Ayodhya Kanda Sarga 107 In Telugu – అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః

అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో మరొక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు రాముడి అనారోగ్యం గురించి తెలుసుకుని, ఎంతో చింతతో బాధపడతాడు. అతను రాముని వద్దకు వెళ్లి, అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. కానీ రాముడు తన వనవాసాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. రాముడు ధర్మం, పితృవాక్య పరిపాలనకు ప్రాముఖ్యతను ఇస్తూ, భరతుని శాంతన చేస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్లి, అవే పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముని తరపున రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ సర్గ భక్తి, ధర్మనిష్ట, మరియు పితృవాక్య పరిపాలనను మునుపటి కంటే మరింతగా స్పష్టం చేస్తుంది.

రామప్రతివచనమ్

పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజః |
ప్రత్యువాచ తతః శ్రీమాన్ జ్ఞాతిమధ్యేఽభిసత్కృతః || ౧ ||

ఉపపన్నమిదం వాక్యం యత్త్వమేవమభాషథాః |
జాతః పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ || ౨ ||

పురా భ్రాతః పితా నః స మాతరం తే సముద్వహన్ |
మాతామహే సమాశ్రౌషీద్రాజ్యశుల్కమనుత్తమమ్ || ౩ ||

దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః |
సంప్రహృష్టో దదౌ రాజా వరమారాధితః ప్రభుః || ౪ ||

తతః సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్వినీ |
అయాచత నరశ్రేష్ఠం ద్వౌ వరౌ వరవర్ణినీ || ౫ ||

తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథా |
తౌ చ రాజా తదా తస్యై నియుక్తః ప్రదదౌ వరౌ || ౬ ||

తేన పిత్రాఽహమప్యత్ర నియుక్తః పురుషర్షభ |
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్ || ౭ ||

సోఽహం వనమిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్వితః |
సీతయా చాప్రతిద్వంద్వః సత్యవాదే స్థితః పితుః || ౮ ||

భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినమ్ |
కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్ || ౯ ||

ఋణాన్మోచయ రాజానం మత్కృతే భరతప్రభుమ్ |
పితరం చాపి ధర్మజ్ఞం మాతరం చాభినందయ || ౧౦ ||

శ్రూయతే హి పురా తాత శ్రుతిర్గీతా యశస్వినా |
గయేన యజమానేన గయేష్వేవ పితన్ ప్రతి || ౧౧ ||

పున్నామ్నో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః |
తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితౄన్ యత్పాతి వా సుతః || ౧౨ ||

ఏష్టవ్యా బహవః పుత్రా గుణవంతో బహుశ్రుతాః |
తేషాం వై సమవేతానామపి కశ్చిద్గయాం వ్రజేత్ || ౧౩ ||

ఏవం రాజర్షయః సర్వే ప్రతీతా రాజనందన |
తస్మాత్ త్రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో || ౧౪ ||

అయోధ్యాం గచ్ఛ భరత ప్రకృతీరనురంజయ |
శత్రుఘ్నసహితో వీర సహ సర్వైర్ద్విజాతిభిః || ౧౫ ||

ప్రవేక్ష్యే దండకారణ్యమహమప్యవిలంబయన్ |
ఆభ్యాం తు సహితో రాజన్ వైదేహ్యా లక్ష్మణేన చ || ౧౬ ||

త్వం రాజా భరత భవ స్వయం నరాణామ్
వన్యానామహమపి రాజరాణ్మృగాణామ్ |
గచ్ఛత్వం పురవరమద్య సంప్రహృష్టః
సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే || ౧౭ ||

ఛాయాం తే దినకరభాః ప్రబాధమానమ్
వర్షత్రం భరత కరోతు మూర్ధ్ని శీతామ్ |
ఏతేషామహమపి కాననద్రుమాణాం
ఛాయాం తామతిశయినీం సుఖీ శ్రయిష్యే || ౧౮ ||

శత్రుఘ్నః కుశలమతిస్తు తే సహాయః
సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్ |
చత్వారస్తనయవరా వయం నరేంద్రమ్
సత్యస్థం భరత చరామ మా విషాదమ్ || ౧౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః || ౧౦౭ ||

Ayodhya Kanda Sarga 107 Meaning In Telugu

తన మనోనిశ్చయాన్ని రాముడు భరతునికి ఈ విధంగా తెలిపాడు.
“భరతా! ఇప్పటి దాకా నీ వు చెప్పినది అంతా మిగుల యుక్తి యుక్తముగా ఉంది. అందులో ఏ దోషమూ లేదు. చాలా చక్కగా చెప్పావు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీకు తెలియని విషయములు కొన్ని నీకు చెప్పక తప్పదు.

