కీర్తనలు భక్తి, ఆధ్యాత్మికత మరియు సంగీత సాహిత్య రంగాల్లో అత్యంత ప్రముఖమైన రూపంలో ఉంటాయి. ఇవి సామాజిక, ఆధ్యాత్మిక సంగతులను సమీపిస్తాయి, మనసును శుద్ధి చేస్తాయి, భక్తిని పెంచుకోవడంలో సహాయపడుతాయి. కీర్తనలు భక్తుల అంతరాళాల్లో అందిన ఆనందంలను విస్తరిస్తాయి, అవి దేవుని కీర్తనాలను గానం చేయడంలో ఉపయోగపడుతాయి.
కీర్తనలు సాహిత్య, సంగీత, నృత్యం వంటి విభిన్న కళల సముదాయాలు సమ్మేళనం చేసుకోవడానికి ఒక సాధన సహాయకంగా నిలుస్తాయి. ఇవి జనాలను ధర్మప్రచారమైనా, అధ్యాత్మిక ఆలోచనలను ప్రచారం చేయడమైనా, మానవ సమస్యలకు పరిష్కారం కల్పించడమైనా, మనసును శుద్ధి చేయడమైనా, భక్తి మరియు ఆనందాన్ని విస్తరిస్తాయి. కీర్తనలు మనసులను స్ఫూర్తిగా చేస్తాయి, మనసులను ప్రశాంతతో భక్తి భావాలని పెంపొందించుకోవడంలో సహాయపడుతాయి. మొదలగు కీర్తనల విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…
ఈ పోస్ట్ లో ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు
సంఖ్య : 461
పుట: 311
రాగం: సాళంగనాట
సాళంగనాట
61 ఇహమెట్టో పరమబెట్టో ఇంక నాకు
సహజమై హరియే శరణము నాకు
||పల్లవి||
చిత్తమిది యొకటే చింత వేనేలసంఖ్య
పొత్తుల హరిఁదలఁచఁ బొద్దులేదు
జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు
||ఇహ||
చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు
||ఇహ||
వీను లివి రెండే వినికి కొలఁదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశుఁ డిటు చూచినను
తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు.
||ఇహ||461
అవతారిక:
నాకు ఇహలోకంతోకాని, పరలోకంతోకాని పనిలేదయ్యా! నా సహజగుణం ఒక్కటే. అది హరియే దిక్కని శరణాగతితో జీవితాంతం గడుపుట, అంటున్నారు అన్నమాచార్యులవారు. మానవజీవితం అన్నాక… మనస్సులో చింతలు తప్పవు, అనవసరమైన వాటినుంచి చూపులను మరల్చలేము, చేతులతో ఏవేవో వ్యర్థమైన పనులు చేస్తూనేవుంటాము, దేన్నిపడితే దాన్ని లొట్టలేసుకొని తింటాననే దౌర్భాగ్యపు నా నాలుకవున్నది, ఉన్నవి రెండే అయినా అంతేలేకుండా అన్నీ వినే చెవులున్నాయి. ఇవన్నీ భ్రష్టు పట్టిస్తూనేవున్నాయి. హరిభక్తి మీద బుద్ధినిలవటం లేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! శరణు మహాప్రభో శరణు… అంటున్నారు.
భావ వివరణ:
ఓ మానవులారా! ఇక నాకు ఇహమెట్టో (ఇహలోకంలో ఏమవుతుందో) పరమెట్టో (ఊర్ధ్వలోకాలలో ఏమవుతుందో) పనిలేదు. నాకు సహజమైన (సహజసిద్ధంగా నిజాయితీగల) శరణాగతి హరియే (శ్రీహరి మాత్రమే).
నాది యెంత విచిత్రమైన పరిస్థితి అంటే… నాకున్న చిత్తము (మనస్సు) ఒక్కటే కాని దానికున్న చింతలు మాత్రం వేవేలు (వేలసంఖ్యలో వున్నాయి). నేను పెట్టుకొన్న పొత్తులతో (సంగత్వంతో) హరిని తలచుటకు పొద్దులేదు (తీరికేలేదు), జొత్తులకన్నులు (ఎఱ్ఱబారిన కళ్ళు) రెండే, కాని అవి చూచే చూపులకు అనవసరమైన వ్యాపకాలు మాత్రం అనంతం. కాని తత్తరించి (ఆరాటపడి) హరిని దగ్గరనుంచి చూడాలని మాత్రం వాటికుండదు.
నా ఈ చేతులు చూశారా! నాకున్నవి రెండే చేతులు. కాని ఇవి చేసే చేష్టలున్నాయే, అవి లక్షోపలక్ష (అనేక లక్షలు). కాని ఈతల (ఇటుచూస్తే) శ్రీహరిని పూజించాలంటేమాత్రం ఈ చేతులకి ఇచ్చలేదు (కోరిక పుట్టదు). ఇక, జాతి నాలిక (అతిసామాన్య ఔన్నత్యంగల నాలిక) నాకూ ఒక్కటే వున్నది. కాని దానికి కావలసిన చవులు (రుచులు) మాత్రం కోటానుకోట్లు. కాని రీతి (విధాయకంగా) హరినామాన్ని వుచ్చరించటానికి (అనుటకు) వేళలేదు (సమయం దొరకడంలేదు).
వీనులివి రెండే (నాకున్న చెవులు రెండు మాత్రమే). కాని ఇవి వినాలనుకొనే మాటలకి అంతుపొంతులేదు. వాటికి పూనికతో హరిభక్తి గురించి వినండి అంటే వాటికి బుద్ధిలేదు. ఇట్లాంటి నటన (నడవడితో) వున్న నన్ను శ్రీవేంకటేశుడు, ఇటుచూచి, తానే పోనీలే వీడు అర్భకుడు అని జాలిపడి యేలె నన్ను (స్వీకరించి పాలించాడు). అమ్మయ్య! ఇక తడబాటు (తత్తరబాటు) లేదు. ఆయన రక్షణలో బ్రతికేస్తున్నాను. భయం వదిలేశాను.
మనలను రక్షించే మాధవుడు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొనర్తు గద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూడి మురియుదుగద
॥ఆశ॥
నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనే పోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోవదందునుగద
ఈ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ జానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ
అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును
॥ఆశ॥
ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మడ దెత్తును
సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి.
అయ్యో యిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద
॥ఆశ॥
మిత్రవంశునకు నేనేమి చేయుదు నేనెవ్వరివేడుదు
ఏమరియుండిరీ మానినులందరు ఏలపోయెనో యాక్షీరాబ్ధికి
ఏల దశరథుడు యజ్ఞము చేసెను ఎందుకు బుట్టిరియీ లోకమునను
ఎందుకు వచ్చిరి యీవనమునకును ఇట్టి వరములనేలవేడిరి
ఎక్కడ నోపుదు యింతటి జాలి
తీరైన పురవీధులు సొంపైన కోనేరులు
సోపానములు సకల ఫలతరువులు
ఆ నదులు ఋషి గంధర్వ నివాసములు
సరసిజాక్ష వినవే సరిలేని గోదావరి స్నానములు
సంపత్కరమై యొప్పినది
॥కలియుగ॥
చక్కని స్త్రీ పురుషులు పట్టణమందు
పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు
వేదశాస్త్రతార్కిక వైష్ణవులు గ్రక్కున వారిని కన్నులజూచి
తక్కువైన పుణ్యమేయని తెల్పుదు
॥కలియుగ॥
వామాక్షులాడగను సీతనుగూడి
హేమపీఠమునందు సంపూర్ణకళలు మోము వెలుగగను
పరివారములు ప్రేమతో గొలువగను
ప్రేమచే భద్రాద్రిరామదాసుని మేలు
స్వామి శ్రీ కోదండరాము నివాసము
పల్లవి : ధన్యుడవు తానీషా నీవు
నన్ను గన్నయ్య పదములు కలగన్నావు
॥ధన్యుడవు॥
నిన్నటిరాతిరి వారు వచ్చియున్న ముచ్చటలాడి యేమేమి యున్నారు
ఎంతవేడినగాని రారు నీవు పుణ్యమూర్తివి గనుక పొడసూపినారు
తానీషా : ధన్యుడవు గోపన్న నీవు యా దాశరథికి నిజదాసుడైనావు
సామాన్యుడని యెంచుకొంటి శ్రీరామచంద్రుల సేవ మీవలన గంటి
ప్రేమతో సేవించుకొంటి నేను పామరుడనై మిమ్ము బాధింపుచుంటి
॥ ధన్యుడవు ॥
గోపన్న : ఏమి పూజలు చేసినారు మా స్వామి భద్రగిరి దాసులు మీరు
ప్రేమతో సేవించినారు శ్రీరామ కృపగల్గి రంజిల్లుతారు
తానీషా : పైకము దీసుకుపొండి భద్రాచల రామదాసులై పట్టమేలండి
అయినదెల్ల వేడుకొనండి మీరు అనుదినము రాముల నర్చించండి
॥ధన్యుడవు||
గోపన్న : ఏటిమాటలు పలికెదరు నా కేటికి రాజ్యమీ యిలలోనే మీరు
మేటి జన్మమెత్తినారు మీ సాటివారలు యీ జగములోలేరు
||ధన్యుడవు ||
తానీషా : భద్రాచలము నెప్పటికి మీ రామభద్రున కిచ్చితి బాగుగా వినుమా
ముద్ర నిశానీల్ కొనుమా శ్రీ భద్రాద్రివర రామదాసుడై యేలుమి
మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
నీ అరుదుమీరలని నెగురవేయ నే హనుమంతుడనుగాను
సరగున మ్రుచ్చుల మాటలు విన నే జాంబవంతుడను గాను
బిరబిర మీవల లోపల బడ నే విభీషణుడనుగాను
పల్లవి : తానీషా : ఏ దేశమున నుండువారు మీరలెందుండి యిట వచ్చినారు
రామ : తొలుత గోదావరియందు మా స్థలమది భద్రాచలమందు
తానీషా : ఎవరి జవానులు మీరు మిమ్మెవరు బంపక వచ్చినారు
రామ :దాసజవానులు మేము రామదాసు పంపగ వచ్చినాము
తానీషా : ఏ కులమువారు మీరు మీరిద్దరు నే వరుసవారు
రామ : ఇనవంశమున బుట్టినాము మేమిద్దర మన్నదమ్ములము
తానీషా : ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు
రామ : రామోజీ లక్ష్మోజినామం వహ్వా రామానుజ మతమువారం
తానీషా : ఎన్నిదినములనుండి మీరు వారిసన్నిధి కొలువై యున్నారు
రామ : తాతముత్తాతలు మేము మూడుతరములనుండి యున్నాము
తానీషా : ఏమి జీతమిచ్చెదరు మీకు ఏమి జీవనమిచ్చెదరు
రామ : సమ్మతిలేని జీతము ప్రసాదమునకే కుదిరినాము
తానీషా : ఎందుకు పంపించినారు మీరేమి పనిగ వచ్చినారు.
రామ : సర్కార్బాకీ పైకము మాచేత బంపగ వచ్చినాము
తానీషా : అర్థమంతయు దెచ్చినారా లేక వ్యర్థముగ వచ్చినారా
రామ : వ్యర్థులముగ మేము రాము మీయర్థమంత దెచ్చినాము
తానీషా : బైఠోజి బైరోజి మీ మాటలు చూడగ వేరు
రామ : బైఠోజి వారముగాము మీ భేటికి వచ్చినాము
తానీషా : లక్షలారును దెచ్చినారా యింకా శిక్షలో నుండమన్నారా
రామ : లక్షలారునియ్యగలము మూడు లక్షలు మేమియ్యగలము
తానీషా : పంపిన పైకము తెండి యాపయిన తమాషా చూడండి
రామ : పదివేలు తెచ్చినామండి యాపయిన మాచేత లేదండి
తానీషా : మగురూర్మాటలు మీతో మాతో మరలించుచున్నారు.
రామ : మగురూరి వారితో మేము మాట్లాడువారము కాము
తానీషా : ధనము మాచేతికియ్యండి యావెనుక ఖైదులోకి పొండి
రామ : ఖైదులోకి మేము పోము మీ ఖజాన పైకమిచ్చేము
తానీషా : చెల్లింతురా ద్రవ్యమంత రసీదు నడుగుట కడువింత
రామ : ఉంగరంబులీడెమందు నుప్పొంగుచు తొడదట్టెయందు
తానీషా : మొహరువేసినంతను మోహనాంగుడు సంతసమునను
మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నివారనితోచెను
ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు
పల్లవి :ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ తెలియవశమా
కామారి వినుతగుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్న తండ్రి రామా
సుతుడనుచు కవులు క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు
మతి తెలియలేరైరి.
॥ఏమయ్య॥
చెలిమి కొడవనుచు పాండవులు నిజ
విరోధివటంచు నల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరి గాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి
॥ఏమయ్య॥
నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడవనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి
॥ఏమయ్య॥
8. పున్నాగరావళి చాపుతాళం
పల్లవి : ఏల దయరాదో రామయ్య నీకేల దయరాదో
మీ మేలుకై పాటుబడితిని యేల మీ భండము చాలుచాలును
॥ఏల॥
చరణములు
బ్రహ్మ గూర్పగదే అహోవరబ్రహ్మకావగదే
బ్రహ్మజనక భవ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట
॥ఏల॥
పాపములచేత రామయ్య నేనోపలేను గదే
శ్రీభూపతి యే ప్రాపులేక నీ ప్రాపేగోరితి ఘోరరూపయిక
శ్రీకృష్ణజయంతి పర్వదినాన అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తన ఇది. “ఓ అమ్మలారా! మనం అంతా నియమంతో జరుపుకొనే కృష్ణజయంతి వేడుక నేడు నందుని ఇంట పుత్రుడుదయించాడనె వుత్సవం భూమిపై ప్రతియేడూ జరుపుకొంటున్నా అది యెప్పటికప్పుడు కొత్తలాయె” అంటున్నారు అన్నమాచార్యులవారు. ఆ అల్లరి కృష్ణుడు శ్రీవేంకటాద్రిపై ఆటలాడుట మరిగిపేలరియై కడుపెచు పెరిగీనమ్మా! అంటున్నారు. అంటే యేమిటి? ‘పేలరి’ అంటే వదరుబోతు అని అర్థం. వాగుడుకాయ అన్నమాట. మరి “బాత్రేయనటే” అంటే….?
భావ వివరణ:
ఓ అమ్మలారా! ఇదివో ఈ పుత్రోత్సవము (పుత్రుని పుట్టుక సందర్భంగా చేయు పండుగ) భూమిపై కొత్తలాయ (ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది). నేడే అట్టి కృష్ణజయంతి. ఇది నేమపు పండుగ (నియమం ప్రకారం జరిపే పండుగ).
పొడవుకు బొడవైన (ఉన్నతోన్నతుడైన ఈ పురుషోత్తముడు నేడు, అడరి (అతిశయించి) తొట్టెలో బాలుడు (ఉయ్యాలలో శిశువు) యైనాడమ్మా! ఈ ప్రపంచంలో యెక్కడ యే యజ్ఞం జరిగినా ఆ యజ్ఞభోక్త (యాగఫలములో మొదటిభాగం ఈయనకే అర్పిస్తారు. దానిని ఆయన వుడుగక (వదలక) నారగించీ (స్వీకరిస్తాడు). అట్టి యజ్ఞపురుషుడు, కొడుకై చనుబాలుత్రాగుతున్నాడే… ఆహా! ఏమిఈ పరమాత్ముని లీల.
ఈయన యెవరో తెలుసునటే? క్షీరసాగరునికి స్వయంగా అల్లుడు. పైగా ఆయన నివాసస్థానంకూడ పాలసముద్రమే. అటువంటి వాడికి పాలవుట్లు తెంచేపండుగ ‘బాతేయనటే’ (ప్రేమకలిగిందటనే?) ఎంతెంత మనం పండుగ చేసికొంటే అదే ఆయనకు పండుగ. ఇవన్నీ ఆవిశ్వాత్మునికెందుకమ్మా? నేడు ఈ తిరుమలలో ఆలరి (అల్లరిపిల్లవాడే) శ్రీవేంకటాద్రిపై ఆటలాడమరగినాడు. పేలరియై (అతివాగుడుకాయయై) ఈ పిల్లవాడు కడుపెచ్చుపెరిగీనమ్మా (తెగ విజృంభిస్తున్నాడమ్మా!)
భాష్యకారుడు అంటే వ్యాఖ్యానం చేసేవాడు అని అర్థం. భగవంతుని లీలలను గురించి సోదాహరణంగా వ్యాఖ్యానించి, భక్తిని పెంపొందింపజేస్తారు భాష్యకారులు. వైష్ణవ పరిభాషలో రామానుజాచార్యుల బిరుదు అది. అన్నమాచార్యులవారి ఈ కీర్తనలో తన గురువుని కీర్తిస్తూ మా భాస్యకారులు మమ్మల్ని దొడ్డవాడిని చేశారు. నిజానికి మేము పామరులమే. ఏమీ యెఱగని మమ్ము “అన్నమాచార్యులవారిని చేసి యెక్కువ చేసి అనుగ్రహించారు అంటున్నారు. “తన్న” అంటే కోల్పోబడిన… లేక… కోల్పోయిన అని అర్థం. ఇట్లా సూటిగ నిఘంటువులో దొరకని చాలామాటలున్నాయి, ఈ కీర్తనలో.
భావ వివరణ:
ఈ భాష్యకారులు (రామానుజాచార్యులవారు) ఏమీ యెరుగని పామరులమైన (అజ్ఞానులమైన) మమ్ము ఆచార్యపదవితో దొడ్డవానిని (గొప్పవానిని) చేశారు.
గతచన్న (గతించిపోయిన, లేక, కోల్పోయిన వేదాలను కమలజునకు (పద్మసంభవుడైన బ్రహ్మకు తిరిగి ఇచ్చిన ఆతని (శ్రీహరి) దయవలన అన్నియు నెఱిగి, గతిలేని (సక్రమమైన ధర్మ మార్గంలేని) కలియుగంలో వచ్చి (అవతరించి) ప్రతిపాదించగలిగె (నిరూపించగలిగెను… అంటే భగవంతుని సాక్షాత్కరింపజేసెను) ఈ భాష్యకారులు.
అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించఁగ
యేలమి శ్రీవేంకటేవు నెంచి చూచితే
కలిమిగల యీ కాంత కౌఁగిటఁ బెనఁగఁ గాను
నిలువెల్లా సిరులై నిండిన ట్టుండెను
||ఎన్ని||
అవతారిక:
ఈ తిరుమలేశుడు యెన్ని మహిమలు గలవాడె! అని ఆశ్చర్యపడుతున్నారు అన్నమాచార్యులవారు. ఆ మహిమలన్నీ కన్నులపండువగా శోభిల్లుతున్నాయని అంటున్నారు. అన్నమయ్యకి ఈ మధురమైన భావలహరియెలా వస్తుందా అనిపించి, ఏడుకొండలవాడే ఆ భావలహరిని ఆయనలో యెగసిపడేలా చేస్తాడు అని సమాధానపడ్డాను. శ్రీమహాలక్ష్మియైన అలమేల్మంగ ఈ స్వామి కౌగిట్లో కరిగే తరుణంలో ఆవిడ ఒంటిమీద నగలన్నీ ఈయనకు అంటుకున్నాయట. భళి భళీ! నీ వూహ భావాతీతమయ్యా! అన్నమయ్యా!
భావ వివరణ:
ఈ దేవదేవుడు యెన్ని మహిమలు కలవాడో యేమని చెప్పగలను? అవి కన్నులపండుగలై అన్నీ నన్ను దగ్గరై అలరించుచున్నవి.
ఈస్వామికి కర్పూరపు వంటిపై మెత్తారు. ఆకలింప (ఆరంగారంగవేసిన) ఆకాపు ఈ పురుషోత్తమునికి ఎలావున్నదంటే… పాలసముద్రములో, పవ్వళించినందున అలల తాకిడికి అంటిన లేతలుంగారు రంగు మీగడ బాగా అంటుకొని మెలపుతో (మెత్తినట్లుగా) వున్నది.
పునుగుపిల్ల నుంచి తీసిన సుగంధద్రవ్యము తట్టుపునుగు. దేవతలందరిలో శిఖామణి (తలమానికమైన) ఈ స్వామి నిమజ్జనానంతరం తట్టు పునుగు కాపు వేస్తారు (మెత్తుతారు). మరి పరికించి చూచితే అది యెట్లా వుంటుందంటే… చిట్టకాన (శృంగారలీలగా) అలనాడు రేపల్లెలో ఈ శంగారరాయుడు అనేక “చీకటి తప్పులు” సేసినందున ఆ రాత్రులన్నీ ఈయన వంటిపై ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని, అందాలమేనిపై ఆ తట్టు పునుగుకాపు ఇంకా అందము పెంచుతున్నది. నేడు అలమేల్మంగతో చేరిన ఈ మహానుభావుడు అట్టె (అదిగో) యెలావున్నాడంటే… కలిమికాంత (శ్రీమహాలక్ష్మియైన) ఆదేవిని ఈ శ్రీవేంకటేశ్వరుడు బిగి కౌగిట జేర్చగా, పెనగులాడెడి, ప్రేయసి ఒంటిపై నగలన్నీ ఈ చిలిపి శ్రీనావాసునికి అటుకొన్నవా అన్నట్లుంది. అందుచేతనే ఈయనకు నిలువెల్లా సిరులై (నగలై) నిండిపోయినవా అన్నట్లుంది. ఇకపై చెప్పే శక్తి నాకు లేదు తండ్రీ!