అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గములో, భరతుడు చిత్తతో రాముడిని అనుసరించి అరణ్యానికి చేరుకున్నాడు. అతని వెంట సుమంతుడు, వశిష్టుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి తదితరులు ఉన్నారు. రాముడు తన తల్లి కౌసల్యను పలకరించి ఆశీర్వాదం అందుకున్నాడు. భరతుడు రాముని పాదాలను తాకి అయోధ్యకు తిరిగి రావాలని వేడుకున్నాడు. రాముడు తన పాదుకలను భరతునికి సమర్పించి, అవి ఆయుధాలుగా రాజ్యం పరిపాలించమని ఆదేశించాడు. భరతుడు పాదుకలను తీసుకొని, రాముడి ఆజ్ఞ ప్రకారం నందిగ్రామంలో ఉంటూ, రాముడి ప్రతినిధిగా రాజ్యపాలన చేయడానికి తిరిగి వెళ్ళాడు. భరతుడి త్యాగం, భక్తి, సోదర ప్రేమ ఈ సర్గలో స్పష్టంగా దర్శనమిస్తుంది.
పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. “కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉ పద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు.”అని అన్నాడు.
భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి.
వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధి పతిగా ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజుకావాలి. నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు భరతుడ ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి, అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “భరత కుమారా! తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేస్తాము.” అని అన్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయోదశః సర్గలో, అజ్ఞాతవాసంలో ఉన్న రోజుల్లో నివాసం చేసుకోవడానికి అడవిలో ఒక స్థలాన్ని సూచించమని రాముడు అగస్త్య మహర్షిని అభ్యర్థిస్తాడు. అగస్త్య మహర్షి రామాయణం యొక్క తదుపరి కోర్సును ఊహించాడు మరియు స్త్రీత్వం మరియు సీత చుట్టూ తన సంభాషణను నడిపించాడు. అప్పుడు ఆ ఋషి పంచవటికి వెళ్లమని రాముడికి తెలియజేస్తాడు, అక్కడ సీత తన పరిసరాలను చూసి ముచ్చటగా ఉంటుంది.
పంచవటీగమనమ్
రామ ప్రీతోఽస్మి భద్రం తే పరితుష్టోఽస్మి లక్ష్మణ |
అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా ||
అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు.
“ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది.
సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు.
కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత, లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు.
అగస్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు. “నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి.” అని అడిగాడు రాముడు.
“రామా! ఇక్కడికి రెండు యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలావరకు గడిచిపోయింది. కొద్దికాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి, నీవు నీ తండ్రిమాట నిలబెట్టు. ఆయనను తరింపజెయ్యి.
అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును.
అటు చూడు. అక్కడ ఒక మధూక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధూక వనమునకు ఉత్తరంగా వెళ్లండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది.” అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు.
రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు.
మనలను రక్షించే మాధవుడు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొనర్తు గద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూడి మురియుదుగద
॥ఆశ॥
నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనే పోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోవదందునుగద
ఈ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ జానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ
అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును
॥ఆశ॥
ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మడ దెత్తును
సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి.
అయ్యో యిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద
॥ఆశ॥
మిత్రవంశునకు నేనేమి చేయుదు నేనెవ్వరివేడుదు
ఏమరియుండిరీ మానినులందరు ఏలపోయెనో యాక్షీరాబ్ధికి
ఏల దశరథుడు యజ్ఞము చేసెను ఎందుకు బుట్టిరియీ లోకమునను
ఎందుకు వచ్చిరి యీవనమునకును ఇట్టి వరములనేలవేడిరి
ఎక్కడ నోపుదు యింతటి జాలి
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచమః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. సుర్పణఖ రాముడిని చూసి మోహించి, సీతను వదిలేయమని కోరుతుంది. రాముడు సీతను వదలకుండా సుర్పణఖతో మాట్లాడతాడు. సుర్పణఖ తన మాయలు ప్రయోగించి రాముడిని పొందాలని ప్రయత్నిస్తుంది.
విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము.” అని అన్నాడు.
లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు.
తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. “రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడక ముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవ కార్యము నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తరువాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరుమాత్రము రామునికి అన్నివిధాలా సాయం చెయ్యండి.” అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకొని తన రథము మీద స్వర్గమునకు వెళ్లిపోయాడు.
తరువాత రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్లాడు. అందరూ ఆమహామునికి పాదాభివందనము చేసారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు.
రాముడు శరభంగ మహర్షిని చూచి “ఓ మహర్షీ!
దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగోరుతాను.” అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు.
“రామా! నేను ఎంతో తపస్సు చేసాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకొని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని, నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. రామా! నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మ లోకములను, స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను. స్వీకరించు.” అని అన్నాడు.
దానికి రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షి! పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించు కోవాలేగానీ, ఒకరు ఇస్తే స్వీకరించ కూడదు.కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యములో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి.” అని అడిగాడు.
ఆ మాటలకు శరభంగ మహాముని ఇలాఅన్నాడు. “ఓ రామా! ఈ అరణ్యములో సుతీక్షుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్లి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించ గలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకినీ నది ప్రవాహము నకు ఎదురు వెళితే, (అంటే ఎగువభాగంలో అని అర్థం) సుతీక్షుడి ఆశ్రమము వస్తుంది.
రామా! నీతో మాట్లాడాను. నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూఉండు.” అని అన్నాడు. తరువాత శరభంగ మహర్షి అగ్ని గుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేసాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్ని కుండము నుండి నవయౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్లిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగమహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు.
తీరైన పురవీధులు సొంపైన కోనేరులు
సోపానములు సకల ఫలతరువులు
ఆ నదులు ఋషి గంధర్వ నివాసములు
సరసిజాక్ష వినవే సరిలేని గోదావరి స్నానములు
సంపత్కరమై యొప్పినది
॥కలియుగ॥
చక్కని స్త్రీ పురుషులు పట్టణమందు
పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు
వేదశాస్త్రతార్కిక వైష్ణవులు గ్రక్కున వారిని కన్నులజూచి
తక్కువైన పుణ్యమేయని తెల్పుదు
॥కలియుగ॥
వామాక్షులాడగను సీతనుగూడి
హేమపీఠమునందు సంపూర్ణకళలు మోము వెలుగగను
పరివారములు ప్రేమతో గొలువగను
ప్రేమచే భద్రాద్రిరామదాసుని మేలు
స్వామి శ్రీ కోదండరాము నివాసము
పల్లవి : ధన్యుడవు తానీషా నీవు
నన్ను గన్నయ్య పదములు కలగన్నావు
॥ధన్యుడవు॥
నిన్నటిరాతిరి వారు వచ్చియున్న ముచ్చటలాడి యేమేమి యున్నారు
ఎంతవేడినగాని రారు నీవు పుణ్యమూర్తివి గనుక పొడసూపినారు
తానీషా : ధన్యుడవు గోపన్న నీవు యా దాశరథికి నిజదాసుడైనావు
సామాన్యుడని యెంచుకొంటి శ్రీరామచంద్రుల సేవ మీవలన గంటి
ప్రేమతో సేవించుకొంటి నేను పామరుడనై మిమ్ము బాధింపుచుంటి
॥ ధన్యుడవు ॥
గోపన్న : ఏమి పూజలు చేసినారు మా స్వామి భద్రగిరి దాసులు మీరు
ప్రేమతో సేవించినారు శ్రీరామ కృపగల్గి రంజిల్లుతారు
తానీషా : పైకము దీసుకుపొండి భద్రాచల రామదాసులై పట్టమేలండి
అయినదెల్ల వేడుకొనండి మీరు అనుదినము రాముల నర్చించండి
॥ధన్యుడవు||
గోపన్న : ఏటిమాటలు పలికెదరు నా కేటికి రాజ్యమీ యిలలోనే మీరు
మేటి జన్మమెత్తినారు మీ సాటివారలు యీ జగములోలేరు
||ధన్యుడవు ||
తానీషా : భద్రాచలము నెప్పటికి మీ రామభద్రున కిచ్చితి బాగుగా వినుమా
ముద్ర నిశానీల్ కొనుమా శ్రీ భద్రాద్రివర రామదాసుడై యేలుమి
మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
నీ అరుదుమీరలని నెగురవేయ నే హనుమంతుడనుగాను
సరగున మ్రుచ్చుల మాటలు విన నే జాంబవంతుడను గాను
బిరబిర మీవల లోపల బడ నే విభీషణుడనుగాను
అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గములో, భరతుడు రాముని ఆశ్రమానికి చేరి ఆయనకు సమర్పణను చెప్పాడు. రాముడు తన తమ్ముడిని ఆలింగనం చేసి సంతాపం వ్యక్తం చేశాడు. భరతుడు రాముని అయోధ్యకు తిరిగి రావాలని, తాను పాదుకలు మాత్రమే ధరించి రాజ్యం పరిపాలిస్తానని కోరాడు. రాముడు తండ్రి చిత్తానికి ప్రతిబంధకుడు కావడం ఇష్టం లేక, తన నిర్ణయం మార్చుకోకుండా అడవిలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళి, అవి పీఠంపై ఉంచి రాముడి హస్తంతోనే పరిపాలన చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఇది వాక్కులు, పాదుకల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు.
“భరతా! మనము ఇంట లేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపి వేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమయింది. కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా! స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంతదూరము వచ్చిఉండెడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు.” అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసి మంథరం అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు.
ఒంటినిండా నగలు అలంకరించు కున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతి లాగ కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంథరను పట్టుకొని శత్రుఘ్నుని వద్దకు తీసుకొని వచ్చారు.
“శత్రుఘ్నకుమారా! ఈమె కైక ఆంతరంగిక దాసి. పేరు మంథర. ఈమె రాముని వనవాసమునకు, మహారాజు మరణమునకు, కారణము. ఈమెను నీ ముందర నిలబెట్టాము. ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.” అని అన్నారు.
ఆ మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం మిన్నుముట్టింది. “మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారము చేసిన ఈ దాసికి తగిన గుణపాఠము చెబుతాను.” అని అన్నాడు. ఆసమయంలో మంథర తో వచ్చిన వాళ్లు శత్రుఘ్నుని కోపం చూచి తలొకదిక్కుకూ పారిపోయారు. “ఈరోజు మంథర శత్రుఘ్నుని చేతిలో చచ్చింది” అని అందరూ అనుకున్నారు.
కొందరు గబగబా కౌసల్యకు ఈ వార్త చెప్పడానికి వెళ్లారు. శత్రుఘ్నుడు మంధరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మంధర అలంకరించుకున్న ఆభరణములు అన్నీ నేల మీద “చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతలో కైక అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మంథర మెడ పట్టుకొని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మంథరను కాపాడమని బతిమాలింది.
భరతుడు శత్రుఘ్నుని చూచి “శత్రుఘ్నా! ఆగు. ఎంత అపరాథము చేసినా స్త్రీలను చంపరాదు.. కాబట్టి మంథరను విడిచి పెట్టు. దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని. కాని రాముడికి అది ఇష్టంలేదు. అందుకని నాకోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మంథర ఒక దాసి. ఆమె ఏమి చేస్తుంది. ఆమెను క్షమించు.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు శత్రుఘ్నుడు తనకోపాన్ని దిగమింగుకొని మంథరను విడిచిపెట్టాడు. మంథర కైక పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది.
అయోధ్యాకాండం సప్తసప్తతితమః సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్ర విచారం, క్షోభతో మరణించిన తరువాత, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది. భరతుడు, శతృఘ్నుడు వారి మాతామహుడి యైన అశ్వపతికి చెరి అక్కడ విషాద వార్త వింటారు. తండ్రి మరణవార్త విని, భరతుడు తీవ్ర దుఃఖంతో అయోధ్యకు తిరిగి వస్తాడు. కైకేయి చేసిన పాపాన్ని తెలుసుకొని, భరతుడు ఆమె పట్ల ఆగ్రహంతో ఉంటాడు. అయోధ్య ప్రజలు భరతుని ఆగమనాన్ని చూసి, రాముని గదిని శూన్యంగా చూచి, రాముని గురించీ భరతుని ప్రశ్నిస్తారు. దశరథుడి మరణంతో, భరతుడు బాధతో కైకేయిని విసురుకుంటాడు.
దశరథుడు మరణించిన పదవ రోజున శుద్ధిజరిగింది. పన్నెండవ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు, బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహన దానము, వస్త్రదానములు విరివిగా చేసాడు. పదమూడవ రోజున భరతుడు అస్థిసంచయనము కొరకు శ్మశానమునకు వెళ్లాడు. తండ్రిచితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు.
“తండ్రీ! నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్లిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా, కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వుకూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయావు.” అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు.
ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దు:ఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు.
“తండ్రీ! కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగి పోయావా! నీవు భరతుని ఎంతో గారాబం చేసావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. ఓదార్చవా! మాకు కావలసిన వస్త్రములు, భోజనపదార్థములు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చే వాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చి ఇస్తారు. ధర్మాత్ముడవు అయిన నీవు పోగానే ఈ భూమి బ్రద్దలు కావాల్సింది. కాని ఎందుకో అలా జరగలేదు. తండ్రీ! మీరు వెళ్లిపోయారు. రాముడు అరణ్యములకు వెళ్లాడు. ఇంక నేను ఎవరిని చూచుకొని బతకాలి. నేనుకూడా అగ్నిప్రవేశము చేస్తాను. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాను. అంతేకానీ అయోధ్యలో అడుగుపెట్టను.” అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు.
ఆ అన్నదమ్ముల శోకమును చూచి అక్కడ ఉన్నవారికి కూడా దు:ఖము ఆగలేదు. అప్పుడు వసిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “భరతా! నీ తండ్రి మరణించి నేటికి పదమూడవ దినము. నీవు అస్థి సంచయనము చేయవలెను. ఇంకనూ నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు మూడు అవస్థలు తప్పవు. అవే ఆకలి దప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు. ధనికుడైనా,
పేదవాడైనా, మహారాజైనా కటిక దరిద్రుడైనా ఇవి అనుభవించ వలసినదే. కాబట్టి నీ తండ్రి మరణము గురించి చింతించడం అవివేకము.” అని అన్నాడు. సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పుమాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకమును విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమమును నిర్వర్తించారు.
శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాదశః సర్గలో, రాముడు, లక్ష్మణుడు, సీత అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అగస్త్య మహర్షి కూడా చాలా కాలం పాటు రాముడిని స్వీకరించడానికి వేచి ఉన్నాడు మరియు ఇప్పుడు వారిని అన్ని గౌరవాలతో స్వీకరిస్తాడు, రాముడిని విష్ణువు అవతారంగా గ్రహించాడు. అగస్త్య మహర్షి విష్ణువు యొక్క దివ్యమైన ధనుస్సును, ఎప్పుడూ బాణాలతో నిండిన రెండు వణుకులను మరియు బంగారు తొడుగులో బంగారు ఖడ్గాన్ని రాముడికి ఇస్తాడు, అదే ఆయుధాలతో విష్ణువు ఒకప్పుడు భూమిపై చెడును నిర్మూలించాడని చెప్పాడు.
అగస్త్యదర్శనమ్
స ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః |
అగస్త్యశిష్యమాసాద్య వాక్యమేతదువాచ హ ||
1
రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలీ |
రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా ||
రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి” అని అన్నాడు.
ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి “మీరు ఎవరు?” అని అడిగాడు.
“నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించు చున్నాము. ” అని అన్నాడు.
“మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను.” అని లోపలకు వెళ్లాడు.
అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు.
“ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా. రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా. వెంటనే నావద్దకు తీసుకొని రావలదా! ” అని శిష్యునితో అన్నాడు.
వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి “రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును.” అని అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి, సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకొని వెళ్లాడు.
రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! అటు చూడు! అగ్ని వలె వెలుగుతున్న అగస్త్యమహర్షి మనకోసం వస్తున్నాడు.” అని అన్నాడు.
రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేసారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని, అతిథిపూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! ముందుగా అగ్నిహోత్రము చేసి, అతిధులను పూజించి, తరువాత భోజనము చేయవలెను. అలాచేయని వాడు నరకానికి పోతాడు.
రామా! నీవు క్షత్రియుడవు. అయోధ్యకు రాజువు. ధర్మము తెలిసినవాడవు. అందరి చేతా గౌరవింప తగినవాడవు. అలాంటి నీవు ఈ రోజు మాకు అతిథిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది.
రామా! నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూణీరము. ఈ తూణీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు.
ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు. ఈ ఆయుధములను నీవు స్వీకరించు. నీకు జయం కలుగుతుంది.” అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను, ఖడ్గమును రామునికి ఇచ్చాడు.
పల్లవి : తానీషా : ఏ దేశమున నుండువారు మీరలెందుండి యిట వచ్చినారు
రామ : తొలుత గోదావరియందు మా స్థలమది భద్రాచలమందు
తానీషా : ఎవరి జవానులు మీరు మిమ్మెవరు బంపక వచ్చినారు
రామ :దాసజవానులు మేము రామదాసు పంపగ వచ్చినాము
తానీషా : ఏ కులమువారు మీరు మీరిద్దరు నే వరుసవారు
రామ : ఇనవంశమున బుట్టినాము మేమిద్దర మన్నదమ్ములము
తానీషా : ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు
రామ : రామోజీ లక్ష్మోజినామం వహ్వా రామానుజ మతమువారం
తానీషా : ఎన్నిదినములనుండి మీరు వారిసన్నిధి కొలువై యున్నారు
రామ : తాతముత్తాతలు మేము మూడుతరములనుండి యున్నాము
తానీషా : ఏమి జీతమిచ్చెదరు మీకు ఏమి జీవనమిచ్చెదరు
రామ : సమ్మతిలేని జీతము ప్రసాదమునకే కుదిరినాము
తానీషా : ఎందుకు పంపించినారు మీరేమి పనిగ వచ్చినారు.
రామ : సర్కార్బాకీ పైకము మాచేత బంపగ వచ్చినాము
తానీషా : అర్థమంతయు దెచ్చినారా లేక వ్యర్థముగ వచ్చినారా
రామ : వ్యర్థులముగ మేము రాము మీయర్థమంత దెచ్చినాము
తానీషా : బైఠోజి బైరోజి మీ మాటలు చూడగ వేరు
రామ : బైఠోజి వారముగాము మీ భేటికి వచ్చినాము
తానీషా : లక్షలారును దెచ్చినారా యింకా శిక్షలో నుండమన్నారా
రామ : లక్షలారునియ్యగలము మూడు లక్షలు మేమియ్యగలము
తానీషా : పంపిన పైకము తెండి యాపయిన తమాషా చూడండి
రామ : పదివేలు తెచ్చినామండి యాపయిన మాచేత లేదండి
తానీషా : మగురూర్మాటలు మీతో మాతో మరలించుచున్నారు.
రామ : మగురూరి వారితో మేము మాట్లాడువారము కాము
తానీషా : ధనము మాచేతికియ్యండి యావెనుక ఖైదులోకి పొండి
రామ : ఖైదులోకి మేము పోము మీ ఖజాన పైకమిచ్చేము
తానీషా : చెల్లింతురా ద్రవ్యమంత రసీదు నడుగుట కడువింత
రామ : ఉంగరంబులీడెమందు నుప్పొంగుచు తొడదట్టెయందు
తానీషా : మొహరువేసినంతను మోహనాంగుడు సంతసమునను
మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నివారనితోచెను
ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుర్థ సర్గం రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తారు. ఈ క్రమంలో, శూర్పణఖ రాముణ్ని చూసి, అతనిపై మోహించి, ప్రేమను ప్రదర్శిస్తుంది. అయితే, రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేస్తుంది.
ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది.
“ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది.
ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు.
కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు.
“లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చి పెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు.” అని అన్నాడు. గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు.
అప్పుడే మూర్ఛనుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నువ్వు ఎవరో గుర్తించాను. నీభార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహా పరాక్రమ వంతులు. మీచేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు. ఇంక నా గురించి చెబుతాను.
నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒక సారి నేను రంభయొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. “దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది” అని కుబేరుడు నాకు శాపవిమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శనభాగ్యము కలిగింది. నాకు శాపవిమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్లిపోతాను. నాకు అనుజ్ఞు ఇవ్వండి.” అని ప్రార్థించాడు.
రామ లక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్లండి మీకుశుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతి పెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.” అని అన్నాడు.
తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీసాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీసాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్ద గా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోసాడు.
ఆ ప్రకారంగా రామలక్ష్మణులు, ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని, గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావ వలెనని కోరిక కల విరాధుడు, తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండ రాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు.
(విరాధుని కధ మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదూ! పైన చెప్పిన విధంగా గోరఖపూర్ ప్రతిలో ఉంది. రాముడు మహా బలవంతుడు. అస్త్రశస్త్ర సంపన్నుడు. అటువంటి రాముడు విరాధుడు సీతను ఎత్తుకొని పోగానే ఏడుస్తాడు. అదీ సీతను విరాధుడు ఎత్తుకొని పోయినందుకు కాదు. తమకు కలిగిన కష్టములను చూచి కైక కళ్లు చల్లబడ్డాయి కదా అని ఏడుస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని పరాక్రమమును గుర్తుచేస్తాడు. అయినా రాముడు ఏమీ చేయడు.
తరువాత విరాధుడు రామ లక్ష్మణులను బుజాల మీద ఎత్తుకొని పోతుంటే, “ఎటూ మనం అటే వెళతాము కదా కాస్త దూరం కలిసి వచ్చిందిలే” అని అనుకుంటాడు రాముడు. అంతేగానీ సీత ఒంటరిగా ఉంది, ఆమెకు ఏమన్నా ఆపద కలుగుతుంది అని గుర్తుకు రాదు. సీత కూడా “రామా నన్ను రక్షించు” అని ఏడవదు. విరాధునితో “నన్ను ఇక్కడ క్రూరమృగాలు తింటాయి. కావాలంటే నన్నుఎత్తుకొని పో, రామలక్ష్మణులను వదిలిపెట్టు” అని అరుస్తుంది. అప్పుడు రామునికి సీత ఒంటరిగా ఉంది అని గుర్తుకు వస్తుంది.
తాము విరాధుని చంపాలి అని అనుకుంటాడు. తరువాత విరాధుడు కూడా తనశాపవృత్తాంతము చెబుతాడు. తన శరీరాన్ని గోతిలో పెట్టి పాతిపెట్టమని కోరతాడు. తరువాత ప్రాణాలు విడుస్తాడు. రాముడు విరాధుని గొంతు మీద కాలు తీయగానే పెద్దగా అరుస్తాడు. అలా అరుస్తూ గిలా గిలా కొట్టుకుంటున్న విరాధుని రామలక్ష్మణులు గోతిలోకి తోసి కప్పెడతారు. వాడు లేవకుండా బండరాళ్లు పెడతారు. విరాధుడు ఇలాగే చస్తాడు అని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా!
కాని రామాయణం ప్రాచ్య ప్రతిలో కధ వేరుగా ఉంది. విరాధుడు సీతను లాక్కుని తన తొడమీద కూర్చోపెట్టుకోగానే సీతకు కలిగిన దుస్థితికి రాముడికి దుఃఖము కలుగుతుంది. లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి విరాధుని మీద ఏడు బాణాలు ప్రయోగిస్తాడు. విరాధుడు లక్ష్మణుని మీద శూలం విసురుతాడు. రాముడు దానిని రెండు ముక్కలుగా విరిచేస్తాడు. మరొక బాణంతో రాముడు విరాధుని వక్షస్థలం చీలేట్టు కొడతాడు. విరాధుడు కిందపడతాడు. కాని చావడు.
రామునికి తనశాప వృత్తాంతము చెబుతాడు. రామునికి కోపం తెప్పించడానికే, రాముని చేతిలో మరణించి శాపవిముక్తి పొందడానికే సీతను లాక్కున్నాను అని చెబుతాడు. తరువాత రాక్షసుల ఆచారం కార తన శరీరాన్ని గోతిలో కప్పెట్టమంటాడు. తరువాత శరభంగ ముని గురించి చెప్పి, తన నిజ స్వరూపంతో గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఈకథ సందర్భోచితంగా ఉంది. కాబట్టి మనము దీనినే అనుసరిద్దాము. పైవిషయములను నేను ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్రీమద్రామాయణము అరణ్యకాండ నుండి గ్రహించాను. వారికి నా పాదాభివందనములు. కృతజ్ఞతలు.)