మన తండ్రి దశరథుడు తాను నీ తల్లి కైకను వివాహమాడు సందర్భంలో తన రాజ్యమునకు ఉత్తర అధికారిగా నిన్ను చేస్తాను అని మీ మాతామహులకు (కైక తండ్రికి) వాగ్దానం చేసాడట. అదీకాకుండా దేవాసుర సంగ్రామంలో నీ తల్లి మన తండ్రి ప్రాణములు రెండు సార్లు కాపాడినందుకు గాను, రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసాడట. నీ తల్లి ఆ వరములను తనకు తరువాత ప్రసాదించమని అడిగినదట. ఆ వరములను నా పట్టాభిషేక సందర్భములో కోరినది.

అందులో మొదటి వరము నాకు 14 ఏళ్ల వనవాసము. రెండవ వరము నీకు అయోధ్య రాజ్య పట్టాభిషేకము. ఆ వరములను మన తండ్రి నీ తల్లికి ఇచ్చాడు. నన్ను 14 ఏళ్లు అరణ్యములకువెళ్లమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞమేరకు నేను అరణ్యములకు వచ్చాను.

నన్ను విడిచి ఉండలేక నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు నా వెంట అడవులకు వచ్చారు. దీనితో మొదటి వరము నెరవేరినది.
మన తండ్రి నీ తల్లికి ఇచ్చిన రెండవ వరమును అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివి కావాలి. అప్పుడే నీవు నీ తల్లి తండ్రుల మాటను పాటించినట్టవుతుంది. నీవు నీ తండ్రిని ఋణవిముక్తుని చేసినట్టవుతుంది. దీనికి ఒక ఇతిహాసమును కూడా చెబుతాను విను.

పూర్వము గయుడు గయా క్షేత్రంలో పితృదేవతల గురించి ఒక యాగము చేసాడట. ఆ సందర్భంలో గయుడు ఈవిధంగా చెప్పాడు అని పెద్దలుచెబుతారు. పుత్రుడు అనే వాడు పితరులను పున్నామ నరకము నుండి రక్షిస్తాడట. అందుకని అతడికి పుత్రుడు అనే పేరు వచ్చిందట. అందుకే తల్లితండ్రులు తమకు చాలా మంది పుత్రసంతానము కావాలని కోరుకుంటారట. ఎందుకంటే, అందులో కనీసం ఒకడైనా గయకు వెళ్లి అక్కడ పితృకార్యము చేస్తాడని వారి ఆశ.

ఓభరతా! నీవు కూడా నీ తండ్రి మాటను పాటించి ఆయనను పున్నామ నరకమునుండి రక్షించు. నీ తండ్రి నీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారము వెంటనే అయోధ్యకు వెళ్లి, పట్టాభిషిక్తుడివై, శత్రుఘ్నుని సాయంతో అయోధ్యను పాలించు. నేను కూడా ఇక్కడ ఉండను. సీత, లక్ష్మణులతో కలిసి దండకారణ్యమునకు వెళతాను. నీవు అయోధ్యను పాలిస్తుంటే, నేను అడవిలో ఉన్న మృగములను పాలిస్తాను. నీవు సంతోషంగా అయోధ్యకు వెళ్లు, నేను అంతే సంతోషంగా దండకారణ్యమునకు వెళతాను.

నీకు నీ సింహాసనము మీద ఉన్న తెల్లటి గొడుగు (శ్వేతఛత్రము) ఎలా నీడనిస్తుందో, నాకు కూడా ఈ అడవిలో ఉన్న ఫలవృక్షములు నీడనిస్తాయి. నీవు శ్వేతఛత్రఛాయలో, నేను వటవృక్షఛాయలో సుఖిద్దాము. నీకు తోడుగా శత్రుఘ్నుడు ఉంటాడు. నాకు తోడుగా లక్ష్మణుడు ఉంటాడు. దశరథునికి కుమారులుగా పుట్టినందుకు, మనము నలుగురము ఆయన మాటను సత్యవ్రతమును నిలబెడదాము.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః (108) >>

Leave a Comment