Vidya Diksha In Telugu – విద్యా దీక్ష

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… విద్యా దీక్ష నీతికథ.

విద్యా దీక్ష

(ఈ కథ ఆదిపర్వంలో ఉంది. విద్యాభ్యాస సమయంలో యితర వ్యవహారాల మీద మనసు పోనివ్వకుండా దీక్షగా చదివితే మంచి ఫలితాలు సాధించగలం అనికదా ఈ కథ ద్వారా భారతం చేసిన హితబోధ)

చాలా రోజుల క్రితం మాట !
కశ్యపుడు అనేముని ఉండేవాడు. ఆయనకు దితి, అదితి అని ఇద్దరు భార్యలు. దితికి కలిగిన పిల్లలు రాక్షసులు. అదితి పిల్లలు దేవతలు.

ఈ అన్నదమ్ములు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూనే ఉండే వారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు వీరు గెలిచేవారు.

అలా సాగుతోంది.
అందులో రాక్షసులకు గురువు శుక్రాచార్యులు. దేవతల గురువు బృహస్పతి. ఆ రాక్షసగురువు చాలాకాలం తపస్సు చేసి మృతసంజీవనీ అనే విద్య సాధించాడు. దానివల్ల యుద్ధంలో చచ్చిన రాక్షసులందరినీ మళ్ళీ బ్రతికించేవాడు.

అప్పటికింకా దేవతలు అమృతపానం చెయ్యలేదు. కనుక వారు చచ్చిపోయేవారు. అది చూచి బృహస్పతి తనకుమారుడయిన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవనీ విద్య నేర్చుకురమ్మని పంపాడు.
కచుడు శుక్రాచార్యుల దగ్గరకు వచ్చి:
‘శ్రీగురుభ్యోనమః ‘ అని పాదాలమీద వ్రాలి:
‘నేను అంగీరస వంశ్యడను, బృహస్పతి తనయుడను. నన్ను కచుడు అని పిలుస్తారు. మీ వద్ద విద్యాత్యాసానికి వచ్చాను’ అన్నాడు.

శుక్రాచార్యులు ఆ కుర్రవాని వివయానికి చాలా సంతోషించి: ‘నాయనా! చాలా ఆనందం’ అని ఆశీర్వదించి తన ఆశ్రమంలో ఉండమన్నాడు.’

కచుడు రోజూ సూర్యోదయంకాకుండా లేచి కాలకృత్యాలు ముగించి సంధ్యావందనాలు యథావిధిగా సాగించి గురుశుశ్రూష చేస్తున్నాడు.

శుక్రాచార్యులవారికి దేవయాని అనే కూతురుంది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. అందులోనూ వయస్సు వదహారు దాటింది.

ఆ పిల్లకి కచుడు మీద మనసు పడింది. అనేకవిధాల తన ప్రేమను వ్యక్తంచేసేది. కచుడికి తవ విద్యాత్యాసం తప్ప మరోదృష్టి లేదు. పయిగా గురువుగారి కూతురు కమక సోదరభావంతోనే చూపేవాడు.

ఇలా ఉండగా –
రాక్షసులందరూ సమావేశమై ఆలోచించారు.
‘ దేవతల గురువయిన బృహస్పతి కొడుకు మన గురువులవద్ద విద్యా భ్యాసానికి వచ్చాడు? శత్రువర్గం వారి దగ్గర ఏం చదువుదామని వచ్చాడు? ఓహో! మన గురువుగారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది.

అది వీడు నేర్చుకు వెడితే మన వంశానికే ప్రమాదం. కనక వీట్టి అడవిలో చంపి పారేద్దాం’ అని నిశ్చయించారు.

గురు సేవాభావంతో అడవిలో అవులను మేపి వస్తున్న కచుడిని చంపేశారు.

ప్రొద్దు గ్రుంకింది.
చీకటి ముదురుతోంది.
రోజూ సాయం సంధ్యావేళకు ఆశ్రమంచేరే కచుడు అప్పటికీ రాక పోవడంతో దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. కూతురు దుఃఖం చూడలేక శుక్రాచార్యులు దివ్య దృష్టితోచూచి, జరిగిన సంగతి గ్రహించి మృత సంజీవనితో కచుని బ్రతికించాడు.

అది విన్న రాక్షసులకు కడుపు మండి పోయింది. బాగా ఆలో చించారు. కచుని సంహరించి కాల్చి ఆ బూడిద కలిపిన కల్లు తెచ్చి శుక్రాచార్యులకు వివయంగా అందించారు.

ఆయన వెనుక ముందు ఆలోచించకుండా ఆ సురాపానం చేశాడు. వాడు వెళ్ళారు.

మళ్ళీ చీకటి పడింది.

ప్రేమపాశంలో ఉన్న దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి ఏడ్చింది.
ఆయన జాలివడి దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది.
‘అమ్మా! ఈ రాక్షసులు వరమ కిరాతకం చేశారు. ఆ బాలుని చితాభస్మం కలిపిన కల్లు నా చేత త్రాగించారు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడు కచుడు. వాడు జీవించాలంటే నా పొట్ట చీల్బుకు రావాలి. వచ్చాక నన్ను బ్రతికించాలి. అంటే లోపం సూక్ష్మ అణువుగా ఉన్న ఆ ప్రాణికి నా విద్య బోధించాలి.

వివేకహీనులైన రాక్షసులు ఈ విధంగా వాడికి మేలు చేశారు, అని పద్మాసనం వేసి, లోపల ఉన్న కచుని ప్రబోధించి మృత సంజీవనీ మంత్రం ఉపదేశించాడు.

కచుడు ఆయన ఉదరం చీల్చుకు వచ్చాడు.
వస్తూనే తాను నేర్పిన విద్యతో గురువుగారిని జీవింపజేసి ఆయన వద్ద సెలవు తీసుకు వెడుతున్నాడు.

వెను వెంట వచ్చి దేవయాని :
‘ఏమయ్యా ః ఇంతకాలం నిన్నే ప్రేమించే నన్ను విడిచి పెడ కావా’ అంది.

‘ సోదరి గురువు తండ్రితో సమానం. ఆ ప్రకారం నువ్వు నాకు చెల్లిలివి ‘, ‘ అన్నాడు.

దేవయానికి కోపం వచ్చి :
‘ఇలా నన్ను హింసించిన ఫలంగా ఈ విద్య నీకు ఉపయోగ పడదు బా’ అంది,
‘ సోదరీ ! విద్య ఎప్పుడూ నిరుపయోగం కాదమ్మా! ఈ మృత సంజీవని నీ శాపం ప్రకారం నాకు ఉపయోగపడక పోయినా నేను బోధిం చిన వారికి ఉపయోగపడుతుంది వెళ్ళు’, అని దేవలోకం చేరాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment