Ayodhya Kanda Sarga 63 In Telugu – అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 63

అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గంలో, దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర, మరియు కైకేయిలతో కలసి రాముడి వనం పంపిన పశ్చాత్తాపంతో బాధపడుతాడు. దశరథుడు రాత్రింబవళ్లు రాముడి గురించే ఆలోచిస్తూ అనుతాపంలో మునిగి తానెవరి మాటలు వినకుండా ఉంటాడు. రాత్రి ఒకప్పుడు, అతను తన గత జీవితంలో చేసిన పాపం గురించి స్మరించుకుంటాడు, అందులో శ్రవణ కుమారుడు అనే అంధురాళ్ల కుమారుడిని పొరపాటున వధించిన సంఘటన. ఈ బాధతో, దశరథుడు తన మరణం సమీపంలో ఉన్నాడు. ఈ సర్గ దశరథుడి పశ్చాత్తాపం, అతని కుమారుడి వియోగంలో నష్టభావాన్ని, మరియు కర్మ ఫలితాలను తెలియజేస్తుంది.

ఋషికుమారవధాఖ్యానమ్

ప్రతిబుద్ధో ముహుర్తేన శోకోపహత చేతనః |
అథ రాజా దశరథః సచింతామభ్యపద్యత || ౧ ||

రామ లక్ష్మణయోశ్చైవ వివాసాద్వాసవోపమమ్ |
ఆవివేశోపసర్గస్తం తమః సూర్యమివాసురమ్ || ౨ ||

సభార్యే నిర్గతే రామే కౌసల్యాం కోసలేశ్వరః |
వివక్షురసితాపాంగాం స్మృత్వా దుష్కృతమాత్మనః || ౩ ||

స రాజా రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనమ్ |
అర్ధరాత్రే దశరథః సంస్మరన్ దుష్కృతం కృతమ్ || ౪ ||

స రాజా పుత్రశోకార్తః స్మృత్వా దుష్కృతమాత్మనః |
కౌసల్యాం పుత్ర శోకార్తామిదం వచనమబ్రవీత్ || ౫ ||

యదాచరతి కళ్యాణి శుభం వా యది వాఽశుభమ్ |
తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః || ౬ ||

గురు లాఘవమర్థానామారంభే కర్మణాం ఫలమ్ |
దోషం వా యో న జానాతి స బాలైతి హోచ్యతే || ౭ ||

కశ్చిదామ్రవణం ఛిత్త్వా పలాశాంశ్చ నిషించతి |
పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నుః స శోచతి ఫలాగమే || ౮ ||

అవిజ్ఞాయ ఫలం యో హి కర్మ త్వేవానుధావతి |
స శోచేత్ఫలవేలాయాం యథా కింశుకసేచకః || ౯ ||

సోఽహమామ్రవణం ఛిత్త్వా పలాశాంశ్చ న్యషేచయమ్ |
రామం ఫలాగమే త్యక్త్వా పశ్చాచ్ఛోచామి దుర్మతిః || ౧౦ ||

లబ్ధశబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మతా |
కుమారః శబ్దవేధీతి మయా పాపమిదం కృతమ్ || ౧౧ ||

తదిదం మేఽనుసంప్రాప్తం దేవి దుఃఖం స్వయం కృతమ్ |
సమ్మోహాదిహ బాలేన యథా స్యాద్భక్షితం విషమ్ || ౧౨ ||

యథాఽన్యః పురుషః కశ్చిత్పలాశైర్మోహితో భవేత్ |
ఏవం మమాఽప్యవిజ్ఞాతం శబ్ద వేధ్యమయం ఫలమ్ || ౧౩ ||

దేవ్యనూఢా త్వమభవో యువరాజో భవామ్యహమ్ |
తతః ప్రావృడనుప్రాప్తా మదకామవివర్ధినీ || ౧౪ ||

ఉపాస్యహి రసాన్ భౌమాన్ తప్త్వా చ జగదంశుభిః |
పరేతాచరితాం భీమాం రవిరావిశతే దిశమ్ || ౧౫ ||

ఉష్ణమంతర్దధే సద్యః స్నిగ్ధా దదృశిరే ఘనాః |
తతః జహృషిరే సర్వే భేకసారంగబర్హిణః || ౧౬ ||

క్లిన్నపక్షోత్తరాః స్నాతాః కృచ్ఛ్రాదివ పతత్రిణః |
వృష్టివాతావధూతాగ్రాన్ పాదపానభిపేదిరే || ౧౭ ||

పతితేనాంభసాఽఽచ్ఛన్నః పతమానేన చాసకృత్ |
ఆబభౌ మత్తసారన్గస్తోయ రాశిరివాచలః || ౧౮ ||

పాండురారుణవర్ణాని స్రూతాంసి విమలాన్యపి |
సుస్రువుర్గిరిధాతుభ్యః సభస్మాని భుజంగవత్ || ౧౯ ||

తస్మిన్నతిసుఖే కాలే ధనుష్మానిషుమాన్ రథీ |
వ్యాయామకృతసంకల్పః సరయూమన్వగాం నదీమ్ || ౨౦ ||

నిపానే మహిషం రాత్రౌ గజం వాఽభ్యాగతం నదీమ్ |
అన్యం వా శ్వాపదం కంచిత్ జిఘాంసురజితేంద్రియః || ౨౧ ||

అథాంధకారే త్వశ్రౌషం జలే కుంభస్య పర్యతః |
అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్దతః || ౨౨ ||

తతోఽహం శరముద్ధృత్య దీప్తమాశీవిషోపమమ్ |
శబ్దం ప్రతి గజప్రేప్సురభిలక్ష్య త్వపాతయమ్ || ౨౩ ||

అముంచం నిశితం బాణమహమాశీవిషోపమమ్ |
తత్ర వాగుషసి వ్యక్తా ప్రాదురాసీద్వనౌకసః || ౨౪ ||

హాహేతి పతతస్తోయే బాణాభిహతమర్మణః |
తస్మిన్నిపతితే బాణే వాగభూత్తత్ర మానుషీ || ౨౫ ||

కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని |
ప్రవివిక్తాం నదీం రాత్రౌ ఉదాహారోఽహమాగతః |
ఇషుణాఽభిహతః కేన కస్య వా కిం కృతం మయా || ౨౬ ||

ఋషేర్హి న్యస్త దండస్య వనే వన్యేన జీవతః |
కథం ను శస్త్రేణ వధో మద్విధస్య విధీయతే || ౨౭ ||

జటాభారధరస్యైవ వల్కలాజినవాససః |
కో వధేన మమార్థీ స్యాత్ కిం వాఽస్యాపకృతం మయా || ౨౮ ||

ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్థసంహితమ్ |
న కశ్చిత్ సాధు మన్యేత యథైవ గురుతల్పగమ్ || ౨౯ ||

నహం తథాఽనుశోచామి జీవిత క్షయమాత్మనః |
మాతరం పితరం చోభౌ అనుశోచామి మద్విధే || ౩౦ ||

తదేతన్మిథునం వృద్ధం చిరకాలభృతం మయా |
మయి పంచత్వమాపన్నే కాం వృత్తిం వర్తయిష్యతి || ౩౧ ||

వృద్ధౌ చ మాతా పితరౌ అహం చైకేషుణా హతః |
కేన స్మ నిహతాః సర్వే సుబాలేనాకృతాత్మనా || ౩౨ ||

తాం గిరం కరుణాం శ్రుత్వా మమ ధర్మానుకాంక్షిణః |
కరాభ్యాం సశరం చాపం వ్యథితస్యాపతద్భువి || ౩౩ ||

తస్యాహం కరుణం శ్రుత్వా నిశి లాలపతో బహు |
సంభ్రాంతః శోకవేగేన భృశమాసం విచేతనః || ౩౪ ||

తం దేశమహమాగమ్య దీన సత్త్వః సుదుర్మనాః |
అపశ్యమిషుణా తీరే సరయ్వాస్తాపసం హతమ్ || ౩౫ ||

అవకీర్ణజటాభారం ప్రవిద్ధకలశోదకమ్ |
స మాముద్వీక్ష్య నేత్రాభ్యాం త్రస్తమస్వస్థచేతసమ్ || ౩౬ ||

ఇత్యువాచ తతః క్రూరం దిధక్షన్నివ తేజసా |
కిం తవాపకృతం రాజన్ వనే నివసతా మయా || ౩౭ ||

జిహీర్షురంభో గుర్వర్థం యదహం తాడితస్త్వయా |
ఏకేన ఖలు బాణేన మర్మణ్యభిహతే మయి || ౩౮ ||

ద్వావంధౌ నిహతౌ వృద్ధౌ మాతా జనయితా చ మే |
తౌ కథం దుర్బలావంధౌ మత్ప్రతీక్షౌ పిపాసితౌ || ౩౯ ||

చిరమాశాకృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యతః |
న నూనం తపసో వాఽస్తి ఫలయోగః శ్రుతస్య వా || ౪౦ ||

పితా యన్మాం న జానాతి శయానం పతితం భువి |
జానన్నపి చ కిం కుర్యాదశక్తిరపరిక్రమః || ౪౧ ||

భిద్యమానమివాశక్తస్త్రాతుమన్యో నగో నగమ్ |
పితుస్త్వమేవ మే గత్వా శీఘ్రమాచక్ష్వ రాఘవ || ౪౨ ||

న త్వామనుదహేత్ క్రుద్ధో వనం వహ్నిరివైధితః |
ఇయమేకపదీ రాజన్ యతః మే పితురాశ్రమః || ౪౩ ||

తం ప్రసాదయ గత్వా త్వం న త్వాం స కుపితః శపేత్ |
విశల్యం కురు మాం రాజన్ మర్మ మే నిశితః శరః || ౪౪ ||

రుణద్ధి మృదుసోత్సేధం తీరమంబు రయో యథా |
సశల్యః క్లిశ్యతే ప్రాణైర్విశల్యో వినశిష్యతి || ౪౫ ||

ఇతి మామవిశచ్చింతా తస్య శల్యాపకర్షణే |
దుఃఖితస్య చ దీనస్య మమ శోకాతురస్య చ || ౪౬ ||

లక్షయామాస హృదయే చింతాం మునిసుతస్తదా |
తామ్యమానః స మాం కృచ్ఛాదువాచ పరమార్తవత్ || ౪౭ ||

సీదమానో వివృత్తాంగో వేష్టమానో గతః క్షయమ్ |
సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్ || ౪౮ ||

బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్ |
న ద్విజాతిరహం రాజన్ మాభూత్తే మనసో వ్యథా || ౪౯ ||

శూద్రాయామస్మి వైశ్యేన జాతః జనపదాధిప |
ఇతీవ వదతః కృచ్ఛ్రాత్ బాణాభిహతమర్మణః || ౫౦ ||

విఘూర్ణతో విచేష్టస్య వేపమానస్య భూతలే |
తస్యత్వానమ్యమానస్య తం బాణమహముద్ధరమ్ || ౫౧ ||

జలార్ద్రగాత్రం తు విలప్య కృచ్ఛ్రాత్
మర్మవ్రణం సంతతముచ్ఛ్వసంతమ్ |
తతః సరయ్వాం తమహం శయానమ్
సమీక్ష్య భద్రేఽస్మి భృశం విషణ్ణః || ౫౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిషష్ఠితమః సర్గః || ౬౩ ||

Ayodhya Kanda Sarga 63 Meaning In Telugu

దశరథుడు కలతనిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్రపట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకు చెబితే తన దు:ఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు.

ఓ కౌసల్యా! మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే, ఒక పనిని మొదలు పెట్టే ముందు, తాను చేయబోయే పని మంచిదా, చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకొని తరువాత ఆ పని మొదలుపెట్టాలి. అలా చెయ్యని వాడు మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు అని పెద్దలు అంటారు.

మోదుగుపూలు పెద్దవిగా ఉంటాయి. కాని మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగ పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు, పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి, మోదుగ చెట్లను పెంచిన వాడు మూఢుడు కాక మరేమవుతాడు. ఎందుకూ పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు, పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానము. మామిడి చెట్టులాంటి రాముని అడవులకు పంపి, మోదుగ చెట్లను పెంచుతున్నాను. కాని ఈ పాపమునకు బలమైన కారణము ఉంది.

నేను మంచి యవ్వనములో ఉండగా నాకు శబ్దవేధి విద్యనేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న మృగము నైనా అది చేయు శబ్దమును విని దానిని గురితప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది. మహా పాపము చేయించింది.

ఓ కౌసల్యా! అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనములో ఉన్నాను. పైగా యువరాజును. కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూనది సమీపములోని అడవికి వేటకు వెళ్లాను. వేటాడి వేటాడి అలసి పోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడటం చాలా ఇష్టం. సరోవరములో నీటిని తాగుటకు వచ్చు జంతువులు నీరు తాగునపుడు చేయు గుడ గుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినోదించేవాడిని.

అదే ప్రకారము ఆ రాత్రికూడా నేను ఒక సరోవరము దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలెనని సంకల్పముతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపునపుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి, ఆ శబ్దము వచ్చు వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘీంకారమునకు బదులు “అయ్యో అమ్మా అమ్మా” అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది.

నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్లాను. అక్కడ ఒక ముని కుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది. “మేము ఈ అడవితో తపస్సుచేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగము చేసినాడో కదా! మేము ఎవరికీ అపకారము చేయలేదే! నీళ్లు తీసుకొని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాని నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికీ ఏ విధమైన అపకారమూ చెయ్యము.

అటువంటిమాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు. అంటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సివచ్చింది. అతడు ఎవరో కానీ ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేసాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారములేదు. కాని నా తల్లి తండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లి తండ్రులను వారి వృధ్యాప్యములో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్థాంతరంగా మరణిస్తే వారికి దిక్కు ఎవరు? ఆ మూర్ఖుడు ఎవరో గానీ నన్ను మాత్రమే చంపలేదు. నాతోపాటు నా తల్లితండ్రులను కూడా చంపాడు. ” అని పరి పరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు.

ఆ మాటలు విన్న మా మనసు వికలమైపోయింది. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ ముని కుమారుని దగ్గరగా వెళ్లాను. అతడు తెచ్చిన కుండా పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ ముని కుమారుడు కళ్లు పైకెత్తి నన్ను చూచాడు.

“ఓ రాజా! నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది. నేను నీకు ఏమి అపకారము చేసానని నన్ను బాణంతో కొట్టావు. నేను నా తల్లి తండ్రుల కొరకు నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చాను. అది అపరాధమా! నువ్వు నన్నే కాదు. నా తల్లి తండ్రులనుకూడా చంపావు. నా తల్లి తండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకొని వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా! ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షము ఏమీ చేయలేనట్టు, నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కాని, నా తండ్రి, నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను, దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకొని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహము తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదుగో ఆ కనపడే కాలి బాట వెంట వెళితే మా ఆశ్రమము వస్తుంది. నీవు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పు.

ఓ రాజా! నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధకలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు. నాకు సత్వరమే మరణం ప్రసాదించు.” అని ఆ ముని కుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణమును తీస్తే అతను వెంటనే మరణిస్తాడు. తియ్యకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ ముని కుమారుడు. కాని అప్పటికే ఆ ముని కుమారుడు బాధతో నేల మీదపడి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు.

“ఓ రాజా! నీవు బ్రహ్మ హత్య చేసానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు. నా తల్లి శూద్ర వనిత. కాబట్టి నీకు ఆభయం లేదు.” అని అంత బాధలో కూడా నా మనసుకు ఊరట కలిగించాడు. ఆ ముని కుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరము నుండి బాణమును లాగేసాను. ఆ ముని కుమారుడు నా వంకే చూస్తూ ప్రాణములు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతిచెందిన ఆ ముని కుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధకలిగింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుఃషష్ఠితమః సర్గః (64) >>

Balakanda Sarga 53 In Telugu – బాలకాండ త్రిపంచాశః సర్గః

Balakanda Sarga 53 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు కామధేనుని పొందాలని ప్రయత్నిస్తాడు, కాని వశిష్ట మహర్షి విశ్వామిత్రుని బేరసారాలు మరియు వస్తుమార్పిడిని పట్టుదలతో నిరాకరిస్తాడు. ‘సామాన్యమైన ఆవును మాత్రమే పవిత్రంగా భావించి, అది మార్కెట్ చేయలేని వస్తువు అయినప్పుడు, ఏ కోరికనైనా పాలు చేసే శబల ఎలా ఇవ్వబడుతుంది లేదా ఇతర సంపదల కోసం ఎలా మార్చబడుతుంది…’ అనేది వశిష్ఠుని వాదన. అయినప్పటికీ, విశ్వామిత్రుడు తన బిడ్డింగ్కు వెళతాడు, కానీ ఫలించలేదు.

శబలానిష్క్రియః

ఏవముక్తా వసిష్ఠేన శబలా శత్రుసూదన |
విదధే కామధుక్కామాన్యస్య యస్య యథేప్సితమ్ ||

1

ఇక్షూన్మధూంస్తథా లాజాన్మైరేయాంశ్చ వరాసవాన్ |
పానాని చ మహార్హాణి భక్ష్యాంశ్చోచ్చావచాంస్తథా ||

2

ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయః పర్వతోపమాః |
మృష్టాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ ||

3

నానాస్వాదురసానాం చ షడ్రసానాం తథైవ చ | [షాడబానాం]
భోజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః ||

4

సర్వమాసీత్సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతమ్ |
విశ్వామిత్రబలం రామ వసిష్ఠేనాభితర్పితమ్ ||

5

విశ్వామిత్రోఽపి రాజర్షిర్హృష్టః పుష్టస్తదాభవత్ |
సాంతఃపురవరో రాజా సబ్రాహ్మణపురోహితః ||

6

సామాత్యో మంత్రిసహితః సభృత్యః పూజితస్తదా |
యుక్తః పరమహర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్ ||

7

పూజితోఽహం త్వయా బ్రహ్మన్పూజార్హేణ సుసత్కృతః |
శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్యవిశారద ||

8

గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ |
రత్నం హి భగవన్నేతద్రత్నహారీ చ పార్థివః ||

9

తస్మాన్మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ |
ఏవముక్తస్తు భగవాన్వసిష్ఠో మునిసత్తమః ||

10

విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిమ్ |
నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవామ్ ||

11

రాజన్దాస్యామి శబలాం రాశిభీ రజతస్య వా |
న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ ||

12

శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా |
అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ ||

13

ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ |
స్వాహాకారవషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా ||

14

ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః |
సర్వస్వమేతత్సత్యేన మమ తుష్టికరీ సదా ||

15

కారణైర్బహుభీ రాజన్న దాస్యే శబలాం తవ |
వసిష్ఠేనైవముక్తస్తు విశ్వామిత్రోఽబ్రవీత్తతః ||

16

సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్యవిశారదః |
హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్సువర్ణాంకుశభూషితాన్ ||

17

దదామి కుంజరాణాం తే సహస్రాణి చతుర్దశ |
హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానాం చతుర్యుజామ్ ||

18

దదామి తే శతాన్యష్టౌ కింకిణీకవిభూషితాన్ |
హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసామ్ ||

19

సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత |
నానావర్ణవిభక్తానాం వయఃస్థానాం తథైవ చ ||

20

దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ |
యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ ||

21

తావద్దాస్యామి తత్సర్వం శబలా దీయతాం మమ |
ఏవముక్తస్తు భగవాన్విశ్వామిత్రేణ ధీమతా ||

22

న దాస్యామీతి శబలాం ప్రాహ రాజన్కథంచన |
ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనమ్ ||

23

ఏతదేవ హి సర్వస్వమేతదేవ హి జీవితమ్ |
దర్శశ్చ పౌర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః ||

24

ఏతదేవ హి మే రాజన్వివిధాశ్చ క్రియాస్తథా |
అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః |
బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్ ||

25

Balakanda Sarga 53 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమ కూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగినవారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేసారు. వసిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంత:పుర కాంతలు, వారి వెంటవచ్చిన పురోహితులు, పరివారము, అందరూ ఎంతో సంతోషించారు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ ఆతిథ్యమునకు మేమందరమూ ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షీ! ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా! కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి.” అని అడిగాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ విశ్వామిత్రా! నీవు వందల వేల ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను. నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము. మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను. ” అని చెప్పాడు వసిష్ఠుడు.

“అది కాదు మహర్షీ! ఒక్క ఆవులే కాదు. బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వమఱులను కట్టిన 8 బంగారు రధములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు నీకు కోటి పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే….. అదీకాకపోతే నీకు ఏం కావాలో కోరుకో….. అవి అన్నీ ఇస్తాను. రత్నములా, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో… అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాతం నాకు ఇవ్వు. ” అని అడిగాడు విశ్వామిత్రుడు.

“నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము. నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు.

నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత, ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వలేను… ఇవ్వను” అని చెప్పాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃపంచాశః సర్గః (54) >>

Ayodhya Kanda Sarga 62 In Telugu – అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 62

అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గలో మంత్రలే అత్రి మహర్షి ఇంటికి వెళ్ళి ఆధ్యాత్మికత, తపస్సు గురించి ప్రశంసలు అందుకుంటాడు. అత్రి మహర్షి, అతని భార్య అనసూయ, అతని ఆశ్రమంలో రాముడు, సీత మరియు లక్ష్మణుడిని ఆతిథ్యం ఇస్తారు. అనసూయ, సీతకు దుస్తులు మరియు ఆభరణాలు అందజేస్తుంది. ఆమె సీతకు పతివ్రత ధర్మాన్ని గురించి ఉపదేశాలు ఇస్తుంది. సీత, తన పతివ్రత ధర్మాన్ని పాటించాలని ప్రతిజ్ఞ చేస్తుంది. అందరూ కృతజ్ఞతా భావంతో ఆశ్రమం నుండి బయలుదేరి మరిన్ని అడవులలో ప్రయాణిస్తారు. ఈ సర్గ, సీత, రాముడు మరియు లక్ష్మణుడి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడాన్ని ప్రతిబింబిస్తుంది.

కౌసల్యాప్రసాదనమ్

ఏవం తు క్రుద్ధయా రాజా రామమాత్రా సశోకయా |
శ్రావితః పరుషం వాక్యం చింతయామాస దుఃఖితః || ౧ ||

చింతయిత్వా స చ నృపో ముమోహ వ్యాకులేంద్రియః |
అథ దీర్ఘేణ కాలేన సంజ్ఞామాప పరంతపః || ౨ ||

స సంజ్ఞాముపలభ్యైవ దీర్ఘముష్ణం చ నిశ్శ్వసన్ |
కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా పునశ్చింతాముపాగమత్ || ౩ ||

తస్య చింతయమానస్య ప్రత్యభాత్ కర్మ దుష్కృతమ్ |
యదనేన కృతం పూర్వమజ్ఞానాచ్ఛబ్ద వేధినా || ౪ ||

అమనాస్తేన శోకేన రామశోకేన చ ప్రభుః |
ద్వాభ్యామపి మహారాజః శోకాబ్యామన్వతప్యత || ౫ ||

దహ్యమానః సశోకాభ్యాం కౌసల్యామాహ భూపతిః |
వేపమానోఽంజలిం కృత్వా ప్రసాదర్థమవాఙ్ముఖః || ౬ ||

ప్రసాదయే త్వాం కౌసల్యే రచితోఽయం మయాఽంజలిః |
వత్సలా చానృశంసా చ త్వం హి నిత్యం పరేష్వపి || ౭ ||

భర్తా తు ఖలు నారీణాం గుణవాన్నిర్గుణోఽపి వా |
ధర్మం విమృశమానానాం ప్రత్యక్షం దేవి దైవతమ్ || ౮ ||

సా త్వం ధర్మపరా నిత్యం దృష్ట లోక పరావర |
నార్హసే విప్రియం వక్తుం దుఃఖితాఽపి సుదుఃఖితమ్ || ౯ ||

తద్వాక్యం కరుణం రాజ్ఞః శ్రుత్వా దీనస్య భాషితమ్ |
కౌసల్యా వ్యసృజద్బాష్పం ప్రణాలీవ నవోదకమ్ || ౧౦ ||

స మూర్ధ్ని బద్ధ్వా రుదతీ రాజ్ఞః పద్మమివాంజలిమ్ |
సంభ్రమాదబ్రవీత్ త్రస్తా త్వరమాణాక్షరం వచః || ౧౧ ||

ప్రసీద శిరసా యాచే భూమౌ నితతితాఽస్మి తే |
యాచితాఽస్మి హతా దేవ హంతవ్యాఽహం న హి త్వయా || ౧౨ ||

నైషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యాయా సంప్రసాద్యతే || ౧౩ ||

జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదినమ్ |
పుత్రశోకార్తయా తత్తు మయా కిమపి భాషితమ్ || ౧౪ ||

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ |
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమః రిపుః || ౧౫ ||

శక్యమాపతితః సోఢుం ప్రహరః రిపుహస్తతః |
సోఢుమాపతితః శోకః సుసూక్ష్మోఽపి న శక్యతే || ౧౬ ||

వనవాసాయ రామస్య పంచరాత్రోఽద్య గణ్యతే |
యః శోకహతహర్షాయాః పంచవర్షోపమః మమ || ౧౭ ||

తం హి చింతయమానాయాః శోకోఽయం హృది వర్ధతే |
నదీనామివ వేగేన సముద్రసలిలం మహత్ || ౧౯ ||

ఏవం హి కథయంత్యాస్తు కౌసల్యాయాః శుభం వచః |
మందరశ్మిరభూత్సూర్యో రజనీ చాభ్యవర్తత || ౨౦ ||

తథ ప్రహ్లాదితః వాక్యైర్దేవ్యా కౌసల్యయా నృపః | [ప్రసాదితో]
శోకేన చ సమాక్రాంతర్నిద్రాయా వశమేయివాన్ || ౨౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్ఠితమః సర్గః || ౬౨ ||

Ayodhya Kanda Sarga 62 Meaning In Telugu

రాముని వియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దు:ఖిస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకు వచ్చింది. తాను వేసిన శబ్దవేది బాణముల వలన కలిగిన మహాపరాధము తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తానుచేసిన పాపము మరొకరితో పంచుకొంటేనేగాని తీరదు అని అనుకున్నాడు. కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.

“కౌసల్యా! భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, సతికి పతియే కదా ప్రత్యక్ష దైవము. నీకు దుఃఖము లేదు అని నేను అనను. కాని ఎంత దు:ఖములో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా! ఆలోచించు.” అని అన్నాడు.

ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదముల మీద వాలి పోయింది. ఆయన పాదములు తన కన్నీటితో అభిషేకించింది.

“మహారాజా! మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండ ఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేసాను. కాని మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేసానో ఇప్పుడు నాకు అర్థం అయింది. ఓ మహారాజా! మీరు ధర్మాత్ములు అని నాకు తెలియును. నాకూ ధర్మం తెలుసు. అంత అవివేకురాలిని కాను. కానీ పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.

మహారాజా! తమరికి తెలియనిది కాదు. శోకము అన్ని అపరాథములకు మూలము. శోకసముద్రములో మునిగిన వాడికి మంచి చెడూ తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తప్పుకోవచ్చు కానీ, మనసులో పుట్టిన చిన్నపాటి దుఃఖమును తట్టకోడం కష్టం. అన్ని ధర్మములు తెలిసినవారు, సర్వసంగపరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసుకదా!

ఓ మహారాజా! రాముడు మనలను విడిచిపోయి నేటికి ఐదు దినములు అయినది కానీ నాకు ఐదు సంవత్సరములు అయినట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశములో ఏమేమో మాటలాడి ఉంటాను. నన్ను క్షమించండి.” అని ప్రార్థించింది కౌసల్య ఇంతలో సాయంకాలము అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది రెండవ భాగము సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గః (63) >>

Balakanda Sarga 64 In Telugu – బాలకాండ చతుఃషష్టితమః సర్గః

Balakanda Sarga 64 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుఃషష్టితమః సర్గలో, విష్ణుమూర్తి దశరథుని తపస్సుకు సంతృప్తి చెంది, రామునిగా అవతరించడానికి సన్నాహాలు చేస్తాడు. దశరథుని యాగం పూర్తయిన తర్వాత, అగ్నిదేవుడు ప్రత్యక్షమై, పాయసాన్ని ఆయనకు అందిస్తాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంపించి, వారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నాలుగు కుమారులను పొందుతారు.

|| రంభాశాపః ||

సురకార్యమిదం రంభే కర్తవ్యం సుమహత్త్వయా |
లోభనం కౌశికస్యేహ కామమోహసమన్వితమ్ ||

1

తథోక్తా సాఽప్సరా రామ సహస్రాక్షేణ ధీమతా |
వ్రీడితా ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ సురేశ్వరమ్ ||

2

అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః |
క్రోధముత్సృజతే ఘోరం మయి దేవ న సంశయః ||

3

తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తుమర్హసి |
ఏవముక్తస్తయా రామ రంభయా భీతయా తయా ||

4

తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిమ్ |
మా భైషి రంభే భద్రం తే కురుష్వ మమ శాసనమ్ ||

5

కోకిలో హృదయగ్రాహీ మాధవే రుచిరద్రుమే |
అహం కందర్పసహితః స్థాస్యామి తవ పార్శ్వతః ||

6

త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరమ్ |
తమృషిం కౌశికం రంభే భేదయస్వ తపస్వినమ్ ||

7

సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపమనుత్తమమ్ |
లోభయామాస లలితా విశ్వామిత్రం శుచిస్మితా ||

8

కోకిలస్య స శుశ్రావ వల్గు వ్యాహరతః స్వనమ్ |
సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత ||

9

అథ తస్య చ శబ్దేన గీతేనాప్రతిమేన చ |
దర్శనేన చ రంభాయా మునిః సందేహమాగతః ||

10

సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుంగవః |
రంభాం క్రోధసమావిష్టః శశాప కుశికాత్మజః ||

11

యన్మాం లోభయసే రంభే కామక్రోధజయైషిణమ్ |
దశ వర్షసహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||

12

బ్రాహ్మణః సుమహాతేజాస్తపోబలసమన్వితః |
ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధకలుషీకృతామ్ ||

13

ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
అశక్నువన్ధారయితుం క్రోధం సంతాపమాగతః ||

14

తస్య శాపేన మహతా రంభా శైలీ తదాఽభవత్ |
వచః శ్రుత్వా చ కందర్పో మహర్షేః స చ నిర్గతః ||

15

కోపేన సుమహాతేజాస్తపోఽపహరణే కృతే |
ఇంద్రియైరజితై రామ న లేభే శాంతిమాత్మనః ||

16

బభూవాస్య మనశ్చింతా తపోఽపహరణే కృతే |
నైవ క్రోధం గమిష్యామి న చ వక్ష్యామి కించన ||

17

అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి |
అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేంద్రియః ||

18

తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితమ్ |
అనుచ్ఛ్వసన్నభుంజానస్తిష్ఠేయం శాశ్వతీః సమాః ||

19

న హి మే తప్యమానస్య క్షయం యాస్యంతి మూర్తయః |
ఏవం వర్షసహస్రస్య దీక్షాం స మునిపుంగవః |
చకారాప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునందన ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃషష్టితమః సర్గః ||

దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు.

“ఓ రంభా! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు. “అని అన్నాడు.

ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. “ఓ దేవేంద్రా! నీమాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం.” అని చెప్పింది.

దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. “రంభా! నీకేం భయం లేదు. నేను, మన్మధుడు, కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమ యానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడపనిలేదు. నీ హావభావవిలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు.” అని అన్నాడు.

రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు.

ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమాన పడ్డాడు. రంభను శపించాడు.

“తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభ పరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు పదివేల సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాపవిమోచన కలుగుతుంది.” అని శాపము, విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది.

ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు.

తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాప పడ్డాడు.

“అయ్యో అనవసరంగా రంభ మీద కోపించాను. శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను ముఖ్యంగా కోపాన్ని జయించలేక పోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంక ఎవరి మీదా కోపగించు కోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీదా కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించువరకూ ఘోర తపస్సు చేస్తాను. ” అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైనాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ పంచషష్టితమః సర్గః (65) >>

Ayodhya Kanda Sarga 43 In Telugu – అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 43 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గ, “కౌసల్యాపరిదేవితమ్”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన అధ్యాయం. ఈ సర్గలో, కౌసల్యా దేవి తన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లిపోవడం వల్ల కలిగిన వియోగంతో దుఃఖంలో మునిగిపోతుంది. రాముడి లేని పరిస్థితిలో, ఆమె మనసులో ఉన్న బాధలను, ఆవేదనను వ్యక్తం చేస్తుంది. కౌసల్యా రాముడి బాల్యాన్నీ, అతని సద్గుణాలనూ, ఆమె పట్ల ఉన్న ప్రేమను తలచుకుంటూ విలపిస్తుంది. ఈ సర్గ కౌసల్యా దేవి హృదయవేదనను, ఆమె ప్రేమను, మరియు తల్లి మరియు కుమారుడి మధ్య ఉన్న బలమైన బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

కౌసల్యాపరిదేవితమ్

తతః సమీక్ష్య శయనే సన్నం శోకేన పార్థివమ్ |
కౌసల్యా పుత్రశోకార్తా తమువాచ మహీపతిమ్ ||

1

రాఘవే నరశార్దూలే విషముప్త్వాహిజిహ్మగా |
విచరిష్యతి కైకేయీ నిర్ముక్తేవ హి పన్నగీ ||

2

వివాస్య రామం సుభగా లబ్ధకామా సమాహితా |
త్రాసయిష్యతి మాం భూయో దుష్టాహిరివ వేశ్మని ||

3

అథ స్మ నగరే రామశ్చరన్భైక్షం గృహే వసేత్ |
కామకారో వరం దాతుమపి దాసం మమాత్మజమ్ ||

4

పాతయిత్వా తు కైకేయ్యా రామం స్థానాద్యథేష్టతః |
ప్రదిష్టో రక్షసాం భాగః పర్వణీవాహితాగ్నినా ||

5

గజరాజగతిర్వీరో మహాబాహుర్ధనుర్ధరః |
వనమావిశతే నూనం సభార్యః సహలక్ష్మణః ||

6

వనే త్వదృష్టదుఃఖానాం కైకేయ్యాఽనుమతే త్వయా |
త్యక్తానాం వనవాసాయ కాన్వవస్థా భవిష్యతి ||

7

తే రత్నహీనాస్తరుణాః ఫలకాలే వివాసితాః |
కథం వత్స్యంతి కృపణాః ఫలమూలైః కృతాశనాః ||

8

అపీదానీం స కాలః స్యాన్మమ శోకక్షయః శివః |
సభార్యం యత్సహ భ్రాత్రా పశ్యేయమిహ రాఘవమ్ ||

9

సుప్త్వేవోపస్థితౌ వీరౌ కదాయోధ్యాం గమిష్యతః |
యశస్వినీ హృష్టజనా సూచ్ఛ్రితధ్వజమాలినీ ||

10

కదా ప్రేక్ష్య నరవ్యాఘ్రావరణ్యాత్పునరాగతౌ |
నందిష్యతి పురీ హృష్టా సముద్ర ఇవ పర్వణి ||

11

కదాఽయోధ్యాం మహాబాహుః పురీం వీరః ప్రవేక్ష్యతి |
పురస్కృత్య రథే సీతాం వృషభో గోవధూమివ ||

12

కదా ప్రాణిసహస్రాణి రాజమార్గే మమాత్మజౌ |
లాజైరవకరిష్యంతి ప్రవిశంతావరిందమౌ ||

13

ప్రవిశంతౌ కదాఽయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలౌ |
ఉదగ్రాయుధనిస్త్రింశౌ సశృంగావివ పర్వతౌ ||

14

కదా సుమనసః కన్యా ద్విజాతీనాం ఫలాని చ |
ప్రదిశంతః పురీం హృష్టాః కరిష్యంతి ప్రదక్షిణమ్ ||

15

కదా పరిణతో బుద్ధ్యా వయసా చామరప్రభః |
అభ్యుపైష్యతి ధర్మజ్ఞస్త్రివర్ష ఇవ లాలయన్ ||

16

నిస్సంశయం మయా మన్యే పురా వీర కదర్యయా |
పాతుకామేషు వత్సేషు మాతృణాం శాతితాః స్తనాః ||

17

సాహం గౌరివ సింహేన వివత్సా వత్సలా కృతా |
కైకేయ్యా పురుషవ్యాఘ్ర బాలవత్సేవ గౌర్బలాత్ ||

18

న హి తావద్గుణైర్జుష్టం సర్వశాస్త్రవిశారదమ్ |
ఏకపుత్రా వినా పుత్రమహం జీవితుముత్సహే ||

19

న హి మే జీవితే కించిత్సామర్థ్యమిహ కల్ప్యతే |
అపశ్యంత్యాః ప్రియం పుత్రం మహాబాహుం మహాబలమ్ ||

20

అయం హి మాం దీపయతే సముత్థితః
తనూజశోకప్రభవో హుతాశనః |
మహీమిమాం రశ్మిభిరుద్ధతప్రభో
యథా నిదాఘే భగవాన్దివాకరః ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 43 Meaning In Telugu

వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే కౌసల్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆమె కూడా రాముని విడిచి ఉండలేక మనసులోనే కుమిలిపోతూ ఉంది. దశరథుని చూచి ఇలా అంది:

“మహారాజా! మన జీవితములలో కైక విషము చిలకరించి నది. ఇప్పుడు కుముసము విడిచిన పాము వలె నిగ నిగ లాడుతూ మెరిసిపోతూ ఉంది. మనకు దుఃఖంతో కుమిలిపోతున్నాము. ఓ మహారాజా! రాముని అయోధ్యనుండి వెడలగొట్టిన కైక నన్నుకూడా విడిచిపెట్టదు. నన్ను వెంటాడి వేధిస్తుంది. పాము వలె కాటేస్తుంది. కనీసము కైక రాముని అరణ్యములకు పంపకుండా తన వద్ద దాసునిగా నియమించుకొనినా కూడా ఎంతో బాగుండేది. నాకళ్ల ఎదుట నా కుమారుడు ఉండే వాడు. నాలుగు ఇళ్లలో బిక్ష తీసుకొని వచ్చి నన్ను పోషించేవాడు.

ఓ మహారాజా! నీవుమాత్రము తక్కువ చేసావా! దేవతలకు ఇవ్వవలసిన హవిస్సులను రాక్షసులకు ఇచ్చినట్టు, రామునికి ఇవ్వవలసిన రాజ్యమును భరతునికి ఇచ్చావు. ఓ మహారాజా! ఈ పాటికి నా రాముడు అడవిలోకి ప్రవేశించి ఉంటాడంటావా! సీత, లక్ష్మణుడు వెంటరాగా అడవులలో దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడంటావా! ఎన్నడూ కష్టములు అంటే తెలియని రాముని, సీతను లక్ష్మణుని, ఆ కైక మాటవిని అడవులకు పంపావు. వాళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో! ఏమో! ఈ వయసులో వారు సుఖాలు అనుభవిం చాల్సింది పోయి, అరణ్యములలో అష్టకష్టాలు పడుతున్నారు. సంభక్ష్య పరమాన్నములు తినడానికి అలవాటు పడ్డవాళ్లు ఆ అడవిలో దిక్కులేని వాళ్లమాదిరి కందమూలములు ఎలా తింటున్నారో కదా!

ఓ మహారాజా! రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ అయోధ్యకు వచ్చినపుడు చూడటానికి నేను బతికి ఉంటానా! ఆ మంగళకరమైన దృశ్యము కళ్లారా చూడగలనా! రామలక్ష్మణులు తిరిగి రాగానే అయోధ్య అంతా పౌర్ణమి నాటి సముద్రము మాదిరి ఎంత ఉప్పొంగిపోతుందోకదా! రాముడు సీతను రథము మీద తన పక్కన కూర్చుండపెట్టుకొని ఎప్పుడు అయోధ్యలో ప్రవేశిస్తాడో కదా! సీతారామలక్ష్మణులు అయోధ్యలోకి ప్రవేశిస్తుంటే అయోధ్యా ప్రజలు వారి మీద పూలు, లాజలు, చల్లే దృశ్యము ఎప్పుడు కనపడుతుందోకదా! అయోధ్యలోకి ప్రవేశించేముందు సీతారాములు అయోధ్య పట్టణమునకు ప్రదక్షిణము చేస్తూ కన్యలకు, బ్రాహ్మణులకు కానుకలు ఇచ్చే దృశ్యము ఎన్నడు చూస్తానో కదా!

ఓ మహారాజా! రాముడు ఈ పధ్నాలుగుసంవత్సరములు అరణ్యములలో మునుల వద్ద ఉండి ఎన్నో ధర్మములు,శాస్త్రములు నేర్చుకొని బుద్ధి పరిణతిచెంది వస్తాడేమో కాని నా రాముడు నాకు మాత్రం ఆడుకునే మూడేళ్ల చంటి వాడి మాదిరి గానే ఉంటాడు. రాముడు రాగానే నేను వాడితో ఆడుకుంటాను. మీరు కాదనకూడదు. అసలు నాకు ఈ పుత్రవియోగము కలగడానికి కారణం నేను ఏజన్మలోనో పాలు తాగే దూడలు వాటి తల్లుల వద్ద పాలుతాగడానికి పోయినపుడు నేను ఆ ఆవుల స్తన్యములను కోసివేసి ఉంటాను. అందుకనే నాకు ఇలాంటి దుర్గతి కలిగింది.

