మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాత్రింశః సర్గలో, రావణుడి ఆడంబరం మరియు వైభవం అతని విలక్షణత మరియు వ్యక్తిత్వం, అతని విజయాలు మరియు విజయాలు, అతని అసూయలు మరియు దురాశలతో పాటు చిత్రీకరించబడింది. లక్ష్మణుడి చేతిలో తన గతి గురించి తెలియజేయడానికి శూర్పణఖ అతనిని సమీపించింది.
తన అన్నలు ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యము తన కళ్లముందు నాశనం కావడం చూచి తట్టుకోలేక పోయింది శూర్పణఖ. ఒక్క రాముని చేతిలోనే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చావడం చూచి పెద్దగా కేకలుపెట్టింది. భయంతో శూర్పణఖ వణికిపోయింది. వెంటనే ఈ విషయం తన అన్న రావణునకు చెప్పడానికి శూర్పణఖ లంకకు పరుగెత్తింది.
లంకానగరంలో, రావణుడు, మూర్తీభవించిన దేవేంద్రుని వలె, సభాప్రాంగణంలో, తన బంగారు సింహాసనము మీద, కూర్చుని ఉన్నాడు. రావణుని చుట్టు అతని మంత్రులు కూర్చుని ఉన్నారు.
రావణుడు సామాన్యుడు కాడు. దేవతలను, గంధర్వులను యుద్ధములో గెలిచినవాడు. ముల్లోకములలో అతనికి తిరుగు లేదు. శత్రువులకు యముడు లాగా వెలుగుతున్నాడు రావణుడు. దేవాసుర యుద్ధములో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలనా, విష్ణువు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయాలకు చిహ్నాలుగా రావణుని ఒంటిమీద ప్రకాశిస్తున్నాయి. రావణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి.
రావణుడు దశకంఠుడు. అంటే పది తలలు కలవాడు. అతనికి ఇరువది చేతులు, పది తలలు. ఆ కనకపు సింహాసనము మీద వెండి కొండమాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు. రావణుడు పరాక్రమవంతుడే కాదు. ఇతరుల భార్యలు అంటే అతనికి మక్కువ ఎక్కువ. ఒకసారి భోగవతీ నగరానికి పోయి, తక్షకుని భార్యను బలాత్కారంగా తీసుకొని వచ్చాడు. రావణునికి ధర్మాచరణము మీద నమ్మకము లేదు. రావణుడు కుబేరుని ఓడించి అతని వద్ద ఉన్న పుష్పక
విమానమును అపహరించాడు.
రావణుడు దివ్యాస్త్రములను ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, అంతే నేర్పుతో సాధుజనులు చేయు యజ్ఞయాగములను భగ్నం చేస్తాడు. రావణునికి కోపం వస్తే సుందర ఉద్యానవనములను, అందమైన వనములను, సరస్సులను నాశనం చేస్తాడు. ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే తత్వం రావణునిది. రావణుడు ఎంతటి అధర్మపరుడైనా గొప్ప తపశ్శాలి.
పూర్వము బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేసాడు. తన శిరస్సులను ఖండించి బ్రహ్మదేవునికి సమర్పించాడు. దాని ప్రతిఫలంగా బ్రహ్మదేవుని వద్దనుండి తనకు యుద్ధములో దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పక్షిజాతులు, సర్పజాతులు, ఒక్క మానవులు తప్ప ఏ ఇతర జీవ జాతుల నుండి కూడా తనకు మరణము లేకుండా వరం పొందాడు. మానవులు తనను ఏమీ చేయలేరని గుడ్డినమ్మకం రావణునిది.
రావణునికి దేవతలు అంటే మంట. ఋత్విక్కులు యజ్ఞయాగములలో హవిస్సులు దేవతలకు ఇవ్వకుండా ఆ యజ్ఞములను నాశనం చేసేవాడు. రావణుడు బ్రాహ్మణులను, ఋషులను, మునులను కూరంగా చంపేవాడు. అతని హృదయము పాషాణము. జాలి అనే పదానికి రావణునికి అర్థం తెలియదు. ప్రజలను హింసించడంలో ఆసక్తి చూపేవాడు.
అటువంటి రావణునికి శూర్పణఖ చెల్లెలు. తన గోడు చెప్పుకోడానికి శూర్పణఖ పరుగు పరుగున రావణుని వద్దకు వచ్చింది. కోయబడిన తన ముక్కు, చెవులను రావణుని చూపించి ఇలా పలికింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – చతుర్వింశః సర్గలో, రాముడు సీతతో పాటు లక్ష్మణుడితో దండకారణ్యంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఆయన రాక్షసులపై శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. రాక్షసులు రాముని శక్తిని పరీక్షించేందుకు అనేక మార్గాల్లో అతనిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా వారిని ఎదుర్కొంటాడు.
జనస్థానములో ఖరుడికి కనపడ్డ దుశ్శకునములు అన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులకు కూడా కనపడ్డాయి. వాటిని చూచిన రాముడు లక్షణునితో ఇలా అన్నాడు.
“లక్ష్మణా! ఆకాశంలో కనపడే దుశ్శకునములను చూచావు కదా! ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి శకునములు ఒక మహాయుద్ధమునకు ముందుకనపడతాయి. అరణ్యములో మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయము కలుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ప్రాణాపాయము కూడా కలగ వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధము జరగబోతోంది అనుటలో సందేహము లేదు.
లక్ష్మణా! జాగ్రత్తగా విను. రాక్షసుల అరుపులు, భేరీనినాదములు వినిపిస్తున్నాయి. రాక్షసులు మనమీదికి యుద్ధానికి వస్తున్నారు. కాబట్టి మనము జరగబోయే దానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నీవు ధనుర్బాణములు ధరించి, సీతను తీసుకొని, చెట్లతోనూ, పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు. నా మాటకు అడ్డు చెప్పవద్దు.
“నేనే రాక్షసులను చంపుతాను.” అనే మాటలు చెప్పవద్దు. మనకు సీత క్షేమము ముఖ్యము. నీవు సీతకు రక్షణగా ఉండు. నేను రాక్షసులను చంపుతాను. అంటే నీవు రాక్షసులను చంపలేవని కాదు. నీవు వీరాధివీరుడవు, శూరుడవు. నీవు ఒక్కడివే అందరు రాక్షసులను మట్టుపెట్టగలవు. కానీ నేను ఒక్కడినే రాక్షస సంహారము చేయవలెనని కోరికగా ఉంది. అందుకనీ నీవు సీతను తీసుకొని వెళ్లు.” అని అన్నాడు రాముడు.
రాముని మాటను మీరలేక, లక్ష్మణుడు, సీతను తీసుకొని గుహలోకి ప్రవేశించాడు. రాముడు కవచమును ధరించాడు. ధనుర్బాణములు తీసుకున్నాడు. ధనుష్టంకారము చేసాడు. రాముడు మొదటిసారిగా రాక్షసులతో యుద్ధ చేయబోతున్నాడు. అందుకని ఆకాశంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు అందరూ సమావేశమయ్యారు.
“రాముడు ఒక్కడు. రాక్షస సేనలు 14,000. ఎలా యుద్ధం చేస్తాడు.” అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. వాళ్ల కళ్లకు రాముడు ప్రళయ కాల రుద్రుడిలా కనపడుతున్నాడు.
ఇంతలో రాక్షస సైన్యము అక్కడకు చేరుకుంది. నాలుగు పక్కల నుండి రాక్షసులు రాముని చుట్టుముట్టారు. పెద్దగా కేకలుపెడుతున్నారు. కొందరు ధనుస్సులను ఠంగు ఠంగున మోగిస్తున్నారు. యుద్ధభేరీలు మోగుతున్నాయి. ఆ భయంకర ధ్వనులకు అడవిలో ఉన్న క్రూరమృగములు సైతము పారిపోయాయి. రాక్షస సైన్యము నలుదిక్కుల నుండి రాముని దగ్గర దగ్గరగా వస్తూ ఉంది.
రాముడు చుట్టూ చూచాడు. తనను చుట్టుముట్టిన రాక్షసులను పరికించి చూచాడు. అమ్ములపొదిలోనుండి బాణములను తీసాడు. రాక్షసులు మీదికి సంధించాడు. రాక్షస సంహారం కోసరము తీవ్రమైన కోపమును తెచ్చుకున్నాడు.
(ఈవిషయము మనకు బాల కాండలో రాముని గుణగణముల గురించి చెప్పేటప్పుడు చదువుకున్నాము. రాముడు శాంతస్వభావుడు. కోపం అనేది తెలియదు. కాని అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు. అవసరం తీరిపోగానే కోపాన్ని వదిలేస్తాడు. మరలా శాంత మూర్తి అవుతాడు. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. కాని మనం చీటికి మాటికీ కోపం తెచ్చుకుంటాము. అన్ని అనర్థాలను తలకు చుట్టుకుంటాము. కష్టనష్టాలను అనుభవిస్తాము. అన్ని కష్టాలు నాకే పెట్టావా భగవంతుడా అని దేవుడిని తిడతాము. అందుకే మనం మానవులం అయ్యాము.)
రాముని కోపం ఆవహించింది. రాక్షసుల మీద కోపంతో ఊగిపోయాడు రాముడు. దక్షయజ్ఞంలో విజృంభించిన రుద్రునిలా ప్రకాశించాడు రాముడు. రాక్షస సైన్యము ఆయుధములతో రాముని చుట్టుముట్టింది..
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, అకంపన అనే రావణుడి గూఢచారి రాముడు జనస్థానాన్ని నాశనం చేసిన వార్తను తెలియజేయడానికి అతని వద్దకు పరుగెత్తాడు. సీతను అపహరించమని రావణుడిని సూచిస్తాడు. ఎందుకంటే సీతని విడిచిపెట్టడం వల్ల రాముడికి శోకం కలుగుతుంది మరియు తద్వారా అతను మరణిస్తాడు. కొంతసేపు ఆలోచిస్తూ, సీతను అపహరించడంలో సహాయం కోరుతూ మరీచ వద్దకు రావణుడు వెళ్తాడు. మారీచా రాముడి సామర్థ్యాలను వివరిస్తూ, విష్ణువు యొక్క అవతారాలను గుర్తుచేస్తాడు మరియు రావణుడికి ఉన్నదానితో సంతృప్తి చెందమని సలహా ఇస్తాడు.
(ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. ఇది ప్రక్షిప్తము అనగా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము)
ఖరుడు, దూషణుడు తమతమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది. వెంటను అకంపనుడు అనే రాక్షసుడు లంకానగరానికి బయలు దేరాడు. రావణుని కలుసుకున్నాడు.
“ఓ రావణా! నేను జనస్థానము నుండి వస్తున్నాను. అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న ఖరుడు, దూషణుడు, వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు. నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను.” అని జరిగింది క్లుప్తంగా వివరించాడు.
ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండి పడ్డాడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు.
“ఓ అకంపనా! ఇది నిజమా! నా అధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి, ఖరదూషణాదులను చంపిన వాడు ఎవరు? వాడికి ఆయువు మూడిందా! లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు. నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బతకలేరు కదా!
ఇంక వీడెంత? వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది. నేను యముడికి యముడను. అగ్నిని కూడా కాల్చివేయగల సమర్థుడను. మృత్యుదేవతకే మృత్యువును. నాకు కోపం వస్తే సూర్యుడిని, అగ్నిని కూడా దహించివేస్తాను. వాయువును కూడా శాసించగలను. అకంపనా! ఇంతకూ వాడెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు. ఎక్కడ ఉంటాడు?” అని కోపంగా అడిగాడు రావణుడు.
ప్రళయాగ్నితో సమానమైన రావణుని కోపం చూచి అకంపనుడు భయంతో వణికిపోయాడు. “నన్ను తమరు చంపను అని అభయం ఇస్తే జరిగింది చెబుతాను” అని అన్నాడు గడగడా వణుకుతూ.
రావణుడు కొంచెం శాంతించాడు. “అలాగే అభయం ఇచ్చాను. ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు” అని అన్నాడు. అకంపనుడు ఇలా చెప్పసాగాడు.
“అయోధ్యానగరమును పరిపాలించు దశరథుని కుమారుడు రాముడు. యువకుడు. మహా పరాక్రమశాలి. ఆజానుబాహుడు. గొప్ప వీరుడు. అతడే ఒంటరిగా ఖరుని, దూషణుని, ససైన్యంగా సంహరించాడు.” అని మరలా క్లుప్తంగానే చెప్పాడు ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో.
ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. రావణునిలో ఇదివరకు ఉన్న కోపం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. “అకంపనా! రాముడు ఒంటరిగా జనస్థానమునకు వచ్చాడా లేక ఇంద్రుని, దేవతలను తోడుగా తీసుకొని వచ్చాడా?” అని అడిగాడు, రాముని వెనుక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామనే ఆలోచనతో.
రావణుని కోపం తగ్గగానే అకంపనుడిలో ధైర్యం పుంజుకుంది. మరలా రాముడి గురించి చెప్పసాగాడు.
“ఆ రాముడు మహాతేజస్సు కలవాడు. సర్వశ్రేష్ఠధనుర్ధారి. దివ్యాస్త్ర సంపన్నుడు. ఇంతెందుకు దేవేంద్రునితో సమానమైన వాడు. ఆ రాముడి వెంట లక్ష్మణుడు అని అతని తమ్ముడు ఉన్నాడు. అన్నకంటే మించిన వాడు. మహా బలశాలి. రామ లక్ష్మణుల చేరికతో వాయువు తోడైనట్టే.
అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానమును సర్వనాశనం చేసాడు. అంతేగానీ తమరు అన్నట్టు దేవేంద్రుడు గానీ, దేవతలు గానీ జనస్థానమునకు రాలేదు. రాముడు ప్రయోగించిన బాణములు కాలసర్పముల వలె జనస్థానములో ఉన్న రాక్షసులను కబళించి వేసాయి.
ఓ రాక్షసరాజా! రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కోరాముడిలాగా ప్రత్యక్షం అయి వాళ్లను నాశనం చేసాడు. ” అని అన్నాడు అకంపనుడు.
అకంపనుని మాటలు సావధానంగా విన్నాడు రావణుడు. ఎవరిని పంపినా లాభం లేదు అనుకున్నాడు. తానే జనస్థానమునకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు.
“అకంపనా! ఇంక నీవు వెళ్లవచ్చు. నేనుస్వయంగా జనస్థానమునకు వెళ్తాను.” అని అన్నాడు.
“రాక్షసరాజా! నా మనవి వినండి. రాముడు సామాన్యుడు కాడు. రాముని జయించడం మన వల్లకాదు. రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు. రాముడు భూమ్యాకాశాలను ఏకం చేయగల వీరుడు. సప్తసముద్రము లను ఏకం చేసి ఈ భూమిని ముంచివేయగల పరాక్రమశాలి.
రాముడు ఈ లోకములనన్నిటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి. (సృష్టి, స్థితి, లయకారకుడు అని అర్థం. రాముడు భగవంతుడు అని అకంపనుడి అభిప్రాయం). ఓ రావణా! నీవుగానీ, నీ రాక్షస సైన్యము కానీ రాముని జయించడం కల్ల. నీవే కాదు. దేవాసురులు ఏకమై వచ్చినా రాముని యుద్ధంలో ఎదుర్కొనలేరు.
కాని రావణా! ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది కదా! ఆ మార్గంలో వెళితే రాముని చంపవచ్చు. ఆ రామునికి సీత అనే అతిలోకసౌందర్యవతి భార్య ఉంది. మంచి యౌవనవతి. దేవతా స్త్రీలుగానీ, అప్సరసలు కానీ అందంలో ఆమెకు సాటిరారు. సీత అంటే రాముడికి పంచప్రాణాలు. సీత లేకుండా రాముడు బతకలేడు. నీవు కనక సీతను అపహరించి తీసుకొని వస్తే, సీత మీద బెంగతో రాముడు ప్రాణాలు విడుస్తాడు. రాముని చంపడానికి ఇది ఒకటే మార్గము.” అని ఒక ఉపాయం చెప్పాడు అకంపనుడు.
రావణునికి ఈ మాటలు కర్ణపేయంగా వినపడ్డాయి. ఒక దెబ్బతో రెండు పిట్టలు. సీతను అపహరిస్తే అటు రాముడు చస్తాడు, ఇటు సీతా తనకు దక్కుతుంది. ఇలా వక్రంగా ఆలోచించాడు రావణుడు, అకంపనుని చూచి ఇలా అన్నాడు.
“అకంపనా! మంచి ఆలోచన చెప్పావు. నేను ఒక్కడినే రేపే జనస్థానమునకు వెళ్లి, సీతను నా రథము మీద కూర్చుండపెట్టుకొని లంకకు తీసుకొని వస్తాను.” అని అన్నాడు.
వెంటనే మంచి గాడిదలు కట్టిన రథమును సిద్ధం చేయమన్నాడు. గాడిదలు కట్టిన రథంలో రావణుడు ఆకాశమార్గంలో జనస్థానమునకు వెళ్లాడు. జనస్థానము దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు, రావణుడు మారీచుని వద్దకు వెళ్లాడు. రావణుని చూచి మారీచుడు అతనికి సకల ఉపచారములు చేసాడు. భక్ష్యములను, భోజన పదార్థములను సమర్పించాడు. రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనము మీద కూర్చున్నాడు. అప్పుడు మారీచుడు రావణునితో ఇలా అన్నాడు.
“రాక్షసరాజా! నీకు జయము కలుగు గాక! లంకలో అందరూ క్షేమమే కదా! ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసైగతో పూర్తి చేయగల సమర్థుడవు, అటువంటిది నీవే స్వయంగా ఇక్కడకు వస్తే నాకు ఏదో సందేహముగా ఉంది. అందుకని అడిగాను. తమరు ఏదో తొందరపని మీద ఇక్కడకు వచ్చి ఉంటారు అని అనుకుంటాను.” అని అన్నాడు మారీచుడు, “ఏం పని మీద వచ్చారు” అని సూటిగా రావణుని అడక్కుండా.
మారీచుని మాటలు విన్న రావణునికి మారీచుని మనసులోని సందేహం అర్థం అయింది. అందుకని సూటిగానే చెప్పాడు.
“మారీచా! ఎవరో రాముడు అట. జనస్థానములో ఉన్న ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యమును ఒంటి చేత్తో తుదముట్టించాడట. ఎవరికీ తేరిపార చూడటానికి శక్యం కాని జనస్థానమును సర్వనాశనం చేసాడట. ఆ రాముని ఉపాయంతో చంపవలెనని అనుకుంటున్నాను. ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము. ఆ సీతను అపహరిస్తే, రాముడు ప్రాణాలు విడుస్తాడు. అందుకని రాముని భార్య సీతను అపహరించవలెనని అనుకుం టున్నాను. దానికీ నీ సాయం కావాలి.” అని సూటిగా అడిగాడు రావణుడు.
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు పడ్డాడు మారీచుడు. “రావణా! నీకు ఇటువంటి ఆలోచన చెప్పిన వాడు ఎవరు? రాముని భార్య సీతను అపహరించమని చెప్పిన ఆ దుర్మారుడు, దుష్టుడు ఎవరు? వాడు నీకు ఆప్తుడు కాదు. నీకు పరమశత్రువు. నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచన కలిగించాడు. “సీతను అపహరించాలి” అనే ఆలోచనే నీ సర్వనాశనానికి దారితీస్తుంది. నీకు ఈ ఆలోచన చెప్పివాడు ఎవరో కానీ, నిన్ను తప్పుదోవ పట్టించాడు. వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరలు పీకమని చెబుతాడా?
రావణా! నేను చెబుతున్నాను విను. రాముడు ఒక మదగజము. దాని కాళ్ల కిందపడి నలిగిపోతావు. రాముడు ఒక సింహము. ఆ సింహము జూలుపట్టి లాగకు. లేడిపిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు. రాముడు ఒక సుడిగుండము. అనవసరంగా ఆ సుడిగుండములో దూకకు. మరలా ప్రాణాలతో బయటకు రాలేవు. ఆ ప్రవాహవేగానికి కొట్టుకుపోతావు.
ఓ లంకేశ్వరా! నా మాటవిను. తిరిగి లంకకు వెళ్లు. హాయిగా లంకను పాలించు. నీ భార్యలతో సుఖించు. రాముడిని తన భార్యతో ఆ అడవిలోనే ఉండనీ. రాముని జోలికి పోకు.” అని హెచ్చరించాడు మారీచుడు. రావణుడు మారీచుని మాటలు విని తిరిగి లంకకు వెళ్లిపోయాడు.
అయోధ్యాకాండం సప్తనవతితమ (97వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, ఇతర రుషులు, సైనికులు రాముని వద్దకు చేరుకుంటారు. భరతుడు రాముని పాదాలు స్పృశించి, తన తండ్రి మరణాన్ని, తన బాధను వ్యక్తపరుస్తాడు. భరతుడు రాముని తిరిగి రావాలని ప్రాధేయపడతాడు, కానీ రాముడు తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం కొనసాగిస్తానని చెప్పి, తన ధర్మాన్ని పాటిస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అయోధ్యకు తిరిగి వెళ్లి, అవి సింహాసనంపై ఉంచి, రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాడు.
భరతుని మీద కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! శాంతించు. తొందర పడకు. వచ్చేవాడు భరతుడు అని నువ్వే చెప్పావు. భరతుడు మన సోదరుడు. పైగా ధర్మాత్ముడు. ఇప్పుడు మనకు కత్తులతోనూ విల్లుతోనూ అస్త్రశస్త్రములతోనూ పని ఏమున్నది. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించుటకు అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు భరతుని చంపి ఆ రాజ్యమును ఏమి చేసుకుంటాను. ఎందుకంటే నేను 14 సంవత్సరముల దాకా రాజ్యపాలన చేయలేను కదా. అదీకాకుండా సోదరుని చంపితే వచ్చేరాజ్యము విషము వంటిది. దానిని నేను ముట్టను.
మరొక విషయం. నేను ఈ రాజ్యమును కోరుతున్నానుఅంటే అది మీ కొరకే గానీ నాకు కాదు. నాకు ఏమీ అక్కరలేదు. ఈ పదునాలుగు సంవత్సరముల తరువాత కూడా నేను మీ కొరకు మాత్రమే రాజ్యపాలన చేస్తాను. నాకు రాజ్య కాంక్ష ఏ మాత్రమూ లేదు. ఇది నా ప్రతిజ్ఞ. మరొక మాట. నేను కావాలి అనుకుంటే శత్రువుల నందరినీ సమూలంగా నాశనం చేసి రాజ్యము కైవసము చేసు కోగలను. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అధర్మపరంగా వచ్చే ఇంద్రపదవి కూడా నాకు ఇష్టం లేదు. అయినా మీకు లేని సుఖము నాకు ఎందుకు. భరతుడు, శత్రుఘ్నుడు, లేని రాజ్యము నాకు ఎందుకు. కాబట్టి శాంతించు. అసలు విషయం తెలుసుకో. నా ఊహ ప్రకారము భరతుడు తన మాతామహుల ఇంటి నుండి తిరిగి వచ్చి, తన తల్లి మూలంగా మనము అరణ్యములకు వెళ్లినట్టు తెలుసుకొని, తిరిగి మనలను అయోధ్యకు తీసుకొని వెళ్లుటకు వచ్చిఉంటాడు. ఎందుకంటే మన కులధర్మము ప్రకారము జ్యేష్టుడే రాజు కావలయును కదా. అందువలన భరతుడు పట్టాభిషేకమునకు అంగీకరించడు. కేవలము మనలను చూచుటకే వస్తూఉంటాడు.
అదీకాకుండా తన తల్లి మూలంగా ఇది అంతా జరిగింది అని తెలుసుకొని నన్ను తిరిగిఅయోధ్యకు తీసుకొనివెళ్లి పట్టాభిషేకము జరిపించవలెనని నా రాజ్యము తిరిగి నాకు ఇవ్వవలెననే ఉద్దేశ్యముతోనే వస్తూ ఉంటాడు. కాబట్టి భరతుడు మనకు కలలో కూడా అపకారము తలపెట్టడు.
అదీకాకుండా లక్ష్మణా! భరతుని సంగతి నీకు తెలియదా! ఇంతకు పూర్వము భరతుడు నీకు ఎప్పుడైనా ఎలాంటి అపకారమైనా చేసాడా! ఇలాంటి భయమును కలిగించాడా! లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు భరతుడు మనకు అపకారము చేస్తాడు అని భయపడు తున్నావు. కాబట్టి భరతుని ఒక్క మాట కూడా అనకు. ఎందుకంటే భరతుని తిడితే నన్ను తిట్టినట్టే.
మరొక మాట ఈ లోకంలో ఎవరైనా ఎంతటి ఆపదలో ఉన్నా కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరులను చంపుకుంటారా! పోనీ నీవు రాజ్యము కావలెనని కోరుకుంటూ ఉంటే చెప్పు. భరతునితో చెప్పి అయోధ్యను నా బదులు నీకు ఇప్పిస్తాను. హాయిగా రాజ్యము ఏలుకో. ఎందుకంటే, ‘భరతా! ఈరాజ్యము లక్ష్మణునికి ఇమ్ము’ అని అనగానే భరతుడు సంతోషంగా నీకు రాజ్యము ఇస్తాడు. ఆ నమ్మకము నాకు ఉంది. చెప్పు నీకు రాజ్యము కావాలా!” అని అడిగాడు రాముడు. లక్ష్మణుడు తన అవివేకపు మాటలకు సిగ్గుతో తల దించుకున్నాడు.
“లక్ష్మణా! అసలు విషయం ఏమిటంటే, భరతుడు రాగానే, మన తండ్రి దశరథుడు, భరతుని వెంటబెట్టుకొని మనలను చూడటానికి వస్తున్నాడు అని అనుకుంటున్నాను. అంతే కాదు, మనము పడుతున్న కష్టములను చూచి, మనలను తిరిగి అయోధ్యకు ఆహ్వానించుటకు వస్తున్నాడేమో అని కూడా అనుమానంగా ఉంది. ఒక వేళ మనము అయోధ్యకు రావడానికి ఇష్టపడక పోతే, కనీసము సీతనైనా తన వెంట తీసుకొని వెళతాడు దశరథుడు.
లక్ష్మణా! అటుచూడు అది మన తండ్రిగారి భద్రగజము కదా! మంద్రగమనంతో ఇటే వస్తూ ఉంది. కాని ఆగజము మీద మన తండ్రి గారి చిహ్నమైన తెల్లటి గొడుగు ఉండాలే. అది కనపడటం లేదు. ఏమయి ఉంటుంది. తండ్రిగారు వస్తుంటే ఆయనవెంట రాజచిహ్నమైన శ్వేతఛత్రము తప్పనిసరిగా ఉంటుంది కదా! అంటే తండ్రిగారు రావడం లేదా! భరతుడు ఒక్కడే వస్తున్నాడా! సరేలే. నువ్వు ఇక్కడే ఉండు.
నేనుచెప్పువరకూ కదలకు.”అని ఆదేశించాడు రాముడు. ఇక్కడ ఇలా ఉంటే, అక్కడ భరతుడు తన సేనలకు ఆజ్ఞఇచ్చాడు. “ఇక్కడ రాముని ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమము వద్ద శాంతికి భంగము కలగకూడదు. కాబట్టి సైన్యము అంతా ఈ పర్వతము చుట్టు విడిది చేయండి.” అని ఆజ్ఞాపించాడు. భరతుని ఆజ్ఞ ప్రకారము భరతుని సైన్యము చిత్రకూట పర్వతము చుట్టూ ఆవరించింది.
అయోధ్యాకాండం షణ్ణవతితమ (96వ) సర్గలో, భరతుడు రాముని వనవాసం నుండి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా సాగుతుంది. భరతుడు తన సైన్యంతో కలిసి చిత్రకూటానికి చేరుకుంటాడు. అక్కడ, అతను రాముడు, సీత, లక్ష్మణులను చూస్తాడు. రాముడు భరతుని ఆత్మీయతను, ప్రేమను గమనించి ఆనందిస్తాడు. భరతుడు రాముని తనతో తిరిగి రావలసిందిగా వేడుకుంటాడు. కానీ, రాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించడం ధర్మమని, వనవాసం పూర్తి చేయడం తన కర్తవ్యమని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి వచ్చేవరకు పాలన చేస్తానని చెప్పి అయోధ్యకు తిరిగి వెళ్తాడు.
ఆ విధంగా మందాకినీ నదీతీరములో ఆనందముగా విహరిస్తున్న సీతా రాములకు, భరతుని సైన్యము వచ్చునప్పుడు రేగిన ధూళి కనపడింది. సేనలు వచ్చునపుడు పుట్టే ధ్వనులు, ఏనుగుల ఘీంకారములు, అశ్వముల పదఘట్టనములు, సైనికుల కోలాహలము రామునికి లీలామాత్రంగా వినపడ్డాయి. ఆ సైన్యముల రాకతో భయపడి పారిపోతున్న మృగములను కూడా చూచాడు రాముడు.
రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! . జాగ్రత్తగా విను. ఏదో మహా సైన్యము వచ్చుచున్న సవ్వడి వినిపించడంలేదూ! ఆ ఏనుగుల ఘీంకారములు, సైనికుల పదఘట్టనములు, గుర్రముల సకిలింపులు, సైన్యములకు బెదిరి పారిపోవు అడవిమృగములు–ఇవన్నీ చూస్తుంటే ఏదో మహాసైన్యముఇక్కడకు వస్తున్నట్టు కనపడుతూఉంది. ఇక్కడకు సైన్యము రావడం ఆశ్చర్యం గా ఉంది. ఎవరైనా రాజ కుమారుడు ఈ అరణ్యమునకు వేట నిమిత్తము వచ్చాడా! లేక ఏదైనా భయంకర మృగముల దండు ఈ అరణ్యములోని ప్రవేశించిందా! నీవు పోయి దాని విషయం కనుక్కొనిరా.”అని అన్నాడు రాముడు.
వెంటనే లక్ష్మణుడు పోయి ఒక పొడుగాటి సాలవృక్షమును ఎక్కాడు. నలుదిక్కులా చూచాడు. తూర్పు దిక్కునుంచి వస్తున్న ఒక రథ, గజ, తురగ, పదాతి దళములతో కూడిన మహా సైన్యము కనపడింది. లక్ష్మణుడు వెంటనే చెట్టు దిగి వచ్చి ఆ సైన్యము రాక గురించి రామునికి చెప్పాడు. వెంటనే రాముడు తగుజాగ్రత్తలు తీసుకున్నాడు. బయట మండుతున్న అగ్నిని ఆర్పివేసారు. సీతను ఒక గుహలో దాచిపెట్టారు. రామలక్ష్మణులు ఇద్దరూ తమతమ వింటినారిని సంధించారు. అమ్ములపొదులను సరిచేసుకున్నారు. కవచములను ధరించారు.
మరలా రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆసేన ఎవరిదో ఆనవాలు పట్టగలవా!” అని అడిగాడు. మరలా లక్ష్మణుడు చెట్టు ఎక్కి పరిశీలనగా పతాకములను చూచి అవి అయోధ్యానగరపతాకములు అని గుర్తించాడు. చెట్టు దిగివచ్చి “అన్నయ్యా! అది భరతునిసేన. భరతుడుసేనా సమేతంగా ఇక్కడకు వస్తున్నాడు. భరతుడు తన మార్గమును నిష్కంటకము చేయదలచుకొని మనలనిద్దరినీ చంపడానికి వస్తున్నాడని నా ఊహ. ఆ రథము మీద అయోధ్య రాజ చిహ్నమగు కోవిదార వృక్షము గల పతాకము ఎగురుతూ ఉంది. రామా! మనము ఇద్దరమూ ఇక్కడే ఉందామా! లేక పర్వతశిఖరములు ఎక్కి అక్కడ పొంచి ఉందామా! ఈ భరతుడు మనలను ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక తన సైన్యముతో మనమీదకు దాడి వస్తున్నాడు. ఏం చేద్దాము? రామా! ఎవరి కొరకు కైక నిన్ను అడవులకు పంపిందో, ఆ భరతుడు నీ మీదికి వస్తున్నాడు.
కాబట్టి భరతుడు మనకు శత్రువు. శత్రుడైన భరతుడు చంపతగ్గవాడు. భరతుడు నీ రాజ్యము అపహరించి నీకు అపకారమే చేసాడు. కాబట్టి అతనిని చంపుటలో దోషము ఏమీ లేదు. నేను భరతుని సంహరిస్తాను. నీ రాజ్యము నీకు ఇప్పిస్తాను. అడవులలో ఉన్న మనలను వదలకుండా, భరతుడు మన మీదికి వచ్చినపుడు అతనిని సంహరించడంలో తప్పులేదు కదా! దీనితో కైకకు తగినశాస్తి జరుగుతుంది. నాచే చంపబడిన భరతుని చూచి కైక కుళ్లి కుళ్లి ఏడవాలి. అలా ఏడుస్తున్న కైకను కూడా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను. దానితో పాపశేషము తొలగిపోతుంది. పాపాత్ముల నుండి భూదేవికి విముక్తి కలుగుతుంది. నాడు నిన్ను అడవులకు పంపునపుడు నాకు వచ్చిన కోపము ఈ రోజుతో చల్లారుతుంది. మన శత్రువుల రక్తంతో ఈ చిత్రకూట పర్వతమును తడిపివేస్తాను. భరతుని చతురంగ బలముల శవాలతో ఈ అడవిలో ఉన్న క్రూరమృగములు విందు చేసుకుంటాయి. నేను ఈ ధనురాణములు ధరించినందుకు, భరతుని సేనలను చంపి వాటి ఋణం తీర్చుకుంటాను. ఇందుకుసందేహము లేదు.”అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – త్రయోవింశః సర్గలో, రాముడు సీతను దుర్భాషలాడిన రాక్షసిని దండిస్తాడు. సీతకు సాంత్వన చెప్పి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత రాముడు సీతను తోటలో తిరగడానికి తీసుకెళతాడు. సీత రాముడికి ధైర్యం చెబుతూ తమ ప్రయాణం సాఫల్యం చెందాలని కోరుకుంటుంది. రాముడు సీతకు విశ్వాసాన్ని నూరిపోస్తాడు.
రాముని మీదికి ఉత్సాహంగా బయలుదేరిన ఖరునికి ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. వారి మీద రక్తవర్షము కురిసింది. ఖరుని రథమునకు కట్టిన గుర్రములు సమతలప్రదేశము మీద కూడా తడబడుతూ పరుగెడుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఖరుని రథముమీద ఎగురుతున్న ధ్వజము మీద నిలబడింది. అనేకములైన క్రూర మృగములు జనస్థానము వద్ద గుమిగూడి వికృతంగా అరుస్తున్నాయి. ఒక పక్కనుంచి నక్కలు తలలు పైకెత్తి ఏదో అమంగళము జరగబోతున్నట్టు కూస్తున్నాయి. పక్షులు, డేగలు, గ్రద్దలు ఖరుని రథానికి అడ్డంగా ఎగురుతున్నాయి.
ఇంతలో సాయం సమయం అయింది.. గ్రహణ కాలం కాకుండానే రాహువు సూర్యుని మింగుతున్నాడా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు. ఆకాశంనుండి ఉల్కాపాతం జరిగింది. స్వల్పంగా భూమి కంపించింది. రథం మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న ఖరుడికి ఎడమ భుజము అదిరింది. మాట తడబడుతూ ఉంది. కళ్లు మండటం మొదలెట్టాయి.
ఇన్ని అపశకునాలు కనపడుతున్నా ఖరుడు చలించలేదు. వెనుకకు మరలలేదు. ముందుకు దూకుతున్నాడు. “సైనికులారా! ఈ ఉత్పాతాలకు భయపడకండి. ఇలాంటివి పిరికి వాళ్లను భయపెడతాయి కానీ మనలను కాదు. ధైర్యంగా ముందుకు దూకండి. ఆ రామలక్ష్మణులను చంపి గానీ వెనకకు తిరగ వద్దు. వాళ్లను చంపి వాళ్ల రక్తం తాగితేనే గానీ నా సోదరి శూర్పణఖ అవమానము చల్లారదు. మనం ఎన్నడూ యుద్ధంలో ఓడిపోలేదు. ఇప్పుడూ ఓడిపోము. నేను తల్చుకుంటే ఆ దేవేంద్రుని కూడా సంహరించగలను. ఈ మానవులు ఎంత?” అని ఖరుడు తనకు తానే ధైర్యము చెప్పుకుంటూ సేనలను ఉత్సాహపరుస్తున్నాడు.
ఈ విధంగా రాక్షసులు యుద్ధానికి కదలడం చూచి ఆ అడవిలో ఉన్న ఋషులు, మునులు, ఏంజరుగుతుందో అని ఆతురతగా చూస్తున్నారు. అందరూ లోక క్షేమాన్ని కోరి (అంటే రాక్షస సంహారాన్ని కోరి) ప్రార్థనలు చేస్తున్నారు. “చక్రాయుధమును ధరించిన శ్రీమహావిష్ణువు దానవులను సంహరించినట్టు ధనుర్ధారి అయిన రాముడు రాక్షస సంహారము చేయుగాక!” అని మనసులో ఆకాంక్షిస్తున్నారు. ఇంక పైనుంచి దేవతలు విమానములు ఎక్కి రాక్షస సైన్యమును చూస్తున్నారు. ఖరుని సేనలో పన్నెండు మంది మహావీరులైన రాక్షసులు ఉన్నారు.
వారు శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సరాస్యుడు, రుధిరాశనుడు ( పైన చెప్పి పేర్లలో వారి అలవాట్లు, గుణగణాలు ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు… శ్యేనగామి పక్షిలా తిరిగేవాడు. యజ్ఞశత్రువు = యజ్ఞములను పాడుచేసేవాడు, విహంగముడు=పక్షిలా ఎగిరేవాడు, పరుషుడు=ఎప్పుడూ పరుషంగా, కఠినంగా మాట్లాడేవాడు, రుధిరాశనుడు=రక్తం తాగేవాడు). వీరే కాకుండా దూషణుని వెంట మహాకపాలి,, స్థూలాక్షుడు, ప్రమాథీ, త్రిశిరస్సుడు అనే మరో నలుగురు రాక్షస సేనానాయకులు తమ తమ సేనలతో నడుస్తున్నారు. వీరందరూ రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళుతున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, పద్నాలుగు రాక్షసులు శూర్పణఖచే మార్గనిర్దేశం చేయబడిన రాముని కుటీరానికి చేరుకుంటారు మరియు వారు రాముడితో యుద్ధం చేస్తారు, అందులో రాముడు వారి ఆయుధాలన్నింటినీ నాశనం చేస్తాడు మరియు వారందరినీ నాశనం చేస్తాడు. ఈ ఓటమిని చూసిన శూర్పణఖ ఓటమిని నివేదించడానికి తన సోదరుడి వద్దకు తిరిగి వెళుతుంది.
శూర్పణఖ ఆ పదునాలుగు మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకొని వెళ్లింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాసి అయిన సీతను చూచారు.
రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు.” అని అన్నాడు.
లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు.
“ఓ రాక్షసులారా! నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గానీ, మా లాంటి తాపసులు కానీ మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు. చంపుతున్నారు. మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోండి. లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణాలు పోగొట్టుకోండి.” అని అన్నాడు రాముడు.
ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటి దాకా వారిని చూచి భయపడ్డవారే గానీ, వారిని ఎదిరించి భయపెట్టిన వారు లేరు. అలాంటిది వీళ్లు ఎదిరిస్తున్నారు అంటే కోపం ఆపుకోలేకపోయారు.
“మా ప్రభువు ఖరుడు. నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులు కోసి, అవమానించి, ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బతకడం కల్ల. ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము. నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములు నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సు వదిలిపారిపోతావు. కాచుకో!” అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదికి తమ తమ ఆయుధములను విసిరారు.
రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్కబాణంతో ముక్కలు చేసాడు. తరువాత రాముడు 14 నారాచములను వారి మీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేసాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్ద అయినాయి. వారి గుండెలు చీలడంతో, ఆ 14 మంది రాక్షసులు నేల మీద పడి ప్రాణాలు వదిలారు.
శూర్పణఖ ఆశ్చర్యంలో ఆ రాక్షసుల వంక చూచింది. రామలక్ష్మణుల వంక చూచింది. శూర్పణఖకు కోపము, భయము, ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలు పెట్టింది. అక్కడి నుండి పరుగెత్తింది. ఖరుని వద్దకు పరుగుపరుగున వచ్చింది. ఖరుని ముందు నేల మీద పడి భోరు భోరున ఏడుస్తూ ఉంది.
అయోధ్యాకాండం పంచనవతితమ (95వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయాలనుకుంటాడు. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయిని క్షమించి, ఆమెను ఆత్మీయంగా అంగీకరిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను మెచ్చుకుంటారు. తరువాత, భరతుడు వశిష్ఠుడితో కలిసి సర్పసముద్రం అనే ప్రాంతానికి వెళ్ళి రాముని పాదుకలను గౌరవంగా తీసుకుని వస్తాడు. భరతుడు, రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి రాకముందు వరకు తాను పాలనను పర్యవేక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని విధి నిష్ఠను, రాముడిపై ప్రేమను ప్రతిబింబిస్తుంది.
రాముడు సీతతో కలిసి మందాకినీ నదీ తీరంలో విహరిస్తున్నాడు.
“సీతా! ఈ మందాకినీ నదీతీరము చూడు. ఎంత సుందరముగా ఉన్నదో! ఆఇసుక తిన్నెలు, నదీజలములలో ఈదుచున్న హంసలు, పైన ఎగురుచున్న సారస పక్షులు, జలముల మీద తేలుచున్న పద్మములు ఎంత శోభాయమానముగా ఉన్నవో చూడు! అదుగో ఆ లేళ్ల గుంపులు నదీజలములు తాగుటకు ఎలా వస్తున్నాయోచూడు! ఆవల తీరమున ఋషులు మందాకినీ నదిలో స్నానం చేస్తున్నారు. మరికొందరు సూర్యోపాసన చేస్తున్నారు. సీతా! ఆ చక్రవాక పక్షులు ఎంత మధురంగా కూయుచున్నవో.
ఇంతటి మనోహరముగా ఉన్న ఈ నదీప్రాంతమును విడిచి వెళ్లుటకు మనసు రాకున్నది. అయోధ్య కన్నా ఇక్కడే బాగుంది కదూ! సీతా నీవు కూడా ఈ నదిలో దిగి జలక్రీడలు ఆడుతావా! ఈ చిత్రకూట పర్వతమే అయోధ్య అనుకో. ఈ మందాకినీ నది సరయూనది. హాయిగా నదిలో దిగి జలకాలాడు. నీవు, లక్ష్మణుడు, తోడుగా ఉండగా ఇంతటిసుందర ప్రదేశములలో విహరిస్తూ నేను అయోధ్యనే మరిచిపోతున్నాను. ప్రస్తుతము నాకు అయోధ్య మీద కాని, ఆ రాజ్యము మీద కానీ ఆసక్తి లేదు. ఇక్కడే ఉండాలని ఉంది.” అని అన్నాడు రాముడు.
(ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. రాముడి గురించి వారి వనవిహారము గురించి వాల్మీకి ఇంతగా రాయాల్సిన పనిలేదు. దీని వెనక ఏదో చెప్పాలని ఆయన తాపత్రయం. ఈరోజుల్లో ఉన్న ఊరి నుండి మరో ఊరికి ట్రాన్సఫర్ అయితే చాలు ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు బాధపడుతుంటారు కొందరు. ఉన్న ఊరు వదలడానికి తెగ బాధపడిపోతుంటారు. మరి కొంతమందికి ఏ ఊరిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా తృప్తి ఉండదు. ఏం ఊరు వెధవ ఊరు అని తిడుతూ ఉంటారు. అటువంటి వారికి రాముని వనవాసము ఒక గుణపాఠము.
రాముడు అయోధ్యకు యువరాజు. పుట్టినప్పటినుండి ఎన్నో రాజభోగములు అనుభవించాడు. విధివశాత్తు అరణ్యవాసం చెయ్యాల్సివచ్చింది. సంతోషంగా అడవులకు వచ్చాడు. అరణ్యములోనే సుఖాలను వెతుక్కుంటున్నాడు. అరణ్యమునే అయోధ్యగా మార్చుకున్నాడు. పైగా అరణ్యములోనే ఎక్కువసుఖం ఉందని మనసుకు నచ్చచెప్పుకుంటున్నాడు. ఉన్నదానినతో తృప్తి చెందుతున్నాడు. నిరాశకు నిస్పృహకు చోటు ఇవ్వలేదు.
‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అని ఒక సినీ కవి అన్నట్టు, బాధలలో కూడా సుఖాలను వెతుక్కోవడం మానవులకు అలవడాలి. అప్పుడే జీవితం సుఖమయమవుతుంది. ఈ జీవితసత్యాన్ని రాముడు తాను అనుభవించి మనకు తెలియజేస్తున్నాడు. అని నా భావన. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్వావింశః సర్గలో, రావణుని సోదరి శూర్పణఖ పంచవటికి వస్తుంది. రాముడిని చూసి ఆమె ఆకర్షితురాలవుతుంది. రాముని ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంది, కానీ రాముడు సీతమ్మను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిరాశలో శూర్పణఖ తన రూపం మార్చుకుని లక్ష్మణుడి దగ్గరకు వెళుతుంది.
శూర్పణఖ తనను అన్న సూటీ పోటీ మాటలు అన్నీ మౌనంగా విన్నాడు ఖరుడు. అవమానభారంతో కుమిలిపోయాడు. అతనిలో పౌరుషం పెల్లుబికింది. కోపం తారస్థాయికి చేరుకుంది. శూర్పణఖను చూచి ఇలా అన్నాడు.
” నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను. నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది. ప్రతీకార జ్వాలలలో రగిలిపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మానవుడికి నేను భయపడడమా! ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు. వాడి ప్రాణాలు హరిస్తాను. నీవు ఏడవకు. వాడి మరణవార్తను నీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను. నా గొడ్డలితో వాడిని నరుకుతాను. వాడి వెచ్చని రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను. ఇది నా నిర్ణయము.” అని పలికాడు ఖరుడు.
“అదేంటి అన్నయ్యా! నీ పరాక్రమం గురించి నాకు తెలీయదా. నీకు సాటి వీరుడు ముల్లోకములలో ఎవరు ఉన్నారు. రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు.” అని పొగిడింది.
శూర్పణఖ మాటలతో ఉప్పొంగి పోయాడు ఖరుడు. వెంటనే తన సేనాపతులను పిలిచాడు.
“సేనాపతీ! మన దగ్గర 14 వేల మంది సైనికులు ఉన్నారు. కదా. వారినందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వారికి నాయకత్వము వహిస్తాను. నా కొరకు ఒక రథము, ఆయుధములు, ధనుస్సులు, బాణములు సిద్ధం చేయండి. మనమందరమూ ఆ రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము.” అని ప్రకటించాడు.
ఖరుడి మాట వినగానే దూషణుడు ఖరుడు కోరినట్టు రథం సిద్ధం చేసాడు. రథం తీసుకొచ్చి ఖరుడి ముందు నిలిపాడు. ఖరుడు ఆ రథం ఎక్కాడు. ఖరునికి దూషణునికి రక్షణగా రాక్షస వీరులు చుట్టు వలయాకారంలో నిలబడ్డారు. ఖరుడు అందరికీ బయలుదేరుటకు అనుజ్ఞ ఇచ్చాడు. జనస్థానమునుండి 14,000 మంది రాక్షసవీరులు ముద్గరలు, పట్టిసములు, శూలములు, పరశువులు, కత్తులు, చక్రాయుధములు, తోమరములు, శక్తి ఆయుధములు, పరిఘలు, కారుకములు (బాణములు), గదాయుధములు, ముసలములు, వజ్రాయుధములు ధరించి, రాముని మీదికి యుద్ధానికి బయలుదేరారు.
(ఇక్కడ కూడా 14 వేల మంది రాక్షస సైన్యము, బయలుదేరింది. ఇది మూడవ 14 సంఖ్య)
ముందు సైనికులు నడువగా ఖరుని రథము వారిని అనుసరించింది. ఖరుడు కోపంతో ఊగి పోతున్నాడు.
“త్వరగా పదండి. శత్రువును చంపండి. నరకండి” అని పెద్దగా అరుస్తున్నాడు.
ఖరుని అరుపులతో, రాక్షసవీరుల పదఘట్టనలతో ఆ అరణ్యము మార్మోగిపోయింది.
అయోధ్యాకాండం చతుర్నవతితమ (94వ) సర్గలో, భరతుడు వశిష్ఠ మహర్షితో కలిసి రాముని ఆశ్రమం వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అతని వెంట కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణాన్ని రాముని చెబుతాడు. రాముడు తండ్రి మరణ వార్త విని శోకసంద్రుడవుతాడు. భరతుడు రాముడిని అరణ్యవాసం నుండి తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన కర్తవ్యాన్ని సమర్థిస్తూ, తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం పూర్తి చేస్తానని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచుతానని, రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యం పాలిస్తానని అంగీకరిస్తాడు.
భరతుడు రాముని గురించి వెతుకుతుంటే, రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి వివరిస్తున్నాడు. “సీతా!ఇక్కడ ఉన్న సౌందర్యశోభలను, ఈ వనముల అందములను చూచిన తరువాత ఇక్కడి నుండి అయోధ్యకు పోవాలని అనిపించడంలేదు. ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు, వన్యమృగములకు, పక్షులకు నిలయము. ఈ ప్రశాంత వాతావరణములో ఈ పర్వత శిఖరములను, వృక్షములను చూస్తూ ఎన్నాళ్లు ఉన్నా విసుగు అనిపించదు. ఈ అరణ్యములో వేప, మామిడి, నేరేడు, వేగిస, లోధ్ర, ప్రియాళ, పనస, చండ్ర, అంకోల, బిల్వ, తుమ్మ, వెదురు,కశ్మ, ఇప్ప, తిలక, బదరి, ఆమలక, పేము పొదలు, మద్ది మొదలగు వృక్షజాతులో నిండి ఉన్నది.
(వాల్మీకి తన రామాయణకావ్యంలో ఆనాడు ఉన్న వృక్షజాతులను తరువాతి తరాల వారికి పరిచయం చేస్తున్నాడు.)
ఓ సీతా! అటు చూడు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పర్వత శిఖరముల మీద జంట జంటలుగా విహరిస్తున్నారు. నేను ఈ వనవాసము చేయడం వలన నా తండ్రి మాటను నిలబెట్టడం, భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగి పోవడం లాంటి గొప్ప పనులు సాధించాను. దీని వలన నా పితృఋణము తీర్చుకున్నట్టు అయింది. నాతో పాటు నువ్వు కూడా నన్నుఅనుసరించి వచ్చి ఈ వనసౌందర్య మును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాజులకు మరణానంతరము ఉత్తమ లోకములు లభించుటకు వనవాసమే ఉ త్తమైనది అయి పూర్వపు రాజర్షులు చెప్పి ఉన్నారు కదా!
సీతా! ఈ చిత్రకూటపర్వతము మీద ఎన్నోఓషధులు ఉ న్నాయి. ఆ ఓషధుల మీది నుండి వీచే గాలి అన్ని రోగములను పోగొడుతుంది అని పెద్దలు చెబుతారు. సీతా! అటు చూడు! ఇక్కడ కొన్ని ప్రదేశములు సహజముగా ఏర్పడిన ఉద్యానవనముల మాదిరి, మరి కొన్ని పూపొదరిళ్లు గృహముల మాదిరి, కనపడుతున్నాయి కదా! ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడిఉన్నదో చూడు! ఇక్కడ కామాతురు లైన స్త్రీపురుషులు, ఈ నిర్జన ప్రదేశములలో కుష్ఠ, పున్నాగ, భూర్జర చెట్ల ఆకులతో శయ్యలు ఏర్పరచుకొని ఉన్నారు చూడు. ఆ కాముకులు నలిపి పారవేసిన పూలమాలలు, తినగా మిగిలిన ఫలములు అక్కడక్కడా పడి ఉన్నాయి చూడు.” అని చిత్రకూటపర్వత విశేషములను సీతకు రాముడు చూపిస్తున్నాడు.