Balakanda Sarga 39 In Telugu – బాలకాండ ఏకోనచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనచత్వారింశః సర్గలో సగర చక్రవర్తి విడుదల చేసిన కర్మ గుర్రాన్ని ఇంద్రుడు ఆచారానికి ఆటంకం కలిగించడానికి లాక్కున్నాడు. గుర్రం లేకుండా కర్మ ముగింపుకు వెళ్లదు. అప్పుడు సగరుడు తన అరవై వేల మంది కుమారులను ఆ గుర్రం కోసం వెతకమని ఆజ్ఞాపించాడు, అది భూమిపై కనిపించకపోతే భూమిని తవ్వమని అడుగుతాడు. మరియు భూమిపై గుర్రం కనిపించనప్పుడు యువరాజులు భూమిని తవ్వి, భూలోకంలో నివసించే జీవుల దుఃఖానికి గురవుతారు.

పృథివీవిదారణమ్

విశ్వామిత్రవచః శ్రుత్వా కథాంతే రఘునందన |
ఉవాచ పరమప్రీతో మునిం దీప్తమివానలమ్ ||

1

శ్రోతుమిచ్ఛామి భద్రం తే విస్తరేణ కథామిమామ్ |
పూర్వకో మే కథం బ్రహ్మన్యజ్ఞం వై సముపాహరత్ ||

2

తస్య తద్వచనం శ్రుత్వా కౌతూహలసమన్వితః |
విశ్వామిత్రస్తు కాకుత్స్థమువాచ ప్రహసన్నివ ||

3

శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః |
శంకరశ్వశురో నామ హిమవానచలోత్తమః ||

4

వింధ్యపర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరమ్ |
తయోర్మధ్యే ప్రవృత్తోఽభూద్యజ్ఞః స పురుషోత్తమ ||

5

స హి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి |
తస్యాశ్వచర్యాం కాకుత్స్థ దృఢధన్వా మహారథః ||

6

అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః |
తస్య పర్వణి సంయుక్తం యజమానస్య వాసవః ||

7

రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్ |
హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్నశ్వే మహాత్మనః ||

8

ఉపాధ్యాయగణాః సర్వే యజమానమథాబ్రువన్ |
అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వోఽపనీయతే ||

9

హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవోపనీయతామ్ |
[* అధికపాఠః –
యజ్ఞచ్ఛిద్రం భవత్యేతత్సర్వేషామశివాయ నః |
తత్తథా క్రియతాం రాజన్ యథాచ్ఛిద్రః క్రతుర్భవేత్ |
*]
ఉపాధ్యాయవచః శ్రుత్వా తస్మిన్సదసి పార్థివః ||

10

షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతదువాచ హ |
గతిం పుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభాః ||

11

మంత్రపూతైర్మహాభాగైరాస్థితో హి మహాక్రతుః |
తద్గచ్ఛత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు వః ||

12

సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్ఛత |
ఏకైకం యోజనం పుత్రా విస్తారమభిగచ్ఛత ||

13

యావత్తురగసందర్శస్తావత్ఖనత మేదినీమ్ |
తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా ||

14

దీక్షితః పౌత్రసహితః సోపాధ్యాయగణో హ్యహమ్ |
ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగదర్శనమ్ ||

15

ఇత్యుక్తా హృష్టమనసో రాజపుత్రా మహాబలాః | [తే సర్వే]
జగ్ముర్మహీతలం రామ పితుర్వచనయంత్రితాః ||

16

[* గత్వ తు పృథివీం సర్వమదృష్టా తం మహబలాః | *]
యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలమ్ |
బిభిదుః పురుషవ్యాఘ్ర వజ్రస్పర్శసమైర్నఖైః ||

17

శూలైరశనికల్పైశ్చ హలైశ్చాపి సుదారుణైః |
భిద్యమానా వసుమతీ ననాద రఘునందన ||

18

నాగానాం వధ్యమానానామసురాణాం చ రాఘవ |
రాక్షసానాం చ దుర్ధర్షః సత్త్వానాం నినదోఽభవత్ ||

19

యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునందన |
బిభిదుర్ధరణీం వీరా రసాతలమనుత్తమమ్ ||

20

ఏవం పర్వతసంబాధం జంబూద్వీపం నృపాత్మజాః |
ఖనంతో నృపశార్దూల సర్వతః పరిచక్రముః ||

21

తతో దేవాః సగంధర్వాః సాసురాః సహపన్నగాః |
సంభ్రాంతమనసః సర్వే పితామహముపాగమన్ ||

22

తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదనాస్తదా |
ఊచుః పరమసంత్రస్తాః పితామహమిదం వచః ||

23

భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః |
బహవశ్చ మహాత్మానో హన్యంతే జలవాసినః ||

24 [వధ్యంతే]

అయం యజ్ఞహరోఽస్మాకమనేనాశ్వోఽపనీయతే |
ఇతి తే సర్వభూతాని హింసంతి సగరాత్మజః ||

25

శ్రీ రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు. తెలియ జేయండి.” అని అడిగాడు.

విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు. ” ఓ రామా! సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచి పెట్టాడు. సగరుని మనుమడైన అంశు మంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్తిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు.

“ ఓ సగర చక్రవర్తీ! యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను.” అని అన్నారు.

ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు. “ ఓ కుమారులారా! ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరి తలము మీద దొరకకపోతే మీ రందరూ ఒక్కొకరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకూ నేను.ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీ కోసము నిరీక్షిస్తూ ఉంటాము.” అని పలికాడు సగరుడు..

తండ్రి ఆజ్ఞ ప్రకారము సగర పుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వ నారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సరములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగర పుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున అరవై వేల యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారి పోయింది. పెద్ద గొయ్యిగా తయారయింది. సగర పుత్రులు జంబూ ద్వీపము అంతా తవ్వేశారు.

ఇది చూచి దేవతలరు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లారు. “ఓ బ్రహ్మ దేవా! యజ్ఞాశ్వము కొరకు సగర పుత్రులు భూమి నంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికన వాడిని దొరికనట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించి పోతున్నాయి. నీ సృష్టి అంతా సర్వ నాశనము అయి పోతోంది. మీరే కాపాడాలి.” అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చత్వారింశః సర్గః (40) >>

Leave a Comment