Ayodhya Kanda Sarga 97 In Telugu – అయోధ్యాకాండ సప్తనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 97

అయోధ్యాకాండం సప్తనవతితమ (97వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, ఇతర రుషులు, సైనికులు రాముని వద్దకు చేరుకుంటారు. భరతుడు రాముని పాదాలు స్పృశించి, తన తండ్రి మరణాన్ని, తన బాధను వ్యక్తపరుస్తాడు. భరతుడు రాముని తిరిగి రావాలని ప్రాధేయపడతాడు, కానీ రాముడు తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం కొనసాగిస్తానని చెప్పి, తన ధర్మాన్ని పాటిస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అయోధ్యకు తిరిగి వెళ్లి, అవి సింహాసనంపై ఉంచి, రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాడు.

భరతగుణప్రశంసా

సుసంరబ్ధం తు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్ఛితమ్ |
రామస్తు పరిసాంత్వ్యాథ వచనం చేదమబ్రవీత్ || ౧ ||

కిమత్ర ధనుషా కార్యమసినా వా సచర్మణా |
మహేష్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే || ౨ ||

పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతమ్ |
కిం కరిష్యామి రాజ్యేన సాపవాదేన లక్ష్మణ || ౩ ||

యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ |
నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్విషకృతానివ || ౪ ||

ధర్మమర్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ |
ఇచ్ఛామి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమి తే || ౫ ||

భ్రాతౄణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణ |
రాజ్యమప్యహమిచ్ఛామి సత్యేనాయుధమాలభే || ౬ ||

నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబరా |
న హీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ || ౭ ||

యద్వినా భరతం త్వాం చ శత్రుఘ్నం చాపి మానద |
భవేన్మమ సుఖం కించిద్భస్మ తత్కురుతాం శిఖీ || ౮ ||

మన్యేఽహమాగతోఽయోధ్యాం భరతో భ్రాతృవత్సలః |
మమ ప్రాణాత్ప్రియతరః కులధర్మమనుస్మరన్ || ౯ ||

శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణమ్ |
జానక్యాసహితం వీర త్వయా చ పురుషర్షభ || ౧౦ ||

స్నేహేనాఽక్రాంతహృదయః శోకేనాకులితేంద్రియః |
ద్రష్టుమభ్యాగతో హ్యేష భరతో నాన్యథాఽఽగతః || ౧౧ ||

అంబాం చ కైకయీం రుష్య పరుషం చాప్రియం వదన్ |
ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగతః || ౧౨ ||

ప్రాప్తకాలం యదేషోఽస్మాన్ భరతో ద్రష్టుమిచ్ఛతి |
అస్మాసు మనసాఽప్యేషః నాప్రియం కించిదాచరేత్ || ౧౩ ||

విప్రియం కృతపూర్వం తే భరతేన కదా ను కిమ్ |
ఈదృశం వా భయం తేఽద్య భరతం యోఽత్ర శంకసే || ౧౪ ||

న హి తే నిష్ఠురం వాచ్యో భరతో నాప్రియం వచః |
అహం హ్యప్రియముక్తః స్యాం భరతస్యాప్రియే కృతే || ౧౫ ||

కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది |
భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః || ౧౬ ||

యది రాజ్యస్య హేతోస్త్వమిమాం వాచం ప్రభాషసే |
వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతామ్ || ౧౭ ||

ఉచ్యమానోఽపి భరతో మయా లక్ష్మణ తత్త్వతః |
రాజ్యమస్మై ప్రయచ్ఛేతి బాఢమిత్యేవ వక్ష్యతి || ౧౮ ||

తథోక్తో ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః |
లక్ష్మణః ప్రవివేశేవ స్వాని గాత్రాణి లజ్జయా || ౧౯ ||

తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా వ్రీడితః ప్రత్యువాచ హ |
త్వాం మన్యే ద్రష్టుమాయాతః పితా దశరథః స్వయమ్ || ౨౦ ||

వ్రీడితం లక్ష్మణం దృష్ట్వా రాఘవః ప్రత్యువాచ హ |
ఏష మన్యే మహాబాహురిహాస్మాన్ ద్రష్టుమాగతః || ౨౧ ||

అథవా నౌ ధ్రువం మన్యే మన్యమానః సుఖోచితౌ |
వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి || ౨౨ ||

ఇమాం వాఽప్యేష వైదేహీమత్యంతసుఖసేవినీమ్ |
పితా మే రాఘవః శ్రీమాన్ వనాదాదాయ యాస్యతి || ౨౩ ||

ఏతౌ తౌ సంప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ |
వాయువేగసమౌ వీర జవనౌ తురగోత్తమౌ || ౨౪ ||

సైష సుమహాకాయః కంపతే వాహినీముఖే |
నాగః శత్రుంజయో నామ వృద్ధస్తాతస్య ధీమతః || ౨౫ ||

న తు పశ్యామి తచ్ఛత్త్రం పాండరం లోకసత్కృతమ్ |
పితుర్దివ్యం మహాబాహో సంశయో భవతీహ మే || ౨౬ ||

వృక్షాగ్రాదవరోహ త్వం కురు లక్ష్మణ మద్వచః |
ఇతీవ రామో ధర్మాత్మా సౌమిత్రం తమువాచ హ || ౨౭ ||

అవతీర్య తు సాలాగ్రాత్తస్మాత్స సమితింజయః |
లక్ష్మణః ప్రాంజలిర్భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః || ౨౮ ||

భరతేనాపి సందిష్టా సమ్మర్దో న భవేదితి |
సమంతాత్తస్య శైలస్య సేనా వాసమకల్పయత్ || ౨౯ ||

అధ్యర్ధమిక్ష్వాకుచమూర్యోజనం పర్వతస్య సా |
పార్శ్వే న్యవిశదావృత్య గజవాజిరథాకులా || ౩౦ ||

సా చిత్రకూటే భరతేన సేనా
ధర్మం పురస్కృత్య విధూయ దర్పమ్ |
ప్రసాదనార్థం రఘునందనస్య
విరాజతే నీతిమతా ప్రణీతా || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తనవతితమః సర్గః || ౯౭ ||

Ayodhya Kanda Sarga 97 Meaning In Telugu

భరతుని మీద కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! శాంతించు. తొందర పడకు. వచ్చేవాడు భరతుడు అని నువ్వే చెప్పావు. భరతుడు మన సోదరుడు. పైగా ధర్మాత్ముడు. ఇప్పుడు మనకు కత్తులతోనూ విల్లుతోనూ అస్త్రశస్త్రములతోనూ పని ఏమున్నది. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించుటకు అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు భరతుని చంపి ఆ రాజ్యమును ఏమి చేసుకుంటాను. ఎందుకంటే నేను 14 సంవత్సరముల దాకా రాజ్యపాలన చేయలేను కదా. అదీకాకుండా సోదరుని చంపితే వచ్చేరాజ్యము విషము వంటిది. దానిని నేను ముట్టను.

మరొక విషయం. నేను ఈ రాజ్యమును కోరుతున్నానుఅంటే అది మీ కొరకే గానీ నాకు కాదు. నాకు ఏమీ అక్కరలేదు. ఈ పదునాలుగు సంవత్సరముల తరువాత కూడా నేను మీ కొరకు మాత్రమే రాజ్యపాలన చేస్తాను. నాకు రాజ్య కాంక్ష ఏ మాత్రమూ లేదు. ఇది నా ప్రతిజ్ఞ. మరొక మాట. నేను కావాలి అనుకుంటే శత్రువుల నందరినీ సమూలంగా నాశనం చేసి రాజ్యము కైవసము చేసు కోగలను. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అధర్మపరంగా వచ్చే ఇంద్రపదవి కూడా నాకు ఇష్టం లేదు. అయినా మీకు లేని సుఖము నాకు ఎందుకు. భరతుడు, శత్రుఘ్నుడు, లేని రాజ్యము నాకు ఎందుకు. కాబట్టి శాంతించు. అసలు విషయం తెలుసుకో. నా ఊహ ప్రకారము భరతుడు తన మాతామహుల ఇంటి నుండి తిరిగి వచ్చి, తన తల్లి మూలంగా మనము అరణ్యములకు వెళ్లినట్టు తెలుసుకొని, తిరిగి మనలను అయోధ్యకు తీసుకొని వెళ్లుటకు వచ్చిఉంటాడు. ఎందుకంటే మన కులధర్మము ప్రకారము జ్యేష్టుడే రాజు కావలయును కదా. అందువలన భరతుడు పట్టాభిషేకమునకు అంగీకరించడు. కేవలము మనలను చూచుటకే వస్తూఉంటాడు.

అదీకాకుండా తన తల్లి మూలంగా ఇది అంతా జరిగింది అని తెలుసుకొని నన్ను తిరిగిఅయోధ్యకు తీసుకొనివెళ్లి పట్టాభిషేకము జరిపించవలెనని నా రాజ్యము తిరిగి నాకు ఇవ్వవలెననే ఉద్దేశ్యముతోనే వస్తూ ఉంటాడు. కాబట్టి భరతుడు మనకు కలలో కూడా అపకారము తలపెట్టడు.

అదీకాకుండా లక్ష్మణా! భరతుని సంగతి నీకు తెలియదా! ఇంతకు పూర్వము భరతుడు నీకు ఎప్పుడైనా ఎలాంటి అపకారమైనా చేసాడా! ఇలాంటి భయమును కలిగించాడా! లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు భరతుడు మనకు అపకారము చేస్తాడు అని భయపడు తున్నావు. కాబట్టి భరతుని ఒక్క మాట కూడా అనకు. ఎందుకంటే భరతుని తిడితే నన్ను తిట్టినట్టే.

మరొక మాట ఈ లోకంలో ఎవరైనా ఎంతటి ఆపదలో ఉన్నా కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరులను చంపుకుంటారా! పోనీ నీవు రాజ్యము కావలెనని కోరుకుంటూ ఉంటే చెప్పు. భరతునితో చెప్పి అయోధ్యను నా బదులు నీకు ఇప్పిస్తాను. హాయిగా రాజ్యము ఏలుకో. ఎందుకంటే, ‘భరతా! ఈరాజ్యము లక్ష్మణునికి ఇమ్ము’ అని అనగానే భరతుడు సంతోషంగా నీకు రాజ్యము ఇస్తాడు. ఆ నమ్మకము నాకు ఉంది. చెప్పు నీకు రాజ్యము కావాలా!” అని అడిగాడు రాముడు. లక్ష్మణుడు తన అవివేకపు మాటలకు సిగ్గుతో తల దించుకున్నాడు.

“లక్ష్మణా! అసలు విషయం ఏమిటంటే, భరతుడు రాగానే, మన తండ్రి దశరథుడు, భరతుని వెంటబెట్టుకొని మనలను చూడటానికి వస్తున్నాడు అని అనుకుంటున్నాను. అంతే కాదు, మనము పడుతున్న కష్టములను చూచి, మనలను తిరిగి అయోధ్యకు ఆహ్వానించుటకు వస్తున్నాడేమో అని కూడా అనుమానంగా ఉంది. ఒక వేళ మనము అయోధ్యకు రావడానికి ఇష్టపడక పోతే, కనీసము సీతనైనా తన వెంట తీసుకొని వెళతాడు దశరథుడు.

లక్ష్మణా! అటుచూడు అది మన తండ్రిగారి భద్రగజము కదా! మంద్రగమనంతో ఇటే వస్తూ ఉంది. కాని ఆగజము మీద మన తండ్రి గారి చిహ్నమైన తెల్లటి గొడుగు ఉండాలే. అది కనపడటం లేదు. ఏమయి ఉంటుంది. తండ్రిగారు వస్తుంటే ఆయనవెంట రాజచిహ్నమైన శ్వేతఛత్రము తప్పనిసరిగా ఉంటుంది కదా! అంటే తండ్రిగారు రావడం లేదా! భరతుడు ఒక్కడే వస్తున్నాడా! సరేలే. నువ్వు ఇక్కడే ఉండు.

నేనుచెప్పువరకూ కదలకు.”అని ఆదేశించాడు రాముడు. ఇక్కడ ఇలా ఉంటే, అక్కడ భరతుడు తన సేనలకు ఆజ్ఞఇచ్చాడు. “ఇక్కడ రాముని ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమము వద్ద శాంతికి భంగము కలగకూడదు. కాబట్టి సైన్యము అంతా ఈ పర్వతము చుట్టు విడిది చేయండి.” అని ఆజ్ఞాపించాడు. భరతుని ఆజ్ఞ ప్రకారము భరతుని సైన్యము చిత్రకూట పర్వతము చుట్టూ ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టనవతితమః సర్గః (98) >>

Ayodhya Kanda Sarga 96 In Telugu – అయోధ్యాకాండ షణ్ణవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 96

అయోధ్యాకాండం షణ్ణవతితమ (96వ) సర్గలో, భరతుడు రాముని వనవాసం నుండి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా సాగుతుంది. భరతుడు తన సైన్యంతో కలిసి చిత్రకూటానికి చేరుకుంటాడు. అక్కడ, అతను రాముడు, సీత, లక్ష్మణులను చూస్తాడు. రాముడు భరతుని ఆత్మీయతను, ప్రేమను గమనించి ఆనందిస్తాడు. భరతుడు రాముని తనతో తిరిగి రావలసిందిగా వేడుకుంటాడు. కానీ, రాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించడం ధర్మమని, వనవాసం పూర్తి చేయడం తన కర్తవ్యమని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి వచ్చేవరకు పాలన చేస్తానని చెప్పి అయోధ్యకు తిరిగి వెళ్తాడు.

లక్ష్మణక్రోధః

తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరినిమ్నగామ్ |
నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్ || ౧ ||

ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా |
ఏవమాస్తే స ధర్మాత్మా సీతయా సహ రాఘవః || ౨ ||

తథా తత్రాసతస్తస్య భరతస్యోపయాయినః |
సైన్యరేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాస్తాం నభస్పృశౌ || ౩ ||

ఏతస్మిన్నంతరే త్రస్తాః శబ్దేన మహతా తతః |
అర్దితా యూథపా మత్తాః సయూథా దుద్రువుర్దిశః || ౪ ||

స తం సైన్యసముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవః |
తాంశ్చ విప్రద్రుతాన్ సర్వాన్ యూథపానన్వవైక్షత || ౫ ||

తాంశ్చ విద్రవతో దృష్ట్వా తం చ శ్రుత్వా చ నిస్వనమ్ |
ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్తతేజసమ్ || ౬ ||

హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయా |
భీమస్తనితగంభీరస్తుములః శ్రూయతే స్వనః || ౭ ||

గజయూథాని వాఽరణ్యే మహిషా వా మహావనే |
విత్రాసితా మృగాః సింహైః సహసా ప్రద్రుతా దిశః || ౮ ||

రాజా వా రాజమాత్రో వా మృగయామటతే వనే |
అన్యద్వా శ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి || ౯ ||

సుదుశ్చరో గిరిశ్చాయం పక్షిణామపి లక్ష్మణ |
సర్వమేతద్యథాతత్త్వమచిరాజ్ఞాతుమర్హసి || ౧౦ ||

స లక్ష్మణః సంత్వరితః సాలమారుహ్య పుష్పితమ్ |
ప్రేక్షమాణో దిశస్సర్వాః పూర్వాం దిశముదైక్షత || ౧౧ ||

ఉదఙ్ముఖః ప్రేక్షమాణో దదర్శ మహతీం చమూమ్ |
రథాశ్వగజసంబాధాం యత్తైర్యుక్తాం పదాతిభిః || ౧౨ ||

తామశ్వగజసంపూర్ణాం రథధ్వజవిభూషితామ్ |
శశంస సేనాం రామాయ వచనం చేదమబ్రీత్ || ౧౩ ||

అగ్నిం సంశమయత్వార్యః సీతా చ భజతాం గుహామ్ |
సజ్యం కురుష్వ చాపం చ శరాంశ్చ కవచం తథా || ౧౪ ||

తం రామః పురుషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ హ |
అంగావేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చమూమ్ || ౧౫ ||

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ |
దిధక్షన్నివ తాం సేనాం రుషితః పావకో యథా || ౧౬ ||

సంపన్నం రాజ్యమిచ్ఛంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనమ్ |
ఆవాం హంతుం సమభ్యేతి కైకేయ్యా భరతః సుతః || ౧౭ ||

ఏష వై సుమహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే |
విరాజత్యుద్గతస్కంధః కోవిదారధ్వజో రథే || ౧౮ ||

భజంత్యేతే యథాకామమశ్వానారుహ్య శీఘ్రగాన్ |
ఏతే భ్రాజంతి సంహృష్టా గజానారుహ్య సాదినః || ౧౯ ||

గృహీతధనుషౌ చావాం గిరిం వీరశ్రయావహై |
అథవేహైవ తిష్ఠావః సన్నద్ధావుద్యతాయుధౌ || ౨౦ ||

అపి నౌ వశమాగచ్ఛేత్ కోవిదారధ్వజో రణే |
అపి ద్రక్ష్యామి భరతం యత్కృతే వ్యసనం మహత్ || ౨౧ ||

త్వయా రాఘవ సంప్రాప్తం సీతయా చ మయా తథా |
యన్నిమిత్తం భవాన్ రాజ్యాచ్చ్యుతో రాఘవ శాశ్వతాత్ || ౨౨ ||

సంప్రాప్తోఽయమరిర్వీర భరతో వధ్యైవ మే |
భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ || ౨౩ ||

పూర్వాపకారిణాం త్యాగే న హ్యధర్మో విధీయతే |
పూర్వాపకారీ భరతస్త్యక్తధర్మశ్చ రాఘవ || ౨౪ ||

ఏతస్మిన్నిహతే కృత్స్నామనుశాధి వసుంధరామ్ |
అద్య పుత్రం హతం సంఖ్యే కైకేయీ రాజ్యకాముకా || ౨౫ ||

మయా పశ్యేత్సుదుఃఖార్తా హస్తిభగ్నమివ ద్రుమమ్ |
కైకేయీం చ వధిష్యామి సానుబంధాం సబాంధవామ్ || ౨౬ ||

కలుషేణాద్య మహతా మేదినీ పరిముచ్యతామ్ |
అద్యేమం సంయతం క్రోధమసత్కారం చ మానద || ౨౭ ||

మోక్ష్యామి శత్రుసైన్యేషు కక్షేష్వివ హుతాశనమ్ |
అద్యైతచ్చిత్రకూటస్య కాననం నిశితైః శరైః || ౨౮ ||

భిందన్ శత్రుశరీరాణి కరిష్యే శోణితోక్షితమ్ |
శరైర్నిర్భిన్నహృదయాన్ కుంజరాంస్తురగాంస్తథా || ౨౯ ||

శ్వాపదాః పరికర్షంతు నరాంశ్చ నిహతాన్మయా |
శరాణాం ధనుషశ్చాహమనృణోఽస్మి మహామృధే |
ససైన్యం భరతం హత్వా భవిష్యామి న సంశయః || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమః సర్గః || ౯౬ ||

Ayodhya Kanda Sarga 96 Meaning In Telugu

ఆ విధంగా మందాకినీ నదీతీరములో ఆనందముగా విహరిస్తున్న సీతా రాములకు, భరతుని సైన్యము వచ్చునప్పుడు రేగిన ధూళి కనపడింది. సేనలు వచ్చునపుడు పుట్టే ధ్వనులు, ఏనుగుల ఘీంకారములు, అశ్వముల పదఘట్టనములు, సైనికుల కోలాహలము రామునికి లీలామాత్రంగా వినపడ్డాయి. ఆ సైన్యముల రాకతో భయపడి పారిపోతున్న మృగములను కూడా చూచాడు రాముడు.

రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! . జాగ్రత్తగా విను. ఏదో మహా సైన్యము వచ్చుచున్న సవ్వడి వినిపించడంలేదూ! ఆ ఏనుగుల ఘీంకారములు, సైనికుల పదఘట్టనములు, గుర్రముల సకిలింపులు, సైన్యములకు బెదిరి పారిపోవు అడవిమృగములు–ఇవన్నీ చూస్తుంటే ఏదో మహాసైన్యముఇక్కడకు వస్తున్నట్టు కనపడుతూఉంది. ఇక్కడకు సైన్యము రావడం ఆశ్చర్యం గా ఉంది. ఎవరైనా రాజ కుమారుడు ఈ అరణ్యమునకు వేట నిమిత్తము వచ్చాడా! లేక ఏదైనా భయంకర మృగముల దండు ఈ అరణ్యములోని ప్రవేశించిందా! నీవు పోయి దాని విషయం కనుక్కొనిరా.”అని అన్నాడు రాముడు.

వెంటనే లక్ష్మణుడు పోయి ఒక పొడుగాటి సాలవృక్షమును ఎక్కాడు. నలుదిక్కులా చూచాడు. తూర్పు దిక్కునుంచి వస్తున్న ఒక రథ, గజ, తురగ, పదాతి దళములతో కూడిన మహా సైన్యము కనపడింది. లక్ష్మణుడు వెంటనే చెట్టు దిగి వచ్చి ఆ సైన్యము రాక గురించి రామునికి చెప్పాడు. వెంటనే రాముడు తగుజాగ్రత్తలు తీసుకున్నాడు. బయట మండుతున్న అగ్నిని ఆర్పివేసారు. సీతను ఒక గుహలో దాచిపెట్టారు. రామలక్ష్మణులు ఇద్దరూ తమతమ వింటినారిని సంధించారు. అమ్ములపొదులను సరిచేసుకున్నారు. కవచములను ధరించారు.

మరలా రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆసేన ఎవరిదో ఆనవాలు పట్టగలవా!” అని అడిగాడు. మరలా లక్ష్మణుడు చెట్టు ఎక్కి పరిశీలనగా పతాకములను చూచి అవి అయోధ్యానగరపతాకములు అని గుర్తించాడు. చెట్టు దిగివచ్చి “అన్నయ్యా! అది భరతునిసేన. భరతుడుసేనా సమేతంగా ఇక్కడకు వస్తున్నాడు. భరతుడు తన మార్గమును నిష్కంటకము చేయదలచుకొని మనలనిద్దరినీ చంపడానికి వస్తున్నాడని నా ఊహ. ఆ రథము మీద అయోధ్య రాజ చిహ్నమగు కోవిదార వృక్షము గల పతాకము ఎగురుతూ ఉంది. రామా! మనము ఇద్దరమూ ఇక్కడే ఉందామా! లేక పర్వతశిఖరములు ఎక్కి అక్కడ పొంచి ఉందామా! ఈ భరతుడు మనలను ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక తన సైన్యముతో మనమీదకు దాడి వస్తున్నాడు. ఏం చేద్దాము? రామా! ఎవరి కొరకు కైక నిన్ను అడవులకు పంపిందో, ఆ భరతుడు నీ మీదికి వస్తున్నాడు.

కాబట్టి భరతుడు మనకు శత్రువు. శత్రుడైన భరతుడు చంపతగ్గవాడు. భరతుడు నీ రాజ్యము అపహరించి నీకు అపకారమే చేసాడు. కాబట్టి అతనిని చంపుటలో దోషము ఏమీ లేదు. నేను భరతుని సంహరిస్తాను. నీ రాజ్యము నీకు ఇప్పిస్తాను. అడవులలో ఉన్న మనలను వదలకుండా, భరతుడు మన మీదికి వచ్చినపుడు అతనిని సంహరించడంలో తప్పులేదు కదా! దీనితో కైకకు తగినశాస్తి జరుగుతుంది. నాచే చంపబడిన భరతుని చూచి కైక కుళ్లి కుళ్లి ఏడవాలి. అలా ఏడుస్తున్న కైకను కూడా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను. దానితో పాపశేషము తొలగిపోతుంది. పాపాత్ముల నుండి భూదేవికి విముక్తి కలుగుతుంది. నాడు నిన్ను అడవులకు పంపునపుడు నాకు వచ్చిన కోపము ఈ రోజుతో చల్లారుతుంది. మన శత్రువుల రక్తంతో ఈ చిత్రకూట పర్వతమును తడిపివేస్తాను. భరతుని చతురంగ బలముల శవాలతో ఈ అడవిలో ఉన్న క్రూరమృగములు విందు చేసుకుంటాయి. నేను ఈ ధనురాణములు ధరించినందుకు, భరతుని సేనలను చంపి వాటి ఋణం తీర్చుకుంటాను. ఇందుకుసందేహము లేదు.”అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తనవతితమః సర్గః (97) >>

Aranya Kanda Sarga 23 In Telugu – అరణ్యకాండ త్రయోవింశః సర్గః

Aranya Kanda Sarga 23 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – త్రయోవింశః సర్గలో, రాముడు సీతను దుర్భాషలాడిన రాక్షసిని దండిస్తాడు. సీతకు సాంత్వన చెప్పి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత రాముడు సీతను తోటలో తిరగడానికి తీసుకెళతాడు. సీత రాముడికి ధైర్యం చెబుతూ తమ ప్రయాణం సాఫల్యం చెందాలని కోరుకుంటుంది. రాముడు సీతకు విశ్వాసాన్ని నూరిపోస్తాడు.

|| ఉత్పాతదర్శనమ్ ||

తస్మిన్ యాతే జనస్థానాదశివం శోణితోదకమ్ |
అభ్యవర్షన్మహామేఘస్తుములో గర్దభారుణః ||

1

నిపేతుస్తురగాస్తస్య రథయుక్తా మహాజవాః |
సమే పుష్పచితే దేశే రాజమార్గే యదృచ్ఛయా ||

2

శ్యామం రుధిరపర్యంతం బభూవ పరివేషణమ్ |
అలాతచక్రప్రతిమం పరిగృహ్య దివాకరమ్ ||

3

తతో ధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితమ్ |
సమాక్రమ్య మహాకాయస్తస్థౌ గృధ్రః సుదారుణః ||

4

జనస్థానసమీపే తు సమాగమ్య ఖరస్వనాః |
విస్వరాన్వివిధాంశ్చక్రుర్మాంసాదా మృగపక్షిణః ||

5

వ్యాజహ్రుశ్చ ప్రదీప్తాయాం దిశి వై భైరవస్వనమ్ |
అశివం యాతుధానానాం శివా ఘోరా మహాస్వనాః ||

6

ప్రభిన్నగిరిసంకాశాస్తోయశోణితధారిణః |
ఆకాశం తదనాకాశం చక్రుర్భీమా బలాహకాః ||

7

బభూవ తిమిరం ఘోరముద్ధతం రోమహర్షణమ్ |
దిశో వా విదిశో వాఽపి న చ వ్యక్తం చకాశిరే ||

8

క్షతజార్ద్రసవర్ణాభా సంధ్యా కాలం వినా బభౌ |
ఖరస్యాభిముఖా నేదుస్తదా ఘోరమృగాః ఖగాః ||

9

కంకగోమాయుగృధ్రాశ్చ చుక్రుశుర్భయశంసినః |
నిత్యాశుభకరా యుద్ధే శివా ఘోరనిదర్శనాః ||

10

నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననైః |
కబంధః పరిఘాభాసో దృశ్యతే భాస్కరాంతికే ||

11

జగ్రాహ సూర్యం స్వర్భానురపర్వణి మహాగ్రహః |
ప్రవాతి మారుతః శీఘ్రం నిష్ప్రభోఽభూద్దివాకరః ||

12

ఉత్పేతుశ్చ వినా రాత్రిం తారాః ఖద్యోతసప్రభాః |
సంలీనమీనవిహగా నలిన్యః శుష్కపంకజాః ||

13

తస్మిన్ క్షణే బభూవుశ్చ వినా పుష్పఫలైర్ద్రుమాః |
ఉద్ధూతశ్చ వినా వాతం రేణుర్జలధరారుణః ||

14

వీచీకూచీతి వాశ్యంత్యో బభూవుస్తత్ర శారికాః |
ఉల్కాశ్చాపి సనిర్ఘాతా నిపేతుర్ఘోరదర్శనాః ||

15

ప్రచచాల మహీ సర్వా సశైలవనకాననా |
ఖరస్య చ రథస్థస్య నర్దమానస్య ధీమతః ||

16

ప్రాకంపత భుజః సవ్యః స్వరశ్చాస్యావసజ్జత |
సాస్రా సంపద్యతే దృష్టిః పశ్యమానస్య సర్వతః ||

17

లలాటే చ రుజా జాతా న చ మోహాన్న్యవర్తత |
తాన్ సమీక్ష్య మహోత్పాతానుత్థితాన్రోమహర్షణాన్ ||

18

అబ్రవీద్రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్ స ఖరస్తదా |
మహోత్పాతానిమాన్ సర్వానుత్థితాన్ ఘోరదర్శనాన్ ||

19

న చింతయామ్యహం వీర్యాద్బలవాన్ దుర్బలానివ |
తారా అపి శరైస్తీక్ష్ణైః పాతయామి నభఃస్థలాత్ ||

20

మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహమ్ |
రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చాస్య లక్ష్మణమ్ ||

21

అహత్వా సాయకైస్తీక్ష్ణైర్నోపావర్తితుముత్సహే |
సకామా భగినీ మేఽస్తు పీత్వా తు రుధిరం తయోః ||

22

యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య విపర్యయః |
న క్వచిత్ప్రాప్తపూర్వో మే సంయుగేషు పరాజయః ||

23

యుష్మాకమేతత్ప్రత్యక్షం నానృతం కథయామ్యహమ్ |
దేవరాజమపి క్రుద్ధో మత్తైరావతయాయినమ్ ||

24

వజ్రహస్తం రణే హన్యాం కిం పునస్తౌ కుమానుషౌ |
సా తస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచమూః ||

25

ప్రహర్షమతులం లేభే మృత్యుపాశావపాశితా |
సమీయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ||

26

ఋషయో దేవగంధర్వాః సిద్ధాశ్చ సహ చారణైః |
సమేత్య చోచుః సహితాస్తేఽన్యోన్యం పుణ్యకర్మణః ||

27

స్వస్తి గోబ్రాహ్మణేభ్యోఽస్తు లోకానాం యేఽభిసంగతాః |
జయతాం రాఘవః సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్ ||

28

చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్ |
ఏతచ్చాన్యచ్చ బహుశో బ్రువాణాః పరమర్షయః ||

29

జాతకౌతూహలాస్తత్ర విమానస్థాశ్చ దేవతాః |
దదృశుర్వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషామ్ ||

30

రథేన తు ఖరో వేగాదుగ్రసైన్యో వినిఃసృతః |
తం దృష్ట్వా రాక్షసం భూయో రాక్షసాశ్చ వినిఃసృతాః ||

31

శ్యేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః |
దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః ||

32

మేఘమాలీ మహామాలీ సర్పాస్యో రుధిరాశనః |
ద్వాదశైతే మహావీర్యాః ప్రతస్థురభితః ఖరమ్ ||

33

మహాకపాలః స్థూలాక్షః ప్రమాథీ త్రిశిరాస్తథా |
చత్వార ఏతే సేనాన్యో దూషణం పృష్ఠతో యయుః ||

34

సా భీమవేగా సమరాభికామా
మహాబలా రాక్షసవీరసేనా |
తౌ రాజపుత్రౌ సహసాఽభ్యుపేతా
మాలా గ్రహాణామివ చంద్రసూర్యౌ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశః సర్గః ||

Aranya Kanda Sarga 23 Meaning In Telugu PDF

రాముని మీదికి ఉత్సాహంగా బయలుదేరిన ఖరునికి ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. వారి మీద రక్తవర్షము కురిసింది. ఖరుని రథమునకు కట్టిన గుర్రములు సమతలప్రదేశము మీద కూడా తడబడుతూ పరుగెడుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఖరుని రథముమీద ఎగురుతున్న ధ్వజము మీద నిలబడింది. అనేకములైన క్రూర మృగములు జనస్థానము వద్ద గుమిగూడి వికృతంగా అరుస్తున్నాయి. ఒక పక్కనుంచి నక్కలు తలలు పైకెత్తి ఏదో అమంగళము జరగబోతున్నట్టు కూస్తున్నాయి. పక్షులు, డేగలు, గ్రద్దలు ఖరుని రథానికి అడ్డంగా ఎగురుతున్నాయి.

ఇంతలో సాయం సమయం అయింది.. గ్రహణ కాలం కాకుండానే రాహువు సూర్యుని మింగుతున్నాడా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు. ఆకాశంనుండి ఉల్కాపాతం జరిగింది. స్వల్పంగా భూమి కంపించింది. రథం మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న ఖరుడికి ఎడమ భుజము అదిరింది. మాట తడబడుతూ ఉంది. కళ్లు మండటం మొదలెట్టాయి.

ఇన్ని అపశకునాలు కనపడుతున్నా ఖరుడు చలించలేదు. వెనుకకు మరలలేదు. ముందుకు దూకుతున్నాడు. “సైనికులారా! ఈ ఉత్పాతాలకు భయపడకండి. ఇలాంటివి పిరికి వాళ్లను భయపెడతాయి కానీ మనలను కాదు. ధైర్యంగా ముందుకు దూకండి. ఆ రామలక్ష్మణులను చంపి గానీ వెనకకు తిరగ వద్దు. వాళ్లను చంపి వాళ్ల రక్తం తాగితేనే గానీ నా సోదరి శూర్పణఖ అవమానము చల్లారదు. మనం ఎన్నడూ యుద్ధంలో ఓడిపోలేదు. ఇప్పుడూ ఓడిపోము. నేను తల్చుకుంటే ఆ దేవేంద్రుని కూడా సంహరించగలను. ఈ మానవులు ఎంత?” అని ఖరుడు తనకు తానే ధైర్యము చెప్పుకుంటూ సేనలను ఉత్సాహపరుస్తున్నాడు.

ఈ విధంగా రాక్షసులు యుద్ధానికి కదలడం చూచి ఆ అడవిలో ఉన్న ఋషులు, మునులు, ఏంజరుగుతుందో అని ఆతురతగా చూస్తున్నారు. అందరూ లోక క్షేమాన్ని కోరి (అంటే రాక్షస సంహారాన్ని కోరి) ప్రార్థనలు చేస్తున్నారు. “చక్రాయుధమును ధరించిన శ్రీమహావిష్ణువు దానవులను సంహరించినట్టు ధనుర్ధారి అయిన రాముడు రాక్షస సంహారము చేయుగాక!” అని మనసులో ఆకాంక్షిస్తున్నారు. ఇంక పైనుంచి దేవతలు విమానములు ఎక్కి రాక్షస సైన్యమును చూస్తున్నారు. ఖరుని సేనలో పన్నెండు మంది మహావీరులైన రాక్షసులు ఉన్నారు.

వారు శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సరాస్యుడు, రుధిరాశనుడు ( పైన చెప్పి పేర్లలో వారి అలవాట్లు, గుణగణాలు ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు… శ్యేనగామి పక్షిలా తిరిగేవాడు. యజ్ఞశత్రువు = యజ్ఞములను పాడుచేసేవాడు, విహంగముడు=పక్షిలా ఎగిరేవాడు, పరుషుడు=ఎప్పుడూ పరుషంగా, కఠినంగా మాట్లాడేవాడు, రుధిరాశనుడు=రక్తం తాగేవాడు). వీరే కాకుండా దూషణుని వెంట మహాకపాలి,, స్థూలాక్షుడు, ప్రమాథీ, త్రిశిరస్సుడు అనే మరో నలుగురు రాక్షస సేనానాయకులు తమ తమ సేనలతో నడుస్తున్నారు. వీరందరూ రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళుతున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుర్వింశః సర్గః (24) >>

Aranya Kanda Sarga 20 In Telugu – అరణ్యకాండ వింశః సర్గః

Aranya Kanda Sarga 20 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, పద్నాలుగు రాక్షసులు శూర్పణఖచే మార్గనిర్దేశం చేయబడిన రాముని కుటీరానికి చేరుకుంటారు మరియు వారు రాముడితో యుద్ధం చేస్తారు, అందులో రాముడు వారి ఆయుధాలన్నింటినీ నాశనం చేస్తాడు మరియు వారందరినీ నాశనం చేస్తాడు. ఈ ఓటమిని చూసిన శూర్పణఖ ఓటమిని నివేదించడానికి తన సోదరుడి వద్దకు తిరిగి వెళుతుంది.

చతుర్దశరక్షోవధః

తతః శూర్పణఖా ఘోరా రాఘవాశ్రమమాగతా |
రక్షసామాచచక్షే తౌ భ్రాతరౌ సహ సీతయా ||

1

తే రామం పర్ణశాలాయాముపవిష్టం మహాబలమ్ |
దదృశుః సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ ||

2

తాన్ దృష్ట్వా రాఘవః శ్రీమానాగతాం తాం చ రాక్షసీమ్ |
అబ్రవీద్భ్రాతరం రామో లక్ష్మణం దీప్తతేజసమ్ ||

3

ముహూర్తం భవ సౌమిత్రే సీతాయాః ప్రత్యనంతరః |
ఇమానస్యా వధిష్యామి పదవీమాగతానిహ ||

4

వాక్యమేతత్తతః శ్రుత్వా రామస్య విదితాత్మనః |
తథేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్ ||

5

రాఘవోఽపి మహచ్చాపం చామీకరవిభూషితమ్ |
చకార సజ్యం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవీత్ ||

6

పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ |
ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనమ్ ||

7

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ ||

8

యుష్మాన్పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే |
ఋషీణాం తు నియోగేన ప్రాప్తోఽహం సశరాయుధః ||

9

తిష్ఠతైవాత్ర సంతుష్టా నోపావర్తితుమర్హథ |
యది ప్రాణైరిహార్థో వా నివర్తధ్వం నిశాచరాః ||

10

తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ |
ఊచుర్వాచం సుసంక్రుద్ధా బ్రహ్మఘ్నాః శూలపాణయః ||

11

సంరక్తనయనా ఘోరా రామం సంరక్తలోచనమ్ |
పరుషం మధురాభాషం హృష్టా దృష్టపరాక్రమమ్ ||

12

క్రోధముత్పాద్య నో భర్తుః ఖరస్య సుమహాత్మనః |
త్వమేవ హాస్యసే ప్రాణానద్యాస్మాభిర్హతో యుధి ||

13

కా హి తే శక్తిరేకస్య బహూనాం రణమూర్ధని |
అస్మాకమగ్రతః స్థాతుం కిం పునర్యోద్ధుమాహవే ||

14

ఏహి బాహుప్రయుక్తైర్నః పరిఘైః శూలపట్టిశైః |
ప్రాణాంస్త్యక్ష్యసి వీర్యం చ ధనుశ్చ కరపీడితమ్ ||

15

ఇత్యేవముక్త్వా సంక్రుద్ధా రాక్షసాస్తే చతుర్దశ |
ఉద్యతాయుధనిస్త్రింశా రామమేవాభిదుద్రువుః ||

16

చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయమ్ |
తాని శూలాని కాకుత్స్థః సమస్తాని చతుర్దశ ||

17

తావద్భిరేవ చిచ్ఛేద శరైః కాంచనభూషణైః |
తతః పశ్చాన్మహాతేజా నారాచాన్ సూర్యసన్నిభాన్ ||

18

జగ్రాహ పరమక్రుద్ధశ్చతుర్దశ శిలాశితాన్ |
గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ||

19

ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివ శతక్రతుః |
రుక్మపుంఖాశ్చ విశిఖా దీప్తా హేమవిభూషితాః ||

20

తే భిత్త్వా రక్షసాం వేగాద్వక్షాంసి రుధిరాప్లుతాః |
వినిష్పేతుస్తదా భూమౌ న్యమజ్జంతాశనిస్వనాః ||

21

తే భిన్నహృదయా భూమౌ ఛిన్నమూలా ఇవ ద్రుమాః |
నిపేతుః శోణితార్ద్రాంగా వికృతా విగతాసవః ||

22

తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛితా |
పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజద్భైరవస్వనాన్ ||

23

సా నదంతీ మహానాదం జవాచ్ఛూర్పణఖా పునః |
ఉపగమ్య ఖరం సా తు కించిత్సంశుష్కశోణితా ||

24

పపాత పునరేవార్తా సనిర్యాసేవ సల్లకీ |
భ్రాతుః సమీపే శోకార్తా ససర్జ నినదం మహుః |
సస్వరం ముమోచే బాష్పం విషణ్ణవదనా తదా ||

25

నిపాతితాన్ దృష్య రణే తు రాక్షసాన్
ప్రధావితా శూర్పణఖా పునస్తతః |
వధం చ తేషాం నిఖిలేన రక్షసాం
శశంస సర్వం భగినీ ఖరస్య సా ||

26

Aranya Kanda Sarga 20 In Telugu Pdf Download

శూర్పణఖ ఆ పదునాలుగు మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకొని వెళ్లింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాసి అయిన సీతను చూచారు.

రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు.” అని అన్నాడు.

లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు.

“ఓ రాక్షసులారా! నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గానీ, మా లాంటి తాపసులు కానీ మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు. చంపుతున్నారు. మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోండి. లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణాలు పోగొట్టుకోండి.” అని అన్నాడు రాముడు.

ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటి దాకా వారిని చూచి భయపడ్డవారే గానీ, వారిని ఎదిరించి భయపెట్టిన వారు లేరు. అలాంటిది వీళ్లు ఎదిరిస్తున్నారు అంటే కోపం ఆపుకోలేకపోయారు.

“మా ప్రభువు ఖరుడు. నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులు కోసి, అవమానించి, ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బతకడం కల్ల. ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము. నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములు నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సు వదిలిపారిపోతావు. కాచుకో!” అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదికి తమ తమ ఆయుధములను విసిరారు.

రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్కబాణంతో ముక్కలు చేసాడు. తరువాత రాముడు 14 నారాచములను వారి మీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేసాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్ద అయినాయి. వారి గుండెలు చీలడంతో, ఆ 14 మంది రాక్షసులు నేల మీద పడి ప్రాణాలు వదిలారు.

శూర్పణఖ ఆశ్చర్యంలో ఆ రాక్షసుల వంక చూచింది. రామలక్ష్మణుల వంక చూచింది. శూర్పణఖకు కోపము, భయము, ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలు పెట్టింది. అక్కడి నుండి పరుగెత్తింది. ఖరుని వద్దకు పరుగుపరుగున వచ్చింది. ఖరుని ముందు నేల మీద పడి భోరు భోరున ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకవింశః సర్గః (21) >>

Ayodhya Kanda Sarga 95 In Telugu – అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 95 In Telugu

అయోధ్యాకాండం పంచనవతితమ (95వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయాలనుకుంటాడు. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయిని క్షమించి, ఆమెను ఆత్మీయంగా అంగీకరిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను మెచ్చుకుంటారు. తరువాత, భరతుడు వశిష్ఠుడితో కలిసి సర్పసముద్రం అనే ప్రాంతానికి వెళ్ళి రాముని పాదుకలను గౌరవంగా తీసుకుని వస్తాడు. భరతుడు, రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి రాకముందు వరకు తాను పాలనను పర్యవేక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని విధి నిష్ఠను, రాముడిపై ప్రేమను ప్రతిబింబిస్తుంది.

మందాకినీవర్ణనా

అథ శైలాద్వినిష్క్రమ్య మైథిలీం కోసలేశ్వరః |
అదర్శయచ్ఛుభజలాం రమ్యాం మందాకినీం నదీమ్ || ౧ ||

అబ్రవీచ్చ వరారోహాం చారుచంద్రనిభాననామ్ |
విదేహరాజస్య సుతాం రామో రాజీవలోచనః || ౨ ||

విచిత్రపులినాం రమ్యాం హంససారససేవితామ్ |
కమలైరుపసంపన్నాం పశ్య మందాకినీం నదీమ్ || ౩ ||

నానావిధైస్తీరరుహైర్వృతాం పుష్పఫలద్రుమైః |
రాజంతీం రాజరాజస్య నలినీమివ సర్వతః || ౪ ||

మృగయూథనిపీతాని కలుషాంభాంసి సాంప్రతమ్ |
తీర్థాని రమణీయాని రతిం సంజనయంతి మే || ౫ ||

జటాజినధరాః కాలే వల్కలోత్తరవాససః |
ఋషయస్త్వవగాహంతే నదీం మందాకినీం ప్రియే || ౬ ||

ఆదిత్యముపతిష్ఠంతే నియమాదూర్ధ్వబాహవః |
ఏతే పరే విశాలాక్షి మునయః సంశితవ్రతాః || ౭ ||

మారుతోద్ధూతశిఖరైః ప్రనృత్త ఇవ పర్వతః |
పాదపైః పత్రపుష్పాణి సృజద్భిరభితో నదీమ్ || ౮ ||

క్వచిన్మణినికాశోదాం క్వచిత్పులినశాలినీమ్ |
క్వచిత్సిద్ధజనాకీర్ణాం పశ్య మందాకినీం నదీమ్ || ౯ ||

నిర్ధూతాన్ వాయునా పశ్య వితతాన్పుష్పసంచయాన్ |
పోప్లూయమానానపరాన్ పశ్య త్వం జలమధ్యగాన్ || ౧౦ ||

తాంశ్చాతివల్గువచసో రథాంగాహ్వయనా ద్విజాః |
అధిరోహంతి కళ్యాణి వికూజంతః శుభా గిరః || ౧౧ ||

దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాశ్చ శోభనే |
అధికం పురవాసాచ్చ మన్యే చ తవ దర్శనాత్ || ౧౨ ||

విధూతకలుషైః సిద్ధైస్తపోదమశమాన్వితైః |
నిత్యవిక్షోభితజలాం విగాహస్వ మయా సహ || ౧౩ ||

సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీమ్ |
కమలాన్యవమజ్జంతీ పుష్కరాణి చ భామిని || ౧౪ ||

త్వం పౌరజనవద్వ్యాలానయోధ్యామివ పర్వతమ్ |
మన్యస్వ వనితే నిత్యం సరయూవదిమాం నదీమ్ || ౧౫ ||

లక్ష్మణశ్చాపి ధర్మాత్మా మన్నిదేశే వ్యవస్థితః |
త్వం చానుకూలా వైదేహి ప్రీతిం జనయథో మమ || ౧౬ ||

ఉపస్పృశంస్త్రిషవణం మధుమూలఫలాశనః |
నాయోధ్యాయై న రాజ్యాయ స్పృహయేఽద్య త్వయా సహ || ౧౭ ||

ఇమాం హి రమ్యాం మృగయూథశాలినీం
నిపీతతోయాం గజసింహవానరైః |
సుపుష్పితైః పుష్పధరైరలంకృతాం
న సోఽస్తి యః స్యాదగతక్లమః సుఖీ || ౧౮ ||

ఇతీవ రామో బహుసంగతం వచః
ప్రియాసహాయః సరితం ప్రతి బ్రువన్ |
చచార రమ్యం నయనాంజనప్రభమ్
స చిత్రకూటం రఘువంశవర్ధనః || ౧౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచనవతితమః సర్గః || ౯౫ ||

Ayodhya Kanda Sarga 95 Meaning In Telugu

రాముడు సీతతో కలిసి మందాకినీ నదీ తీరంలో విహరిస్తున్నాడు.
“సీతా! ఈ మందాకినీ నదీతీరము చూడు. ఎంత సుందరముగా ఉన్నదో! ఆఇసుక తిన్నెలు, నదీజలములలో ఈదుచున్న హంసలు, పైన ఎగురుచున్న సారస పక్షులు, జలముల మీద తేలుచున్న పద్మములు ఎంత శోభాయమానముగా ఉన్నవో చూడు! అదుగో ఆ లేళ్ల గుంపులు నదీజలములు తాగుటకు ఎలా వస్తున్నాయోచూడు! ఆవల తీరమున ఋషులు మందాకినీ నదిలో స్నానం చేస్తున్నారు. మరికొందరు సూర్యోపాసన చేస్తున్నారు. సీతా! ఆ చక్రవాక పక్షులు ఎంత మధురంగా కూయుచున్నవో.

ఇంతటి మనోహరముగా ఉన్న ఈ నదీప్రాంతమును విడిచి వెళ్లుటకు మనసు రాకున్నది. అయోధ్య కన్నా ఇక్కడే బాగుంది కదూ! సీతా నీవు కూడా ఈ నదిలో దిగి జలక్రీడలు ఆడుతావా! ఈ చిత్రకూట పర్వతమే అయోధ్య అనుకో. ఈ మందాకినీ నది సరయూనది. హాయిగా నదిలో దిగి జలకాలాడు. నీవు, లక్ష్మణుడు, తోడుగా ఉండగా ఇంతటిసుందర ప్రదేశములలో విహరిస్తూ నేను అయోధ్యనే మరిచిపోతున్నాను. ప్రస్తుతము నాకు అయోధ్య మీద కాని, ఆ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు. ఇక్కడే ఉండాలని ఉంది.” అని అన్నాడు రాముడు.

(ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. రాముడి గురించి వారి వనవిహారము గురించి వాల్మీకి ఇంతగా రాయాల్సిన పనిలేదు. దీని వెనక ఏదో చెప్పాలని ఆయన తాపత్రయం. ఈరోజుల్లో ఉన్న ఊరి నుండి మరో ఊరికి ట్రాన్సఫర్ అయితే చాలు ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు బాధపడుతుంటారు కొందరు. ఉన్న ఊరు వదలడానికి తెగ బాధపడిపోతుంటారు. మరి కొంతమందికి ఏ ఊరిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా తృప్తి ఉండదు. ఏం ఊరు వెధవ ఊరు అని తిడుతూ ఉంటారు. అటువంటి వారికి రాముని వనవాసము ఒక గుణపాఠము.

రాముడు అయోధ్యకు యువరాజు. పుట్టినప్పటినుండి ఎన్నో రాజభోగములు అనుభవించాడు. విధివశాత్తు అరణ్యవాసం చెయ్యాల్సివచ్చింది. సంతోషంగా అడవులకు వచ్చాడు. అరణ్యములోనే సుఖాలను వెతుక్కుంటున్నాడు. అరణ్యమునే అయోధ్యగా మార్చుకున్నాడు. పైగా అరణ్యములోనే ఎక్కువసుఖం ఉందని మనసుకు నచ్చచెప్పుకుంటున్నాడు. ఉన్నదానినతో తృప్తి చెందుతున్నాడు. నిరాశకు నిస్పృహకు చోటు ఇవ్వలేదు.

‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అని ఒక సినీ కవి అన్నట్టు, బాధలలో కూడా సుఖాలను వెతుక్కోవడం మానవులకు అలవడాలి. అప్పుడే జీవితం సుఖమయమవుతుంది. ఈ జీవితసత్యాన్ని రాముడు తాను అనుభవించి మనకు తెలియజేస్తున్నాడు. అని నా భావన. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత

అయోధ్యాకాండ షణ్ణవతితమః సర్గః (96)

Aranya Kanda Sarga 22 In Telugu – అరణ్యకాండ ద్వావింశః సర్గః

Aranya Kanda Sarga 22 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్వావింశః సర్గలో, రావణుని సోదరి శూర్పణఖ పంచవటికి వస్తుంది. రాముడిని చూసి ఆమె ఆకర్షితురాలవుతుంది. రాముని ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంది, కానీ రాముడు సీతమ్మను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిరాశలో శూర్పణఖ తన రూపం మార్చుకుని లక్ష్మణుడి దగ్గరకు వెళుతుంది.

ఖరసంనాహః

ఏవమాధర్షితః శూరః శూర్పణఖ్యా ఖరస్తదా |
ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః ||

1

తవావమానప్రభవః క్రోధోఽయమతులో మమ |
న శక్యతే ధారయితుం లవణాంభ ఇవోత్థితమ్ ||

2

న రామం గణయే వీర్యాన్మానుషం క్షీణజీవితమ్ |
ఆత్మదుశ్చరితైః ప్రాణాన్ హతో యోఽద్య విమోక్ష్యతి ||

3

బాష్పః సంహ్రియతామేష సంభ్రమశ్చ విముచ్యతామ్ |
అహం రామం సహ భ్రాత్రా నయామి యమసాదనమ్ ||

4

పరశ్వధహతస్యాద్య మందప్రాణస్య సంయుగే |
రామస్య రుధిరం రక్తముష్ణం పాస్యసి రాక్షసి ||

5

సా ప్రహృష్టా వచః శ్రుత్వా ఖరస్య వదనాచ్చ్యుతమ్ |
ప్రశశంస పునర్మౌర్ఖ్యాద్భ్రాతరం రక్షసాం వరమ్ ||

6

తయా పరుషితః పూర్వం పునరేవ ప్రశంసితః |
అబ్రవీద్దూషణం నామ ఖరః సేనాపతిం తదా ||

7

చతుర్దశ సహస్రాణి మమ చిత్తానువర్తినామ్ |
రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినామ్ ||

8

నీలజీమూతవర్ణానాం ఘోరాణాం క్రూరకర్మణామ్ |
లోకహింసావిహారాణాం బలినాముగ్రతేజసామ్ ||

9

తేషాం శార్దూలదర్పాణాం మహాస్యానాం మహౌజసామ్ |
సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్య కారయ ||

10

ఉపస్థాపయ మే క్షిప్రం రథం సౌమ్య ధనూంషి చ |
శరాంశ్చిత్రాంశ్చ ఖడ్గశ్చ శక్తీశ్చ వివిధాః శితాః ||

11

అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనామ్ |
వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిద ||

12

ఇతి తస్య బ్రువాణస్య సూర్యవర్ణం మహారథమ్ |
సదశ్వైః శబలైర్యుక్తమాచచక్షేఽథ దూషణః ||

13

తం మేరుశిఖరాకారం తప్తకాంచనభూషణమ్ |
హేమచక్రమసంబాధం వైడూర్యమయకూబరమ్ ||

14

మత్స్యైః పుష్పైర్ద్రుమైః శైలైశ్చంద్రసూర్యైశ్చ కాంచనైః |
మంగళైః పక్షిసంఘైశ్చ తారాభిరభిసంవృతమ్ ||

15

ధ్వజనిస్త్రింశసంపన్నం కింకిణీకవిరాజితమ్ |
సదశ్వయుక్తం సోమర్షాదారురోహ ఖరో రథమ్ ||

16

నిశామ్య తు రథస్థం తం రాక్షసా భీమవిక్రమాః |
తస్థుః సంపరివార్యైనం దూషణం చ మహాబలమ్ ||

17

ఖరస్తు తాన్మహేష్వాసాన్ ఘోరవర్మాయుధధ్వజాన్ |
నిర్యాతేత్యబ్రవీద్దృష్టో రథస్థః సర్వరాక్షసాన్ ||

18

తతస్తద్రాక్షసం సైన్యం ఘోరవర్మాయుధధ్వజమ్ |
నిర్జగామ జనస్థానాన్మహానాదం మహాజవమ్ ||

19

ముద్గరైః పట్టిశైః శూలైః సుతీక్ష్ణైశ్చ పరశ్వధైః |
ఖడ్గైశ్చక్రైశ్చ హస్తస్థైర్భ్రాజమానైశ్చ తోమరైః ||

20

శక్తిభిః పరిఘైర్ఘోరైరతిమాత్రైశ్చ కార్ముకైః |
గదాసిముసలైర్వజ్రైర్గృహీతైర్భీమదర్శనైః ||

21

రాక్షసానాం సుఘోరాణాం సహస్రాణి చతుర్దశ |
నిర్యాతాని జనస్థానాత్ఖరచిత్తానువర్తినామ్ ||

22

తాంస్త్వభిద్రవతో దృష్ట్వా రాక్షసాన్ భీమవిక్రమాన్ |
ఖరస్యాపి రథః కించిజ్జగామ తదనంతరమ్ ||

23

తతస్తాన్ శబలానశ్వాంస్తప్తకాంచనభూషితాన్ |
ఖరస్య మతమాజ్ఞాయ సారథిః సమచోదయత్ ||

24

స చోదితో రథః శీఘ్రం ఖరస్య రిపుఘాతినః |
శబ్దేనాపూరయామాస దిశశ్చ ప్రదిశస్తదా ||

25

ప్రవృద్ధమన్యుస్తు ఖరః ఖరస్వనో
రిపోర్వధార్థం త్వరితో యథాఽంతకః |
అచూచుదత్ సారథిమున్నదన్ ఘనం
మహాబలో మేఘ ఇవాశ్మవర్షవాన్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వావింశః సర్గః ||

Aranya Kanda Sarga 22 Meaning In Telugu PDF

శూర్పణఖ తనను అన్న సూటీ పోటీ మాటలు అన్నీ మౌనంగా విన్నాడు ఖరుడు. అవమానభారంతో కుమిలిపోయాడు. అతనిలో పౌరుషం పెల్లుబికింది. కోపం తారస్థాయికి చేరుకుంది. శూర్పణఖను చూచి ఇలా అన్నాడు.

” నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను. నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది. ప్రతీకార జ్వాలలలో రగిలిపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మానవుడికి నేను భయపడడమా! ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు. వాడి ప్రాణాలు హరిస్తాను. నీవు ఏడవకు. వాడి మరణవార్తను నీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను. నా గొడ్డలితో వాడిని నరుకుతాను. వాడి వెచ్చని రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను. ఇది నా నిర్ణయము.” అని పలికాడు ఖరుడు.

“అదేంటి అన్నయ్యా! నీ పరాక్రమం గురించి నాకు తెలీయదా. నీకు సాటి వీరుడు ముల్లోకములలో ఎవరు ఉన్నారు. రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు.” అని పొగిడింది.

శూర్పణఖ మాటలతో ఉప్పొంగి పోయాడు ఖరుడు. వెంటనే తన సేనాపతులను పిలిచాడు.

“సేనాపతీ! మన దగ్గర 14 వేల మంది సైనికులు ఉన్నారు. కదా. వారినందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వారికి నాయకత్వము వహిస్తాను. నా కొరకు ఒక రథము, ఆయుధములు, ధనుస్సులు, బాణములు సిద్ధం చేయండి. మనమందరమూ ఆ రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము.” అని ప్రకటించాడు.

