అయోధ్యాకాండం యొక్క చతుఃసప్తతితమః సర్గం లో రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి అరణ్యాన్ని చేరుతారు. ఈ సమయంలో దశరథ మహారాజు, కైకేయి కోరిన రెండు వరాలు ఇవ్వడం వల్ల, రాముని అడవికి పంపడం వల్ల బాధతో మరణిస్తారు. భార్య కైకేయి కారణంగా తన కుమారుడిని వనవాసానికి పంపడం వల్ల ఆయన తీవ్రంగా బాధపడతారు. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అక్కడి వనచరుల సహాయంతో జీవనం సాగిస్తారు. కైకేయి చేసిన కార్యం పట్ల దశరథుడు తీవ్ర పశ్చాత్తాపంతో, తపస్సు చేస్తూ రాముని తిరిగి రావాలని ఆశిస్తూ చివరకు మరణిస్తారు.
కైకేయ్యాక్రోశః
తాం తథా గర్హయిత్వా తు మాతరం భరతస్తదా |
రోషేణ మహతాఽవిష్టః పునరేవాబ్రవీద్వచః || ౧ ||
రాజ్యాద్భ్రంశస్వ కైకేయి నృశంసే దుష్టచారిణి |
పరిత్యక్తా చ ధర్మేణ మా మృతం రుదతీ భవ || ౨ ||
కిం ను తేఽదూషయద్రాజా రామః వా భృశధార్మికః |
యయోః మృత్యుర్వివాసశ్చ త్వత్కృతే తుల్యమాగతౌ || ౩ ||
భ్రూణహత్యామసి ప్రాప్తా కులస్యాస్య వినాశనాత్ |
కైకేయి నరకం గచ్ఛ మా చ భర్తుః సలోకతామ్ || ౪ ||
యత్త్వయా హీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణా |
సర్వలోకప్రియం హిత్వా మమాప్యాపాదితం భయమ్ || ౫ ||
త్వత్కృతే మే పితా వృత్తః రామశ్చారణ్యమాశ్రితః |
అయశో జీవలోకే చ త్వయాఽహం ప్రతిపాదితః || ౬ ||
మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే |
న తేఽహమభిభాష్యోఽస్మి దుర్వృత్తే పతిఘాతిని || ౭ ||
కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా మమ మాతరః |
దుఃఖేన మహతాఽవిష్టాస్త్వాం ప్రాప్య కులదూషిణీమ్ || ౮ ||
న త్వమశ్వపతేః కన్యా ధర్మరాజస్య ధీమతః |
రాక్షసీ తత్ర జాతాఽసి కులప్రధ్వంసినీ పితుః || ౯ ||
యత్త్వయా ధార్మికో రామర్నిత్యం సత్యపరాయణః |
వనం ప్రస్థాపితో దుఃఖాత్ పితా చ త్రిదివం గతః || ౧౦ ||
యత్ప్రధానాఽసి తత్పాపం మయి పిత్రా వినా కృతే |
భ్రాతృభ్యాం చ పరిత్యక్తే సర్వ లోకస్య చాప్రియే || ౧౧ ||
కౌసల్యాం ధర్మసంయుక్తాం వియుక్తాం పాపనిశ్చయే |
కృత్వా కం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామినీ || ౧౨ ||
కిం నావబుధ్యసే క్రూరే నియతం బంధుసంశ్రయమ్ |
జ్యేష్ఠం పితృసమం రామం కౌసల్యాయాత్మ సంభవమ్ || ౧౩ ||
అంగప్రత్యంగజః పుత్రః హృదయాచ్చాపి జాయతే |
తస్మాత్ప్రియతమో మాతుః ప్రియత్వాన్న తు బాంధవః || ౧౪ ||
అన్యదా కిల ధర్మజ్ఞా సురభిః సురసమ్మతా |
వహమానౌ దదర్శోర్వ్యాం పుత్రౌ విగతచేతసౌ || ౧౫ ||
తావర్ధదివసే శ్రాంతౌ దృష్ట్వా పుత్రౌ మహీతలే |
రురోద పుత్రశోకేన బాష్పపర్యాకులేక్షణా || ౧౬ ||