ఓ మహారాజా! నేను గోవునైతే నా రాముడు గోవత్సము. అట్టి మా ఇద్దరినీ సింహము వంటి కైక వేరు చేసినది. ఆ పాపము ఊరికే పోదు. ఓ మహారాజా! నా రాముని విడిచి నేనుజీవించడం కల్ల. ఇంక ఒక్కరోజుకూడా రాముని లేకుండా నేను జీవించడం నా వల్ల కాదు. ఆ శక్తి నాకు లేదు. ఎందు కంటే దావానలము అరణ్యమును కాల్చివేసి నట్టు, పుత్రశోకము అనే అగ్ని నన్ను అనునిత్యమూ దహించి వేస్తూ ఉంది. ఆ అగ్నిలో నేను కాలి బూడిద అవడం తథ్యం.” అని భోరు భోరున ఏడుస్తూ ఉంది కౌసల్య.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుశ్చత్వారింశః సర్గః (44)>>

Balakanda Sarga 51 In Telugu – బాలకాండ ఏకపంచాశః సర్గః

Balakanda Sarga 51 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకపంచాశః సర్గలో, తన తండ్రి గౌతముడు తన తల్లి అహల్యతో తిరిగి కలవడం గురించి ఆరా తీస్తూ, శతానంద మహర్షి విశ్వామిత్రుని పురాణాన్ని వివరిస్తాడు. విశ్వామిత్రుడు ఒకానొక సమయంలో గొప్ప రాజుగా ఉన్నప్పుడు, అనేక స్వీయ-ముఖ్యమైన దోపిడీల ద్వారా సంపాదించిన విశ్వామిత్రుని యొక్క నిజాయితీకి కట్టుబడి ఉన్నందుకు శతానంద రాముడిని అభినందించాడు. విశ్వామిత్రుని జీవిత చరిత్రను రాముడికి తెలియజేయడంలో శతానంద విలువైనది, ఎందుకంటే విశ్వామిత్రుడు చేసినట్లుగా రాజులను అతిగా భరించడం రాజులకు అననుకూలంగా ఉంటుంది.

విశ్వామిత్రవృత్తమ్

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః |
హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః ||

1

గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతితప్రభః |
రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః ||

2

స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ |
శతానందో మునిశ్రేష్ఠం విశ్వామిత్రమథాబ్రవీత్ ||

3

అపి తే మునిశార్దూల మమ మాతా యశస్వినీ |
దర్శితా రాజపుత్రాయ తపోదీర్ఘముపాగతా ||

4

అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ |
వన్యైరుపాహరత్పూజాం పూజార్హే సర్వదేహినామ్ ||

5

అపి రామాయ కథితం యథావృత్తం పురాతనమ్ |
మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితమ్ ||

6

అపి కౌశిక భద్రం తే గురుణా మమ సంగతా |
మాతా మమ మునిశ్రేష్ఠ రామసందర్శనాదితః ||

7

అపి మే గురుణా రామః పూజితః కుశికాత్మజ |
ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః ||

8

అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజ |
ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః ||

9

తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః |
ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్ ||

10

నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా |
సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా ||

11

తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య ధీమతః |
శతానందో మహాతేజా రామం వచనమబ్రవీత్ ||

12

స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ |
విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితమ్ ||

13

అచింత్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః |
విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిమ్ ||

14

నాస్తి ధన్యతరో రామ త్వత్తోఽన్యో భువి కశ్చన |
గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః ||

15

శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః |
యథా బలం యథా వృత్తం తన్మే నిగదతః శృణు ||

16

రాజాఽభూదేష ధర్మాత్మా దీర్ఘకాలమరిందమః |
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః ||

17

ప్రజాపతిసుతస్త్వాసీత్కుశో నామ మహీపతిః |
కుశస్య పుత్రో బలవాన్కుశనాభః సుధార్మికః ||

18

కుశనాభసుతస్త్వాసీద్గాధిరిత్యేవ విశ్రుతః |
గాధేః పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

19

విశ్వమిత్రో మహాతేజాః పాలయామాస మేదినీమ్ |
బహువర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్ ||

20

కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూథినీమ్ |
అక్షౌహిణీపరివృతః పరిచక్రామ మేదినీమ్ ||

21

నగరాణి చ రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ |
ఆశ్రమాన్క్రమశో రాజా విచరన్నాజగామ హ ||

22

వసిష్ఠస్యాశ్రమపదం నానావృక్షసమాకులమ్ |
నానామృగగణాకీర్ణం సిద్ధచారణసేవితమ్ ||

23

దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితమ్ |
ప్రశాంతహరిణాకీర్ణం ద్విజసంఘనిషేవితమ్ ||

24

బ్రహ్మర్షిగణసంకీర్ణం దేవర్షిగణసేవితమ్ |
తపశ్చరణసంసిద్ధైరగ్నికల్పైర్మహాత్మభిః ||

25

[* సతతం సంకులం శ్రీమద్బ్రహ్మకల్పైర్మహాత్మభిః | *]
అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా |
ఫలమూలాశనైర్దాంతైర్జితరోషైర్జితేంద్రియైః ||

26

ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః |
అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితమ్ ||

27

వసిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరమ్ |
దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః ||

28

Balakanda Sarga 51 In Telugu Pdf With Meaning

జనకుని పక్కను ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు.

“ ఓ మహర్షీ! శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా! నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా! మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా! దైవము ప్రతికూలించడం వలన మా తల్లి గారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా! రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా! మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరిం చాడా! నా తండ్రి అయిన గౌతముడు శ్రీ రాముని పూజించాడా! అతిధి సత్కారములు చేసాడా! శ్రీ రాముడు నా తండ్రిని ఆదరించాడా! గౌరవించాడా! మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా!” అని శతానందుడఱు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు.

ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు. “ఓ శతానందా! నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినది అంతా చేసాను. రేణుకా దేవి జమదగ్నిని చేరి నట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది.” అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు.

ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు. “శ్రీ రామా! సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యము చే నీవు ధన్యుడవు అయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను.

ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు. చక్రవర్తి. ధర్మవేత్త. సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేసాడు. వీరి వంశము గురించి చెబుతాను విను.
ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేసాడు. అందరు రాజులను ఓడించాడు.

ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు. ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వసిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫల వృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది దేవ ఋషులు, దేవతలు, బ్రహ్మ ఋషులు వసిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్య ద్వేషములు, కోప తాపములు అసూయ లేవు. వాలఖిల్యులూ, వైఖానసులు, ఋషులు జపములు, హోమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంత మంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంత మందికేవలము నీరు తాగుతూ మరి కొంత మంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఎటుచూచినా పవిత్రత ప్రశాంతత వెల్లి విరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణము లో ఉన్న వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు.

శ్రీమద్రామాయణము,
బాల కాండము యాభైఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విపంచాశః సర్గః (52) >>

Balakanda Sarga 62 In Telugu – బాలకాండ ద్విషష్టితమః సర్గః

Balakanda Sarga 62 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రామాయణంలోని బాలకాండలో 62వ సర్గ, ద్విషష్టితమః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి కలిసి జనక మహారాజు రాజధాని మిథిలాకి చేరుకుంటారు. జనక మహారాజు రాముడు అహల్య శాప విమోచనం చేసిన విషయాన్ని విని, అతడిని ప్రశంసిస్తాడు. రాజ్యంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది.

|| అంబరీషయజ్ఞః ||

శునఃశేపం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః |
వ్యశ్రామ్యత్పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన ||

1

తస్య విశ్రమమాణస్య శునఃశేపో మహాయశాః |
పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శ హ ||

2

తప్యంతమృషిభిః సార్ధం మాతులం పరమాతురః |
వివర్ణవదనో దీనస్తృష్ణయా చ శ్రమేణ చ ||

3

పపాతాంకే మునౌ రామ వాక్యం చేదమువాచ హ | [మునేరాశు]
న మేఽస్తి మాతా న పితా జ్ఞాతయో బాంధవాః కుతః ||

4

త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవః |
త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః ||

5

రాజా చ కృతకార్యః స్యాదహం దీర్ఘాయురవ్యయః |
స్వర్గలోకముపాశ్నీయాం తపస్తప్త్వా హ్యనుత్తమమ్ ||

6

త్వం మే నాథో హ్యనాథస్య భవ భవ్యేన చేతసా |
పితేవ పుత్రం ధర్మాత్మంస్త్రాతుమర్హసి కిల్బిషాత్ ||

7

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః |
సాంత్వయిత్వా బహువిధం పుత్రానిదమువాచ హ ||

8

యత్కృతే పితరః పుత్రాంజనయంతి శుభార్థినః |
పరలోకహితార్థాయ తస్య కాలోఽయమాగతః ||

9

అయం మునిసుతో బాలో మత్తః శరణమిచ్ఛతి |
అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః ||

10

సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః |
పశుభూతా నరేంద్రస్య తృప్తిమగ్నేః ప్రయచ్ఛత ||

11

నాథవాంశ్చ శునఃశేపో యజ్ఞశ్చావిఘ్నితో భవేత్ |
దేవతాస్తర్పితాశ్చ స్యుర్మమ చాపి కృతం వచః ||

12

మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యందాదయః సుతాః |
సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్ ||

13

కథమాత్మసుతాన్హిత్వా త్రాయసేఽన్యసుతం విభో |
అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే ||

14

తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః |
క్రోధసంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే ||

15

నిఃసాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితమ్ |
అతిక్రమ్య తు మద్వాక్యం దారుణం రోమహర్షణమ్ ||

16

శ్వమాంసభోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యామనువత్స్యథ ||

17

కృత్వా శాపసమాయుక్తాన్పుత్రాన్మునివరస్తదా |
శునఃశేపమువాచార్తం కృత్వా రక్షాం నిరామయామ్ ||

18

పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః |
వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర ||

19

ఇమే తు గాథే ద్వే దివ్యే గాయేథా మునిపుత్రక |
అంబరీషస్య యజ్ఞేఽస్మింస్తతః సిద్ధిమవాప్స్యసి ||

20

శునఃశేపో గృహీత్వా తే ద్వే గాథే సుసమాహితః |
త్వరయా రాజసింహం తమంబరీషమువాచ హ ||

21

రాజసింహ మహాసత్త్వ శీఘ్రం గచ్ఛావహే సదః |
నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ ||

22

తద్వాక్యమృషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః |
జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటమతంద్రితః ||

23

సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణమ్ |
పశుం రక్తాంబరం కృత్వా యూపే తం సమబంధయత్ ||

24

స బద్ధో వాగ్భిరగ్ర్యాభిరభితుష్టావ వై సురౌ |
ఇంద్రమింద్రానుజం చైవ యథావన్మునిపుత్రకః ||

25

తతః ప్రీతః సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః |
దీర్ఘమాయుస్తదా ప్రాదాచ్ఛునఃశేపాయ రాఘవ ||

26

స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్యాంతమవాప్తవాన్ |
ఫలం బహుగుణం రామ సహస్రాక్షప్రసాదజమ్ ||

27

విశ్వామిత్రోఽపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్షశతాని చ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విషష్ఠితమః సర్గః ||

Balakanda Sarga 62 Meaning In Telugu

ఋచీకుని వద్దనుండి అతని కుమారుడైన శునశేపుని లక్షగోవులు ఇచ్చి కొనుక్నున్న అంబరీషుడు, అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శునశేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ శునశేవుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్లారు. శునశేపుడు మేనమామ ఒడిలో తల పెట్టుకొని ఏడిచాడు.

“ఓ మహర్షీ! నాకు తల్లి లేదు. తండ్రిలేడు. ఇద్దరూ నన్ను వదిలేసారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రివంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి. ” అని వేడుకున్నాడు.

శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. “కుమారులారా! పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేసారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్లడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు శునశేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను శునశేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది.” అని అన్నాడు.

తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. “తండ్రీ! మీరు శునశేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్లమం టున్నారు. అలా చెయ్యడం కుక్కమాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరమూ వెళ్లము.” అని చెప్పారు.

కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. “ఏమన్నారు. పరులకు సాయం చెయ్యడం కుక్కమాంసం తినడంతో సమానమా! అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్కమాంసము తింటూ వేయి సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము.” అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు.

ఇదంతా చూచిన శున శేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యము చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు.

“ఓ శునశేవా! యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి, ఊపస్తంభమునకు కడతారు. అపుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

శునశేపునకు రెండు మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన శునశేపుడు అంబరీషుని వెంట వెళ్లాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు. శునశేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేసారు. ఊపస్థంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేసారు.

అప్పుడు శునశేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. శునశేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా శునశేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి.

తరువాత విశ్వామిత్రుడు వేయి సంవత్సరములు పుష్కరక్షేత్రములో తపస్సు చేసాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓ తత్సత్.

బాలకాండ త్రిషష్టితమః సర్గః (63) >>

Ayodhya Kanda Sarga 61 In Telugu – అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 61

అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గః ఋషిపత్ని అహల్యను మునులు, రఘునందనుడైన రాముడు తన పాదస్పర్శతో ఆమెను విముక్తిని ప్రసాదించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, మరియు విశ్వామిత్రుడు మిథిలాపురికి చేరారు. జనక మహారాజు వారికి స్వాగతం పలికాడు. రాముడు పరశురాముని ధనుస్సును విరిచాడు, దాంతో జనకుడు సీతకు రాముని వరం ఇస్తానని ప్రకటించాడు. ఆ దివ్య వివాహాన్ని చూస్తూ మిథిలాపురం సంతోషంలో మునిగిపోయింది. సీతారాముల కల్యాణం వైభవంగా జరగ్గా, జనకుడు సీతను రామునికి ఇచ్చి సంతోషం పొందాడు. దీంతో అయోధ్యాకాండ ఏకషష్ఠితమః సర్గ ముగుస్తుంది.

కౌసల్యోపాలంభః

వనం గతే ధర్మపరే రామే రమయతాం వరే |
కౌసల్యా రుదతీ స్వార్తా భర్తారమిదమబ్రవీత్ || ౧ ||

యద్యపి త్రిషు లోకేషు ప్రథితం తే మయద్యశః |
సానుక్రోశో వదాన్యశ్చ ప్రియవాదీ చ రాఘవః || ౨ ||

కథం నరవరశ్రేష్ఠ పుత్రౌ తౌ సహ సీతయా |
దుఃఖితౌ సుఖసంవృద్ధౌ వనే దుఃఖం సహిష్యతః || ౩ ||

సా నూనం తరుణీ శ్యామా సుకుమారీ సుఖోచితా |
కథముష్ణం చ శీతం చ మైథిలీ ప్రసహిష్యతే || ౪ ||

భుక్త్వాఽశనం విశాలాక్షీ సూపదం శాన్వితం శుభమ్ |
వన్యం నైవారమాహారం కథం సీతోపభోక్ష్యతే || ౫ ||

గీతవాదిత్రనిర్ఘోషం శ్రుత్వా శుభమనిందితా |
కథం క్రవ్యాదసింహానాం శబ్దం శ్రోష్యత్యశోభనమ్ || ౬ ||

మహేంద్రధ్వజసంకాశః క్వ ను శేతే మహాభుజః |
భుజం పరిఘసంకాశముపధాయ మహాబలః || ౭ ||

పద్మవర్ణం సుకేశాంతం పద్మ నిశ్శ్వాసముత్తమమ్ |
కదా ద్రక్ష్యామి రామస్య వదనం పుష్కరేక్షణమ్ || ౮ ||

వజ్రసారమయం నూనం హృదయం మే న సంశయః |
అపశ్యంత్యా న తం యద్వై ఫలతీదం సహస్రధా || ౯ ||

యత్త్వయాఽకరుణం కర్మ వ్యపోహ్య మమ బాంధవాః |
నిరస్తాః పరిధావంతి సుఖార్హః కృపణా వనే || ౧౦ ||

యది పంచదశే వర్షే రాఘవః పునరేష్యతి |
జహ్యాద్రాజ్యం చ కోశం చ భరతో నోపలక్షయతే || ౧౧ ||

భోజయంతి కిల శ్రాద్ధే కేచిత్స్వానేవ బాంధవాన్ |
తతః పశ్చాత్సమీక్షంతే కృతకార్యా ద్విజర్షభాన్ || ౧౨ ||

తత్ర యే గుణవంతశ్చ విద్వాంసశ్చ ద్విజాతయః |
న పశ్చాత్తేఽభిమన్యంతే సుధామపి సురోపమాః || ౧౩ ||

బ్రాహ్మణేష్వపి తృప్తేషు పశ్చాద్భోక్తుం ద్విజర్షభాః |
నాభ్యుపైతుమలం ప్రాజ్ఞాః శృంగచ్ఛేదమివర్షభాః || ౧౪ ||

ఏవం కనీయసా భ్రాత్రా భుక్తం రాజ్యం విశాంపతే |
భ్రాతా జ్యేష్ఠో వరిష్ఠశ్చ కిమర్థం నావమంస్యతే || ౧౫ ||

న పరేణాహృతం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితుమిచ్చతి |
ఏవమేతన్నరవ్యాఘ్రః పరలీఢం న మన్యతే || ౧౬ ||

హవిరాజ్యం పురోడాశాః కుశా యూపాశ్చ ఖాదిరాః |
నైతాని యాతయామాని కుర్వంతి పునరధ్వరే || ౧౭ ||

తథా హ్యాత్తమిదం రాజ్యం హృతసారాం సురామివ |
నాభిమంతుమలం రామర్నష్ట సోమమివాధ్వరమ్ || ౧౮ ||

నైవం విధమసత్కారం రాఘవో మర్షయిష్యతి |
బలవానివ శార్దూలో వాలధేరభిమర్శనమ్ || ౧౯ ||

నైతస్య సహితా లోకాః భయం కుర్యుర్మహామృధే |
అధర్మం త్విహ ధర్మాత్మా లోకం ధర్మేణ యోజయేత్ || ౨౦ ||

నన్వసౌ కాంచనైర్బాణైర్మహావీర్యో మహాభుజః |
యుగాంత ఇవ భూతాని సాగరానపి నిర్దహేత్ || ౨౧ ||

స తాదృశః సింహబలో వృషభాక్షో నరర్షభః |
స్వయమేవ హతః పిత్రా జలజేనాత్మజో యథా || ౨౨ ||

ద్విజాతిచరితో ధర్మః శాస్త్రదృష్టః సనాతనః |
యది తే ధర్మనిరతే త్వయా పుత్రే వివాసితే || ౨౩ ||

గతిరేకా పతిర్నార్యా ద్వితీయా గతిరాత్మజః |
తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థీ నేహ విద్యతే || ౨౪ ||

తత్ర త్వం చైవ మే నాస్తి రామశ్చ వనమాశ్రితః |
న వనం గంతుమిచ్ఛామి సర్వథా నిహతా త్వయా || ౨౫ ||

హతం త్వయా రాజ్యమిదం సరాష్ట్రమ్
హతస్తథాఽఽత్మా సహ మంత్రిభిశ్చ |
హతా సపుత్రాఽస్మి హతాశ్చ పౌరాః
సుతశ్చ భార్యా చ తవ ప్రహృష్టౌ || ౨౬ ||

ఇమాం గిరం దారుణశబ్దసంశ్రితామ్
నిశమ్య రాజాఽపి ముమోహ దుఃఖితః |
తతః స శోకం ప్రవివేశ పార్థివః
స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్ || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్ఠితమః సర్గః || ౬౧ ||

Ayodhya Kanda Sarga 61 Meaning In Telugu

తరువాత కౌసల్య, మహారాజు దశరథుని చూచి ఇలా పలికింది. “మహారాజా! తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా! కాని కన్నకుమారుని, కోడలిని, ఎలా అడవులకు పంపగలిగావు. నీ దయాగుణము అంతా ఏమయింది? అది సరే! ఏ పాపమూ ఎరుగని సీతను కూడా అడవులకు పంపావు కదా! ఆమె అడవులలో ఎలా తిరుగ గలదు? ఆ కందమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా! పొద్దుటే మంగళవాద్యములను వినడానికి అలవాటు పడిన సీత క్రూరమృగముల అరుపులు ఎలా వినగలదు అని ఎన్నడైనా ఆలోచించారా! తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధలు పడుతున్నాడో మీకు తెలుసా! రాముని చూడకుండా ఉండటానికి మీది హృదయమా లేక బండరాయా!
మహారాజా! రాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము ముగించుకొనితిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యమును రామునికి ఇస్తాడంటారా! ఒక వేళ భరతుడు ఇచ్చినా రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా!

ఏమో నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు. ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్దపులి తినదు. అలాగే భరతుడుకి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు. రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా! యుద్ధము చేసి అన్నా రాజ్యము తీసుకుంటాడు కానీ భరతుని దయాధర్మభిక్ష కిందతీసుకోడు. రామునికి జరిగిన అవమానానికి ఆరోజే రాముడు తమరిని నరికి వేసి ఉండేవాడు. కానీ తండ్రి అనే గౌరవంతో విడిచి పెట్టాడు అని అనుకుంటాను. లేకపోతే రాముని పరాక్రమునకు ముల్లోకములలో తిరుగులేదు కదా! తన తోకతొక్కిన వాడిని వ్యాఘ్రము ఎలా క్షమించదో అలాగే తనకు అపకారము చేసిన వాడిని రాముడు కూడా క్షమించడు. అటువంటి రాముని పరాక్రమాన్ని వీరత్వాన్నీ నీవు నాశనం చేసావు. దేశం నుండి వెళ్లగొట్టావు. ఇది ధర్మాత్ములు చెయ్యదగిన పనేనా!

