Balakanda Sarga 29 In Telugu – బాలకాండ ఏకోనత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనత్రింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణులు పూర్వ అధ్యాయంలో సిద్ధ ఆశ్రమాన్ని, సిద్ధ ఆశ్రమాన్ని విచారించారు, దీని కోసం ఋషి విశ్వామిత్రుడు ఆ సన్యాసం వారసత్వం గురించి తెలియజేస్తాడు, ఎందుకంటే అది ఒకప్పుడు వామ్నా అవతారంలో విష్ణువుకు చెందినది. విశ్వామిత్రుడు దాని గురించి మరియు వామన అనే మరుగుజ్జు సన్యాసి బాలుడు భూమిపై చెడును ఎలా నిర్మూలించాడో వివరిస్తాడు. ఈ రామావతారంలో కూడా అలాగే చేయమని విశ్వామిత్ర మహర్షి నుండి రాముడికి ఒక సూచన.

సిద్ధాశ్రమః

అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః |
విశ్వామిత్రో మహాతేజా వ్యాఖ్యాతుముపచక్రమే ||

1

ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవరః ప్రభుః |
వర్షాణి సుబహూన్యేవ తథా యుగశతాని చ ||

2

తపశ్చరణయోగార్థమువాస సుమహాతపాః |
ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః ||

3

సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః |
ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనిర్బలిః ||

4

నిర్జిత్య దైవతగణాన్సేంద్రాంశ్చ సమరుద్గణాన్ |
కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః ||

5

[* యజ్ఞం చకార సుమహాన్ అసురేంద్రో మహాబలః | *]
బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః |
సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే ||

6

బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమమ్ |
అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతామ్ ||

7

యే చైనమభివర్తంతే యాచితార ఇతస్తతః |
యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్ఛతి ||

8

స త్వం సురహితార్థాయ మాయాయోగముపాశ్రితః |
వామనత్వం గతో విష్ణో కురు కల్యాణముత్తమమ్ ||

9

ఏతస్మిన్నంతరే రామ కశ్యపోఽగ్నిసమప్రభః |
అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా ||

10

దేవీసహాయో భగవన్దివ్యం వర్షసహస్రకమ్ |
వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్ ||

11

తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్ |
తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురోషోత్తమమ్ ||

12

శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో |
త్వమనాదిరనిర్దేశ్యస్త్వామహం శరణం గతః ||

13

తమువాచ హరిః ప్రీతః కశ్యపం ధూతకల్మషమ్ |
వరం వరయ భద్రం తే వరార్హోఽసి మతో మమ ||

14

తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కశ్యపోఽబ్రవీత్ |
అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః ||

15

వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత |
పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ ||

16

భ్రాతా భవ యవీయాంస్త్వం శక్రస్యాసురసూదన |
శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి ||

17

అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి |
సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ఠ భగవన్నితః ||

18

అథ విష్ణుర్మహాతేజా అదిత్యాం సమజాయత |
వామనం రూపమాస్థాయ వైరోచనిముపాగమత్ ||

19

త్రీన్క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః |
ఆక్రమ్య లోకాఁల్లోకాత్మా సర్వలోకహితే రతః ||

20

మహేంద్రాయ పునః ప్రాదాన్నియమ్య బలిమోజసా |
త్రైలోక్యం స మహాతేజాశ్చక్రే శక్రవశం పునః ||

21

తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమః శ్రమనాశనః |
మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే ||

22

ఏతమాశ్రమమాయాంతి రాక్షసా విఘ్నకారిణః |
అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణః ||

23

అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమమనుత్తమమ్ |

తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ |
[* ఇత్యుక్త్వా పరమప్రీతో గృహ్య రామం సలక్ష్మణమ్ | *]
ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహామునిః ||

24

శశీవ గతనీహారః పునర్వసుసమన్వితః |
తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమనివాసినః ||

25

ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయన్ |
యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే ||

26

తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియామ్ |
ముహూర్తమివ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ||

27

ప్రాంజలీ మునిశార్దూలమూచతూ రఘునందనౌ |
అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుంగవ ||

28

సిద్ధాశ్రమోఽయం సిద్ధః స్యాత్సత్యమస్తు వచస్తవ |
ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

29

ప్రవివేశ తతో దీక్షాం నియతో నియతేంద్రియః |
కుమారావపి తాం రాత్రిముషిత్వా సుసమాహితౌ ||

30

ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాముపాస్య చ |
స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేన చ |
హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతామ్ ||

31

రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా, విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు.

” ఓ రామా! ఈ ప్రదేశములోనే శ్రీ మహా విష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేసాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహా విష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన, దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవత లందరినీ జయించి ముల్లోకములనూ పరిపాలిస్తున్నాడు. ఆ బలి చక్రవర్తి ఒక సారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్నా విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు.

ఓ విష్ణూ! బలి చక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు.

ఓ దేవా! నీవు దేవతల మేలు కోరి, వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి, మాకు మేలు చేయుము. ” అని ప్రార్థించారు.

అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు.

” ఓ పురుషోత్తమా! నీవు తపోమయు డవు. తపోరాశివి. తపోమూర్తివి. తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది, అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను. ” అని ప్రార్థించాడు.

అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు.

“భగవాన్! నీవు నాకు అదితికి పుత్రుడుగా జన్మించు. దేవేంద్రునికి తమ్ముడుగా జన్మించు. దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరములు తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్! నాకు పుత్రుడుగా జన్మించి నన్ను కృతార్ధుడిని చెయ్యి” అని ప్రార్థించాడు కశ్యపుడు.

కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణు మూర్తి, కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. తనకు మూడు అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలి చక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుట స్థలమును ఇస్తూ నీటిని ధారపోసాడు. వామనుడు బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. ముల్లోకములను ఆక్రమించాడు. బలి చక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతోముల్లోకములు మరలా మహేంద్రుని అధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమములో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి.

రామా! ఇప్పుడు మనము సిద్ధాశ్రమములో ప్రవేశిస్తున్నాము. రామా! ఈ ఆశమములో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు. ” అని అన్నాడు ఈ విశ్వామిత్రుడు.

రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమములో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకొని వెళ్లారు. వారిని పూజంచారు. అతిథి సత్కారములు చేసారు. రామ లక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు.

తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకుశుభం కలుగుతుంది. తమరు ఈ రోజునుండే యాగము ప్రారంభించండి. మేము యాగ రక్షణ చేస్తాము.” అని అన్నారు.

ఆ మాటలు విన్న విశ్రామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగ దీక్షను స్వీకరించాడు. రామ లక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రాత:కాల సంధ్యావందనము ఆచరించి, విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి, ఆయనతో ఇలా అన్నారు.

వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ త్రింశః సర్గః (30) >>

Leave a Comment