ఖరుడి మాట వినగానే దూషణుడు ఖరుడు కోరినట్టు రథం సిద్ధం చేసాడు. రథం తీసుకొచ్చి ఖరుడి ముందు నిలిపాడు. ఖరుడు ఆ రథం ఎక్కాడు. ఖరునికి దూషణునికి రక్షణగా రాక్షస వీరులు చుట్టు వలయాకారంలో నిలబడ్డారు. ఖరుడు అందరికీ బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు. జనస్థానమునుండి 14,000 మంది రాక్షసవీరులు ముద్గరలు, పట్టిసములు, శూలములు, పరశువులు, కత్తులు, చక్రాయుధములు, తోమరములు, శక్తి ఆయుధములు, పరిఘలు, కారుకములు (బాణములు), గదాయుధములు, ముసలములు, వజ్రాయుధములు ధరించి, రాముని మీదికి యుద్ధానికి బయలుదేరారు.

(ఇక్కడ కూడా 14 వేల మంది రాక్షస సైన్యము, బయలుదేరింది. ఇది మూడవ 14 సంఖ్య)

ముందు సైనికులు నడువగా ఖరుని రథము వారిని అనుసరించింది. ఖరుడు కోపంతో ఊగి పోతున్నాడు.

“త్వరగా పదండి. శత్రువును చంపండి. నరకండి” అని పెద్దగా అరుస్తున్నాడు.

ఖరుని అరుపులతో, రాక్షసవీరుల పదఘట్టనలతో ఆ అరణ్యము మార్మోగిపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయోవింశః సర్గః (23) >>

Ayodhya Kanda Sarga 94 In Telugu – అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 94

అయోధ్యాకాండం చతుర్నవతితమ (94వ) సర్గలో, భరతుడు వశిష్ఠ మహర్షితో కలిసి రాముని ఆశ్రమం వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అతని వెంట కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణాన్ని రాముని చెబుతాడు. రాముడు తండ్రి మరణ వార్త విని శోకసంద్రుడవుతాడు. భరతుడు రాముడిని అరణ్యవాసం నుండి తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన కర్తవ్యాన్ని సమర్థిస్తూ, తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం పూర్తి చేస్తానని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచుతానని, రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యం పాలిస్తానని అంగీకరిస్తాడు.

చిత్రకూటవర్ణనా

దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివనప్రియః |
వైదేహ్యాః ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్ || ౧ ||

అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ |
భార్యామమరసంకాశః శచీమివ పురందరః || ౨ ||

న రాజ్యాద్భ్రంశనం భద్రే న సుహృద్భిర్వినాభవః |
మనో మే బాధతే దృష్ట్వా రమణీయమిమం గిరిమ్ || ౩ ||

పశ్యేమమచలం భద్రే నానాద్విజగణాయుతమ్ |
శిఖరైః ఖమివోద్విద్ధైర్ధాతుమద్భిర్విభూషితమ్ || ౪ ||

కేచిద్రజతసంకాశాః కేచిత్ క్షతజసన్నిభాః |
పీతమాంజిష్ఠవర్ణాశ్చ కేచిన్మణివరప్రభాః || ౫ ||

పుష్పార్కకేతకాభాశ్చ కేచిజ్జ్యోతీరసప్రభాః |
విరాజంతేఽచలేంద్రస్య దేశా ధాతువిభూషితాః || ౬ ||

నానామృగగణద్వీపితరక్ష్వృక్షగణైర్వృతః |
అదుష్టైర్భాత్యయం శైలో బహుపక్షిసమాయుతః || ౭ ||

ఆమ్రజంబ్వసనైర్లోధ్రైః ప్రియాలైః పనసైర్ధవైః |
అంకోలైర్భవ్యతినిశైర్బిల్వతిందుకవేణుభిః || ౮ ||

కాశ్మర్యరిష్టవరుణైర్మధూకైస్తిలకైస్తథా |
బదర్యామలకైర్నీపైర్వేత్రధన్వనబీజకైః || ౯ ||

పుష్పవద్భిః ఫలోపేతైశ్ఛాయావద్భిర్మనోరమైః |
ఏవమాదిభిరాకీర్ణః శ్రియం పుష్యత్యయం గిరిః || ౧౦ ||

శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ |
కిన్నరాన్ ద్వంద్వశో భద్రే రమమాణాన్మనస్వినః || ౧౧ ||

శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ |
పశ్య విద్యాధరస్త్రీణాం క్రీడోద్ధేశాన్ మనోరమాన్ || ౧౨ ||

జలప్రపాతైరుద్భేదైర్నిష్యందైశ్చ క్వచిత్ క్వచిత్ |
స్రవద్భిర్భాత్యయం శైలః స్రవన్మద ఇవ ద్విపః || ౧౩ ||

గుహాసమీరణో గంధాన్ నానాపుష్పభవాన్వహన్ |
ఘ్రాణతర్పణమభ్యేత్య కం నరం న ప్రహర్షయేత్ || ౧౪ ||

యదీహ శరదోఽనేకాస్త్వయా సార్ధమనిందితే |
లక్ష్మణేన చ వత్స్యామి న మాం శోకః ప్రధక్ష్యతి || ౧౫ ||

బహుపుష్పఫలే రమ్యే నానాద్విజగణాయుతే |
విచిత్రశిఖరే హ్యస్మిన్ రతవానస్మి భామిని || ౧౬ ||

అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయమ్ |
పితుశ్చానృణతా ధర్మే భరతస్య ప్రియం తథా || ౧౭ ||

వైదేహి రమసే కచ్చిచ్చిత్రకూటే మయా సహ |
పశ్యంతీ వివిధాన్భావాన్ మనోవాక్కాయసమ్మతాన్ || ౧౮ ||

ఇదమేవామృతం ప్రాహుః రాజ్ఞి రాజర్షయః పరే |
వనవాసం భవార్థాయ ప్రేత్య మే ప్రపితామహాః || ౧౯ ||

శిలాః శైలస్య శోభంతే విశాలాః శతశోఽభితః |
బహులా బహుళైర్వర్ణైర్నీలపీతసితారుణైః || ౨౦ ||

నిశి భాంత్యచలేంద్రస్య హుతాశనశిఖా ఇవ |
ఓషధ్యః స్వప్రభాలక్ష్యా భ్రాజమానాః సహస్రశః || ౨౧ ||

కేచిత్ క్షయనిభా దేశాః కేచిదుద్యానసన్నిభాః |
కేచిదేకశిలా భాంతి పర్వతస్యాస్య భామిని || ౨౨ ||

భిత్త్వేవ వసుధాం భాతి చిత్రకూటః సముత్థితః |
చిత్రకూటస్య కూటోఽసౌ దృశ్యతే సర్వతః శుభః || ౨౩ ||

కుష్ఠపున్నాగస్థగరభూర్జపత్రోత్తరచ్ఛదాన్ |
కామినాం స్వాస్తరాన్ పశ్య కుశేశయదలాయుతాన్ || ౨౪ ||

మృదితాశ్చాపవిద్ధాశ్చ దృశ్యంతే కమలస్రజః |
కామిభిర్వనితే పశ్య ఫలాని వివిధాని చ || ౨౫ ||

వస్వౌకసారాం నళినీమత్యేతీవోత్తరాన్ కురూన్ |
పర్వతశ్చిత్రకూటోఽసౌ బహుమూలఫలోదకః || ౨౬ ||

ఇమం తు కాలం వనితే విజహ్రివాన్
త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ |
రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధనీం
సతాం పథి స్వైర్నియమైః పరైః స్థితః || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్నవతితమః సర్గః || ౯౪ ||

Ayodhya Kanda Sarga 94 Meaning In Telugu

భరతుడు రాముని గురించి వెతుకుతుంటే, రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి వివరిస్తున్నాడు. “సీతా!ఇక్కడ ఉన్న సౌందర్యశోభలను, ఈ వనముల అందములను చూచిన తరువాత ఇక్కడి నుండి అయోధ్యకు పోవాలని అనిపించడంలేదు. ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు, వన్యమృగములకు, పక్షులకు నిలయము. ఈ ప్రశాంత వాతావరణములో ఈ పర్వత శిఖరములను, వృక్షములను చూస్తూ ఎన్నాళ్లు ఉన్నా విసుగు అనిపించదు. ఈ అరణ్యములో వేప, మామిడి, నేరేడు, వేగిస, లోధ్ర, ప్రియాళ, పనస, చండ్ర, అంకోల, బిల్వ, తుమ్మ, వెదురు,కశ్మ, ఇప్ప, తిలక, బదరి, ఆమలక, పేము పొదలు, మద్ది మొదలగు వృక్షజాతులో నిండి ఉన్నది.

(వాల్మీకి తన రామాయణకావ్యంలో ఆనాడు ఉన్న వృక్షజాతులను తరువాతి తరాల వారికి పరిచయం చేస్తున్నాడు.)

ఓ సీతా! అటు చూడు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పర్వత శిఖరముల మీద జంట జంటలుగా విహరిస్తున్నారు. నేను ఈ వనవాసము చేయడం వలన నా తండ్రి మాటను నిలబెట్టడం, భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగి పోవడం లాంటి గొప్ప పనులు సాధించాను. దీని వలన నా పితృఋణము తీర్చుకున్నట్టు అయింది. నాతో పాటు నువ్వు కూడా నన్నుఅనుసరించి వచ్చి ఈ వనసౌందర్య మును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాజులకు మరణానంతరము ఉత్తమ లోకములు లభించుటకు వనవాసమే ఉ త్తమైనది అయి పూర్వపు రాజర్షులు చెప్పి ఉన్నారు కదా!

సీతా! ఈ చిత్రకూటపర్వతము మీద ఎన్నోఓషధులు ఉ న్నాయి. ఆ ఓషధుల మీది నుండి వీచే గాలి అన్ని రోగములను పోగొడుతుంది అని పెద్దలు చెబుతారు. సీతా! అటు చూడు! ఇక్కడ కొన్ని ప్రదేశములు సహజముగా ఏర్పడిన ఉద్యానవనముల మాదిరి, మరి కొన్ని పూపొదరిళ్లు గృహముల మాదిరి, కనపడుతున్నాయి కదా! ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడిఉన్నదో చూడు! ఇక్కడ కామాతురు లైన స్త్రీపురుషులు, ఈ నిర్జన ప్రదేశములలో కుష్ఠ, పున్నాగ, భూర్జర చెట్ల ఆకులతో శయ్యలు ఏర్పరచుకొని ఉన్నారు చూడు. ఆ కాముకులు నలిపి పారవేసిన పూలమాలలు, తినగా మిగిలిన ఫలములు అక్కడక్కడా పడి ఉన్నాయి చూడు.” అని చిత్రకూటపర్వత విశేషములను సీతకు రాముడు చూపిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః (95) >>

Ayodhya Kanda Sarga 93 In Telugu – అయోధ్యాకాండ త్రినవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 93

అయోధ్యాకాండం త్రినవతితమ (93వ) సర్గలో, భరతుడు దశరథ మహారాజు మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందాడు. అతను తన తల్లి కైకేయి పై మహా కోపంతో తిట్టిపోస్తాడు. కైకేయి తన చర్యలను సమర్థించడానికి ప్రయత్నిస్తే, భరతుడు ఆమెను తీవ్రంగా గద్దించింది. అతను రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పరిపాలించరని, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించాడు. ఆ తరువాత, భరతుడు తన సోదరుడు శత్రుఘ్నుడితో కలిసి గురు వశిష్ఠుని వద్దకు వెళ్లి సలహా కోరుతాడు. వశిష్ఠుడు రాముని తిరిగి పిలవడానికి సమ్మతిస్తాడు. భరతుడు, అల్లరి పరంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్లి, రాముని తిరిగి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముని పట్ల అతని అపార ప్రేమను ప్రతిబింబిస్తుంది.