ధర్మ శాస్త్రము ప్రకారము స్త్రీకి మొదటి రక్షకుడు భర్త. రెండవ రక్షకుడు కుమారుడు. మూడవ రక్షకుడు జ్ఞాతి. నాకు భర్తగా నువ్వు ఉండీ లేనట్టే. నాకు నా కుమారుని దూరం చేసావు. నన్ను గతిలేని దానిని చేసావు. అధోగతి పాలు చేసావు. నన్నే కాదు ఈదేశాన్నే నాశనం చేసావు. దిక్కులేకుండా చేసావు. నీవు చేసిన పనుల వలన నీ భార్య కైక నీ కుమారుడు భరతుడు మాత్రమే ఆనందిస్తారు. తక్కినవాళ్లు దుఃఖములో మునిగితేలుతున్నారు. కేవలం ఇద్దరి సుఖం కోసం ఇంతమందిని క్షోభపెట్టడం ధర్మమా!” అని కౌసల్య దశరథుని అనరాని మాటలు అంటూ ఉంటే దశరథుడు కిమ్మనకుండా అన్నీ భరిస్తున్నాడు. తాను చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని అనుకుంటూ అన్నింటినీ భరిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గః (62) >>

Balakanda Sarga 49 In Telugu – బాలకాండ ఏకోనపంచాశః సర్గః

Balakanda Sarga 49 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనపంచాశః సర్గలో, రాముడు వారి ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు అహల్య తన శాపం నుండి విముక్తి పొందింది. విశ్వామిత్రుడు అహల్య పురాణం యొక్క కథనాన్ని కొనసాగిస్తూ, అహల్య ఎవరికీ కనిపించకుండా నివసిస్తున్న ఆమె ఆశ్రమంలోకి రామని అడుగుతాడు. ఒకసారి రాముడు ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె తన శపించబడిన అదృశ్య స్థితి నుండి వ్యక్తమవుతుంది. ఆమె తన దివ్య రూపంతో ఉద్భవించింది మరియు రామ మరియు లక్ష్మణులకు అతిథిగా ఉంటుంది. గౌతమ మహర్షి కూడా తన నిష్క్రమించిన భార్య అహల్యను అంగీకరించడానికి ఈ తరుణంలో వస్తాడు.

అహల్యాశాపమోక్షః

అఫలస్తు తతః శక్రో దేవానగ్నిపురోగమన్ |
అబ్రవీత్ త్రస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్ ||

1

కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః |
క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతమ్ ||

2

అఫలోఽస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా |
శాపమోక్షేణ మహతా తపోస్యాపహృతం మయా ||

3

తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః సచారణాః |
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ ||

4

శతక్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః |
పితృదేవానుపేత్యాహుః సర్వే సహ మరుద్గణైః ||

5

అయం మేషః సవృషణః శక్రో హ్యవృషణః కృతః |
మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత ||

6

అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి |
భవతాం హర్షణార్థే చ యే చ దాస్యంతి మానవాః ||

7

అక్షయం హి ఫలం తేషాం యూయం దాస్యథ పుష్కలమ్ |
అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః ||

8

ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్ |
తదాప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః ||

9

అఫలాన్భుంజతే మేషాన్ఫలైస్తేషామయోజయన్ |
ఇంద్రస్తు మేషవృషణస్తదాప్రభృతి రాఘవ ||

10

గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః |
తదాగచ్ఛ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః ||

11

తారయైనాం మహాభాగామహల్యాం దేవరూపిణీమ్ |
విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః ||

12

విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమథావిశత్ |
దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్ ||

13

లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః |
ప్రయత్నాన్నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ ||

14

స తుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభామివ |
మధ్యేఽమ్భసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ ||

15

ధూమేనాపి పరీతాంగీం దీప్తామగ్నిశిఖామివ |
సా హి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్యా బభూవ హ ||

16

త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనమ్ |
శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగతా ||

17

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా |
స్మరంతీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ ||

18

పాద్యమర్ఘ్యం తథాఽఽతిథ్యం చకార సుసమాహితా |
ప్రతిజగ్రాహ కాకుత్స్థో విధిదృష్టేన కర్మణా ||

19

పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదుందుభినిఃస్వనైః |
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమః ||

20

సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్ |
తపోబలవిశుద్ధాంగీం గౌతమస్య వశానుగామ్ ||

21

గౌతమోఽపి మహాతేజా అహల్యాసహితః సుఖీ | [హి]
రామం సంపూజ్య విధివత్తపస్తేపే మహాతపాః ||

22

రామోఽపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః |
సకాశాద్విధివత్ప్రాప్య జగామ మిథిలాం తతః ||

23

Balakanda Sarga 49 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కిందపడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని, మొదలగు దేవతలతోనూ, ఋషులతోనూ ఇలా అన్నాడు.

“నేను మీ కోసం ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేసాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేసాను. తద్వారా దేవ కార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీ కోసం ఇదంతా చేసాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి.” అని అన్నాడు దేవేంద్రుడు.

దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు.

“ఓ పితృ దేవతలారా! మానవుడు యజ్ఞములు చేయునపుడు మేషములను(మేకలు, గొర్రెలు) బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి.” అని అన్నాడు.

అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణము లను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి, అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకొంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.

రామా! మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమములో ప్రవేశించి ఆమెకు శాపవిమోచన కలిగిద్దాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటి దాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికి కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతం అయింది. ఆమె అందరికి కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు.

అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామ లక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేసారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు.

ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందు కున్నాడు.

గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్లిపోయాడు. రాముడు, లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ పంచాశః సర్గః (50) >>

Ayodhya Kanda Sarga 40 In Telugu – అయోధ్యాకాండ చత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 40

అయోధ్యాకాండ చత్వారింశః సర్గలో, భరతుడు కేకయదేశం నుండి తిరిగి వచ్చి తన తల్లి కైకేయితో మాట్లాడతాడు. తండ్రి దశరథుని మరణం, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లిన విషయాలు తెలిసి, భరతుడు దిగ్భ్రాంతి చెందుతాడు. కైకేయి చేసిన ఈ పాపకార్యాల పట్ల భరతుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తల్లి చర్యలను తిడతాడు, ఆమెకు దుర్వచనాలు పలుకుతాడు. భరతుడు రాముని రాజ్యం తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. తన తల్లి కైకేయిని క్షమించలేడని, రాముడిని రాజ్యానికి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, సోదర ప్రేమను, తల్లి చర్యల పట్ల అతని ప్రతిస్పందనను చూపిస్తుంది.

పౌరాద్యనువ్రజ్యా

అథ రామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాంజలిః |
ఉపసంగృహ్య రాజానం చక్రుర్దీనాః ప్రదక్షిణమ్ || ౧ ||

తం చాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞః సీతయా సహ |
రాఘవః శోకసమ్మూఢో జననీమభ్యవాదయత్ || ౨ ||

అన్వక్షం లక్ష్మణో భ్రాతుః కౌసల్యామభ్యవాదయత్ |
అథ మాతుః సుమిత్రాయా జగ్రాహ చరణౌ పునః || ౩ ||

తం వందమానం రుదతీ మాతా సౌమిత్రిమబ్రవీత్ |
హితకామా మహాబాహుం మూర్ధ్న్యుపాఘ్రాయ లక్ష్మణమ్ || ౪ ||

సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్తః సుహృజ్జనే |
రామే ప్రమాదం మా కార్షీః పుత్ర భ్రాతరి గచ్ఛతి || ౫ ||

వ్యసనీ వా సమృద్ధో వా గతిరేష తవానఘ |
ఏష లోకే సతాం ధర్మో యజ్జ్యేష్ఠవశగో భవేత్ || ౬ ||

ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతనమ్ |
దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ || ౭ ||

లక్ష్మణం త్వేవముక్త్వా సా సంసిద్ధం ప్రియరాఘవమ్ |
సుమిత్రా గచ్ఛ గచ్ఛేతి పునః పునరువాచ తమ్ || ౮ ||

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్ |
అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్ || ౯ ||

తతః సుమంత్రః కాకుత్స్థం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ |
వినీతో వినయజ్ఞశ్చ మాతలిర్వాసవం యథా || ౧౦ ||

రథమారోహ భద్రం తే రాజపుత్ర మహాయశః |
క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి || ౧౧ ||

చతుర్దశ హి వర్షాణి వస్తవ్యాని వనే త్వయా |
తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాఽసి చోదితః || ౧౨ ||

తం రథం సూర్యసంకాశం సీతా హృష్టేన చేతసా |
ఆరురోహ వరారోహా కృత్వాలంఽకారమాత్మనః || ౧౩ ||

అథో జ్వలనసంకాశం చామీకరవిభూషితమ్ |
తమారురుహతుస్తూర్ణం భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౪ ||

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ || ౧౫ ||

తథైవాయుధజాలాని భ్రాతృభ్యాం కవచాని చ |
రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినం చ తత్ || ౧౬ ||

సీతాతృతీయానారూఢాన్దృష్ట్వా ధృష్టమచోదయత్ |
సుమంత్రః సమ్మతానశ్వాన్వాయువేగసమాంజవే || ౧౭ ||

ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే |
బభూవ నగరే మూర్ఛా బలమూర్ఛా జనస్య చ || ౧౮ ||

తత్సమాకులసంభ్రాంతం మత్తసంకుపితద్విపమ్ |
హయశింజితనిర్ఘోషం పురమాసీన్మహాస్వనమ్ || ౧౯ ||

తతః సబాలవృద్ధా సా పురీ పరమపీడితా |
రామమేవాభిదుద్రావ ఘర్మార్తా సలిలం యథా || ౨౦ ||

పార్శ్వతః పృష్ఠతశ్చాపి లంబమానాస్తదున్ముఖాః |
బాష్పపూర్ణముఖాః సర్వే తమూచుర్భృశనిస్వనాః || ౨౧ ||

సంయచ్ఛ వాజినాం రశ్మీన్సూత యాహి శనైః శనైః |
ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శం నో భవిష్యతి || ౨౨ ||

ఆయసం హృదయం నూనం రామమాతురసంశయమ్ |
యద్దేవగర్భప్రతిమే వనం యాతి న భిద్యతే || ౨౩ ||

కృతకృత్యా హి వైదేహీ ఛాయేవానుగతా పతిమ్ |
న జహాతి రతా ధర్మే మేరుమర్కప్రభా యథా || ౨౪ ||

