మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తషష్ఠితమః సర్గః (67వ సర్గ) రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రాక్షసుల నుండి ఋషులను రక్షిస్తారు. ఈ సర్గలో రాముడు రాక్షసుల నేతలతో యుద్ధాలు చేయడం, దుర్మార్గులను శిక్షించడం, మరియు సన్యాసులతో సంభాషణలు జరపడం వంటి విషయాలు ఉంటాయి. రాముడు ధర్మాన్ని రక్షించే తన ధైర్యాన్ని, సహనాన్ని ఈ సర్గలో ప్రదర్శిస్తాడు.
“వినదగునెవ్వరుచెప్పిన” అని ఈ నాడు ఒక సామెత ఉంది. శ్రీరాముడు అక్షరాలా ఆ సూత్రాన్నే పాటించాడు. లక్షణుడు తన కన్నా చిన్న వాడు. కానీ తనకు నీతిబోధ చేసాడు. శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎదురు చెప్పలేదు. బదులు చెప్పలేదు. తర్కించలేదు. విమర్శించలేదు. మౌనంగా అంగీకరించాడు. తన కోపాన్ని తనలోనే అణచుకొన్నాడు. ఎత్తిన ధనుస్సును దించాడు. తమ్ముని ముందు తలవంచి క్లుప్తంగా ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఎక్కడికి వెళదాము. సీత గురించిన ఆధారాలు ఏ ఉపాయంతో దొరుకుతాయో ఆలోచించు.” అని అన్నాడు.
అన్నయ్య శాంతించడంతో లక్ష్మణుడికి ఉత్సాహం పెల్లుబికింది. “అన్నయ్యా! ఎటువంటి పెనుగాలి వీచినా పర్వతము చలించనట్టు, ఎన్ని కష్టములు వచ్చినా నీ వంటి ధీరోదాత్తులు చలించకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. విజయం సాధించాలి. అన్నయ్యా! సీతను ఆ రాక్షసులు ఏమి చేసినా ఈ అడవిలోనే చెయ్యాలి. ఎందుకంటే ఈ జనస్థానము రాక్షసులకు బలమైన స్థావరము. అందుకని మనము ఈ అడవిని క్షుణ్ణంగా వెదుకుదాము. మనకు సరిఅయిన ఆధారాలు లభిస్తాయి. వాటి ద్వారా సీత జాడ తెలుసుకుందాము. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము. ” అన్నాడు.
వెంటనే మారు మాటాడక రాముడు లక్ష్మణుని అనుసరించాడు. ఇద్దరూ అడవిలో సీత కోసం వెదకడం మొదలెట్టారు. వారి శ్రమ త్వరలోనే ఫలించింది. రావణుడు తన రెక్కలు విరగ గొట్టగానే జటాయువు ఎగురుతూ పోయి అల్లంత దూరంలో పడ్డాడు. బాధతో మూలుగుతున్నాడు. కొండంత ఎత్తున నేలమీద పడి ఉన్న జటాయువును చూచారు రామలక్షణులు. రామునిలో ఆవేశం పెల్లుబికింది. ఆ కొండంత పక్షికూడా రాక్షసుడే అనుకున్నాడు. ఎందుకంటే అంతకు ముందే లేడి రూపంలో ఉన్న మారీచుని సంహరించాడు. ఇప్పుడు వీడు పక్షిరూపంలో ఉన్న రాక్షసుడు అనుకున్నాడు. అందుకే విల్లు ఎక్కుపెట్టి అర్ధచంద్ర బాణం సంధించాడు.
“లక్షణా! అడుగో సీతను అపహరించి తినివేసిన రాక్షసుడు. సీతను భక్షించి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. వాడిని ఇప్పుడే హతమారుస్తాను.” అంటూ ఆవేశంతో పలికాడు.
దూరం నుండి రాముని మాటలను విన్నాడు జటాయువు. “నేను రాక్షసుడిని కాను రామా! నీ తండ్రిగారి స్నేహితుడు జటాయువును. సీత జాడ నాకు తెలుసు.” అని పెద్దగా అరిచాడు.
రామ లక్ష్మణులు గబా గబా జటాయువు దగ్గరకు వెళ్లారు. రెక్కలు విరిగి శరీరం అంతా రక్తంతో తడిసిముద్ద అయి ఉన్న జటాయువును చూచారు. జటాయువు అవసాన దశలో ఉన్నాడు. అందుకని పరామర్శలకు తావు ఇవ్వకుండా తనకు తెలిసిన విషయాలు గబా గబా చెప్పనారంభించాడు.
“రామా! లక్ష్మణా! జాగ్రత్తగా వినండి. సీతను అపహరించింది. నా రెక్కలు విరుగ గొట్టినది రావణుడు అనే రాక్షసరాజు. సీతను రావణుడు అపహరించి ఎత్తుకు పోవడం నేను కళ్లారా చూచాను. అతనితో నేను పోరాడాను. అతని రథాన్ని విరుగగొట్టాను. సారధిని చంపాను. రథానికి కట్టిన గాడిదలను చంపాను. రావణుని కవచం ఛేధించాను. రావణుడు కత్తితో నారెక్కలు ఖండించాడు. నేను కింద పడిపోగానే రావణుడు సీతను ఎత్తుకొని ఆకాశమార్గంలో ఎగిరిపోయాడు. ఇప్పటికే ఆ రాక్షసుడు నన్ను చంపాడు. ఇంకా నువ్వు ఏమి చంపుతావు.” అని అన్నాడు జటాయువు.
రాముడు ధనుస్సును కింద పడేసాడు. రామలక్ష్మణులు జటాయువు ను కౌగలించుకున్నారు. సీత కోసరం తన ప్రాణాలను బలిపెట్టిన జటాయువును పట్టు కొని ఏడ్చారు. జటాయువు ఊపిరి భారంగా తీస్తున్నాడు.
“చూచావా నా దౌర్భాగ్యము. రాజ్యం పోయింది. తండ్రి పోయాడు. నా భార్య అపహరింపబడింది. ఇప్పుడు నా పితృసమానుడు జటాయువు కూడా పోతున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు కూడా ఎండి పోతున్నాయి. నావంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో మరొకడు ఉంటాడా! ” అని వలా వలా ఏడ్చాడు.
రాముడు జటాయువును కౌగలించుకొని “నా సీతను ఆ రాక్షసుడు ఎక్కడకు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది.” అని అడిగాడు.
