అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ఒక ప్రముఖమైన భాగం. ఈ సర్గలో, భరతుడు, తన తండ్రి దశరథ మహారాజు మరణవార్త విని తీవ్రంగా దుఃఖిస్తాడు. అయోధ్యకు చేరుకున్న భరతుడు, తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమవుతాడు. ప్రజలమధ్య భరతుడు, తన తల్లిదండ్రుల పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, రాముని వనవాసానికి కారణమైన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. భరతుడు, కైకేయిని మందలించకుండానే ఆమెను క్షమిస్తాడు. ఈ సర్గ భక్తి, క్షమ, మరియు ధర్మానికి ఉన్న ప్రాధాన్యతను తెలుపుతుంది. భరతుడు తన అన్న రాముడి పట్ల ఉన్న ప్రేమను, తన తండ్రి పట్ల ఉన్న కృతజ్ఞతను అందరికీ చూపిస్తాడు.
ఇక్ష్వాకువంశకీర్తనమ్
క్రుద్ధమాజ్ఞాయ రామం తం వసిష్ఠః ప్రత్యువాచ హ |
జాబాలిరపి జానీతే లోకస్యాస్య గతాగతిమ్ || ౧ ||
నివర్తయితుకామస్తు త్వామేతద్వాక్యముక్తవాన్ |
ఇమాం లోకసముత్పత్తిం లోకనాథ నిబోధ మే || ౨ ||
సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మితా |
తతః సమభవద్బ్రహ్మా స్వయంభూర్దైవతైః సహ |
స వరాహస్తతో భూత్వా ప్రోజ్జహార వసుంధరామ్ || ౩ ||
అసృజచ్చ జగత్ సర్వం సహ పుత్రైః కృతాత్మభిః |
ఆకాశప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్యావ్యయః || ౪ ||
తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః || ౫ ||
వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతస్సుతః |
స తు ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోః సుతః || ౬ ||
యస్యేయం ప్రథమం దత్తా సమృద్ధా మనునా మహీ |
తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ || ౭ ||
ఇక్ష్వాకోఽస్తు సుతః శ్రీమాన్ కుక్షిరేవేతి విశ్రుతః |
కుక్షేరథాత్మజో వీరో వికుక్షిరుదపద్యత || ౮ ||
వికుక్షేస్తు మహాతేజాః బాణః పుత్రః ప్రతాపవాన్ |
బాణస్య తు మహాబాహురనరణ్యో మహాయశాః || ౯ ||
నానావృష్టిర్బభూవాస్మిన్న దుర్భిక్షం సతాం వరే |
అనరణ్యే మహారాజే తస్కరో నాపి కశ్చన || ౧౦ ||
అనరణ్యాన్మహాబాహుః పృథూరాజా బభూవ హ |
తస్మాత్ పృథోర్మహారాజస్త్రిశంకురుదపద్యత || ౧౧ ||
స సత్యవచనాద్వీరః సశరీరో దివంగతః |
త్రిశంకోరభవత్సూనుర్ధుంధుమారో మహాయశాః || ౧౨ ||
ధుంధుమారో మహాతేజాః యువనాశ్వో వ్యజాయత |
యువనాశ్వసుతః శ్రీమాన్ మాంధాతా సమపద్యత || ౧౩ ||
మాంధాతుస్తు మహాతేజాః సుసంధిరుదపద్యత |
సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ || ౧౪ ||
యశస్వీ ధ్రువసంధేస్తు భరతో రిపుసూదనః |
భరతాత్తు మహాబాహోరసితో నామ జాయత || ౧౫ ||
యస్యైతే ప్రతిరాజానో ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః || ౧౬ ||
తాంస్తు సర్వాన్ ప్రతివ్యూహ్య యుద్ధే రాజా ప్రవాసితః |
స చ శైలవరే రమ్యే బభూవాభిరతో మునిః || ౧౭ ||
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతిః |
ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ || ౧౮ ||
భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః |
తమృషిం సముపాగమ్య కాలిందీ త్వభ్యవాదయత్ || ౧౯ ||
స తామభ్యవదద్విప్రో వరేప్సుం పుత్రజన్మని |
పుత్రస్తే భవితా దేవి మహాత్మా లోకవిశ్రుతః || ౨౦ ||
ధార్మికశ్చ సుశీలశ్చ వంశకర్తాఽరిసూదనః |
కృత్వా ప్రదక్షిణం హృష్టా మునిం తమనుమాన్య చ || ౨౧ ||
పద్మపత్రసమానాక్షం పద్మగర్భసమప్రభమ్ |
తతః సా గృహమాగమ్య దేవీ పుత్రం వ్యజాయత || ౨౨ ||
సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
గరేణ సహ తేనైవ జాతః స సగరోఽభవత్ || ౨౩ ||
స రాజా సగరో నామ యః సముద్రమఖానయత్ |
ఇష్ట్వా పర్వణి వేగేన త్రాసయంతమిమాః ప్రజాః || ౨౪ ||
అసమంజస్తు పుత్రోభూత్ సగరస్యేతి నః శ్రుతమ్ |
జీవన్నేవ స పిత్రా తు నిరస్తః పాపకర్మకృత్ || ౨౫ ||
అంశుమానపి పుత్రోఽభూదసమంజస్య వీర్యవాన్ |
దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః || ౨౬ ||
భగీరథాత్ కకుత్స్థస్తు కాకుత్స్థా యేన విశ్రుతాః |
కకుత్స్థస్య చ పుత్రోఽభూద్రఘుర్యేన తు రాఘవాః || ౨౭ ||
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః |
కల్మాషపాదః సౌదాసః ఇత్యేవం ప్రథితో భువి || ౨౮ ||
కల్మాషపాదపుత్రోఽభూచ్ఛంఖణస్త్వితి విశ్రుతః |
యస్తు తద్వీర్యమాసాద్య సహసైన్యో వ్యనీనశత్ || ౨౯ ||
శంఖణస్య చ పుత్రోఽభూచ్ఛూరః శ్రీమాన్ సుదర్శనః |
సుదర్శనస్యాగ్నివర్ణాగ్నివర్ణస్య శీఘ్రగః || ౩౦ ||
శీఘ్రగస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రశుశ్రుకః |
ప్రశుశ్రుకస్య పుత్రోఽభూదంబరీషో మహాద్యుతిః || ౩౧ ||
అంబరీషస్య పుత్రోఽభూన్నహుషః సత్యవిక్రమః |
నహుషస్య చ నాభాగః పుత్రః పరమధార్మికః || ౩౨ ||
అజశ్చ సువ్రతశ్చైవ నాభాగస్య సుతావుభౌ |
అజస్య చైవ ధర్మాత్మా రాజా దశరథః సుతః || ౩౩ ||
తస్య జ్యేష్ఠోఽసి దాయాదో రామ ఇత్యభివిశ్రుతః |
తద్గృహాణ స్వకం రాజ్యమవేక్షస్వ జనం నృప || ౩౪ ||
ఇక్ష్వాకూణాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజః |
పూర్వజే నావరః పుత్రో జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే || ౩౫ ||
స రాఘవాణాం కులధర్మమాత్మనః
సనాతనం నాద్య విహంతుమర్హసి |
ప్రభూతరత్నామనుశాధి మేదినీమ్
ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః || ౩౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే దశోత్తరశతతమః సర్గః || ౧౧౦ ||
Ayodhya Kanda Sarga 110 Meaning In Telugu
సభలో జరుగుతున్న వాదోపవాదాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు కులగురువు వసిష్ఠుడు. ఎవరు చెప్పినా రాముడు ఒప్పుకోడంలేదు. జాబాలిమాటలతో రాముడు కోపగించుకున్నాడు అని అర్ధం అయింది వసిష్ఠునకు. జాబాలి సామాన్యుడు కాదు. అందుకని జాబాలి మాటలను సర్దిచెప్పడానికి ప్రయత్నం చేసాడు వసిష్ఠుడు.
“ఓ రామా! ఈ లోకంలో జనులు పుడుతూ చస్తూ ఉంటారనీ, పుణ్యలోకాలకు, పాప లోకాలకూ పోయి మరలా జన్మ ఎత్తుతుంటారనీ జాబాలికి కూడా తెలుసు. కానీ నిన్ను ఎలాగైనా అయోధ్యకు రప్పించాలనే తాపత్రయంతో అలా మాట్లాడాడు కానీ వేరు కాదు. ఇంతకూ ఈ సృష్టి ఎలా మొదలయిందో నాకు తెలిసినంత వరకూ చెబుతాను విను. ఈ సృష్టి ప్రారంభం కాక ముందు ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. ఆ జలంలో నుండి భూమి ఆవిర్భవించింది. తరువాత దేవతలు, బ్రహ్మదేవుడు పుట్టారు. తరువాత బ్రహ్మ వరాహ రూపంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు. ( విష్ణుదేవుడు వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు అని నానుడి కాని బ్రహ్మ దేవుడు వరాహావతారము ధరించాడని కొన్ని పురాణాలలో ఉంది అని పండితులఅభిప్రాయము.) శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మ నుండి మరీచి, కశ్యపుడు పుట్టారు. కశ్యపునికి సూర్యుడు కుమారుడు. సూర్యుని కుమారుడు మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు మొట్ట మొదటగా ఈ అయోధ్యను పాలించాడు. అందుకే మీ వంశమును ఇక్ష్వాకు వంశము అని పిలుస్తారు.
ఇక్ష్వాకు కుమారుడు కుక్ష్మి, కుక్షికి వికుక్షి అనే కుమారుడు పుట్టాడు. వికుక్షికి బాణుడు జన్మించాడు. బాణుడి కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడు ఈ దేశమును సుభిక్షంగా పరిపాలించాడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకుడు. ఆ త్రిశంకువే విశ్వామిత్రుని సాయంతో సశరీరంగా స్వర్గమునకు వెళ్లాడు. ఆ త్రిశంకుని కుమారుడు దుగ్ధుమారుడు, దుగ్ధుమారుని కుమారుడు యవనాశ్వుడు. ఆ యవనాశ్వుని కుమారుడు మాంధాత. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధి కుమారుడు ధృవసంధి. ధృవసంధికుమారుడు భరతుడు. (ఆ భరతుని పేరు మీదనే భారత దేశము, భరత ఖండము అని పిలువబడుతూ ఉంది.)
భరతుని కుమారుడు అసితుడు. ఈ అసితునికి ఒక కధ ఉండి. అసితునికి హైహయులు, తాలజంఘులు, శశిబిందువులు అనే రాజవంశీయులు శత్రువులు. వారు అసితుని రాజ్యము నుండి తరిమివేసారు. అసితుడు భార్యలతో సహా అడవులకు పారిపోయాడు. అప్పుడు అసితుని భార్యలు గర్భవతులు. అసితుని భార్యలకు ఒకరంటే ఒకరికి పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భం స్రావం అయేట్టు విషం పెట్టింది.
భృగు వంశమునకు చెందిన చ్యవనుడు హిమవత్పర్వతము మీద ఉంటున్నాడు. అసితుని భార్య కాళింది. కాళిందికే ఆమె సవతి విషం పెట్టింది. కాళింది చ్యవనుడి దగ్గరకు పోయి ఆయనకు నమస్కరించింది. “నీకు లోకముచే పూజింపబడేవాడు, ధార్మికుడు, మంచి శీలము కలవాడు, మీ వంశము నిలబెట్టేవాడు అయిన పుత్రుడు జన్మిస్తాడు” అని ఆశీర్వదించాడు.
చ్యవనుని ఆశీర్వాదము ఫలించి కాళిందికి సర్వలక్షణ సమన్వితుడైన కుమారుడు జన్మించాడు. విషమును విరిచి పుట్టాడు. కాబట్టి అతనికి సగరుడు అనే పేరు సార్థకమయింది. సగర చక్రవర్తి ఒక యజ్ఞము చేసాడు. యజ్ఞాశ్వమును వదిలిపెట్టాడు. ఆయజ్ఞాశ్వము మాయం అయింది. దానిని వెదికించే ప్రయత్నంలో సముద్రమును తవ్వించాడు. సముద్రమును తవ్వడానికి సగరుడు కారకుడు అయ్యాడు కాబట్టి ఆయనపేరు మీద సముద్రమునకు సాగరము అనే పేరు సార్థకమయింది.
సగరునకు అసమంజుడు అనే కుమారుడు పుట్టాడు. వాడుచిన్నప్పటినుండి పాపకృత్యాలకు అలవాటుపడ్డాడు. కాబట్టి సగరుడు అసమంజుని వదిలివేసాడు. (ఈ అసమంజుడి గురించే కైక వాదించింది. దానిని మంత్రులు తిప్పికొట్టారు). అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. (ఈ భగీరథుడే గంగను భూమి మీదికి తీసుకొని వచ్చాడు. అందుకే గంగానదికి భాగీరధి అనే పేరు వచ్చింది).
భగీరథుని కుమారుడు కకుత్సుడు. ఆ కకుమ్హుని పేరు మీద మీ వంశమునకు కాకుత్స్య వంశము అనేపేరు వచ్చింది. కకుతున రఘువుకుమారుడు. అతని పేరుమీదుగానే మీ వంశమునకు రఘువంశము అనే పేరు, మీ అందరికీ రాఘువులు అనే పేరు వచ్చింది. రఘువు కుమారుడు కల్మాషపాదుడు. కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. మరువుకుమారుడు ప్రశుశ్రువుడు.
అతని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడు మీ తండ్రి దశరథమహారాజు. నీవు ఆ దశరథుని పెద్దకుమారుడవు. మీ వంశములో అందరూ తమ పెద్దకుమారులకు రాజ్యాధికారము సంక్రమింపజేసారు. వంశపారంపర్యంగా పెద్దవాడివైన నీకు రాజ్యాధికారము లభించింది. అందుకని నీవు కాదనకుండా అయోధ్యను పాలించు. ఇక్ష్వాకు వంశములో ఇప్పటి వరకూ జ్యేష్టుడే రాజు అయ్యాడు. జ్యేష్టుడు ఉండగా చిన్నవాడు రాజుకావడం ధర్మవిరుద్ధము. కాబట్టి ఓ రామా! ఇప్పుడు నీవు నీ వంశ గౌరవమును వారు కాపాడుకుంటూ వస్తున్న రాజధర్మమును నాశనం చెయ్యవద్దు. నీ తండ్రి పరిపాలించినట్టు నీవు కూడాఅయోధ్యను పాలించు.” అని అన్నాడు వసిష్ఠుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్