మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గురుసేవ సత్ఫలితం ఇస్తుంది నీతికథ.
గురుసేవ సత్ఫలితం ఇస్తుంది
(ఇది ఆదిపర్వంలో కథ. గురు సేవ ఎంత అవసరమో, దాని ఫలితం ఎంతటిదో గ్రహించాలి.)
ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడు అనే పేరుగల ఉపా ధ్యాయు డుండేవాడు. ఆయన దగ్గర ఎందరో విద్యాభ్యానంచేసేవారు.
ఆ రోజులలో గురుకులాలంటే చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధానంలో ఆయన సేవచేస్తూ వినయ విధేయతలతో విద్యనేర్చుకునేవారు. గురువుగారు కూడా వారిని తన బిడ్డలుగా చూసుకుని ఎవరికి ఏ విద్యయందు అభిరుచి ఉన్నదో గ్రహించి ఆ విద్యనే నేర్పేవాడు. తనకు కావలసిన విద్యనేర్ప గల గురువును అన్వేషిస్తూ విద్యార్థి తిరిగేవాడు. అవీ అనాటి గురుకులాలు.
అటువంటి గురుతులంలో పైలునివద్ద ఉదంకుడని శిష్యుడుండే వాడు. ఈ ఉదంకుడు విద్యపూర్తి చేసుకుని సంప్రదాయం ప్రకారం గురువుగారి దగ్గర సెలవుతీసుకునే ముందు, చేతులు కట్టుకు నిలబడి, తలవంచి.
‘ఆచార్యా! గురునక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించండి’, అన్నాడు
అప్పుడు పైలుడు చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించి :
“నాయనా నీ వంటి శిష్యుడు దొరకడం మా అదృష్టం. గురు దక్షిణ ఏమీ అవసరం లేదు,’ అన్నాడు.
ఉదంకుడు అలాగే నిలబడి:
‘ఆచార్యా! గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడం న్యాయంకాదు. కమఠ మీరు ఆజ్ఞాపించండి’, అన్నాడు.
వాని పట్టుదల, ధర్మవిరతిచూపి సంతోషంతో:
నాయనా! ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురు దక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్ళి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు’, అన్నాడు పై లుడు.
ఉదంకుడు లోపలకు వెళ్ళి గురువుగారి భార్యకు నమస్కరించి విష యం చెప్పాడు.
అప్పుడావిడ :
‘నాయనా మీ గురువుగారి దగ్గర పౌష్యుడనే రాజు విద్యనేర్పు కున్నాడు. ఆ రాజుభార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు, అంది.
ఉదంకుడు పరమానందంతో బయలుదేర పండగా ఆవిడ పిలిచి ” నాయనా ! ఇంక నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చెయ్య బోతున్నాను. అప్పటికి అవి తీసుకురావాలి’ అంది.
‘చిత్తం, తల్లీ’ అని ఉదంకుడు బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక మహావృషభంమీద ఒకా నౌక పురుషుడు అడ్డుగా వచ్చి:
‘ఈ గోమయం భక్షించివెళ్ళు. అనుమానించకు. దీన్ని మీ గురువుగారు కూడా భక్షించారు’, అనగానే ఉదంకుడు మాట్లాడకుండా అది తిని, త్వరగా రాజు గారింటికి వెళ్ళాడు.
మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి, అతని సమాచారం అడిగి: ‘మీ రాకవల్ల మా జన్మ ధన్యమయింది. ఊరకరారు మహాత్ములు! ఏ పనిమీద వచ్చారో చెప్పండి’, అనగా గురుపత్ని కోరిక వివరించాడు.
మహారాజు వినయంగా
‘ ఓ విద్వాంసుడా ? మీరు ఏదికోరినా ఇవ్వవలసిందే. ఇప్పుడు మీరు స్వయంగా అంతఃపురానికి వెళ్ళి మహారాణిని అడగండి. ఆవిడ సంతోషంగా ఇస్తుంది’, అన్నాడు.
ఉదంకుడు క్షణాలలో అంతిపురికిపోయి తిరిగివచ్చి :
‘రాజా! మీరు విద్వాంసులతో పరిహాసాలాడుతా రమకో లేదు. మహారాణి అంతఃపురంలో లేదు’, అన్నాడు.
రాజు: ఓ మహాత్మా! క్షమించాలి. అపవిత్రులకు నా భార్య కనబడదు. మీ వంటివారు అుచిగా ఉన్నారనీ అనలేను.
ఉదంకుడు: గుర్తుకు వచ్చింది మహారాజా! నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణపు తొందరలో నేను కాళ్ళూ, చేతులూ, ముఖం కడగకుండా ఆచమించాను. ఇలాచెప్పి అప్పటి కప్పుడు అన్నీ ముగించి అంతఃపురానికి వెళ్ళి ఎదురుగా వినయంతో నిలిచిన రాణికి తన రాశకు కారణం చెప్పాడు.