కిష్కింధాకాండలో నవమ సర్గ, హనుమంతుడు లంకను దహించి సీతకు మరోసారి ధైర్యం చెప్పడం గురించి ఉంటుంది. లంకను దహించి, హనుమంతుడు సీతకు రాముడి సందేశాన్ని మరోసారి అందించి, రక్షణ కోసం రాముడు త్వరలో వచ్చే విషయాన్ని చెబుతాడు. సీత, హనుమంతుడికి రాముడికి ఇవ్వవలసిన చూడామణిని అందిస్తుంది. హనుమంతుడు లంకను విడిచి, రాముడి వద్దకు తిరిగి చేరుకుంటాడు. తిరిగి వచ్చాక, హనుమంతుడు సీతను కనుగొన్న వివరాలను రాముని, సుగ్రీవుని, వానర సైన్యానికి తెలియజేస్తాడు. ఈ సర్గలో సీతకు ధైర్యం ఇచ్చిన హనుమంతుడి చర్యలు, రాముడు, సుగ్రీవుడు, వానర సైన్యంలోని ఆనందం ప్రధానంగా ఉంటాయి.
“రామా! వాలి, నేను, అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్న గారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రి గారు చనిపోయిన తరువాత, పెద్ద కుమారుడు అయిన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసారు. వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే, నేను వాలికి సేవకునిలా అతనిని సేవించేవాడిని. మయునికి ఇద్దరు కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి, మా అన్న వాలికి ఒక స్త్రీమూలకంగా విరోధము ఏర్పడింది. ఒకరోజు అర్థ రాత్రి అందరమూ నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమ వంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్థరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చచెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్లాడు. నేను కూడా వాలితో పాటు వెళ్లాను.
మా ఇద్దరినీ చూచి మాయావి పారిపోయాడు. నేను, వాలి, మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగములోకి ప్రవేశించాడు. ఆ సొరంగము గడ్డితో కప్పబడి ఉంది. నేను వాలి బయట నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ఇలా అన్నాడు. “తమ్ముడా! సుగ్రీవా! నేను ఈ బిలములో ప్రవేశించి, శత్రువును చంపి వస్తాను. నేను వచ్చువరకూ నీవు ఈ బిలము వద్ద నా కోసం వేచి ఉండు.” అని అన్నాడు.
దానికి నేను ఒప్పుకోలేదు. నేను కూడా తన వెంట వస్తానని ఎంత బతిమాలుకున్నా వాలి వినలేదు. తాను ఒక్కడే ఆ సొరంగము లోకి వెళ్లాడు. నేను సొరంగము బయట నిలబడి ఉన్నాను. దాదాపు ఒక సంవత్సర కాలము గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. నేను ఓపికగా ఆ సంవత్సరకాలము సొరంగము బయట వేచి ఉన్నాను. నాలో ఏదో శంక మొదలయింది. వాలి మహావీరుడు. కానీ సంవత్సరకాలము రాకపోవడంతో నామనసు కీడు శంకించింది. అయినా గుండె నిబ్బరంతో ఎదురు చూచాను.
కొంత కాలానికి ఆ సొరంగము నుండి నురుగతో కూడిన రక్తం మడుగులాగా బయటకు ప్రవహించింది. రాక్షసులు గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వినబడ్డాయి. కాని నా సోదరుడు అరుస్తున్న గొంతు వినబడలేదు. నా సోదరుడు వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడినట్టు నిర్ధారణ చేసుకున్నాను. ఇంక అక్కడ ఉండి చేసేది ఏమీ లేకపోవడంతో, నేను ఆ బిలమును పెద్ద పెద్ద బండ రాళ్లతో మూసి వేసాను. నా అన్న వాలికి జలతరణములు కూడా విడిచాను. తరువాత కిష్కింధకు తిరిగి వచ్చాను.
నా అన్న వాలి మరణాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాను. కాని మంత్రులు ఆ విషయాన్ని పసిగట్టారు. తెలుసుకున్నారు. నేను ఎంత వద్దన్నా, అందరూ కలిసి నన్ను ఈ కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేసారు. ఆ విధంగా నేను కిష్కింధకు రాజునై ధర్మంగా పరిపాలిస్తున్నాను.
ఇంతలో వాలి ఆ రాక్షసుడు మాయావిని చంపి కిష్కింధకు తిరిగి వచ్చాడు. నన్ను కిష్కింధకు రాజుగా చూచాడు. తట్టుకోలేక పోయాడు. నా మీద ఆగ్రహించాడు. నా మంత్రులను బంధించాడు. నేను వాలి అంతటి పరాక్రమ వంతుడనైనా, అన్నగారి మీద గౌరవంతో నేను వాలిని ఎదిరించలేదు. నా అన్నకు అభివాదము చేసాను. గౌరవించాను. కాని వాలి నన్ను ఆదరించలేదు. నా మీద ఆగ్రహించాడు. నేను వాలి పాదాల మీద పడి ప్రార్థించాను. కాని వాలికి నా మీద కోపం పోలేదు. నన్ను అనుగ్రహించలేదు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్షష్టితమః సర్గం (66వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, కబంధుడు తన శాప విముక్తి అనంతరం, రాముడికి సుగ్రీవుని గురించి వివరాలు చెబుతూ, అతని సహాయం పొందేందుకు మార్గదర్శనం చేస్తాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి సుగ్రీవుని వెతుకుతూ కిష్కింధకు చేరుకుంటాడు. సుగ్రీవుని సహాయం పొందడానికి రాముడు అతనితో స్నేహం చేస్తాడు, వారి మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తాడు.
లక్షణుని మాటలు రాముని మీద పనిచేయలేదు. ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కానీ, సీతను గురించి శోకించడం మానలేదు. రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. మానసికంగా శక్తిని, బలాన్ని కోల్పోయాడు. రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు.
“రామా! మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్రసంతతి లేక. యజ్ఞములు, యాగములు చేసి మనలను పొందాడు. నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు. మన తండ్రి దశరథుడు. నీవు రాజ్యాని పోగొట్టుకున్నావు. ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు.
యయాతి లాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు. ఇంక మనము ఎంత! కష్టములు, సుఖములు, ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం. వాటిని తట్టుకొని నిలబడడమే మానవుని కర్తవ్యము. మన తండ్రి పురోహితులు వసిష్ఠులవారికి ఒకే రోజు నూర్గురు కుమారులు కలిగారు. వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకేరోజు మరణించారు.
ఇంతెందుకు, భూదేవి కూడా ప్రతిరోజూ ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది. సూర్య చంద్రులు కూడా రాహు కేతువుల చేతిలో గ్రహణములను అనుభవిస్తున్నారు. దేవతలకు అధిపతి ఇంద్రుడు కూడా ఒక్కోసారి తప్పుడు పనులు చేసి కష్టాల పాలు కావడం మనకు తెలుసు కదా! కాబట్టి ఎంతటి వారికైనా కష్టములు తప్పవు. కష్టములు వచ్చాయని ఇలా దుఃఖించడం అవివేకము అనిపించుకుంటుంది.
