Kishkindha Kanda Sarga 8 In Telugu – కిష్కింధాకాండ అష్టమః సర్గః

కిష్కింధాకాండలో అష్టమ సర్గలో, హనుమంతుడు సీతను కనిపెట్టిన తర్వాత రావణుడి రాక్షస సేనతో పోరాడుతాడు. హనుమంతుడు తన శక్తిని ప్రదర్శించి, రాక్షసులను సంహరిస్తాడు, అశోకవాటికను ధ్వంసం చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు, హనుమంతుడిని పట్టుకోవడానికి తన సేనను పంపిస్తాడు. హనుమంతుడు రావణుని సేనను ఎదుర్కొని, తన శౌర్యాన్ని చూపుతాడు. చివరికి, హనుమంతుడిని రావణుని వద్దకు తేవబడతాడు. హనుమంతుడు రావణుని భయంకర రూపాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా ఉంటాడు. రావణుడు హనుమంతుడి తోకను కాల్చమని ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు తన కాలుతున్న తోకతో లంకను ఆగ్నేయం చేస్తాడు, అక్కడి ప్రజలు భయంతో త్రస్తులవుతారు.

వాలివధప్రతిజ్ఞా

పరితుష్టస్తు సుగ్రీవస్తేన వాక్యేన వానరః |
లక్ష్మణస్యాగ్రతో రామమిదం వచనమబ్రవీత్ || ౧ ||

సర్వథాఽహమనుగ్రాహ్యో దేవతానామసంశయః |
ఉపపన్నగుణోపేతః సఖా యస్య భవాన్మమ || ౨ ||

శక్యం ఖలు భవేద్రామ సహాయేన త్వయాఽనఘ |
సురరాజ్యమపి ప్రాప్తుం స్వరాజ్యం కిం పునః ప్రభో || ౩ ||

సోఽహం సభాజ్యో బంధూనాం సుహృదాం చైవ రాఘవ |
యస్యాగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవవంశజమ్ || ౪ ||

అహమప్యనురూపస్తే వయస్యో జ్ఞాస్యసే శనైః |
న తు వక్తుం సమర్థోఽహం స్వయమాత్మగతాన్ గుణాన్ || ౫ ||

మహాత్మనాం తు భూయిష్ఠం త్వద్విధానాం కృతాత్మనామ్ |
నిశ్చలా భవతి ప్రీతిర్ధైర్యమాత్మవతామివ || ౬ ||

రజతం వా సువర్ణం వా వస్త్రాణ్యాభరణాని చ |
అవిభక్తాని సాధూనామవగచ్ఛంతి సాధవః || ౭ ||

ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖితః సుఖితోఽపి వా |
నిర్దోషో వా సదోషో వా వయస్యః పరమా గతిః || ౮ ||

ధనత్యాగః సుఖత్యాగో దేహత్యాగోఽపి వా పునః |
వయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధమ్ || ౯ ||

తత్తథేత్యబ్రవీద్రామః సుగ్రీవం ప్రియవాదినమ్ |
లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేవ ధీమతః || ౧౦ ||

తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలమ్ |
సుగ్రీవః సర్వతశ్చక్షుర్వనే లోలమపాతయత్ || ౧౧ ||

స దదర్శ తతః సాలమవిదూరే హరీశ్వరః |
సుపుష్పమీషత్పత్రాఢ్యం భ్రమరైరుపశోభితమ్ || ౧౨ ||

తస్యైకాం పర్ణబహులాం భంక్త్వా శాఖాం సుపుష్పితామ్ |
సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవః || ౧౩ ||

తావాసీనౌ తతో దృష్ట్వా హనూమానపి లక్ష్మణమ్ |
సాలశాఖాం సముత్పాట్య వీనీతముపవేశయత్ || ౧౪ ||

సుఖోపవిష్టం రామం తు ప్రసన్నముదధిం యథా |
ఫలపుష్పసమాకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే || ౧౫ ||

తతః ప్రహృష్టః సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా |
ఉవాచ ప్రణయాద్రామం హర్షవ్యాకులితాక్షరమ్ || ౧౬ ||

అహం వినికృతో భ్రాత్రా చరామ్యేష భయార్దితః |
ఋశ్యమూకం గిరివరం హృతభార్యః సుదుఃఖితః || ౧౭ ||

సోఽహం త్రస్తో భయే మగ్నో వసామ్యుద్భ్రాంతచేతనః |
వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ || ౧౮ ||

వాలినో మే భయార్తస్య సర్వలోకభయంకర |
మమాపి త్వమనాథస్య ప్రసాదం కర్తుమర్హసి || ౧౯ ||

ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః |
ప్రత్యువాచ స కాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ || ౨౦ ||

ఉపకారఫలం మిత్రమపకారోఽరిలక్షణమ్ |
అద్యైవ తం హనిష్యామి తవ భార్యాపహారిణమ్ || ౨౧ ||

ఇమే హి మే మహావేగాః పత్రిణస్తిగ్మతేజసః |
కార్తికేయవనోద్భూతాః శరా హేమవిభూషితాః || ౨౨ ||

కంకపత్రప్రతిచ్ఛన్నా మహేంద్రాశనిసన్నిభాః |
సుపర్వాణః సుతీక్ష్ణాగ్రాః సరోషా ఇవ పన్నగాః || ౨౩ ||

భ్రాతృసంజ్ఞమమిత్రం తే వాలినం కృతకిల్బిషమ్ |
శరైర్వినిహతం పశ్య వికీర్ణమివ పర్వతమ్ || ౨౪ ||

రాఘవస్య వచః శ్రుత్వా సుగ్రీవో వాహినీపతిః |
ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి చాబ్రవీత్ || ౨౫ ||

రామ శోకాభిభూతోఽహం శోకార్తానాం భవాన్ గతిః |
వయస్య ఇతి కృత్వా హి త్వయ్యహం పరిదేవయే || ౨౬ ||

త్వం హి పాణిప్రదానేన వయస్యో మేఽగ్నిసాక్షికమ్ |
కృతః ప్రాణైర్బహుమతః సత్యేనాపి శపామి తే || ౨౭ ||

వయస్య ఇతి కృత్వా చ విస్రబ్ధం ప్రవదామ్యహమ్ |
దుఃఖమంతర్గతం యన్మే మనో హరతి నిత్యశః || ౨౮ ||

ఏతావదుక్త్వా వచనం బాష్పదూషితలోచనః |
బాష్పోపహతయా వాచా నోచ్చైః శక్నోతి భాషితుమ్ || ౨౯ ||

బాష్పవేగం తు సహసా నదీవేగమివాగతమ్ |
ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామసన్నిధౌ || ౩౦ ||

స నిగృహ్య తు తం బాష్పం ప్రమృజ్య నయనే శుభే |
వినిఃశ్వస్య చ తేజస్వీ రాఘవం వాక్యమబ్రవీత్ || ౩౧ ||

పురాహం వాలినా రామ రాజ్యాత్ స్వాదవరోపితః |
పరుషాణి చ సంశ్రావ్య నిర్ధూతోఽస్మి బలీయసా || ౩౨ ||

హృతా భార్యా చ మే తేన ప్రాణేభ్యోఽపి గరీయసీ |
సుహృదశ్చ మదీయా యే సంయతా బంధనేషు తే || ౩౩ ||

యత్నవాంశ్చ సుదుష్టాత్మా మద్వినాశాయ రాఘవ |
బహుశస్తత్ప్రయుక్తాశ్చ వానరా నిహతా మయా || ౩౪ ||

శంకయా త్వేతయా చేహ దృష్ట్వా త్వామపి రాఘవ |
నోపసర్పామ్యహం భీతో భయే సర్వే హి బిభ్యతి || ౩౫ ||

కేవలం హి సహాయా మే హనూమత్ప్రముఖాస్త్విమే |
అతోఽహం ధారయామ్యద్య ప్రాణాన్ కృచ్ఛ్రగతోఽపి సన్ || ౩౬ ||

ఏతే హి కపయః స్నిగ్ధా మాం రక్షంతి సమంతతః |
సహ గచ్ఛంతి గంతవ్యే నిత్యం తిష్ఠంతి చ స్థితే || ౩౭ ||

సంక్షేపస్త్వేష తే రామ కిముక్త్వా విస్తరం హి తే |
స మే జ్యేష్ఠో రిపుర్భ్రాతా వాలీ విశ్రుతపౌరుషః || ౩౮ ||

తద్వినాశాద్ధి మే దుఃఖం ప్రనష్టం స్యాదనంతరమ్ |
సుఖం మే జీవితం చైవ తద్వినాశనిబంధనమ్ || ౩౯ ||

ఏష మే రామ శోకాంతః శోకార్తేన నివేదితః |
దుఃఖితః సుఖితో వాఽపి సఖ్యుర్నిత్యం సఖా గతిః || ౪౦ ||

శ్రుత్వైతద్వచనం రామః సుగ్రీవమిదమబ్రవీత్ |
కిం నిమిత్తమభూద్వైరం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || ౪౧ ||

అహం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర | [సుఖం]
ఆనంతర్యం విధాస్యామి సంప్రధార్య బలాబలమ్ || ౪౨ ||

బలవాన్ హి మమామర్షః శ్రుత్వా త్వామవమానితమ్ |
వర్ధతే హృదయోత్కంపీ ప్రావృడ్వేగ ఇవాంభసః || ౪౩ ||

హృష్టః కథయ విస్రబ్ధో యావదారోప్యతే ధనుః |
సృష్టశ్చేద్ధి మయా బాణో నిరస్తశ్చ రిపుస్తవ || ౪౪ ||

ఏవముక్తస్తు సుగ్రీవః కాకుత్స్థేన మహాత్మనా |
ప్రహర్షమతులం లేభే చతుర్భిః సహ వానరైః || ౪౫ ||

తతః ప్రహృష్టవదనః సుగ్రీవో లక్ష్మణాగ్రజే |
వైరస్య కారణం తత్త్వమాఖ్యాతుముపచక్రమే || ౪౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమః సర్గః || ౮ ||

Kishkindha Kanda Sarga 8 Meaning In Telugu

అలా మాట్లాడు కోడంలో సుగ్రీవుడు తనకూ, తన అన్న వాలికి శత్రుత్వము ఎందుకు వచ్చిందీ అన్న విషయం రామునితో చెప్పసాగాడు. “ఓ రామా! నీవు నా స్నేహితుడవు కావడం నా అదృష్టం. దేవతలు నా మీద కరుణ చూపడం వలననే నీవు నా మిత్రుడివి అయ్యావు. నీవు నాకు మిత్రుడుగా, నాకు అండగా ఉంటే నేను ఒక్క కిష్కింధా రాజ్యమే కాదు, స్వర్గలోక ఆధిపత్యము కూడా పొందగలను.

ఓ రామా! నీతో స్నేహం చేయడం వలన నాకు నా బంధుమిత్రులలో గౌరవం పెరిగింది. నా గురించి, నా గుణగణముల గురించి నేను చెప్పుకోకూడదు కానీ, నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అని మాత్రం చెప్పగలను. ఎందు కంటే అతడు ధనికుడైనా, పేద వాడైనా, సుఖాలలో మునిగి తేలుతున్నా, దు:ఖాలలో కుంగి పోతున్నా, మంచి వాడైనా, చెడ్డ వాడైనా, ఎటువంటి వాడికైనా స్నేహితుడే దిక్కు. స్నేహమునకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. స్నేహాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు తన స్నేహితుని కొరకు ధనమును గానీ, సుఖములను గానీ, సంపదలను కానీ ఆఖరుకు ఉన్న ఊరును కానీ, త్యజించుటకు వెనుకాడరు. అటువంటి స్నేహము మనది.”అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు నవ్వి “మిత్రమా! నువ్వు చెప్పినది యదార్థము.” అని అన్నాడు.

(స్నేహాన్ని గురించి వాల్మీకి ఇచ్చిన అద్భుత నిర్వచనము ఈ నాటికీ అనుసరణీయము. మన సినిమా రచయితలు తమ డైలాగులలో వాల్మీకి చెప్పిన పదాలనే అటు ఇటు తిప్పి తిప్పి వల్లె వేస్తుంటారు).

“రామా! నా సోదరుడు వాలి నన్ను అవమానించాడు. నా భార్యను నా నుండి లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకున్నాను. కాబట్టి నీవు నాకు ఉపకారము చెయ్యాలి” అని మరలా గుర్తు చేసాడు సుగ్రీవుడు.

“మిత్రమా! స్నేహమునకు ఫలము ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే కదా! ఒకరికి ఒకరు అపకారము చేసుకోవడం శత్రువుల లక్షణము. నేను నీ మిత్రుడను కాబట్టి నీకు అపకారము చేసిన వారిని వధించి, నీకు మేలు చేస్తాను.” అని తన ప్రతిజ్ఞను గుర్తు చేసాడు రాముడు.

సుగ్రీవుడు చాలా దీన స్థితిలో ఉన్నాడు అందుకని రామునికి పదే పదే గుర్తు చేస్తున్నాడు. వానరులు చపల స్వభావులు కదా! “రామా! నీవు నా స్నేహితుడవు. అందుకని నా కష్టములను నీతో చెప్పుకుంటున్నాను. సాయం చెయ్యమని పదే పదే అడుగుతున్నాను. ఏమీ అనుకోకు. నీతో నా కష్టములు అన్నీ చెప్పాలని ఉంది. కాని నోరు పెగలడం లేదు.” అని కళ్ల నిండా కన్నీరు కారుస్తున్నాడు సుగ్రీవుడు. అతి కష్టం మీద తన దుఃఖమును ఆపుకుంటూ, సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.

“నీకు చెప్పాను కదా! వాలి నా అన్న. చాలా బలవంతుడు. నన్ను తిట్టాడు. అవమానించాడు. రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. నేను నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి భార్యను నా నుండి దూరం చేసాడు. నా అన్న వాళ్లందరినీ బంధించాడు. నన్ను చంపడానికి ఎంతో మందిని పంపాడు. నేను వారి నందరినీ చంపాను. అందుకే నిన్ను చూచినప్పుడు కూడా నీవు వాలి పంపిన వాడివి అని అనుమానించాను. భయపడ్డాను. శరీరంలో భయం ఉంటే, దేనిని చూచి అయినా భయపడడం, మానవ స్వభావము కదా! ఇంక మా వానరుల సంగతి చెప్పాలా! ఇదుగో! హనుమంతుడు మొదలగు వారు నా వెంట ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వీళ్లే నేను నమ్మిన స్నేహితులు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇదీ నా వృత్తాంతము. ఇంతకన్నా వివరాలు అనవసరము అనుకుంటున్నాను.

వాలి నాకు శతృవు. వాలి నా సోదరుడే అయినప్పటికీ, వాలి చస్తేనే గానీ నా దుఃఖము ఉపశమించదు. నా సమస్తదు:ఖములకు కారకుడు వాలి. నా సుఖజీవనము వాలి మరణం మీద ఆధారపడి ఉంది. రామా! నా దుఃఖమునకు కారణము, నా దు:ఖము ఎలా తీరుతుందో వివరంగా చెప్పాను. కష్టాలలో ఉన్న మిత్రుడికి మిత్రుడే గతికాబట్టి, ఒక మిత్రుడుగా నాకు సాయం చెయ్యి” అని అన్నాడు సుగ్రీవుడు.

రాముడికి ఒక విషయం బోధపడటం లేదు. సుగ్రీవుడు ఇన్ని విషయాలు చెబుతున్నాడు కానీ అసలు తనకూ, వాలికీ ఎందుకు వైరం వచ్చిందో చెప్పడం లేదు. అడిగితే గానీ చెప్పేట్టు లేడు అని అనుకున్నాడు.

“మిత్రమా! సుగ్రీవా! నీకూ నీ అన్న వాలికి వైరం ఎందుకు, దేని గురించి, ఏ కారణం చేత కలిగింది. వివరంగా చెప్పు. అప్పుడు మీ ఇద్దరిలో తప్పు ఒప్పు నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. అసలు వైరకారణం తెలిస్తే గానీ, మా బలాబలములను సరి చూచుకోడానికి వీలు ఉండదు కదా! అప్పుడు వాలిని సులభంగా అంతమొందించ వచ్చును. నీకు నీ అన్న వలన జరిగిన అవమానమును విని నాకూ కోపం తారస్థాయిని చేరుకుంది. నేను నీ అన్నను చంపేలోగా మీ ఇద్దరి మీ మధ్య ఉన్న వైరమునకు కారణం తెలుసుకోగోరుతున్నాను. నా మీద విశ్వాసము ఉంచి మీ ఇరువురి మధ్య ఉన్న విరోధమునకు కారణం చెప్పు” అని అన్నాడు రాముడు. ఇంక తప్పదని సుగ్రీవుడు రామునికి తనకు అన అన్న వాలితో ఎందుకు విరోధము వచ్చిందో వివరంగా చెప్పనారంభించాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ నవమః సర్గః (9)>>

Leave a Comment