Ayodhya Kanda Sarga 119 In Telugu – అయోధ్యాకాండ ఏకోనవింశతిశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 119

అయోధ్యాకాండలోని 119వ సర్గలో, రాముడు సీతను కళ్యాణం చేయడానికి రాజశ్రీను సమాధానపడిస్తారు. అంతేకానీ, కేకాయి తన తండ్రిని స్వీకరించి, రాజశ్రీ రాముడి రాజ్యం ప్రవేశిస్తుంది. అది ద్వారా, వారికి రాజ్య ప్రబంధనలో ప్రాముఖ్యతను అందించడానికి అవసరమైతుంది. వీటిని ఆశ్రయించడానికి అందుకుంటుంది. ఈ సర్గంలో రాముడు తన ప్రజలను సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు, తన కుటుంబసభలను ఉత్తమంగా నిర్వహించడానికి ఆసక్తి పెట్టుకుంటాడు.

దండకారణ్యప్రవేశః

అనసూయా తు ధర్మజ్ఞా శ్రుత్వా తాం మహతీం కథామ్ |
పర్యష్వజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలీమ్ || ౧ ||

వ్యక్తాక్షరపదం చిత్రం భాషితం మధురం త్వయా |
యథా స్వయమ్వరం వృత్తం తత్సర్వం హి శ్రుతం మయా |
రమేఽహం కథయా తే తు దృఢం మధురభాషిణి || ౨ ||

రవిరస్తం గతః శ్రీమానుపోహ్య రజనీం శివామ్ |
దివసం ప్రతికీర్ణానామాహారార్థం పతతిత్రణామ్ || ౩ ||

సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వనిః |
ఏతే చాప్యభిషేకార్ద్రా మునయః కలశోద్యతాః || ౪ ||

సహితా ఉపవర్తంతే సలిలాప్లుతవల్కలాః |
ఋషీణామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకమ్ || ౫ ||

కపోతాంగారుణో ధూమో దృశ్యతే పవనోద్ధతః |
అల్పపర్ణాహి తరవో ఘనీభూతాః సమంతతః || ౬ ||

విప్రకృష్టేఽపి దేశేఽస్మిన్న ప్రకాశంతి వై దిశః |
రజనీచరసత్త్వాని ప్రచరంతి సమంతతః || ౭ ||

తపోవనమృగా హ్యేతే వేదితీర్థేషు శేరతే |
సంప్రవృద్ధా నిశా సీతే నక్షత్రసమలంకృతా || ౮ ||

జోత్స్నాప్రావరణశ్చంద్రో దృశ్యతేఽభ్యుదితోఽంబరే |
గమ్యతామనుజానామి రామస్యానుచరీ భవ || ౯ ||

కథయంత్యా హి మధురం త్వయాఽహం పరితోషితా |
అలంకురు చ తావత్త్వం ప్రత్యక్షం మమ మైథిలి || ౧౦ ||

ప్రీతిం జనయ మే వత్సే దివ్యాలంకారశోభితా |
సా తథా సమలంకృత్య సీతా సురసుతోపమా || ౧౧ ||

ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభిముఖీ యయౌ |
తథా తు భూషితాం సీతాం దదర్శ వదతాం వరః || ౧౨ ||

రాఘవః ప్రీతిదానేన తపస్విన్యా జహర్ష చ |
న్యవేదయత్తతః సర్వం సీతా రామాయ మైథిలీ || ౧౩ ||

ప్రీతిదానం తపస్విన్యా వసనాభరణస్రజమ్ |
ప్రహృష్టస్త్వభవద్రామో లక్ష్మణశ్చ మహారథః || ౧౪ ||

మైథిల్యాః సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభామ్ |
తతస్తాం శర్వరీం ప్రీతః పుణ్యాం శశినిభాననః || ౧౫ ||

అర్చితస్తాపసైః సిద్ధైరువాస రఘునందనః |
తస్యాం రాత్ర్యాం వ్యతీతాయామభిషిచ్య హుతాగ్నికాన్ || ౧౬ ||

ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తాపసాన్ వనగోచరాన్ |
తావూచుస్తే వనచరాస్తాపసా ధర్మచారిణః || ౧౭ ||

వనస్య తస్య సంచారం రాక్షసైః సమభిప్లుతమ్ |
రక్షాంసి పురుషాదాని నానారూపాణి రాఘవ || ౧౮ ||

వసంత్యస్మిన్ మహారణ్యే వ్యాలాశ్చ రుధిరాశనాః |
ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా తాపసం ధర్మచారిణమ్ || ౧౯ ||

అదంత్యస్మిన్ మహారణ్యే తాన్నివారయ రాఘవ |
ఏష పంథా మహర్షీణాం ఫలాన్యాహరతాం వనే |
అనేన తు వనం దుర్గం గంతుం రాఘవ తే క్షమమ్ || ౨౦ ||

ఇతీవ తైః ప్రాంజలిభిస్తపస్విభిః
ద్విజైః కృతః స్వస్త్యయనః పరంతపః |
వనం సభార్యః ప్రవివేశ రాఘవః
సలక్ష్మణః సూర్యమివాభ్రమండలమ్ || ౨౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవింశతిశతతమః సర్గః || ౧౧౯ ||

Ayodhya Kanda Sarga 119 Meaning In Telugu

సీతారాముల కల్యాణ గాధను విన్న అనసూయ ఆనందంతో పరవశించిపోయింది. సీతను గాఢంగా కౌగలించుకొని ఆమె నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. అంతలోనే రాత్రిఅయింది. మునులు అందరూ వారి వారి సాయంకాల సంధ్యావందనారి కార్యక్రమములను ముగించుకొని తమ కుటీరములకు వస్తున్నారు. అంతలో చంద్రోదయము అయింది.

అనసూయ సీతను చూచి, “సీతా! ఇంక నీవు రాముని వద్దకు వెళ్లు. నేను ఇచ్చిన ఆభరణములను, వస్త్రములను నా ఎదుటనే అలంకరించుకో. నిన్ను చూచి ఆనందిస్తాను.” అన్నది అనసూయ. ఆమె కోరిక మేరకు సీత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను ధరించి, అనసూయకు నమస్కారము చేసింది. తరువాత సీత అనసూయ వద్ద సెలవు తీసుకొని రాముని వద్దకు వెళ్లింది.

సర్వాలంకార భూషిత అయిన సీతను చూచి రాముడు ఎంతో సంతోషించాడు. సీత కూడా అనసూయ తనకు ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను రాముని చూపించింది. మహాపతివ్రత అనసూయతో సత్కారమును పొందిన సీతను చూచి రాముడు లక్ష్మణుడు ఎంతో ఆనందించారు. రాముడు, సీత, చల్లని వెన్నెలలో ఆనందంగా విహరించారు.

ఆ రాత్రిగడిచిపోయింది. మరునాడు ఉదయము రామలక్ష్మణులు, ప్రాతఃసంధ్యావందనాది కార్యక్రములు ముగించు కున్నారు. తరువాత అక్కడ నివసించు ఋషుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మునులు రామలక్ష్మణులతో వారు ప్రయాణము చేయు మార్గములో రాక్షస బాధ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

“రామా! ఈ అరణ్యములో నరమాంసభక్షకులైన రాక్షసులు నివసిస్తున్నారు. వారినుంచి జాగ్రత్తగా ఉండు. ఒంటరిగా ఎవరైనా కనపడితే వారిని పట్టుకొని చంపి తింటారు. కాబట్టి మీ ముగ్గురూ ఒకటిగా ప్రయాణం చెయ్యండి. ఒంటరిగా ఉండవద్దు. సీతను ఒంటరిగా వదలవద్దు.”
రాముడు వారి సూచనలను అన్నీ శ్రద్ధగా విన్నాడు. వారి వద్ద సెలవు తీసుకొని సీత, లక్ష్మణునితో సహా అరణ్యములలోకి ప్రయాణం అయ్యాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
అయోధ్యాకాండము సర్వం సంపూర్ణము.

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

|| ఇత్యయోధ్యాకాండః సమాప్తః ||

Aranya Kanda Sarga 45 In Telugu – అరణ్యకాండ పంచచత్వారింశః సర్గః

Aranya Kanda Sarga 45 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచచత్వారింశః సర్గం రామాయణంలోని ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గంలో రాముడు సీతను వెతుకుతూ తిరుగుతాడు. మార్గంలో, అతను తీవ్ర విషాదంలో ఉన్న జటాయువును కనుగొంటాడు. జటాయువు రాముడికి సీతను అపహరించిన రావణుడి గురించి వివరించి, సీతను రక్షించే ప్రయత్నంలో తాను ఎలా గాయపడ్డాడో చెబుతాడు.

సీతాపారుష్యమ్

ఆర్తస్వరం తు తం భర్తుర్విజ్ఞాయ సదృశం వనే |
ఉవాచ లక్ష్మణం సీతా గచ్ఛ జానీహి రాఘవమ్ ||

1

న హి మే హృదయం స్థానే జీవితం వాఽవతిష్ఠతే |
క్రోశతః పరమార్తస్య శ్రుతః శబ్దో మయా భృశమ్ ||

2

ఆక్రందమానం తు వనే భ్రాతరం త్రాతుమర్హసి |
తం క్షిప్రమభిధావ త్వం భ్రాతరం శరణైషిణమ్ ||

3

రక్షసాం వశమాపన్నం సింహానామివ గోవృషమ్ |
న జగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనమ్ ||

4

తమువాచ తతస్తత్ర కుపితా జనకాత్మజా |
సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ ||

5

యస్త్వమస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసే |
ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే ||

6

లోభాన్మమ కృతే నూనం నానుగచ్ఛసి రాఘవమ్ |
వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తి తే ||

7

తేన తిష్ఠసి విస్రబ్ధస్తమపశ్యన్మహాద్యుతిమ్ |
కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ ||

8

కర్తవ్యమిహ తిష్ఠంత్యా యత్ప్రధానస్త్వమాగతః |
ఇతి బ్రువాణాం వైదేహీం బాష్పశోకపరిప్లుతామ్ ||

9

అబ్రవీల్లక్ష్మణస్త్రస్తాం సీతాం మృగవధూమివ |
పన్నగాసురగంధర్వదేవమానుషరాక్షసైః ||

10

అశక్యస్తవ వైదేహీ భర్తా జేతుం న సంశయః |
దేవి దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు ||

11

రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ |
దానవేషు చ ఘోరేషు న స విద్యేత శోభనే ||

12

యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమమ్ |
అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి ||

13

న త్వామస్మిన్వనే హాతుముత్సహే రాఘవం వినా |
అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి ||

14

త్రిభిర్లోకైః సముద్యుక్తైః సేశ్వరైరపి సామరైః |
హృదయం నిర్వృతం తేఽస్తు సంతాపస్త్యజ్యతామయమ్ ||

15

ఆగమిష్యతి తే భర్తా శీఘ్రం హత్వా మృగోత్తమమ్ |
న చ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్కృతః ||

16

గంధర్వనగరప్రఖ్యా మాయా సా తస్య రక్షసః |
న్యాసభూతాసి వైదేహి న్యస్తా మయి మహాత్మనా ||

17

రామేణ త్వం వరారోహే న త్వాం త్యక్తుమిహోత్సహే |
కృతవైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరైః ||

18

ఖరస్య నిధనాదేవ జనస్థానవధం ప్రతి |
రాక్షసా వివిధా వాచో విసృజంతి మహావనే ||

19

హింసావిహారా వైదేహి న చింతయితుమర్హసి |
లక్ష్మణేనైవముక్తా సా క్రుద్ధా సంరక్తలోచనా ||

20

అబ్రవీత్పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినమ్ |
అనార్యాకరుణారంభ నృశంస కులపాంసన ||

21

అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్ |
రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే ||

22

నైతచ్చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ యద్భవేత్ |
త్వద్విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు ||

23

సుదుష్టస్త్వం వనే రామమేకమేకోఽనుగచ్ఛసి |
మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా ||

24

తన్న సిధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా |
కథమిందీవరశ్యామం పద్మపత్రనిభేక్షణమ్ ||

25

ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనమ్ |
సమక్షం తవ సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యే న సంశయః ||

26

రామం వినా క్షణమపి న హి జీవామి భూతలే |
ఇత్యుక్తః పరుషం వాక్యం సీతయా రోమహర్షణమ్ ||

27

అబ్రవీల్లక్ష్మణః సీతాం ప్రాంజలిర్విజితేంద్రియః |
ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీ మమ ||

28

వాక్యమప్రతిరూపం తు న చిత్రం స్త్రీషు మైథిలి |
స్వభావస్త్వేష నారీణామేవం లోకేషు దృశ్యతే ||

29

విముక్తధర్మాశ్చపలాస్తీక్ష్ణా భేదకరాః స్త్రియః |
న సహే హీదృశం వాక్యం వైదేహీ జనకాత్మజే ||

30

శ్రోత్రయోరుభయోర్మేఽద్య తప్తనారాచసన్నిభమ్ |
ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతా వనేచరాః ||

31

న్యాయవాదీ యథాన్యాయముక్తోఽహం పరుషం త్వయా |
ధిక్త్వామద్య ప్రణశ్య త్వం యన్మామేవం విశంకసే ||

32

స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితమ్ |
గమిష్యే యత్ర కాకుత్స్థః స్వస్తి తేఽస్తు వరాననే ||

33

రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రా వనదేవతాః |
నిమిత్తాని హి ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే ||

34

అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః |
[* న వేత్యేతన్న జానామి వైదేహి జనకాత్మజే *] ||

35

లక్ష్మణేనైవముక్తా తు రుదంతీ జనకాత్మజా |
ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం బాష్పపరిప్లుతా ||

36

గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ |
ఆబంధిష్యేఽథవా త్యక్ష్యే విషమే దేహమాత్మనః ||

37

పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
న త్వహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే ||

38

ఇతి లక్ష్మణమాక్రుశ్య సీతా దుఃఖసమన్వితా |
పాణిభ్యాం రుదతీ దుఃఖాదుదరం ప్రజఘాన హ ||

39

తామార్తరూపాం విమనా రుదంతీం
సౌమిత్రిరాలోక్య విశాలనేత్రామ్ |
ఆశ్వాసయామాస న చైవ భర్తు-
-స్తం భ్రాతరం కించిదువాచ సీతా ||

40

తతస్తు సీతామభివాద్య లక్ష్మణః
కృతాంజలిః కించిదభిప్రణమ్య చ |
అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం
జగామ రామస్య సమీపమాత్మవాన్ ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 45 Meaning In Telugu PDF

మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో “హా సీతా! హా లక్షణా!” అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు, బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి…

లక్షణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు, కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా! అసంభవం. ఇదేదో రాక్షస మాయ. ఆ మాయలకు లోబడరాదు”అని నిర్ణయించుకున్నాడు.

కాని సీతలో స్త్రీ సహజమైన భయము ఆందోళనా మొదలయ్యాయి. వెంటనే లక్ష్మణుని పిలిచింది.

“లక్ష్మణా! విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు. మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టు ఉన్నారు. లేకపోతే అలా కేకలుపెట్టరు. నువ్వు సత్వరమే వెళ్లి మీ అన్నగారిని రక్షించు.” అని తొందర పెట్టింది.

సీత మాటలకు లక్ష్మణుడు చలించలేదు. మరలా సీత లక్ష్మణుని తొందర పెట్టింది. “లక్ష్మణా! నా మనసు అంతా ఆందోళనగా ఉంది. నా ప్రాణములు నిలవడం లేదు. తొందరగా వెళ్లు. ఏమయిందో తెలుసుకో. రాముని రక్షించు. రాముడు ఏ రాక్షసుల వాత పడ్డాడో. లేక పోతే అలా అరవడు. తొందరగా వెళ్లవయ్యా!!” అని తొందర పెట్టింది సీత.

అయినా లక్ష్మణుడు కదలలేదు. చుట్టు ఏమైనా ఆపద పొంచి ఉన్నదా అని పరికిస్తున్నాడు. అప్పుడు సీతలో అనుమాన బీజం మొలకెత్తింది. అనుమానం మనసులో నాటుకోవాలే కానీ, దానికి హద్దు ఉండదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది. అనుమానానికి కోపం తోడైతే ఇంక చెప్పేదేముంది. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు.

“లక్ష్మణా! ఏమీటా మౌనం. మీ అన్న అరుపులు నీకు వినపడలేదా! నేను చెప్పిన మాటలూ వినపడలేదా! నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా! నీ అన్నను రక్షించడానికి నీవు వెళ్లడం లేదంటే నీవు నీ అన్నకు మిత్రుడివి కావు. శత్రువు.

ఆ! నాకు అర్థం అయింది. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు. నీకు నా మీద దురాలోచన ఉండటం వలననే నీవు రాముని రక్షించడానికి వెళ్లడం లేదు. రాముడికి ఆపద కలగాలనీ, మరణించాలనీ నీవు కోరుకుంటున్నావు కదూ! రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు కదూ! నీకు రాముని మీద ఏ మాత్రం ప్రేమలేదు. నా మీద కోరిక ఉంది. అందుకే ఇలా చేస్తున్నావు.

లక్ష్మణా! అసలు నువ్వు మాతో అరణ్యాలకు ఎందుకు వచ్చినట్టు? రాముని రక్షించడానికే కదా! ఆ రాముడే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? లక్ష్మణా! నీకు రాముని రక్షించడమే ప్రధానమైన కర్తవ్యము అంతే కానీ నా ఎదురుగా నిలబడటం కాదు. నన్ను రక్షించడం కాదు ముఖ్యం. ముందు నీవు రాముని వద్దకు వెళ్లు. ఆపదలో ఉన్న రాముని రక్షించు.” అంటూ సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కిందపడిపోయింది.

అది చూచి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు. సీతతో ఇలా అన్నాడు. “ఓ విదేహ రాజపుత్రీ! ఊరడిల్లుము. రామునికి ఏమీ కాదు. రాముని రాక్షసులు గానీ, దేవతలు గానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, ఆఖరుకు మానవులు కానీ జయించలేరు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. యుద్ధములో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం. రాముని చంపడం ఎవరి తరమూ కాదు. రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్లడం క్షేమం కాదు. కాబట్టి నీ దు:ఖాన్ని వదిలిపెట్టు. నీ భర్త ఆ మృగాన్ని చంపి నీ తీసుకురాగలడు.

ఓ జనకరాజపుత్రి! సావధానంగా ఆలోచించు. అది రాముని కంఠస్వరము కాదు. రాక్షసుల మాయ. నా అనుమానము నిజం అయితే ఆ మాయా మృగము మారీచుడు. వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరిచిఉంటాడు. నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నిన్ను నా వద్ద ఉంచాడు. నిన్ను అంతేజాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది. అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు.

సీతా! మరొక మాట. రాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను అందరినీ చంపాడు. అది నీకు తెలుసు. ఆ కారణం చేత రాక్షసులు అంతా రాముడి మీద కోపంతో, శత్రుత్వంతో ఉన్నారు. రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు. వాటిని మనము పట్టించుకోకూడదు. కాబట్టి నీవు రాముని గూర్చి చింతపడవలదు. రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు. ” అని అన్నాడు. లక్ష్మణుడు.

లక్ష్మణుని మాటలు సీత చెవికి ఎక్కలేదు. ఆమెకు అనుమానము ఎక్కువ అయింది. కోపంతో లక్ష్మణునితో ఇలా అంది.

“ఓ లక్ష్మణా! నీవు రఘువంశములో చెడ బుట్టావు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది. ఈ అడవిలో రామునికి ప్రాణాపాయము ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది. అందుకే రామునికి సాయంగా వెళ్లను అంటున్నావు. నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఇంతకన్నా ఏమి కావాలి?

ఇది నీకు పుట్టిన బుద్ధా! లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా! ఏది ఏమైనా మీ కోరిక సిద్ధించదు. నేను మీకు దక్కను. మనసా వాచా కర్మణా రాముడినే కోరుకుంటున్న నేను మీకు వశం అవుతానని ఎలా అనుకున్నారు! నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బతకలేను. నీ ఎదుటనే ప్రాణత్యాగము చేసుకుంటాను.” అని వలా వలా ఏడుస్తోంది సీత.

లక్ష్మణునికి ఆమెను ఎలా ఓదార్చాలో, ఎలా అనునయించాలో, ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు.

“అమ్మా సీతా! నీకు ఎలా బదులు చెప్పాలో అర్థం కావడం లేదు. నీవు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. నీ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోకవిదితము. కాని నీవు జనకుని కుమార్తెవు. రాముని భార్యవు. నీవు కూడా ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నీ మాటలు నా చెవులలో ములుకుల వలె గుచ్చుకుంటూ ఉన్నాయి.

ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను. ఇంక సహించలేను. నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను. దీనికి ఈ వనదేవతలే సాక్షులు. కాని నీవే మనసులో దురాలోచన పెట్టుకొని నన్ను నిందిస్తున్నావు. నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెళుతున్నాను.

ఓ జనకరాజపుత్రీ! ఈ వనదేవతలే నీకు రక్షగా ఉందురు గాక! నీకు క్షేమం అగుగాక! ఓ సీతా! ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునములు కనపడటం లేదు. మరలా నేను, నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది. ” అని వెళ్లనా వద్దా అని తటపటాయిస్తున్నాడు లక్ష్మణుడు.

అది చూచి మరలా సీత సూటీ పోటీ మాటలు అనడం మొదలెట్టింది. “ఓ లక్ష్మణా! ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. రామునికి ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా! రామునికి జరగకూడనిది జరిగితే నేను గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకొని చస్తాను. లేదా ఆ ఎత్తైన పర్వతము మీదికి ఎక్కి కిందికి దూకుతాను. విషం తాగుతాను. అగ్నిలో దూకుతాను. చస్తాను. అంతేగానీ నేను పరపురుషుని నా పాదముతో కూడా తాకను.” అని నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత.

సీత ఏడుపు భరించలేకపోయాడు లక్ష్మణుడు. ఏమి అయితే అది అవుతుందని, సీతకు నమస్కరించాడు. మరలా మరలా వెనక్కు తిరిగి చూచుకుంటూ, కనులనిండా నీరు నిండగా, ఆ స్థలం వదిలి రాముని వెదుక్కుంటూ వెళ్లాడు లక్ష్మణుడు.

(ఇక్కడ ఒక మాట. మనకు అనుశ్రుతంగా ఉన్న కథలలో లక్ష్మణుడు ఆశ్రమము ముందు ఒక గీతగీచాడనీ, రావణుడు దగ్గర రాగానే ఆ గీత మంటలు విరజిమ్మింది అనీ, అందుకని రావణుడు సీతను గీతదాటి రమ్మన్నాడనీ, సీత గీత దాటగానే, తీసుకొని వెళ్లాడని, సీతను తాకకుండా ఆమె ఉన్న ప్రదేశమును మొత్తం పెకలించి తీసుకువెళ్లాడనీ, రావణుడు సీతను తాకితో భస్మం అయిపోతాడని శాపం ఉందనీ, అందుకని సీతను తాకకుండా తీసుకొని వెళ్లాడనీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అవే సినిమాలలో, టివిలలో కూడా చూపించారు. కాని వాల్మీకి రామాయణంలో ఇవన్నీ లేవు. లక్ష్మణుడు గీతా గీయలేదు. సీత గీత దాటనూ లేదు. రావణుడు సీతను మెడ కింద ఒక చెయ్యి, నడుము కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకొని రథం మీద కూర్చోపెట్టాడు. తాను కూర్చుని సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్లాడు.

(అట్లేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా) అని వాల్మీకి రామాయణంలో ఉంది.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షట్చత్వారింశః సర్గః (46)>>

Aranya Kanda Sarga 44 In Telugu – అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గః

Aranya Kanda Sarga 44 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గం రామాయణంలోని ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో రావణుడు సీతను అపహరించి తన రథంపై లంకకు తీసుకువెళతాడు. సీత రావణుడి చెరలో ఉండి రాముడిని ఆలోచిస్తూ దుఃఖిస్తుంది. మార్గమధ్యంలో, జటాయువు రావణుడిని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ రావణుడు అతనిని గాయపరుస్తాడు.

మారీచవంచనా

తథా తు తం సమాదిశ్య భ్రాతరం రఘునందనః |
బబంధాసిం మహాతేజా జాంబూనదమయత్సరుమ్ ||

1

తతస్త్ర్యవనతం చాపమాదాయాత్మవిభూషణమ్ |
ఆబధ్య చ కలాపౌ ద్వౌ జగామోదగ్రవిక్రమః ||

2

తం వంచయానో రాజేంద్రమాపతంతం నిరీక్ష్య వై |
బభూవాంతర్హితస్త్రాసాత్ పునః సందర్శనేఽభవత్ ||

3

బద్ధాసిర్ధనురాదాయ ప్రదుద్రావ యతో మృగః |
తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమానమివాగ్రతః ||

4

అవేక్ష్యావేక్ష్య ధావంతం ధనుష్పాణిం మహావనే |
అతివృత్తమిషోః పాతాల్లోభయానం కదాచన ||

5

శంకితం తు సముద్భ్రాంతముత్పతంతమివాంబరే |
దృశ్యమానమదృశ్యం చ వనోద్దేశేషు కేషుచిత్ ||

6

చిన్నాభ్రైరివ సంవీతం శారదం చంద్రమండలమ్ |
ముహూర్తాదేవ దదృశే ముహుర్దూరాత్ప్రకాశతే ||

7

దర్శనాదర్శనాదేవం సోఽపాకర్షత రాఘవమ్ |
సుదూరమాశ్రమస్యాస్య మారిచో మృగతాం గతః ||

8

ఆసీత్ క్రుద్ధస్తు కాకుత్స్థో వివశస్తేన మోహితః |
అథావతస్థే సంభ్రాంతశ్ఛాయామాశ్రిత్య శాద్వలే ||

9

స తమున్మాదయామాస మృగరూపో నిశాచరః |
మృగైః పరివృతో వన్యైరదూరాత్ ప్రత్యదృశ్యత ||

10

గ్రహీతుకామం దృష్ట్వైనం పునరేవాభ్యధావత |
తత్‍క్షణాదేవ సంత్రాసాత్ పునరంతర్హితోఽభవత్ ||

11

పునరేవ తతో దూరాద్వృక్షషండాద్వినిఃసృతమ్ |
దృష్ట్వా రామో మహాతేజాస్తం హంతుం కృతనిశ్చయః ||

12

భూయస్తు శరముద్ధృత్య కుపితస్తత్ర రాఘవః |
సూర్యరశ్మిప్రతీకాశం జ్వలంతమరిమర్దనః ||

13

సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బలీ |
తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పన్నగమ్ ||

14

ముమోచ జ్వలితం దీప్తమస్త్రం బ్రహ్మవినిర్మితమ్ |
శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః ||

15

మారీచస్యైవ హృదయం విభేదాశనిసన్నిభః |
తాలమాత్రమథోత్ప్లుత్య న్యపతత్స శరాతురః ||

16

వినదన్భైరవం నాదం ధరణ్యామల్పజీవితః |
మ్రియమాణస్తు మారీచో జహౌ తాం కృత్రిమాం తనుమ్ ||

17

స్మృత్వా తద్వచనం రక్షో దధ్యౌ కేన తు లక్ష్మణమ్ |
ఇహ ప్రస్థాపయేత్ సీతా శూన్యే తాం రావణో హరేత్ ||

18

స ప్రాప్తకాలమాజ్ఞాయ చకార చ తతః స్వరమ్ |
సదృశం రాఘవస్యైవ హా సీతే లక్ష్మణేతి చ ||

19

తేన మర్మణి నిర్విద్ధః శరేణానుపమేన చ |
మృగరూపం తు తత్త్యక్త్వా రాక్షసం రూపమాత్మనః ||

20

చక్రే స సుమహాకాయో మారీచో జీవితం త్యజన్ |
తతో విచిత్రకేయూరః సర్వాభరణభూషితః ||

21

హేమమాలీ మహాదంష్ట్రో రాక్షసోఽభూచ్ఛరాహతః |
తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనమ్ ||

22

రామో రుధిరసిక్తాంగం వేష్టమానం మహీతలే |
జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచః స్మరన్ ||

23

మారీచస్యైవ మాయైషా పూర్వోక్తం లక్ష్మణేన తు |
తత్తథా హ్యభవచ్చాద్య మారీచోఽయం మయా హతః ||

24

హా సీతే లక్ష్మణేత్యేవమాక్రుశ్య చ మహాస్వనమ్ |
మమార రాక్షసః సోఽయం శ్రుత్వా సీతా కథం భవేత్ ||

25

లక్ష్మణశ్చ మహాబాహుః కామవస్థాం గమిష్యతి |
ఇతి సంచింత్య ధర్మాత్మా రామో హృష్టతనూరుహః ||

26

తత్ర రామం భయం తీవ్రమావివేశ విషాదజమ్ |
రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరమ్ ||

27

నిహత్య పృషతం చాన్యం మాంసమాదాయ రాఘవః |
త్వరమాణో జనస్థానం ససారాభిముఖస్తదా ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుశ్చత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 44 Meaning In Telugu

ఈ విధంగా రాముడు లక్ష్మణునికి ఆ లేడిని చంపాలి అన్న తన నిర్ణయాన్ని, సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు. ధనర్బాణములను తీసుకున్నాడు. వీపుకు రెండు అమ్ములపొదులను కట్టుకున్నాడు.

ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు. ఇంక రాముడు తనను వేటాడటానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు. చెంగు చెంగున గెంతుతూ దూరంగా పారిపోయాడు. అది చూచి రాముడు ఆ మృగము వెంట పరుగెత్తాడు. మారీచుడు రామునికి చిక్కినట్టే చిక్కి మరలా దూరంగా పరుగెత్తుతున్నాడు. రాముడు తన బాణములతో దానిని కొడుతున్నాడు. ఆ బాణములను చిత్రవిచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరుగెడుతున్నాడు మారీచుడు. మెరుపు తీగవలె ఒక క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమౌతూ పారిపోతున్నాడు మారీచుడు.

రామునికి పట్టుదల పెరిగింది. ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ప్రకారంగా మారీచుడు రాముని పర్ణశాలకు దూరంగా తీసుకొని వెళ్లాడు. రామునికి విపరీతంగా కోపం వచ్చింది. ఒక చిన్న జింకపిల్ల తనకు చిక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు.

అప్పటికే రాముడు అలిసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మారీచుడు తనకు తానుగా మరి కొన్ని మృగములను సృష్టించుకొని ఆ లేళ్లగుంపులో తాను మెరిసిపోతూ రాముని ముందు తిరుగాడుతున్నాడు.

రామునికి కోపంపెరిగింది. లేచి మరలా పరుగెత్తాడు. మారీచుడూ అందకుండా పరుగెత్తాడు. రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించాడు. ఆ లేడికి గురిపెట్టి ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రము నిప్పులు కక్కుకుంటూ ఆ లేడిని తరుముతూ దూసుకుపోయింది. ఆ దివ్యాస్త్రము బారి నుండి మారీచుడు తప్పించుకోలేకపోయాడు. ఆ దివ్యాస్త్రము మారీచుని గుండెలు చీల్చింది. ఆ దెబ్బకు మారీచుడు పైకి ఎగిరి దబ్బున కిందపడ్డాడు.

మరణ కాలంలో మారీచునకు తన నిజస్వరూపము వచ్చింది. అప్పుడు మారీచునికి రావణుని మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ “హా సీతా! హా లక్షణా!”

అని బిగ్గరగా అరిచాడు. మారీచుడు తన భయంకరమైన రాక్షస స్వరూపముతో నేలమీద పడిపోయాడు. మారీచుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది.

లేడి రూపంలో తనను అంతదాకా తీసుకొని వచ్చిన రాక్షసుని చూచిన తరువాత రామునికి లక్ష్మణుని మాటలలో ఉన్న అంతరార్థం అవగతమయింది. అప్పుడు సీతకు ఏమయిందో అని కంగారు పడ్డాడు రాముడు. రామునికి సర్వం బోధపడింది.

“వీడు మారీచుడే. సందేహము లేదు. లక్ష్మణుని మాటలు యదార్థములు. అయినా వీడు చస్తూ “సీతా లక్ష్మణా” అని ఎందుకు అరిచాడు. ఆ అరుపులు విని సీత నా గురించి కంగారు పడదు కదా! ఈ అరుపులు విని లక్ష్మణుడు నాకు ఏమైనా ఆపద కలిగిందని అనుకోడు కదా!”

ఈ ఆలోచన రాగానే రాముడి మనసులో కీడు శంకించాడు. రాముని ఒళ్లు జలదరించింది. కొంచెం భయం కూడా కలిగింది. ఇప్పుడు తీసుకుపోడానికి లేడి లేదు. దాని చర్మం లేదు. అందుకని మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసమును, చర్మాన్ని తీసుకొని తన పర్ణశాల వైపు వెళుతున్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచచత్వారింశః సర్గః (45) >>

Aranya Kanda Sarga 43 In Telugu – అరణ్యకాండ త్రిచత్వారింశః సర్గః

Aranya Kanda Sarga 43 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిచత్వారింశః సర్గం రామాయణంలోని కీలక అధ్యాయం. ఈ సర్గంలో రావణుడు తన మాయవిలాసాలు ప్రదర్శించి మారీచుడిని సీతను అపహరించడానికి పంపిస్తాడు. మారీచుడు సువర్ణ మృగంగా మారి సీతను ఆకర్షిస్తాడు. సీత ఆ మృగాన్ని పట్టుకోవాలని రాముని కోరుతుంది. రాముడు ఆ మృగాన్ని తరమడానికి వెళతాడు, కానీ అది మాయమృగం అని తెలుసుకుంటాడు.

లక్ష్మణశంకాప్రతిసమాధానమ్

సా తం సంప్రేక్ష్య సుశ్రోణీ కుసుమాన్యపచిన్వతీ |
హైమరాజతవర్ణాభ్యాం పార్శ్వాభ్యాముపశోభితమ్ ||

1

ప్రహృష్టా చానవద్యాంగీ మృష్టహాటకవర్ణినీ |
భర్తారమభిచక్రంద లక్ష్మణం చాపి సాయుధమ్ ||

2

తయాఽఽహూతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్యా రామలక్ష్మణౌ |
వీక్షమాణౌ తు తం దేశం తదా దదృశతుర్మృగమ్ ||

3

శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ |
తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగమ్ ||

4

చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినా వనే |
అనేన నిహతా రాజన్ రాజానః కామరూపిణా ||

5

అస్య మాయావిదో మాయామృగరూపమిదం కృతమ్ |
భానుమత్ పురుషవ్యాఘ్ర గంధర్వపురసన్నిభమ్ ||

6

మృగో హ్యేవం విధో రత్నవిచిత్రో నాస్తి రాఘవ |
జగత్యాం జగతీనాథ మాయైషా హి న సంశయః ||

7

ఏవం బ్రువాణం కాకుత్స్థం ప్రతివార్య శుచిస్మితా |
ఉవాచ సీతా సంహృష్టా చర్మణా హృతచేతనా ||

8

ఆర్యపుత్రాభిరామోఽసౌ మృగో హరతి మే మనః |
ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి ||

9

ఇహాశ్రమపదేఽస్మాకం బహవః పుణ్యదర్శనాః |
మృగాశ్చరంతి సహితాః సృమరాశ్చమరాస్తథా ||

10

ఋక్షాః పృషతసంఘాశ్చ వానరాః కిన్నరాస్తథా |
విచరంతి మహాబాహో రూపశ్రేష్ఠా మనోహరాః ||

11

న చాస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగః పురా |
తేజసా క్షమయా దీప్త్యా యథాఽయం మృగసత్తమః ||

12

నానావర్ణవిచిత్రాంగో రత్నబిందుసమాచితః |
ద్యోతయన్ వనమవ్యగ్రం శోభతే శశిసన్నిభః ||

13

అహో రూపమహో లక్ష్మీః స్వరసంపచ్చ శోభనా |
మృగోఽద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవ మే ||

14

యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ |
ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి ||

15

సమాప్తవనవాసానాం రాజ్యస్థానాం చ నః పునః |
అంతఃపురవిభూషార్థో మృగ ఏష భవిష్యతి ||

16

భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి ||

17

జీవన్న యది తేఽభ్యేతి గ్రహణం మృగసత్తమః |
అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి ||

18

నిహతస్యాస్య సత్త్వస్య జాంబూనదమయత్వచి |
శష్పబృస్యాం వినీతాయామిచ్ఛామ్యహముపాసితుమ్ ||

19

కామవృత్తమిదం రౌద్రం స్త్రీణామసదృశం మతమ్ |
వపుషా త్వస్య సత్త్వస్య విస్మయో జనితో మమ ||

20

తేన కాంచనరోమ్ణా తు మణిప్రవరశృంగిణా |
తరుణాదిత్యవర్ణేన నక్షత్రపథవర్చసా ||

21

బభూవ రాఘవస్యాపి మనో విస్మయమాగతమ్ |
ఏవం సీతావచః శ్రుత్వా తం దృష్ట్వా మృగమద్భుతమ్ ||

22

లోభితస్తేన రూపేణ సీతాయా చ ప్రచోదితః |
ఉవాచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచః ||

23

పశ్య లక్ష్మణ వైదేహ్యాః స్పృహాం మృగగతామిమామ్ |
రూపశ్రేష్ఠతయా హ్యేష మృగోఽద్య న భవిష్యతి ||

24

న వనే నందనోద్దేశే న చైత్రరథసంశ్రయే |
కుతః పృథివ్యాం సౌమిత్రే యోఽస్య కశ్చిత్సమో మృగః ||

25

ప్రతిలోమానులోమాశ్చ రుచిరా రోమరాజయః |
శోభంతే మృగమాశ్రిత్య చిత్రాః కనకబిందుభిః ||

26

పశ్యాస్య జృంభమాణస్య దీప్తామగ్నిశిఖోపమామ్ |
జిహ్వాం ముఖాన్నిఃసరంతీం మేఘాదివ శతహ్రదామ్ ||

27

మసారగల్లర్కముఖః శంఖముక్తానిభోదరః |
కస్య నామాభిరూపోఽసౌ న మనో లోభయేన్మృగః ||

28

కస్య రూపమిదం దృష్ట్వా జాంబూనదమయం ప్రభో |
నానారత్నమయం దివ్యం న మనో విస్మయం వ్రజేత్ ||

29

[* కిం పునర్మైథిలీ సీతా బాలా నారీ న విస్మయేత్ | *]
మాంసహేతోరపి మృగాన్ విహారార్థం చ ధన్వినః |
ఘ్నంతి లక్ష్మణ రాజానో మృగయాయాం మహావనే ||

30

ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే |
ధాతవో వివిధాశ్చాపి మణిరత్నసువర్ణినః ||

31

తత్సారమఖిలం నౄణాం ధనం నిచయవర్ధనమ్ |
మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ ||

32

అర్థీ యేనార్థకృత్యేన సంవ్రజత్యవిచారయన్ |
తమర్థమర్థశాస్త్రజ్ఞాః ప్రాహురర్థ్యాశ్చ లక్ష్మణ ||

33

ఏతస్య మృగరత్నస్య పరార్ధ్యే కాంచనత్వచి |
ఉపవేక్ష్యతి వైదేహీ మయా సహ సుమధ్యమా ||

34

న కాదలీ న ప్రియకీ న ప్రవేణీ న చావికీ |
భవేదేతస్య సదృశీ స్పర్శనేనేతి మే మతిః ||

35

ఏష చైవ మృగః శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చరః |
ఉభావేతౌ మృగౌ దివ్యౌ తారామృగమహీమృగౌ ||

36

యది వాఽయం తథా యన్మాం భవేద్వదసి లక్ష్మణ |
మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోఽస్య వధో మయా ||

37

ఏతేన హి నృశంసేన మారీచేనాకృతాత్మనా |
వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాః ||

38

ఉత్థాయ బహవో యేన మృగయాయాం జనాధిపాః |
నిహతాః పరమేష్వాసాస్తస్మాద్వధ్యస్త్వయం మృగః ||

39

పురస్తాదిహ వాతాపిః పరిభూయ తపస్వినః |
ఉదరస్థో ద్విజాన్ హంతి స్వగర్భోఽశ్వతరీమివ ||

40

స కదాచిచ్చిరాల్లోభాదాససాద మహామునిమ్ |
అగస్త్యం తేజసా యుక్తం భక్ష్యస్తస్య బభూవ హ ||

41

సముత్థానే చ తద్రూపం కర్తుకామం సమీక్ష్య తమ్ |
ఉత్స్మయిత్వా తు భగవాన్ వాతాపిమిదమబ్రవీత్ ||

42

త్వయావిగణ్య వాతాపే పరిభూతాః స్వతేజసా |
జీవలోకే ద్విజశ్రేష్ఠాస్తస్మాదసి జరాం గతః ||

43

తదేతన్న భవేద్రక్షో వాతాపిరివ లక్ష్మణ |
మద్విధం యోఽతిమన్యేత ధర్మనిత్యం జితేంద్రియమ్ ||

44

భవేద్ధతోఽయం వాతాపిరగస్త్యేనేవ మాం గతః |
ఇహ త్వం భవ సన్నద్ధో యంత్రితో రక్ష మైథిలీమ్ ||

45

అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన |
అహమేనం వధిష్యామి గ్రహీష్యామ్యపి వా మృగమ్ ||

46

యావద్గచ్ఛామి సౌమిత్రే మృగమానయితుం ద్రుతమ్ |
పశ్య లక్ష్మణ వైదేహీం మృగత్వచి గతస్పృహామ్ ||

47

త్వచా ప్రధానయా హ్యేష మృగోఽద్య న భవిష్యతి |
అప్రమత్తేన తే భావ్యమాశ్రమస్థేన సీతయా ||

48

యావత్పృషతమేకేన సాయకేన నిహన్మ్యహమ్ |
హత్వైతచ్చర్మ చాదాయ శీఘ్రమేష్యామి లక్ష్మణ ||

49

ప్రదక్షిణేనాతిబలేన పక్షిణా
జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ |
భవాప్రమత్తః ప్రతిగృహ్య మైథిలీం
ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః ||

50

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రిచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 43 Meaning In Telugu PDF

ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయామృగము కనపడింది. సీతకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి.

“ఆర్యపుత్రా! లక్ష్మణా! రండి! త్వరగా రండి. ఇక్కడకు రండి. ఇటు చూడండి. ఈ లేడిని చూడండి. అబ్బా! ఎంత బాగుందో! ఎంత ముచ్చటగా ఉందో!” అని అరిచినట్టు పిలిచింది.

రాముడు, అక్ష్మణుడు గబగబా అక్కడకు వచ్చారు. సీత వారికి ఆ లేడిని చూపించింది. సీతతో పాటు రాముడు కూడా ఆ మృగమును చూచి ఆనందించాడు. కాని లక్ష్మణునికి ఆ మృగమును చూచి అనుమానం కలిగింది.

“రామా! ఈ మృగము సామాన్య మృగము మాదిరి లేదు. ఎవరో రాక్షసుడు ఈ మృగవేషము ధరించినట్టు కనపడుతూ ఉంది. ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి, వేటకు వచ్చిన రాజులను వంచించి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు. ఆ మారీచుడు ఈ మృగముకాదు. కదా! నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము ఎన్నో లేళ్లను చూచాము. కానీ ఇంతటి ప్రకాశవంతమైన, బంగారు వర్ణములో ఉన్న లేడిని చూడలేదు. ఇదేదో రాక్షస మాయగా ఉంది. అసలు ఇటువంటి లేడి భూలోకములో ఉంటుందా అని నా అనుమానము.

రామా! సందేహము లేదు. ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ఉంది. ఇది నిస్సంశయముగా మాయాలేడి. రాక్షస మాయ.” అని అన్నాడు లక్ష్మణుడు.

అప్పుడు సీత లక్ష్మణుని చూచి ఇలా అంది. “లక్ష్మణా! నీకు అన్నీ అనుమానాలే. అందమైన లేడి పిల్లను చూచి ఆనందించక అనుమా నిస్తావెందుకు. ఈ లేడి పిల్లను మన ఆశ్రమములో ఉంచి పెంచు కుందాము. రోజూ దీనితో నాకు కాలక్షేపము అవుతుంది.

రామా! నాకు ఆ లేడిని తెచ్చి ఇవ్వరా! ప్రాణములతోటి పట్టి తెండి. మన ఆశ్రమ ప్రాంతములో ఎన్నో లేళ్లు సంచరిస్తున్నాయి. కానీ అవి ఈ లేడి అంత అందంగా ఆకర్షణీయంగా లేవు. అసలు ఇలాంటి మృగమును నేను ఇంతవరకూ చూడలేదు. చూడండి. దాని శరీరం చిత్రవిచిత్రరంగులతో ఎలా మెరిసిపోతోందో! ఆ లేడి మనుషులను చూచి భయపడటం లేదు. నిర్భయంగా తిరుగుతూ ఉంది. దీనిని పెంచుకొని దీనితో వినోదించవలెనని నాకు కోరికగా ఉంది.

ఆహా! ఏమి రూపము! ఏమి సౌందర్యము. దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాధా! దీనిని చూడగానే నా మనసు దీని యందే లగ్నం అయింది. అది నా మనసు హరించింది. దీనిని వదిలి నేను ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నాను. కాబట్టి నాధా! దీనిని సజీవంగా పట్టి తెండి. మనము వనవాసకాలములో దీనితో వినోదించి, మరలా మనము అయోధ్యకు పోవునపుడు దీనిని మన వెంట అయోధ్యతీసుకొని పోవుదము. దీనిని చూచి అత్తయ్యగారు, భరతుడు, నా చెల్లెళ్లు ఎంతో సంతోషిస్తారు.

పోనీలెండి. ఈ మృగమును సజీవంగా పట్టుకోలేక పోతే, కనీసము దీని చర్మమును అన్నా నాకు బహుమతిగా ఇవ్వండి. నేను దాచుకుంటాను. నేను పూజచేసుకొనేటప్పుడు దీని మీద కూర్చుని పూజచేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు! స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు కోరకూడదను మాట నిజమే. కాని, ఈ బంగారు లేడిని చూచి కోరకుండా ఉండలేకపోతున్నాను. ఈ సారికి మన్నించండి.” అని గోముగా ప్రేమగా అడిగింది సీత.

రామునికి కూడా ఆ మృగమును చూస్తే ఆనందం కలిగింది. వెంటనే ఆశ్చర్యము కూడా కలిగింది. సీత ఆ మృగమును కావాలి అంటూ ఉంది. తనకు కూడా ఆ మృగమును వేటాడవలెనని కోరికగా ఉంది. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! సీత మాటలు విన్నావు కదా. సీతకు ఈ మృగము అంటే ఎంతో ఆసక్తిగా ఉంది. నాకు చూడ ఇటువంటి మృగమును మనము ఈ దండకారణ్యములో ఇంతవరకూ చూడలేదు. అంతే కాదు ఇది దేవలోకములో ఉండవలసిన మృగము. భూలోకములోకి ఎలా వచ్చిందో! అటువంటిది మన కంటపడింది. దీని ఒంటి మీద ఉన్న బంగారు చుక్కలు అతిమనోహరంగా ఉన్నాయి. అసలు ఇటువంటి మృగమును చూచి ఎవరు ఆనందించరు! ఈ మృగము అందరినీ ఆకర్షిస్తుంది.

లక్ష్మణా! సాధారణంగా రాజులు వినోదము కొరకు వేటకు పోయి ఇటువంటి మృగములను చంపుతారు. వాటి మాంసమును తింటారు. అది క్షత్రియులకు సహజము. కాబట్టి మనము ఈ మృగమును చంపి దాని చర్మమును సీతకు ఇస్తాము. నేను సీత ఈ మృగచర్మము మీద సుఖంగా ఆసీనులము అవుతాము. ఏ మృగ చర్మము కూడా దీని చర్మము అంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటాను.

పోనీ నీవు చెప్పినట్టు ఇది రాక్షస మాయ అని అనుకుంటే, మనము దీనిని వెంటనే చంపుదాము. ఆ రాక్షసుడు కూడా చస్తాడు. నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అనే రాక్షసుడు అయితే ఇంకా మంచిది. ఈ మారీచుడు ఇదివరకు ఈ దండ కారణ్యములో ఎంతో మంది మునులను తన మాయలతో చంపి తిన్నాడు. వీడే మారీచుడు అయితే అవశ్యం వీడిని చంపితీరాలి. వీడు చంపతగ్గవాడు కదా! ఇదివరలో అగస్త్యుడు వాతాపిని చంపినట్టు మనము మారీచుని చంపుదాము. వీడిపీడను, ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు, ఇక్కడ నివసించే ఋషులకు, లేకుండా చేద్దాము.

అలాకాకుండా, ఈ మృగము మామూలు మృగము అయితే దీనిని చంపి సీతకు చర్మము ఇద్దాము. ఇది రాక్షసుడు అయితే దీనిని చంపి ఇక్కడివారలకు రాక్షసపీడను విరగడ చేద్దాము. కాబట్టి దీనిని చంపడం అవశ్యం ఆచరించతగినది.

లక్ష్మణా! నేను ఈ మృగమును వేటాడి చంపుతాను. నేను వచ్చేదాకా నీవును సీతను రక్షిస్తూ ఉండు. నేను ఒక్కక్షణములో ఈ మృగమును చంపి దాని చర్మమును తీసుకొని వస్తాను. నీవుమాత్రము ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చువరకూ జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు. లక్ష్మణా! కావాలంటే జటాయువు సాయం తీసుకో. నీవు, జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి.” అని పలికాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గః (44) >>

Ayodhya Kanda Sarga 118 In Telugu – అయోధ్యాకాండ అష్టాదశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 118

అయోధ్యాకాండలోని 118వ సర్గలో, రావణుడు మారీచుని తన ప్రణాళిక వివరించి, సీతను అపహరించడానికి సహాయం చేయమని ఆదేశిస్తాడు. మారీచుడు మొదట ఈ ప్రణాళికకు విరోధం చూపినా, చివరికి రావణుని భయంతో అంగీకరిస్తాడు. మారీచుడు సువర్ణ మృగం రూపంలో పంచవటికి చేరుకుంటాడు. సీత ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యంతో రాముని దానిని పట్టుకోవాలని కోరుతుంది. రాముడు సీత కోరికను తీర్చడానికి ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెళతాడు. రాముడు వెళ్లిన తరువాత, లక్ష్మణుడు సీతను రక్షణ కోసం అక్కడే ఉండిపోతాడు. ఈ సర్గ సీతా అపహరణానికి పునాది వేస్తుంది, తద్వారా రామాయణ కథ కీలక మలుపు తిరుగుతుంది.

దివ్యాలంకారగ్రహణమ్

సా త్వేవముక్తా వైదేహీ త్వనసూయాఽనసూయయా |
ప్రతిపూజ్య వచో మందం ప్రవక్తుముపచక్రమే || ౧ ||

నైతదాశ్చర్య్యమార్యాయాః యన్మాం త్వమనుభాషసే |
విదితం తు మమాప్యేతద్యథా నార్యాః పతిర్గురుః || ౨ ||

యద్యప్యేష భవేద్భర్తా మమార్యే వృత్తవర్జితః |
అద్వైధముపచర్తవ్యస్తథాప్యేష మయా భవేత్ || ౩ ||

కిం పునర్యో గుణశ్లాఘ్యః సానుక్రోశో జితేంద్రియః |
స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్పితృవత్ప్రియః || ౪ ||

యాం వృత్తిం వర్తతే రామః కౌసల్యాయాం మహాబలః |
తామేవ నృపనారీణామన్యాసామపి వర్తతే || ౫ ||

సకృద్దృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సలః |
మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్ || ౬ ||

ఆగచ్ఛంత్యాశ్చ విజనం వనమేవం భయావహమ్ |
సమాహితం మే శ్వశ్ర్వా చ హృదయే తద్ధృతం మహత్ || ౭ ||

పాణిప్రదానకాలే చ యత్పురా త్వగ్నిసన్నిధౌ |
అనుశిష్టా జనన్యాఽస్మి వాక్యం తదపి మే ధృతమ్ || ౮ ||

నవీకృతం చ తత్సర్వం వాక్యైస్తే ధర్మచారిణి |
పతిశుశ్రూషణాన్నార్యాస్తపో నాన్యద్విధీయతే || ౯ ||

సావిత్రీ పతిశుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయతే |
తథావృత్తిశ్చ యాతా త్వం పతిశుశ్రూషయా దివమ్ || ౧౦ ||

వరిష్ఠా సర్వనారీణామేషా చ దివి దేవతా |
రోహిణీ న వినా చంద్రం ముహూర్తమపి దృశ్యతే || ౧౧ ||

ఏవంవిధాశ్చ ప్రవరాః స్త్రియో భర్తృదృఢవ్రతాః |
దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణా || ౧౨ ||

తతోఽనసూయా సంహృష్టా శ్రుత్వోక్తం సీతయా వచః |
శిరస్యాఘ్రాయ చోవాచ మైథిలీం హర్షయంత్యుత || ౧౩ ||

నియమైర్వివిధైరాప్తం తపో హి మహదస్తి మే |
తత్సంశ్రిత్య బలం సీతే ఛందయే త్వాం శుచిస్మితే || ౧౪ ||

ఉపపన్నం మనోజ్ఞం చ వచనం తవ మైథిలి |
ప్రీతా చాస్మ్యుచితం కిం తే కరవాణి బ్రవీహి మే || ౧౫ ||

తస్యాస్తద్వచనం శ్రుత్వా విస్మితా మందవిస్మయా
కృతమిత్యబ్రవీత్సీతా తపోబలసమన్వితామ్ || ౧౬ ||

సా త్వేవముక్తా ధర్మజ్ఞా తయా ప్రీతతరాఽభవత్ |
సఫలం చ ప్రహర్షం తే హంత సీతే కరోమ్యహమ్ || ౧౭ ||

ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ |
అంగరాగం చ వైదేహి మహార్హం చానులేపనమ్ || ౧౮ ||

మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ |
అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి || ౧౯ ||

అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ జనకాత్మజే |
శోభయిష్యసి భర్తారం యథా శ్రీర్విష్ణుమవ్యయమ్ || ౨౦ ||

సా వస్త్రమంగరాగం చ భూషణాని స్రజస్తథా |
మైథిలీ ప్రతిజగ్రాహ ప్రీతిదానమనుత్తమమ్ || ౨౧ ||

ప్రతిగృహ్య చ తత్ సీతా ప్రీతిదానం యశస్వినీ |
శ్లిష్టాంజలిపుటా తత్ర సముపాస్త తపోధనామ్ || ౨౨ ||

తథా సీతాసుపాసీనామనసూయా దృఢవ్రతా |
వచనం ప్రష్టుమారేభే కాంచిత్ ప్రియకథామను || ౨౩ ||

స్వయంవరే కిల ప్రాప్తా త్వమనేన యశస్వినా |
రాఘవేణేతి మే సీతే కథా శ్రుతిముపాగతా || ౨౪ ||

తాం కథాం శ్రోతుమిచ్ఛామి విస్తరేణ చ మైథిలి |
యథానుభూతం కార్త్స్న్యేన తన్మే త్వం వక్తుమర్హసి || ౨౫ ||

ఏవముక్తా తు సా సీతా తాం తతో ధర్మచారిణీమ్ |
శ్రూయతామితి చోక్త్వా వై కథయామాస తాం కథామ్ || ౨౬ ||

మిథిలాఽధిపతిర్వీరో జనకో నామ ధర్మవిత్ |
క్షత్రధర్మే హ్యభిరతో న్యాయతః శాస్తి మేదినీమ్ || ౨౭ ||

తస్య లాంగలహస్తస్య కర్షతః క్షేత్రమండలమ్ |
అహం కిలోత్థితా భిత్త్వా జగతీం నృపతేః సుతా || ౨౮ ||

స మాం దృష్ట్వా నరపతిర్ముష్టివిక్షేపతత్పరః |
పాంసుకుంఠితసర్వాంగీం జనకో విస్మితోఽభవత్ || ౨౯ ||

అనపత్యేన చ స్నేహాదంకమారోప్య చ స్వయమ్ |
మమేయం తనయేత్యుక్త్వా స్నేహో మయి నిపాతితః || ౩౦ ||

అంతరిక్షే చ వాగుక్తా ప్రతి మాఽమానుషీ కిల |
ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవ || ౩౧ ||

తతః ప్రహృష్టో ధర్మాత్మా పితా మే మిథిలాఽధిపః |
అవాప్తో విపులామృద్ధిం మామవాప్య నరాధిపః || ౩౨ ||

దత్తా చాస్మీష్టవద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణా |
తయా సంభావితా చాస్మి స్నిగ్ధయా మాతృసౌహృదాత్ || ౩౩ ||

పతిసంయోగసులభం వయో దృష్ట్వా తు మే పితా |
చింతామభ్యగమద్దీనో విత్తనాశాదివాధనః || ౩౪ ||

సదృశాచ్చాపకృష్టాచ్చ లోకే కన్యాపితా జనాత్ |
ప్రధర్షణమవాప్నోతి శక్రేణాపి సమో భువి || ౩౫ ||

తాం ధర్షణామదూరస్థాం దృష్ట్వా చాత్మని పార్థివః |
చింతాఽర్ణవగతః పారం నాససాదాప్లవో యథా || ౩౬ ||

అయోనిజాం హి మాం జ్ఞాత్వా నాధ్యగచ్ఛద్విచింతయన్ |
సదృశం చానురూపం చ మహీపాలః పతిం మమ || ౩౭ ||

తస్య బుద్ధిరియం జాతా చింతయానస్య సంతతమ్ |
స్వయం వరం తనూజాయాః కరిష్యామీతి ధీమతః || ౩౮ ||

మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మనా |
దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీ చాక్షయసాయకౌ || ౩౯ ||

అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాపి చ గౌరవాత్ |
తన్న శక్తా నమయితుం స్వప్నేష్వపి నరాధిపాః || ౪౦ ||

తద్ధనుః ప్రాప్య మే పిత్రా వ్యాహృతం సత్యవాదినా |
సమవాయే నరేంద్రాణాం పూర్వమామంత్ర్య పార్థివాన్ || ౪౧ ||

ఇదం చ ధనురుద్యమ్య సజ్యం యః కురుతే నరః |
తస్య మే దుహితా భార్యా భవిష్యతి న సంశయః || ౪౨ ||

తచ్చ దృష్ట్వా ధనుః శ్రేష్ఠం గౌరవాద్గిరిసన్నిభమ్ |
అభివాద్య నృపా జగ్మురశక్తాస్తస్య తోలనే || ౪౩ ||

సుదీర్ఘస్య తు కాలస్య రాఘవోఽయం మహాద్యుతిః |
విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః || ౪౪ ||

లక్ష్మణేన సహ భ్రాత్రా రామః సత్యపరాక్రమః |
విశ్వామిత్రస్తు ధర్మాత్మా మమ పిత్రా సుపూజితః || ౪౫ ||

ప్రోవాచ పితరం తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ |
సుతౌ దశరథస్యేమౌ ధనుర్దర్శనకాంక్షిణౌ || ౪౬ ||

ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికమ్ |
ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధనుః సముపానయత్ || ౪౭ ||

నిమేషాంతరమాత్రేణ తదానమ్య స వీర్యవాన్ |
జ్యాం సమారోప్య ఝటితి పూరయామాస వీర్యవత్ || ౪౮ ||

తేన పూరయతా వేగాన్మధ్యే భగ్నం ద్విధా ధనుః |
తస్య శబ్దోఽభవద్భీమః పతితస్యాశనేరివ || ౪౯ ||

తతోఽహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధినా |
నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమమ్ || ౫౦ ||

దీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః |
అవిజ్ఞాయ పితుశ్ఛందమయోధ్యాఽధిపతేః ప్రభోః || ౫౧ ||

తతః శ్వశురమామంత్ర్య వృద్ధం దశరథం నృపమ్ |
మమ పిత్రా త్వహం దత్తా రామాయ విదితాత్మనే || ౫౨ ||

మమ చైవానుజా సాధ్వీ ఊర్మిళా ప్రియదర్శనా |
భార్యాఽర్థే లక్ష్మణస్యాపి దత్తా పిత్రా మమ స్వయమ్ || ౫౩ ||

ఏవం దత్తాఽస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే |
అనురక్తాఽస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరమ్ || ౫౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశోత్తరశతతమః సర్గః || ౧౧౮ ||

Ayodhya Kanda Sarga 118 Meaning In Telugu

అత్రిమహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత, ఆమెతో ఇలా అన్నది. “పూజ్యురాలా! స్త్రీకి పతియే దైవము అన్న విషయం నాకు బాగా తెలుసు. భర్త గుణవంతుడైనా, గుణహీనుడైనా, నాకు పూజ్యుడే. అటువంటప్పుడు గుణవంతుడు, దయాగుణము కలవాడూ, ఇంద్రియములను జయించినవాడు, నా మీద అమితమైన ప్రేమకలవాడూ, ధర్మము తెలిసినవాడూ, నన్ను నా తల్లితండ్రులకంటే ఎక్కువగా ఆదరించేవాడు అయిన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను.

రాముడు నా మీదనే కాదు, తన తల్లి కౌసల్యమీదా, ఆయన ఇతర తల్లుల మీదా సమానమైన పూజ్యభావంతో ఉంటాడు. మా మామగారు దశరథునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. రాముడు వారి నందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు. వారేకాదు. నన్ను తప్ప లోకంలో మిగిలిన స్త్రీలనందరినీ మాతృ భావంతో చూస్తాడు. మీరు చెప్పినమాటలే నేను వనవాసమునకు వచ్చునపుడు మా అత్తగారు కౌసల్యాదేవిగారు కూడా చెప్పారు. అవి ఇంకా నా మనసులో మెదులుతున్నాయి.

అంతేకాదు, నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేసారు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ, అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మీరు కూడా నాడు సావిత్రి వలె పతిసేవలో తరించి ఉత్తమ లోకాలు పొందుతారు. పూర్వము కూడా ఎంతో మంది స్త్రీలు తమ భర్తలనుసేవించి తరించారు.”అని పలికింది సీత.

సీత మాటలకు అనసూయ ఎంతోసంతోషించింది. సీతను పొదివి పట్టుకొని ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. “అమ్మా సీతా! నేను ఎంతో తపశ్శక్తి సంపాదించాను. రాక రాక మా ఇంటికి వచ్చావు. నీకు ఏమైన కానుక ఇవ్వాలని ఉంది. నీకు ఇష్టమైనది ఏమైనా కోరుకో ఇస్తాను.” పలికింది అనసూయ.

“అమ్మా! మిమ్ములను చూడటం, కలుసుకోవడం, మీతో మాట్లాడటమే గొప్ప వరం. ఇంకా నాకు ఏమీ కావాలి. మీ సన్నిధిలో నేను తృప్తిగా ఉన్నాను.” అని పలికింది సీత. అనసూయ నవ్వింది. “సీతా! నీ మనోభావన. కానీ స్త్రీలకు అలంకారముల మీద మమకారము ఉంటుంది కదా. అందుకని నీకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, అంగరాగములు ఇస్తున్నాను. వాటిని అలంకరించుకో. నేను ఇచ్చే ఆభరణములు, వస్త్రములు దివ్యమైనవి. ఎన్నటికీ మాయవు, నలగవు. నిత్యనూతనంగా ఉంటాయి. వాటిని ధరించి నీ భర్తకు ఆనందము కలిగించు.” అని పలికి అనసూయ సీతకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, మైపూతలు తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చింది. సీత కూడా వాటిని భక్తితో తీసుకుంది. సీత అనసూయ పక్కనే కూర్చుని ఆమెను సేవించింది. ఇంక ఇద్దరూ పాత విషయాలను ముచ్చటించుకుంటున్నారు.

“సీతా! నీ వివాహం ఎలా జరిగింది. నీ తండ్రి నీకు స్వయంవరము ప్రకటించాడని విన్నాను. వాటి విశేషములు ఏమిటి నాకు చెప్పవా!” అని మాతృవాత్సల్యముతో అడిగింది. సీత కూడా తన పెళ్లినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. అనసూయకు ఇలా చెప్పసాగింది.
“అమ్మా! నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు. న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు. దాని కోసరం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట. అప్పుడు నేను ఆ నాగేటి చాలులో దొరికానట. నేను దొరికినప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినపడినదట “ఓరాజా! ఈ శిశువు మనుష్యజాతికి చెందినది కాదు. దేవతా కాంత. నీవు ఆమెను పుత్రికా ధర్మంతో పెంచు.” అని వినపడినదట.

తరువాత జనకుడు నన్ను తన కుమార్తె వలె పెంచి పెద్దచేసాడట. జనకుని భార్యకూడా నన్ను తన తల్లివలె ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిందట. ఇంతలో నాకు వివాహము చేయదగిన వయసు వచ్చింది. నా తండ్రి జనకునకు నా వివాహము గురించి దిగులు పట్టుకుంది. ఎందుకంటే నేను అయోనిజను. దేవతా అంశ కలదానిను. కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభం. ఆయనకు ఏమీ తోచలేదు. అందుకని నాకు స్వయం వరము అంతకు ముందు వరుణ దేవుడు మా తండ్రి జనకునకు ఒక దివ్యమైన ధనుస్సు, రెండు అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడు. ఆ ధనస్సు చాలా బరువైంది. ఎవరూ కనీసం కదపను కూడా కదపలేరు. ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం. అవి గుర్తుకు వచ్చాయి మా తండ్రిగారికి.

నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు. “ఈ థనుస్సు దివ్యమైనది. దీనిని ఎవరైతే ఎత్తి ఎక్కుపెట్ట గలరో,వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను. ఇందులో సంశయం లేదు.” అని ప్రకటించాడు.

ఎంతో మంది రాజులు ప్రయత్నించారు కానీ కనీసం ఆ ధనుస్సును కదల్చనుకూడా కదల్చ లేకపోయారు. ఇంక ఎత్తడం, ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యం అయింది. అందుకని రాజులందరూ ఆదివ్యమైన ధనుస్సుకు నమస్కరించి వెళ్లిపోయారు.

అలాచాలాకాలము గడిచింది. ఆ దివ్య ధనుస్సును ఎవరూ ఎత్తలేకపోయారు. ఎక్కుపెట్టలేకపోయారు. ఇంతలో రఘువంశము లో పుట్టిన రాముడు విశ్వామిత్రుని తో సహా మిథిలకు వచ్చాడు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను మా తండ్రికి పరిచయం చేసాడు.

“ఓ జనకమహారాజా! వీరు రామలక్ష్మణులు, అయోధ్యాధిపతి దశరథుని కుమారులు. నీ దగ్గర దివ్యమైన ధనుస్సు ఉందని విన్నాము. దానిని చూడటానికి వచ్చారు. ఆ ధనుస్సును వీరికి చూపించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

నా తండ్రి ఆ ధనుస్సును అతి కష్టం మీద అక్కడకు తెప్పించాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టాడు. నారి పట్టుకొని ఒక్కసారి ఆకర్ణాంతము లాగాడు. (ఎడమ చేతితో ధనుస్సు పట్టుకొని, కుడి చేతితో దానికి కట్టిన తాడు పట్టుకొని చెవి దాకా లాగడం.)

రాముడు లాగిన వేగానికి పిడుగు పడిన శబ్దం వచ్చింది. ఆ దివ్యమైన ధనుస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలయింది. నా తండ్రి జనకుడు ఎంతో సంతోషించాడు. తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము నన్ను రామునికి ఇచ్చి కన్యాదానము చేయ నిశ్చయించాడు. వెంటనే జలము తెమ్మని ఆదేశించాడు.

రాముడు తన తండ్రి అనుమతి లేనిదే వివాహము చేసుకోను అని అన్నాడు. వెంటనే దశరథునికి వర్తమానము పంపించారు. దశరథమహారాజు మిథిలానగరమునకు వచ్చాడు. నా జనకుడు నన్ను రామునికి ఇచ్చి వివాహము చేసాడు. నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేసాడు. ఆ విధంగా నా వివాహము రామునితో జరిగింది. అప్పటి నుండి నేను నా భర్త రాముని దైవము వలె పూజిస్తున్నాను.”అని తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపింది సీత.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనవింశతిశతతమః సర్గః (119) >>

Aranya Kanda Sarga 42 In Telugu – అరణ్యకాండ ద్విచత్వారింశః సర్గః

Aranya Kanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విచత్వారింశః సర్గం రామాయణంలోని మూడవ కాండలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ఉంటున్నారు. ఈ సందర్భంలో రావణుడి చెల్లెలు శూర్పణఖా రాముని చూసి అతనితో వివాహం చేసుకోవాలని కోరుతుంది. రాముడు ఆమెను తిరస్కరిస్తాడు, దాంతో శూర్పణఖా సీతకు హాని చేయాలని ప్రయత్నిస్తుంది.

స్వర్ణమృగప్రేక్షణమ్

ఏవముక్త్వా తు వచనం మారీచో రావణం తతః |
గచ్ఛావేత్యబ్రవీద్దీనో భయాద్రాత్రించరప్రభోః ||

1

దృష్టశ్చాహం పునస్తేన శరచాపాసిధారిణా |
మద్వధోద్యతశస్త్రేణ వినష్టం జీవితం చ మే ||

2

న హి రామం పరాక్రమ్య జీవన్ప్రతినివర్తతే |
వర్తతే ప్రతిరూపోఽసౌ యమదండహతస్య తే ||

3

కిం ను శక్యం మయా కర్తుమేవం త్వయి దురాత్మని |
ఏష గచ్ఛామ్యహం తాత స్వస్తి తేఽస్తు నిశాచర ||

4

ప్రహృష్టస్త్వభవత్తేన వచనేన స రావణః |
పరిష్వజ్య సుసంశ్లిష్టమిదం వచనమబ్రవీత్ ||

5

ఏతచ్ఛౌండీర్యయుక్తం తే మచ్ఛందాదివ భాషితమ్ |
ఇదానీమసి మారీచః పూర్వమన్యో నిశాచరః ||

6

ఆరుహ్యతామయం శీఘ్రం రథో రత్నవిభూషితః |
మయా సహ తథా యుక్తః పిశాచవదనైః ఖరైః ||

7

ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి |
తాం శూన్యే ప్రసభం సీతామానయిష్యామి మైథిలీమ్ ||

8

తతో రావణమారీచౌ విమానమివ తం రథమ్ |
ఆరుహ్య యయతుః శీఘ్రం తస్మాదాశ్రమమండలాత్ ||

9

తథైవ తత్ర పశ్యంతౌ పత్తనాని వనాని చ |
గిరీంశ్చ సరితః సర్వా రాష్ట్రాణి నగరాణి చ ||

10

సమేత్య దండకారణ్యం రాఘవస్యాశ్రమం తతః |
దదర్శ సహమరీచో రావణో రాక్షసాధిపః ||

11

అవతీర్య రథాత్తస్మాత్తతః కాంచనభూషణాత్ |
హస్తే గృహీత్వా మారీచం రావణో వాక్యమబ్రవీత్ ||

12

ఏతద్రామాశ్రమపదం దృశ్యతే కదలీవృతమ్ |
క్రియతాం తత్సఖే శీఘ్రం యదర్థం వయమాగతాః ||

13

స రావణవచః శ్రుత్వా మారీచో రాక్షసస్తదా |
మృగో భూత్వాఽఽశ్రమద్వారి రామస్య విచచార హ ||

14

స తు రూపం సమాస్థాయ మహదద్భుతదర్శనమ్ |
మణిప్రవరశృంగాగ్రః సితాసితముఖాకృతిః ||

15

రక్తపద్మోత్పలముఖ ఇంద్రనీలోత్పలశ్రవాః |
కించిదభ్యున్నతగ్రీవః ఇంద్రనీలదలాధరః ||

16

కుందేందువజ్రసంకాశముదరం చాస్య భాస్వరమ్ |
మధూకనిభపార్శ్వశ్చ పద్మకింజల్కసన్నిభః ||

17

వైడూర్యసంకాశఖురస్తనుజంఘః సుసంహతః |
ఇంద్రాయుధసవర్ణేన పుచ్ఛేనోర్ధ్వం విరాజతా ||

18

మనోహరః స్నిగ్ధవర్ణో రత్నైర్నానావిధైర్వృతః |
క్షణేన రాక్షసో జాతో మృగః పరమశోభనః ||

19

వనం ప్రజ్వలయన్రమ్యం రామాశ్రమపదం చ తత్ |
మనోహరం దర్శనీయం రూపం కృత్వా స రాక్షసః ||

20

ప్రలోభనార్థం వైదేహ్యా నానాధాతువిచిత్రితమ్ |
విచరన్ గచ్ఛతే తస్మాచ్ఛాద్వలాని సమంతతః ||

21

రూప్యైర్బిందుశతైశ్చిత్రో భూత్వా స ప్రియదర్శనః |
విటపీనాం కిసలయాన్ భంక్త్వాదన్ విచచార హ ||

22

కదలీగృహకం గత్వా కర్ణికారానితస్తతః |
సమాశ్రయన్మందగతిః సీతాసందర్శనం తథా ||

23

రాజీవచిత్రపృష్ఠః స విరరాజ మహామృగః |
రామాశ్రమపదాభ్యాశే విచచార యథాసుఖమ్ ||

24

పునర్గత్వా నివృత్తశ్చ విచచార మృగోత్తమః |
గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే ||

25

విక్రీడంశ్చ క్వచిద్భూమౌ పునరేవ నిషీదతి |
ఆశ్రమద్వారమాగమ్య మృగయూథాని గచ్ఛతి ||

26

మృగయూథైరనుగతః పునరేవ నివర్తతే |
సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాం గతః ||

27

పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ |
సముద్వీక్ష్య చ తం సర్వే మృగా హ్యన్యే వనేచరాః ||

28

ఉపగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశో దశ |
రాక్షసః సోఽపి తాన్వన్యాన్ మృగాన్ మృగవధే రతః ||

29

ప్రచ్ఛాదనార్థం భావస్య న భక్షయతి సంస్పృశన్ |
తస్మిన్నేవ తతః కాలే వైదేహీ శుభలోచనా ||

30

కుసుమాపచయవ్యగ్రా పాదపానభ్యవర్తత |
కర్ణికారానశోకాంశ్చ చూతాంశ్చ మదిరేక్షణా ||

31

కుసుమాన్యపచిన్వంతీ చచార రుచిరాననా |
అనర్హాఽరణ్యవాసస్య సా తం రత్నమయం మృగమ్ ||

32

ముక్తామణివిచిత్రాంగం దదర్శ పరమాంగనా |
సా తం రుచిరదంతోష్ఠీ రూప్యధాతుతనూరుహమ్ ||

33

విస్మయోత్ఫుల్లనయనా సస్నేహం సముదైక్షత |
స చ తాం రామదయితాం పశ్యన్ మాయామయో మృగః ||

34

విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనమ్ |
అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగమ్ |
విస్మయం పరమం సీతా జగామ జనకాత్మజా ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్విచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 42 Meaning In Telugu

అప్పటికి రెండు సార్లు రాముడి చేతిలో చావు తప్పించుకున్నా, మూడవసారి రాముడి చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకొని రావణుని వెంట బయలుదేరాడు మారీచుడు. ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు. అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడ్డాడు.

మారీచుని కౌగలించుకొని “మారీచా! నామాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడవు అనిపించుకున్నావు. నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారీచుడవు కావు. నీవు కూడా నాతో రా. రథం ఎక్కు. మనం ఇద్దరం రాముని ఆశ్రమం దాకా వెళదాము తరువాత తెలుసుగా. కాస్త సీతను ప్రలోభ పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పారిపో.

రామ లక్ష్మణులు అటు పోగానే నేను సీతను తీసుకొని ఇటు వచ్చేస్తాను.” అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు.

తరువాత రావణుడు, మారీచుడు ఇద్దరూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దండకారణ్యం వైపు ప్రయాణం సాగించారు. కొన్ని దినములు ప్రయాణించి ఇద్దరూ రాముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. రావణుడు, మారీచుడు ఇద్దరూ రథం దిగారు.

“మారీచా! అటు చూడు. అదే రాముని ఆశ్రమము అనుకుంటాను. నేనుచెప్పింది గుర్తు ఉంది కదా. ఆ ప్రకారం చెయ్యి నేను ఈ పరిసరాలలో దాక్కొని ఉంటాను.” అని అన్నాడు రావణుడు.

వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు వన్నెకల లేడి రూపం ధరించాడు. రాముని ఆశ్రమం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. సీత దృష్టి లో పడేట్టు సంచరిస్తున్నాడు. మారీచుడు ధరించిన ఆ లేడి రూపము చాలా సుందరంగా ఉంది. దాని ముఖము సగం తెల్లగా సగం నల్లగా ఉంది. మెడ కొంచెం ఎత్తుగా ఉంది. దాని శరీరము బంగారు రంగుతో మెరుస్తూ ఉంది.

ఆ లేడి అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అటు ఇటు పరుగెత్తుతూ, గెంతుతూ, భయం భయంగా చూస్తూ ఉంది. కాసేపు అలా ఆడుకొని, కొంచెం సేపు అలసటగా పడుకొంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయ లేడి.

ఇంతలో కొన్ని లేళ్లు అక్కడకు గుంపుగా వచ్చాయి. ఈ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది. కాని మిగిలిన లేళ్లు ఈ మాయలేడిని వాసన చూచి ఎందుకో దూరంగా పరుగెడుతున్నాయి. మారీచునకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరా కరా నమిలి తినాలని మహాకోరికగా ఉంది. కాని తాను ఉన్న పరిస్థితులలో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు.

అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చింది. ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది. ఇంతలో ఆ మాయలేడి సీత కంటపడింది. బంగారు వర్ణంతో మిలా మిలా మెరిసిపోతున్న ఆ లేడి వంక కుతూహలంగా చూచింది సీత. ఆ అరణ్యంలో అంతవరకూ అటువంటి లేడిని సీత చూడలేదు. అందుకని ఆశ్చర్యం ఆ లేడి వంక చూస్తూ ఉంది.

అమ్మయ్య వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచుడు. సీత దగ్గరగా వెళ్లి ఆమె తనను అందుకొనేటట్టు ఆమెకు దగ్గరగా అటు ఇటు తిరుగుతున్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>

Ayodhya Kanda Sarga 117 In Telugu – అయోధ్యాకాండ సప్తదశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 117

అయోధ్యాకాండలోని 117వ సర్గలో, శూర్పణఖా తన పరాభవం గురించి రావణుని చెబుతుంది. రాముడు, లక్ష్మణుడు ఖరుడు, దూషణుడు, త్రిశిరులను హతమార్చిన విషయాన్ని వివరిస్తుంది. రావణుడు ఆ వార్తలు విని తీవ్రంగా కోపంతో రగిలిపోతాడు. అతను సీత యొక్క సౌందర్యం గురించి విన్నప్పటి నుండి, ఆమెను తన భార్యగా చేసుకోవాలని సంకల్పిస్తాడు. రావణుడు మారీచుని సహాయంతో తన కూటి తంత్రాల ప్రణాళికను సిద్ధం చేస్తాడు. మారీచుడు స్వర్ణమృగ రూపంలో సీతను మోహింపజేయడానికి ముందుకు వస్తాడు. ఈ సర్గ రామాయణంలో కీలక మలుపు, ఎందుకంటే ఇది సీతాపహరణానికి దారితీస్తుంది, తద్వారా రాముని మరియు రావణుని మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతుంది.

సీతాపాతివ్రత్యప్రశంసా

రాఘవస్త్వథ యాతేషు తపస్విషు విచింతయన్ |
న తత్రారోచయద్వాసం కారణైర్బహుభిస్తదా || ౧ ||

ఇహ మే భరతో దృష్టో మాతరశ్చ సనాగరాః |
సా చ మే స్మృతిరన్వేతి తాన్నిత్యమనుశోచతః || ౨ ||

స్కంధావారనివేశేన తేన తస్య మహాత్మనః |
హయహస్తికరీషైశ్చోపమర్దః కృతో భృశమ్ || ౩ ||

తస్మాదన్యత్ర గచ్ఛామ ఇతి సంచింత్య రాఘవః |
ప్రాతిష్ఠత స వైదేహ్యా లక్ష్మణేన చ సంగతః || ౪ ||

సోఽత్రేరాశ్రమమాసాద్య తం వవందే మహాయశాః |
తం చాపి భగవానత్రిః పుత్రవత్ ప్రత్యపద్యత || ౫ ||

స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతమ్ |
సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాంత్వయత్ || ౬ ||

పత్నీం చ సమనుప్రాప్తాం వృద్ధామామంత్ర్య సత్కృతామ్ |
సాంత్వయామాస ధర్మజ్ఞః సర్వభూతహితే రతః || ౭ ||

అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీమ్ |
ప్రతిగృహ్ణీష్వ వైదేహీమబ్రవీదృషిసత్తమః || ౮ ||

రామాయ చాచచక్షే తాం తాపసీం ధర్మచారిణీమ్ |
దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరమ్ || ౯ ||

యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తితా |
ఉగ్రేణ తపసా యుక్తా నియమైశ్చాప్యలంకృతా || ౧౦ ||

దశవర్షసహస్రాణి యయా తప్తం మహత్తపః |
అనసూయా వ్రతైః స్నాతా ప్రత్యూహాశ్చ నివర్తితాః || ౧౧ ||

దేవకార్యనిమిత్తం చ యయా సంత్వరమాణయా |
దశరాత్రం కృతా రాత్రిః సేయం మాతేవ తేఽనఘ || ౧౨ ||

తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీమ్ |
అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా || ౧౩ ||

అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగతా |
ఏవం బ్రువాణం తమృషిం తథేత్యుక్త్వా స రాఘవః || ౧౪ ||

సీతామువాచ ధర్మజ్ఞామిదం వచనముత్తమమ్ |
రాజపుత్రి శ్రుతం త్వేతన్మునేరస్య సమీరితమ్ || ౧౫ ||

శ్రేయోఽర్థమాత్మనః శ్రీఘ్రమభిగచ్ఛ తపస్వినీమ్ |
సీతా త్వేతద్వచః శ్రుత్వా రాఘవస్య హితైషిణః || ౧౬ ||

తామత్రిపత్నీం ధర్మజ్ఞామభిచక్రామ మైథిలీ |
శిథిలాం వలితాం వృద్ధాం జరాపాండరమూర్ధజామ్ || ౧౭ ||

సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీ యథా |
తాం తు సీతా మహాభాగామనసూయాం పతివ్రతామ్ || ౧౮ ||

అభ్యవాదయదవ్యగ్రా స్వనామ సముదాహరత్ |
అభివాద్య చ వైదేహీ తాపసీం తామనిందితామ్ || ౧౯ ||

బద్ధాంజలిపుటా హృష్టా పర్యపృచ్ఛదనామయమ్ |
తతః సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీమ్ || ౨౦ ||

సాంత్వయంత్యబ్రవీద్ధృష్టా దిష్ట్యా ధర్మమవేక్షసే |
త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానమృద్ధిం చ భామిని || ౨౧ ||

అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్ఛసి |
నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః || ౨౨ ||

యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః |
దుఃశీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః || ౨౩ ||

స్త్రీణామార్యస్వభావానాం పరమం దైవతం పతిః |
నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహమ్ || ౨౪ ||

సర్వత్రయోగ్యం వైదేహి తపఃకృతమివావ్యయమ్ |
న త్వేనమవగచ్ఛంతి గుణదోషమసత్ స్త్రియః || ౨౫ ||

కామవక్తవ్యహృదయా భర్తృనాథాశ్చరంతి యాః |
ప్రాప్నువంత్యయశశ్చైవ ధర్మభ్రంశం చ మైథిలి || ౨౬ ||

అకార్యవశమాపన్నాః స్త్రియో యాః ఖలు తద్విధాః |
త్వద్విధాస్తు గుణైర్యుక్తాః దృష్టలోకపరావరాః |
స్త్రియః స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా || ౨౭ ||

తదేవమేనం త్వమనువ్రతా సతీ
పతివ్రతానాం సమయానువర్తినీ |
భవస్వ భర్తుః సహధర్మచారిణీ
యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి || ౨౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తరశతతమః సర్గః || ౧౧౭ ||

Ayodhya Kanda Sarga 117 Meaning In Telugu

మునులందరూ వెళ్లిపోయిన తరువాత రాముడు ఆలోచనలో పడ్డాడు. మునులు చెప్పినది నిజమే అనిపించింది. ఆ ప్రదేశంలో ఉండటం క్షేమం కాదనుకున్నాడు. దానికి తోడు రామునికి పాతజ్ఞాపకాలు వెంటాడ సాగాయి. ఆ పర్ణశాలలోనే రాముడు భరతుని, శత్రుఘ్నుని, తనతల్లులను కలుసుకున్నాడు. ఇప్పుడు వారు లేకపోవడంతో మాటి మాటికీ వారే మనసులో మెదులు తున్నారు. వారి జ్ఞాపకాలతోనే మనసు నిండిపోయింది. స్థలం మారితేనే గానీ ప్రయోజనం లేదు అని అనుకున్నాడు.

దానికి తోడు భరతుడు తన సేనలతో వచ్చిఅక్కడ ఉన్నాడు. వారు అక్కడ ఉన్న కాలంలో వారు వాడేసిన వ్యర్థ పదార్థాలు, గుర్రములు, ఏనుగులు వదిలిన మలమూత్రములతో ఆ ప్రదేశం అంతా దుర్గంధం వ్యాపించింది. ఆ కారణం చేత కూడా ఆ ప్రదేశం తమ నివాసమునకు అనుకూలంగా లేదు అని అనుకున్నాడు రాముడు.

అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో, లక్ష్మణునితోకలిసి అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్లాడు. అత్రి మహాముని రాముని తన కుమారుని వలె ఆదరించాడు. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు. తినడానికి ఫలములు ఇచ్చాడు. తన భార్య వృద్ధురాలు అయిన అనసూయకు రాముని, సీతను పరిచయం చేసాడు.

“రామా! ఈమె నా భార్య అనసూయ. నా సహధర్మచారిణి. ఒకసారి పది సంవత్సరములు కరువు వచ్చి లోకము అంతా దగ్ధము అయిపోతున్న సమయంలో, జనులకు ఫలములను జలములను ఇచ్చి కాపాడింది. ఈమె గొప్ప తపస్వి. ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సార్థక నామధేయురాలు. అసూయ అంటే ఏమిటో తెలియని అనసూయ. పైగా వృద్ధురాలు. సీతకు ఆమె గురించి చెప్పి పరిచయం చెయ్యి.” అని అన్నాడు అత్రి.

రాముడు సీతతో ఇలా అన్నాడు. “సీతా! విన్నావుగా మహాఋషి మాటలు. మహాతపస్వి అనసూయా దేవిని సేవించు. నీకు శుభం కలుగుతుంది.”అనిఅన్నాడు. వెంటనే సీత అనసూయవద్దకు వెళ్లి ఆమెకు ప్రదక్షణ పూర్వకంగా నమస్కారము చేసింది. తన పేరు, తన గురించి చెప్పుకుంది. వృద్ధురాలు అనసూయ కూడా సీతను ఆలింగనము చేసుకొని ఆమెను కుశలప్రశ్నలు వేసింది.

ఇంకా ఇలా అంది. “సీతా! నీవు ధర్మమును పాటిస్తున్నావు. అందుకే ఏ మాత్రంఅహంకారము, అభిజాత్యము, కోపం లేకుండా, నీ రాజభోగములను, ఐశ్వర్యమును వదిలిపెట్టి, పతి వెంట వనవాసము నకు వచ్చావు. నీ వంటి సౌభాగ్యవతి ఎక్కడా లేదు. తన భర్త రాజుగా రాజాంతఃపురములలో ఉన్నా, లేక వనములలో కష్టాలు పడుతూ ఉన్నా, తన భర్త పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా, భర్తను విడిచిపెట్టకుండా సదా అనుసరించి ఉంటుందో ఆ భార్య ఉత్తమలోకములను పొందుతుంది. ఉత్తమ స్త్రీలకు తన భర్త ధనవంతుడైనా, దరిద్రుడైనా, గుణవంతుడైనా, దురభ్యాసాలకు అలవాటు పడినవాడైనా, అతడే దైవము. అటువంటి స్త్రీ తన భర్తమును దైవము వలె పూజిస్తుంది. స్త్రీలకు భర్తను మించిన ఆప్త బంధువు వేరొకరు లేరు అనడంలో అతిశయోక్తిలేదు. కాని కొంత మంది స్త్రీలు కోరికలకు బానిసలై, తన భర్త తాను కోరిన కోరికలు తీర్చలేదని భర్తను నిరాదరిస్తుంటారు. భర్తలమీద అధికారము చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు ధర్మభ్రంశమును పొంది అపకీర్తి పాలవుతారు. (అనసూయ కైకను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్పిందా అనిపిస్తుంది.)

కాని నీ వంటి స్త్రీలు మంచి చెడ్డలను పరిశీలించి భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమలోకములు పొందుతారు. అందుకని నీవు కూడా ఎల్లప్పుడూ నీ భర్తనే అనుసరిస్తూ, భర్త మాట జవదాటకుండా, ఉత్తమ స్త్రీగా వర్ధిల్లు. దాని వలన నీకు కీర్తి, సౌభాగ్యము సంప్రాప్తిస్తాయి.”అని పలికింది అనసూయ.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టాదశోత్తరశతతమః సర్గః (118) >>

Ayodhya Kanda Sarga 116 In Telugu – అయోధ్యాకాండ షోడశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 116

అయోధ్యాకాండలోని 116వ సర్గలో, శూర్పణఖా తనతో జరిగిన అవమానాన్ని తన సోదరులైన ఖరుడు, దూషణుడు, త్రిశిరులకు తెలియజేస్తుంది. కోపంతో, వారు రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఖరుడు, దూషణుడు, త్రిశిరులు తమ సైన్యంతో కలిసి రాముడు, లక్ష్మణులపై దాడి చేస్తారు. రాముడు, లక్ష్మణుడు ధైర్యంగా పోరాడి, రాక్షస సైన్యాన్ని ఓడిస్తారు. ఈ యుద్ధంలో రాముడి ధైర్యం, శౌర్యం మరియు లక్ష్మణుడి పరాక్రమం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సీత రాముడి విజయం చూసి ఆనందిస్తుంది. ఈ సంఘటన రాముని పరాక్రమాన్ని, రాక్షసులపై అతని విజయాన్ని ప్రతిబింబిస్తుంది, తద్వారా రామాయణ కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

ఖరవిప్రకరణకథనమ్

ప్రతిప్రయాతే భరతే వసన్ రామస్తపోవనే |
లక్షయామాస సోద్వేగమథౌత్సుక్యం తపస్వినామ్ || ౧ ||

యే తత్ర చిత్రకూటస్య పురస్తాత్తాపసాశ్రమే |
రామమాశ్రిత్య నిరతాస్తానలక్షయదుత్సుకాన్ || ౨ ||

నయనైర్భుకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః |
అన్యోన్యముపజల్పంతః శనైశ్చక్రుర్మిథః కథాః || ౩ ||

తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్త్వాత్మని శంకితః |
కృతాంజలిరువాచేదమృషిం కులపతిం తతః || ౪ ||

న కచ్చిద్భగవన్ కించిత్పూర్వవృత్తమిదం మయి |
దృశ్యతే వికృతం యేన విక్రియంతే తపస్వినః || ౫ ||

ప్రమాదాచ్చరితం కచ్చిత్కించిన్నావరజస్య మే |
లక్ష్మణస్యర్షిభిర్దృష్టం నానురూపమివాత్మనః || ౬ ||

కచ్చిచ్ఛుశ్రూషమాణా వః శుశ్రూషణపరా మయి |
ప్రమదాభ్యుచితాం వృత్తిం సీతా యుక్తం న వర్తతే || ౭ ||

అథర్షిర్జరయా వృద్ధస్తపసా చ జరాం గతః |
వేపమాన ఇవోవాచ రామం భూతదయాపరమ్ || ౮ ||

కుతః కళ్యాణసత్త్వాయాః కళ్యాణాభిరతేస్తథా |
చలనం తాత వైదేహ్యాస్తపస్విషు విశేషతః || ౯ ||

త్వన్నిమిత్తమిదం తావత్తాపసాన్ ప్రతి వర్తతే |
రక్షోభ్యస్తేన సంవిగ్నాః కథయంతి మిథః కథాః || ౧౦ ||

రావణావరజః కశ్చిత్ ఖరో నామేహ రాక్షసః |
ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాననికేతనాన్ || ౧౧ ||

ధృష్టశ్చ జితకాశీ చ నృశంసః పురుషాదకః |
అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాత న మృష్యతే || ౧౨ ||

త్వం యదాప్రభృతి హ్యస్మిన్నాశ్రమే తాత వర్తసే |
తదాప్రభృతి రక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్ || ౧౩ ||

దర్శయంతి హి బీభత్సైః క్రూరైర్భీషణకైరపి |
నానారూపైర్విరూపైశ్చ రూపైర్వికృతదర్శనైః || ౧౪ ||

అప్రశస్తైరశుచిభిః సంప్రయోజ్య చ తాపసాన్ |
ప్రతిఘ్నంత్యపరాన్ క్షిప్రమనార్యాః పురతః స్థితాః || ౧౫ ||

తేషు తేష్వాశ్రమస్థానేష్వబుద్ధమవలీయ చ |
రమంతే తాపసాంస్తత్ర నాశయంతోఽల్పచేతసః || ౧౬ ||

అపక్షిపంతి స్రుగ్భాండానగ్నీన్ సించంతి వారిణా |
కలశాంశ్చ ప్రమృద్నంతి హవనే సముపస్థితే || ౧౭ ||

తైర్దురాత్మభిరామృష్టానాశ్రమాన్ ప్రజిహాసవః |
గమనాయాన్యదేశస్య చోదయంత్యృషయోఽద్యమామ్ || ౧౮ ||

తత్పురా రామ శారీరీముపహింసాం తపస్విషు |
దర్శయంతి హి దుష్టాస్తే త్యక్ష్యామ ఇమమాశ్రమమ్ || ౧౯ ||

బహుమూలఫలం చిత్రమవిదూరాదితో వనమ్ |
పురాణాశ్రమమేవాహం శ్రయిష్యే సగణః పునః || ౨౦ ||

ఖరస్త్వయ్యపి చాయుక్తం పురా తాత ప్రవర్తతే |
సహాస్మాభిరితో గచ్ఛ యది బుద్ధిః ప్రవర్తతే || ౨౧ ||

సకలత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ |
సమర్థస్యాపి వసతో వాసో దుఃఖమిహాద్య తే || ౨౨ ||

ఇత్యుక్తవంతం రామస్తం రాజపుత్రస్తపస్వినమ్ |
న శశాకోత్తరైర్వాక్యైరవరోద్ధుం సముత్సుకః || ౨౩ ||

అభినంద్య సమాపృచ్ఛ్య సమాధాయ చ రాఘవమ్ |
స జగామాశ్రమం త్యక్త్వా కులైః కులపతిః సహ || ౨౪ ||

రామః సంసాధ్య త్వృషిగణమనుగమనాత్
దేశాత్తస్మాత్ కులపతిమభివాద్య ఋషిమ్ |
సమ్యక్ప్రీతైస్తైరనుమత ఉపదిష్టార్థః
పుణ్యం వాసాయ స్వనిలయముపసంపేదే || ౨౫ ||

ఆశ్రమం త్వృషివిరహితం ప్రభుః
క్షణమపి న విజహౌ స రాఘవః |
రాఘవం హి సతతమనుగతాః
తాపసాశ్చార్షచరితధృతగుణాః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశోత్తరశతతమః సర్గః || ౧౧౬ ||

Ayodhya Kanda Sarga 116 Meaning In Telugu

భరతుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు, సీత, వనవాసము చేస్తున్నారు. రాముడు అక్కడున్న ఋషుల మొహాల్లో ఏదోభయాన్ని చూచాడు. వారు ఆందోళనగా ఉన్నట్టు గమనించాడు. వారు ఆ ప్రదేశమును వదిలి వెళ్లబోతున్నట్టు తెలుసుకున్నాడు. రాముని చూచి వారు ఏదో గుసగుసగా రహస్యంగా మాట్లాడుకోవడం చూచాడు రాముడు.

రామునికి ఏమీ కావడం లేదు. తాము అక్కడ ఉండటం వలన ఆ ఋషులకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో అని అనుమాన పడ్డాడు. ఏమైనా సరే అనుమానము నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ఋషుల కందరిలోకీ పెద్దవాడి దగ్గరకు వెళ్లాడు. ఆయనకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు.

“మహాత్మా! గత కొద్దిరోజులుగా ఇక్కడ ఉన్న ఋషుల ప్రవర్తనలో ఏదో మార్పుకనపడుతూ ఉంది. కారణం తెలియడం లేదు. మా వల్ల ఏదైనా అపరాధము జరిగిందా? నా తమ్ముడు తమరి పట్ల ప్రమాదవశాత్తు అనుచితంగా ప్రవర్తించాడా! నా భార్య సీత తమరికి కూడా సేవలు చేస్తూ ఉంది కదా. ఆమెసేవలలో ఏమైనా లోపం కనిపించిందా! మా వల్ల ఏమైనా అపరాధము జరిగితే చెప్పండి సరిదిద్దుకుంటాము.” అని అన్నాడు రాముడు. దానికి ఆ వృద్ధుడైన ఋషి ఇలాఅన్నాడు. “రామా! నీ భార్య సీత కల్యాణి. కల్యాణ స్వభావము కలది. ఆమె వల్ల లోపం ఎందుకుంటుంది. కాని ఒకవిషయం నీకు చెప్పాలి. మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా. మీమీద రాక్షసులకు వైరము ఉంది. మీకూ రాక్షసులకు ఉన్న వైరము కారణంగా మా తాపసులకు ఏమైనా అపకారము కలుగుతుందేమో అని ఈ ఋషులు భయపడుతున్నారు. దాని గురించి వారు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. నీ ఎదుట పడి చెప్పడానికి భయపడుతున్నారు.

రామా! ఇక్కడ రావణుని తమ్ముడు ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు సామాన్యుడు కాడు. అతి క్రూరుడు. నరమాంస భక్షకుడు. మహావీరుడు. వాడు జనస్థానములో తపస్సు చేసుకుంటున్న ఋషులను అందరినీ చంపాడు. వాడికి నీ మీద కోపముగ ఉందని తెలిసింది. నీవు ఇక్కడకు వచ్చి పర్ణశాల నిర్మించుకొన్నది మొదలు ఆ రాక్షసుల బాధ ఎక్కువ అయింది.

రాక్షసులు మమ్ములను నానాబాధలకు గురి చేస్తున్నారు. వారు చూడటానికే భయంకరంగా ఉండే ఆకారాలతో వచ్చి మమ్ములను బాధిస్తున్నారు. మేము చేసు కొనే హోమములలో తినకూడని పదార్థములను వేస్తున్నారు. మా ఎదుటనే ఋషులను చంపుతూ మమ్ములను భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్లు ఎక్కడుంటారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. హటాత్తుగా వస్తారు.

అందినవాడిని అందినట్టు చంపుతారు. ఆనందంతో కేరింతలు కొడతారు. హెూమగుండంలో నీళ్లు పోసి ఆర్పుతారు. మేము వాడుకొనే పాత్రలు పగుల కొడతారు. తరువాత అందకుండా పారిపోతారు.

వారి బాధలు భరించలేకుండా ఉన్నాము. ఈ చోటు విడిచి వేరేచోటికి పోదామని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు మమ్ములను శారీరకంగా హింసిస్తున్నారు. వారి బాధలు పడలేకుండా ఉన్నాము. ఇక్కడికి సమీపములోనే మరొక అరణ్యము ఉంది. అక్కడ ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. మేము తపస్సు చేసుకోడానికి అక్కడ అనువుగా ఉంటుంది. అందుచేత అక్కడకు పోదామని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంతలో నువ్వే అడిగావు. అందుకని వివరంగా చెప్పాను.

ఆ ఖరుడు మమ్ములనే కాదు నిన్ను కూడా బాధించగలడు. నీకు కూడా ప్రాణాపాయము కలుగుతుంది. అందుకని నీకు ఇష్టం అయితే నువ్వు కూడా ఈ ప్రదేశము విడిచి మా వెంట వచ్చెయ్యి. ఎందుకంటే మీ తోపాటు నీ భార్యకూడా ఉంది. ఆమెను ఎల్లప్పుడూ రక్షించుకోడం కష్టం కదా! ఎప్పుడో ఒకప్పుడు ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న సీతకు రాక్షసుల వలన ఏదో ఒక ఆపద కలుగుతుంది. అందువలన మీరు ఇక్కడ ఉండటం అంతక్షేమంకాదు. ” అన్ని గబా గబా చెప్పాడు.

తరువాత ఆ మునులందరూ ఆ ప్రదేశమును విడిచి వెళ్లడానికి ఉద్యుక్తులవు తున్నారు. రాముడు మాత్రము అక్కడ నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకని ఆ మునులందరూ రాముని అక్కడే విడిచి వెళ్లిపోయారు. రాముడు కొంతదూరము వారితో వెళ్లి వారికి వీడ్కోలు చెప్పాడు. తిరిగి తన పర్ణశాల వద్దకు వచ్చాడు. ఆరోజుదాకా ఋషులతో వారి వేదఘోషలతో మార్మోగిన ఆ ప్రదేశములో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తదశోత్తరశతతమః సర్గః (117) >>

Ayodhya Kanda Sarga 115 In Telugu – అయోధ్యాకాండ పంచదశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 115

అయోధ్యాకాండలోని 115వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివాసం ఏర్పరుస్తారు. ఈ సర్గలో శూర్పణఖా అనే రాక్షసి రాముని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముని ప్రేమ కోసం ప్రాధేయపడుతుంది, కానీ రాముడు సీతపై తన ప్రేమను చూపిస్తూ ఆమెను తిరస్కరించుతాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడి వద్దకు వెళుతుంది, కానీ అతను కూడా ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా సీతను హాని చేయడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. ఈ సంఘటన రామాయణంలో కీలకంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాముడు మరియు రావణుని మధ్య శత్రుత్వానికి పునాది వేస్తుంది.

నందిగ్రామనివాసః

తతో నిక్షిప్య మాతౄః స అయోధ్యాయాం దృఢవ్రతః |
భరతః శోకసంతప్తో గురూనిదమథాబ్రవీత్ || ౧ ||

నందిగ్రామం గమిష్యామి సర్వానామంత్రయేఽద్య వః |
తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా || ౨ ||

గతశ్చ హి దివం రాజా వనస్థశ్చ గురుర్మమ |
రామం ప్రతీక్షే రాజ్యాయ స హి రాజా మహాయశాః || ౩ ||

ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః |
అబ్రువన్ మంత్రిణః సర్వే వసిష్ఠశ్చ పురోహితః || ౪ ||

సుభృశం శ్లాఘనీయం చ యదుక్తం భరత త్వయా |
వచనం భ్రాతృవాత్సల్యాదనురూపం తవైవ తత్ || ౫ ||

నిత్యం తే బంధులుబ్ధస్య తిష్ఠతో భ్రాతృసౌహృదే |
ఆర్యమార్గం ప్రపన్నస్య నానుమన్యేత కః పుమాన్ || ౬ ||

మంత్రిణాం వచనం శ్రుత్వా యథాఽభిలషితం ప్రియమ్ |
అబ్రవీత్సారథిం వాక్యం రథో మే యుజ్యతామితి || ౭ ||

ప్రహృష్టవదనః సర్వా మాతౄస్సమభివాద్య సః |
ఆరురోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్వితః || ౮ ||

ఆరుహ్య చ రథం శీఘ్రం శత్రుఘ్నభరతావుభౌ |
యయతుః పరమప్రీతౌ వృతౌ మంత్రిపురోహితైః || ౯ ||

అగ్రతో గురవస్తత్ర వసిష్ఠప్రముఖా ద్విజాః |
ప్రయయుః ప్రాఙ్ముఖాః సర్వే నందిగ్రామో యతోఽభవత్ || ౧౦ ||

బలం చ తదనాహూతం గజాశ్వరథసంకులమ్ |
ప్రయయౌ భరతే యాతే సర్వే చ పురవాసినః || ౧౧ ||

రథస్థః స హి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సలః |
నందిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే || ౧౨ ||

తతస్తు భరతః క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య సః |
అవతీర్య రథాత్తూర్ణం గురూనిదమువాచ హ || ౧౩ ||

ఏతద్రాజ్యం మమ భ్రాత్రా దత్తం సన్న్యాసవత్ స్వయమ్ |
యోగక్షేమవహే చేమే పాదుకే హేమభూషితే || ౧౪ ||

భరతః శిరసా కృత్వా సన్న్యాసం పాదుకే తతః |
అబ్రవీద్దుఃఖసంతప్తః సర్వం ప్రకృతిమండలమ్ || ౧౫ ||

ఛత్రం ధారయత క్షిప్రమార్యపాదావిమౌ మతౌ |
ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మః పాదుకాభ్యాం గురోర్మమ || ౧౬ ||

భ్రాత్రా హి మయి సన్న్యాసో నిక్షిప్తః సౌహృదాదయమ్ |
తమిమం పాలయిష్యామి రాఘవాగమనం ప్రతి || ౧౭ ||

క్షిప్రం సంయోజయిత్వా తు రాఘవస్య పునః స్వయమ్ |
చరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహపాదుకౌ || ౧౮ ||

తతో నిక్షిప్తభారోఽహం రాఘవేణ సమాగతః |
నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితామ్ || ౧౯ ||

రాఘవాయ చ సన్న్యాసం దత్త్వే మే వరపాదుకే |
రాజ్యం చేదమయోధ్యాం చ ధూతపాపో భవామి చ || ౨౦ ||

అభిషిక్తే తు కాకుత్స్థే ప్రహృష్టముదితే జనే |
ప్రీతిర్మమ యశశ్చైవ భవేద్రాజ్యాచ్చతుర్గుణమ్ || ౨౧ ||

ఏవం తు విలపన్ దీనో భరతః స మహాయశాః |
నందిగ్రామేఽకరోద్రాజ్యం దుఃఖితో మంత్రిభిః సహ || ౨౨ ||

స వల్కలజటాధారీ మునివేషధరః ప్రభుః |
నందిగ్రామేఽవసద్వీరః ససైన్యో భరతస్తదా || ౨౩ ||

రామాగమనమాకాంక్షన్ భరతో భ్రాతృవత్సలః |
భ్రాతుర్వచనకారీ చ ప్రతిజ్ఞాపారగస్తథా || ౨౪ ||

పాదుకే త్వభిషిచ్యాథ నంద్రిగ్రామేఽవసత్తదా |
భరతః శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ || ౨౫ ||

తతస్తు భరతః శ్రీమానభిషిచ్యార్యపాదుకే |
తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా || ౨౬ ||

తదా హి యత్కార్య్యముపైతి కించిత్
ఉపాయనం చోపహృతం మహార్హమ్ |
స పాదుకాభ్యాం ప్రథమం నివేద్య
చకార పశ్చాద్భరతో యథావత్ || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమః సర్గః || ౧౧౫ ||

Ayodhya Kanda Sarga 115 Meaning In Telugu

భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయ ములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.

తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామ మునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు.

వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.

భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. “గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు.”అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూటపదునైదవ సర్గ సంపూర్ణమ
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షోడశోత్తరశతతమః సర్గః (116) >>

Aranya Kanda Sarga 41 In Telugu – అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గః

Aranya Kanda Sarga 41 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు సీతను వెతికేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో, రాముడు తన సంకేత రింగ్‌ను హనుమంతుడికి ఇస్తాడు, ఇది సీతకు రాముడి గుర్తుగా ఉంటుంది. హనుమంతుడు ఆ రింగ్‌ను తీసుకుని లంకకు ప్రయాణిస్తాడు.

రావణనిందా

ఆజ్ఞప్తోఽరాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః |
అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపమ్ ||

1

కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణా |
సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర ||

2

కస్త్వయా సుఖినా రాజన్ నాభినందతి పాపకృత్ |
కేనేదముపదిష్టం తే మృత్యుద్వారముపాయతః ||

3

శత్రవస్తవ సువ్యక్తం హీనవీర్యా నిశాచరాః |
ఇచ్ఛంతి త్వాం వినశ్యంతముపరుద్ధం బలీయసా ||

4

కేనేదముపదిష్టం తే క్షుద్రేణాహితవాదినా |
యస్త్వామిచ్ఛతి నశ్యంతం స్వకృతేన నిశాచర ||

5

వధ్యాః ఖలు న హన్యంతే సచివాస్తవ రావణ |
యే త్వాముత్పథమారూఢం న నిగృహ్ణంతి సర్వశః ||

6

అమాత్యైః కామవృత్తో హి రాజా కాపథమాశ్రితః |
నిగ్రాహ్యః సర్వథా సద్భిర్న నిగ్రాహ్యో నిగృహ్యసే ||

7

ధర్మమర్థం చ కామం చ యశశ్చ జయతాం వర |
స్వామిప్రసాదాత్ సచివాః ప్రాప్నువంతి నిశాచర ||

8

విపర్యయే తు తత్సర్వం వ్యర్థం భవతి రావణ |
వ్యసనం స్వామివైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః ||

9

రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర |
తస్మాత్సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపాః ||

10

రాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నిశాచర |
న చాపి ప్రతికూలేన నావినీతేన రాక్షస ||

11

యే తీక్ష్ణమంత్రాః సచివా భజ్యంతే సహ తేన వై |
విషమే తురగాః శీఘ్రా మందసారథయో యథా ||

12

బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః |
పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః ||

13

స్వామినా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||

14

అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః |
యేషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియః ||

15

తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా |
అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి ||

16

మాం నిహత్య తు రామశ్చ న చిరాత్త్వాం వధిష్యతి |
అనేన కృతకృత్యోఽస్మి మ్రియే యదరిణా హతః ||

17

దర్శనాదేవ రామస్య హతం మాముపధారయ |
ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవమ్ ||

18

ఆనయిష్యసి చేత్ సీతామాశ్రమాత్ సహితో మయా |
నైవ త్వమసి నైహం చ నైవ లంకా న రాక్షసాః ||

19

నివార్యమాణస్తు మయా హితైషిణా
న మృష్యసే వాక్యమిదం నిశాచర |
పరేతకల్పా హి గతాయుషో నరా
హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితమ్ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 41 Meaning In Telugu

రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు. తను చెప్పిన పని చెయ్యకపోతే రావణుడు చంపుతాడు. ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు. అందుకని మరలా ఒకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అనుకున్నాడు మారీచుడు. అయితే ఈ సారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు.

“ఓ రావణా! నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు? వాళ్లు చెప్పినా నీవు ఎలా విన్నావు?నాకు తెలుసు. నీవు సుఖంగా ఉండటం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్లు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు. ఇంతకూ వారు ఎవరో నాకు తెలియాలి. నీ చావు చూడాలని కోరుకొనే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి.

రాముని శత్రువులు ఎవరో కానీ వాళ్లు రాముని చంపలేక, మహా పరాక్రమ వంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు. వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు. నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. వాళ్లు ఎవరో నాకు చెప్పు. వాళ్లు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపెయ్యి.

నీవు దారి తప్పి నడిచినా, నిన్ను సక్రమ మార్గంలో పెట్టే వాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరే వారు నీకు మంత్రులు, హితులు ఎలా అవుతారు? రాజు చెడ్డ మార్గంలో పోతుంటే, మంత్రులు రాజుకు హితం చెప్పి, మంచి మార్గంలో నడిచేట్టు చెయ్యాలి. అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను!

(మారీచుడు చెప్పిన ఈ మాటలు నేటికి కూడా వర్తిస్తాయి. ముఖ్యమంత్రి చెడు నిర్ణయాలు తీసుకుంటుంటే కాబినెట్ మంత్రులు అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే సెక్రటరీలు (ఐ.ఏ.యస్ ఆఫీసర్లు) వారికి మార్గనిర్దేశం చెయ్యాలి. వారి తప్పుడు నిర్ణయాలను అడ్డుకోవాలి. ప్రజాక్షేమాన్ని కాపాడాలి. కానీ ఈ నాడు జరుగుతున్నదేమిటి. ముఖ్యమంత్రికి కాబినెట్ మంత్రులు తాన అంటే తందానా అంటున్నారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. లేకపోతే వారి మంత్రి పదవులు పోతాయని భయం.

అలాగే సెక్రటరీలు మంత్రులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తప్పని తేలితే మాదేం లేదు అంతా మంత్రులు చెప్పినట్టే చేసాము అని సమర్ధించు కుంటున్నారు. మంత్రులు చెప్పింది చెయ్యడానికి ఐ.ఏ.యస్ లు ఎందుకు. గుమాస్తాలు చాలు కదా. పాలకులను సక్రమమార్గంలో నడిపించడమే కార్యదర్శుల పని. ఈ విషయాన్నే నాడు మారీచుడు రావణునికి స్పష్టంగా చెప్పాడు.)

రాజు మంచి వాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది. రాజు చెడ్డ వాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. రాజ్యానికి మూలం రాజు. అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి, రాజును రక్షించుకోవడం మంత్రులవిధి. ప్రజావ్యతిరేకుడైన రాజు, ప్రజలను పీడించేరాజు ప్రజాభిమానము చూరగొనలేడు. అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు.

రాజు మంచి వాడైనా, మంత్రులు చెడ్డ వారైతే, మంత్రుల చెడు సలహాల ఫలితంగా, రాజు కూడా వారితో పాటు నశించి పోతాడు. ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలవుతారు. ఇప్పుడు నీవు తీసుకునే ఈ నిర్ణయంతో నీతోపాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు.

ఓ రావణా! నాకు ఎటూ చావు తప్పదు. అది నాకు తెలుసు. నా బాధ అంతా నీ గురించే. పోతే నేను ఒక్కడినే పోతాను. కానీ నీవు, నీ ప్రజలు, సైన్యంతో సహా నశించిపోతావు. నీవు చెప్పిన పని నేను చేస్తాను. రాముడి చేతిలో చస్తాను. కాని నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు.

నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు. రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు. కాని సీతను అపహరించిన తరువాత, లంకను పాలించ డానికి నీవు ఉండవు అని తెలుసుకో!

కాబట్టి ఓ రావణా! ఇదే మన ఆఖరు సమావేశము. నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకొని వెళ్లగానే నేను చస్తాను. సీతను అపహరించగానే నీవు చస్తావు. అప్పుడు ఈ లంకా ఉండదు. ఈ రాక్షసులూ ఉండరు.

నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు. కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఇంక పోదాం పద.” అని అన్నాడు మారీచుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్విచత్వారింశః సర్గః (42) >>