ఇప్పుడు మన ముందు ఉన్నవి రెండే రెండు విషయాలు. ఒకటి సీత అపహరించబడింది. లేక సీత చంపబడింది. ఫలితంగా సీత నీ నుండి దూరం అయింది. ఏది జరిగినా నీవు సామాన్య మానవుల వలె దుఃఖించరాదు. ధైర్యంగా ఉండాలి. సత్యము గురించి తెలిసిన వారు ఎంత పెద్ద కష్టము వచ్చినా చలించరు. కాబట్టి రామా! దుఃఖమును మాని జరిగిన విషయములను బుద్ధితో ఆలోచించు. ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది..
మనము చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలు వస్తుంటాయి. ఆ ఫలితములను అనుభవించడమే మన కర్తవ్యము. కొన్ని కర్మలు సుఖాన్ని ఇస్తాయి. కొన్ని కర్మలు దు:ఖాన్ని కలుగజేస్తాయి. సుఖము కానీ, దు:ఖము కానీ ఎల్లకాలమూ ఉండవు. కొంతకాలము తరువాత అవి నశించిపోతాయి.
మనము అనుభవించు ఫలములు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితములే అనుకొనరాదు. మనము పూర్వజన్మలో చేసిన కర్మలకు ఫలితములు ఈ జన్మలో అనుభవానికి వస్తాయి. ఇప్పుడు మనకు కలిగిన ఈ దుఃఖము మన పూర్వ జన్మలో మనము చేసిన కర్మల ఫలము అయి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు లభించిన ఫలితములను బట్టి పూర్వ జన్మలో మనము చేసిన కర్మలను ఊహించుకొనవచ్చును. చేసిన కర్మలకు ఫలితము అనుభవింపక తప్పదు. కాబట్టి దు:ఖించి ప్రయోజనము లేదు.
రామా! ఇవన్నీ నీకు కొత్త కాదు. నీవే నాకు ఇవన్నీ చెప్పావు. ప్రస్తుతము నీవు సీతావియోగ దుఃఖములో ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పవలసి వచ్చినది. లేక పోతే సాక్షాత్తు బృహస్పతికి కూడా నీవు ధర్మములు చెప్ప సమర్ధుడవు. ప్రస్తుతము నీలో ఉన్న జ్ఞానము సీతను గురించి శోకించడంలో మరుగున పడి ఉన్నది. నీలో అంతర్గతముగా ఉన్న జ్ఞానమును నేను వెలికి తీస్తున్నాను.
ఓ రామా! నీవు మానవుడవే అయినా దేవతలకు ఉన్న పరాక్రమము ఉంది. కాబట్టి నీవు శోకము మాని మనకు అపకారము చేసిన శత్రువుల గురించి ఆలోచిద్దాము. అంతేగానీ ఈ ప్రకారంగా అస్త్ర శస్త్రములను ప్రయోగించి లోకాలను నాశనం చేయడం వలన ఏమీ ప్రయోజనము లేదు. ముందు సీతను అపహరించిన వాడు ఎవడో తెలుసుకొని వాడిని తగిన విధంగా దండిస్తాము. ముందు నీ శోకము మాను.” అని అన్నాడు లక్ష్మణుడు.
కిష్కింధాకాండలో అష్టమ సర్గలో, హనుమంతుడు సీతను కనిపెట్టిన తర్వాత రావణుడి రాక్షస సేనతో పోరాడుతాడు. హనుమంతుడు తన శక్తిని ప్రదర్శించి, రాక్షసులను సంహరిస్తాడు, అశోకవాటికను ధ్వంసం చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు, హనుమంతుడిని పట్టుకోవడానికి తన సేనను పంపిస్తాడు. హనుమంతుడు రావణుని సేనను ఎదుర్కొని, తన శౌర్యాన్ని చూపుతాడు. చివరికి, హనుమంతుడిని రావణుని వద్దకు తేవబడతాడు. హనుమంతుడు రావణుని భయంకర రూపాన్ని చూసి భయపడకుండా ధైర్యంగా ఉంటాడు. రావణుడు హనుమంతుడి తోకను కాల్చమని ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు తన కాలుతున్న తోకతో లంకను ఆగ్నేయం చేస్తాడు, అక్కడి ప్రజలు భయంతో త్రస్తులవుతారు.
అలా మాట్లాడు కోడంలో సుగ్రీవుడు తనకూ, తన అన్న వాలికి శత్రుత్వము ఎందుకు వచ్చిందీ అన్న విషయం రామునితో చెప్పసాగాడు. “ఓ రామా! నీవు నా స్నేహితుడవు కావడం నా అదృష్టం. దేవతలు నా మీద కరుణ చూపడం వలననే నీవు నా మిత్రుడివి అయ్యావు. నీవు నాకు మిత్రుడుగా, నాకు అండగా ఉంటే నేను ఒక్క కిష్కింధా రాజ్యమే కాదు, స్వర్గలోక ఆధిపత్యము కూడా పొందగలను.
ఓ రామా! నీతో స్నేహం చేయడం వలన నాకు నా బంధుమిత్రులలో గౌరవం పెరిగింది. నా గురించి, నా గుణగణముల గురించి నేను చెప్పుకోకూడదు కానీ, నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అని మాత్రం చెప్పగలను. ఎందు కంటే అతడు ధనికుడైనా, పేద వాడైనా, సుఖాలలో మునిగి తేలుతున్నా, దు:ఖాలలో కుంగి పోతున్నా, మంచి వాడైనా, చెడ్డ వాడైనా, ఎటువంటి వాడికైనా స్నేహితుడే దిక్కు. స్నేహమునకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. స్నేహాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు తన స్నేహితుని కొరకు ధనమును గానీ, సుఖములను గానీ, సంపదలను కానీ ఆఖరుకు ఉన్న ఊరును కానీ, త్యజించుటకు వెనుకాడరు. అటువంటి స్నేహము మనది.”అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు నవ్వి “మిత్రమా! నువ్వు చెప్పినది యదార్థము.” అని అన్నాడు.
(స్నేహాన్ని గురించి వాల్మీకి ఇచ్చిన అద్భుత నిర్వచనము ఈ నాటికీ అనుసరణీయము. మన సినిమా రచయితలు తమ డైలాగులలో వాల్మీకి చెప్పిన పదాలనే అటు ఇటు తిప్పి తిప్పి వల్లె వేస్తుంటారు).
“రామా! నా సోదరుడు వాలి నన్ను అవమానించాడు. నా భార్యను నా నుండి లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకున్నాను. కాబట్టి నీవు నాకు ఉపకారము చెయ్యాలి” అని మరలా గుర్తు చేసాడు సుగ్రీవుడు.
