Kishkindha Kanda Sarga 19 In Telugu – కిష్కింధాకాండ ఏకోనవింశః సర్గః

కిష్కింధాకాండంలో ఏకోనవింశం సర్గంలో, హనుమంతుడు లక్ష్మణుడిని ఆశ్వాసన ఇస్తాడు మరియు రాముని సహాయాన్ని పూర్తిచేస్తాడు. వాల్మీకి మహర్షి సహాయంతో రామాయణ కథని ఆరంభిస్తాడు. రాముడు హనుమంతుడి వర్ణనను ఆదరిస్తున్నాడు, అది పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి హనుమంతుడి అదృష్టాన్ని శ్రేష్టిస్తాడని వెలుగులు వ్యక్తం చేస్తాడు.

తారాగమనమ్

స వానరమహారాజః శయానః శరవిక్షతః |
ప్రత్యుక్తో హేతుమద్వాక్యైర్నోత్తరం ప్రత్యపద్యత || ౧ ||

అశ్మభిః ప్రవిభిన్నాంగః పాదపైరాహతో భృశమ్ |
రామబాణేన చ క్రాంతో జీవితాంతే ముమోహ సః || ౨ ||

తం భార్యా బాణమోక్షేణ రామదత్తేన సంయుగే |
హతం ప్లవగశార్దూలం తారా శుశ్రావ వాలినమ్ || ౩ ||

సా సపుత్రాప్రియం శ్రుత్వా వధం భర్తుః సుదారుణమ్ |
నిష్పపాత భృశం త్రస్తా మృగీవ గిరిగహ్వరాత్ || ౪ ||

యే త్వంగదపరీవారా వానరా భీమవిక్రమాః |
తే సకార్ముకమాలోక్య రామం త్రస్తాః ప్రదుద్రువుః || ౫ ||

సా దదర్శ తతస్త్రస్తాన్ హరీనాపతతో ద్రుతమ్ |
యూథాదివ పరిభ్రష్టాన్ మృగాన్నిహతయూథపాన్ || ౬ ||

తానువాచ సమాసాద్య దుఃఖితాన్ దుఃఖితా సతీ |
రామవిత్రాసితాన్ సర్వాననుబద్ధానివేషుభిః || ౭ ||

వానరా రాజసింహస్య యస్య యూయం పురఃసరాః |
తం విహాయ సుసంత్రస్తాః కస్మాద్ద్రవథ దుర్గతాః || ౮ ||

రాజ్యహేతోః స చేద్భ్రాతా భ్రాత్రా రౌద్రేణ పాతితః |
రామేణ ప్రహితై రౌద్రైర్మార్గణైర్దూరపాతిభిః || ౯ ||

కపిపత్న్యా వచః శ్రుత్వా కపయః కామరూపిణః |
ప్రాప్తకాలమవిక్లిష్టమూచుర్వచనమంగనామ్ || ౧౦ ||

జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వ చాంగదమ్ |
అంతకో రామరూపేణ హత్వా నయతి వాలినమ్ || ౧౧ ||

క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చ శిలాస్తథా |
వాలీ వజ్రసమైర్బాణై రామేణ వినిపాతితః || ౧౨ ||

అభిద్రుతమిదం సర్వం విద్రుతం ప్రసృతం బలమ్ |
అస్మిన్ ప్లవగశార్దూలే హతే శక్రసమప్రభే || ౧౩ ||

రక్ష్యతాం నగరద్వారమంగదశ్చాభిషిచ్యతామ్ |
పదస్థం వాలినః పుత్రం భజిష్యంతి ప్లవంగమాః || ౧౪ ||

అథవారుచితం స్థానమిహ తే రుచిరాననే |
ఆవిశంతి హి దుర్గాణి క్షిప్రమన్యాని వానరాః || ౧౫ ||

అభార్యాశ్చ సభార్యాశ్చ సంత్యత్ర వనచారిణః |
లుబ్ధేభ్యో విప్రయుక్తేభ్యస్తేభ్యో నస్తుములం భయమ్ || ౧౬ ||

అల్పాంతరగతానాం తు శ్రుత్వా వచనమంగనా |
ఆత్మనః ప్రతిరూపం సా బభాషే చారుహాసినీ || ౧౭ ||

పుత్రేణ మమ కిం కార్యం కిం రాజ్యేన కిమాత్మనా |
కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి || ౧౮ ||

పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మనః |
యోఽసౌ రామప్రయుక్తేన శరేణ వినిపాతితః || ౧౯ ||

ఏవముక్త్వా ప్రదుద్రావ రుదంతీ శోకకర్శితా |
శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతీ || ౨౦ ||

ఆవ్రజంతీ దదర్శాథ పతిం నిపతితం భువి |
హంతారం దానవేంద్రాణాం సమరేష్వనివర్తినామ్ || ౨౧ ||

క్షేప్తారం పర్వతేంద్రాణాం వజ్రాణామివ వాసవమ్ |
మహావాతసమావిష్టం మహామేఘౌఘనిఃస్వనమ్ || ౨౨ ||

శక్రతుల్యపరాక్రాంతం వృష్ట్వేవోపరతం ఘనమ్ |
నర్దంతం నర్దతాం భీమం శూరం శూరేణ పాతితమ్ || ౨౩ ||

శార్దూలేనామిషస్యార్థే మృగరాజం యథా హతమ్ |
అర్చితం సర్వలోకస్య సపతాకం సవేదికమ్ || ౨౪ ||

నాగహేతోః సుపర్ణేన చైత్యమున్మథితం యథా |
అవష్టభ్య చ తిష్ఠంతం దదర్శ ధనురుత్తమమ్ || ౨౫ ||

రామం రామానుజం చైవ భర్తుశ్చైవానుజం శుభా |
తానతీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే || ౨౬ ||

సమీక్ష్య వ్యథితా భూమౌ సంభ్రాంతా నిపపాత హ |
సుప్త్వేవ పునరుత్థాయ ఆర్యపుత్రేతి క్రోశతీ |
రురోద సా పతిం దృష్ట్వా సందితం మృత్యుదామభిః || ౨౭ ||

తామవేక్ష్య తు సుగ్రీవః క్రోశంతీం కురరీమివ |
విషాదమగమత్కష్టం దష్ట్వా చాంగదమాగతమ్ || ౨౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకోనవింశః సర్గః || ౧౯ ||

Kishkindha Kanda Sarga 19 Meaning In Telugu

వాలిని రాముడు తన బాణంతో కొట్టడం, వాలి పడిపోవడం, చనిపోయే స్థితిలో ఉండటం వాలి భార్య తారకు తెలిసింది. వాలి, తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనే ఉన్నాడు. తార, అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దుఃఖించారు. వాలి దగ్గరకు పరుగు పరుగున వస్తున్నారు.
అప్పటికే, ధనుస్సును ధరించి, కాలయముని మాదిరి నిలబడి ఉన్న రాముని చూచి వానరులు అందరూ పారిపోయారు. పారి పోతున్న వానరులను చూచింది తార. తార వారిని చూచి ఇలా పలికింది. “ఓ వానరులారా! ఇప్పటి వరకూ మీరు మీ రాజు వాలి వెంట ఉండే వాళ్లు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు. రాజ్యం కోసరం సుగ్రీవుడు, తాను ఏమీ చేయలేక, రాముని సాయంతో మీ రాజు వాలిని చంపించాడు. మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడకండి. పారిపోకండి. నాతో రండి.” అని అన్నది తార.

పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు. తారను చూచి ఇలా అన్నారు. “అమ్మా తారా! ముందు నీవు, నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో. లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు. సుగ్రీవునికి అడ్డం లేకుండా చేస్తాడు. రాముడు వాలిని చంపగానే, మేమందరమూ భయంతో పారిపోయాము. అమ్మా తారా! నీవు అంగదుని రాజుగా అభిషేకించు. మేమందరమూ అంగదుని, వాలిని సేవించినట్టు సేవిస్తాము.” అని ఎవరికి తోచినట్టు వారు అరిచారు.

మరి కొందరు తారను చూచి “తారా! నీవు అంగదుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు. సుగ్రీవుడు, అతని మంత్రులు రాజదుర్గములను ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటిదాకా మనము సుగ్రీవుని అతని మంత్రులను నానా కష్టాలుపెట్టాము. వాళ్లు ఇప్పుడు మనమీద పగతీర్చుకొనే అవకాశం ఉంది. కాబట్టి నీవు అంగదునితో కలిసి పారిపో” అని సలహా ఇచ్చారు.

ఆ మాటలు విన్న తార వారితో ఇలా అంది. “ఓ వానరవీరులారా! నా సర్వస్వము అయిన నా భర్త పోయాక, నాకు ఈ రాజ్యంతో, నా కొడకుతో, ఈ శరీరంతో పనేముంది. నేను నా భర్త వద్దకు వెళ్లాలి. నా భర్త ఎక్కడ ఉన్నాడు. ఏస్థితిలో ఉన్నాడు.” అంటూ ఏడుస్తూ వాలి వద్దకు పరుగెత్తింది.
దుందుభి లాంటి రాక్షసులను మట్టుబెట్టిన వాలి, పరాక్రమంలో దేవేంద్రునితో సమానమైన వాలి, మరణావస్థలో నేలమీద పడి ఉండటం చూచింది. వాలి దేహము పక్కన ధనుస్సు ఊతంగా పట్టుకొని నిలబడి ఉన్న రాముని, లక్ష్మణుని, తన భర్త వాలి తమ్ముడు సుగ్రీవునీ చూచింది. నేరుగా వెళ్లి తన భర్త శరీరం మీద పడిపోయింది. “ఆర్య పుత్రా! లేవండి. నేను మీ తారను వచ్చాను లేవండి.” అంటూ రోదిస్తూ ఉంది. తన వదిన తారను, తన అన్నకుమారుడు అంగదుని చూచి సుగ్రీవునికి దుఃఖము ఆగలేదు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ వింశః సర్గః (20) >>>

Leave a Comment