Balakanda Sarga 74 In Telugu – బాలకాండ చతుఃసప్తతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుఃసప్తతితమః సర్గలో విశ్వామిత్రుడు రాముడిని గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకువెళతాడు. అక్కడ అహల్యా శాపవిమోచనమును వివరిస్తాడు. ఇంద్రుడి కృత్యంతో శపించబడిన అహల్యా, రాముడి పాదధూళి తగిలి ముక్తి పొందుతుంది. ఆ తరువాత, రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి చేరుకుంటారు. అక్కడ యజ్ఞం జరుగుతుంది, అందులో రాముడు పాల్గొంటాడు.

|| జామదగ్న్యాభియోగః ||

అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః |
ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తరపర్వతమ్ ||

1

ఆశీర్భిః పూరయిత్వా చ కుమారాంశ్చ సరాఘవాన్ |
విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపమ్ ||

2

ఆపృష్ట్వాథ జగామాశు రాజా దశరథః పురీమ్ |
గచ్ఛంతం తం తు రాజానమన్వగచ్ఛన్నరాధిపః ||

3

అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు |
గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః ||

4

కంబలానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యంబరాణి చ |
హస్త్యశ్వరథపాదాతం దివ్యరూపం స్వలంకృతమ్ ||

5

దదౌ కన్యాపితా తాసాం దాసీదాసమనుత్తమమ్ |
హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ ||

6

దదౌ పరమసంహృష్టః కన్యాధనమనుత్తమమ్ |
దత్త్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివమ్ ||

7

ప్రవివేశ స్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః |
రాజాప్యయోధ్యాధిపతిః సహ పుత్రైర్మహాత్మభిః ||

8

ఋషీన్సర్వాన్పురస్కృత్య జగామ సబలానుగః |
గచ్ఛంతం తం నరవ్యాఘ్రం సర్షిసంఘం సరాఘవమ్ ||

9

ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరంతి తతస్తతః |
భౌమాశ్చైవ మృగాః సర్వే గచ్ఛంతి స్మ ప్రదక్షిణమ్ ||

10

తాన్దృష్ట్వా రాజశార్దూలో వసిష్ఠం పర్యపృచ్ఛత |
అసౌమ్యాః పక్షిణో ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణాః ||

11

కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి |
రాజ్ఞో దశరథస్యైతచ్ఛ్రుత్వా వాక్యం మహానృషిః ||

12

ఉవాచ మధురాం వాణీం శ్రూయతామస్య యత్ఫలమ్ |
ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్చ్యుతమ్ ||

13

మృగాః ప్రశమయంత్యేతే సంతాపస్త్యజ్యతామయమ్ |
తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవ హ ||

14

కంపయన్మేదినీం సర్వాం పాతయంశ్చ మహాద్రుమాన్ |
తమసా సంవృతః సూర్యః సర్వా న ప్రబభుర్దిశః ||

15

భస్మనా చావృతం సర్వం సమ్మూఢమివ తద్బలమ్ |
వసిష్ఠశ్చర్షయశ్చాన్యే రాజా చ ససుతస్తదా ||

16

ససంజ్ఞా ఇవ తత్రాసన్సర్వమన్యద్విచేతనమ్ |
తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్ఛన్నేవ సా చమూః ||

17

దదర్శ భీమసంకాశం జటామండలధారిణమ్ |
భార్గవం జామదగ్న్యం తం రాజారాజవిమర్దినమ్ ||

18

కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుఃసహమ్ |
జ్వలంతమివ తేజోభిర్దుర్నిరీక్ష్యం పృథగ్జనైః ||

19

స్కంధే చాసాద్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్ |
ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్ ||

20

తం దృష్ట్వా భీమసంకాశం జ్వలంతమివ పావకమ్ |
వసిష్ఠప్రముఖాః సర్వే జపహోమపరాయణాః ||

21

సంగతా మునయః సర్వే సంజజల్పురథో మిథః |
కచ్చిత్పితృవధామర్షీ క్షత్రం నోత్సాదయిష్యతి ||

22

పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వరః |
క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితమ్ ||

23

ఏవముక్త్వార్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనమ్ |
ఋషయో రామరామేతి వచో మధురమబ్రువన్ ||

24

ప్రతిగృహ్య తు తాం పూజామృషిదత్తాం ప్రతాపవాన్ |
రామం దాశరథిం రామో జామదగ్న్యోఽభ్యభాషత ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃసప్తతితమః సర్గః ||

Balakanda Sarga 74 Meaning In Telugu PDF

సీతారాముల కల్యాణం జరిగింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు, నూతన వధూవరు లందరినీ ఆశీర్వదించి, జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్లిపోయిన తరువాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు.

అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణములు కానుకగా ఇచ్చాడు. లక్ష ఆవులను, అనేక వస్త్రాభరణము లను, ఏనుగులు, హయములు, రథములను అరణంగా ఇచ్చాడు. దాసులను దాసీజనమును దన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణ గా చతురంగ బలములను పంపాడు. వారితో పాటు మిథిలా నగరము బయట దాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. తరువాత వెను తిరిగి మిథిలకు వచ్చాడు.

దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే దశరథుడు వసిష్ఠుని పిలిచి ఆ దుశ్శకునముల కు అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు వసిష్ఠుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుంది అని ఈ దుశ్శకునములు సూచిస్తూ ఉన్నాయి. కాని ఆ ఆపద సులభంగా తొలగి పోతుంది అని కొన్ని శుభశకునములు కూడా కనపడుతున్నాయియి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు.” అని వివరించాడు వసిష్ఠుడు.

ఇంతలో తీవ్రంగా పెను గాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుని కాంతి వెల వెల బోయింది. చీకట్లు కమ్మాయి. ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు.

అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు. వెంటనే దశరథుడు, వసిష్ఠుడు, బ్రాహ్మణులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించారు. ఉచితాసనము ఇచ్చి సత్కరిం చారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ పంచసప్తతితమః సర్గః (75) >>

Leave a Comment