“మిత్రమా! స్నేహమునకు ఫలము ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే కదా! ఒకరికి ఒకరు అపకారము చేసుకోవడం శత్రువుల లక్షణము. నేను నీ మిత్రుడను కాబట్టి నీకు అపకారము చేసిన వారిని వధించి, నీకు మేలు చేస్తాను.” అని తన ప్రతిజ్ఞను గుర్తు చేసాడు రాముడు.
సుగ్రీవుడు చాలా దీన స్థితిలో ఉన్నాడు అందుకని రామునికి పదే పదే గుర్తు చేస్తున్నాడు. వానరులు చపల స్వభావులు కదా! “రామా! నీవు నా స్నేహితుడవు. అందుకని నా కష్టములను నీతో చెప్పుకుంటున్నాను. సాయం చెయ్యమని పదే పదే అడుగుతున్నాను. ఏమీ అనుకోకు. నీతో నా కష్టములు అన్నీ చెప్పాలని ఉంది. కాని నోరు పెగలడం లేదు.” అని కళ్ల నిండా కన్నీరు కారుస్తున్నాడు సుగ్రీవుడు. అతి కష్టం మీద తన దుఃఖమును ఆపుకుంటూ, సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.
“నీకు చెప్పాను కదా! వాలి నా అన్న. చాలా బలవంతుడు. నన్ను తిట్టాడు. అవమానించాడు. రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు. నేను నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి భార్యను నా నుండి దూరం చేసాడు. నా అన్న వాళ్లందరినీ బంధించాడు. నన్ను చంపడానికి ఎంతో మందిని పంపాడు. నేను వారి నందరినీ చంపాను. అందుకే నిన్ను చూచినప్పుడు కూడా నీవు వాలి పంపిన వాడివి అని అనుమానించాను. భయపడ్డాను. శరీరంలో భయం ఉంటే, దేనిని చూచి అయినా భయపడడం, మానవ స్వభావము కదా! ఇంక మా వానరుల సంగతి చెప్పాలా! ఇదుగో! హనుమంతుడు మొదలగు వారు నా వెంట ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వీళ్లే నేను నమ్మిన స్నేహితులు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇదీ నా వృత్తాంతము. ఇంతకన్నా వివరాలు అనవసరము అనుకుంటున్నాను.
వాలి నాకు శతృవు. వాలి నా సోదరుడే అయినప్పటికీ, వాలి చస్తేనే గానీ నా దుఃఖము ఉపశమించదు. నా సమస్తదు:ఖములకు కారకుడు వాలి. నా సుఖజీవనము వాలి మరణం మీద ఆధారపడి ఉంది. రామా! నా దుఃఖమునకు కారణము, నా దు:ఖము ఎలా తీరుతుందో వివరంగా చెప్పాను. కష్టాలలో ఉన్న మిత్రుడికి మిత్రుడే గతికాబట్టి, ఒక మిత్రుడుగా నాకు సాయం చెయ్యి” అని అన్నాడు సుగ్రీవుడు.
రాముడికి ఒక విషయం బోధపడటం లేదు. సుగ్రీవుడు ఇన్ని విషయాలు చెబుతున్నాడు కానీ అసలు తనకూ, వాలికీ ఎందుకు వైరం వచ్చిందో చెప్పడం లేదు. అడిగితే గానీ చెప్పేట్టు లేడు అని అనుకున్నాడు.
“మిత్రమా! సుగ్రీవా! నీకూ నీ అన్న వాలికి వైరం ఎందుకు, దేని గురించి, ఏ కారణం చేత కలిగింది. వివరంగా చెప్పు. అప్పుడు మీ ఇద్దరిలో తప్పు ఒప్పు నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. అసలు వైరకారణం తెలిస్తే గానీ, మా బలాబలములను సరి చూచుకోడానికి వీలు ఉండదు కదా! అప్పుడు వాలిని సులభంగా అంతమొందించ వచ్చును. నీకు నీ అన్న వలన జరిగిన అవమానమును విని నాకూ కోపం తారస్థాయిని చేరుకుంది. నేను నీ అన్నను చంపేలోగా మీ ఇద్దరి మీ మధ్య ఉన్న వైరమునకు కారణం తెలుసుకోగోరుతున్నాను. నా మీద విశ్వాసము ఉంచి మీ ఇరువురి మధ్య ఉన్న విరోధమునకు కారణం చెప్పు” అని అన్నాడు రాముడు. ఇంక తప్పదని సుగ్రీవుడు రామునికి తనకు అన అన్న వాలితో ఎందుకు విరోధము వచ్చిందో వివరంగా చెప్పనారంభించాడు.
కిష్కింధాకాండలో సప్తమ సర్గ, హనుమంతుడు లంకకు చేరుకోవడం, సీతాను కనుగొనడం గురించి ఉంటుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటి, లంకలోకి ప్రవేశించి రాక్షసుల నగరాన్ని సందర్శిస్తాడు. అక్కడ అతను రాక్షసుల రక్షణలను దాటి, రావణుని అశోకవాటికలో సీతను కనుగొంటాడు. సీతను చూసి హనుమంతుడు రాముని ఉంగరాన్ని చూపించి, రాముడి సందేశాన్ని అందిస్తాడు. సీత రాముడి స్మరణతో ధైర్యంగా ఉండమని హనుమంతుడికి హామీ ఇస్తుంది. హనుమంతుడు సీతకు రక్షణ కల్పించేందుకు తన శక్తి, మాయా శక్తులను వినియోగిస్తాడు. ఈ సర్గలో సీతా-హనుమంతుల మధ్య స్నేహం, నమ్మకం ప్రధాన అంశాలు.
రాముని పలుకులు విన్న తరువాత సుగ్రీవునకు కూడా దు:ఖము ముంచుకొచ్చింది. దుఃఖముతో పూడుకుపోయిన గొంతుతో సుగ్రీవుడు ఇలా అన్నాడు.
“రామా! సీతను అపహరించిన ఆ రాక్షసుని నివాసము గానీ, వాడి పరాక్రమము గానీ, బలము కానీ నాకు తెలియదు. కాని నా శాయశక్తులా ప్రయత్నించి వాడిని గురించి తెలుసుకుంటాను. నీ దుఃఖమును విడిచి పెట్టు. నన్ను నమ్ము. నిశ్చింతగా ఉండు. నీ భార్యను నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇదే నా ప్రతిజ్ఞ. నీవు అతి త్వరలో సీతను అపహరించిన ఆ రావణుడు అనే రాక్షసుని చంపి సీతను పొందు తావు.
కాని ముందు నీవు ఈ దు:ఖమును, దీనత్వమును, వదిలి పెట్టు. ధైర్యము అవలంబించు. నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ వలెనే నా భార్యను కూడా ఎత్తుకు పోయారు. కానీ నేను నీ వలె దు:ఖించడం లేదు. క్రుంగి పోవడం లేదు. ధైర్యము విడిచి పెట్టలేదు. నా భార్యను ఎత్తుకుపోయిన వాలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నా వంటి సాధారణ వానరుడే పోయిన భార్యను గురించి చింతించడం లేదంటే ఇంక నీ వంటి ధీరోదాత్తుడు, పరాక్రమవంతుడు, పండితుడు ఇలా దీనంగా భార్యకోసరం ధైర్యాన్ని విడనాడి దు:ఖించడం ఏమాత్రం తగదు.
బుద్ధిమంతుడైన వాడు ఆపదలలో గానీ, ధన నష్టము సంభవించి నప్పుడు గానీ, ప్రాణాపాయ స్థితిలో గానీ, ధైర్యమును విడిచిపెట్టడు. దు:ఖించడు. బుద్ధికి పదును పెట్టి తగిన ఉపాయము గురించి ఆలోచిస్తాడు. అలా కాకుండా మూర్ఖత్వముతో ఎల్లప్పుడూ దీనత్వముతో ఉండేవాడు, తన మనసును తన అధీనములో ఉంచుకోలేక, నడి సముద్రంలో నావలాగా మునిగిపోతాడు. కాబట్టి ఓ రామా! ఒక స్నేహితుడుగా నిన్ను వేడుకుంటున్నాను. దీనత్వాన్ని వదిలిపెట్టు. శోకానికి స్వస్తి చెప్పు. బుద్ధికి పదునుపెట్టు. పౌరుషాన్ని తెచ్చుకో. ఎందుకంటే అనుక్షణం శోకంతో కుమిలిపోయేవాడికి సుఖం ఎంతో దూరంలో ఉంటుంది. శోకార్తునకు అన్నీ సందేహాలే కలుగుతాయి. వాడు ఏ పనీ సక్రమంగా చెయ్యలేడు. ధైర్యవంతుడు అన్ని పనులు సక్రమంగా నిర్వహించగలడు. రామా! నేను నీకు నీతులు ఉపదేశించడం లేదు. కేవలం ఒక స్నేహితుడుగా నీ దు:ఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను.” అని సుగ్రీవుడు రామునికి సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నించాడు.
సుగ్రీవుని మాటలకు రాముడు స్వస్థత పొందాడు. సుగ్రీవుని కౌగలించుకొని ఇలా అన్నాడు. “మిత్రమా సుగ్రీవా! నా హితమును కోరే స్నేహితుడు ఎలా చేస్తాడో అదే నువ్వు చేసావు. నీ సాంత్వన వచనములతో నాకు స్వస్థత లభించింది. నీ వంటి స్నేహితుడు, బంధువు నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారము, సీతను, ఆ రావణుడు అనే రాక్షసుని వెతికే ప్రయత్నం చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నేను నీకు ఏం చెయ్యాలో వివరంగా చెప్పు. మన ఇరువురి కార్యములు సఫలం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది. నా సాయం గురించి నీవు సందేహించకు. నేను ఇప్పటి దాకా అబద్ధము చెప్పలేదు. ఇంక మీదట చెప్పను కూడా. నీకు సాయం చేస్తాను అని ప్రతిజ్ఞచేస్తున్నాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సుగ్రీవుడు, హనుమంతుడు ఎంతో సంతోషించారు. రాముడు చేసిన ప్రతిజ్ఞను విని సుగ్రీవుడు తన పని సఫలం అయినట్టే అని ఎంతో సంతోషించాడు. తరువాత రాముడు, సుగ్రీవుడు ఒక ఏకాంత ప్రదేశములో కూర్చుని తమ కష్టసుఖములు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచషష్టితమః సర్గం (65వ సర్గ) రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీతను వెతికే ప్రయాణంలో కబంధుడిని ఎదుర్కొంటాడు. కబంధుడు రాక్షసుడిగా ఉండి, తన శాప విమోచనం కోసం రాముడి సహాయాన్ని కోరుతాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి, కబంధుడిని హతమార్చి, అతని శాపాన్ని తొలగిస్తాడు. శాప విముక్తి తరువాత, కబంధుడు రాముడికి సుగ్రీవుని గురించి, అతని సహాయం పొందే విధానాన్ని వివరిస్తాడు.
సీతా వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే రామునితో ఇలా అన్నాడు.
“రామా! నీవు సౌమ్యుడవు. మృదుస్వభావుడవు. సకల జనులకు హితుడవు. అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అనడం భావ్యమా! నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా! చంద్రునికి వెన్నెల, సూర్యునికి వేడి, భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత, సాధుజన ప్రియత్వము అలంకారాలు. ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా!
సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు. వాడిని శిక్షించాలి గానీ, ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా! ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరికి యుద్ధం జరిగిందో, అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు.
కాని ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము. కాని ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగిందే కానీ, పెద్ద సైన్యము మధ్య జరిగింది కాదు. పెద్దసైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు. ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి. మరొకడు గెలవాలి. కాబట్టి ఆ చచ్చినవాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటాడు. వాడిని పట్టుకుంటే మనకు సీత జాడతెలియవచ్చు. కాబట్టి ఆ ఇద్దరి గురించి నీవు నీ ఆయుధమును ప్రయోగించడం ఉచితం కాదు.
నీ భార్యను అపహరించడం క్షమించరాని నేరము. మనము ఆ నేరము చేసిన అపరాధిని పట్టి శిక్షిస్తాము. నీకు ఈ ప్రకృతి సాయం చేయడం లేదు అని అనుకుంటున్నావు. అలా అని ఎందుకు అనుకుం వు. దక్షిణ దిక్కుగా పొమ్మని చెప్పింది ఆ మూగజీవాలే కదా! ఇంక చెట్టు, పుట్టలు, పర్వతాలు, నదులు తాము చూచిన విషయాన్ని నీకు ఎలా తెలియజేయగలవు. వాటికి నీకు సాయం చేయాలని ఉన్నా చేయలేవు కదా! అందుకని శాంతం వహించు.
