కిష్కింధాకాండ త్రయోవింశః సర్గంలో, వాలిని రాముడు బాణంతో చంపిన తర్వాత సుగ్రీవుడు ఎంతో బాధ పడతాడు. వాలి చివరి శ్వాసలు తీసుకుంటూ రాముడితో మాట్లాడి, సుగ్రీవుని రక్షించమని అభ్యర్థిస్తాడు. రాముడు వాలికి సంతాపం తెలియజేసి, సుగ్రీవుని రాజ్యాన్ని పొందడం సరియైనదని చెప్పి అతనిని ఆత్మస్థైర్యంతో నిలిపి, అతని కర్తవ్యం నిర్వర్తించమని సలహా ఇస్తాడు. వాలిని అంజనాదేవి (తార) కన్నీళ్లు పెట్టుకొని బాధ పడుతుంది. వాలి చివరగా రాముని క్షమాపణ కోరతాడు, అప్పుడు రాముడు వాలిని శాంతినిచ్చి, సుగ్రీవుని రాజుగా నియమించడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెడతాడు.
తార తన భర్త ముఖాన్ని చూస్తూ తట్టుకోలేక ఈ విధంగా విలపిస్తూ ఉంది. “నాధా! అర్థరాత్రి సుగ్రీవునితోయుద్ధానికి పోవద్దని నేను నీకు శతవిధాలా చెప్పాను. కానీ నీవు నా మాటను పెడచెవిని పెట్టావు. అందుకే నేను ఇక్కడే ఉన్నా భూదేవిని కౌగలించుకొని పడుకున్నావు. ముల్లోకాలను గడగడలాండిచి ఎవరికీ లొంగని నీవు, నీ తమ్ముడు, నీ కన్నా దుర్బలుడైన సుగ్రీవుని చేతిలో ఓడిపాయావా! ఎంత ఆశ్చర్యము.
నాధా! వానర నాయకులు, భల్లూకనాయకులు నిన్ను సేవించడానికి వచ్చారు. లే. వారిని ఆదరించు. వారితో మాట్లాడు. నీవు నీ శత్రువులను చంపి వారిని భూతల శయనము చెందేట్టు చేసావు. ఇప్పుడు నీవు కూడా నీశత్రువు చేతిలో చంపబడి భూతలము మీద శయనించి ఉన్నావా!
నాధా! నన్ను అనాధనుచేసి నీవు ఒంటరిగా వెళ్లిపోవడం నీకు న్యాయంగా ఉందా నాధా! ఈ లోకంలో బుద్ధి ఉన్న వాడు ఎవ్వడూ తన కుమార్తెను వీరుడికి, పరాక్రమవంతుడికి ఇవ్వకూడదు. ఎందుకంటే శూరుడి భార్యకు నా మాదిరి అకాల వైధవ్యము తప్పదుకదా! వారు శోక సముద్రములో మునిగి పోక తప్పదు కదా! నీ మరణము కనులారా చూచికూడా నా హృదయము బద్దలు కాలేదంటే, నా గుండె కటిక పాషాణముతో సమానము కదా!
నాధా! ఈ లోకంలో స్త్రీకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత వైభవము ఉన్నా, భర్తలేకపోతే ఆమెను విధవ అనే అంటారు. అటువంటి వైధవ్యము నాకు సంప్రాప్తించింది. ఎలాభరించాలి! ఈ సమయంలో నిన్ను తనివిదీరా కౌగలించుకొని ఏడవకుండా నీ శరీరం రక్తసిక్తమయింది. సుగ్రీవుని ఆశలు నెరవేర్చిన ఈ రాముని బాణము ఇంకా నీ శరీరంలో ఎందుకు ?”అంటూ తార వాలి శరీరంలో నుండి రాముని ధనుస్సు వెడలిన బాణమును బయటకు లాగింది.
వాలి శరీరంనుండి రామ బాణమును బయటకు లాగగానే, ఆ గాయము నుండి రక్తం జలధార మాదిరి పైకి ఉబికింది. తార తన కళ్లనుండి నీరు కారుతుండగా వాలి గాయము నుండి స్రవించిన రక్తాన్ని తుడిచింది. తార తన కుమారుడు అంగదుని చూచి ఇలా అంది.
“నాయనా! అంగదా! నీ తండ్రిని కడసారి చూచి నమస్కారం చెయ్యి.” వెంటనే అంగదుడు పైకి లేచి తన తండ్రి వాలికి భక్తితో నమస్కారం చేసాడు. “నాధా! నేను తమరి కుమారుడు అంగదుడు పక్కనే కూర్చుని ఉన్నాము. తమరి కుమారుడు అంగదుడు నమస్కరించు చున్నాడు. ఆశీర్వదించండి” అని విలపించింది తార.
ఓనాధా! మీరు, మీ తమ్ముడు సుగ్రీవునితో యుద్ధము అనే యజ్ఞమును చేసి, మీ భార్యనైన నేను లేకుండానే, రక్తంతో అవభృధ స్నానం చేస్తున్నారా! (యజ్ఞము చేసిన తరువాత భార్యా భర్తలు కలిసి పవిత్రమైన అవభృధ స్నానము చేయడం ఆచారం. రాజసూయ యాగము అయిన తరువాత అవభృధ స్నానంతో పవిత్రమైన తనకురులను ఆ దుష్టుడు దుశ్శాసనుడు తాకాడని ద్రౌపది కోపంతో ఊగిపోయింది.)
నా మాట వినకుండా యుద్ధమనే యజ్ఞము చేసి ఒంటరిగా అవభృధ స్నానం చేసారా! నాధా! మరణించింది నీవు మాత్రమే కాదు. నేను, నా కుమారుడు అంగదుడు కూడా మరణించాము. జీవచ్ఛవాల మాదిరి మిగిలిపోయాము. నీవు మమ్ములను విడిచిపోయినట్టు మా ఐశ్వర్యము కూడా మమ్ములను విడిచి పెట్టి పోయింది.” అని ఏడుస్తూ ఉంది తార.
కిష్కింధాకాండ ద్వావింశః సర్గంలో, హనుమాన్ సుగ్రీవుని సల్లాపాన్ని రాముని వద్ద వివరిస్తాడు. రాముడు సుగ్రీవుని సమస్యలు తెలుసుకొని, వాలిని చంపడానికి సుగ్రీవుని సహాయం చేయడానికి నిర్ణయిస్తాడు. సుగ్రీవుడు తన యోధులను సమీకరించి, రాముని సహాయంతో వాలిని ఎదిరించడానికి సిద్ధమవుతాడు. వాలి తన సోదరుడు సుగ్రీవుని ఎదిరించడానికి వస్తాడు. సుగ్రీవుడు రాముని మద్దతుతో వాలితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. యుద్ధం తీవ్రంగా సాగుతుంది, కానీ రాముడు వాలిని నిశితంగా చూసి సుగ్రీవుని రక్షణలో నిలబడి, వాలిని కుష్టిదాడితో చంపేస్తాడు.
అప్పటికి వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా కళ్లు తెరిచాడు. తార వంక చూచాడు. తన కుమారుడు అంగదుని వంక, తార వంక మార్చి మార్చి చూచాడు. సుగ్రీవుని తన దగ్గరకు పిలిచాడు. అతి కష్టం మీద ఇలా అన్నాడు.
“సుగ్రీవా! నేను నీ పట్ల చాలా అపరాధము చేసాను. నన్ను క్షమించు. నా బుద్ధి వక్రించి నీ భార్యను నా దగ్గర ఉంచుకొని నిన్ను రాజ్యము నుండి వెడలగొట్టాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండవలెనని బ్రహ్మ రాసి ఉన్నాడు. అందుకే నేను యమలోకమునకు పోతున్నాను. నీవు ఈ కిష్కింధను పాలించు. ఎవరి చేతిలోనూ ఓడి పోని నేను రామునిచేతిలో ఓడిపోయాను. ధర్మానికి ఓడిపోయాను. నా మరణావస్థలో నేను నీకు ఒక మాట చెపుతాను.
సావధానంగా విను. వీలైతే ఆచరణలో పెట్టు. నా కొడుకు అంగదుడు. చిన్నవాడు. చూడు ఎలా నేల మీద పడి పొర్లుతున్నాడో. అంగదుడు చిన్నప్పటి నుండి. సుఖాలలో పెరిగాడు. కష్టము అంటే ఎరుగడు. వాడిని నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా చూచుకున్నాను. నా కుమారుడు అంగదుని నీ కుమారునిగా భావించు. వాడికి ఏ లోటూ రాకుండా చూచుకో. ఇంక మీదట నుండి అంగదునికి తండ్రివి, దాతవు, రక్షకుడివి, అభయ ప్రదాతవు అన్నీ నువ్వే. అంగదుడు నీకు అన్ని విధాలా తోడ్పడగలడు. యుద్ధములో నీకు అండగాఉండి అన్ని విధాలా నా కొడుకు అనిపించుకుంటాడు. ఇంక ఈమె నా భార్య తార. సుషేణుని కుమార్తె. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోడంలో సమర్థురాలు. ఎటువంటి ఉపద్రవకర పరిస్థితులకు కూడా ఎదురు నిలిచి, సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలది. తార ఆలోచించి చేయమన్న కార్యమును నీవు నిస్సందేహంగా చేయవచ్చును. నీకు జయం లభిస్తుంది.
తరువాత, నీవు రామునితో ఏ కార్యము నిమిత్తము మైత్రి చేసుకున్నావో ఆ కార్యమును తక్షణం నెరవేర్చు. రాముడిని అవమానించకు. మోసగించకు. అలాచేస్తే రాముడు నా మాదిరి నిన్ను కూడా చంపుతాడు.
సుగ్రీవా! నా మెడలో ఉన్న బంగారు మాల నాకు ఇంద్రుడు ఇచ్చాడు. దానిని నీవు వెంటనే తీసుకో. అది నా ఒంటిమీద ఉండగా నేను చనిపోతే దానికి శవదోషం తగులుతుంది. అప్పుడు దాని మహత్తు పోతుంది. కాబట్టి వెంటనే తీసుకొని నీ మెడలో వేసుకో.” అని అన్నాడు వాలి.
వాలి మాటలు విని సుగ్రీవునికి దుఃఖము పొర్లుకొచ్చింది. ఏడుస్తూనే వాలి మెడలో ఉన్న బంగారు మాలను తీసుకొని తనమెడలో వేసుకున్నాడు. వాలి అంగదుని వంక చూచి ఇలా అన్నాడు. “కుమారా! అంగదా! ఇంక మీదట నీకు అన్నీ నీ పినతండ్రి సుగ్రీవుడే. సు:ఖము వచ్చినా, దు:ఖము వచ్చినా ఓర్చుకో. కాలానుగుణంగా ప్రవర్తించు. సుగ్రీవుని ఆజ్ఞలను పాలించు. నేను కాబట్టి నీవు ఏమి చేసినను ఓర్చుకున్నాను. సహించాను. కాని ఇదివరకటి మాదిరి చేస్తే సుగ్రీవునికి కోపం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకో. సుగ్రీవునికి కోపం తెప్పించకు.
ఇంకొక మాట. నీవు ఇంక మీదట సుగ్రీవుని అధీనంలో ఉండబోతున్నావు. సుగ్రీవుని శత్రువులతో స్నేహం చేయకు. అలాగే సుగ్రీవుని మిత్రులతో శత్రుత్వం పెట్టుకోకు. సుగ్రీవునికి ఇష్టమైన పనులనే చేస్తూ ఉండు. ఇంకొక విషయం. నీవు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ, అలాగే ఎక్కువ ద్వేషము కలిగి ఉండకు. ఎందుకంటే అతిగా ఉండటం ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి రాగద్వేషాలలో సమతుల్యం పాటించు. మధ్యస్తంగా వ్యవహరించు.”
అలా మాట్లాడుతూనే వాలి ఆఖరిశ్వాస విడిచాడు. వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టారు. వాలి మరణంతో కిష్కింధా నగరము కళావిహీన మయింది. వాలి యొక్క పరాక్రమము, వీరత్వము, వాలి చేసిన యుద్ధములు, వాలి చంపిన వారి గురించి వానరులు తలచుకొని తలచుకొని ఏడుస్తున్నారు. తన కళ్ల ఎదుటే ప్రాణాలు విడిగిన తనభర్త వాలినిచూచి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది.
కిష్కింధాకాండంలో ఏకవింశః సర్గంలో, హనుమాన్ సుగ్రీవుని దర్శించి శ్రీరాముని సందేశం తెలియజేస్తాడు. సుగ్రీవుడు రాముని పరిచయం గురించి విన్నతర్వాత తన బాధలను వివరించడానికి హనుమాంతో మాట్లాడతాడు. వాలి భయంతో సుగ్రీవుడు కిష్కింధను విడిచిపెట్టి మల్యవంత పర్వతం వద్ద ఆశ్రయం పొందినట్లు చెప్పినప్పుడు హనుమాన్ రాముని దక్షిణ దిశలో వెతికినట్లు వివరిస్తాడు. రాముడు సుగ్రీవుని సమస్యను పరిష్కరించడానికి వాలి యుద్ధంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు.
తార అలా ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు. “అమ్మా! తారా! మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనము లేదు. ఈ దేహములు నీటి బుడగలు. కాలానుగుణంగా అవి బద్దలు అవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణీ చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక, నీ శేషజీవితములో శుభం కలగాలని కోరుకో! అదే ప్రస్తుత కర్తవ్యము.
ఇప్పటి దాకా ఈ కిష్కింధలో ఉన్న వేలకొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు. ఇప్పుడు వాలి లేడు. స్వర్గమునకు వెళ్లాడు. స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దు:ఖించడం అవివేకము. ఈ కిష్కింధలో ఉన్న వేలాది వానరులకు, భల్లూకములకు వాలి మరణానంతరము నీవు, అంగదుడు రక్షకులు. అంగదునికి పట్టాభిషేకము చేస్తాము. నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు. తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు, వాలికి శాస్త్రములలో నిర్ణయింపబడినట్టు ఉత్తర క్రియలు నిర్వహించాలి. వాలికి దహన సంస్కారములు చెయ్యాలి.” అని పలికాడు హనుమంతుడు.
భర్త మరణముతో బాధ పడుతున్న తార, హనుమంతుని మాటలు విని ఇలా అంది. “హనుమా! నాకు నా భర్త లేకపోయిన తరువాత అంగదుని వంటి కుమారులు నూరు మంది ఉన్నా ఏమి ప్రయోజనము. నా శక్తి, నా సామర్థ్యము అన్నీ నా భర్తతోనే పోయాయి. నేను అశక్తురాలను. అన్ని వ్యవహారములు అంగదుని పినతండ్రి సుగ్రీవుని ఆజ్ఞప్రకారమే చెయ్యండి. అంగదుని యోగక్షేమములు విచారించుటకు నేను అర్హురాలిని కాను. అది తండ్రి బాధ్యత. తండ్రి లేనపుడు పినతండ్రి బాధ్యత. కాబట్టి అంగదుని యోగక్షేమముల గురించి సుగ్రీవుడు చూచుకొన గలడు. ఇన్నాళ్లు నేను నా భర్త వాలిని సేవించాను. ఇప్పుడు ఆయన పోయిన మార్గమునే అనుసరిస్తాను. నా భర్త పక్కనే నేను ఉంటాను. ఇది నా నిశ్చయము.” అని పలికింది తార.
కిష్కింధాకాండంలో వింశం సర్గంలో, రాముడు లక్ష్మణుడిని వానర సేనలకు సహాయంగా పంపిస్తాడు. సుగ్రీవుడు హనుమంతుడిని కళంకించడానికి చేయాల్సి, అవను మొదటి రామాయణ వెర్షన్ను చెప్పింది. రాముని సోదరి శ్రీమతి మారుతి వాల్మీకితో సందేహంకు కారణమైన కోపానికి ప్రకారం మరులసియుండదు.
రాముని బాణం దెబ్బతిని చావుబతుకుల్లో ఉన్న భర్త వాలిని చూచి తార భోరున ఏడిచింది. “ఓ వీరుడా! నీవు లోకోత్తర వీరుడవే. నీ వీరత్వము, పరాక్రమము ఏమైపోయాయి. ఎందుకు ఇలా దీనంగా నేల మీద పడి ఉన్నావు. నేను, నీ భార్య తారను, వచ్చాను. లే. నన్ను పలకరించు. నీవు మహారాజువు. ఇలా నేల మీద పడుకోవడం తగునా. లేచి మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకో. ఓ భూనాధా! ఇన్నాళ్లు ఈ భూమిని పాలించిన నీవు, అవసాన సమయంలో కూడా భూదేవిని వదల లేక. ఆమెను కౌగలించుకొని పడుకున్నావా!
ఓ వానరవీరా! ఎంతో కష్టపడి, స్వర్గాన్ని తలదన్నే విధంగా, ఈ కిష్కింధను నిర్మించావు. ఇప్పుడు ఆ కిష్కింధను వదిలి ఎక్కడకు పోతున్నావు? నాధా! నేను నీ వియోగము తట్టుకోలేకున్నాను. నన్ను విడిచి వెళ్లవద్దు. నిన్ను ఈ స్థితిలో చూచి కూడా నా హృదయం బద్దలు కాలేదంటే, నా గుండె కఠినమైన పాషాణము అనుకుంటాను. అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు. ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేట్టు చేసింది.
నాధా! నేను నీకు భార్యగా ఉన్నాను. నేను కాకుండా ఎంతో మంత్రి స్త్రీలు ఉన్నారు కదా! కానీ నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు. అతనిని రాజ్యము నుండి వెళ్లగొట్టావు. దాని ఫలితమే నీకు సంప్రాప్తించిన ఈ దుర్మరణం. నాధా! నీవు సుగ్రీవునితో యుద్ధానికి పోకముందు ఎన్నోవిధాలుగా చెప్పాను. సుగ్రీవునితో సంధి చేసుకోమన్నాను. కానీ నీవు నా మాటలను పెడచెవిని పెట్టావు. పైగా నన్ను నిందించావు. కోరి కోరి మరణాన్ని కౌగలించుకున్నావు.
నాధా! రాముడు నిన్ను చంపినందుకు నేను చారించడం లేదు. కానీ ఏ నాడూ కష్టము గానీ, దు:ఖము కానీ అనుభవించని నేను ఈ వైధవ్య దుఃఖమును అనుభవించవలసి రావడం చాలా బాధగా ఉంది. నాధా! నీ కుమారుడు అంగదుని చూడండి. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగాడు. ఇప్పుడు పినతండ్రి సుగ్రీవుని వశమయ్యాడు. ఎన్ని బాధలు పడతాడో ఏమో!
నాయనా! అంగదా! నీ తండ్రివాలిని చూడు. కడసారి దర్శనం చేసుకో. ఇంక మీదట రోజూ చూచే నీ తండ్రి ముఖం రేపటి నుండి నీకు కనిపించదు. నాథా! నీ కుమారుడు అంగదుడు నిన్ను పిలుస్తున్నాడు. అంగదుని పలకరించు. అతనికి జీవితంలో నడుచుకోవలసిన జాగ్రత్తలు చెప్పు.
నాధా! నిన్ను చంపడం ద్వారా రాముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఓ సుగ్రీవా! నీ కోరిక తీరింది కదా! ఇంక నీ భార్య రుమ నీకు లభిస్తుందిలే. నీవు ఏ దిగులు, భయమూ లేకుండా ఈ కిష్కింధను ఏలుకో! నీ అన్న వాలిని చంపించావు కదా! ఇంకనీకు అడ్డేముంది.
నాధా! నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్కమాట కూడా పలుకవేమి? మాట్లాడు. నేనే కాదు. నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు. వారి వంక కన్నెత్తి చూడు. వారిని పలకరించు.” అని తార, ఆమెతో వచ్చిన వాలి భార్యలు వలా వలా ఏడుస్తున్నారు. అంగదుని పట్టుకొని రోదిస్తున్నారు.
తారకు ఇంకా ఆశ చావలేదు. వాలి మరలా బతుకుతాడని ఆశతో వాలిని కుదిపి కుదిపి ఏడుస్తూ ఉంది. “ఓ నాధా! నేను, అంగదుడు ఏమి అపరాధము చేసామని మమ్ములను విడిచి పోతున్నావు. తెలిసో తెలియకో మేము నీ పట్ల ఏమైనా అపరాధము చేస్తే దానిని క్షమించు. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను.” అని వాలి పాదాల మీద తల పెట్టి ఏడుస్తూ ఉంది తార. భర్త లేని బతుకు తనకు వ్యర్ధమని ఎంచి, తార తన భర్త వాలితో పాటు ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకుంది.
కిష్కింధాకాండంలో ఏకోనవింశం సర్గంలో, హనుమంతుడు లక్ష్మణుడిని ఆశ్వాసన ఇస్తాడు మరియు రాముని సహాయాన్ని పూర్తిచేస్తాడు. వాల్మీకి మహర్షి సహాయంతో రామాయణ కథని ఆరంభిస్తాడు. రాముడు హనుమంతుడి వర్ణనను ఆదరిస్తున్నాడు, అది పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి హనుమంతుడి అదృష్టాన్ని శ్రేష్టిస్తాడని వెలుగులు వ్యక్తం చేస్తాడు.
వాలిని రాముడు తన బాణంతో కొట్టడం, వాలి పడిపోవడం, చనిపోయే స్థితిలో ఉండటం వాలి భార్య తారకు తెలిసింది. వాలి, తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనే ఉన్నాడు. తార, అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దుఃఖించారు. వాలి దగ్గరకు పరుగు పరుగున వస్తున్నారు.
అప్పటికే, ధనుస్సును ధరించి, కాలయముని మాదిరి నిలబడి ఉన్న రాముని చూచి వానరులు అందరూ పారిపోయారు. పారి పోతున్న వానరులను చూచింది తార. తార వారిని చూచి ఇలా పలికింది. “ఓ వానరులారా! ఇప్పటి వరకూ మీరు మీ రాజు వాలి వెంట ఉండే వాళ్లు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు. రాజ్యం కోసరం సుగ్రీవుడు, తాను ఏమీ చేయలేక, రాముని సాయంతో మీ రాజు వాలిని చంపించాడు. మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడకండి. పారిపోకండి. నాతో రండి.” అని అన్నది తార.
పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు. తారను చూచి ఇలా అన్నారు. “అమ్మా తారా! ముందు నీవు, నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో. లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు. సుగ్రీవునికి అడ్డం లేకుండా చేస్తాడు. రాముడు వాలిని చంపగానే, మేమందరమూ భయంతో పారిపోయాము. అమ్మా తారా! నీవు అంగదుని రాజుగా అభిషేకించు. మేమందరమూ అంగదుని, వాలిని సేవించినట్టు సేవిస్తాము.” అని ఎవరికి తోచినట్టు వారు అరిచారు.
మరి కొందరు తారను చూచి “తారా! నీవు అంగదుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు. సుగ్రీవుడు, అతని మంత్రులు రాజదుర్గములను ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటిదాకా మనము సుగ్రీవుని అతని మంత్రులను నానా కష్టాలుపెట్టాము. వాళ్లు ఇప్పుడు మనమీద పగతీర్చుకొనే అవకాశం ఉంది. కాబట్టి నీవు అంగదునితో కలిసి పారిపో” అని సలహా ఇచ్చారు.
ఆ మాటలు విన్న తార వారితో ఇలా అంది. “ఓ వానరవీరులారా! నా సర్వస్వము అయిన నా భర్త పోయాక, నాకు ఈ రాజ్యంతో, నా కొడకుతో, ఈ శరీరంతో పనేముంది. నేను నా భర్త వద్దకు వెళ్లాలి. నా భర్త ఎక్కడ ఉన్నాడు. ఏస్థితిలో ఉన్నాడు.” అంటూ ఏడుస్తూ వాలి వద్దకు పరుగెత్తింది.
దుందుభి లాంటి రాక్షసులను మట్టుబెట్టిన వాలి, పరాక్రమంలో దేవేంద్రునితో సమానమైన వాలి, మరణావస్థలో నేలమీద పడి ఉండటం చూచింది. వాలి దేహము పక్కన ధనుస్సు ఊతంగా పట్టుకొని నిలబడి ఉన్న రాముని, లక్ష్మణుని, తన భర్త వాలి తమ్ముడు సుగ్రీవునీ చూచింది. నేరుగా వెళ్లి తన భర్త శరీరం మీద పడిపోయింది. “ఆర్య పుత్రా! లేవండి. నేను మీ తారను వచ్చాను లేవండి.” అంటూ రోదిస్తూ ఉంది. తన వదిన తారను, తన అన్నకుమారుడు అంగదుని చూచి సుగ్రీవునికి దుఃఖము ఆగలేదు.
కిష్కింధాకాండలో షష్ఠ సర్గ, హనుమంతుడు సీతను వెతికే ప్రస్థానంలో కీలకమైనది. అన్వేషణ బృందం దక్షిణ దిశలోని ఎడారి, అడవులు దాటింది. అన్వేషణలో వారు సింహిక అనే రాక్షసితో పోరాడుతారు, హనుమంతుడు ఆమెను సంహరిస్తాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, హనుమంతుడు ధైర్యంతో ముందుకు సాగుతాడు. చివరికి, వారికి సంపాతి అనే జటాయువు సోదరుడు లభిస్తాడు, అతను సీత లంకలో ఉంది అని సమాచారమిస్తాడు. ఈ వార్తతో హనుమంతుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు తదితరులు ఉత్సాహంగా లంకకు ప్రయాణించడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో హనుమంతుడి ధైర్యం, ప్రతిభ, అన్వేషణలో ఉత్సాహం ప్రధానంగా చూపిస్తాయి.
భూషణప్రత్యభిజ్ఞానమ్
పునరేవాబ్రవీత్ ప్రీతో రాఘవం రఘునందనమ్ |
అయమాఖ్యాతి మే రామ సచివో మంత్రిసత్తమః || ౧ ||
సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసము ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు. నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు. నీవు నాకు మిత్రుడవు అయినావు. ఇంక నీ దు:ఖమును విడిచి పెట్టు. నీ భార్య సీత ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వచ్చి నీకు అప్పగిస్తాను. నీ దు:ఖాన్ని తొలగిస్తాను. నీ భార్య ఆకాశములో ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను. ఇది సత్యము. నేను మాట తప్పను.
రామా! నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది. ఒక రోజు మేమందరమూ ఈ పర్వత శిఖరము మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకు పోవడం, ఆమె రామా, రామా అని అరవడం మేము చూచాము. ఆమె సీతయే. సందేహము లేదు. ఆ రాక్షసుడు రావణుడు అయి ఉంటాడు. ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రములో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జారవిడిచినది. ఆ మూట మా దగ్గర పడింది. మేము వాటిని మా దగ్గరే ఉంచాము. వాటిని నీకు చూపిస్తాను. ఆ ఆభరణములను నీవు గుర్తు పట్టగలవేమో చూడు.”అని అన్నాడు సుగ్రీవుడు.
ఆ మాటలు విని రాముడు ఉత్సాహంగా “మిత్రమా! ఆ ఆభరణములు వస్త్రము త్వరగా తీసుకొనిరా. నా సీత ఆభరణములు, వస్త్రము నేను చూడాలి.” అని ఆతురతగా అన్నాడు రాముడు. సుగ్రీవుడు వెంటనే పక్కనేఉన్న గుహలోకి వెళ్లాడు.
క్షణములో ఒక ఉత్తరీయములో కట్టబడిన ఆభరణములను తీసుకొని వచ్చాడు. “రామా! ఇదే ఆ వస్త్రము. ఇవే ఆ ఆభరణములు. చూడు. ఇవి నీ భార్య సీతకు చెందినవేమో!”అని అన్నాడు.
రాముడు ఆ ఉత్తరీయమును, ఆభరణములను చూచాడు. రాముని కళ్లనిండా నీళ్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు మనసు వశం తప్పింది. “హా సీతా!” అంటూ కిందపడి పోయాడు. రాముడు ఆ ఆభరణములను ఉత్తరీయమును తన గుండెలకు హత్తుకున్నాడు. రాముని శ్వాస భారంగా వస్తూ ఉంది. నోట మాట రావడం లేదు. ఉ ద్వేగంతో ఉన్నాడు. రాముని కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఏడుస్తూ లక్ష్మణుని వంక చూచాడు.
“లక్ష్మణా! సీతను ఆ రాక్షసుడు అపహరించుకు పోతున్నప్పుడు సీత జారవిడిచిన ఆభరణములు, ఉత్తరీయము చూడు. ఇవి మెత్తని గడ్డి మీద పడి ఉంటాయి. అందుకనే విరిగిపోకుండా ఉ న్నాయి. లక్ష్మణా! సీత ఆభరణములను నీవు గుర్తు పట్టగలవా!”అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నాకు సీత ధరించే ఏ ఆభరణముల గురించి అంతగా తెలియదు. నేను ప్రతిరోజూ ఆమెకు పాదాభివందనము చేయునపుడు ఆమె కాళ్లకు ధరించే నూపురములు చూస్తూ ఉంటాను. కాబట్టి అవి మాత్రమే గుర్తు పట్టగలను.” అని అన్నాడు. (లక్ష్మణుడు చెప్పినట్టుగా రాయబడి ఉన్న ఈ శ్లోకము ప్రాచ్య ప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము.)
ఆ ఆభరణములను చూచి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! ఇవి నిస్సంశయముగా నా సీత ఆభరణములే. ఇది నా సీత ధరించిన ఉత్తరీయము. సీతను అపహరించిన ఆ రాక్షసుడు సీతను ఏ దేశమునకు తీసుకొని వెళ్లాడో చెప్పగలవా? ఆ రాక్షసుడు. ఎక్కడ ఉంటాడో చెప్పగలవా? వాడి మూలంగా రాక్షస జాతి అంతా సర్వనాశనం అవుతుంది. ఇది సత్యము. సీతను అపహరించి ఆ రాక్షసుడు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. సుగ్రీవా! చెప్పు. ఆ రాక్షసుడి గురించిన వివరాలు చెప్పు. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఇప్పుడే వాడిని సంహరిస్తాను.” అని కోపావేశంతో ఊగిపోతూ అన్నాడు రాముడు.
కిష్కింధాకాండంలో అష్టాదశం సర్గంలో, రాముడు హనుమంతుడిని సుగ్రీవుడి ప్రయత్నాలను మెరుగుపరచడానికి అధ్యాయంలో చేరుకున్నారు. హనుమంతుడు తన సౌమ్యతనంతో సుగ్రీవుడిని విశ్వాసంతో ప్రేరేపిస్తాడు. రాముడు లక్ష్మణుడి సహాయంతో రాముడిని ప్రకటించడం, వానరుల సేనల నుంచి రావాలని ప్రస్తావించడం కింద తన సౌమ్యంతో సుగ్రీవుడిని ప్రేరేపిస్తాడు.
వాలి అన్న మాటలు అన్నీ ఓపికగా విన్నాడు రాముడు. వాలి మౌనం వహించగానే రాముడు వాలి చేసిన ఆరోపణలను అన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు.
“ఓ వాలీ! నీకు ధర్మము, అర్థము, కామము అంటే ఏమిటో తెలియవు. లోక మర్యాదలు తెలియవు. నన్ను మాత్రము నీ ఇష్టం వచ్చినట్టు నిందించావు. నాతో మాట్లాడే ముందు. నన్ను నిందించే ముందు, నీవు నీ పెద్దలతో, పండితులతో చర్చించి ఉండాల్సింది. ఈ అరణ్యములు, పర్వతములు, సమస్తజంతుజాలము అన్నీ ఇక్ష్వాకు వంశపు రాజులకు చెందినవి. ఈ అడవిలోని జంతు జాలమును. మనుష్యులను, రాక్షసులను రక్షించడానికి కానీ, శిక్షించడానికి కానీ, ఇక్ష్వాకు వంశము రాజులకే అధికారము కలదు. ప్రస్తుతము ఈ భూమినంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యసత్యవ్రతుడు. ధర్మము తెలిసినవాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయగల సమర్ధుడు. భరతుడు దేశ,కాల,మాన పరిస్థితులను గుర్తెరిగి పాలించే రాజు.
భరతుని ఆజ్ఞమేరకు, ధర్మరక్షణ చేయుటకు, మేము ఈ ప్రాంతం అంతా సంచరిస్తున్నాము. ధర్మనిరతుడైన భరతుని పాలనలో అధర్మమునకు తావు లేదు. ధర్మవిరుద్ధముగా ఎవరూ ప్రవర్తించరు. కాని మేము భరతుని ఆజ్ఞమేరకు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించే వారిని గుర్తించి, వారిని తగిన విధంగా శిక్షిస్తూ, ధర్మరక్షణ చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మేము నీ రాజ్యమునకు వచ్చాము. నీవు ధర్మాతిక్రమణ చేసినట్టు ఋజువు అయింది. కామభోగములకు ప్రాధాన్యము ఇచ్చి, నిందార్హమైన పనులుచేసినట్టు మా దృష్టికి వచ్చింది.
నీకు ధర్మం గురించి చెబుతాను విను. జన్మనిచ్చిన తండ్రి, తనకన్నా ముందు పుట్టిన అన్న, విద్య చెప్పిన గురువు, వీరు ముగ్గురూ కన్న తండ్రితో సమానము. అలాగే, తన కన్నా తరువాత పుట్టిన తమ్ముడు, తన కుమారుడు, తన శిష్యుడు. పుత్రసమానులు. ఓ వానరా! సత్పురుషులు ఆచరించే ధర్మమును కేవలము ఆత్మతో తెలుసువలెనే కానీ, బాహ్య కర్మల వలన తెలుసుకోలేరు. గుడ్డి వాడిని మరొక గుడ్డివాడు నడిపించినట్టు, చంచల స్వభావుడవైన నీవు, నీ మాదిరే చంచల స్వభావులైన నీ తోటి వానరులతో ఆలోచించి ధర్మాధర్మనిర్ణయము చేయగలవా!
నీవు ఇంతవరకూ నేను నిన్ను చంపాను అన్న కోపంతో మాట్లాడావు. నేను నిన్ను ఎందుకు చంపానో చెబుతాను విను. నీ తమ్ముని భార్య నీకు కోడలి వంటిది. నీవు ధర్మము తప్పి నీ సోదరుడు జీవించి ఉండగానే అతని భార్య రుమను కామాంధుడవై నీ వద్ద ఉంచుకున్నావు. ఓ వానరా! నీవు ధర్మమును అతిక్రమించి నీ తమ్ముడి భార్మను కామవాంఛతో తాకావు కాబట్టి, నీవు చేసిన పాపమునకు నీకు మరణదండన విధించడమైనది. లోకాచారమును మరిచి, ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు వారికి మరణ దండనే సరి అయిన ప్రాయశ్చిత్తము.
నేను ఉత్తమ కులములో పుట్టిన క్షత్రియుడను. ఇటువంటి అధర్మకార్యము సహించను. ఎవరైనా కామము చేత తన కుమార్తెను, సోదరిని, తమ్ముని భార్యను కోరితే, వారికి దండన విధించడం క్షత్రియ ధర్మము. ఆ ధర్మమే నేను నిర్వర్తించాను. మరలా చెబుతున్నాను. ఈ భూమి అంతా భరతుని రాజ్యములోనిది. మేము భరతుని ఆజ్ఞను పాలిస్తున్నాము. ధర్మరక్షణ చేస్తున్నాము. నీవు ధర్మమార్గము తప్పి నడుస్తున్నావు అని తెలిసి కూడా నిన్ను ఎలా క్షమించగలము. ధర్మము ప్రకారము రాజ్యము చేయు భరతుడు అధర్మపరులను నాశనం చేస్తాడు. మేము భరతుని ఆజ్ఞమేరకు నీవంటి అధర్మపరులను శిక్షించడానికి కంకణము కట్టుకున్నాము.
ఓ వానర రాజా! నీవు అన్నట్టు నేను సుగ్రీవునితో స్నేహం చేసాను కానీ, ధర్మబద్ధంగా స్నేహము చేసాను. దానికి మూలము రాజ్యము, నా భార్యసీత. సుగ్రీవుడు నాకు సాయం చేస్తాడు. నేను అతనికి సాయం చేస్తాను. రెండూ ధర్మబద్ధంగా చేసే సహాయాలే. నేను వానరుల ఎదుట, నిన్ను చంపి సుగ్రీవునికి రాజ్యము ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. ఇందులో తప్పేముంది. ధర్మబద్ధంగా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మం కదా!
నేను పైన చెప్పిన కారణముల వలన నీకు ధర్మబద్ధంగా తగిన దండన విధింపబడింది. ఆ దండన నీవు అంగీకరించక తప్పదు. నీకు దండన విధించడం ధర్మసమ్మతము అని నీవు గ్రహించాలి. నేను ధర్మమును పాటిస్తున్నాను కాబట్టి స్నేహితుడ వైన నీకు దండన విధించి ఉపకారమే చేసాను.
ఈ సందర్భంలో నీకు మనువుచెప్పిన మాటలు వినిపిస్తాను. విను. పాపములు చేసిన మానవులు, రాజులచే దండింపబడి, వారు చేసిన పాపములనుపోగొట్టుకొని, పుణ్యాత్ములై స్వర్గమునకు వెళ్తారు. చేసిన పాపమునకు దండన అనుభవిస్తే, ఆ పాపము పోతుంది. ఆ నేరము చేసిన వాడు పాపము నుండి విముక్తుడవుతాడు. ఒక వేళ రాజు పాపము చేసిన వాడికి దండన విధించకపోతే, ఆ పాపము రాజుకు సంక్రమిస్తుంది. పూర్వము మాంధాత అనే చక్రవర్తి, నీవు చేసినటువంటి పాపమే చేసిన ఒక వ్యక్తిని దండించకుండా వదిలిపెట్టాడు. దాని ఫలితంగా, అతడు చేసిన పాపము మాంధాతకు సంక్రమించింది. ఒక్క మాంధాత కాదు. ఎంతో మంది రాజులు, దండించతగిన వారిని దండించకుండా వదిలిపెట్టి, పాపములను పొందారు.
ఓ వానర రాజా! నేనేదో స్వతంత్రంగా ప్రవర్తించి నిన్ను చంపాను అని అనుకోవద్దు. నేనుస్వతంత్రుడను కాను. ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవలసిన వాడను. నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలులేదు.
ఓ వానర రాజా! నిన్ను దండించుటకు మరొక కారణము కూడా చెబుతాను విను. మానవులకు, ప్రత్యేకించి క్షత్రియులకు, వేట నిషిద్ధము కాదు. జంతువులను వేటాడేటప్పుడు మాటు వేసిచంపడం సర్వసాధారణం. వేటలో మృగములు పరుగెత్తుతున్నా, భయపడి నిలిచిపోయినా, ఏమరిపాటుగా ఉన్నా, అటువంటి మృగములను చంపడం పాపం కాదు. ధర్మము తెలిసిన ఎంతో మంది రాజర్షులు కూడా వేటకు వెళ్లేవారు. నీవు వానరుడవు. మృగజాతికి చెందినవాడివి. అందుకని క్షత్రియధర్మము ప్రకారము నిన్ను వేటాడాను. నీవు నాతో యుద్ధం చేస్తున్నా లేక సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నా, నువ్వు వానరుడివే కదా! నువ్వు నాతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే చంపాలి అనే నియమం లేదు. అందుకని ఒక రాజుగా నిన్ను దండించే ప్రక్రియలో భాగంగా నిన్ను చంపాను.
రాజులు ధర్మమును రక్షించడానికే పుట్టారు. క్షత్రియులు మానవరూపంలో భూమి మీద నడయాడుతున్న దేవతలు. అందుచేత దండన విధించిన రాజులను నిందించడం ధర్మం కాదు. నేను మా తండ్రి తాతల నుండి అనుసరిస్తున్న ధర్మము ప్రకారము నీకు దండన విధించాను. నీవేమో ధర్మం తెలియక నన్ను నిందించావు.” అని అనునయంగా చెప్పాడు రాముడు.
రాముని మాటలు విన్న వాలికి కనువిప్పు కలిగింది. ధర్మము తెలుసుకున్న వాలి, రాముని యందు తప్పులేదని గ్రహించాడు. అప్పుడు వాలి రామునికి నమస్కరించి ఇలా అన్నాడు.
“ఓ రామా! నీవు చెప్పినది అక్షరసత్యము. ఏ సందేహమూ లేదు. ధర్మం తెలియకుండా, అజ్ఞానంతో నేను పలికిన మాటలను పట్టించుకోవద్దు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడవు. ప్రజలకు మేలుచెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకొనేవాడివి. అందుకని ధర్మాధర్మ నిర్ణయమునకు నీవే సమర్థుడివి.
ఓ రామా! నేను అధర్మంగా ప్రవర్తించాను. తగిన దండన అనుభవించాను. రామా! నా దిగులు అంతా నా కుమారుడు అంగదుడి గురించి. అంగదుడు చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగాడు. నేను కనపడకపోతే ఆహారమూ నీరూ ముట్టడు. నా కుమారుడు చిన్నవాడు. లోకానుభవము లేదు. వాడిని నీవు రక్షించాలి. నీవు సుగ్రీవుని యందు ఎంతటి అనురాగం చూపుతావో అదే మాదిరి అంగదుని కూడా దయతో చూడు.
ఓ రామా! నీవు నీ తమ్ములు లక్ష్మణుని, భరతుని ఏ విధంగా మన్నిస్తావో, అదే మాదిరి సుగ్రీవునీ, అంగదునీ మన్నించు. చేసిన తప్పంతా నాదే. ఇందులో నా భార్య తారకు ప్రమేయం లేదు. నేను చేసిన అపరాధమునకు నా భార్య తారను నా తమ్ముడు సుగ్రీవుడు అవమానించకుండా చూడు. నా భార్య తార నీ గురించి చెప్పి నన్ను వారించినా, నేను ఆమె మాటలను పెడచెవిని బెట్టి సుగ్రీవునితో యుద్ధానికి తలపడినందుకు ఫలితంగా నీ చేతిలో మరణిస్తున్నాను.” అనిపలికి మౌనంగా ఉన్నాడు వాలి.