చిత్రకూటవనప్రేక్షణమ్

తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః |
అర్దితా యూథపా మత్తాః సయూథాః సంప్రదుద్రువుః || ౧ ||

ఋక్షాః పృషతసంఘాశ్చ రురవశ్చ సమతంతః |
దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ || ౨ ||

స సంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజః |
వృతో మహత్యా నాదిన్యా సేనయా చతురంగయా || ౩ ||

సాగరౌఘనిభా సేనా భరతస్య మహాత్మనః |
మహీం సంఛాదయామాస ప్రావృషిద్యామివాంబుదః || ౪ ||

తురంగాఘైరవతతా వారణైశ్చ మహాజవైః |
అనాలక్ష్యా చిరం కాలం తస్మిన్కాలే బభూవ భూః || ౫ ||

స యాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంతవాహనః |
ఉవాచ భరతః శ్రీమాన్ వసిష్ఠం మంత్రిణాం వరమ్ || ౬ ||

యాదృశం లక్ష్యతే రూపం యథా చైవ శ్రుతం మయా |
వ్యక్తం ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజో యమబ్రవీత్ || ౭ ||

అయం గిరిశ్చిత్రకూట ఇయం మందాకినీ నదీ |
ఏతత్ప్రకాశతే దూరాన్నీలమేఘనిభం వనమ్ || ౮ ||

గిరేః సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి |
వారణైరవమృద్యంతే మామకైః పర్వతోపమైః || ౯ ||

ముంచంతి కుసుమాన్యేతే నగాః పర్వతసానుషు |
నీలా ఇవాతపాపాయే తోయం తోయధరా ఘనాః || ౧౦ ||

కిన్నరాచరితం దేశం పశ్య శత్రుఘ్న పర్వతమ్ |
మృగైః సమంతాదాకీర్ణం మకరైరివ సాగరమ్ || ౧౧ ||

ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగాః ప్రచోదితాః |
వాయుప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే || ౧౨ ||

కుర్వంతి కుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ |
మేఘప్రకాశైః ఫలకైర్దాక్షిణాత్యా యథా నరాః || ౧౩ ||

నిష్కూజమివ భూత్వేదం వనం ఘోరప్రదర్శనమ్ |
అయోధ్యేవ జనాకీర్ణా సంప్రతి ప్రతిభాతి మా || ౧౪ ||

ఖురైరుదీరితో రేణుర్దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి |
తం వహత్యనిలః శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియమ్ || ౧౫ ||

స్యందనాంస్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ |
ఏతాన్సంపతతః శీఘ్రం పశ్య శత్రుఘ్న కాననే || ౧౬ ||

ఏతాన్విత్రాసితాన్పశ్య బర్హిణః ప్రియదర్శనాన్ |
ఏతమావిశతః శీఘ్రమధివాసం పతత్త్రిణః || ౧౭ ||

అతిమాత్రమయం దేశో మనోజ్ఞః ప్రతిభాతి మా |
తాపసానాం నివాసోఽయం వ్యక్తం స్వర్గపథో యథా || ౧౮ ||

మృగా మృగీభిః సహితా బహవః పృషతా వనే |
మనోజ్ఞరూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః || ౧౯ ||

సాధుసైన్యాః ప్రతిష్ఠంతాం విచిన్వంతు చ కాననే |
యథా తౌ పురుషవ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ || ౨౦ ||

భరతస్య వచః శ్రుత్వా పురుషాః శస్త్రపాణయః |
వివిశుస్తద్వనం శూరాః ధూమం చ దదృశుస్తతః || ౨౧ ||

తే సమాలోక్య ధూమాగ్రమూచుర్భరతమాగతాః |
నామనుష్యే భవత్యాగ్నిర్వ్యక్తమత్రైవ రాఘవౌ || ౨౨ ||

అథ నాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ |
మన్యే రామోపమాః సంతి వ్యక్తమత్ర తపస్వినః || ౨౩ || [అన్యే]

తచ్ఛ్రుత్వా భరతస్తేషాం వచనం సాధుసమ్మతమ్ |
సైన్యానువాచ సర్వాంస్తానమిత్రబలమర్దనః || ౨౪ ||

యత్తా భవంతస్తిష్ఠంతు నేతో గంతవ్యమగ్రతః |
అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవ చ || ౨౫ ||

ఏవముక్తాస్తతః సర్వే తత్ర తస్థుః సమంతతః |
భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్ || ౨౬ ||

వ్యవస్థితా యా భరతేన సా చమూ-
-ర్నిరీక్షమాణాఽపి చ ధూమమగ్రతః |
బభూవ హృష్టా నచిరేణ జానతీ
ప్రియస్య రామస్య సమాగమం తదా || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రినవతితమః సర్గః || ౯౩ ||

Ayodhya Kanda Sarga 93 Meaning In Telugu

మహాసముద్రము వలె ఉన్న భరతుని సైన్యము పరివారము ఆ అడవులలో ప్రయాణం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మృగములు భయపడి పారిపోతున్నాయి. ఆ సైన్యము నడిచేటప్పుడు రేగిన ధూళితో ఆకాశం ఎర్రగా కవురు వేసినట్టు అయింది. వారందరూ చిత్రకూట పర్వతమును సమీపించారు. భరతుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! పరిసరములను బట్టి చూడగా మనకు చిత్రకూటపర్వతమును సమీపించినట్టు కనపడు చున్నది. అదుగో అదే మందాకినీ నది. ఇక్కడ కిన్నరులుసంచరిస్తూ ఉంటారని ప్రతీతి.

(ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అదేమిటంటే—-
కుర్వన్తికుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ।
మేఘప్రకాశై: ఫలకైర్దాక్షిణాత్యా యథానరా॥

ఈ పర్వత శిఖరములు, మేఘములతో సమానంగా, దాక్షిణాత్య నరుల వలె ప్రకాశిస్తున్నాయి. అని స్థూలంగా చెప్పుకోవచ్చు. దూరానికి మేఘములు, పర్వత శిఖరములు నల్లగా ఉంటాయి. అంటే దక్షిణదేశ నరులు నల్లగా ఉంటారని మనం అనుకోవచ్చునా. అలా కాకపోతే, ఇక్కడ దాక్షిణాత్యుల ప్రసక్తి తీసుకురావడం ఎందుకు? ఉత్తరదేశస్థులు తెల్లగా ఆజానుబాహులుగా ఉంటారని మనకు తెలిసిందే. కాబట్టి మన చరిత్రలో చెప్పినట్టు ఆర్యులు దస్యులు అనే రెండు తెగలు ఉన్నాయని స్పష్టం అవుతున్నట్టుగా ఉంది. ఇది కేవలము ఊహ మాత్రమే రూఢి కాదు.)

తరువాత భరతుడు శత్రుఘ్నుని చూచి “సోదరా! ఈ ప్రశాంత మైన అరణ్యమును చూస్తుంటే ఇక్కడ ఋషులు నివసిస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు మనము రాముని పర్ణశాల కొరకు వెతకవలెను. మన సైన్యమును నలుదిక్కులకు పంపి రాముని జాడ కనుగొనమని చెప్పు.” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు సైన్యము నలుదిక్కులకు వెళ్లారు. వారికి కొంచెం దూరంలో పొగ లేస్తున్నట్టు కనపడింది. వెంటనే వారు భరతుని వద్దకు వచ్చి “మహారాజా! ఈ అరణ్యములో ఆ ప్రదేశములో పొగవస్తోంది అంటే అక్కడ జనసంచారము ఉన్నట్టే. అక్కడే రామలక్ష్మణులు ఉండవచ్చు అని అనుమానంగా ఉంది. అలా కాకపోతే అక్కడ ముని ఆశ్రమములు ఉండవచ్చు. వారిని అడిగితే రాముని జాడలు చెప్పగలరు.” అని అన్నారు.

భరతుడు వారితో ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడే ఉండండి. నేను, వసిష్ఠుడు సుమంత్రుడు పోయి చూచి వస్తాము. అంతదాకా మీరు ఇక్కడే వేచి ఉండండి.”అని అన్నాడు. తరువాత భరతుడు ఆపొగవస్తున్న దిక్కుగా చూచాడు. చాలారోజుల తరువాత తాను రాముని చూడబోవుచున్నానని ఎంతో సంతోషించాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః (94) >>

Aranya Kanda Sarga 19 In Telugu – అరణ్యకాండ ఏకోనవింశః సర్గః

Aranya Kanda Sarga 19 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకోనవింశః సర్గలో, శూర్పణఖ తన బాధాకరమైన కథను తన సోదరుడు ఖరకు ముఖ్యంగా సీతను నేరం చేస్తూ వివరిస్తుంది. సీత రక్తాన్ని తాగడానికి ఖరా యుద్ధం చేయాలని ఆమె కోరుకుంటుంది. ఖర తన సోదరిని శాంతింపజేయడానికి పద్నాలుగు రాక్షసులను రాముని అంతమొందించడానికి పంపుతాడు.

ఖరక్రోధః

తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితామ్ |
భగినీం క్రోధసంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః ||

1

ఉత్తిష్ఠ తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమమ్ |
వ్యక్తమాఖ్యాహి కేన త్వమేవంరూపా విరూపితా ||

2

కః కృష్ణసర్పమాసీనమాశీవిషమనాగసమ్ |
తుదత్యభిసమాపన్నమంగుళ్యగ్రేణ లీలయా ||

3

కః కాలపాశమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే |
యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమమ్ ||

4

బలవిక్రమసంపన్నా కామగా కామరూపిణీ |
ఇమామవస్థాం నీతా త్వం కేనాంతకసమా గతా ||

5

దేవగంధర్వభూతానామృషీణాం చ మహాత్మనామ్ |
కోఽయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకార హ ||

6

న హి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్మమ విప్రియమ్ |
అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనమ్ ||

7

అద్యాహం మార్గణైః ప్రాణానాదాస్యే జీవితాంతకైః |
సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః ||

8

నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః |
సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి ||

9

కస్య పత్రరథాః కాయాన్మాంసముత్కృత్య సంగతాః |
ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయా రణే ||

10

తం న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః |
మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే ||

11

ఉపలభ్య శనైః సంజ్ఞాం తం మే శంసితుమర్హసి |
యేన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జితా ||

12

ఇతి భ్రాతుర్వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః |
తతః శూర్పణఖా వాక్యం సబాష్పమిదమబ్రవీత్ ||

13

తరుణౌ రూపసంపన్నౌ సుకూమారౌ మహాబలౌ |
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ||

14

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

15

గంధర్వరాజప్రతిమౌ పార్థివవ్యంజనాన్వితౌ |
దేవౌ వా మానుషౌ వా తౌ న తర్కయితుముత్సహే ||

16

తరుణీ రూపసంపన్నా సర్వాభరణభూషితా |
దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా ||

17

తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్య తామ్ |
ఇమామవస్థాం నీతాహం యథానాథాసతీ తథా ||

18

తస్యాశ్చానృజువృత్తాయాస్తయోశ్చ హతయోరహమ్ |
సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని ||

19

ఏష మే ప్రథమః కామః కృతస్తాత త్వయా భవేత్ |
తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే ||

20

ఇతి తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ |
వ్యాదిదేశ ఖరః క్రుద్ధో రాక్షసానంతకోపమాన్ ||

21

మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ |
ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ ||

22

తౌ హత్వా తాం చ దుర్వృత్తామపావర్తితుమర్హథ |
ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి ||

23

మనోరథోఽయమిష్టోఽస్యా భగిన్యా మమ రాక్షసాః |
శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్య స్వేన తేజసా ||

24

యుష్మాభిర్నిర్హతౌ దృష్ట్వా తావుభౌ భ్రాతరౌ రణే |
ఇయం ప్రహృష్టా ముదితా రుధిరం యుధి పాస్యతి ||

25

ఇతి ప్రతిసమాదిష్టా రాక్షసాస్తే చతుర్దశ |
తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనా వాతేరితా యథా ||

26

తతస్తు తే తం సముదగ్రతేజసం
తథాపి తీక్ష్ణప్రదరా నిశాచరాః |
న శేకురేనం సహసా ప్రమర్దితుం
వనద్విపా దీప్తమివాగ్నిముత్థితమ్ ||

27

Aranya Kanda Sarga 19 In Telugu Pdf Download

ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు. ఖరుడు. ఆమెను రెండుచేతులతో లేవనెత్తాడు.