అధస్తాద్వ్రజతస్తస్యాః సురరాజ్ఞో మహాత్మనః |
బిందవః పతితా గాత్రే సూక్ష్మాః సురభిగంధినః || ౧౭ ||
ఇంద్రోఽప్యశ్రునిపాతం తం స్వగాత్రే పుణ్యగంధినమ్ |
సురభిం మన్యతే దృష్ట్వా భూయసీం తాం సురేశ్వరః || ౧౮ ||
నిరీక్షమాణః శక్రస్తాం దదర్శ సురభిం స్థితామ్ |
ఆకాశే విష్ఠితాం దీనాం రుదతీం భృశదుఃఖితామ్ || ౧౯ ||
తాం దృష్ట్వా శోకసంతప్తాం వజ్ర పాణిర్యశస్వినీమ్ |
ఇంద్రః ప్రాంజలిరుద్విగ్నః సురరాజోఽబ్రవీద్వచః || ౨౦ ||
భయం కచ్చిన్న చాస్మాసు కుతశ్చిద్విద్యతే మహత్ |
కుతర్నిమిత్తః శోకస్తే బ్రూహి సర్వ హితైషిణి || ౨౧ ||
ఏవముక్తా తు సురభిః సురరాజేన ధీమతా |
పత్యువాచ తతో ధీరా వాక్యం వాక్యవిశారదా || ౨౨ ||
శాంతం పాపం న వః కించిత్ కుతశ్చిదమరాధిప |
అహం తు మగ్నౌ శోచామి స్వపుత్రౌ విషమే స్థితౌ || ౨౩ ||
ఏతౌ దృష్ట్వా కృశౌ దీనౌ సూర్యరశ్మిప్రతాపినౌ |
అర్ద్యమానౌ బలీవర్దౌ కర్షకేణ సురాధిప || ౨౪ ||
మమ కాయాత్ ప్రసూతౌ హి దుఃఖితౌ భారపీడితౌ |
యౌ దృష్ట్వా పరితప్యేఽహం నాస్తి పుత్రసమః ప్రియః || ౨౫ ||
యస్యాః పుత్రసహస్రైస్తు కృత్స్నం వ్యాప్తమిదం జగత్ |
తాం దృష్ట్వా రుదతీం శక్రో న సుతాన్మన్యతే పరమ్ || ౨౬ ||
సదాఽప్రతిమవృత్తాయా లోకధారణకామ్యయా |
శ్రీమత్యా గుణనిత్యాయాః స్వభావపరిచేష్టయా || ౨౭ ||
యస్యాః పుత్రసహస్రాణి సాఽపి శోచతి కామధుక్ |
కిం పునర్యా వినా రామం కౌసల్యా వర్తయిష్యతి || ౨౮ ||
ఏకపుత్రా చ సాధ్వీ చ వివత్సేయం త్వయా కృతా |
తస్మాత్త్వం సతతం దుఃఖం ప్రేత్య చేహ చ లప్స్యసే || ౨౯ ||
అహం హ్యపచితిం భ్రాతుః పితుశ్చ సకలామిమామ్ |
వర్ధనం యశసశ్చాపి కరిష్యామి న సంశయః || ౩౦ ||
ఆనాయయిత్వా తనయం కౌసల్యాయా మహాబలమ్ |
స్వయమేవ ప్రవేక్ష్యామి వనం మునినిషేవితమ్ || ౩౧ ||
న హ్యహం పాపసంకల్పే పాపే పాపం త్వయా కృతమ్ |
శక్తో ధారయితుం పౌరైరశ్రుకంఠైర్నిరీక్షితః || ౩౨ ||
సా త్వమగ్నిం ప్రవిశ వా స్వయం వా దండకాన్విశ |
రజ్జుం బధాన వా కంఠే న హి తేఽన్యత్పరాయణమ్ || ౩౩ ||
అహమప్యవనిం ప్రాప్తే రామే సత్యపరాక్రమే |
కృతకృత్యో భవిష్యామి విప్రవాసితకల్మషః || ౩౪ ||
ఇతి నాగైవారణ్యే తోమరాంకుశచోదితః |
పపాత భువి సంక్రుద్ధో నిశ్శ్వసన్నివ పన్నగః || ౩౫ ||
సంరక్తనేత్రః శిథిలాంబరస్తథా
విధూత సర్వాభరణః పరంతపః |
బభూవ భూమౌ పతితో నృపాత్మజః
శచీపతేః కేతురివోత్సవక్షయే || ౩౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃసప్తతితమః సర్గః || ౭౪ ||
Ayodhya Kanda Sarga 74 Meaning In Telugu
తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలక లేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు.