మనము ఇక్కడ ఉన్న మునులను, ఋషులను కలిసి వారి సాయంతో సీతను గురించి వెదుకుదాము. ఈ అడవి, పర్వతములు, నదీతీరములు అణువు అణువునా గాలిద్దాము. సీత జాడ తెలిసే వరకూ, సీతను అపహరించిన వాడు దొరికే వరకూ మనకు అన్ని లోకములు వెదుకుదాము. ఒక వేళ దేవతలు గానీ, దానవులు గానీ ఈ పని చేసి ఉంటే, వారికి ఒక అవకాశం ఇద్దాము. అప్పటికీ వారు దారికి రాకపోతే, అప్పుడు వారిని కఠినంగా శిక్షిద్దాము. ముందు మనము సామోపాయముతోనూ, మన ఉదాత్తమైన శీలము తోనూ, వినయంగా అడుగుదాము. వారు మాట వినకపోతే, అప్పుడు నీ పరాక్రమం చూపించవచ్చును.” అని రాముని శాంతింపజేసాడు. లక్ష్మణుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃషష్టితమః సర్గం (64వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు సీతను వెతికే క్రమంలో హనుమంతుని, జటాయువును కలుస్తాడు. జటాయువు రావణుడి చేతిలో సీత అపహరణను చూసి రామునికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. జటాయువు ధైర్యం మరియు సీతను రక్షించడానికి చేసిన ప్రయత్నం రాముడికి ఎంతో ప్రేరణ ఇస్తుంది.
రాముడికి ఇంకాఆశ చావలేదు. ‘ఏమో సీత ఎక్కడికైనా వెళ్లిందేమో. మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో’ అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి
“లక్ష్మణా! నీవు వెంటనే గోదావరీనదీ తీరానికి వెళ్లు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కానీ, స్నానానికి కానీ వెళ్లిందేమో చూడు.’ ఇదే ఆఖరి ఆశ.” అన్నాడు రాముడు.
అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరీ నదీతీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు.
“అన్నయ్యా! నేను గోదావరి తీరం అంతా వెదికాను. బిగ్గరగా అరిచాను. సీత ఎక్కడా కనిపించలేదు.” అని చెప్పాడు.
ఆఖరి ఆశకూడా వమ్ముకావడంతో రాముడు హతాశు డయ్యాడు. కాని రామునికి ఇంకా కొస ఆశ మిగిలి ఉంది. “లక్ష్మణుడు సరిగా చూచాడో! లేదో ఏమో!” అని తానే స్వయంగా గోదావరీ నదీ తీరానికి వెళ్లాడు. సీతా! సీతా! అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు.
రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరీ నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను ఎంత ఎలుగెత్తి పిలిచిననూ ఈ వనములో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు. ఏం చేయాలి. నీ పాణిని గ్రహించిన సీత ఏదీ అని సీత తల్లి తండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి.
లక్ష్మణా! నా రాజ్యము పోయినా, అరణ్యవాసము సంప్రాప్తిం చినా, నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సీత నన్ను విడిచి పోయింది. ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి. నాకు ధైర్యము చెప్పేవాళ్లు ఎవరు.
లక్ష్మణా! చూచావా! ఈ మృగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలి అనుకుంటున్నాయి. కాని చెప్పలేకపోతున్నాయి. సీత గురించి వీటికి తెలిసి ఉంటుంది. ఉండు వీటిని అడుగుతాను.” అని రాముడు ఒక్కొక్క మృగం దగ్గరకు పోయి “సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా!” అని ప్రతి మృగమును అడుగుతున్నాడు.
వాటి కళ్ల వెంట కన్నీరు కారుతూ ఉంది. కాని ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాని అవి ఒక సంకేతమును ఇచ్చాయి. ఆ మృగములు తమ మోరలు ఎత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరుగెడుతున్నాయి. ఆకాశం వంక చూస్తున్నాయి. మరలా దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి.
రాముడు సీతా వియోగ దుఃఖంలో ఉన్నాడు. కానీ లక్ష్మణుడు సూక్ష్మబుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు. “రామా! గమనించావా! నువ్వు “మీరు సీతను చూచారా! సీత ఎక్కడకు వెళ్లింది” అని అడగగానే ఈ మృగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణదిక్కుగా తీసుకువెళ్లినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్లి వెదుకుదాము. సీత జాడ ఏమైనా తెలుస్తుందేమో!” అని అన్నాడు లక్ష్మణుడు.
ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక దొరికినా లాభమే అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది. “లక్ష్మణా! అలాగే చేద్దాము. పద పోదాం.” అన్నాడు రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళు తున్నారు.మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడిఉ డ చూచారు.
రాముడు ఆపూలను చూచాడు. “లక్ష్మణా! ఈ పూలు చూచావా! ఈ రోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకొని వచ్చి సీతకు ఇచ్చాను. ఈ పూలు ఇంకా వాడిపోలేదు. ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి.” అని సంతోషించాడు.
మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు. “ఓ పర్వతములారా! మీకు సీత జాడ తెలుసు. ఎవరు తీసుకొనిపోయారో తెలుసు. తెలిసీ చెప్పకపోయారో నా బాణములతో మిమ్ములను పిండి పిండి చేస్తాను.” అని పెద్దగా అరిచాడు. రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి.
ఇంతలో నేలమీద అటు ఇటు పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు, చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. పెద్ద అడుగులు రాక్షసునివి గానూ చిన్న అడుగులు సీతవి గానూ పోల్చుకున్నారు రామలక్ష్మణులు. ఆతురతగా ముందుకు నడిచారు.
వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు బాణములు, ముక్కలైన రథము కనపడ్డాయి. అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. అక్కడక్కడా విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు. వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెదుకుతున్నారు. “లక్ష్మణా! ఇటు చూడు. ఇక్కడ నేల మీద రక్త బిందువులు కనపడుతున్నాయి. ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు. లక్ష్మణా! చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదుగో ఇటు చూడు! బంగారముతో అలంకరింపబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది. ఇది ఎవరిదిఅయి ఉంటుందో తెలియదు. లక్ష్మణా! ఇటుచూడు. ఇక్కడ బంగారు కవచము పడిఉంది. ” అని అన్నాడు రాముడు.
“అన్నయ్యా! ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడిఉంది. అదుగో అక్కడ పిశాచముఖములు కలిగిన గాడిదలు చచ్చి పడిఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది.” అని అన్నాడు లక్ష్మణుడు.
“లక్ష్మణా! ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది. అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ పడిఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. బంగాచపు ములికలు కలిగి ఉన్నాయి. రెండు అమ్ములపొదులు కూడా ఉన్నాయి. రథసారథికూడా చచ్చిపడి ఉన్నాడు. ఈసారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళెములు, కొరడా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లుకూడా చంపబడినట్టున్నారు. వాళ్ల శరీరాలు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు” అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు.