“చెల్లెలా శూర్పణఖా! ఏమిటీ ఘోరము. ఎవరు చేసారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేసాడా! వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాశం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేసాడు. ఎవడు వాడు! ఎక్కడ ఉంటాడు! ఉన్నది ఉన్నట్టు చెప్పు.

అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా! పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా! అలాంటి నీకు ఈ గతి పట్టించిన వాడు ఎవడు? వాడు దేవతా! గంధర్వుడా! భూతమా! లేక ఎవరన్నా పరాక్రమ వంతుడైన ఋషిపుంగవుడా! ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసికూడా నీకు అవమానం చేసాడంటే వాడికి ఆయువు మూడింది.

ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానము నకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గానీ, గంధర్వులు కానీ, రాక్షసులు గానీ, పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా! చెప్పు. నీ భయందోళనలనుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు.” అని అడిగాడు ఖరుడు.

శూర్పణఖ కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి. కళ్లు తుడుచుకుంటూ ఖరునితో ఇలా చెప్పింది. “ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథమహారాజు కుమారులట. పేరు రాముడు, లక్ష్మణుడు. వారు సుకుమారులు. సుందరాకారులు. కాని మంచి బలంగా ఉన్నారు. మునివేషములో ఉన్నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వారి ముఖంలో రాజసం తొణికిసలాడుతూ ఉంది. వారు దేవతలో మనుష్యులో చెప్పలేను. వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీమూలంగానే నాకు ఈ అవమానము జరిగింది. నువ్వు వెళ్లి ఆ స్త్రీని, ఆ ఇద్దరు యువకులనుచంపి వారి రక్తముతో నా దాహము తీర్చు. అప్పటి దాకా నా పగ చల్లారదు.” అని రోషంతో పలికింది శూర్పణఖ.

ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు. వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన 14 మంది రాక్షస వీరులను పిలిపించాడు. (ఇక్కడ గమనించండి. రామాయణంలో ఈ 14 అంకె విశిష్టమైనది. రాముని వనవాసము 14 సంవత్సరములు. ఖరుడు పంపిన వారు 14 మంది. ఇంకా ఈ 14 సంఖ్య వస్తూనే ఉంటుంది. భారతంలో 18 అంకె ఉన్నట్టు రామాయణంలో 14 అంకెకు ప్రాధాన్యత ఉన్నట్టు ఉంది.).

“ఓ రాక్షసవీరులారా! ముని వేషములో ఉన్న ఇద్దరు క్షత్రియ కుమారులు, ఒక స్త్రీ దండకారణ్యములో ప్రవేశించారట. మీరు వెళ్లి ఆ ముని కుమారులను, ఆ స్త్రీని చంపండి. వారి రక్తము నా సోదరి శూర్పణఖ తాగవలెనని కోరుతూ ఉంది. వెళ్లండి. వాళ్లను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి.” అని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఆ 14 మంది రాక్షసవీరులూ శూర్పణఖను తీసుకొని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ వింశః సర్గః (20) >>

Aranya Kanda Sarga 21 In Telugu – అరణ్యకాండ ఏకవింశః సర్గః

Aranya Kanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకవింశః సర్గలో, రాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు పంచవటి ప్రాంతంలో నివాసం ప్రారంభిస్తారు. పంచవటిలో వాతావరణం అందంగా ఉంటుంది. అక్కడ వారు చిన్న ఆశ్రమాన్ని నిర్మించి నివసిస్తారు. ఈ సుందర వాతావరణంలో సీతమ్మ పూలతో అలంకరణలు చేస్తూ సంతోషంగా గడుపుతుంది.

ఖరసంధుక్షణమ్

స పునః పతితాం దృష్ట్వా క్రోధాచ్ఛూర్పణఖాం ఖరః |
ఉవాచ వ్యక్తయా వాచా తామనర్థార్థమాగతామ్ ||

1

మయా త్విదానీం శూరాస్తే రాక్షసా రుధిరాశనః |
త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుద్యతే పునః ||

2

భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యశః |
ఘ్నంతోఽపి న నిహంతవ్యా న న కుర్యుర్వచో మమ ||

3

కిమేతచ్ఛ్రోతుమిచ్ఛామి కారణం యత్కృతే పునః |
హా నాథేతి వినర్దంతీ సర్పవల్లుఠసి క్షితౌ ||

4

అనాథవద్విలపసి నాథే తు మయి సంస్థితే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ మా భైషీర్వైక్లబ్యం త్యజ్యతామిహ ||

5

ఇత్యేవముక్తా దుర్ధర్షా ఖరేణ పరిసాంత్వితా |
విమృజ్య నయనే సాస్రే ఖరం భ్రాతరమబ్రవీత్ ||

6

అస్మీదానీమహం ప్రాప్తా హృతశ్రవణనాసికా |
శోణితౌఘపరిక్లిన్నా త్వయా చ పరిసాంత్వితా ||

7

ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే చతుర్దశ |
నిహంతుం రాఘవం క్రోధాన్మత్ప్రియార్థం సలక్ష్మణమ్ ||

8

తే తు రామేణ సామర్షాః శూలపట్టిశపాణయః |
సమరే నిహతాః సర్వే సాయకైర్మర్మభేదిభిః ||

9

తాన్ దృష్ట్వా పతితాన్భూమౌ క్షణేనైవ మహాబలాన్ |
రామస్య చ మహత్కర్మ మహాంస్త్రాసోఽభవన్మమ ||

10

అహమస్మి సముద్విగ్నా విషణ్ణా చ నిశాచర |
శరణం త్వాం పునః ప్రాప్తా సర్వతోభయదర్శినీ ||

11

విషాదనక్రాధ్యుషితే పరిత్రాసోర్మిమాలిని |
కిం మాం న త్రాయసే మగ్నాం విపులే శోకసాగరే ||

12

ఏతే చ నిహతా భూమౌ రామేణ నిశితైః శరైః |
యేఽపి మే పదవీం ప్రాప్తా రాక్షసాః పిశితాశనాః ||

13

మయి తే యద్యనుక్రోశో యది రక్షస్సు తేషు చ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||

14

దండకారణ్యనిలయం జహి రాక్షసకంటకమ్ |
యది రామం మమామిత్రం న త్వమద్య వధిష్యసి ||

15

తవ చైవాగ్రతః ప్రాణాంస్త్యక్ష్యామి నిరపత్రపా |
బుద్ధ్యాఽహమనుపశ్యామి న త్వం రామస్య సంయుగే ||

16

స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః |
శూరమానీ న శూరస్త్వం మిథ్యారోపితవిక్రమః ||

17

మానుషౌ యౌ న శక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||

18

దండకారణ్యనిలయం జహి తం కులపాంసన |
నిఃసత్త్వస్యాల్పవీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ ||

19

అపయాహి జనస్థానాత్త్వరితః సహబాంధవః |
రామతేజోఽభిభూతో హి త్వం క్షిప్రం వినశిష్యసి ||

20

స హి తేజః సమాయుక్తో రామో దశరథాత్మజః |
భ్రాతా చాస్య మహావీర్యో యేన చాస్మి విరూపితా ||

21

ఏవం విలప్య బహుశో రాక్షసీ వితతోదరీ |
భ్రాతుః సమీపే దుఃఖార్తా నష్టసంజ్ఞా బభూవ హ |
కరాభ్యాముదరం హత్వా రురోద భృశదుఃఖితా ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకవింశః సర్గః ||

Aranya Kanda Sarga 21 Meaning In Telugu

పదునాలుగు మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని వెళ్లిన శూర్పణఖ వెంటనే ఒంటరిగా రావడం చూచి ఆశ్చర్యపోయాడు ఖరుడు.

“ఏంటి శూర్పణఖా! ఏమయింది. నీవు కోరితేనేకదా నీ వెంట 14 మంది రాక్షస వీరులను పంపాను. మరలా ఏడుస్తూ వచ్చావెందుకు. ఊరికే అలా భయపడితే ఎలాగా! నేను ఉన్నాగా నీకెందుకు భయం. ఏం జరిగిందో చెప్పు” అన్నాడు ఖరుడు.

ఖరుని చూచి వ్యంగ్యంగా ఇలా అంది శూర్పణఖ. “ముక్కు, చెవులూ కోయించుకొని రక్తంకారుకుంటూ ఏడ్చుకుంటూ నీదగ్గరకు వచ్చానా! నీవు నన్ను ఓదార్చావు కదా! రామలక్ష్మణులను చంపడానికి 14 మంది రాక్షస వీరులను పంపావు కదా! మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ 14మంది నా వెంట వచ్చారు కదా! క్షణకాలంలో రాముడిచేతిలో గుండెలు పగిలి చచ్చారు. ఇదీ మనవాళ్ల ప్రతాపం. ఇంక భయపడక చస్తానా! వాళ్లందరూ అలా క్షణకాలంలో నేలమీద పడగానే నాకు వణుకు పుట్టింది. పరుగెత్తుకుంటూ వచ్చాను.

ఓ ఖరా! నాకు భయంగా ఉంది. రామలక్ష్మణులు ఏవైపు నుంచి అన్నా రావచ్చు. నిన్ను, నన్ను చంపవచ్చు నీకు నా మీద జాలి దయ ఉంటే, ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి, బలము ఉంటే, దండకారణ్యములో నివాసమేర్పరచుకొన్న ఆ రామలక్ష్మణులను వెంటనే చంపు. వాళ్లు సామాన్యులు కాదు. రాక్షసులను చంపడానికి వచ్చిన దేవతలు. నీవు కనక రాముడిని చంపకపోతే నేను నీ ఎదుటనే ఆత్మహత్య చేసుకొని చస్తాను.

అయినా నీకు ఇంత సైన్యము, ఇంత బలము, పరాక్రమములు ఉండి ఏం ప్రయోజనం. ఇద్దరిని చంపలేకపోయావు. అసలు నువ్వు అయినా రాముని ఎదుట నిలిచి యుద్ధం చెయ్యగలవా అని నా అనుమానము.

ఖరా! వాళ్లు సామాన్య మానవులు. నీ సైన్యము ఆ మానవులను చంపలేకపోయాయి. నీవేదో పెద్ద పరాక్రమవంతుడవని డంబాలు పలుకుతున్నావు. నీ పరాక్రమము శూరత్వము ఎందుకు తగలపెట్టనా! నా మాటవిని ఈ జనస్థానము వదిలి ఎక్కడికన్నా వెళ్లి బతుకు పో! నువ్వు రాక్షసకులంలో చెడ బుట్టావు. అందుకే మానవులకు భయపడుతున్నావు.

ఓ ఖరా! ఆఖరుసారిగా చెబుతున్నాను విను. నీకు రాముని ఎదిరించే వీరత్వము ఉంటే, నీ సైన్యంతో వెళ్లి రామలక్ష్మణులను చంపు. లేకపోతే, నీ బంధుమిత్రులతో ఈ జనస్థానము వదిలి పారిపో! అదే ఉత్తమము. రాముని తేజస్సు ముందు నీవు నిలువలేవు. అందుకే నా ముక్కు చెవులు కోసినా ఇంకా రామలక్ష్మణులు బతికే ఉన్నారు.” అని సూటిపోటీ మాటలతో ఖరుని రెచ్చగొట్టింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓతత్సత్.

అరణ్యకాండ ద్వావింశః సర్గః (22) >>