అయోధ్యాకాండ పంచసప్తతితమః సర్గంలో, సుమంత్రుడు రాముడు, సీత, లక్ష్మణులను గంగానది వద్ద వదిలి కుశలముగా తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు. సుమంత్రుడు వధూతి దశరథుని వద్దకు వెళ్ళి రాముని అరణ్యవాసం గురించి వివరించాడును. దశరథుడు రాముని వేదనతో బాధపడి, వేదనతో వ్యాకులుడైనాడు. రాముడు లేని జీవితాన్ని తట్టుకోలేక, రాముడి తలపులో ఉంటూ కన్నీళ్ళతో వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదు, రాముని స్వరాన్ని మళ్లీ వినాలని తహతహలాడతాడు. దశరథుడు చివరికి తాపత్రయంతో రాముడి తలపులో తన ప్రాణాలు విడుస్తాడు.
భరతశపథః
దీర్ఘకాలాత్సముత్థాయ సంజ్ఞాం లబ్ధ్వా చ వీర్యవాన్ |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం దీనాముద్వీక్ష్య మాతరమ్ || ౧ ||
సోఽమాత్యమధ్యేభరతో జననీమభ్యకుత్సయత్ |
రాజ్యం న కామయే జాతు మంత్రయే నాపి మాతరమ్ || ౨ ||
అభిషేకం న జానామి యోఽభూద్రాజ్ఞా సమీక్షితః |
విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్నసహితోఽవసమ్ || ౩ ||
వనవాసం న జానామి రామస్యాహం మహాత్మనః |
వివాసనం వా సౌమిత్రేః సీతాయాశ్చ యథాఽభవత్ || ౪ ||
తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః |
కౌసల్యా శబ్దమాజ్ఞాయ సుమిత్రామిదమబ్రవీత్ || ౫ ||
ఆగతః క్రూర కార్యాయాః కైకేయ్యా భరతః సుతః |
తమహం ద్రష్టుమిచ్ఛామి భరతం దీర్ఘదర్శినమ్ || ౬ ||
ఏవముక్త్వా సుమిత్రాం సా వివర్ణా మలినా కృశా |
ప్రతస్థే భరతః యత్ర వేపమానా విచేతనా || ౭ ||
స తు రామానుజశ్చాపి శత్రుఘ్న సహితస్తదా |
ప్రతస్థే భరతః యత్ర కౌసల్యాయా నివేశనమ్ || ౮ ||
తతః శత్రుఘ్నభరతౌ కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ |
పర్యష్వజేతాం దుఃఖార్తాం పతితాం నష్ట చేతనామ్ || ౯ ||
రుదంతౌ రుదతీం దుఃఖాత్సమేత్యార్యాం మనస్వినీమ్ |
భరతం ప్రత్యువాచేదం కౌసల్యా భృశ దుఃఖితా || ౧౦ ||
ఇదం తే రాజ్య కామస్య రాజ్యం ప్రాప్తమకంటకమ్ |
సంప్రాప్తం బత కైకేయ్యా శీఘ్రం క్రూరేణ కర్మణా || ౧౧ ||
ప్రస్థాప్య చీరవసనం పుత్రం మే వనవాసినమ్ |
కైకేయీ కం గుణం తత్ర పశ్యతి క్రూరదర్శినీ || ౧౨ ||
క్షిప్రం మామపి కైకేయీ ప్రస్థాపయితుమర్హతి |
హిరణ్యనాభో యత్రాస్తే సుతః మే సుమహా యశాః || ౧౩ ||
అథవా స్వయమేవాహం సుమిత్రానుచరా సుఖమ్ |
అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవః || ౧౪ ||
కామం వా స్వయమేవాద్య తత్ర మాం నేతుమర్హసి |
యత్రాసౌ పురుషవ్యాఘ్రః పుత్రో మే తప్యతే తపః || ౧౫ ||
ఇదం హి తవ విస్తీర్ణం ధనధాన్యసమాచితమ్ |
హస్త్వశ్వరథసంపూర్ణం రాజ్యం నిర్యాతితం తయా || ౧౬ ||
ఇత్యాదిబహుభిర్వాక్యైః క్రూరైః సంభర్త్సితోఽనఘః |
వివ్యథే భరతస్తీవ్రం వ్రణే తుద్యేవ సూచినా || ౧౭ ||
పపాత చరణౌ తస్యాస్తదా సంభ్రాంతచేతనః |
విలప్య బహుధాఽసంజ్ఞో లబ్దసంజ్ఞస్తతః స్థితః || ౧౮ ||
ఏవం విలపమానాం తాం భరతః ప్రాంజలిస్తదా |
కౌసల్యాం ప్రత్యువాచేదం శోకైః బహుభిరావృతామ్ || ౧౯ ||
ఆర్యే కస్మాదజానంతం గర్హసే మామకిల్భిషమ్ |
విపులాం చ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే || ౨౦ ||
కృతా శాస్త్రానుగా బుద్ధిర్మాభూత్తస్య కదాచన |
సత్యసంధః సతాం శ్రేష్ఠో యస్యార్యోఽనుమతే గతః || ౨౧ ||
ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యం చ ప్రతి మేహతు |
హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోఽనుమతే గతః || ౨౨ ||
కారయిత్వా మహత్కర్మ భర్తా భృత్యమనర్థకమ్ |
అధర్మః యోఽస్య సోఽస్యాస్తు యస్యార్యోఽనుమతే గతః || ౨౩ ||
పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ |
తతస్తం ద్రుహ్యతాం పాపం యస్యార్యోఽనుమతే గతః || ౨౪ ||
బలిషడ్భాగముద్ధృత్య నృపస్యారక్షతః ప్రజాః |
అధర్మః యోఽస్య సోఽస్యాస్తు యస్యార్యోఽనుమతే గతః || ౨౫ ||
సంశ్రుత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞదక్షిణామ్ |
తాం విప్రలపతాం పాపం యస్యార్యోఽనుమతే గతః || ౨౬ ||
హస్త్యశ్వరథసంబాధే యుద్ధే శస్త్రసమాకులే |
మా స్మ కార్షీత్సతాం ధర్మం యస్యార్యోఽనుమతే గతః || ౨౭ ||
ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా |
స నాశయతు దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౨౮ ||
మా చ తం వ్యూఢబాహ్వంసం చంద్రార్కసమతేజనమ్ |
ద్రాక్షీద్రాజ్యస్థమాసీనం యస్యార్యోఽనుమతే గతః || ౨౯ ||
పాయసం కృసరం చాగం వృథా సోఽశ్నాతు నిర్ఘృణః |
గురూంశ్చాప్యవజానాతు యస్యార్యోఽనుమతే గతః || ౩౦ ||
గాశ్చ స్పృశతు పాదేన గురూన్ పరివదేత్స్వయమ్ |
మిత్రే ద్రుహ్యేత సోఽత్యంతం యస్యార్యోఽనుమతే గతః || ౩౧ ||
విశ్వాసాత్కథితం కించిత్పరివాదం మిథః క్వచిత్ |
వివృణోతు స దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౩౨ ||
అకర్తా హ్యకృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః |
లోకే భవతు విద్వేష్యో యస్యార్యోఽనుమతే గతః || ౩౩ ||
పుత్రైర్దారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారితః |
సైకో మృష్టమశ్నాతు యస్యార్యోఽనుమతే గతః || ౩౪ ||
అప్రాప్య సదృశాన్ దారాననపత్యః ప్రమీయతామ్ |
అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్యార్యోఽనుమతే గతః || ౩౫ ||
మాత్మనః సంతతిం ద్రాక్షీత్స్వేషు దారేషు దుఃఖితః |
ఆయుః సమగ్రమప్రాప్య యస్యార్యోఽనుమతే గతః || ౩౬ ||
రాజ స్త్రీబాలవృద్ధానాం వధే యత్పాపముచ్యతే |
భృత్యత్యాగే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతామ్ || ౩౭ ||
లాక్షయా మధుమాంసేన లోహేన చ విషేణ చ |
సదైవ బిభృయాద్భృత్యాన్ యస్యార్యోఽనుమతే గతః || ౩౮ ||
సంగ్రామే సముపోఢే స్మ శత్రుపక్షభయంకరే |
పలాయామానో వధ్యేత యస్యార్యోఽనుమతే గతః || ౩౯ ||
కపాలపాణిః పృథివీమటతాం చీరసంవృతః |
భిక్షమాణో యథోన్మత్తో యస్యార్యోఽనుమతే గతః || ౪౦ ||
మద్యే ప్రసక్తో భవతు స్త్రీష్వక్షేషు చ నిత్యశః |
కామక్రోధాభిభూతస్తు యస్యార్యోఽనుమతే గతః || ౪౧ ||
మా స్మ ధర్మే మనో భూయాదధర్మం సునిషేవతామ్ |
అపాత్రవర్షీ భవతు యస్యార్యోఽనుమతే గతః || ౪౨ ||
సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్రశః |
దస్యుభిర్విప్రలుప్యంతాం యశ్యార్యోఽనుమతే గతః || ౪౩ ||
ఉభే సంధ్యే శయానస్య యత్పాపం పరికల్ప్యతే |
తచ్చ పాపం భవేత్తస్య యస్యార్యోఽనుమతే గతః || ౪౪ ||
యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే |
మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతామ్ || ౪౫ ||
దేవతానాం పితౄణాం చ మాతాపిత్రోస్తథైవ చ |
మా స్మ కార్షీత్ స శుశ్రూషాం యస్యార్యోఽనుమతే గతః || ౪౬ ||
సతాం లోకాత్సతాం కీర్త్యాః సంజ్జుష్టాత్ కర్మణస్తథా |
భ్రశ్యతు క్షిప్రమద్యైవ యస్యార్యోఽనుమతే గతః || ౪౭ ||
అపాస్య మాతృశుశ్రూషామనర్థే సోఽవతిష్ఠతామ్ |
దీర్ఘబాహుర్మహావక్షాః యస్యార్యోఽసుమతే గతః || ౪౮ ||
బహుపుత్రో దరిద్రశ్చ జ్వరరోగసమన్వితః |
స భూయాత్సతతక్లేశీ యస్యార్యోఽనుమతే గతః || ౪౯ ||
ఆశామాశం సమానానాం దీనానామూర్ధ్వచక్షుషామ్ |
ఆర్థినాం వితథాం కుర్యాద్యస్యార్యోఽనుమతే గతః || ౫౦ ||
మాయయా రమతాం నిత్యం పరుషః పిశునోఽశుచిః |
రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౫౧ ||
ఋతుస్నాతాం సతీం భార్యామృతుకాలానురోధినీమ్ |
అతివర్తేత దుష్టాత్మా యస్యార్యోఽనుమతే గతః || ౫౨ ||
ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ని షేవతామ్ |
త్యక్తధర్మరతిర్మూఢో యస్యార్యోఽనుమతే గతః || ౫౩ ||
విప్రలుప్తప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ |
తదేవ ప్రతిపద్యేత యస్యార్యోఽనుమతే గతః || ౫౪ ||
పానీయదూషకే పాపం తథైవ విషదాయకే |
యత్తదేకః స లభతాం యస్యార్యోఽనుమతే గతః || ౫౫ ||
బ్రాహ్మణాయోద్యతాం పూజాం విహంతు కలుషేంద్రియః |
బాలవత్సాం చ గాం దోగ్దుః యస్యర్యోఽనుమతే గతః || ౫౬ ||
తృష్ణార్తం సతి పానీయే విప్రలంభేన యోజయేత్ |
లభేత తస్య యత్పాపం యస్యార్యోఽనుమతే గతః || ౫౭ ||
భక్త్యా వివదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతః |
తస్య పాపేన యుజ్యేత యస్యార్యోఽనుమతే గతః || ౫౮ ||
విహీనాం పతి పుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మజః |
ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తో నిపపాత హ || ౫౯ ||
తథా తు శపథైః కష్టైః శపమానమచేతనమ్ |
భరతం శోక సంతప్తం కౌసల్యా వాక్యమబ్రవీత్ || ౬౦ ||
మమ దుఃఖమిదం పుత్ర భూయః సముపజాయతే |
శపథైః శపమానో హి ప్రాణానుపరుణత్సి మే || ౬౧ ||
దిష్ట్యా న చలితో ధర్మాత్ ఆత్మా తే సహలక్ష్మణః |
వత్స సత్య ప్రతిజ్ఞో మే సతాం లోకమవాప్స్యసి || ౬౨ ||
ఇత్యుక్త్వా చాంకమానీయ భరతం భ్రాతృవత్సలమ్ |
పరిష్వజ్య మహాబాహుం రురోద భృశదుఃఖితా || ౬౩ ||
ఏవం విలపమానస్య దుఃఖార్తస్య మహాత్మనః |
మోహాచ్చ శోక సంరోధాత్ బభూవ లులితం మనః || ౬౪ ||
లాలప్యమానస్య విచేతనస్య
ప్రణష్టబుద్ధేః పతితస్య భూమౌ |
ముహుర్ముహుర్నిశ్శ్వసతశ్చ ఘర్మమ్
సా తస్య శోకేన జగామ రాత్రిః || ౬౫ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః || ౭౫ ||
Ayodhya Kanda Sarga 75 Meaning In Telugu
పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక, తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలయింది కైక. కాని తనకొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు. శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేల మీద పడి ఉన్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది.
ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తల పైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే, తన తండ్రి మరణిస్తే, తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి. పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైక తో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అనీ, తాను అమాయకుడననీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు.
“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.
భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.
“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం.” అని బిగ్గరగా అరిచాడు.
భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య, సుమితను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద వెళ్లి భరతుని పలకరించి వద్దాము.” అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపువస్తున్నాడు.
భరతుని చూచినకౌసల్యకు దుఃఖము ఆగలేదు. ఏడుస్తూ భరతుని పొదిపట్టుకొంది. గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. “నాయనా భరతా! నీవు రాజ్యము కావాలని కోరుకున్నావు. నీకు అన్నదమ్ముల బాధ కానీ దాయాదుల బాధ కానీ లేని రాజ్యము లభించింది. నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వలన నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది. కైక తన కొడుక్కు రాజ్యము కావాలని కోరుకోడంలో తప్పులేదు. కానీ నా కొడుకును నార చీరలు కట్టించి అడవులకు పంపడం దేనికి? దాని వలన ఆమెకు కలిగే ప్రయోజనము ఏమి? అంతకన్నా నన్ను కూడా రామునితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే బాగుండేది. ఆమె కోరుకున్నా కోరుకోక పోయినా నేను, సుమిత్రా, మా కుమారుల వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాము. నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నాము. నీకు మామీద దయ ఉంటే మమ్ములను రాముడు ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. ఇదే మేము నిన్ను కోరేది.” అని భరతుని సూదుల వంటి మాటలతో బాధపెట్టింది కౌసల్య.
ఆ మాటలకు చలించిపోయాడు భరతుడు. తనకు ఏ పాపమూ తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు. తుదకు కౌసల్యకూడా ఆ ప్రకారము మాట్లాడింది. ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు. గట్టిగా కౌసల్య కాళ్లు పట్టుకున్నాడు. భోరునవిలపిస్తున్నాడు. కౌసల్యముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! నా సంగతి నీకు తెలియదా. రాముడు అంటే నాకు ఎంత ప్రేమా భక్తి ఉందో నీకు తెలియదా. ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు. నా అన్న రాముని అరణ్యములకుపంపిన వారికి ధర్మశాస్త్రము గురించి ఏమీ తెలియదు. వారి బుద్ధి చెడిపోయినది.
అమ్మా! నాకు తెలిసీ, నేను రాముని అడవులకుపంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపమును, సూర్యుని ఎదురుగా మలమూత్రవిసర్జన చేసిన పాపమును, పాపాత్ములను సేవించిన పాపమును పొందుతాను. అమ్మా! నేనే కనక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పనిచేయించుకొని వారికి పారితోషికము ఇవ్వని పాపమున పోతాను. రాముడు అడవులకు పోవడం నాకు తెలిసీ నేను ఊరకుంటే నేను రాజద్రోహము చేసిన పాపమున పోతాను.