లక్ష్మణుడు కూడా వారిని చూచి వారు రాక్షసులు అని పోల్చుకున్నాడు. కాని సీత ఏమయిందో తెలయడం లేదు. రామునికి అర్థం అయింది. ఇదంతా రాక్షసుల పని అని. లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“ఓ లక్ష్మణా! ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది. సీతను తీసుకువెళ్లడం గానీ, చంపి తినడం గానీ జరిగి ఉండవచ్చు. సీత గురించి ఇక్కడ ఘోరయుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడు తున్నాయి. దేవతలుగానీ వనదేవతలు గానీ సీతను రక్షించలేదు. ఏది ఏమయినా నాకు తీరని నష్టం కలుగజేసారు. నాకు సహజంగా దయాగుణం ఉంది. అనవసరంగా నేను ఎవరికీ అపకారము చెయ్యను. నా దయా గుణమును దేవతలు, వనదేవతలు, రాక్షసులు నా చేతగాని తనంగా భావిస్తున్నారు. నన్ను పరాక్రమము లేని వాడుగా అనుకొంటున్నారు. నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది.
అందుకని, నేను నా దయాగుణమును తొక్కిపట్టి, విజృంభిస్తాను. సకల భూతములను, రాక్షసులను నాశనం చేస్తాను. యక్షగంధర్వ, పిశాచ, దానవులను క్షోభపెడతాను. ఎవరినీ సుఖంగా బతకనివ్వను. నా అస్త్ర శస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను. ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమము ఏమిటో వారికి తెలియజేస్తాను.” అని పలికి విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
“లక్ష్మణా! ఇక్కడ ఉన్న వారందరికీ నా సీతకు ఏమయిందో తెలుసు. కానీ నాకు చెప్పడం లేదు. వారు, దేవతలు కానీ, రాక్షసులు గానీ, నా సీత జాడ చెప్పకపోయినా, నా సీతను నాకు సజీవంగా నాకు అప్పగించకపోయినా, ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను.” అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిషష్టితమః సర్గం (63వ సర్గ) రామాయణంలో ప్రధానమైన భాగం. ఈ సర్గలో, రావణుడు మాయా సీతను అపహరించిన తరువాత, రాముడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుని, హనుమంతుని సహాయంతో వనాలను అన్వేషిస్తాడు. ఈ అన్వేషణలో రాముడు అనేక వనాలను, అడవులను దాటుతూ సీతను వెతుకుతాడు. ఈ సర్గలో, రాముడు తన భార్య సీతను రక్షించడానికి ఎంతో సాహసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. రాముని తపస్సు, కృషి, ధర్మపాలన ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.
రాముడి దుఃఖానికి అంతులేకుండా పోయింది. లక్ష్మణుడు ఎంత ఓదారుస్తున్నా రాముడు సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమెకోసం విలపిస్తున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.
“నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను. అందుకనే నాకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నేను ఊరికే అనడం లేదు లక్ష్మణా! నాకు రాజ పోయింది. బంధుమిత్రులు దూరం అయ్యారు. తల్లి దూరం అయింది. తండ్రి మరణించాడు. ఇప్పుడు నా భార్యకూడా నాకు దూరం అయింది. ఇది పాపకర్మల ఫలితం కాదా!
సీతను ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఆమె ఎంతగా విలపించి ఉంటుందో తలచుకుంటేనే భయంగా ఉంది. సందేహము లేదు. సీతను రాక్షసులే అపహరించారు. నరమాంస భక్షకులైన రాక్షసులు సీతను అపహరించి, ఆమె కంఠమును ఖండించి ఆమె నెత్తురు తాగి ఉంటారు. ఆ సమయంలో ఆమె ఎంతగా ఏడ్చిందో కదా!
లక్ష్మణా! నీకు తెలుసుకదా! సీత, నేను, ఆ శిలాఫలకము మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు గడిపాము కదా! లక్ష్మణా! సీత గోదావరికి స్నానం నిమిత్తం వెళ్లి ఉంటుందంటావా! కాని ఆమె ఎప్పుడూ ఒంటరిగా గోదావరికి స్నానానికి వెళ్లదే! నేను తోడు లేనిదే సీత కనీసము తామరపూల కోసరం కూడా తటాకమునకు వెళ్లదు. ఎందుకంటే సీత మహాభయస్తురాలు.” అని లక్ష్మణునితో అన్నాడు.
తల పైకి ఎత్తాడు. ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు. “ఓ సూర్యభగవానుడా! నీవు లోకమంతా వెలుగుతుంటావు కదా! నా సీత ఎక్కడైన కనపడిందా! నీవు చూచావా! చూస్తే నాకు చెప్పవా!” అని సూర్యుడిని వేడుకున్నాడు. అలాగే వాయుదేవుడిని కూడా వేడుకున్నాడు.
ఇదంతా చూచిన లక్ష్మణుడికి కూడా దుఃఖం ముంచు కొచ్చింది. తనూ దుఃఖిస్తే రాముడు ఇంకా దైన్యానికి లోనవుతాడని తనలో తాను తమాయించుకున్నాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
“రామా! ఇంక చాలు. సీత కోసం దుఃఖించడం మాను. ఇలా దుఃఖిస్తూ కూర్చుంటే సీత తిరిగి వస్తుందా! పద. సీతను వెదుకుదాము. నీ వంటి బుద్ధిమంతులు కష్టములు వచ్చినప్పుడే ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి రామా! ధైర్యము తెచ్చుకో. ” అని రామునికి ధైన్యవచనాలు పలికాడు. కానీ రాముడి మీద అవి పనిచేయలేదు. (ఈ సర్గ కూడా ప్రాచ్యప్రతిలో లేదు. అందుకని ఈ సర్గ కూడా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము.)
కిష్కింధాకాండలో పంచమ సర్గలో, సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నాలుగు దిశల్లో సీతాన్వేషణకు పంపిస్తాడు. హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన ప్రముఖులు అన్వేషణలో పాల్గొంటారు. హనుమంతుడికి రాముడు సీతదేవి కనిపిస్తే ఇచ్చేందుకు తన ఉంగరాన్ని ఇస్తాడు. వానరులు ప్రతి కొండ, అడవి, సముద్రం వెతుకుతారు. ఈ సమయంలో సీతదేవి లక్షణాలను వివరించటం ద్వారా రాముడు హనుమంతుడికి ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. అన్వేషణ బృందం దక్షిణ దిశగా పయనిస్తుంది, హనుమంతుడు తన శక్తిని వినియోగించి, సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడానికి సన్నద్ధమవుతాడు. ఈ సర్గలో అన్వేషణకు సంబంధించిన ప్రణాళికలు, స్నేహబంధం మరియు ధైర్యం ప్రాముఖ్యత వహిస్తాయి.
హనుమంతుడు రామలక్ష్మణులను తన బుజముల మీద ఎక్కించుకొని ఋష్యమూక పర్వతము నుండి మలయ పర్వతమునకు తీసుకొని వెళ్లాడు. రామలక్ష్మణులను మలయ పర్వతము మీద దించి, సుగ్రీవుని వద్దకు వెళ్లాడు.
