మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాం…
వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. కొత్తగా పెళ్ళి అయిన ఆడపిల్లల చేత పెద్ద ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దగ్గరవుండి శ్రద్ధగా చేయిస్తూ వుంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకి అనువైనవే అయినా, ఈ వరలక్ష్మీ వ్రతం నాడు చేసే పూజ వల్ల విశేషమైన ఫలితాలను పొందటం జరుగుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకుని, స్త్రీలు నూతన వస్త్రాలు ధరించి ఈ పూజలు చేసుకొంటారు.
వ్రతం చేయు విధానం
ఇంటికి తూర్పుదిశలో పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ మంటపాన్ని రంగవల్లులతో అలంకరించి, ఒకకొత్త తువ్వాలుపై బియ్యం పరచి దాని మధ్యలో కలశం ఏర్పాటు చేసుకోవాలి. లేత మర్రిచిగుళ్ళు, లేత మామిడి ఆకులు వంటి పంచ పల్లవాలతో అలంకరించిన కలశంపై కొబ్బరికాయ, దానిపై రవికల గుడ్డ కాని కొత్త చీరకాని పెట్టి అమ్మవారి రూపాన్ని మనోహరంగా తయారు చేసుకోవాలి. బంగారు నగలతోటి ఆ రూపాన్ని అలంకరించడం యిల్లాళ్ళ సరదా. ఈ విధంగా తయారు చేసుకున్న వరలక్ష్మీదేవిని శ్రీసూక్త విధానంగా ధ్యానం, ఆవాహనం, అర్ఘ్య పాద్యాదులు, స్నానం, ధూపదీపాదుల వంటి షోడశోపచారములతో అర్చించాలి. సబ్రాహ్మణులైన ఋత్విక్కుల ఆధ్వర్యంలో గృహములోని ఆడవారంతా సమూహంగా నిర్వహించుకునే ప్రత్యేక పూజ ఇది. అష్టోత్తర శతనామాలతో పువ్వులతో, కుంకుమతో అమ్మవారిని అర్పించాలి. తొమ్మిది సూత్రములతో (పోచలతో) మధ్యలో పువ్వులు చేర్చి కట్టుకునే తోరాన్ని వామహస్తానికి ధరించాలి. 12 రకాల పిండివంటలు ఒక్కొక్కటి 12 చొప్పున పూజ చేసిన బ్రాహ్మణునకు వాయినం ఇవ్వాలి. దక్షిణ తాంబూలాది సత్కారములతో ఋత్వికులని తృప్తిపరచడం ఒక ముఖ్యమైన కార్యక్రమం.
వరలక్ష్మీ వ్రత ఫలితాలు
ఈ వరలక్ష్మీ పూజలో మరొక ప్రత్యేకత వ్రతకథ. పూజ ఎంత ముఖ్యమో, వ్రతకథని చదువుకోవటం అంతే ముఖ్యం. ఆ తల్లి కరుణాకటాక్ష ప్రభావాన్ని తెలియజేసే ఈ కథని పాటరూపంగా పాడుకోవడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీ అలా ఆడవారంతా కలిసి భక్తి శ్రద్దలతో పాట పాడుతూ వుంటే చాలా వినసొంపుగా వుంటుంది. బ్రాహ్మణాశీర్వాదం తరువాత బంధుమిత్రాదులతో అందరూ ప్రసాదం తీసుకోవటం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం సువాసినులను పేరంటానికి పిలిచి, ఎంతో సంతోషంగా వారిని సత్కరించి పంపడం కూడా పూజా సాంప్రదాయంలోని భాగమే. చాతుర్వర్ణాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ దేవిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని, కుటుంబ సుఖసౌఖ్యాలను వరంగా పొందటం ఈ పూజలోని ముఖ్యఉద్దేశం.
శ్రీ ఆదిలక్ష్మీదేవిని కామేశ్వరీ దేవి రూపంలో కూడా కొలవటం ఆనవాయితీ. కొన్ని కుటుంబాలలో కామేశ్వరీ దేవి కులదేవత. ఆ కుటుంబంలోని ఆడవారు అంతా కలసి సమిష్టిగా ఇష్ట కామేశ్వరీ వ్రతం చేసుకుంటారు. ఆ తల్లి అనుగ్రహంవల్ల కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగావుండేలా, అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా వుండేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థిస్తారు. ప్రాణశక్తిని వృద్ధి చేసుకుని తద్వారా శారీరక మానసిక అనారోగ్యాలను తగ్గించుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. ఔషధ సేవనాన్ని ఈ రకంగా బాగా తగ్గించుకోవచ్చు. ప్రాణశక్తిని పెంచమని ఆదిలక్ష్మి అమ్మ వారిని ప్రార్థించి శ్రద్ధా భక్తులతో పూజ చేసుకుంటే తప్పక ఆరోగ్యం చక్కబడుతుంది దేనికైనా నమ్మకం ముఖ్యం.
సాధారణంగా అనారోగ్యం రాగానే విరివిగా మందులు వాడేయటం మనకి అలవాటయిపోయింది. ఆ మందుల దుష్ప్రభావ ఫలితంగా భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవటం జరుగుతోంది. ఏ మందులు వాడనక్కరలేకుండా ఆ ఆదిలక్ష్మీ దేవి కృపవల్ల ప్రాణశక్తిని పెంపొందింప జేసుకుని పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకు ఒక మార్గం. పూజా విధా నంలో భాగంగా ఆ ఆదిలక్ష్మీ మాత అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించటం ఇందువల్ల ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ నామావళిలోని నామాలన్నీ మనపూర్వీకులు ఎంతో సాధనచేసి కనుగొన్నవి. ప్రతినామమూ ఎంతో ప్రభావపూరిత మైనది. ఆదిలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని భక్తుల సౌకర్యార్ధం ఈ పుస్తకంలో చేర్చటం జరిగింది. నిత్యపూజలు చేసుకునే సౌకర్యం, అవకాశంలేని వారు కోసం బీజాక్షర జపం చేసుకుంటే తక్షణఫలితాలు కలుగుతాయి.
పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము గురించి తెలుసుకుందాం…
సత్యనారాయణ స్వామి వ్రత విధానము
వ్రత విశిష్టత, విధానము
ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును.
మాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను.
వ్రతమురోజు విధిగా చేయవలిసిన పనులు
ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.
పూజాక్రమము:
గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను.
నాలుగు వర్ణముల వారికి పూజావిధానము
బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్ధలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను.
వ్రతములు మనస్సును ఆరోగ్యకరముగా, ధర్మప్రియముగా, సామాజిక సహజముగా నిర్వహించే మార్గములు. ఇవి ఆత్మశుద్ధి, మానసిక శాంతి, అంతర్ముఖ సౌమ్యత, సమాజ భద్రత మరియు భగవద్భక్తిని ఉన్నతముగా చేస్తాయి. వ్రతములు మన జీవితాన్ని సరళముగా, సాధారణముగా మరియు మొండిగా ఉంచుతాయి. వ్రతములు మనస్సును ద్యానంలో, ధర్మపథములో, సంయవనంలో ఉంచుతాయి.
ఇవి మన జీవితంలో నేర్పించిన ప్రతీ అదృష్టం ఒక అత్యంత ప్రాముఖ్యత మరియు అద్భుతమైన మూలకము. వ్రతములు మన మనసును సరళముగా మరియు శుద్ధిగా చేస్తాయి, మన సమాజానికి కల్యాణం, సమృద్ధి, శాంతి మరియు సౌమ్యతను అందిస్తాయి. ఏ ఏ వ్రతాలు చేస్తే ఏమి ఫలితం వస్తుంది ఈ క్రింది లింకులను అనుసరించండి.