నేను కనక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్టయితే నేను ప్రజల నుండీ పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపమున పోతాను. (ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఇదే పాపం చేస్తున్నారు.)
అమ్మా! నేను కనక రాముని అరణ్యములకో పోవుటకు నా సమ్మతి తెలిపినట్టయితే నేను యాగము చేయించుకున్న తరువాత ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన పోతాను.
నేను కనక నా అన్న రాముని అరణ్యవాసమునకు కారణము అయితే నేను యుద్ధములో పారిపోయి వచ్చిన వాడు పొందే పాపమును, పెద్దలను అవమానించిన పాపమును, వేదాధ్యయనము చెయ్యని పాపమును, మిత్రద్రోహము చేసిన పాపమును, భార్యాబిడ్డలకు, బంధువులకుపెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నమును భుజించిన పాపమును, సంతానము కలుగని వాడు పొందే పాపమును, రాజును, స్త్రీలను, బాలురను వృద్ధులను చంపిన పాపమును, తాను పోషించ వలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపమును, అక్రమ వ్యాపారములను చేసిన వాడు పొందే పాపమును, ఇతరుల ఇండ్లు తగలపెట్టిన వాడు పొందే పాపమును, ఉదయము, సాయంత్రమూ నిద్రించేవాడు పొందే పాపమును, గురువుగారి భార్యను కామించే వాడు పొందే పాపమును, దేవతలను ఆరాధించని వాడు, తల్లితండ్రులకు సేవచేయని వాడు పొందే పాపమును, క్రూరపు పనులు చేయుచూ, అబద్ధాలు ఆడుతూ, అపవిత్రంగా, అధర్మంగా, అందరికీ భయపడుతూ దొంగవలె బతికేవాడు పొందే పాపమును, కట్టుకున్న భార్యను వదిలి, పరస్త్రీల వెంట తిరిగేవాడు పొందే పాపమును, తాగే నీరు పాడుచేసేవాడు, ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపమును, సిద్ధంగా ఉన్న పూజను పాడుచేసేవాడు పొందేపాపమును, దూడకు కూడా మిగల్చకుండా ఆవునుండి పాలు అన్నీపితికేవాడు పొందే పాపమును, నా దగ్గర జలం ఉండీ, దప్పికతో ఉన్న వారికి జలం ఇవ్వని వాడు పొందే పాపమును, ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూచేవాడు పొందే పాపమును, పొందుతాను.
అమ్మా! నేను కనక రాముని అడవులకు పంపడానికి అనుమతి ఇచ్చినట్టు నీవు భావిస్తే నేను ప్రజలందరిచేతా అందరికీ అపకారము చేసేవాడి గానూ, కృతఘ్నుడు గానూ, ఆత్మహత్యాసదృశు డుగానూ, సిగ్గులేని వాడిగానూ అవమానింపబడతాను. నేను మీ అందరి శాపములు తగిలి బిచ్చము ఎత్తుకొంటూ పిచ్చివాని వలె బతుకుతాను. నిత్యమూ మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ, పాపములు చేస్తూ బతుకుతాను. ధర్మభ్రష్టుడిని, సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను. ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను.
ఇకనైనా నన్ను నమ్మవా అమ్మా.” అని భరతుడు ఎన్నో ఒట్లు పెట్టుకున్నాడు. కౌసల్య పాదాల మీద పడ్డాడు భరతుడు. భరతుని మాటలు విన్న కౌసల్యకు నోట మాట రాలేదు. భరతుని పైకి లేవదీసింది. “కుమారా భరతా! నీవు ఇన్ని ఒట్లు పెట్టుకొని నా దు:ఖము మరింత ఎక్కువ చేసావు. భరతా! నీవు ధర్మాత్ముడివి. ఆవిషయం నాకు తెలుసు. కాని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను. ఏమీ అనుకోకు” అంటూ భరతుని కౌగలించుకొని కౌసల్య దు:ఖిస్తూ ఉంది. ఆ ప్రకారంగా భరతుడు, కౌసల్య దు:ఖిస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.