“ఓ సుగ్రీవా! వీరు రాముడు లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు. నేనే వీరిని నా వెంట తీసుకొని వచ్చాను. రాముడు మహా పరాక్రమ వంతుడు. రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన వాడు. ధర్మము తెలిసిన వాడు. దశరథుని కుమారుడు. తండ్రి ఆజ్ఞప్రకారము వనవాసము చేస్తున్నాడు. రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు. ఆ రాముడు ప్రస్తుతము నీ శరణు కోరుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు నీతో స్నేహము చేయవలెనని అభిలషిస్తున్నారు. వీరి స్నేహమును అంగీకరించు. దీని వలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది. వీరిరువురూ పూజింప తగిన వారు. వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు.” అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు.
రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! మీ గుణగణముల గురించి హనుమంతుడు నాతో చెప్పాడు. మీరు ఉత్తమ మానవులు. నేను వానరుడను. ఈ వానరుడితో స్నేహము కోరుతున్నారంటే, ఇది మీరు నాకు చేస్తున్న సత్కారముగా భావిస్తున్నాను. మీకు నాతో స్నేహం చేయడం ఇష్టం అయితే, నా చేతులు మీకోసం చాస్తున్నాను. మీ చేతితో నా చేతిని తాకండి. కరచాలనం చెయ్యండి.” అని అన్నాడు సుగ్రీవుడు.
సుగ్రీవుడు పలికిన పలుకులు విన్న రాముడు చాలా సంతోషించాడు. సుగ్రీవుని హస్తము పట్టుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం అంగీకరించాడు. సుగ్రీవుని గాఢంగా కౌగలించుకున్నాడు. ఈ సన్నివేశము చూచి హనుమంతుడు చాలా ఆనందించాడు. రెండు కర్రలతో నిప్పుపుట్టించాడు. అగ్ని రగిల్చాడు. ఆ అగ్నిని రాముడు సుగ్రీవుని మధ్య ఉంచాడు. రాముడు, సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టు ప్రదక్షిణము చేసారు. అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవులు మిత్రులయ్యారు.
సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. “మనము ఇద్దరమూ సమానమైన దు:ఖములో ఉన్నాము. ఒకరి దు:ఖములను ఒకరం పంచుకుందాము. ఇకమీదట మన సుఖదు:ఖములను సమానంగా పంచుకుందాము.” అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షము నుండి ఒక కొమ్మను విరిచాడు. కింద పరిచాడు. రాముడు సుగ్రీవుడు దాని మీద కూర్చున్నారు. తరువాత హనుమంతుడు ఒక చందన వృక్షము కొమ్మను తెచ్చి లక్ష్మణునికి కానుకగా ఇచ్చాడు. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు.
“ఓ రామా! నా అన్న వాలి నన్ను చాలా అవమానించాడు. నాతో శతృత్వము పెంచుకున్నాడు. నా నుండి నా భార్యను లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి తరిమేసాడు. నేను, నా అన్న వాలికి భయపడి, అపరిమిత మైన దుఃఖమును అనుభవిస్తూ, ఈ ఋష్యశృంగ పర్వతము మీద నివసిస్తున్నాను. రామా! ఇప్పుడు నాకు నీ అభయము కావాలి. నాకు వాలి నుండి రక్షణ కావాలి. నా రాజ్యము నాకు కావాలి. నా భార్య నాకు కావాలి. ఇదంతా నీ వల్లే జరగాలి.” అని అన్నాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవుని మాటలకు నవ్వుతూ ఇలా అన్నాడు. “నేను నీకు తప్పకుండా సాయము చేస్తాను. నీ భార్యను అపహరించిన వాలిని చంపి నీ భార్యను నీకు తెచ్చి అప్పగిస్తాను. ఈ బాణములు చూచావు కదా. ఇవి అమోఘమైనవి. వీటితో వాలిని వధిస్తాను.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సుగ్రీవుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ రామా! నీ మాటలు వింటుంటే నాకు నా భార్యను తిరిగి పొందినంత ఆనందంగా ఉంది. నాకు వాలి వలన కలిగిన భయాన్ని శాశ్వతంగా తొలగించు. వాలి నన్ను మరలా ఎటువంటి బాధ పెట్టకుండా చెయ్యి” అని అన్నాడు సుగ్రీవుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విషష్టితమః సర్గం అంటే రామాయణంలోని అరణ్యకాండ యొక్క 62వ అధ్యాయం. ఈ సర్గలో, రాముడు, సీతా, లక్ష్మణులు దండకారణ్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ప్రధాన సంఘటన సీత హరణం. రాక్షసుడు రావణుడు, సీతను అపహరించడానికి వచ్చి, ఆమెను బలవంతంగా తన రథంలో ఎక్కించుకొని, లంకకు తీసుకువెళ్తాడు. సీత విడిపించబడటానికి ఆర్తనాదం చేస్తుంది, కానీ ఆమెను రక్షించడానికి ఎవ్వరూ ఉండరు.
వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడ బాయని సీత ఒక్కసారిగా తనను విడిచి పోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రా రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్టూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీ కనపడలేదు.
మరలా లక్ష్మణుడి వంక చూచాడు. “లక్ష్మణా! నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు. సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా!” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. “ఓ సీతా! నీకు ఎంత ఆపద సంభవించినది. ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో! ఆమె కోరిక తీరినట్టయింది కదా! సీతా! నీతో కలిసి అయోధ్యనుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తలిస్తే జనం నన్ను పిరికి వాడనీ, పరాక్రమం లేని వాడనీ నిందించరా!
నిజమే! నేను పిరికివాడినే! లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే! నేను నిజంగా పిరికివాడినే! మీ తండ్రి జనక మహారాజు వచ్చి ‘నాకుమార్తె సీత ఎక్కడ?” అంటే నేను ఏమి సమాధానం చెప్పాలి. ఆయనకు నా మొహం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా! అందుకే నేను మరలా అయోధ్యకు వెళ్లను? సీతలేని అయోధ్యలో నేను ఉండలేను.” అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొనని మాట్లాడుతున్నాడు.
ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. “లక్ష్మణా! నీవు అయోధ్యకు వెళ్లు. నా కోసరం నువ్వుకూడా ఎందుకు ఈ అడవులలో బాధలుపడతావు. భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నామాటగా చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి నా తల్లిని జాగ్రత్తగా చూసుకో! ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. లక్ష్మణా! నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దాని కోసరం వెళ్లడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం. నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం, అన్నీ వివరించు.” అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు భయంతో వణికిపోయాడు. సీతావియోగదుఃఖం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు.