Kishkindha Kanda Sarga 9 In Telugu – కిష్కింధాకాండ నవమః సర్గః

కిష్కింధాకాండలో నవమ సర్గ, హనుమంతుడు లంకను దహించి సీతకు మరోసారి ధైర్యం చెప్పడం గురించి ఉంటుంది. లంకను దహించి, హనుమంతుడు సీతకు రాముడి సందేశాన్ని మరోసారి అందించి, రక్షణ కోసం రాముడు త్వరలో వచ్చే విషయాన్ని చెబుతాడు. సీత, హనుమంతుడికి రాముడికి ఇవ్వవలసిన చూడామణిని అందిస్తుంది. హనుమంతుడు లంకను విడిచి, రాముడి వద్దకు తిరిగి చేరుకుంటాడు. తిరిగి వచ్చాక, హనుమంతుడు సీతను కనుగొన్న వివరాలను రాముని, సుగ్రీవుని, వానర సైన్యానికి తెలియజేస్తాడు. ఈ సర్గలో సీతకు ధైర్యం ఇచ్చిన హనుమంతుడి చర్యలు, రాముడు, సుగ్రీవుడు, వానర సైన్యంలోని ఆనందం ప్రధానంగా ఉంటాయి.

వైరవృత్తాంతానుక్రమః

శ్రూయతాం రామ యద్వృత్తమాదితః ప్రభృతి త్వయా |
యథా వైరం సముద్భూతం యథా చాహం నిరాకృతః || ౧ ||

వాలీ నామ మమ భ్రాతా జ్యేష్ఠః శత్రునిషూదనః |
పితుర్బహుమతో నిత్యం మమాపి చ తథా పురా || ౨ ||

పితర్యుపరతేఽస్మాకం జ్యేష్ఠోఽయమితి మంత్రిభిః |
కపీనామీశ్వరో రాజ్యే కృతః పరమసమ్మతః || ౩ ||

రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ |
అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః || ౪ ||

మాయావీ నామ తేజస్వీ పూర్వజో దుందుభేః సుతః |
తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా || ౫ ||

స తు సుప్తజనే రాత్రౌ కిష్కింధాద్వారమాగతః |
నర్దతి స్మ సుసంరబ్ధో వాలినం చాహ్వయద్రణే || ౬ ||

ప్రసుప్తస్తు మమ భ్రాతా నర్దితం భైరవస్వనమ్ |
శ్రుత్వా న మమృషే వాలీ నిష్పపాత జవాత్తదా || ౭ ||

స తు వై నిఃసృతః క్రోధాత్తం హంతుమసురోత్తమమ్ |
వార్యమాణస్తతః స్త్రీభిర్మయా చ ప్రణతాత్మనా || ౮ ||

స తు నిర్ధూయ సర్వాన్నో నిర్జగామ మహాబలః |
తతోఽహమపి సౌహార్దాన్నిఃసృతో వాలినా సహ || ౯ ||

స తు మే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాదవస్థితమ్ |
అసురో జాతసంత్రాసః ప్రదుద్రావ తతో భృశమ్ || ౧౦ ||

తస్మిన్ ద్రవతి సంత్రస్తే హ్యావాం ద్రుతతరం గతౌ |
ప్రకాశశ్చ కృతో మార్గశ్చంద్రేణోద్గచ్ఛతా తదా || ౧౧ ||

స తృణైరావృతం దుర్గం ధరణ్యా వివరం మహత్ |
ప్రవివేశాసురో వేగాదావామాసాద్య విష్ఠితౌ || ౧౨ ||

తం ప్రవిష్టం రిపుం దృష్ట్వా బిలం రోషవశం గతః |
మామువాచ తదా వాలీ వచనం క్షుభితేంద్రియః || ౧౩ ||

ఇహ త్వం తిష్ఠ సుగ్రీవ బిలద్వారి సమాహితః |
యావదత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసా రిపుమ్ || ౧౪ ||

మయా త్వేతద్వచః శ్రుత్వా యాచితః స పరంతపః |
శాపయిత్వా చ మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్ || ౧౫ ||

తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రః సంవత్సరో గతః |
స్థితస్య చ మమ ద్వారి స కాలోఽప్యత్యవర్తత || ౧౬ ||

అహం తు నష్టం తం జ్ఞాత్వా స్నేహాదాగతసంభ్రమః |
భ్రాతరం తు న పశ్యామి పాపాశంకి చ మే మనః || ౧౭ ||

అథ దీర్ఘస్య కాలస్య బిలాత్తస్మాద్వినిఃసృతమ్ |
సఫేనం రుధిరం రక్తమహం దృష్ట్వా సుదుఃఖితః || ౧౮ ||

నర్దతామసురాణాం చ ధ్వనిర్మే శ్రోత్రమాగతః |
నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిఃస్వనో గురోః || ౧౯ ||

అహం త్వవగతో బుద్ధ్యా చిహ్నైస్తైర్భ్రాతరం హతమ్ |
పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా || ౨౦ ||

శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగతః సఖే |
గూహమానస్య మే తత్త్వం యత్నతో మంత్రిభిః శ్రుతమ్ || ౨౧ ||

తతోఽహం తైః సమాగమ్య సమ్మతైరభిషేచితః |
రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ || ౨౨ ||

ఆజగామ రిపుం హత్వా వాలీ తమసురోత్తమమ్ |
అభిషిక్తం తు మాం దృష్ట్వా వాలీ సంరక్తలోచనః || ౨౩ ||

మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్ |
నిగ్రహేఽపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ || ౨౪ ||

న ప్రావర్తత మే బుద్ధిర్భ్రాతుర్గౌరవయంత్రితా |
హత్వా శత్రుం స మే భ్రాతా ప్రవివేశ పురం తదా || ౨౫ ||

మానయంస్తం మహాత్మానం యథావచ్చాభ్యవాదయమ్ |
ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేనాంతరాత్మనా || ౨౬ ||

నత్వా పాదావహం తస్య ముకుటేనాస్పృశం ప్రభో |
కృతాంజలిరుపాగమ్య స్థితోఽహం తస్య పార్శ్వతః |
అపి వాలీ మమ క్రోధాన్న ప్రసాదం చకార సః || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమః సర్గః || ౯ ||

Kishkindha Kanda Sarga 9 Meaning In Telugu

“రామా! వాలి, నేను, అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్న గారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రి గారు చనిపోయిన తరువాత, పెద్ద కుమారుడు అయిన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసారు. వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే, నేను వాలికి సేవకునిలా అతనిని సేవించేవాడిని. మయునికి ఇద్దరు కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి, మా అన్న వాలికి ఒక స్త్రీమూలకంగా విరోధము ఏర్పడింది. ఒకరోజు అర్థ రాత్రి అందరమూ నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమ వంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్థరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చచెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్లాడు. నేను కూడా వాలితో పాటు వెళ్లాను.

మా ఇద్దరినీ చూచి మాయావి పారిపోయాడు. నేను, వాలి, మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగములోకి ప్రవేశించాడు. ఆ సొరంగము గడ్డితో కప్పబడి ఉంది. నేను వాలి బయట నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ఇలా అన్నాడు. “తమ్ముడా! సుగ్రీవా! నేను ఈ బిలములో ప్రవేశించి, శత్రువును చంపి వస్తాను. నేను వచ్చువరకూ నీవు ఈ బిలము వద్ద నా కోసం వేచి ఉండు.” అని అన్నాడు.

దానికి నేను ఒప్పుకోలేదు. నేను కూడా తన వెంట వస్తానని ఎంత బతిమాలుకున్నా వాలి వినలేదు. తాను ఒక్కడే ఆ సొరంగము లోకి వెళ్లాడు. నేను సొరంగము బయట నిలబడి ఉన్నాను. దాదాపు ఒక సంవత్సర కాలము గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. నేను ఓపికగా ఆ సంవత్సరకాలము సొరంగము బయట వేచి ఉన్నాను. నాలో ఏదో శంక మొదలయింది. వాలి మహావీరుడు. కానీ సంవత్సరకాలము రాకపోవడంతో నామనసు కీడు శంకించింది. అయినా గుండె నిబ్బరంతో ఎదురు చూచాను.

కొంత కాలానికి ఆ సొరంగము నుండి నురుగతో కూడిన రక్తం మడుగులాగా బయటకు ప్రవహించింది. రాక్షసులు గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వినబడ్డాయి. కాని నా సోదరుడు అరుస్తున్న గొంతు వినబడలేదు. నా సోదరుడు వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడినట్టు నిర్ధారణ చేసుకున్నాను. ఇంక అక్కడ ఉండి చేసేది ఏమీ లేకపోవడంతో, నేను ఆ బిలమును పెద్ద పెద్ద బండ రాళ్లతో మూసి వేసాను. నా అన్న వాలికి జలతరణములు కూడా విడిచాను. తరువాత కిష్కింధకు తిరిగి వచ్చాను.

నా అన్న వాలి మరణాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాను. కాని మంత్రులు ఆ విషయాన్ని పసిగట్టారు. తెలుసుకున్నారు. నేను ఎంత వద్దన్నా, అందరూ కలిసి నన్ను ఈ కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేసారు. ఆ విధంగా నేను కిష్కింధకు రాజునై ధర్మంగా పరిపాలిస్తున్నాను.
ఇంతలో వాలి ఆ రాక్షసుడు మాయావిని చంపి కిష్కింధకు తిరిగి వచ్చాడు. నన్ను కిష్కింధకు రాజుగా చూచాడు. తట్టుకోలేక పోయాడు. నా మీద ఆగ్రహించాడు. నా మంత్రులను బంధించాడు. నేను వాలి అంతటి పరాక్రమ వంతుడనైనా, అన్నగారి మీద గౌరవంతో నేను వాలిని ఎదిరించలేదు. నా అన్నకు అభివాదము చేసాను. గౌరవించాను. కాని వాలి నన్ను ఆదరించలేదు. నా మీద ఆగ్రహించాడు. నేను వాలి పాదాల మీద పడి ప్రార్థించాను. కాని వాలికి నా మీద కోపం పోలేదు. నన్ను అనుగ్రహించలేదు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ దశమః సర్గః (10) >>

Leave a Comment