వాలి పలికిన పలుకులు విన్న రాముడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. “ఓ వానర రాజా! నీ కొడుకు అంగదుని గురించి, నీ భార్య తార గురించి నీవు దిగులు చెందవద్దు. మరొక మాట. నేను నిన్ను అనవసరంగా అన్యాయంగా చంపానని నీవు మనసులో బాధపడవద్దు. నీవేదో మహా పాపము చేసావని తలంచ వద్దు. నీవు పొరపాటు చేసావు. నేను నిన్ను దండించడానికి నిశ్చయించుకున్నాను. శిక్షింప తగ్గవాడిని శిక్షించిన రాజు, శిక్ష అనుభవించతగి ఉండి. ఆ శిక్షను అనుభవించిన నేరస్తుడు, ఇద్దరూ ఉత్తమ గతులుపొందుతారు. ఆ కారణం చేత తప్పు చేసిన నీవు నేను విధించిన దండనతో నీవు చేసిన పాపములు అన్నీ తొలగిపోయాయి. నీవు ఇప్పుడు నీ సహజమైన వాలి స్థితిని (సుగ్రీవుని వెళ్లగొట్టి అతని భార్య రుమను కామంతో పొందక ముందు ఉన్న స్థితి) పొందావు.
ఓ వాలీ! ఇది దైవ నిర్ణయము. దీనిని తప్పించుకోలేవు. కాబట్టి నీలో ఉన్న కోపమును మోహమును విడిచి శాంతము వహించు. నీవు కోరినట్టు గానే, అంగదుడు ఇప్పటిదాకా నీ పట్ల ఎంతటి అనురాగాన్ని, ప్రేమను ప్రదర్శిస్తున్నాడో, సుగ్రీవుని పట్ల, నా పట్ల అదే అనురాగాన్ని ప్రదర్శించగలడు.” అని వాలిని అనునయించాడు రాముడు.
రాముని మాటలను విని వాలి “ఓ రామా! నీవు నన్ను బాణంతో కొట్టి చంపావు అన్న కోపంలో శక్తి తగ్గి, కోపం పెరిగి, నిన్ను ఏమేమోఅన్నాను. నన్నుక్షమించు.” అని అన్నాడు వాలి. తాను చేసిన ఆరోపణలకు రాముడు ఇచ్చిన సమాధానానికి హేతుబద్ధమైన ప్రతిసమాధానాన్ని ఇవ్వలేకపోయాడు వాలి. పైగా అవసాన దశలో ఉన్నాడు. శరీరం క్షణక్షణానికి క్షీణించి పోతూ ఉంది. శక్తి తగ్గిపోతూ ఉంది. వాలి ప్రాణాలు అతని దేహన్ని విడువ డానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో వాలి స్పృహ తప్పి పడిపోయాడు.
కిష్కింధాకాండం సప్తదశం సర్గంలో, రాముడు వాల్మీకి రాజ్యాభిషేకానికి స్థలాన్ని తయారు చేస్తారు. సుగ్రీవుడు అంగదుని దాదాపు వానరులను అందించి, అంగదుని విధిని పాలిస్తున్నారు. రాముని నేతృత్వంలో వానరులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కాకసాయే, నల మరియు నీల పంచపర్వాలను ప్రధాన వానర సైన్యాలను నడిపిస్తారు. ఇంద్రజిత్తుని సంహారానికి రాముడు అంగదుని నిర్దేశాలు ఇస్తారు. ఈ సర్గంలో సుగ్రీవుడు రాముని విశ్వాసాన్ని గెలిచేందుకు అనేక చర్యలు తీసుకుంటారు.
రాముని బాణం దెబ్బ తిన్న వాలినేల మీద పడిపోయాడు. శరీరం పడిపోయింది కానీ అతని తేజస్సు తగ్గలేదు. వాలి మెడలో ఉన్న ఇంద్రమాల, అతని గుండెల్లో గుచ్చుకున్న రామ బాణము అతనిలో ఉన్న తేజస్సును సడలిపోనివ్వడం లేదు.
తన బాణము దెబ్బకు వాలి పడి పోగానే, రాముడు, లక్ష్మణుడు వాలి దగ్గరకు వెళ్లారు. వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముని చూచాడు. యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు. వాలి మాటల్లో రాముని పట్ల వినయం ఉంది. కాని పౌరుషం తగ్గలేదు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి.
“నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను. నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా! నీవంక తిరిగి నీ తో యుద్ధం చేయని వాడిని చంపి నీవు ఏం సాధించావు? నేను విన్నదానిని బట్టి రాముడు కులీనుడు. సత్త్వగుణ సంపన్నుడు. తేజస్వి. వ్రతనిష్ట కలవాడు. రాముడు కరుణామయుడు. ఎల్లప్పుడూ ప్రజలహితం కోరేవాడు. ఇతరుల పట్ల జాలి, దయ కలవాడు. ఉత్సాహవంతుడు. సమయస్ఫూర్తి కలవాడు. ధృడమైన బుద్ధికలవాడు. ఈ లోకంలో ఉన్న వారంతా నిన్ను పై గుణములతో కీర్తిస్తుంటారు కదా! పైగా నీవు రాజువు. రాజైన వాడు ఇంద్రియనిగ్రహము, ఓర్పు, ధైర్యము, బలము, పరాక్రమము, తప్పుచేసిన వారిని దండించే గుణము కలిగి ఉండాలి.
నీవు సుగ్రీవునికి అండగా, మిత్రుడుగా ఉన్నావని తార చెప్పింది. కానీ సకల సద్గుణ సంపన్నుడవైన నీవు తప్పు చేయవని నేను సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాను. నేను సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు నీవు నాకు కనపడలేదు. (అంటే రాముడు చెట్టు చాటునో పొదలమాటునో దాక్కుని ఉన్నాడని వాలి అంటున్నాడు.) కాని నీ బాణం దెబ్బనాకు తగిలింది. అంటే నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుంటే, నీవు నాకు కనపడకుండా మాటు వేసి నన్ను కొట్టావు అని నేను అనుకుంటున్నాను.
ధర్మాత్ముడవు అని పేరుగాంచిన నీ బుద్ధి ఇంత చెడ్డదనీ, నీవు ధర్మాత్ముడు అనే ముసుగులో అధర్మాలను ఆచరించే దుర్మార్గుడవు అనీ, పాపాత్ముడవనీ, గడ్డితో కప్పబడిన నేలబావి లాంటి వాడివనీ నాకు తెలియక, నేను సుగ్రీవునితో ధర్మయుద్ధానికి తలపడ్డాను. రామా! నీవు సాత్వికుని వేషంలో ఉన్న పాపాత్ముడివి, నివురు కప్పిన నిప్పులాంటి వాడివి అని తెలుసుకోలేకపోయాను.
రామా! నేను నీ దేశానికి రాలేదు. నీ నగరానికి రాలేదు. నీ దేశంలో కానీ, నీ నగరంలో కానీ ఏ నేరమూ, తప్పూ చేయలేదు. నిన్ను నేను ఎన్నడూ అవమానించలేదు. నీకు ఎటువంటి అపకారము చేయలేదు. నామానాన నేను అడవులలో ఉంటూ ఫలములు, మూలములు తింటూ బతుకుతున్నాను. నీవు నరుడవు. నేను కాయలు పండ్లు తినే వానరమును. పాపం చెయ్యడం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీతో యుద్ధం చేయడం లేదు. మరొకరితో యుద్ధం చేస్తున్నాను. అటువంటి నన్ను ఏ కారణంతో చంపావు?
రామా! నీవు రాజులలో ప్రసిద్ధుడవు. ఎన్నో శాస్త్రములను చదివావు. ప్రస్తుతము జటలు, నారచీరలు ధరించి మునివేషములో ఉన్నావు. ముని వేషములో ఉన్న నీవు ఇటువంటి క్రూరమైన పని చేయడం తగునా!
రామా! నీవు రఘు వంశములో పుట్టావు. పైకి మాత్రం ధర్మానికి ప్రతిరూపంగా కనపడతావు. కాని లోలోపల దుష్టుడివి. నీవు క్రూరత్వానికి ప్రతిరూపం. లోకానికి మాత్రం ధర్మాత్ముడు, మంచి వాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. రామా! రాజుకు ఉండవలసిన గుణములు ఏవంటే—సామము, దానము, క్షమ, ధర్మగుణము, సత్యము పలకడం, పరాక్రమము, ధైర్యము. ఇవీ రాజుకు ఉండవలసిన గుణములు. రామా! మేము అడవులలో ఉంటూ ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే వానరులము. నీవు నరుడివి. నరులకు రాజువు. మీకు అనుభవించడానికి రాజ్యము, వెండి, బంగారము కావాలి. కాని ఎక్కడో మారుమూల ఉన్న నా అరణ్యరాజ్యము నీకు ఎందుకు?
నీతిగా ఉంటడం, వినయము కలిగి ఉండటం, దండించతగినవారిని దండించడం, నిరపరాధులను విడిచిపెట్టడం, ఇవీ రాజు పాటించవలసిన ధర్మములు. రాజులు ఈ ధర్మములకు లోబడి ప్రవర్తించాలి కానీ వారి ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించరాదు. కాని నీవు రాజువై ఉండీ పై ధర్మములను పాటించలేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నీకు నీ కోరికలు తీరాలి. దాని కోసం ఏమి చెయ్యడానికైనా వెనుదీయవు. పైగా నీకు కోపం ఎక్కువ. నీ మనస్సు నిలకడలేదు. రాజధర్మములను ఆచరించడంలో నీకు | స్థిరమైన బుద్ధిలేదు. ఆయుధము నీ చేతిలో ఉంది కదా అని అందరినీ చంపుకుంటూపోతావు. అదీ నీ తత్త్వము.
ఓ మనుజేశ్వరా! రామా! నీకు ధర్మాచరణములో శ్రద్ధ, భక్తి లేవు. నీవు కామానికి దాసుడవు. నీ కోరికలు ఎటు లాగితే అటు వెళతావు. నాకు తెలిసీ నేను ఏ అపరాధమూ చెయ్యలేదు. అటువంటి నన్ను అకారణంగా చంపావు. ఈ చర్యను లోకుల ముందు, సాటి రాజుల ముందు, ఎలా సమర్ధించుకుంటావు?
ఓ రామా! రాజును, బ్రాహ్మణుని, గోవును, అమాయకమైన జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేవాడు, వేదప్రమాణమును నమ్మని వాడు, ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, గురువుగారి భార్యను కామించేవాడు, నరకానికి వెళతారు. నేను మనిషినికాను జంతువును. నన్ను అకారణంగా చంపావు. నీకు ఏ గతి పడుతుందో ఆలోచించుకో?
నేను జంతువును కాబట్టి నన్ను వేటాడావు అని అనుకోడానికీ వీలు లేదు. ఎందుకంటే నన్ను వేటాడి, చంపినందువలన నీకు ఏమన్నా ప్రయోజనము ఉందా అంటే అదీలేదు. నా చర్మము దేనికీ పనికిరాదు. నా వెంట్రుకలు, ఎముకలు, మీ వంటి మంచివారు తాకను కూడా తాకరు. నా మాంసము తినడానికి పనికిరాదు. ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఎందుకు వేటాడావు?
రామా! నీ క్రూర బుద్ధిని ఊహించిన నా భార్య నాకు హితోపదేశము చేసింది. కానీ గర్వాంధుడనై ఆమె ఉపదేశము పెడచెవిని పెట్టాను. తగిన ఫలితము అనుభవించాను. ఒక శీలవతికి దుర్మార్గుడైన భర్త ఉన్నా ఒకటే లేకా ఒకటే. అలాగే నీ రాజ్యానికి, ఈ భూమికి, దుర్మార్గుడైన, శీలవంతుడుకాని నీవంటిరాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే! దొంగచాటుగా దెబ్బతీసేవాడివి, ఇతరులకు అకారణంగా హాని చేసేవాడివి, నీచ బుద్ధి కలవాడివి, పైకి మాత్రం మంచి వాడిగా కనిపిస్తూ లోపల కుచ్ఛితమైన బుద్ధి కలవాడివి, పాపాత్ముడవు అయిన నీవు ఆ దశరథునికి కుమారుడిగా ఎలా జన్మించావో అర్థం కావడం లేదు. సత్పురుషులు, యోగ్యులు అయిన వాళ్లు నిందించే పనిని నీవు చేసావు. వారి ముందు నీ చర్యను ఎలా సమర్ధించుకుంటావు?
రామా! నేను నీకు శత్రువును కాను. మిత్రుడను కాను. నీవు నిజంగా వీరుడవు, పరాక్రమ వంతుడివి అయితే నీ శత్రువులతో యుద్ధం చేసి గెలువు. అదీ వీరత్వము అంటే! నేను నీకు శత్రువును అని నీవు అనుకుంటే, నాతో యుద్ధమే చేయాల్సింది. ఈ పాటికి నిన్ను యమునికి అతిథిగా పంపి ఉండేవాడిని. నన్ను ఎదిరించి పోరాడే ధైర్యము లేక, చేత కాక, చాటున ఉండి నన్ను చంపావు.
మద్యము మత్తులో నిద్రించు వాడిని పాము కాటు వేసినట్టు, నువ్వు నన్ను చాటునుండి చంపావు. నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేసావు అని నాకు తెలిసింది. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు.
రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చెయ్యడానికికి బదులుగా నీవు నా వద్దకు వచ్చి నాతో స్నేహం చేసి ఉంటే నేను ఆ రావణుని కాళ్లు చేతులు కట్టితెచ్చి నీ పాదాల ముందు పడవేసేవాడిని. ఆకాశములో గానీ, పాతాళములోకానీ, నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చి నీకు అప్పగించి ఉండేవాడిని.
రామా! సుగ్రీవుడు నాసోదరుడు. నా తరువాత కిష్కింధకు రాజు అవుతాడు. అది ధర్మమే. కానీ నీవు నన్ను చాటునుండి చంపడం మాత్రం అధర్మము. క్షమించరాని నేరము. నీకు చేతనయితే నీవు చేసిన కార్యము ధర్మబద్ధము అని నిరూపించుకో.” అని పలికి వాలి మౌనంగా ఉండిపోయాడు.
కిష్కింధాకాండంలో షోడశం సర్గం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు వానర సేన కూడా ప్రణయ కలాపాలు చేస్తుంటారు. సుగ్రీవుడు మాటలతో అలంకరించబడి, వివాహ సంస్కారాలను పాలిస్తాడు. అయోధ్యలో రాజ్యాభిషేకం చేయడంతో శ్రీరాముడు వానర సేనల సహాయాన్ని అందించేందుకు ముందుగా, రాజకీయ సహాయాన్ని సుగ్రీవుడు మాత్రం అందించడంతో రాముని ప్రియుడు మరియు భక్తుడగా చూడగలడు.
తార చెప్పిన మాటలు వాలి పెడచెవిని పెట్టాడు. తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. విదిలించి కొట్టాడు. పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించి వేసింది.
“నా కన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందూ వెనకా ఆలోచిస్తూ కూర్చోవాలా! కుదరదు. నీవు భయస్తురాలవు. పిరికిదానికి. నా వంటి వీరుడు శూరుడు యుద్ధానికి వెనుదీయ్యడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే, ఓర్పుతో ఉండటం మరణం కన్నా సహించరానిది. ఇంక రాముని గూర్చి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా. రాముడు ధర్మాత్ముడు. ఆర్తజనులను రక్షించేవాడు అని.
అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు. సుగ్రీవుని కోసరం పాపం ఎలా చేస్తాడు? ఏదో స్త్రీసహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు. ఇంకచాలు లోపలకు వెళ్లు.
పిచ్చిదానా! నేను నా సోదరుని చంపుతాను అనుకున్నావా! లేదు. నేను కేవలం సుగ్రీవుని అహంకారము అణిచి బుద్ధి చెప్పి పంపేస్తాను. అంతే. ప్రస్తుతము సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు. యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమకొద్దీ, నీ బుద్ధికి తోచిన ఉపాయము చెప్పావు. అది చాలు. ఇంక లోపలకు వెళ్లు. నేను చిటికలో సుగ్రీవుని గర్వము అణిచి అతనిని పారిపోయేట్టు చేసి వస్తాను.” అని పలికాడు వాలి.
తార ఇంక చేసేది లేక దుఃఖిస్తూ వాలికి ప్రదక్షిణ పూర్వక నమస్కారము చేసింది. భర్త విజయాన్ని కాంక్షిస్తూ అతనికి వీరతిలకము దిద్దింది. అంతఃపుర కాంతలతో సహా లోపలకు వెళ్లింది. వాలి కోపంతో బుసలు కొడుతూ నగరం బయటకు వచ్చాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని నలుదిక్కులా చూస్తున్నాడు. అల్లంత దూరంలో నడుముకు ధట్టికట్టుకొని ధైర్యంగా నిలబడి రంకెలు వేస్తున్న సుగ్రీవుని చూచాడు. వాలి కోపంతో సుగ్రీవుని వైపుకు వెళ్లాడు.
వాలి మెడలో ఇంద్రుడు ఇచ్చిన బంగారు మాల ఉంది. సుగ్రీవుని మెడలో రాముడు వేసిన గజపుష్పమాల ఉంది. సుగ్రీవుని చూచి వాలి ఇలా అన్నాడు. “ఒరేయ్ సుగ్రీవా! ఈ పిడికిలితో గట్టిగా గుద్దితే చస్తావురా! నాతో ఎందుకురా నీకు” అని అన్నాడు.
“ఓ వాలీ! నాకూ పిడికిలి ఉంది. నేనూ నీ తల మీద ఒక గుద్దు గుద్దితే తలపగిలి చస్తావు.” అని మాటకు మాట బదులు చెప్పాడు సుగ్రీవుడు. ఇంక వాలి ఊరుకోలేకపోయాడు. సుగ్రీవుని పిడికిలితో మోదాడు. సుగ్రీవునికి ఒళ్లంతా రక్తసిక్తము అయింది. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాలవృక్షమును పీకి వాలి మీదికి విసిరాడు. ఆ వృక్షము దెబ్బకు వాలి కదిలిపోయాడు. వాలి సుగ్రీవులు ద్వంద్వయుద్ధమునకు తలపడ్డారు. ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుతున్నారు. తన మెడలో ఉన్న సువర్ణమాల మహిమతో వాలి బలము క్షణక్షణము వృద్ధి చెందుతుంటే, సుగ్రీవుని బలము క్షీణించసాగింది. కాని పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు. రాముని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
వాలి సుగ్రీవులు కొమ్మలతోనూ, రాళ్లతోనూ, చెట్లతోనూ, గోళ్లతోనూ, పిడికిళ్లతోనూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది. వాలి దెబ్బకు తట్టుకోలేక సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు. సుగ్రీవుని బలం సన్నగిల్లింది అని గ్రహించాడు రాముడు. వాలిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. ధనుస్సును ఆకర్ణాంతము లాగి, వాలి మీదికి గురి చూచి, బాణమును వదిలాడు. రాముడు వదిలిన బాణము సరిగ్గా వాలి వక్షస్థలమును చీల్చుకుంటూ వీపు నుండి బయటకు వచ్చింది. ఆ బాణము దెబ్బతిన్న వాలి, పక్షిమాదిరి నేలకూలాడు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి. ఆరోజు వాలి నేలకూలాడు. వాలికి క్రమ క్రమంగా స్పృహ తప్పుతూ ఉంది. గొంతులో గుర గుర శబ్దం వస్తూ ఉంది. వాలియుద్ధరంగంలో దీనంగా పడి ఉన్నాడు.
కిష్కింధాకాండ పంచదశః సర్గలో, సుగ్రీవుడు రామునితో సీతా దేవి శోధనకు సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తాడు. వానరసేనలు వివిధ దిక్కులలో బయలుదేరి వెతకమని ఆజ్ఞలు పొందుతారు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు వంటి వానరులు తమ సేనలతో కలిసి సీతను వెతికే ప్రయత్నంలో పాల్గొంటారు. ఈ సర్గలో, వానరులు అడవులు, పర్వతాలు, నదులు, సముద్రతీరాలను దాటి వెతకడం ప్రారంభిస్తారు. వారి శోధనలో సీతను కనుగొనడానికి అడ్డంకులను అధిగమించడం కోసం తమ బలాన్ని, ధైర్యాన్ని చూపిస్తారు. సీతను రక్షించి రామునికి తిరిగి తీసుకురావాలని సంకల్పంతో వానరులు తమ ప్రయత్నాన్ని మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తారు.
ఉంది. ఆ సాయం ఎవరు, ఏ రూపంలో చేస్తున్నారో తెలియదు. ఇంతకూ సుగ్రీవునికి సాయం చేసే వాళ్లు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? సుగ్రీవునికి సాయం చెయ్యాల్సిన అవసరం వారికి ఏముంది? బయట నుండి సాయం లేకుండా సుగ్రీవుడు ఇంతధైర్యంగా మరలా నీ మీదికి యుద్ధానికి కాలు దువ్వడు.
సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు. నేర్పు కలవాడు. తనకు ఏ లాభమూ లేకుండా ఎవరితోనూ స్నేహం చెయ్యడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో స్నేహం చేసాడో తెలుసుకోవడం అవసరం కదా! ఇటీవల మీ కుమారుడు అంగదుడు నాకు ఒక వార్త చెప్పాడు. దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను. మన సరిహద్దుల్లో కాపలా ఉండే గూఢచారులు అంగదునికి ఈ వార్త చెప్పారట.
అదేమిటంటే…… ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు, దశరథుని కుమారులు, రామ లక్ష్మణులు అనే పేరు గల వాళ్లు మన వనములో సంచరిస్తూ ఉన్నారట. వారితో సుగ్రీవునికి స్నేహం కలిసిందట. వారు సుగ్రీవుని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నారట. ఇంక ఆ రాముడు ధనుస్సును ప్రయోగించడంలో గొప్ప నేర్పరి. బాణములను వేగంగా వేయగలడు. ఆ రాముడు ధర్మపరుడు. ఆపదలలో ఉన్నవారిని కాపాడే గుణం కలవాడు. మంచి లౌకిక జ్ఞానము శాస్త్రజ్ఞానము కలవాడు. తండ్రి ఆజ్ఞను పాలించేవాడు. రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం అని తెలిసింది. అటువంటి వాడు ఇప్పుడు నీ సోదరుడు సుగ్రీవునికి సాయం చేస్తున్నాడట. కాబట్టి రామునితో నీకు విరోధము తగదు అని నా భావన. నీవు నా మీద కోపం తెచ్చుకోకపోతే నీకు ఒక విషయం చెబుతాను. సావధానంగా విను. నీకు తెలుసు.
సుగ్రీవుడు ఏ తప్పూ చేయలేదు. కాబట్టి నీ తమ్ముని ఆదరించు. అతని రాజ్యము అతనికి ఇవ్వు. సుగ్రీవునితో విరోధము మాను. నీవు సుగ్రీవునితోస్నేహం చేసుకుంటే, రాముడు కూడా నీకు స్నేహితుడు అవుతాడు. నాధా! సుగ్రీవుడు పరాయివాడు కాదు కదా! నీకు స్వంత తమ్ముడు. అతని మీద ప్రేమ చూపించాలి గానీ ద్వేషించకూడదు. ప్రస్తుతము నీకు నీ సోదరుడు సుగ్రీవునితో సంధి చేసుకొనడం తప్ప వేరు మార్గము లేదు. నేను నీ హితము కోరి ఈ మాటలు చెబుతున్నాను. నీవు నా భర్త కాబట్టి, నీ క్షేమమును నేను సదా కోరుతాను కాబట్టి చెబుతున్నాను. కోపము, ద్వేషము విడిచి పెట్టు. నా మాటవిను. సుగ్రీవునితో యుద్ధము మాను. ” అని తార తన భర్త వాలికి హితోపదేశము చేసింది. కాని తార మాటలు వాలికిరుచించలేదు.
(ఇది విదురుడు సుయోధనునికి హితము చెప్పినట్టు ఉంది కదా! వాలి– సుయోధనుడు. సుగ్రీవుడు– ధర్మరాజు. సుగ్రీవునితో రామునికి మైత్రి కుదిరింది. ధర్మరాజుతో కృష్ణునికి బంధుత్వతము మైత్రి రెండు ఉన్నాయి. ఇద్దరి మధ్యా రాజ్యము వలన తగాదా వచ్చింది. సుగ్రీవుని భార్యను వాలి అవమానిస్తే, ధర్మరాజు భార్యను సుయోధనుడు అవమానించాడు. వాలి సుగ్రీవుని అడవులకు తరిమితే, సుయోధనుడు ధర్మరాజును అడవులకు పంపాడు. అరణ్య వాసం తరువాత ధర్మరాజు యుద్ధం చేస్తే, అరణ్యవాసం తరువాత సుగ్రీవుడు వాలితో యుద్ధం చేసాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వాలిని చంపితే, కృష్ణుడు చెప్పిన ఉపాయంతో భీముని చేతిలో సుయోధనుడు చచ్చాడు. కృష్ణుడు ఏ పక్కన ఉంటే అక్కడ జయం ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. విదురుడు సుయోధనునితో సంధి చేసుకోమంటే, ఇక్కడ తార కూడా వాలిని సంధిచేసుకోమని చెప్పింది. యుగాలు మారినా, కధలు వేరైనా, ధర్మం ఒకటే. అదే కలియుగంలో చిన్న సామెత రూపంలో ఉంది. పోరు నష్టము పొందు లాభము.)