“అమ్మా! నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేసావు. అమ్మా నేను మరణించిన తరువాత నా శవాన్ని, ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగానీ. ఏమ్మా! నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా! ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీకు ఏమి అపకారము చేసాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు?
నీవు చేసినపాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు, భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా! ఈ తుచ్ఛమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్నుకూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రిమరణానికి కారణం నీవే అయినా, నేనే ರಾಜ್ಯಂ కోసరం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు. తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది. నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు. నువ్వు నా తల్లివి కావు. నావు శత్రువుతో సమానము. భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరురాలను నా తల్లి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ మూలంగా కౌసల్యకు, సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది.
నీవు ఇక్ష్వాకు వంశమునకే కాదు నీ తండ్రి అశ్వపతి వంశమునకు కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు. మా తాత గారి వంశములో పుట్టిన రాక్షసివి. నీవు చేసిన పాపపు పనులకు నాకు పితృవియోగము, సోదరుల వియోగము కలిగాయి. ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు. నీకు మరొక పాపలోకము సృష్టింపబడవలెను.
అమ్మా! నీకు రాముని సంగతీ, నా తండ్రి దశరథుని సంగతీ తెలియదా! వారు ధర్మము తప్పని వారనీ, ఆడి తప్పని వారనీ తెలియదా! వారికి ఇంత ద్రోహం ఎలా చేసావమ్మా! నేను నీ కన్న కొడుకును. నీ శరీరం నాకు పంచి ఇచ్చావు. మరి నాకు ఈ పితృవియోగము, భ్రాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా! తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను విను ….పూర్వము ఒక సారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు (కోడె దూడలు) భూమిని దున్నుతూ సొమ్మసిలి పడిపోవడం చూచిందట. అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట. ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడినవట. ఆ కంటినీరు కామధేనువువి అని అనుకున్నాడు దేవేంద్రుడు. వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరకు వెళ్లాడట. ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించి ఇలా అంది.
“దేవేంద్రా! నా పుత్రులు అయిన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సొమ్మసిలి పడిపోయాయి. కాని దయజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలితిప్పుతూ బాధపెడుతున్నాడు. నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్లు వచ్చాయి. బరువుమోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరము పంచుకొని పుట్టాయి. ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా!” అని పలికింది కామధేనువు.
అమ్మా! ఈ లోకంలో ఉన్న కోటాను కోట్ల ధేనువులు అన్నీ కామధేనువు పుత్రులే. కానీ, కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేనువు. అటువంటిది లేక లేక కలిగిన కన్నకొడుకులను పోగొట్టుకున్న ఆ కౌసల్య, సుమిత్ర నిరంతరమూ కార్చే కన్నీరు నీకు కనపడలేదా అమ్మా! వారి దుఃఖము నీ మనసును కదిలించలేదా?
అమ్మా! కన్నకొడుకులను కన్నతల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. నేను వెంటనే నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవులకు పోతాను. అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు. లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యములకు రా! అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకొని మరణించు. ఇదితప్ప నీకు వేరుమార్గము లేదు. రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తేగానీ నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు.” అని కోపంతో ఊగి పోతూ తల్లి కైకను శతవిధాలా దూషించాడు భరతుడు. ఆయాసం వచ్చి నేలమీద కూలబడి పోయాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదినాలుగవ సర్ద సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.