రాణి! విద్వాంసుల కోరిక తీర్చడం మా విధి. ఇవిగో రత్న కుండలాలు తీసుకోండి. ఒకమాట. ఈ కుండలాలు దొంగిలించాలని చిర కాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. అది కనిపెట్టుకుంటూ వెళ్ళండి.
ఉదంకుడు అవి తీసుకుని చక చక వస్తున్నాడు. కొంక దూరం వచ్చేసరికి దారి వెంట ముసలి బిచ్చగాడు వానిని వెన్నంటి వస్తున్నాడు.
ఉదంకుడు సాయంకాలానికి ఒక చెరువు దగ్గరటచేరి, కుండలాలు ఒడ్డున పెట్టి సంధ్యావందనం ఆరంభించగా ఆ దొంగ వాటిని ఆవహరించి పారిపోయాడు.
ఉడంకుడు తిరిగి చూసేసరికి ఆ దొంగవాడు పాములామారి ఒక బిలంలో దూరాడు. దాన్ని తవ్వడానికి ఉదంకుడు శ్రమపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బిలాన్ని విశాలం చేశాడు.
దానిగుండా పోయి పోయి ఉదంకుడు నాగలోకానికిపోయి అనేక విధాల ప్రార్థనలు చేసినా తక్షకుడు కనిపించలేదు.
కనిపించకపోగా ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నారు.
నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. దానికి వన్నెండు ఆకులు ఉన్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక పురుషుడు కనిపించాడు. అందరినీ స్తుతించగా ఆ పురుషుడు ప్రసన్న వదనంతో ‘ వరం కోరుకో’ అన్నాడు.
ఉదంకుడు: నాగలోకమంతా నా వశంలో ఉండాలి.
“అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు’ అన్నాడా పురుషుడు.
ఉదంకుడు ఊదగా నాగలోకంనిండా అగ్నిజ్వాలలు వ్యాపించాయి. ఆ మంటలకు తాళలేక తక్షకుడువచ్చి కుండలాలు సమర్పించి పాదాలమీద వడ్డాడు.
అప్పటికే కాలాతీతం కావస్తున్నది. ‘గురుపత్నీ వ్రత సమయానికి ఎలాచేరడం’ అని విచారిస్తుండగా ఆ పురుషుడు తన గుర్రంయిచ్చి అదృశ్యం అయ్యాడు.
మరుక్షణంలో ఉదంకుడు గురువుగారి ఆశ్రమం దగ్గర దిగాడు. గుర్రం మాయమయ్యింది.
అప్పటికి గురువుగారి భార్య అభ్యంగస్నానంచేసి వ్రతానికి సన్నద్ధు రాలవు తున్నది.
ఉదంకుడు ఆవిడ పాదాలకు నమస్కరించి, కుండలాలు అర్పించి, ఆశీర్వాదం పొంది, గురువుగారి దగ్గరకు వచ్చాడు.
ఇంత ఆలస్యం ఎందుకయింది అని గురువుగారు అడుగగా జరిగిన విషయాలన్నీ వివరించి వాటి అంతరార్థం బోధించమని కోరాడు. ‘నాయనా! నీకు ఎదురుపడిన పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఆయన ఐరావతం. ఆ గోమయం అమృతం. అది భక్షించక పోతే నువ్వు నాగలోకంలో జీవించవు.
నాగలోకంలో స్త్రీలను చూశావే, వారు ధాత- విధాతలు.
నలుపు తెలుపు దారాలు రాత్రింబవళ్ళు. చక్రాన్ని తిప్పే ఆరుగురూ ఋతువులు, పన్నెండాకులూ మాసాలు. ఆ చక్రం సంవత్సర రూప మయిన కాలచక్రం.
అక్కడ కనిపించిన పురుషుడు దేవేంద్రుడు. ఆ గుర్రం అగ్ని హోత్రుడు.
ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇంద్రుడు నాకు ప్రాణమిత్రుడు. నువ్వు నా శిష్యుడవు కనక నీకు అపాయం జరగకుండా కాపాడాడు. నీ వలె వినయ విధేయతలతో, గురుశుశ్రూష చేసి విద్యనేర్చుకునే వారిని ఎప్పుడూ దేవతలు కాపాడుతారు. ఇకనువ్వు మీ ఇంటికి వెళ్ళు. నీకు” సర్వశుభాలూ కలుగుగాక’, అని గురువుగారు ఆశీర్వదించాడు.
మరిన్ని నీతికథలు మీకోసం: