Aranya Kanda Sarga 5 In Telugu – అరణ్యకాండ పంచమః సర్గః

Aranya Kanda Sarga 5 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచమః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. సుర్పణఖ రాముడిని చూసి మోహించి, సీతను వదిలేయమని కోరుతుంది. రాముడు సీతను వదలకుండా సుర్పణఖతో మాట్లాడతాడు. సుర్పణఖ తన మాయలు ప్రయోగించి రాముడిని పొందాలని ప్రయత్నిస్తుంది.

|| శరభంగబ్రహ్మలోకప్రస్థానమ్ ||

హత్వా తు తం భీమబలం విరాధం రాక్షసం వనే |
తతః సీతాం పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్ ||

1

అబ్రవీల్లక్ష్మణం రామో భ్రాతరం దీప్తతేజసమ్ |
కష్టం వనమిదం దుర్గం న చ స్మ వనగోచరాః ||

2

అభిగచ్ఛామహే శీఘ్రం శరభంగం తపోధనమ్ |
ఆశ్రమం శరభంగస్య రాఘవోఽభిజగామ హ ||

3

తస్య దేవప్రభావస్య తపసా భావితాత్మనః |
సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతమ్ ||

4

విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరోపమమ్ |
అవరుహ్య రథోత్సంగాత్సకాశే విబుధానుగమ్ ||

5

అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరమ్ |
సుప్రభాభరణం దేవం విరజోంబరధారిణమ్ ||

6

తద్విధైరేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః |
హరిభిర్వాజిభిర్యుక్తమంతరిక్షగతం రథమ్ ||

7

దదర్శాదూరతస్తస్య తరుణాదిత్యసన్నిభమ్ |
పాండురాభ్రఘనప్రఖ్యం చంద్రమండలసన్నిభమ్ ||

8

అపశ్యద్విమలం ఛత్రం చిత్రమాల్యోపశోభితమ్ |
చామరవ్యజనే చాగ్ర్యే రుక్మదండే మహాధనే ||

9

గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని |
గంధర్వామరసిద్ధాశ్చ బహవః పరమర్షయః ||

10

అంతరిక్షగతం దేవం వాగ్భిరగ్ర్యాభిరీడిరే |
సహ సంభాషమాణే తు శరభంగేన వాసవే ||

11

దృష్ట్వా శతక్రతుం తత్ర రామో లక్ష్మణమబ్రవీత్ |
రామోఽథ రథముద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్ ||

12

అర్చిష్మంతం శ్రియా జుష్టమద్భుతం పశ్య లక్ష్మణ |
ప్రతపంతమివాదిత్యమంతరిక్షగతం రథమ్ ||

13

యే హయాః పురుహూతస్య పురా శక్రస్య నః శ్రుతాః |
అంతరిక్షగతా దివ్యాస్త ఇమే హరయో ధ్రువమ్ ||

14

ఇమే చ పురుషవ్యాఘ్రా యే తిష్ఠంత్యభితో రథమ్ |
శతం శతం కుండలినో యువానః ఖడ్గపాణయః ||

15

విస్తీర్ణవిపులోరస్కాః పరిఘాయతబాహవః |
శోణాంశువసనాః సర్వే వ్యాఘ్రా ఇవ దురాసదాః ||

16

ఉరోదేశేషు సర్వేషాం హారా జ్వలనసన్నిభాః |
రూపం బిభ్రతి సౌమిత్రే పంచవింశతివార్షికమ్ ||

17

ఏతద్ధి కిల దేవానాం వయో భవతి నిత్యదా |
యథేమే పురుషవ్యాఘ్రా దృశ్యంతే ప్రియదర్శనాః ||

18

ఇహైవ సహ వైదేహ్యా ముహూర్తం తిష్ఠ లక్ష్మణ |
యావజ్జానామ్యహం వ్యక్తం క ఏష ద్యుతిమాన్రథే ||

19

తమేవముక్త్వా సౌమిత్రిమిహైవ స్థీయతామితి |
అభిచక్రామ కాకుత్స్థః శరభంగాశ్రమం ప్రతి ||

20

తతః సమభిగచ్ఛంతం ప్రేక్ష్య రామం శచీపతిః |
శరభంగమనుప్రాప్య వివిక్త ఇదమబ్రవీత్ ||

21

ఇహోపయాత్యసౌ రామో యావన్మాం నాభిభాషతే |
నిష్ఠాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి ||

22

[* తావద్గచ్ఛామహే శీఘ్రం యావన్మాం నాభిభాషతే | *]
జితవంతం కృతార్థం చ ద్రష్టాహమచిరాదిమమ్ |
కర్మ హ్యనేన కర్తవ్యం మహదన్యైః సుదుష్కరమ్ ||

23

నిష్పాదయిత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి |
ఇతి వజ్రీ తమామంత్ర్య మానయిత్వా చ తాపసమ్ ||

24

రథేన హరియుక్తేన యయౌ దివమరిందమః |
ప్రయాతే తు సహస్రాక్షే రాఘవః సపరిచ్ఛదమ్ ||

25

అగ్నిహోత్రముపాసీనం శరభంగముపాగమత్ |
తస్య పాదౌ చ సంగృహ్య రామః సీతా చ లక్ష్మణః ||

26

నిషేదుః సమనుజ్ఞాతా లబ్ధవాసా నిమంత్రితాః |
తతః శక్రోపయానం తు పర్యపృచ్ఛత్స రాఘవః ||

27

శరభంగశ్చ తత్సర్వం రాఘవాయ న్యవేదయత్ |
మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీషతి ||

28

జితముగ్రేణ తపసా దుష్ప్రాపమకృతాత్మభిః |
అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానమదూరతః ||

29

బ్రహ్మలోకం న గచ్ఛామి త్వామదృష్ట్వా ప్రియాతిథిమ్ |
త్వయాఽహం పురుషవ్యాఘ్ర ధార్మికేణ మహాత్మనా ||

30

సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితమ్ |
అక్షయా నరశార్దూల మయా లోకా జితాః శుభాః ||

31

బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్ |
ఏవముక్తో నరవ్యాఘ్రః సర్వశాస్త్రవిశారదః ||

32

ఋషిణా శరభంగేణ రాఘవో వాక్యమబ్రవీత్ |
అహమేవాహరిష్యామి సర్వలోకాన్మహామునే ||

33

ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే |
రాఘవేణైవముక్తస్తు శక్రతుల్యబలేన వై ||

34

శరభంగో మహాప్రాజ్ఞః పునరేవాబ్రవీద్వచః |
ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామ ధార్మికః ||

35

వసత్యరణ్యే ధర్మాత్మా స తే శ్రేయో విధాస్యతి |
సుతీక్ష్ణమభిగచ్ఛ త్వం శుచౌ దేశే తపస్వినమ్ ||

36

రమణీయే వనోద్దేశే స తే వాసం విధాస్యతి |
ఇమాం మందాకినీం రామ ప్రతిస్రోతామనువ్రజ ||

37

నదీం పుష్పోడుపవహాం తత్ర తత్ర గమిష్యసి |
ఏష పంథా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్య తాత మామ్ ||

38

యావజ్జహామి గాత్రాణి జీర్ణాం త్వచమివోరగః |
తతోఽగ్నిం సుసమాధాయ హుత్వా చాజ్యేన మంత్రవిత్ ||

39

శరభంగో మహాతేజాః ప్రవివేశ హుతాశనమ్ |
తస్య రోమాణి కేశాంశ్చ దదాహాగ్నిర్మహాత్మనః ||

40

జీర్ణాం త్వచం తథాస్థీని యచ్చ మాంసం సశోణితమ్ |
రామస్తు విస్మితో భ్రాత్రా భార్యయా చ సహాత్మవాన్ ||

41

స చ పావకసంకాశః కుమారః సమపద్యత |
ఉత్థాయాగ్నిచయాత్తస్మాచ్ఛరభంగో వ్యరోచత ||

42

స లోకానాహితాగ్నీనామృషీణాం చ మహాత్మనామ్ |
దేవానాం చ వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత ||

43

స పుణ్యకర్మా భవనే ద్విజర్షభః
పితామహం సానుచరం దదర్శ హ |
పితామహశ్చాపి సమీక్ష్య తం ద్విజం
ననంద సుస్వాగతమిత్యువాచ హ ||

44

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమః సర్గః ||

Aranya Kanda Sarga 5 Meaning In Telugu

విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము.” అని అన్నాడు.

లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు.

తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. “రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడక ముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవ కార్యము నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తరువాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరుమాత్రము రామునికి అన్నివిధాలా సాయం చెయ్యండి.” అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకొని తన రథము మీద స్వర్గమునకు వెళ్లిపోయాడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్లాడు. అందరూ ఆమహామునికి పాదాభివందనము చేసారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు.

రాముడు శరభంగ మహర్షిని చూచి “ఓ మహర్షీ!
దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగోరుతాను.” అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు.

“రామా! నేను ఎంతో తపస్సు చేసాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకొని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని, నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. రామా! నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మ లోకములను, స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను. స్వీకరించు.” అని అన్నాడు.

దానికి రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షి! పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించు కోవాలేగానీ, ఒకరు ఇస్తే స్వీకరించ కూడదు.కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యములో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి.” అని అడిగాడు.

ఆ మాటలకు శరభంగ మహాముని ఇలాఅన్నాడు. “ఓ రామా! ఈ అరణ్యములో సుతీక్షుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్లి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించ గలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకినీ నది ప్రవాహము నకు ఎదురు వెళితే, (అంటే ఎగువభాగంలో అని అర్థం) సుతీక్షుడి ఆశ్రమము వస్తుంది.

రామా! నీతో మాట్లాడాను. నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూఉండు.” అని అన్నాడు. తరువాత శరభంగ మహర్షి అగ్ని గుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేసాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్ని కుండము నుండి నవయౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్లిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగమహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షష్ఠః సర్గః (6) >>

Sri Ramadasu Keerthanalu 51-60 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 51-60

Sri Ramadasu Keerthanalu 51-60 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

51. సావేరి చాపుతాళం

పల్లవి : కలయే గోపాలం కస్తూరి తిలక సుఫాలం
కుండల రుచిరం లలితకపోలం
చంద్రసన్నిభ కాంతి కాంతం
జగన్నాధపురీ నిశాంతం
అనుపమ రూపం మహితమణి కనిక కలాపం
విగతగోప వినుతాడు తాపం.
ముని మనోనీరేజ తరణీం
పంకజ సన్నిభ చారుచరణం
విదిత ద్విజకాంత కరాంభోజ నవనీతం
కమల భవముని గీతం
వివిధ కుసుమాలంకారం
విమల బృందావన విహారం

॥కలయే॥

భాసిత భాసురం భద్రాద్రినివాస నిధానం
దివ్యానంత భూసురగానం
రాజకేళి విరాజమానం
రామదాస స్తుతి నిధానం

॥కలయే॥

52. మోహన ఆదితాళం

పల్లవి : కలికి యీ కల సాంగముగ వినవే
ఓ కలికి పలుకగ నీతో మైపులకలొద వేడిని
అప్పుకలుగువాడె యువతి రామదాసుడు
అప్పుడతనికై నేడు
ఇద్దరు గూడి జోడుకప్పము పుచ్చికొనెడి
చెప్పున మము బంపుడు
తప్పక యెసగుడు తడవులేక రసీదనుడు

॥కలికి॥

రామలక్ష్మణులట వా రర్క వంశజులట
రామదాసు పైకమట రసీదు బంపెనట
రాములవారు చెల్లించిరట రసీదందిపోయిందట
ఏమి కారణము యెరుగను ఈ కలను
యేమని చెప్పుదునే నెలనాగ యీ వింత
ఈ మహిమలు ఆ రాములది కాబోలు
జాము ప్రొద్దున్నది జయ మపజయమే యెరుగ

॥కలికి॥

53. ఆనందభైరవి రూపకతాళం

కలియుగ వైకుంఠము భద్రాచలనిలయము సేవింతము
అలివేణులారా మీరానందముగ వేగ విలిసితమైనట్టి వేడుక చూడరె

|| కలియుగ||

కాంచనసౌధములు కంబమును మించిన దూలములు
వజ్రములు చెక్కించిన స్తంభములు
పగడములని భ్రమించు ద్వారములు
అందయాన మరి యెంచలేనుగాదె
మంచి పచ్చలు గూర్చిన వాకిళ్ళు

|| కలియుగ||

బంగారు గోపురములు దేవళముల వెలుంగు మాణిక్యములు
భేరీమృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలు
సొంపైన కల్యాణరత్న మంటపములు
శృంగారమేమని దెలియ విన్నవింతు

|| కలియుగ||

తీరైన పురవీధులు సొంపైన కోనేరులు
సోపానములు సకల ఫలతరువులు
ఆ నదులు ఋషి గంధర్వ నివాసములు
సరసిజాక్ష వినవే సరిలేని గోదావరి స్నానములు
సంపత్కరమై యొప్పినది

॥కలియుగ॥

చక్కని స్త్రీ పురుషులు పట్టణమందు
పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు
వేదశాస్త్రతార్కిక వైష్ణవులు గ్రక్కున వారిని కన్నులజూచి
తక్కువైన పుణ్యమేయని తెల్పుదు

॥కలియుగ॥

వామాక్షులాడగను సీతనుగూడి
హేమపీఠమునందు సంపూర్ణకళలు మోము వెలుగగను
పరివారములు ప్రేమతో గొలువగను
ప్రేమచే భద్రాద్రిరామదాసుని మేలు
స్వామి శ్రీ కోదండరాము నివాసము

॥కలియుగ॥

54. కళ్యాణి ఆదితాళం

పల్లవి : కైంకర్యము చేసెను రామదాసు కైంకర్యము చేసెను
కైంకర్యముచేసె కాకుత్థ్స తిలకునకు
సంకటహరణ సర్వాత్మయని మ్రొక్కి

||కైంకర్యము॥

శ్రీ కరమగు రాజిత మణిశాలల
ప్రాకారంబుల బహుమఠమెల్లెడ
మంజుల తరమగు మణి మంటపములు
రంజరాగమణి కలితాంగంబుల

||కైంకర్యము॥

చౌకంగ కాంచన కూటంబుల
నాకాశంబున కంటెడు తేరుల
గోపుర మెరసెడి నోపురవితతుల
దీవించు వితర్థిశల బెడంగుల

||కైంకర్యము॥

తళుకుగులుకు పగడంపు కంబముల
బలుపడంబులును బలు కలువడముల
రంగుగ ముత్యపు రంగవల్లికల
శృంగారములగు చిరతపాలికల

॥కైంకర్యము॥

మకరతోరణ మణి మాల్యంబుల
ముకురతోరణ సమ్మోదంబుల
భుగభుగ వెలసెడు పూ చప్పరముల
అగరు ధూపముల నాలపట్టములు

||కైంకర్యము॥

మెరసెడు రీతిని మేలిమిగాగను
ధారాళములగు ద్వారబంధముల
చారురత్న కాంచన శిఖరంబులకు
ఘుమఘుమమనియెడు గంధవాసనల

||కైంకర్యము॥

ఘుమఘుము యను బలు కుంకుమరసముల
ఘణఘణఘణ యను గంటలు తలుపుల
ధణధణ యనెడి మృదంగ వాద్యముల
మిసమిస మెరిసెడి మేనిమిగోడల

||కైంకర్యము॥

కనకమయంబగు గరుడ ధ్వజముల
రామరామయను రామ శుకంబుల
వేమరు పొగడెడు విబుధ గణంబుల
పొసగ మ్రోయు తంబురుల పరంబుల

||కైంకర్యము॥

కొసరి యాడు భక్తుల నృత్యంబుల
వైనతేయముఖ వాహన చయముల
పూనమర్దల భూరి నినాదము
మెరసెడిరీతిని మేలిమిగాగను

||కైంకర్యము॥

వెల్లగొడుగులను వింజామరములు
మల్లెల మొల్లల మంచివాసనల
పిల్లనగ్రోవి గంభీర స్వరముల
ఝల్లరి ఢక్కా జయనాదమ్ముల

||కైంకర్యము॥

పల్లవపాణులు పాటలాటల
సల్లలితోత్పలచయ పరిమళముల
వనమాలా సంత సౌరభముల
ఘన తులసీదళ ఘన కదంబముల

॥కైంకర్యము॥

రామభజన సంభారోత్కరముల
రామతీర్థ సారసముల తావుల
రామస్మరణావ మధురమ్ముల
రామభద్ర విగ్రహదర్శనముల
హనుమదంగ వాహనముల ఘనముల

॥కైంకర్యము॥

అనుపమ శృంగారానందముల
రమణ భద్రగిరి రామాలయములు
అమలానందంబై ధరలోపల
మెరసెడిరీతిని మేలిమి గాగను

॥కైంకర్యము॥

55. నాదనామక్రియ రూపకతాళం

పల్లవి : ధన్యుడవు తానీషా నీవు
నన్ను గన్నయ్య పదములు కలగన్నావు

॥ధన్యుడవు॥

నిన్నటిరాతిరి వారు వచ్చియున్న ముచ్చటలాడి యేమేమి యున్నారు
ఎంతవేడినగాని రారు నీవు పుణ్యమూర్తివి గనుక పొడసూపినారు
తానీషా : ధన్యుడవు గోపన్న నీవు యా దాశరథికి నిజదాసుడైనావు
సామాన్యుడని యెంచుకొంటి శ్రీరామచంద్రుల సేవ మీవలన గంటి
ప్రేమతో సేవించుకొంటి నేను పామరుడనై మిమ్ము బాధింపుచుంటి

॥ ధన్యుడవు ॥

గోపన్న : ఏమి పూజలు చేసినారు మా స్వామి భద్రగిరి దాసులు మీరు
ప్రేమతో సేవించినారు శ్రీరామ కృపగల్గి రంజిల్లుతారు
తానీషా : పైకము దీసుకుపొండి భద్రాచల రామదాసులై పట్టమేలండి
అయినదెల్ల వేడుకొనండి మీరు అనుదినము రాముల నర్చించండి

॥ధన్యుడవు||

గోపన్న : ఏటిమాటలు పలికెదరు నా కేటికి రాజ్యమీ యిలలోనే మీరు
మేటి జన్మమెత్తినారు మీ సాటివారలు యీ జగములోలేరు

||ధన్యుడవు ||

తానీషా : భద్రాచలము నెప్పటికి మీ రామభద్రున కిచ్చితి బాగుగా వినుమా
ముద్ర నిశానీల్ కొనుమా శ్రీ భద్రాద్రివర రామదాసుడై యేలుమి

॥ధన్యుడవు||

56. మాయామాళవగౌళ ఏకతాళం

పల్లవి : నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవా బృందాలోలం

|| నంద ||

జలజ సంభవాది వినుత చరణారవిందం
లలితమోహన రాధావదన నళిన మిళిందం

|| నంద ||

నిటల లలిత స్ఫటికుటిల నీలాలక బృందం కృష్ణం
ఘటిత శోభిత గోపికా ధర మకరందం

॥నంద॥

గోదావరీ తీర రాజగోపికా రామం కృష్ణం
ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రి రామం

|| నంద ||

57. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కయినా
వెయ్యారులు దాచుకొనియు నర్థులకియ్యని లోభుల కయ్యయ్యో

||పొయ్యే||

చరణములు :
ఇచ్చిన మాత్రం బిచ్చును దైవము హెచ్చడిగినరాదు
వచ్చేటప్పుడు వెంటనేమైన తెచ్చుకొన్నదిలేదు

||పొయ్యే||

హెచ్చుగతిది తెలియని పామరులు దురాశను తగులుకొని
ఇచ్చుటనార్జించిన ధనమెచ్చటకెత్తుకు పొయ్యే దరయ్యయ్యో

||పొయ్యే||

తనువును రక్షించుటకై మూలమూలలందును ధనము దాచెదరు
తనువును సుతబాంధవు లస్థిరమని తలచి గానగలేరు

||పొయ్యే||

58. కాంభోజి ఆదితాళం

పల్లవి : బహుకాలమునకు శ్రీ భద్రాచలశేషునకు పాదసేవకుడనైతి
అహహా నాజన్మము సఫలమాయె నేటికిని అనుమానములు దీరె నిక సుంతగను

||బహు||

తల్లి గర్భమునందు మలమూత్రముల మునిగి ధరణిపై జన్మించితి
కల్లలాడుచు పాపకర్మలొడిగట్టి కామపురుషులను జేరితి నీవేగతి

||బహు||

కోపుడను పాపుడను గుణహీనుడను నేను క్రూరుడను కుత్సితుడను
దాపుచేయక నన్ను రక్షింపదలచు శ్రీరామచంద్రునకు భారమా యికను

||బహు||

అఖిల లోకంబులకు నాధారమైయున్న యాది పురుషోత్తముడు
సక్రియతో గూడిన సమయమందుజేరి సన్నుతులు చేయకలిగి తొలుత

||బహు||

రామదాసుని నేలుకొరకై శ్రీభధ్రాద్రిధాములై యుదయించి
యేమికొదవలు మనకు నెరుగగలుగజేసే స్నేహంబునితరమెల్లకల్ల

||బహు||

59. మధ్యమావతి చాపుతాళం

పల్లవి : బిడియ మేలనిక మోక్షమిచ్చి నీవడుదుదాటిపోరా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా

॥ బిడియ॥

మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
నీ అరుదుమీరలని నెగురవేయ నే హనుమంతుడనుగాను
సరగున మ్రుచ్చుల మాటలు విన నే జాంబవంతుడను గాను
బిరబిర మీవల లోపల బడ నే విభీషణుడనుగాను

||బిడియ॥

మాయచేత వంచింపబడగనే మహేశుడనుగాను
న్యాయములేకయే యిటునటు దిరుగను నారదుండగాను
ఆయముచెడి హరినరుడని కొలువను నర్జునుండగాను
దాయాదుండని మదిలో మురియను దశరథుడనుగాను

||బిడియ||

గరిమతోడ మా సీతనుజూడ కాచితినిందాక
పరగభద్రుని శిఖరావాసా పరబలసంహార
నరహరి నను రక్షింపువేగమే నారాయణరూపా
మంచి నిదురలోనైనను మీపద సరసిజములు మరువ

||బిడియ||

60. మోహన ఆదితాళం

పల్లవి : భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము
అద్రిజాధిప బ్రహ్మేంద్రాదులకెల్ల భద్రములొసగెడు భవ్యవిధానము

॥భద్రాద్రి॥

ఇనవంశజులు మేమిద్దరము చాలదినమునుండి యున్నారము
అనిశము రామదాసుని యాజ్ఞ చొప్పున పనులు చేయుచు

॥భద్రాద్రి॥

ఖైదు చేసిన వార్తదెలిసి యిల్లు బయలుదేరి మిమ్ములకలసి
పైకము చెల్లించి భక్తుని యాపదబాపి గొంపోయెడి పనికై వచ్చితిమి

॥భద్రాద్రి॥

భక్తుడైన రామదాసు యెంతో శక్తిచేసిరి మంచి మేలని
ముక్తిని ధానమౌ యుక్తి తెలియక యాశక్తి ధనాపేక్షకై యిటు చేసిరి

||భద్రాద్రి॥

మించిన కార్యమేమాయె యెంతో వంచన చేయుటలాయె
సంచులన్నీ మీరె యెంచి రసీదు వ్రాయించి సెలవిప్పించండి వేగమె

||భద్రాద్రి॥

రామదాసుని రప్పించు తండ్రి ప్రేమతో మాకప్పగించు
స్వామి యా భద్రాద్రి సదయుని కనుగొన రామదాసునిగూడి రయమున బోవలె

||భద్రాద్రి॥

మరిన్ని కీర్తనలు:

Ayodhya Kanda Sarga 78 In Telugu – అయోధ్యాకాండ అష్టసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 78 In Telugu

అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గములో, భరతుడు రాముని ఆశ్రమానికి చేరి ఆయనకు సమర్పణను చెప్పాడు. రాముడు తన తమ్ముడిని ఆలింగనం చేసి సంతాపం వ్యక్తం చేశాడు. భరతుడు రాముని అయోధ్యకు తిరిగి రావాలని, తాను పాదుకలు మాత్రమే ధరించి రాజ్యం పరిపాలిస్తానని కోరాడు. రాముడు తండ్రి చిత్తానికి ప్రతిబంధకుడు కావడం ఇష్టం లేక, తన నిర్ణయం మార్చుకోకుండా అడవిలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళి, అవి పీఠంపై ఉంచి రాముడి హస్తంతోనే పరిపాలన చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఇది వాక్కులు, పాదుకల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

కుబ్జావిక్షేపః

అథ యాత్రాం సమీహంతం శత్రుఘ్నః లక్ష్మణానుజః |
భరతం శోకసంతప్తమిదం వచనమబ్రవీత్ || ౧ ||

గతిర్యః సర్వ భూతానాం దుఃఖే కిం పునరాత్మనః |
స రామః సత్త్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితః వనమ్ || ౨ ||

బలవాన్ వీర్యసంపన్నో లక్ష్మణో నామ యోఽప్యసౌ |
కిం న మోచయతే రామం కృత్వా అపి పితృనిగ్రహమ్ || ౩ ||

పూర్వమేవ తు నిగ్రాహ్యః సమవేక్ష్య నయానయౌ |
ఉత్పథం యః సమారూఢో నార్యా రాజా వశం గతః || ౪ ||

ఇతి సంభాషమాణే తు శత్రుఘ్నే లక్ష్మణానుజే |
ప్రాగ్ద్వారేఽభూత్తదా కుబ్జా సర్వాభరణభూషితా || ౫ ||

లిప్తా చందనసారేణ రాజవస్త్రాణి బిభ్రతీ |
వివిధం వివిధైస్తైస్తైర్భూషణైశ్చ విభూషితా || ౬ ||

మేఖలాదామభిశ్చిత్రైః అన్యైశ్చ శుభభూషణైః |
బభాసే బహుభిర్బద్ధా రజ్జుబద్ధేవ వానరీ || ౭ ||

తాం సమీక్ష్య తదా ద్వాస్థాః సుభృశం పాపకారిణీమ్ |
గృహీత్వాఽకరుణం కుబ్జాం శత్రుఘ్నాయ న్యవేదయత్ || ౮ ||

యస్యాః కృతే వనే రామర్న్యస్త దేహశ్చ వః పితా |
సేయం పాపా నృశంసా చ తస్యాః కురు యథామతి || ౯ ||

శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ వచనం భృశదుఃఖితః |
అంతఃపురచరాన్ సర్వాన్ ఇత్యువాచ ధృతవ్రతః || ౧౦ ||

తీవ్రముత్పాదితం దుఃఖం భ్రాతౄణాం మే తథా పితుః |
యయా సేయం నృశంసస్య కర్మణః ఫలమశ్నుతామ్ || ౧౧ ||

ఏవముక్తా తు తేనాశు సఖీజనసమావృతా |
గృహీతా బలవత్ కుబ్జా సా తద్గృహమనాదయత్ || ౧౨ ||

తతః సుభృశ సంతప్తస్తస్యాః సర్వః సఖీజనః |
క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం వ్యపలాయత సర్వశః || ౧౩ ||

ఆమంత్రయత కృత్స్నశ్చ తస్యాః సర్వసఖీజనః |
యథాఽయం సముపక్రాంతర్నిశ్శేషం నః కరిష్యతి || ౧౪ ||

సానుక్రోశాం వదాన్యాం చ ధర్మజ్ఞాం చ యశస్వినీమ్ |
కౌసల్యాం శరణం యామః సా హి నోఽస్తు ధ్రువా గతిః || ౧౫ ||

స చ రోషేణ తామ్రాక్షః శత్రుఘ్నః శత్రుతాపనః |
విచకర్ష తదా కుబ్జాం క్రోశంతీం ధరణీతలే || ౧౬ ||

తస్యా హ్యాకృష్యమాణాయా మంథరాయాస్తతస్తతః |
చిత్రం బహువిధం భాండం పృథివ్యాం తద్వ్యశీర్యత || ౧౭ ||

తేన భాండేన సంస్తీర్ణం శ్రీమద్రాజనివేశనమ్ |
అశోభత తదా భూయః శారదం గగనం యథా || ౧౮ ||

స బలీ బలవత్క్రోధాద్గృహీత్వా పురుషర్షభః |
కైకేయీమభినిర్భర్త్స్య బభాషే పరుషం వచః || ౧౯ ||

తైః వాక్యైః పరుషైర్దుఃఖైః కైకేయీ భృశదుఃఖితా |
శత్రుఘ్నభయసంత్రస్తా పుత్రం శరణమాగతా || ౨౦ ||

తాం ప్రేక్ష్య భరతః క్రుద్ధం శత్రుఘ్నమిదమబ్రవీత్ |
అవధ్యాః సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతామితి || ౨౧ ||

హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీమ్ |
యది మాం ధార్మికో రామర్నాసూయేన్మాతృ ఘాతకమ్ || ౨౨ ||

ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః |
త్వాం చ మాం చైవ ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ || ౨౩ ||

భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణానుజః |
న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరామ్ || ౨౪ ||

సా పాదమూలే కైకేయ్యాః మంథరా నిపపాత హ |
నిశ్శ్వసంతీ సుదుఃఖార్తా కృపణం విలలాప చ || ౨౫ ||

శత్రుఘ్న విక్షేప విమూఢసంజ్ఞామ్
సమీక్ష్య కుబ్జాం భరతస్య మాతా |
శనైః సమాశ్వాసయదార్తరూపామ్
క్రౌంచీం విలగ్నామివ వీక్షమాణామ్ || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టసప్తతితమః సర్గః || ౭౮ ||

Ayodhya Kanda Sarga 78 Meaning In Telugu

దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు.

“భరతా! మనము ఇంట లేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపి వేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమయింది. కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా! స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంతదూరము వచ్చిఉండెడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు.” అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసి మంథరం అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు.

ఒంటినిండా నగలు అలంకరించు కున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతి లాగ కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంథరను పట్టుకొని శత్రుఘ్నుని వద్దకు తీసుకొని వచ్చారు.

“శత్రుఘ్నకుమారా! ఈమె కైక ఆంతరంగిక దాసి. పేరు మంథర. ఈమె రాముని వనవాసమునకు, మహారాజు మరణమునకు, కారణము. ఈమెను నీ ముందర నిలబెట్టాము. ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.” అని అన్నారు.

ఆ మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం మిన్నుముట్టింది. “మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారము చేసిన ఈ దాసికి తగిన గుణపాఠము చెబుతాను.” అని అన్నాడు. ఆసమయంలో మంథర తో వచ్చిన వాళ్లు శత్రుఘ్నుని కోపం చూచి తలొకదిక్కుకూ పారిపోయారు. “ఈరోజు మంథర శత్రుఘ్నుని చేతిలో చచ్చింది” అని అందరూ అనుకున్నారు.

కొందరు గబగబా కౌసల్యకు ఈ వార్త చెప్పడానికి వెళ్లారు. శత్రుఘ్నుడు మంధరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మంధర అలంకరించుకున్న ఆభరణములు అన్నీ నేల మీద “చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతలో కైక అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మంథర మెడ పట్టుకొని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మంథరను కాపాడమని బతిమాలింది.

భరతుడు శత్రుఘ్నుని చూచి “శత్రుఘ్నా! ఆగు. ఎంత అపరాథము చేసినా స్త్రీలను చంపరాదు.. కాబట్టి మంథరను విడిచి పెట్టు. దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని. కాని రాముడికి అది ఇష్టంలేదు. అందుకని నాకోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మంథర ఒక దాసి. ఆమె ఏమి చేస్తుంది. ఆమెను క్షమించు.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు శత్రుఘ్నుడు తనకోపాన్ని దిగమింగుకొని మంథరను విడిచిపెట్టాడు. మంథర కైక పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బడి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గః (79) >>

Ayodhya Kanda Sarga 77 In Telugu – అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 77

అయోధ్యాకాండం సప్తసప్తతితమః సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్ర విచారం, క్షోభతో మరణించిన తరువాత, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది. భరతుడు, శతృఘ్నుడు వారి మాతామహుడి యైన అశ్వపతికి చెరి అక్కడ విషాద వార్త వింటారు. తండ్రి మరణవార్త విని, భరతుడు తీవ్ర దుఃఖంతో అయోధ్యకు తిరిగి వస్తాడు. కైకేయి చేసిన పాపాన్ని తెలుసుకొని, భరతుడు ఆమె పట్ల ఆగ్రహంతో ఉంటాడు. అయోధ్య ప్రజలు భరతుని ఆగమనాన్ని చూసి, రాముని గదిని శూన్యంగా చూచి, రాముని గురించీ భరతుని ప్రశ్నిస్తారు. దశరథుడి మరణంతో, భరతుడు బాధతో కైకేయిని విసురుకుంటాడు.

భరతశత్రుఘ్నవిలాపః

తతర్దశాహేఽతిగతే కృతశౌచో నృపాత్మజః |
ద్వాదశేఽహని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ || ౧ ||

బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం ధనమన్నం చ పుష్కలమ్ |
వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ || ౨ ||

బాస్తికం బహు శుక్లం చ గాశ్చాపి శతశస్తథా |
దాసీదాసం చ యానం చ వేశ్మాని సుమహాంతి చ || ౩ ||

బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రః రాజ్ఞస్తస్యౌర్ధ్వదైహికమ్ |
తతః ప్రభాతసమయే దివసేఽథ త్రయోదశే || ౪ ||

విలలాప మహా బాహుర్భరతః శోకమూర్ఛితః |
శబ్దాపిహితకంఠశ్చ శోధనార్థముపాగతః || ౫ ||

చితామూలే పితుర్వాక్యమిదమాహ సుదుఃఖితః |
తాత యస్మిన్నిసృష్టోఽహం త్వయా భ్రాతరి రాఘవే || ౬ ||

తస్మిన్వనం ప్రవ్రజితే శూన్యే త్యక్తోఽస్మ్యహం త్వయా |
యథా గతిరనాథాయాః పుత్రః ప్రవ్రాజితః వనమ్ || ౭ ||

తామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వం క్వ గతర్నృప |
దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస్థిస్థానమండలమ్ || ౮ ||

పితుః శరీరనిర్వాణం నిష్టనన్ విషసాద సః |
స తు దృష్ట్వా రుదన్ దీనః పపాత ధరణీతలే || ౯ ||

ఉత్థాప్యమానః శక్రస్య యంత్ర ధ్వజైవచ్యుతః |
అభిపేతుస్తతః సర్వే తస్యామాత్యాః శుచివ్రతమ్ || ౧౦ ||

అంతకాలే నిపతితం యయాతిమృషయో యథా |
శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిప్లుతమ్ || ౧౧ ||

విసంజ్ఞో న్యపతద్భూమౌ భూమి పాలమనుస్మరన్ |
ఉన్మత్తైవ నిశ్చేతా విలలాప సుదుఃఖితః || ౧౨ ||

స్మృత్వా పితుర్గుణాంగాని తని తాని తదా తదా |
మంథరాప్రభవస్తీవ్రః కైకేయీగ్రాహసంకులః || ౧౩ ||

వరదానమయోఽక్షోభ్యో అమజ్జయచ్ఛోకసాగరః |
సుకుమారం చ బాలం చ సతతం లాలితం త్వయా || ౧౪ ||

క్వ తాత భరతం హిత్వా విలపంతం గతః భవాన్ |
నను భోజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ || ౧౫ ||

ప్రవారయసి నః సర్వాన్ తన్నః కోఽన్య కరిష్యతి |
అవదారణ కాలే తు పృథివీ నావదీర్యతే || ౧౬ ||

యా విహీనా త్వయా రాజ్ఞా ధర్మజ్ఞేన మహాత్మనా |
పితరి స్వర్గమాపన్నే రామే చారణ్యమాశ్రితే || ౧౭ ||

కిం మే జీవితసామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
హీనో భ్రాత్రా చ పిత్రా చ శూన్యామిక్ష్వాకు పాలితామ్ || ౧౮ ||

అయోధ్యాం న ప్రవేక్ష్యామి ప్రవేక్ష్యామి తపోవనమ్ |
తయోర్విలపితం శ్రుత్వా వ్యసనం చాన్వవేక్ష్య తత్ || ౧౯ ||

భృశమార్తతరా భూయః సర్వ ఏవానుగామినః |
తతః విషణ్ణౌ శ్రాంతౌ చ శత్రుఘ్నభరతావుభౌ || ౨౦ || [విశ్రాంతౌ]

ధరణ్యాం సంవ్యచేష్టేతాం భగ్నశృంగావివర్షభౌ |
తతః ప్రకృతిమాన్ వైద్యః పితురేషాం పురోహితః || ౨౧ ||

వసిష్ఠో భరతం వాక్యముత్థాప్య తమువాచ హ |
త్రయోదశోఽయం దివసః పితుర్వృత్తస్య తే విభో || ౨౨ ||

సావశేషాస్థినిచయే కిమిహ త్వం విలంబసే |
త్రీణి ద్వంద్వాని భూతేషు ప్రవృత్తాన్యవిశేషతః || ౨౩ ||

తేషు చాపరిహార్యేషు నైవం భవితుమర్హతి |
సుమంత్రశ్చాపి శత్రుఘ్నముత్థాప్యాభిప్రసాద్య చ || ౨౪ ||

శ్రావయామాస తత్త్వజ్ఞః సర్వభూతభవాభవౌ |
ఉత్థితౌ తౌ నరవ్యాఘ్రౌ ప్రకాశేతే యశస్వినౌ || ౨౫ ||

వర్షాతప పరిక్లిన్నౌ పృథగింద్రధ్వజావివ |
అశ్రూణి పరిమృద్నంతౌ రక్తాక్షౌ దీనభాషిణౌ |
అమాత్యాస్త్వరయంతి స్మ తనయౌ చాపరాః క్రియాః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తసప్తతితమః సర్గః || ౭౭ ||

Ayodhya Kanda Sarga 77 Meaning In Telugu

దశరథుడు మరణించిన పదవ రోజున శుద్ధిజరిగింది. పన్నెండవ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు, బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహన దానము, వస్త్రదానములు విరివిగా చేసాడు. పదమూడవ రోజున భరతుడు అస్థిసంచయనము కొరకు శ్మశానమునకు వెళ్లాడు. తండ్రిచితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు.

“తండ్రీ! నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్లిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా, కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వుకూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయావు.” అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు.

ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దు:ఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు.

“తండ్రీ! కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగి పోయావా! నీవు భరతుని ఎంతో గారాబం చేసావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. ఓదార్చవా! మాకు కావలసిన వస్త్రములు, భోజనపదార్థములు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చే వాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చి ఇస్తారు. ధర్మాత్ముడవు అయిన నీవు పోగానే ఈ భూమి బ్రద్దలు కావాల్సింది. కాని ఎందుకో అలా జరగలేదు. తండ్రీ! మీరు వెళ్లిపోయారు. రాముడు అరణ్యములకు వెళ్లాడు. ఇంక నేను ఎవరిని చూచుకొని బతకాలి. నేనుకూడా అగ్నిప్రవేశము చేస్తాను. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాను. అంతేకానీ అయోధ్యలో అడుగుపెట్టను.” అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు.

ఆ అన్నదమ్ముల శోకమును చూచి అక్కడ ఉన్నవారికి కూడా దు:ఖము ఆగలేదు. అప్పుడు వసిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “భరతా! నీ తండ్రి మరణించి నేటికి పదమూడవ దినము. నీవు అస్థి సంచయనము చేయవలెను. ఇంకనూ నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు మూడు అవస్థలు తప్పవు. అవే ఆకలి దప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు. ధనికుడైనా,

పేదవాడైనా, మహారాజైనా కటిక దరిద్రుడైనా ఇవి అనుభవించ వలసినదే. కాబట్టి నీ తండ్రి మరణము గురించి చింతించడం అవివేకము.” అని అన్నాడు. సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పుమాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకమును విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమమును నిర్వర్తించారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

అయోధ్యాకాండ అష్టసప్తతితమః సర్గః (78) >>

Aranya Kanda Sarga 12 In Telugu – అరణ్యకాండ ద్వాదశః సర్గః

Aranya Kanda Sarga 12 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాదశః సర్గలో, రాముడు, లక్ష్మణుడు, సీత అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అగస్త్య మహర్షి కూడా చాలా కాలం పాటు రాముడిని స్వీకరించడానికి వేచి ఉన్నాడు మరియు ఇప్పుడు వారిని అన్ని గౌరవాలతో స్వీకరిస్తాడు, రాముడిని విష్ణువు అవతారంగా గ్రహించాడు. అగస్త్య మహర్షి విష్ణువు యొక్క దివ్యమైన ధనుస్సును, ఎప్పుడూ బాణాలతో నిండిన రెండు వణుకులను మరియు బంగారు తొడుగులో బంగారు ఖడ్గాన్ని రాముడికి ఇస్తాడు, అదే ఆయుధాలతో విష్ణువు ఒకప్పుడు భూమిపై చెడును నిర్మూలించాడని చెప్పాడు.

అగస్త్యదర్శనమ్

స ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః |
అగస్త్యశిష్యమాసాద్య వాక్యమేతదువాచ హ ||

1

రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలీ |
రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా ||

2

లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వవరజో హితః |
అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః ||

3

తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ |
ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతామ్ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః |
తథేత్యుక్త్వాఽగ్నిశరణం ప్రవివేశ నివేదితుమ్ ||

5

స ప్రవిశ్య మునిశ్రేష్ఠం తపసా దుష్ప్రధర్షణమ్ |
కృతాంజలిరువాచేదం రామాగమనమంజసా ||

6

యథోక్తం లక్ష్మణేనైవ శిష్యోఽగస్త్యస్య సమ్మతః |
పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవ చ ||

7

ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా |
ద్రష్టుం భవంతమాయాతౌ శుశ్రూషార్థమరిందమౌ ||

8

యదత్రానంతరం తత్త్వమాజ్ఞాపయితుమర్హసి |
తతః శిష్యాదుపశ్రుత్య ప్రాప్తం రామం సలక్ష్మణమ్ ||

9

వైదేహీం చ మహాభాగామిదం వచనమబ్రవీత్ |
దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః ||

10

మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి |
గమ్యతాం సత్కృతో రామః సభార్యః సహలక్ష్మణః ||

11

ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశితః |
ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మనా ||

12

అభివాద్యాబ్రవీచ్ఛిష్యస్తథేతి నియతాంజలిః |
తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ ||

13

క్వాసౌ రామో మునిం ద్రష్టుమేతు ప్రవిశతు స్వయమ్ |
తతో గత్వాఽఽశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణః ||

14

దర్శయామాస కాకుత్స్థం సీతాం చ జనకాత్మజామ్ |
తం శిష్యః ప్రశ్రితో వాక్యమగస్త్యవచనం బ్రువన్ ||

15

ప్రావేశయద్యథాన్యాయం సత్కారార్హం సుసత్కృతమ్ |
ప్రవివేశ తతో రామః సీతయా సహ లక్ష్మణః ||

16

ప్రశాంతహరిణాకీర్ణమాశ్రమం హ్యవలోకయన్ |
స తత్ర బ్రహ్మణః స్థానమగ్నేః స్థానం తథైవ చ ||

17

విష్ణోః స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః |
సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ||

18

ధాతుర్విధాతుః స్థానే చ వాయోః స్థానం తథైవ చ |
నాగరాజస్య చ స్థానమనంతస్య మహాత్మనః ||

19

స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానమేవ చ |
స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః ||

20

కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి |
తతః శిష్యైః పరివృతో మునిరప్యభినిష్పతత్ ||

21

తం దదర్శాగ్రతో రామో మునీనాం దీప్తతేజసామ్ |
అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ ||

22

ఏష లక్ష్మణ నిష్క్రామత్యగస్త్యో భగవానృషిః |
ఔదార్యేణావగచ్ఛామి నిధానం తపసామిమమ్ ||

23

ఏవముక్త్వా మహాబాహురగస్త్యం సూర్యవర్చసమ్ |
జగ్రాహ పరమప్రీతస్తస్య పాదౌ పరంతపః ||

24

అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః సలక్ష్మణః ||

25

ప్రతిజగ్రాహ కాకుత్స్థమర్చయిత్వాసనోదకైః |
కుశలప్రశ్నముక్త్వా చ హ్యాస్యతామితి చాబ్రవీత్ ||

26

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథీన్ప్రతిపూజ్య చ |
వానప్రస్థేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ ||

27

ప్రథమం చోపవిశ్యాథ ధర్మజ్ఞో మునిపుంగవః |
ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదమ్ ||

28

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథిం ప్రతిపూజయేత్ |
అన్యథా ఖలు కాకుత్స్థ తపస్వీ సముదాచరన్ ||

29

దుఃసాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్ |
రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః ||

30

పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ప్రాప్తః ప్రియాతిథిః |
ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైరన్యైశ్చ రాఘవమ్ ||

31

పూజయిత్వా యథాకామం పునరేవ తతోఽబ్రవీత్ |
ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్నవిభూషితమ్ ||

32

వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణా |
అమోఘః సూర్యసంకాశో బ్రహ్మదత్తః శరోత్తమః ||

33

దత్తౌ మమ మహేంద్రేణ తూణీ చాక్షయసాయకౌ |
సంపూర్ణౌ నిశితైర్బాణైర్జ్వలద్భిరివ పావకైః ||

34

మహారజత కోశోఽయమసిర్హేమవిభూషితః |
అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ||

35

ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసామ్ |
తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద ||

36

జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా |
ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధమ్ |
దత్త్వా రామాయ భగవానగస్త్యః పునరబ్రవీత్ ||

37

Aranya Kanda Sarga 12 Meaning In Telugu PDF

రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి” అని అన్నాడు.

ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి “మీరు ఎవరు?” అని అడిగాడు.

“నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించు చున్నాము. ” అని అన్నాడు.

“మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను.” అని లోపలకు వెళ్లాడు.

అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు.

“ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా. రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా. వెంటనే నావద్దకు తీసుకొని రావలదా! ” అని శిష్యునితో అన్నాడు.

వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి “రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును.” అని అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి, సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకొని వెళ్లాడు.

రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! అటు చూడు! అగ్ని వలె వెలుగుతున్న అగస్త్యమహర్షి మనకోసం వస్తున్నాడు.” అని అన్నాడు.

రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేసారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని, అతిథిపూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! ముందుగా అగ్నిహోత్రము చేసి, అతిధులను పూజించి, తరువాత భోజనము చేయవలెను. అలాచేయని వాడు నరకానికి పోతాడు.

రామా! నీవు క్షత్రియుడవు. అయోధ్యకు రాజువు. ధర్మము తెలిసినవాడవు. అందరి చేతా గౌరవింప తగినవాడవు. అలాంటి నీవు ఈ రోజు మాకు అతిథిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది.

రామా! నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూణీరము. ఈ తూణీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు.

ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు. ఈ ఆయుధములను నీవు స్వీకరించు. నీకు జయం కలుగుతుంది.” అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను, ఖడ్గమును రామునికి ఇచ్చాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయోదశః సర్గః (13) >>

Sri Ramadasu Keerthanalu 41-50 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 41-50

Sri Ramadasu Keerthanalu 41-50 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

41. నాదనామక్రియ ఏకతాళం

పల్లవి : తానీషా : ఏ దేశమున నుండువారు మీరలెందుండి యిట వచ్చినారు
రామ : తొలుత గోదావరియందు మా స్థలమది భద్రాచలమందు
తానీషా : ఎవరి జవానులు మీరు మిమ్మెవరు బంపక వచ్చినారు
రామ :దాసజవానులు మేము రామదాసు పంపగ వచ్చినాము
తానీషా : ఏ కులమువారు మీరు మీరిద్దరు నే వరుసవారు
రామ : ఇనవంశమున బుట్టినాము మేమిద్దర మన్నదమ్ములము
తానీషా : ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు
రామ : రామోజీ లక్ష్మోజినామం వహ్వా రామానుజ మతమువారం
తానీషా : ఎన్నిదినములనుండి మీరు వారిసన్నిధి కొలువై యున్నారు
రామ : తాతముత్తాతలు మేము మూడుతరములనుండి యున్నాము
తానీషా : ఏమి జీతమిచ్చెదరు మీకు ఏమి జీవనమిచ్చెదరు
రామ : సమ్మతిలేని జీతము ప్రసాదమునకే కుదిరినాము
తానీషా : ఎందుకు పంపించినారు మీరేమి పనిగ వచ్చినారు.
రామ : సర్కార్బాకీ పైకము మాచేత బంపగ వచ్చినాము
తానీషా : అర్థమంతయు దెచ్చినారా లేక వ్యర్థముగ వచ్చినారా
రామ : వ్యర్థులముగ మేము రాము మీయర్థమంత దెచ్చినాము
తానీషా : బైఠోజి బైరోజి మీ మాటలు చూడగ వేరు
రామ : బైఠోజి వారముగాము మీ భేటికి వచ్చినాము
తానీషా : లక్షలారును దెచ్చినారా యింకా శిక్షలో నుండమన్నారా
రామ : లక్షలారునియ్యగలము మూడు లక్షలు మేమియ్యగలము
తానీషా : పంపిన పైకము తెండి యాపయిన తమాషా చూడండి
రామ : పదివేలు తెచ్చినామండి యాపయిన మాచేత లేదండి
తానీషా : మగురూర్మాటలు మీతో మాతో మరలించుచున్నారు.
రామ : మగురూరి వారితో మేము మాట్లాడువారము కాము
తానీషా : ధనము మాచేతికియ్యండి యావెనుక ఖైదులోకి పొండి
రామ : ఖైదులోకి మేము పోము మీ ఖజాన పైకమిచ్చేము
తానీషా : చెల్లింతురా ద్రవ్యమంత రసీదు నడుగుట కడువింత
రామ : ఉంగరంబులీడెమందు నుప్పొంగుచు తొడదట్టెయందు
తానీషా : మొహరువేసినంతను మోహనాంగుడు సంతసమునను

42. మధ్యమావతి చాపుతాళం

పల్లవి : ఏదేశము మీది యెవ్వరు బంపిరి యెందుకై వచ్చితిరి
భేదమొందక యతి భీతి నొందక మాకు
ఖ్యాతిగ జెప్పిన గాచేము మిమ్మిపుడు
అజునికైన నలవికాదిచటికి రాగ అర్థరాత్రియందున
గజ సింహములనైన ఖండించు భటులెంతో
కావలియుండగ గడిచివచ్చితి రెట్లు
అర్థమంతయు జూడ నాశ్చర్యమాయేను
అటు భారమెటు దెస్తిరి
భద్రేభములకైన బరువైతోచు నీ యర్థము
మీరెచట నార్జించి తొ చ్చితిరి

॥ఏదేశము॥

మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నివారనితోచెను
ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు

॥ఏదేశము॥

అంతదనుక ఖైదులోనుండు డనెనపుడు

||ఏదేశము ||

43. ఆనందభైరవి ఆదితాళం

పల్లవి : ఏమిటిది దయరాదు శ్రీరాములు
నన్ను నేమిటికి రక్షింప శ్రీ రాములు
పరులను వేడబోను శ్రీరాములు
నీకే కరములు చాచి యున్నాను శ్రీరాములు
పండ్రెండేండ్లాయె నేమి శ్రీరాములు
బందిఖానాలో నేనుండినాను శ్రీరాములు

||ఏమిటిది||

అర్థము తెమ్మనుచునన్ను శ్రీరాములు
ఇప్పుడరికట్టనెంచినారు శ్రీరాములు

||ఏమిటిది||

తానీషాగారి జవానులు నన్ను
తహసీలు చేయుచున్నారు శ్రీరాములు

||ఏమిటిది||

ముచ్చటైన యాడతేన శ్రీరాములు
నీవు యిచ్చే యర్థము లియ్యనేడు శ్రీరాములు

||ఏమిటిది||

నీచేగాకున్న నింకను శ్రీరాములు
మాతల్లి సీతమ్మలేదా శ్రీరాములు

||ఏమిటిది||

మాతల్లి సీతమ్మకైన శ్రీరాములు
నేను మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు

||ఏమిటిది||

ఆశించియుండిన దాసుని శ్రీరాములు
నీకు పోషి భారము లేదా శ్రీరాములు

||ఏమిటిది॥

నిన్ను నమ్మినానయ్య శ్రీరాములు
నేను గట్టిగా నా మదిలో శ్రీరాములు

॥ఏమిటిది ||

ఇల్లు వదలిటురావదేమి శ్రీరాములు
మీకు విడిది భద్రాచలమాయెనో శ్రీరాములు

॥ఏమిటిది ||

వాసిగభద్రాద్రి వెలిసిన శ్రీరాములు
రామదాసుని రక్షింపరాదా శ్రీరాములు

॥ఏమిటిది ||

44. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : ఏమిరా రామా నావల్ల నేరమేమిరా రామ
ఏమి రామ యీలాగుకష్టము నీ మహిమో నా ప్రారబ్ధమో
కుండలి శయనా వేదండరక్ష కాఖండతేజ నాయండ నుండవే

||ఏమిరా||

పంకజలోచన శంకరసుత సంకటములు మాన్పవే పొంకముతోను

||ఏమిరా||

సుందరధర నీ సుందర పదములు ఇందిరేశ కనుగొందుచూపవే

||ఏమిరా||

దినమొక యేడుగ ఘనమున గడిపెద తనయుని మీదను దయలేదయ్యయ్యో

||ఏమిరా||

సదయాహృదయ నీ మృదుపదములు నా హృదయ కమలమున వదలక నిల్పెద
రామరామ భద్రాచల సీతారామదాసుని ప్రేమతో నేలవే

||ఏమిరా॥

45. బేగడ ఏకతాళం

పల్లవి : ఎలాగు తాళుదు నేమి సేతు రామా
ఈ జాలిచేతను తాళజాలను రామా
దీనజనుల కెల్ల దిక్కు నీవే రామా
మనమున నిన్ను నేమరవనో రామా

||ఏలాగు||

పావనమూర్తి యో పట్టాభి రామా
కావవే యీవేళ కౌశల్య రామా

||ఏలాగు||

శరణుని నీ మరుగు జేరితి రామా
శరణంటే కాచేది బిరుదు రఘురామా

||ఏలాగు||

చెప్పరాని ప్రేమ నెంచు దాతుర రామా
ఆపన్న రక్షకుడ నాపాలి శ్రీరామా

||ఏలాగు||

నీ సొమ్మునే నటుల నిజమాయె రామా
నా దోషములనన్ని దొలగింపవె రామా

||ఏలాగు||

రాతికైన చెమట రంజిల్లునో రామా
ఆతీరు నీ మనసు నొందుదు శ్రీరామా

||ఏలాగు||

యమబాధ నొందగ నేరనో రామా
యమదండనలు లేక యెడబాపు రామా

||ఏలాగు||

వాసిగ రామకీర్తనలు జేసితి రామా
రామదాసునిమీద దయయుంచు శ్రీరామా

||ఏలాగు||

46. మధ్యమావతి ఆదితాళం

పల్లవి : ఓరఘు నీవాయని నే బిలిచిన
నోహో యనరాదా
సారెకు మరి వేసారి యన్యము
చేరదు నామది యేరా ధీరా
నీటజిక్కి కరి మాటికి వేసరి
నాకట ధర నీపాటల బాడగ
మేటి మకరి తలమీటి కాదు దయ
ఏనాటికి నాపై నేటికి రాదో

||ఓరగు||

మున్ను సభను నా పన్నత వేడుచు
మిమ్ము కృష్ణాయని యెన్నగ ద్రౌపది
కెన్నో వలువలిచ్చి మన్నన బ్రోచిన
వెన్నుడ నా మొర వింటివో లేదో

||ఓరగు||

బంటునైతినని యుంటే పరాకున
నుంటిని తెలిసి ముక్కంటి వినుత నా
జంట బాయకను వెంట రమ్మని వేడు
కొంటి భద్రగిరి రామదాస పోషక

||ఓరగు||

47. శంకరాభరణము రూపకతాళం

పల్లవి : కంటినేడు మా రాముల కనుగొంటి నేడు
కంటి నేడు భక్తగుణముల మాపాలి
మా జంటభద్రగిరి నంటియున్నవాని

॥కంటినేడు॥

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువు తీరిన మా కోదండరామ

॥కంటినేడు॥

కమలాప్త తిలకము ఘన నీల గాత్రము
కరుణారసము గురియు కందోయి గలవాని

॥కంటినేడు॥

హుకుమంజి ముత్యాలసరములు మెరయగ
మురిపెంపు చిరునవ్వు మోము గలిగినవాని

॥కంటినేడు॥

ఘల్లుఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయు
తళుకు బెళుకు పాదతలము గలిగినవాని

॥కంటినేడు॥

కరకు బంగారుచేల కాంతిజగము గొప్ప
శరచాపములు కేల ధరియించు స్వామి

॥కంటినేడు॥

ధరణి శ్రీరామదాసుని రక్షించు
పరమపురుషుడైన భద్రగిరీశుని

॥కంటినేడు॥

48. కాంభోజి ఏకతాళం

పల్లవి : కటకట నీదు సంకల్పమెట్టిదో గాని
నేనెంతవాడనురా రామా
నిటలాక్షుడు తొల్లి నీ మాయ గనలేక
తటుకుపడి నీవల దగిలెను గనుక

॥కటకట॥

శరణన్న మునులను బిరబిర బ్రోచెడు
బిరుదుగల్గిన దొరవే ఓ రామా
పరిపరి విధముల మొరలిడ వినక
నన్నరమర చేసిన హరి నిన్నే మందు

॥కటకట॥

భావ జనక నా భావ మెరుగవే
వేగమున రాగదే దేవా
దేవాదిదేవా దీనశరణ్య
నీవే దిక్కని నిక్కము నమ్మితి

॥కటకట॥

గీర్వాణసుత భద్రగిరివాసా
సర్వయోగీశ్వర రామా
సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయా
సర్వాధారా పరాకేల రామా

॥కటకట॥

49. సౌరాష్ట్ర ఆదితాళం

పల్లవి : కరుణించి దైవలరామ అహో
పరమపావననామ పట్టాభిరామా

||కరుణించి||

అన్న వస్త్రము లిత్తుమనుచు దొరలన్నారు మన్నించెదవనుచు
ఆయురన్నం ప్రయచ్ఛతి యనుచు మారకున్నను నీవే మాకున్నావనుచు

||కరుణించి||

మరియింత కాలమ్ముదనుకా మమ్ము మరచితివని ఒప్పుకొనర
మమ్ము దరిజేర్చినంతదనుకా మీది శరణాగత త్రాణ బిరుదటు కనుక

||కరుణించి||

నరులను గొలచుటకన్నా భద్రగిరిరాఘవుని వేడుకొన్నా
ఇహపరము లిలగలవని విన్నా నేను దరహాసము నా రామదాస ప్రసన్నా

||కరుణించి||

50. కన్నడ ఆదితాళం

పల్లవి : కలనిజమాయె కలికిరో వినవే
కలనిజమాయెనే
చూపున బాలారే సొగసైన రౌతులే
రేపనరాదే యో రమామణి నమ్మలేదు

||కల||

నా మదిలో నిన్ను నరులని గాన లే
నీ మహిలో నేనెరుగనివారే

||కల||

పురుషులు చూడగ పురాణపురుషులే
మర్యాదలేదే మహానుభావులే

||కల||

దాస జవానులే జాతి కబీరులే
వాసవిసుతులే వారిజనేత్రులే

||కల||

భద్రాద్రి వాసులే భవ్య యశోద్భష్ణాలే
భద్రాద్రి రామదాసపాలిట చిద్విరాసులే

||కల||

మరిన్ని కీర్తనలు:

Aranya Kanda Sarga 4 In Telugu – అరణ్యకాండ చతుర్థః సర్గః

Aranya Kanda Sarga 4 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుర్థ సర్గం రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తారు. ఈ క్రమంలో, శూర్పణఖ రాముణ్ని చూసి, అతనిపై మోహించి, ప్రేమను ప్రదర్శిస్తుంది. అయితే, రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేస్తుంది.

విరాధనిఖననమ్

హ్రియమాణౌ తు తౌ దృష్ట్వా వైదేహీ రామలక్ష్మణౌ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ ప్రగృహ్య సుభుజా భుజౌ ||

1

ఏష దాశరథీ రామః సత్యవాన్ శీలవాన్ శుచిః |
రక్షసా రౌద్రరూపేణ హ్రియతే సహలక్ష్మణః ||

2

మాం వృకా భక్షయిష్యంతి శార్దూలా ద్వీపినస్తథా |
మాం హరోత్సృజ్య కాకుత్స్థౌ నమస్తే రాక్షసోత్తమ ||

3

తస్యాస్తద్వచనం శ్రుత్వా వైదేహ్యా రామలక్ష్మణౌ |
వేగం ప్రచక్రతుర్వీరౌ వధే తస్య దురాత్మనః ||

4

తస్య రోద్రస్య సౌమిత్రిర్బాహుం సవ్యం బభంజ హ |
రామస్తు దక్షిణం బాహుం తరసా తస్య రక్షసః ||

5

స భగ్నబాహుః సంవిగ్నో నిపపాతాశు రాక్షసః |
ధరణ్యాం మేఘసంకాశో వజ్రభిన్న ఇవాచలః ||

6

ముష్టిభిర్జానుభిః పద్భిః సూదయంతౌ తు రాక్షసమ్ |
ఉద్యమ్యోద్యమ్య చాప్యేనం స్థండిలే నిష్పిపేషతుః ||

7

స విద్ధో బహుభిర్బాణైః ఖడ్గాభ్యాం చ పరిక్షతః |
నిష్పిష్టో బహుధా భూమౌ న మమార స రాక్షసః ||

8

తం ప్రేక్ష్య రామః సుభృశమవధ్యమచలోపమమ్ |
భయేష్వభయదః శ్రీమానిదం వచనమబ్రవీత్ ||

9

తపసా పురుషవ్యాఘ్ర రాక్షసోఽయం న శక్యతే |
శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే ||

10

తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం రాక్షసః ప్రశ్రితం వచః |
ఇదం ప్రోవాచ కాకుత్స్థం విరాధః పురుషర్షభమ్ ||

11

హతోఽహం పురుషవ్యాఘ్ర శక్రతుల్యబలేన వై |
మయా తు పూర్వం త్వం మోహన్న జ్ఞాతః పురుషర్షభః ||

12

కౌసల్యా సుప్రజా తాత రామస్త్వం విదితో మయా | [రామ తాత]
వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః ||

13

అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుమ్ |
తుంబురుర్నామ గంధర్వః శప్తో వైశ్రవణేన హ ||

14

ప్రసాద్యమానశ్చ మయా సోఽబ్రవీన్మాం మహాయశాః |
యదా దాశరథీ రామస్త్వాం వధిష్యతి సంయుగే ||

15

తదా ప్రకృతిమాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి |
ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురాఽనఘ ||

16

అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహార హ |
తవ ప్రసాదాన్ముక్తోఽహమభిశాపాత్సుదారుణాత్ ||

17

భువనం స్వం గమిష్యామి స్వస్తి వోఽస్తు పరంతప |
ఇతో వసతి ధర్మాత్మా శరభంగః ప్రతాపవాన్ ||

18

అధ్యర్ధయోజనే తాత మహర్షిః సూర్యసన్నిభః |
తం క్షిప్రమభిగచ్ఛ త్వం స తే శ్రేయో విధాస్యతి ||

19

అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ |
రక్షసాం గతసత్త్వానామేష ధర్మః సనాతనః ||

20

అవటే యే నిధీయంతే తేషాం లోకాః సనాతనాః |
ఏవముక్త్వా తు కాకుత్స్థం విరాధః శరపీడితః ||

21

బభూవ స్వర్గసంప్రాప్తో న్యస్తదేహో మహాబలః |
తచ్ఛ్రుత్వా రాఘవో వాక్యం లక్ష్మణం వ్యాదిదేశ హ ||

22

కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్యాస్య లక్ష్మణ |
వనేఽస్మిన్ సుమహచ్ఛ్వభ్రం ఖన్యతాం రౌద్రకర్మణః ||

23

ఇత్యుక్త్వా లక్ష్మణం రామః ప్రదరః ఖన్యతామితి |
తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్ ||

24

తతః ఖనిత్రమాదాయ లక్ష్మణః శ్వభ్రముత్తమమ్ |
అఖనత్పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః ||

25

తం ముక్తకంఠం నిష్పిష్య శంకుకర్ణం మహాస్వనమ్ |
విరాధం ప్రాక్షిపచ్ఛ్వభ్రే నదంతం భైరవస్వనమ్ ||

26

తమాహవే నిర్జితమాశువిక్రమౌ
స్థిరావుభౌ సంయతి రామలక్ష్మణౌ |
మదాన్వితౌ చిక్షిపతుర్భయావహం
నదంతముత్క్షిప్య బిలే తు రాక్షసమ్ ||

27

అవధ్యతాం ప్రేక్ష్య మహాసురస్య తౌ
శితేన శస్త్రేణ తదా నరర్షభౌ |
సమర్థ్య చాత్యర్థవిశారదావుభౌ
బిలే విరాధస్య వధం ప్రచక్రతుః ||

28

స్వయం విరాధేన హి మృత్యురాత్మనః
ప్రసహ్య రామేణ వధార్థమీప్సితః |
నివేదితః కాననచారిణా స్వయం
న మే వధః శస్త్రకృతో భవేదితి ||

29

తదేవ రామేణ నిశమ్య భాషితం
కృతా మతిస్తస్య బిలప్రవేశనే |
బిలం చ రామేణ బలేన రక్షసా
ప్రవేశ్యమానేన వనం వినాదితమ్ ||

30

ప్రహృష్టరూపావివ రామలక్ష్మణౌ
విరాధముర్వ్యాం ప్రదరే నిఖాయ తమ్ | [నిహత్య తౌ]
ననందతుర్వీతభయౌ మహావనే
శిలాభిరంతర్దధతుశ్చ రాక్షసమ్ ||

31

తతస్తు తౌ కార్ముకఖడ్గధారిణౌ
నిహత్య రక్షః పరిగృహ్య మైథిలీమ్ |
విజహ్నతుస్తౌ ముదితౌ మహావనే
దివి స్థితౌ చంద్రదివాకరావివ ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థః సర్గః ||

Aranya Kanda Sarga 4 Meaning In Telugu

ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది.

“ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది.

ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు.

కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు.

“లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చి పెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు.” అని అన్నాడు. గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు.

అప్పుడే మూర్ఛనుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! నువ్వు ఎవరో గుర్తించాను. నీభార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహా పరాక్రమ వంతులు. మీచేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు. ఇంక నా గురించి చెబుతాను.

నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒక సారి నేను రంభయొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. “దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది” అని కుబేరుడు నాకు శాపవిమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శనభాగ్యము కలిగింది. నాకు శాపవిమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్లిపోతాను. నాకు అనుజ్ఞు ఇవ్వండి.” అని ప్రార్థించాడు.

రామ లక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్లండి మీకుశుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతి పెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.” అని అన్నాడు.

తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీసాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీసాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్ద గా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోసాడు.

ఆ ప్రకారంగా రామలక్ష్మణులు, ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని, గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావ వలెనని కోరిక కల విరాధుడు, తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండ రాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు.

(విరాధుని కధ మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదూ! పైన చెప్పిన విధంగా గోరఖపూర్ ప్రతిలో ఉంది. రాముడు మహా బలవంతుడు. అస్త్రశస్త్ర సంపన్నుడు. అటువంటి రాముడు విరాధుడు సీతను ఎత్తుకొని పోగానే ఏడుస్తాడు. అదీ సీతను విరాధుడు ఎత్తుకొని పోయినందుకు కాదు. తమకు కలిగిన కష్టములను చూచి కైక కళ్లు చల్లబడ్డాయి కదా అని ఏడుస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని పరాక్రమమును గుర్తుచేస్తాడు. అయినా రాముడు ఏమీ చేయడు.

తరువాత విరాధుడు రామ లక్ష్మణులను బుజాల మీద ఎత్తుకొని పోతుంటే, “ఎటూ మనం అటే వెళతాము కదా కాస్త దూరం కలిసి వచ్చిందిలే” అని అనుకుంటాడు రాముడు. అంతేగానీ సీత ఒంటరిగా ఉంది, ఆమెకు ఏమన్నా ఆపద కలుగుతుంది అని గుర్తుకు రాదు. సీత కూడా “రామా నన్ను రక్షించు” అని ఏడవదు. విరాధునితో “నన్ను ఇక్కడ క్రూరమృగాలు తింటాయి. కావాలంటే నన్నుఎత్తుకొని పో, రామలక్ష్మణులను వదిలిపెట్టు” అని అరుస్తుంది. అప్పుడు రామునికి సీత ఒంటరిగా ఉంది అని గుర్తుకు వస్తుంది.

తాము విరాధుని చంపాలి అని అనుకుంటాడు. తరువాత విరాధుడు కూడా తనశాపవృత్తాంతము చెబుతాడు. తన శరీరాన్ని గోతిలో పెట్టి పాతిపెట్టమని కోరతాడు. తరువాత ప్రాణాలు విడుస్తాడు. రాముడు విరాధుని గొంతు మీద కాలు తీయగానే పెద్దగా అరుస్తాడు. అలా అరుస్తూ గిలా గిలా కొట్టుకుంటున్న విరాధుని రామలక్ష్మణులు గోతిలోకి తోసి కప్పెడతారు. వాడు లేవకుండా బండరాళ్లు పెడతారు. విరాధుడు ఇలాగే చస్తాడు అని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా!

కాని రామాయణం ప్రాచ్య ప్రతిలో కధ వేరుగా ఉంది. విరాధుడు సీతను లాక్కుని తన తొడమీద కూర్చోపెట్టుకోగానే సీతకు కలిగిన దుస్థితికి రాముడికి దుఃఖము కలుగుతుంది. లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి విరాధుని మీద ఏడు బాణాలు ప్రయోగిస్తాడు. విరాధుడు లక్ష్మణుని మీద శూలం విసురుతాడు. రాముడు దానిని రెండు ముక్కలుగా విరిచేస్తాడు. మరొక బాణంతో రాముడు విరాధుని వక్షస్థలం చీలేట్టు కొడతాడు. విరాధుడు కిందపడతాడు. కాని చావడు.

రామునికి తనశాప వృత్తాంతము చెబుతాడు. రామునికి కోపం తెప్పించడానికే, రాముని చేతిలో మరణించి శాపవిముక్తి పొందడానికే సీతను లాక్కున్నాను అని చెబుతాడు. తరువాత రాక్షసుల ఆచారం కార తన శరీరాన్ని గోతిలో కప్పెట్టమంటాడు. తరువాత శరభంగ ముని గురించి చెప్పి, తన నిజ స్వరూపంతో గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఈకథ సందర్భోచితంగా ఉంది. కాబట్టి మనము దీనినే అనుసరిద్దాము. పైవిషయములను నేను ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్రీమద్రామాయణము అరణ్యకాండ నుండి గ్రహించాను. వారికి నా పాదాభివందనములు. కృతజ్ఞతలు.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ పంచమః సర్గః (5) >>

Sri Ramadasu Keerthanalu 1-10 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు -Sri Ramadasu Keerthanalu కీర్తన:1-10

Sri Ramadasu Keerthanalu 1-10 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

1. వరాళిరాగం ఆదితాళం

పల్లవి : అంతా రామమయం యీ జగమంతా రామమయం
అంతరంగమున నాత్మారాముం డనంత రూపమున వింతలు సలుపగ

||అంతా॥

సౌమసూర్యులను సురలుదారలను
ఆ మహాంబుధులు నఖిల జగంబులు
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు

||అంతా||

నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు

||అంతా||

అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులు నరిషడ్వర్గములు

||అంతా||

ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము

||అంతా||

2. అసావేరి ఆదితాళం

పల్లవి : అబ్బ బ్బ దెబ్బలకు తాళలేనురా
రామప్ప గొబ్బున నన్నేలు కోరా

||అబ్బబ్బ||

మేలు చేయుదునంటి గదరా
వరహాలు మొహరీలు జమచేస్తిగదరా
నీ పరిచారులకు నే పెట్టితి గదరా

||అబ్బబ్బ||

పరులకొక్కరువ్వ యీయలేదు గదరా
ఓ పరమాత్మ నీ పాదముల్ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా
హరసుత గోవిందం హరితాళలేనురా

||అబ్బబ్బ||

అంతటిలో నిను నెరనమ్మినానురా
శరణాగత గోవిందలహరి తాళలేనురా
శరధి బంధించిన శౌర్యమెక్కడరా
రాక్షస సంహార రక్షింపరారా

||అబ్బబ్బ||

రామ భద్రాద్రిరామ సీతారామా
నీ నామమెప్పుడు భజయించితి గదురా
రామదాసుని నిటుల చేయించి తేరా

||అబ్బబ్బ||

3. వరాళి ఏకతాళం

పల్లవి : ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతాముదిత లక్ష్మణులు
కలసి కొలువగా రఘుపతి యుండెడి
చరణములు
చారుస్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి

||ఇదిగో||

అనుపమానమై అతిసుందరమై
దనరుచక్రము ధగధగ మెరిసెడి

||ఇదిగో||

కలియుగమందున నిలవైకుంఠము
నలరుచున్నది నయముగ మ్రొక్కుడి

||ఇదిగో||

పొన్నల పొగడల పూపొదరిండ్లను
చెన్ను మీగడను శృంగారంబడు

||ఇదిగో||

శ్రీకరముగ రామదాసునును
ప్రాకటముగ బ్రోచె ప్రభువాసము

||ఇదిగో||

4. కాంభోజి ఆదితాళం

పల్లవి : ఇక్ష్వాకుల తిలక ఇకనైన బలుకవు రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా

॥ఇక్ష్వాకు॥

చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర
యాప్రాకారములకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ జూడక యిత్తరి బ్రోవుము రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
యాపతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలత్రాడు రామచంద్ర
ఆ మొలత్రాటికిబట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
యా పతకముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
యా పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్ర
జగన్మోహన సంకెళ్లు వేసిరి కాళ్లకు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

కలికి తురాయి నీకు మెరుపుగ జేయిస్తే రామచంద్ర
నీవు కులుకుచు దిరిగెదవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

మీ తండ్రి దశరధమహారాజు పెట్టెనా రామచంద్ర
లేక మీ మామ జనక మహారాజు పంపైనా రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

అబ్బ తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
యీ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

ఏటికి చల్లిన నీళ్లాయె నా బ్రతుకు రామచంద్ర
నేను అథమురాలికంటె నన్యాయమైతిని రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

సర్కారు పైకము తృణముగ నెంచక రామచంద్ర
దెబ్బలు తినలేను యప్పుదీర్చుమయ్య రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

కౌసల్య పుత్రుడ దశరథ తనయుడ రామచంద్ర
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్ర

॥ఇక్ష్వాకు॥

భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్ర
నీవు క్షేమముగ శ్రీరామదాసుని నేలుము రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

5. వరాళి ఆదితాళం

పల్లవి : ఏడనున్నాడో భద్రాద్రివాసు డేడ నున్నాడో
నాపాలి రాముడేడ నున్నాడో

||ఏడ||

ఏడనున్నాడో గాని జాడ తెలియలేదు
నాడు గజేంద్రుని కీడుబాపిన స్వామి

||ఏడ||

ద్రౌణీబాణ జ్వాలదాకిన బాలకునికి
ప్రాణమిచ్చిన జగత్రాణ రక్షకుడు

||ఏడ||

పాంచాలి సభలోన భంగమొందిననాడు
వంచనలేకను వలువలిచ్చిన తండ్రి

||ఏడ||

దుర్వాసు డుగ్రమున ధర్మసుతుని జూడ
నిర్వహించిన నవనీత చోరకుడు

||ఏడ||

అక్షయముగ శ్రీ భద్రాచలమందున
సాక్షాత్కరించిన జగదేకవీరుడు

||ఏడ||

6. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి :ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా

చరణములు :
శ్రీరఘునందన సీతారమణా శ్రితిజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా

॥ఏ తీరుగ॥

మురిపెముతో నా స్వామిని నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచ నేమరుగు జొచ్చితిని రామా

॥ఏ తీరుగ॥

క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవే దైవశిఖామణి రామా

॥ఏ తీరుగ॥

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబనీ యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా

॥ఏ తీరుగ॥

తాండవమున కఖిలాండకోటి బ్రహ్మాండనాయకా రామా
భండనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా

॥ఏ తీరుగు॥

వాసవకమలభవ సురవందిత వారధిబంధన రామా
సార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘురామా

॥ఏ తీరుగ॥

వాసవనుత రామదాస పోషకవందన మయోధ్యరామా
భాసురవద సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

॥ఏ తీరుగ॥

7. కల్యాణిరాగము రూపకతాళము

పల్లవి :ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ తెలియవశమా
కామారి వినుతగుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్న తండ్రి రామా
సుతుడనుచు కవులు క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు
మతి తెలియలేరైరి.

॥ఏమయ్య॥

చెలిమి కొడవనుచు పాండవులు నిజ
విరోధివటంచు నల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరి గాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి

॥ఏమయ్య॥

నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడవనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

॥ఏమయ్య॥

8. పున్నాగరావళి చాపుతాళం

పల్లవి : ఏల దయరాదో రామయ్య నీకేల దయరాదో
మీ మేలుకై పాటుబడితిని యేల మీ భండము చాలుచాలును

॥ఏల॥

చరణములు
బ్రహ్మ గూర్పగదే అహోవరబ్రహ్మకావగదే
బ్రహ్మజనక భవ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట

॥ఏల॥

పాపములచేత రామయ్య నేనోపలేను గదే
శ్రీభూపతి యే ప్రాపులేక నీ ప్రాపేగోరితి ఘోరరూపయిక

॥ఏల॥

తలపగడాల ఆనందభాష్పములూరెగదె
నీలినీరదనిభకోమలరూప భద్రశైలవాస రామదాసునేలగ

॥ఏల॥

9. నాదనామక్రియ ఏకతాళం

పల్లవి : కోదండరామ కోదండరామ కోదండరామ కోదండరామ
నీదండనాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు

॥కోదండ॥

శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరోగ్యమిమ్ము

॥కోదండ॥

జయరఘువీర జగదేకవీర భయనివార భక్తమందార

॥కోదండ॥

మణిమయభూష మంజులభాష రణజయ ఘోష రమణీయ వేష

॥కోదండ॥

ఏలరావయ్య యేమందునయ్య పాలింపవయ్య ప్రౌడిగనయ్య

॥కోదండ॥

తండ్రివి నీవే తల్లివి నీవే దాతవు నీవే దైవము నీవే

॥కోదండ॥

అద్భుత కుండలామలదండ సద్గుణదండ సమర ప్రచండ

॥కోదండ॥

సరసిజనేత్ర సౌందర్యగాత్ర పరమపవిత్ర భవ్యచరిత్ర

॥కోదండ॥

నీబుద్ధి వీడు ఎరుగనివాడు పాపడువీడు బడలియున్నాడు

॥కోదండ॥

పాపనులేపి ప్రజలనుగల్పి యాపదబాపి యటు ప్రీతిజూపి

॥కోదండ॥

నమ్మిన చిన్నవాడెందున నున్న మమ్ములగన్న మాయన్న వన్న

॥కోదండ॥

ఎవరు మీతోటి ఎవరు మీసాటిరారు మీపాటి రాజులమేటి

॥కోదండ॥

దశరథబాలదాసావన దశముఖకాల ధరణీశపాల

॥కోదండ॥

మారుతభీమ మాల్యాభిరామ కల్యాణనామ కారుణ్యధామ

॥కోదండ॥

మంజులభాష మణిమయభూష కుంజరపోష కువలయవేష

॥ కోదండ॥

పుట్టింప నీవే పోషింప నీవే కులమియ్య నీవే భాగ్యము నీవే

॥కోదండ॥

శరణన్న చోట క్షమచేయుమాట బిరుదునీదౌట నెరిగిన మాట

॥కోదండ॥

రామయ్యవీని రక్షింతుగాని సేవచేసేవాని సుతుడుగానీ

॥కోదండ॥

మురళీవిలోల మునిజనపాల తులసీవనమాల తుంబురలోల

॥ కోదండ॥

రావణభంగ రమణీయాంగ మందరోద్దార మౌక్తికహార

॥ కోదండ॥

వందనమయ్య వాదేలనయ్య దండనసేయ తగదు మీకయ్య

॥కోదండ||

లాలితహాసలక్ష్మివిలాస పాలితదాస భద్రిద్రివాస

॥ కోదండ॥

శ్రీవిజయరామ శ్రీతులసిరామ పావనరామ భద్రాద్రిరామ

॥ కోదండ॥

10. యమునా కల్యాణి ఆదితాళం

పల్లవి : గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమపురుష ఏ వెరవులేక నీ మరుగుజొచ్చితిని
అరమర సేయక

॥గరుడ॥

పిలువగానేరమ్మి అభయము తలపగానెయిమ్మి
కలిమిబలిమి నాకలలో నీవని పలవరించిన నన్ను గన్నయ్య

॥గరుడ॥

పాలకడలిశయనా దశరథబాల జలజనయనా
పాలముంచిన నీటముంచిన నీపాలబడితిని జాలము సేయక

॥గరుడ॥

ఏలరావు స్వామి నను నిపుడేలుకోవదేమి
ఏలువాడవని చాలనమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి

॥గరుడ॥

ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాళ
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతిపై రక్షింపుము

॥గరుడ॥

మరిన్ని కీర్తనలు:

Ayodhya Kanda Sarga 56 In Telugu | అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 56 In Telugu

అయోధ్యా కాండ సర్గ 56 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.

చిత్రకూటనివాసః

అథ రాత్ర్యాం వ్యతీతాయామవసుప్తమనంతరమ్ |
ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః ||

1

సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనమ్ |
సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప ||

2

స సుప్తః సమయే భ్రాత్రా లక్ష్మణః ప్రతిబోధితః |
జహౌ నిద్రాం చ తంద్రీం చ ప్రసక్తం చ పథిశ్రమమ్ ||

3

తతౌత్థాయ తే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలమ్ |
పంథానమృషిణాఽఽదిష్టం చిత్రకూటస్య తం యయుః ||

4

తతః సంప్రస్థితః కాలే రామః సౌమిత్రిణా సహ |
సీతాం కమల పత్రాక్షీమిదం వచనమబ్రవీత్ ||

5

ఆదీప్తానివ వైదేహి సర్వతః పుష్పితాన్నగాన్ |
స్వైః పుష్పైః కింశుకాన్ పశ్య మాలినః శిశిరాత్యయే ||

6

పశ్య భల్లాతకాన్ ఫుల్లాన్ నరైః అనుపసేవితాన్ |
ఫల పత్రైః అవనతాన్ నూనం శక్ష్యామి జీవితుమ్ ||

7

పశ్య ద్రోణప్రమాణాని లంబమానాని లక్ష్మణ |
మధూని మధుకారీభిః సంభృతాని నగే నగే ||

8

ఏష క్రోశతి నత్యూహస్తం శిఖీ ప్రతికూజతి |
రమణీయే వనోద్దేశే పుష్పసంస్తరసంకటే ||

9

మాతంగయూథానుసృతం పక్షి సంఘానునాదితమ్ |
చిత్రకూటమిమం పశ్య ప్రవృద్ధశిఖరం గిరిమ్ ||

10

సమభూమితలే రమ్యే ద్రుమైర్బహుభిరావృతే |
పుణ్యే రంస్యామహే తాత చిత్రకూటస్య కాననే ||

11

తతస్తౌ పాదచారేణ గచ్ఛంతౌ సహ సీతయా |
రమ్యమాసేదతుః శైలం చిత్రకూటం మనోరమమ్ ||

12

తం తు పర్వతమాసాద్య నానాపక్షిగణాయుతమ్ |
బహుమూలఫలం రమ్యం సంపన్నం సరసోదకమ్ ||

13

మనోజ్ఞోఽయం గిరిః సౌమ్య నానాద్రుమలతాయతః |
బహుమూలఫలో రమ్యః స్వాజీవః ప్రతిభాతి మే ||

14

మునయశ్చ మహాత్మానో వసంత్యస్మిన్ శిలోచ్చయే |
అయం వాసో భవేత్తావదత్ర సౌమ్య రమేమహి ||

15

ఇతి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలిః |
అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకి మభివాదయన్ ||

16

తాన్మహర్షిః ప్రముదితః పూజయామాస ధర్మవిత్ |
ఆస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్య చ ||

17

తతోఽబ్రవీన్మహాబాహుర్లకమణం లక్ష్మణాగ్రజః |
సంనివేద్య యథాన్యాయమాత్మానమృషయే ప్రభుః ||

18

లక్ష్మణానయ దారూణి దృఢాని చ వరాణి చ |
కురుష్వావసథం సౌమ్య వాసే మే అభిరతం మనః ||

19

తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిర్వివిధాన్ ద్రుమాన్ |
ఆజహార తతశ్చక్రే పర్ణశాలామరిందమః ||

20

తాం నిష్ఠితాం బద్ధకటాం దృష్ట్వా రమః సుదర్శనామ్ |
శుశ్రూషమాణమేకాగ్రమిదం వచనమబ్రవీత్ ||

21

ఐణేయం మాంసమాహృత్య శాలాం యక్ష్యామహే వయమ్ |
కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః ||

22

మృగం హత్వాఽఽనయ క్షిప్రం లక్ష్మణేహ శుభేక్షణ |
కర్తవ్యః శాస్త్రదృష్టో హి విధిర్ధర్మమనుస్మర ||

23

భ్రాతుర్వచన మాజ్ఞాయ లక్ష్మణః పరవీరహా |
చకార స యథోక్తం చ తం రామః పునరబ్రవీత్ ||

24

ఐణేయం శ్రపయస్వైతచ్ఛాలాం యక్ష్యమహే వయమ్ |
త్వరసౌమ్య ముహూర్తోఽయం ధ్రువశ్చ దివసోఽప్యయమ్ ||

25

స లక్ష్మణః కృష్ణమృగం హత్వా మేధ్యం ప్రతాపవాన్ |
అథ చిక్షేప సౌమిత్రిః సమిద్ధే జాతవేదసి ||

26

తం తు పక్వం సమాజ్ఞాయ నిష్టప్తం ఛిన్న శోణితమ్ |
లక్ష్మణః పురుషవ్యాఘ్రమథ రాఘవమబ్రవీత్ ||

27

అయం కృష్ణః సమాప్తాంగః శృతః కృష్ణమృగే యథా |
దేవతాం దేవసంకాశ యజస్వ కుశలో హ్యసి ||

28

రామః స్నాత్వా తు నియతః గుణవాన్ జప్యకోవిదః |
సంగ్రహేణాకరోత్సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్ ||

29

ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశావసథం శుచిః |
బభూవ చ మనోహ్లాదో రామస్యామితతేజసః ||

30

వైశ్వదేవబలిం కృత్వా రౌద్రం వైష్ణవమేవ చ |
వాస్తుసంశమనీయాని మంగళాని ప్రవర్తయన్ ||

31

జపం చ న్యాయతః కృత్వా స్నాత్వా నద్యాం యథావిధి |
పాప సంశమనం రామశ్చకార బలిముత్తమమ్ ||

32

వేదిస్థలవిధానాని చైత్యాన్యాయతనాని చ |
ఆశ్రమస్యానురూపాణి స్థాపయామాస రాఘవః ||

33

వన్యైర్మాల్యైః ఫలైర్మూలైః పక్వైర్మామ్సైర్యథావిధి |
అద్భిర్జపైశ్చ వేదోక్తైర్ధర్భైశ్చ ససమిత్కుశైః ||

34

తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా |
తదా వివిశతుః శాలాం సుశుభాం శుభలక్షణౌ ||

35

తాం వృక్షపర్ణచ్ఛదనాం మనోజ్ఞాం
యథా ప్రదేశం సుకృతాం నివాతామ్ |
వాసాయ సర్వే వివిశుః సమేతాః
సభాం యథా దేవగణాః సుధర్మామ్ ||

36

అనేకనానామృగపక్షిసంకులే
విచిత్రపుష్పస్తబకైర్ద్రుమైః యుతే |
వనోత్తమే వ్యాలమృగానునాదితే
తథా విజహ్రుః సుసుఖం జితేంద్రియాః ||

37

సురమ్యమాసాద్య తు చిత్రకూటం
నదీం చ తాం మాల్యవతీం సుతీర్థామ్ |
ననంద హృష్టః మృగ పక్షిజుష్టాం
జహౌ చ దుఃఖం పురవిప్రవాసాత్ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్పంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 56 Meaning In Telugu

మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు.

రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.

“లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు.

వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా!మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకొని వచ్చి కుటీరము నిర్మించు.” అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. “లక్ష్మణా! మనకు ఈ పర్ణశాలలో చాలాకాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి. వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము.

కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు.” అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొనివచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేసాడు. “రామా! లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీసిద్ధం చేసాను.ఇంక పూజకు ఉపక్రమించండి.” అని అన్నాడు లక్ష్మణుడు.

రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ,వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేసాడు. దేవతల నందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేసాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు.

లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసముసేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ, ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్ధములు సేకరిస్తూ, వాటిని తింటూ, ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తపంచాశః సర్గః (౫౭) >>

Ayodhya Kanda Sarga 82 In Telugu – అయోధ్యాకాండ ద్వ్యశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 82 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ 82వ సర్గ, “సేనాప్రస్థాపనమ్”, రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడిని తిరిగి తీసుకురావడానికి వనానికి సేనను ప్రస్థానిస్తాడు. భరతుడు తన సైన్యంతో సహా, రాముడు ఉంటున్న అరణ్యానికి బయలుదేరతాడు. ఈ సర్గ భరతుడి ధైర్యం, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమ, మరియు రాముడు తిరిగి రావాలని కోరుకునే భరతుడి పట్టుదలను స్పష్టంగా చూపిస్తుంది. సేనాప్రస్థాపన సందర్భంలో, భరతుడు తన సైన్యానికి మార్గదర్శకత్వం చేస్తూ, రాముడి సేవలో ఉండడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఈ సర్గ భరతుడి విధేయత, ధర్మపరాయణత, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

సేనాప్రస్థాపనమ్

తామార్యగణసంపూర్ణాం భరతః ప్రగ్రహాం సభామ్ |
దదర్శ బుద్ధి సంపన్నః పూర్ణచంద్రో నిశామివ ||

1

ఆసనాని యథాన్యాయమార్యాణాం విశతాం తదా |
వస్త్రాంగరాగప్రభయా ద్యోతితా సా సభోత్తమా ||

2

సా విద్వజ్జనసంపూర్ణా సభా సురుచిరా తదా |
అదృశ్యత ఘనాపాయే పూర్ణచంద్రేవ శర్వరీ ||

3

రాజ్ఞస్తు ప్రకృతీః సర్వాః సమగ్రాః ప్రేక్ష్య ధర్మవిత్ |
ఇదం పురోహితః వాక్యం భరతం మృదు చాబ్రవీత్ ||

4

తాత రాజా దశరథః స్వర్గతర్ధర్మమాచరన్ |
ధనధాన్యవతీం స్ఫీతాం ప్రదాయ పృథివీం తవ ||

5

రామస్తథా సత్యధృతిః సతాం ధర్మమనుస్మరన్ |
నాజహాత్పితురాదేశం శశీ జ్యోత్స్నామివోదితః ||

6

పిత్రా భ్రాత్రా చ తే దత్తం రాజ్యం నిహతకణ్టకమ్ |
తద్భుంక్ష్వ ముదితామాత్యః క్షిప్రమేవాభిషేచయ ||

7

ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః |
కోట్యాపరాంతాః సాముద్రా రత్నాన్యభిహరంతు తే ||

8

తచ్ఛ్రుత్వా భరతః వాక్యం శోకేనాభిపరిప్లుతః |
జగామ మనసా రామం ధర్మజ్ఞో ధర్మకాంక్షయా ||

9

స బాష్ప కలయా వాచా కలహంస స్వరః యువా |
విలలాప సభామధ్యే జగర్హే చ పురోహితమ్ ||

10

చరిత బ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమతః |
ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేత్ ||

11

కథం దశరథాజ్ఞాతః భవేద్రాజ్యాపహారకః |
రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తుమిహార్హసి ||

12

జ్యేష్ఠః శ్రేష్ఠశ్చ ధర్మాత్మా దిలీపనహుషోపమః |
లబ్ధుమర్హతి కాకుత్స్థో రాజ్యం దశరథో యథా ||

13

అనార్య జుష్టమస్వర్గ్యం కుర్యాం పాపమహం యది |
ఇక్ష్వాకూణామహం లోకే భవేయం కులపాంసనః ||

14

యద్ధి మాత్రా కృతం పాపం నాహం తదపిరోచయే |
ఇహస్థో వనదుర్గస్థం నమస్యామి కృతాంజలిః ||

15

రామమేవానుగచ్ఛామి స రాజా ద్విపదాం వరః |
త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవో ||

16

తద్వాక్యం ధర్మసంయుక్తం శ్రుత్వా సర్వే సభాసదః |
హర్షాన్ముముచురశ్రూణి రామే నిహితచేతసః ||

17

యది త్వార్యం న శక్ష్యామి వినివర్తయితుం వనాత్ |
వనే తత్రైవ వత్స్యామి యథాఽర్యో లక్ష్మణస్తథా ||

18

సర్వోపాయం తు వర్తిష్యే వినివర్తయితుం బలాత్ |
సమక్షమార్య మిశ్రాణాం సాధూనాం గుణవర్తినామ్ ||

19

విష్టికర్మాంతికాః సర్వే మార్గశోధకరక్షకాః |
ప్రస్థాపితా మయా పూర్వం యాత్రాఽపి మమ రోచతే ||

20

ఏవముక్త్వా తు ధర్మాత్మా భరతః భ్రాతృవత్సలః |
సమీపస్థమువాచేదం సుమంత్రం మంత్రకోవిదమ్ ||

21

తూర్ణముత్థాయ గచ్ఛ త్వం సుమంత్ర మమ శాసనాత్ |
యాత్రామాజ్ఞాపయ క్షిప్రం బలం చైవ సమానయ ||

22

ఏవముక్తః సుమంత్రస్తు భరతేన మహాత్మనా |
హృష్టస్తదాదిశత్సర్వం యథాసందిష్టమిష్టవత్ ||

23

తాః ప్రహృష్టాః ప్రకృతయో బలాధ్యక్షా బలస్య చ |
శ్రుత్వా యాత్రాం సమాజ్ఞప్తాం రాఘవస్య నివర్తనే ||

24

తతః యోధాంగనాః సర్వా భర్త్రూన్ సర్వాన్ గృహే గృహే |
యాత్రా గమనమాజ్ఞాయ త్వరయంతి స్మ హర్షితాః ||

25

తే హయైర్గోరథైః శీఘ్రైః స్యందనైశ్చ మహాజవైః |
సహయోధైః బలాధ్యక్షాః బలం సర్వమచోదయన్ ||

26

సజ్జం తు తద్బలం దృష్ట్వా భరతః గురుసన్నిధౌ |
రథం మే త్వరయస్వేతి సుమంత్రం పార్శ్వతోఽబ్రవీత్ ||

27

భరతస్య తు తస్యాజ్ఞాం ప్రతిగృహ్య చ హర్షితః |
రథం గృహీత్వా ప్రయయౌ యుక్తం పరమవాజిభిః ||

28

స రాఘవః సత్యధృతిః ప్రతాపవాన్
బ్రువన్ సుయుక్తం దృఢసత్యవిక్రమః |
గురుం మహారణ్యగతం యశస్వినమ్
ప్రసాదయిష్యన్భరతోఽబ్రవీత్తదా ||

29

తూర్ణం సముత్థాయ సుమంత్ర గచ్ఛ
బలస్య యోగాయ బలప్రధానాన్ |
ఆనేతుమిచ్ఛామి హి తం వనస్థమ్
ప్రసాద్య రామం జగతః హితాయ ||

30

స సూతపుత్రః భరతేన సమ్యక్
ఆజ్ఞాపితః సంపరిపూర్ణకామః |
శశాస సర్వాన్ప్రకృతి ప్రధానాన్
బలస్య ముఖ్యాంశ్చ సుహృజ్జనం చ ||

31

తతః సముత్థాయ కులే కులే తే
రాజన్యవైశ్యా వృషలాశ్చ విప్రాః |
అయూయుజన్నుష్ట్రరథాన్ ఖరాంశ్చ
నాగాన్ హయాంశ్చైవ కులప్రసూతాన్ ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వ్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 82 Meaning In Telugu

రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు.

‘రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు.” అని పలికాడు వసిష్ఠుడు.

అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. “కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్దకుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంత కన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకువంశమునకు కళంకము తీసుకు రాలేను. నా తల్లి చేసిన పాప కార్యములో నేను పాలుపంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నానిర్ణయము.” అని పలికాడు భరతుడు.

భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేసారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు.

“మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒక వేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే, నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్లుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా! నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి ” అని అన్నాడు.

భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రధము సిద్ధము చేసాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః (83) >>