అహో లక్ష్మణ సిద్ధార్థః సతతాం ప్రియవాదినమ్ |
భ్రాతరం దేవసంకాశం యస్త్వం పరిచరిష్యసి || ౨౫ ||

మహత్యేషా హి తే సిద్ధిరేష చాభ్యుదయో మహాన్ |
ఏష స్వర్గస్య మార్గశ్చ యదేనమనుగచ్ఛసి || ౨౬ ||

ఏవం వదంతస్తే సోఢుం న శేకుర్బాష్పమాగతమ్ |
నరాస్తమనుగచ్ఛంతః ప్రియమిక్ష్వాకునందనమ్ || ౨౭ ||

అథ రాజా వృతః స్త్రీభిర్దీనాభిర్దీనచేతనః |
నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్గృహాత్ || ౨౮ ||

శుశ్రువే చాగ్రతః స్త్రీణాం రుదంతీనాం మహాస్వనః |
యథా నాదః కరేణూనాం బద్ధే మహతి కుంజరే || ౨౯ ||

పితా హి రాజా కాకుత్స్థః శ్రీమాన్సన్నస్తదాఽభవత్ |
పరిపూర్ణః శశీ కాలే గ్రహేణోపప్లుతో యథా || ౩౦ ||

స చ శ్రీమానచింత్యాత్మా రామో దశరథాత్మజః |
సూతం సంచోదయామాస త్వరితం వాహ్యతామితి || ౩౧ ||

రామో యాహీతి సూతం తం తిష్ఠేతి స జనస్తదా |
ఉభయం నాశకత్సూతః కర్తుమధ్వని చోదితః || ౩౨ ||

నిర్గచ్ఛతి మహాబాహౌ రామే పౌరజనాశ్రుభిః |
పతితైరభ్యవహితం ప్రశశామ మహీరజః || ౩౩ ||

రుదితాశ్రుపరిద్యూనం హాహాకృతమచేతనమ్ |
ప్రయాణే రాఘవస్యాసీత్పురం పరమపీడితమ్ || ౩౪ ||

సుస్రావ నయనైః స్త్రీణామాస్రమాయాససంభవమ్ |
మీనసంక్షోభచలితైః సలిలం పంకజైరివ || ౩౫ ||

దృష్ట్వా తు నృపతిః శ్రీమానేకచిత్తగతం పురమ్ |
నిపపాతైవ దుఃఖేన హతమూల ఇవ ద్రుమః || ౩౬ ||

తతో హలహలాశబ్దో జజ్ఞే రామస్య పృష్ఠతః |
నరాణాం ప్రేక్ష్య రాజానం సీదంతం భృశదుఃఖితమ్ || ౩౭ ||

హా రామేతి జనాః కేచిద్రామమాతేతి చాపరే |
అంతఃపురం సమృద్ధం చ క్రోశంతః పర్యదేవయన్ || ౩౮ ||

అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసమ్ |
రాజానం మాతరం చైవ దదర్శానుగతౌ పథి || ౩౯ ||

స బద్ధ ఇవ పాశేన కిశోరో మాతరం యథా |
ధర్మపాశేన సంక్షిప్తః ప్రకాశం నాభ్యుదైక్షత || ౪౦ ||

పదాతినౌ చ యానార్హావదుఃఖార్హౌ సుఖోచితౌ |
దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిమ్ || ౪౧ ||

న హి తత్పురుషవ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితుః |
మాతుశ్చ సహితుం శక్తస్తోత్రార్దిత ఇవ ద్విపః || ౪౨ ||

ప్రత్యగారమివాయాంతీ వత్సలా వత్సకారణాత్ |
బద్ధవత్సా యథా ధేనుః రామమాతాఽభ్యాధావత || ౪౩ ||

తథా రుదంతీం కౌసల్యాం రథం తమనుధావతీమ్ |
క్రోశంతీం రామ రామేతి హా సీతే లక్ష్మణేతి చ || ౪౪ ||

రామలక్ష్మణసీతార్థం స్రవంతీం వారి నేత్రజమ్ |
అసకృత్ప్రైక్షత స తాం నృత్యంతీమివ మాతరమ్ || ౪౫ ||

తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః |
సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివ చాంతరా || ౪౬ ||

నాశ్రౌషమితి రాజానముపాలబ్ధోఽపి వక్ష్యసి |
చిరం దుఃఖస్య పాపిష్ఠమితి రామస్తమబ్రవీత్ || ౪౭ ||

రామస్య స వచః కుర్వన్ననుజ్ఞాప్య చ తం జనమ్ |
వ్రజతోఽపి హయాన్ శీఘ్రం చోదయామాస సారథిః || ౪౮ ||

న్యవర్తత జనో రాజ్ఞో రామం కృత్వా ప్రదక్షిణమ్ |
మనసాప్యశ్రువేగైశ్చ న న్యవర్తత మానుషమ్ || ౪౯ ||

యమిచ్ఛేత్పునరాయాంతం నైనం దూరమనువ్రజేత్ |
ఇత్యమాత్యా మహారాజమూచుర్దశరథం వచః || ౫౦ ||

తేషాం వచః సర్వగుణోపపన్నం
ప్రస్విన్నగాత్రః ప్రవిషణ్ణరూపః |
నిశమ్య రాజా కృపణః సభార్యో
వ్యవస్థితస్తం సుతమీక్షమాణః || ౫౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చత్వారింశః సర్గః || ౪౦ ||

Ayodhya Kanda Sarga 40 Meaning In Telugu

సీతారామలక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధం అయింది. వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేసారు. సాష్టాంగ పడ్డారు. ఆయన పాదములు తాకారు. దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు. వనవాసానికి అనుమతి ఇచ్చాడు. తరువాత వారు కౌసల్యకు నమస్కరించారు. ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదముతీసుకున్నాడు. సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది.

“నాయనా లక్ష్మణా! రాముడు నీ అన్న వనవాస సమయము లో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఎందుకంటే సుఖదు:ఖము లలో రాముడే నీకు దిక్కు. రాముని నీ తండ్రి దశరథుని గా భావించు. ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు. నీ తల్లి తండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి. జాగ్రత్తగా వెళ్లిరా!” అనిపలికింది సుమిత్ర.

అందరూ రథము దగ్గరకు వచ్చారు. సుమంత్రుడు రథమువద్ద నిలబడి ఉన్నాడు. రాముని చూచి “రామా! రథము సిద్ధముగా ఉన్నది.
మీరు రథము ఎక్కండి. మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకొని వెళుతాను.” అని అన్నాడు సుమంత్రుడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కారు. రథములో దశరథుని ఆదేశము మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు, ఆభరణములు పెట్టబడి ఉన్నాయి. రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు, కత్తులు, డాలులు మొదలగునవి రథములో పెట్టించాడు దశరథుడు.
రథము బయలు దేరింది. రాముడు అరణ్యములకో పోవడం చూచి అయోధ్యప్రజలు విలపిస్తున్నారు. అయోధ్య అంతా శోక సముద్రములో మునిగిపోయింది. అందరూ రాముని రథము వెంట పరుగెత్తుతున్నారు. వెనక నుండి అరుస్తున్నారు.

“ఓ సుమంత్రా! రథము కొంచెం నెమ్మదిగా పోనీయవయ్యా. మేము రాముని ఆఖరుసారిగా చూడాలి.” అని అరుస్తున్నారు. ఇంకొంతమంది అక్కడక్కడా నిలబడి “కన్నకొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌసల్య ఎలా భరించింది.” అని అనుకుంటున్నారు. ఇంకొంత మంది “ఆహా! ఆ సీతది ఏమి అదృష్టము. రాముని వెన్నంటి అడవులకు వెళుతూ ఉంది. లక్ష్మణుడుకూడా ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఈ పధ్నాలుగేళ్లు రాముని వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడు.” అని వారి అదృష్టానికి పొంగిపోతున్నారు.

ఆ ప్రకారంగా అయోధ్యా ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. భవనముల పైన ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముని చూచి “పట్టాభిషేకము చేసుకోవాల్సినవాడు, అడవులకు వెళుతున్నాడు. ఏం విచిత్రము” అని శోకిస్తున్నారు.

అయోధ్యావాసుల శోకమును చూడలేక రాముడు “సుమంత్రా! రథమును తొందరగా తోలు. వీరి బాధ చూడలేకున్నాను.” అని అన్నాడు. కాని వెనక నుండి పౌరులు రథము ఆపమని అరుస్తున్నారు. ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు. రథము వేగమును అందుకోలేక చాలా మంది కిందపడి పోయారు. కొంతమంది మూర్ఛపోయారు. ఇంకొంతమంది పట్టువిడవకుండా రథము వెంట పరుగెత్తుతున్నారు.

రాముడు రథము మీద పోతూ ఉంటే, దశరథుడు, కౌసల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రధము వెంట కొంత దూరం వచ్చారు. ఇంక ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు. తన రథము వెంట నడిచివస్తున్న వారిని చూచి రాముడు కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నాడు. కాని బైటికి గంభీరంగా ఉన్నాడు. వారి బాధ చూడలేక రధమును తొందరగా పోనివ్వమన్నాడు.

కాని కౌసల్యమాత్రమూ రథము వెంట పరుగెత్తు తూనే ఉంది. “రామా రామా ఆగు రామా ఆగు” అంటూ అరుస్తూ ఉంది. రాముడు వెనక్కుతిరిగి తల్లిని చూచాడు. మనసు ఆగలేదు. కాని నిగ్రహించు కున్నాడు. వెనకనుండి కౌసల్యఅరుపులు సుమంత్రునికి వినిపిస్తున్నాయి. కాని రాముడు రథాన్ని ముందుకు పోనివ్వ మంటున్నాడు. సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు. రథం సాగిపోతూనే ఉంది. ఇంక రాముని వెంట నడవలేక, పరుగెత్తలేక కొంత మంది అయోధ్యా ప్రజలువెనుకకు తిరిగి వెళ్లిపోయారు. కాని మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండ బట్టలేక మరలా రథం వెంట నడుస్తున్నాడు. అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నాడు.

“మహారాజా! మనము ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటామో, వారిని ఎక్కువ దూరము సాగనంపకూడదు. కాబట్టి వెనకుకు పోదాముపదండి.” అని అన్నారు. మంత్రులమాటలను మన్నించాడు దశరథుడు. ఆగిపోయాడు. రాముడువెళ్లిన దారివెంట చూస్తున్నాడు. రథము ధూళి కనపడ్డమేరా చూస్తున్నాడు. రాముని రథము కనుచూపుమేర దాటిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలభైయవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకచత్వారింశః సర్గః (41) >>