అయోధ్యాకాండలోని 119వ సర్గలో, రాముడు సీతను కళ్యాణం చేయడానికి రాజశ్రీను సమాధానపడిస్తారు. అంతేకానీ, కేకాయి తన తండ్రిని స్వీకరించి, రాజశ్రీ రాముడి రాజ్యం ప్రవేశిస్తుంది. అది ద్వారా, వారికి రాజ్య ప్రబంధనలో ప్రాముఖ్యతను అందించడానికి అవసరమైతుంది. వీటిని ఆశ్రయించడానికి అందుకుంటుంది. ఈ సర్గంలో రాముడు తన ప్రజలను సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు, తన కుటుంబసభలను ఉత్తమంగా నిర్వహించడానికి ఆసక్తి పెట్టుకుంటాడు.
సీతారాముల కల్యాణ గాధను విన్న అనసూయ ఆనందంతో పరవశించిపోయింది. సీతను గాఢంగా కౌగలించుకొని ఆమె నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. అంతలోనే రాత్రిఅయింది. మునులు అందరూ వారి వారి సాయంకాల సంధ్యావందనారి కార్యక్రమములను ముగించుకొని తమ కుటీరములకు వస్తున్నారు. అంతలో చంద్రోదయము అయింది.
అనసూయ సీతను చూచి, “సీతా! ఇంక నీవు రాముని వద్దకు వెళ్లు. నేను ఇచ్చిన ఆభరణములను, వస్త్రములను నా ఎదుటనే అలంకరించుకో. నిన్ను చూచి ఆనందిస్తాను.” అన్నది అనసూయ. ఆమె కోరిక మేరకు సీత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను ధరించి, అనసూయకు నమస్కారము చేసింది. తరువాత సీత అనసూయ వద్ద సెలవు తీసుకొని రాముని వద్దకు వెళ్లింది.
సర్వాలంకార భూషిత అయిన సీతను చూచి రాముడు ఎంతో సంతోషించాడు. సీత కూడా అనసూయ తనకు ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను రాముని చూపించింది. మహాపతివ్రత అనసూయతో సత్కారమును పొందిన సీతను చూచి రాముడు లక్ష్మణుడు ఎంతో ఆనందించారు. రాముడు, సీత, చల్లని వెన్నెలలో ఆనందంగా విహరించారు.
ఆ రాత్రిగడిచిపోయింది. మరునాడు ఉదయము రామలక్ష్మణులు, ప్రాతఃసంధ్యావందనాది కార్యక్రములు ముగించు కున్నారు. తరువాత అక్కడ నివసించు ఋషుల వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మునులు రామలక్ష్మణులతో వారు ప్రయాణము చేయు మార్గములో రాక్షస బాధ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
“రామా! ఈ అరణ్యములో నరమాంసభక్షకులైన రాక్షసులు నివసిస్తున్నారు. వారినుంచి జాగ్రత్తగా ఉండు. ఒంటరిగా ఎవరైనా కనపడితే వారిని పట్టుకొని చంపి తింటారు. కాబట్టి మీ ముగ్గురూ ఒకటిగా ప్రయాణం చెయ్యండి. ఒంటరిగా ఉండవద్దు. సీతను ఒంటరిగా వదలవద్దు.”
రాముడు వారి సూచనలను అన్నీ శ్రద్ధగా విన్నాడు. వారి వద్ద సెలవు తీసుకొని సీత, లక్ష్మణునితో సహా అరణ్యములలోకి ప్రయాణం అయ్యాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచచత్వారింశః సర్గం రామాయణంలోని ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గంలో రాముడు సీతను వెతుకుతూ తిరుగుతాడు. మార్గంలో, అతను తీవ్ర విషాదంలో ఉన్న జటాయువును కనుగొంటాడు. జటాయువు రాముడికి సీతను అపహరించిన రావణుడి గురించి వివరించి, సీతను రక్షించే ప్రయత్నంలో తాను ఎలా గాయపడ్డాడో చెబుతాడు.
మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో “హా సీతా! హా లక్షణా!” అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు, బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి…
లక్షణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు, కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా! అసంభవం. ఇదేదో రాక్షస మాయ. ఆ మాయలకు లోబడరాదు”అని నిర్ణయించుకున్నాడు.
కాని సీతలో స్త్రీ సహజమైన భయము ఆందోళనా మొదలయ్యాయి. వెంటనే లక్ష్మణుని పిలిచింది.
“లక్ష్మణా! విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు. మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టు ఉన్నారు. లేకపోతే అలా కేకలుపెట్టరు. నువ్వు సత్వరమే వెళ్లి మీ అన్నగారిని రక్షించు.” అని తొందర పెట్టింది.
సీత మాటలకు లక్ష్మణుడు చలించలేదు. మరలా సీత లక్ష్మణుని తొందర పెట్టింది. “లక్ష్మణా! నా మనసు అంతా ఆందోళనగా ఉంది. నా ప్రాణములు నిలవడం లేదు. తొందరగా వెళ్లు. ఏమయిందో తెలుసుకో. రాముని రక్షించు. రాముడు ఏ రాక్షసుల వాత పడ్డాడో. లేక పోతే అలా అరవడు. తొందరగా వెళ్లవయ్యా!!” అని తొందర పెట్టింది సీత.
అయినా లక్ష్మణుడు కదలలేదు. చుట్టు ఏమైనా ఆపద పొంచి ఉన్నదా అని పరికిస్తున్నాడు. అప్పుడు సీతలో అనుమాన బీజం మొలకెత్తింది. అనుమానం మనసులో నాటుకోవాలే కానీ, దానికి హద్దు ఉండదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది. అనుమానానికి కోపం తోడైతే ఇంక చెప్పేదేముంది. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు.
“లక్ష్మణా! ఏమీటా మౌనం. మీ అన్న అరుపులు నీకు వినపడలేదా! నేను చెప్పిన మాటలూ వినపడలేదా! నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా! నీ అన్నను రక్షించడానికి నీవు వెళ్లడం లేదంటే నీవు నీ అన్నకు మిత్రుడివి కావు. శత్రువు.
ఆ! నాకు అర్థం అయింది. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు. నీకు నా మీద దురాలోచన ఉండటం వలననే నీవు రాముని రక్షించడానికి వెళ్లడం లేదు. రాముడికి ఆపద కలగాలనీ, మరణించాలనీ నీవు కోరుకుంటున్నావు కదూ! రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు కదూ! నీకు రాముని మీద ఏ మాత్రం ప్రేమలేదు. నా మీద కోరిక ఉంది. అందుకే ఇలా చేస్తున్నావు.
లక్ష్మణా! అసలు నువ్వు మాతో అరణ్యాలకు ఎందుకు వచ్చినట్టు? రాముని రక్షించడానికే కదా! ఆ రాముడే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? లక్ష్మణా! నీకు రాముని రక్షించడమే ప్రధానమైన కర్తవ్యము అంతే కానీ నా ఎదురుగా నిలబడటం కాదు. నన్ను రక్షించడం కాదు ముఖ్యం. ముందు నీవు రాముని వద్దకు వెళ్లు. ఆపదలో ఉన్న రాముని రక్షించు.” అంటూ సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కిందపడిపోయింది.
అది చూచి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు. సీతతో ఇలా అన్నాడు. “ఓ విదేహ రాజపుత్రీ! ఊరడిల్లుము. రామునికి ఏమీ కాదు. రాముని రాక్షసులు గానీ, దేవతలు గానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, ఆఖరుకు మానవులు కానీ జయించలేరు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. యుద్ధములో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం. రాముని చంపడం ఎవరి తరమూ కాదు. రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్లడం క్షేమం కాదు. కాబట్టి నీ దు:ఖాన్ని వదిలిపెట్టు. నీ భర్త ఆ మృగాన్ని చంపి నీ తీసుకురాగలడు.
ఓ జనకరాజపుత్రి! సావధానంగా ఆలోచించు. అది రాముని కంఠస్వరము కాదు. రాక్షసుల మాయ. నా అనుమానము నిజం అయితే ఆ మాయా మృగము మారీచుడు. వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరిచిఉంటాడు. నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నిన్ను నా వద్ద ఉంచాడు. నిన్ను అంతేజాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది. అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు.
సీతా! మరొక మాట. రాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను అందరినీ చంపాడు. అది నీకు తెలుసు. ఆ కారణం చేత రాక్షసులు అంతా రాముడి మీద కోపంతో, శత్రుత్వంతో ఉన్నారు. రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు. వాటిని మనము పట్టించుకోకూడదు. కాబట్టి నీవు రాముని గూర్చి చింతపడవలదు. రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు. ” అని అన్నాడు. లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలు సీత చెవికి ఎక్కలేదు. ఆమెకు అనుమానము ఎక్కువ అయింది. కోపంతో లక్ష్మణునితో ఇలా అంది.
“ఓ లక్ష్మణా! నీవు రఘువంశములో చెడ బుట్టావు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది. ఈ అడవిలో రామునికి ప్రాణాపాయము ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది. అందుకే రామునికి సాయంగా వెళ్లను అంటున్నావు. నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఇంతకన్నా ఏమి కావాలి?
ఇది నీకు పుట్టిన బుద్ధా! లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా! ఏది ఏమైనా మీ కోరిక సిద్ధించదు. నేను మీకు దక్కను. మనసా వాచా కర్మణా రాముడినే కోరుకుంటున్న నేను మీకు వశం అవుతానని ఎలా అనుకున్నారు! నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బతకలేను. నీ ఎదుటనే ప్రాణత్యాగము చేసుకుంటాను.” అని వలా వలా ఏడుస్తోంది సీత.
లక్ష్మణునికి ఆమెను ఎలా ఓదార్చాలో, ఎలా అనునయించాలో, ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు.
“అమ్మా సీతా! నీకు ఎలా బదులు చెప్పాలో అర్థం కావడం లేదు. నీవు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. నీ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోకవిదితము. కాని నీవు జనకుని కుమార్తెవు. రాముని భార్యవు. నీవు కూడా ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నీ మాటలు నా చెవులలో ములుకుల వలె గుచ్చుకుంటూ ఉన్నాయి.
ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను. ఇంక సహించలేను. నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను. దీనికి ఈ వనదేవతలే సాక్షులు. కాని నీవే మనసులో దురాలోచన పెట్టుకొని నన్ను నిందిస్తున్నావు. నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెళుతున్నాను.
ఓ జనకరాజపుత్రీ! ఈ వనదేవతలే నీకు రక్షగా ఉందురు గాక! నీకు క్షేమం అగుగాక! ఓ సీతా! ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునములు కనపడటం లేదు. మరలా నేను, నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది. ” అని వెళ్లనా వద్దా అని తటపటాయిస్తున్నాడు లక్ష్మణుడు.
అది చూచి మరలా సీత సూటీ పోటీ మాటలు అనడం మొదలెట్టింది. “ఓ లక్ష్మణా! ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. రామునికి ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా! రామునికి జరగకూడనిది జరిగితే నేను గోదావరిలో దూకుతాను. ఉరిపోసుకొని చస్తాను. లేదా ఆ ఎత్తైన పర్వతము మీదికి ఎక్కి కిందికి దూకుతాను. విషం తాగుతాను. అగ్నిలో దూకుతాను. చస్తాను. అంతేగానీ నేను పరపురుషుని నా పాదముతో కూడా తాకను.” అని నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత.
సీత ఏడుపు భరించలేకపోయాడు లక్ష్మణుడు. ఏమి అయితే అది అవుతుందని, సీతకు నమస్కరించాడు. మరలా మరలా వెనక్కు తిరిగి చూచుకుంటూ, కనులనిండా నీరు నిండగా, ఆ స్థలం వదిలి రాముని వెదుక్కుంటూ వెళ్లాడు లక్ష్మణుడు.
(ఇక్కడ ఒక మాట. మనకు అనుశ్రుతంగా ఉన్న కథలలో లక్ష్మణుడు ఆశ్రమము ముందు ఒక గీతగీచాడనీ, రావణుడు దగ్గర రాగానే ఆ గీత మంటలు విరజిమ్మింది అనీ, అందుకని రావణుడు సీతను గీతదాటి రమ్మన్నాడనీ, సీత గీత దాటగానే, తీసుకొని వెళ్లాడని, సీతను తాకకుండా ఆమె ఉన్న ప్రదేశమును మొత్తం పెకలించి తీసుకువెళ్లాడనీ, రావణుడు సీతను తాకితో భస్మం అయిపోతాడని శాపం ఉందనీ, అందుకని సీతను తాకకుండా తీసుకొని వెళ్లాడనీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అవే సినిమాలలో, టివిలలో కూడా చూపించారు. కాని వాల్మీకి రామాయణంలో ఇవన్నీ లేవు. లక్ష్మణుడు గీతా గీయలేదు. సీత గీత దాటనూ లేదు. రావణుడు సీతను మెడ కింద ఒక చెయ్యి, నడుము కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకొని రథం మీద కూర్చోపెట్టాడు. తాను కూర్చుని సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్లాడు.
(అట్లేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా) అని వాల్మీకి రామాయణంలో ఉంది.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుశ్చత్వారింశః సర్గం రామాయణంలోని ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో రావణుడు సీతను అపహరించి తన రథంపై లంకకు తీసుకువెళతాడు. సీత రావణుడి చెరలో ఉండి రాముడిని ఆలోచిస్తూ దుఃఖిస్తుంది. మార్గమధ్యంలో, జటాయువు రావణుడిని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ రావణుడు అతనిని గాయపరుస్తాడు.
ఈ విధంగా రాముడు లక్ష్మణునికి ఆ లేడిని చంపాలి అన్న తన నిర్ణయాన్ని, సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు. ధనర్బాణములను తీసుకున్నాడు. వీపుకు రెండు అమ్ములపొదులను కట్టుకున్నాడు.
ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు. ఇంక రాముడు తనను వేటాడటానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు. చెంగు చెంగున గెంతుతూ దూరంగా పారిపోయాడు. అది చూచి రాముడు ఆ మృగము వెంట పరుగెత్తాడు. మారీచుడు రామునికి చిక్కినట్టే చిక్కి మరలా దూరంగా పరుగెత్తుతున్నాడు. రాముడు తన బాణములతో దానిని కొడుతున్నాడు. ఆ బాణములను చిత్రవిచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరుగెడుతున్నాడు మారీచుడు. మెరుపు తీగవలె ఒక క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమౌతూ పారిపోతున్నాడు మారీచుడు.
రామునికి పట్టుదల పెరిగింది. ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ప్రకారంగా మారీచుడు రాముని పర్ణశాలకు దూరంగా తీసుకొని వెళ్లాడు. రామునికి విపరీతంగా కోపం వచ్చింది. ఒక చిన్న జింకపిల్ల తనకు చిక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు.
అప్పటికే రాముడు అలిసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మారీచుడు తనకు తానుగా మరి కొన్ని మృగములను సృష్టించుకొని ఆ లేళ్లగుంపులో తాను మెరిసిపోతూ రాముని ముందు తిరుగాడుతున్నాడు.
రామునికి కోపంపెరిగింది. లేచి మరలా పరుగెత్తాడు. మారీచుడూ అందకుండా పరుగెత్తాడు. రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించాడు. ఆ లేడికి గురిపెట్టి ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రము నిప్పులు కక్కుకుంటూ ఆ లేడిని తరుముతూ దూసుకుపోయింది. ఆ దివ్యాస్త్రము బారి నుండి మారీచుడు తప్పించుకోలేకపోయాడు. ఆ దివ్యాస్త్రము మారీచుని గుండెలు చీల్చింది. ఆ దెబ్బకు మారీచుడు పైకి ఎగిరి దబ్బున కిందపడ్డాడు.
మరణ కాలంలో మారీచునకు తన నిజస్వరూపము వచ్చింది. అప్పుడు మారీచునికి రావణుని మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ “హా సీతా! హా లక్షణా!”
అని బిగ్గరగా అరిచాడు. మారీచుడు తన భయంకరమైన రాక్షస స్వరూపముతో నేలమీద పడిపోయాడు. మారీచుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది.
లేడి రూపంలో తనను అంతదాకా తీసుకొని వచ్చిన రాక్షసుని చూచిన తరువాత రామునికి లక్ష్మణుని మాటలలో ఉన్న అంతరార్థం అవగతమయింది. అప్పుడు సీతకు ఏమయిందో అని కంగారు పడ్డాడు రాముడు. రామునికి సర్వం బోధపడింది.
“వీడు మారీచుడే. సందేహము లేదు. లక్ష్మణుని మాటలు యదార్థములు. అయినా వీడు చస్తూ “సీతా లక్ష్మణా” అని ఎందుకు అరిచాడు. ఆ అరుపులు విని సీత నా గురించి కంగారు పడదు కదా! ఈ అరుపులు విని లక్ష్మణుడు నాకు ఏమైనా ఆపద కలిగిందని అనుకోడు కదా!”
ఈ ఆలోచన రాగానే రాముడి మనసులో కీడు శంకించాడు. రాముని ఒళ్లు జలదరించింది. కొంచెం భయం కూడా కలిగింది. ఇప్పుడు తీసుకుపోడానికి లేడి లేదు. దాని చర్మం లేదు. అందుకని మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసమును, చర్మాన్ని తీసుకొని తన పర్ణశాల వైపు వెళుతున్నాడు రాముడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిచత్వారింశః సర్గం రామాయణంలోని కీలక అధ్యాయం. ఈ సర్గంలో రావణుడు తన మాయవిలాసాలు ప్రదర్శించి మారీచుడిని సీతను అపహరించడానికి పంపిస్తాడు. మారీచుడు సువర్ణ మృగంగా మారి సీతను ఆకర్షిస్తాడు. సీత ఆ మృగాన్ని పట్టుకోవాలని రాముని కోరుతుంది. రాముడు ఆ మృగాన్ని తరమడానికి వెళతాడు, కానీ అది మాయమృగం అని తెలుసుకుంటాడు.
ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయామృగము కనపడింది. సీతకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి.
“ఆర్యపుత్రా! లక్ష్మణా! రండి! త్వరగా రండి. ఇక్కడకు రండి. ఇటు చూడండి. ఈ లేడిని చూడండి. అబ్బా! ఎంత బాగుందో! ఎంత ముచ్చటగా ఉందో!” అని అరిచినట్టు పిలిచింది.
రాముడు, అక్ష్మణుడు గబగబా అక్కడకు వచ్చారు. సీత వారికి ఆ లేడిని చూపించింది. సీతతో పాటు రాముడు కూడా ఆ మృగమును చూచి ఆనందించాడు. కాని లక్ష్మణునికి ఆ మృగమును చూచి అనుమానం కలిగింది.
“రామా! ఈ మృగము సామాన్య మృగము మాదిరి లేదు. ఎవరో రాక్షసుడు ఈ మృగవేషము ధరించినట్టు కనపడుతూ ఉంది. ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి, వేటకు వచ్చిన రాజులను వంచించి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు. ఆ మారీచుడు ఈ మృగముకాదు. కదా! నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము ఎన్నో లేళ్లను చూచాము. కానీ ఇంతటి ప్రకాశవంతమైన, బంగారు వర్ణములో ఉన్న లేడిని చూడలేదు. ఇదేదో రాక్షస మాయగా ఉంది. అసలు ఇటువంటి లేడి భూలోకములో ఉంటుందా అని నా అనుమానము.
రామా! సందేహము లేదు. ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ఉంది. ఇది నిస్సంశయముగా మాయాలేడి. రాక్షస మాయ.” అని అన్నాడు లక్ష్మణుడు.
అప్పుడు సీత లక్ష్మణుని చూచి ఇలా అంది. “లక్ష్మణా! నీకు అన్నీ అనుమానాలే. అందమైన లేడి పిల్లను చూచి ఆనందించక అనుమా నిస్తావెందుకు. ఈ లేడి పిల్లను మన ఆశ్రమములో ఉంచి పెంచు కుందాము. రోజూ దీనితో నాకు కాలక్షేపము అవుతుంది.
రామా! నాకు ఆ లేడిని తెచ్చి ఇవ్వరా! ప్రాణములతోటి పట్టి తెండి. మన ఆశ్రమ ప్రాంతములో ఎన్నో లేళ్లు సంచరిస్తున్నాయి. కానీ అవి ఈ లేడి అంత అందంగా ఆకర్షణీయంగా లేవు. అసలు ఇలాంటి మృగమును నేను ఇంతవరకూ చూడలేదు. చూడండి. దాని శరీరం చిత్రవిచిత్రరంగులతో ఎలా మెరిసిపోతోందో! ఆ లేడి మనుషులను చూచి భయపడటం లేదు. నిర్భయంగా తిరుగుతూ ఉంది. దీనిని పెంచుకొని దీనితో వినోదించవలెనని నాకు కోరికగా ఉంది.
ఆహా! ఏమి రూపము! ఏమి సౌందర్యము. దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాధా! దీనిని చూడగానే నా మనసు దీని యందే లగ్నం అయింది. అది నా మనసు హరించింది. దీనిని వదిలి నేను ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నాను. కాబట్టి నాధా! దీనిని సజీవంగా పట్టి తెండి. మనము వనవాసకాలములో దీనితో వినోదించి, మరలా మనము అయోధ్యకు పోవునపుడు దీనిని మన వెంట అయోధ్యతీసుకొని పోవుదము. దీనిని చూచి అత్తయ్యగారు, భరతుడు, నా చెల్లెళ్లు ఎంతో సంతోషిస్తారు.
పోనీలెండి. ఈ మృగమును సజీవంగా పట్టుకోలేక పోతే, కనీసము దీని చర్మమును అన్నా నాకు బహుమతిగా ఇవ్వండి. నేను దాచుకుంటాను. నేను పూజచేసుకొనేటప్పుడు దీని మీద కూర్చుని పూజచేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు! స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు కోరకూడదను మాట నిజమే. కాని, ఈ బంగారు లేడిని చూచి కోరకుండా ఉండలేకపోతున్నాను. ఈ సారికి మన్నించండి.” అని గోముగా ప్రేమగా అడిగింది సీత.
రామునికి కూడా ఆ మృగమును చూస్తే ఆనందం కలిగింది. వెంటనే ఆశ్చర్యము కూడా కలిగింది. సీత ఆ మృగమును కావాలి అంటూ ఉంది. తనకు కూడా ఆ మృగమును వేటాడవలెనని కోరికగా ఉంది. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! సీత మాటలు విన్నావు కదా. సీతకు ఈ మృగము అంటే ఎంతో ఆసక్తిగా ఉంది. నాకు చూడ ఇటువంటి మృగమును మనము ఈ దండకారణ్యములో ఇంతవరకూ చూడలేదు. అంతే కాదు ఇది దేవలోకములో ఉండవలసిన మృగము. భూలోకములోకి ఎలా వచ్చిందో! అటువంటిది మన కంటపడింది. దీని ఒంటి మీద ఉన్న బంగారు చుక్కలు అతిమనోహరంగా ఉన్నాయి. అసలు ఇటువంటి మృగమును చూచి ఎవరు ఆనందించరు! ఈ మృగము అందరినీ ఆకర్షిస్తుంది.
లక్ష్మణా! సాధారణంగా రాజులు వినోదము కొరకు వేటకు పోయి ఇటువంటి మృగములను చంపుతారు. వాటి మాంసమును తింటారు. అది క్షత్రియులకు సహజము. కాబట్టి మనము ఈ మృగమును చంపి దాని చర్మమును సీతకు ఇస్తాము. నేను సీత ఈ మృగచర్మము మీద సుఖంగా ఆసీనులము అవుతాము. ఏ మృగ చర్మము కూడా దీని చర్మము అంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటాను.
పోనీ నీవు చెప్పినట్టు ఇది రాక్షస మాయ అని అనుకుంటే, మనము దీనిని వెంటనే చంపుదాము. ఆ రాక్షసుడు కూడా చస్తాడు. నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అనే రాక్షసుడు అయితే ఇంకా మంచిది. ఈ మారీచుడు ఇదివరకు ఈ దండ కారణ్యములో ఎంతో మంది మునులను తన మాయలతో చంపి తిన్నాడు. వీడే మారీచుడు అయితే అవశ్యం వీడిని చంపితీరాలి. వీడు చంపతగ్గవాడు కదా! ఇదివరలో అగస్త్యుడు వాతాపిని చంపినట్టు మనము మారీచుని చంపుదాము. వీడిపీడను, ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు, ఇక్కడ నివసించే ఋషులకు, లేకుండా చేద్దాము.
అలాకాకుండా, ఈ మృగము మామూలు మృగము అయితే దీనిని చంపి సీతకు చర్మము ఇద్దాము. ఇది రాక్షసుడు అయితే దీనిని చంపి ఇక్కడివారలకు రాక్షసపీడను విరగడ చేద్దాము. కాబట్టి దీనిని చంపడం అవశ్యం ఆచరించతగినది.
లక్ష్మణా! నేను ఈ మృగమును వేటాడి చంపుతాను. నేను వచ్చేదాకా నీవును సీతను రక్షిస్తూ ఉండు. నేను ఒక్కక్షణములో ఈ మృగమును చంపి దాని చర్మమును తీసుకొని వస్తాను. నీవుమాత్రము ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చువరకూ జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు. లక్ష్మణా! కావాలంటే జటాయువు సాయం తీసుకో. నీవు, జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి.” అని పలికాడు రాముడు.
అయోధ్యాకాండలోని 118వ సర్గలో, రావణుడు మారీచుని తన ప్రణాళిక వివరించి, సీతను అపహరించడానికి సహాయం చేయమని ఆదేశిస్తాడు. మారీచుడు మొదట ఈ ప్రణాళికకు విరోధం చూపినా, చివరికి రావణుని భయంతో అంగీకరిస్తాడు. మారీచుడు సువర్ణ మృగం రూపంలో పంచవటికి చేరుకుంటాడు. సీత ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యంతో రాముని దానిని పట్టుకోవాలని కోరుతుంది. రాముడు సీత కోరికను తీర్చడానికి ఆ మృగాన్ని పట్టుకోవడానికి వెళతాడు. రాముడు వెళ్లిన తరువాత, లక్ష్మణుడు సీతను రక్షణ కోసం అక్కడే ఉండిపోతాడు. ఈ సర్గ సీతా అపహరణానికి పునాది వేస్తుంది, తద్వారా రామాయణ కథ కీలక మలుపు తిరుగుతుంది.
అత్రిమహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత, ఆమెతో ఇలా అన్నది. “పూజ్యురాలా! స్త్రీకి పతియే దైవము అన్న విషయం నాకు బాగా తెలుసు. భర్త గుణవంతుడైనా, గుణహీనుడైనా, నాకు పూజ్యుడే. అటువంటప్పుడు గుణవంతుడు, దయాగుణము కలవాడూ, ఇంద్రియములను జయించినవాడు, నా మీద అమితమైన ప్రేమకలవాడూ, ధర్మము తెలిసినవాడూ, నన్ను నా తల్లితండ్రులకంటే ఎక్కువగా ఆదరించేవాడు అయిన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను.
రాముడు నా మీదనే కాదు, తన తల్లి కౌసల్యమీదా, ఆయన ఇతర తల్లుల మీదా సమానమైన పూజ్యభావంతో ఉంటాడు. మా మామగారు దశరథునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. రాముడు వారి నందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు. వారేకాదు. నన్ను తప్ప లోకంలో మిగిలిన స్త్రీలనందరినీ మాతృ భావంతో చూస్తాడు. మీరు చెప్పినమాటలే నేను వనవాసమునకు వచ్చునపుడు మా అత్తగారు కౌసల్యాదేవిగారు కూడా చెప్పారు. అవి ఇంకా నా మనసులో మెదులుతున్నాయి.
అంతేకాదు, నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేసారు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ, అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మీరు కూడా నాడు సావిత్రి వలె పతిసేవలో తరించి ఉత్తమ లోకాలు పొందుతారు. పూర్వము కూడా ఎంతో మంది స్త్రీలు తమ భర్తలనుసేవించి తరించారు.”అని పలికింది సీత.
సీత మాటలకు అనసూయ ఎంతోసంతోషించింది. సీతను పొదివి పట్టుకొని ఆమె తలనిమిరి నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. “అమ్మా సీతా! నేను ఎంతో తపశ్శక్తి సంపాదించాను. రాక రాక మా ఇంటికి వచ్చావు. నీకు ఏమైన కానుక ఇవ్వాలని ఉంది. నీకు ఇష్టమైనది ఏమైనా కోరుకో ఇస్తాను.” పలికింది అనసూయ.
“అమ్మా! మిమ్ములను చూడటం, కలుసుకోవడం, మీతో మాట్లాడటమే గొప్ప వరం. ఇంకా నాకు ఏమీ కావాలి. మీ సన్నిధిలో నేను తృప్తిగా ఉన్నాను.” అని పలికింది సీత. అనసూయ నవ్వింది. “సీతా! నీ మనోభావన. కానీ స్త్రీలకు అలంకారముల మీద మమకారము ఉంటుంది కదా. అందుకని నీకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, అంగరాగములు ఇస్తున్నాను. వాటిని అలంకరించుకో. నేను ఇచ్చే ఆభరణములు, వస్త్రములు దివ్యమైనవి. ఎన్నటికీ మాయవు, నలగవు. నిత్యనూతనంగా ఉంటాయి. వాటిని ధరించి నీ భర్తకు ఆనందము కలిగించు.” అని పలికి అనసూయ సీతకు దివ్యమైన ఆభరణములు, వస్త్రములు, మైపూతలు తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చింది. సీత కూడా వాటిని భక్తితో తీసుకుంది. సీత అనసూయ పక్కనే కూర్చుని ఆమెను సేవించింది. ఇంక ఇద్దరూ పాత విషయాలను ముచ్చటించుకుంటున్నారు.
“సీతా! నీ వివాహం ఎలా జరిగింది. నీ తండ్రి నీకు స్వయంవరము ప్రకటించాడని విన్నాను. వాటి విశేషములు ఏమిటి నాకు చెప్పవా!” అని మాతృవాత్సల్యముతో అడిగింది. సీత కూడా తన పెళ్లినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. అనసూయకు ఇలా చెప్పసాగింది.
“అమ్మా! నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు. న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు. దాని కోసరం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట. అప్పుడు నేను ఆ నాగేటి చాలులో దొరికానట. నేను దొరికినప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినపడినదట “ఓరాజా! ఈ శిశువు మనుష్యజాతికి చెందినది కాదు. దేవతా కాంత. నీవు ఆమెను పుత్రికా ధర్మంతో పెంచు.” అని వినపడినదట.
తరువాత జనకుడు నన్ను తన కుమార్తె వలె పెంచి పెద్దచేసాడట. జనకుని భార్యకూడా నన్ను తన తల్లివలె ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిందట. ఇంతలో నాకు వివాహము చేయదగిన వయసు వచ్చింది. నా తండ్రి జనకునకు నా వివాహము గురించి దిగులు పట్టుకుంది. ఎందుకంటే నేను అయోనిజను. దేవతా అంశ కలదానిను. కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభం. ఆయనకు ఏమీ తోచలేదు. అందుకని నాకు స్వయం వరము అంతకు ముందు వరుణ దేవుడు మా తండ్రి జనకునకు ఒక దివ్యమైన ధనుస్సు, రెండు అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడు. ఆ ధనస్సు చాలా బరువైంది. ఎవరూ కనీసం కదపను కూడా కదపలేరు. ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం. అవి గుర్తుకు వచ్చాయి మా తండ్రిగారికి.
నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు. “ఈ థనుస్సు దివ్యమైనది. దీనిని ఎవరైతే ఎత్తి ఎక్కుపెట్ట గలరో,వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తాను. ఇందులో సంశయం లేదు.” అని ప్రకటించాడు.
ఎంతో మంది రాజులు ప్రయత్నించారు కానీ కనీసం ఆ ధనుస్సును కదల్చనుకూడా కదల్చ లేకపోయారు. ఇంక ఎత్తడం, ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యం అయింది. అందుకని రాజులందరూ ఆదివ్యమైన ధనుస్సుకు నమస్కరించి వెళ్లిపోయారు.
అలాచాలాకాలము గడిచింది. ఆ దివ్య ధనుస్సును ఎవరూ ఎత్తలేకపోయారు. ఎక్కుపెట్టలేకపోయారు. ఇంతలో రఘువంశము లో పుట్టిన రాముడు విశ్వామిత్రుని తో సహా మిథిలకు వచ్చాడు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను మా తండ్రికి పరిచయం చేసాడు.
“ఓ జనకమహారాజా! వీరు రామలక్ష్మణులు, అయోధ్యాధిపతి దశరథుని కుమారులు. నీ దగ్గర దివ్యమైన ధనుస్సు ఉందని విన్నాము. దానిని చూడటానికి వచ్చారు. ఆ ధనుస్సును వీరికి చూపించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
నా తండ్రి ఆ ధనుస్సును అతి కష్టం మీద అక్కడకు తెప్పించాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టాడు. నారి పట్టుకొని ఒక్కసారి ఆకర్ణాంతము లాగాడు. (ఎడమ చేతితో ధనుస్సు పట్టుకొని, కుడి చేతితో దానికి కట్టిన తాడు పట్టుకొని చెవి దాకా లాగడం.)
రాముడు లాగిన వేగానికి పిడుగు పడిన శబ్దం వచ్చింది. ఆ దివ్యమైన ధనుస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలయింది. నా తండ్రి జనకుడు ఎంతో సంతోషించాడు. తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము నన్ను రామునికి ఇచ్చి కన్యాదానము చేయ నిశ్చయించాడు. వెంటనే జలము తెమ్మని ఆదేశించాడు.
రాముడు తన తండ్రి అనుమతి లేనిదే వివాహము చేసుకోను అని అన్నాడు. వెంటనే దశరథునికి వర్తమానము పంపించారు. దశరథమహారాజు మిథిలానగరమునకు వచ్చాడు. నా జనకుడు నన్ను రామునికి ఇచ్చి వివాహము చేసాడు. నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేసాడు. ఆ విధంగా నా వివాహము రామునితో జరిగింది. అప్పటి నుండి నేను నా భర్త రాముని దైవము వలె పూజిస్తున్నాను.”అని తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపింది సీత.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విచత్వారింశః సర్గం రామాయణంలోని మూడవ కాండలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ఉంటున్నారు. ఈ సందర్భంలో రావణుడి చెల్లెలు శూర్పణఖా రాముని చూసి అతనితో వివాహం చేసుకోవాలని కోరుతుంది. రాముడు ఆమెను తిరస్కరిస్తాడు, దాంతో శూర్పణఖా సీతకు హాని చేయాలని ప్రయత్నిస్తుంది.
అప్పటికి రెండు సార్లు రాముడి చేతిలో చావు తప్పించుకున్నా, మూడవసారి రాముడి చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకొని రావణుని వెంట బయలుదేరాడు మారీచుడు. ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు. అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడ్డాడు.
మారీచుని కౌగలించుకొని “మారీచా! నామాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడవు అనిపించుకున్నావు. నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారీచుడవు కావు. నీవు కూడా నాతో రా. రథం ఎక్కు. మనం ఇద్దరం రాముని ఆశ్రమం దాకా వెళదాము తరువాత తెలుసుగా. కాస్త సీతను ప్రలోభ పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పారిపో.
రామ లక్ష్మణులు అటు పోగానే నేను సీతను తీసుకొని ఇటు వచ్చేస్తాను.” అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు.
తరువాత రావణుడు, మారీచుడు ఇద్దరూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దండకారణ్యం వైపు ప్రయాణం సాగించారు. కొన్ని దినములు ప్రయాణించి ఇద్దరూ రాముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. రావణుడు, మారీచుడు ఇద్దరూ రథం దిగారు.
“మారీచా! అటు చూడు. అదే రాముని ఆశ్రమము అనుకుంటాను. నేనుచెప్పింది గుర్తు ఉంది కదా. ఆ ప్రకారం చెయ్యి నేను ఈ పరిసరాలలో దాక్కొని ఉంటాను.” అని అన్నాడు రావణుడు.
వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు వన్నెకల లేడి రూపం ధరించాడు. రాముని ఆశ్రమం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. సీత దృష్టి లో పడేట్టు సంచరిస్తున్నాడు. మారీచుడు ధరించిన ఆ లేడి రూపము చాలా సుందరంగా ఉంది. దాని ముఖము సగం తెల్లగా సగం నల్లగా ఉంది. మెడ కొంచెం ఎత్తుగా ఉంది. దాని శరీరము బంగారు రంగుతో మెరుస్తూ ఉంది.
ఆ లేడి అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అటు ఇటు పరుగెత్తుతూ, గెంతుతూ, భయం భయంగా చూస్తూ ఉంది. కాసేపు అలా ఆడుకొని, కొంచెం సేపు అలసటగా పడుకొంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయ లేడి.
ఇంతలో కొన్ని లేళ్లు అక్కడకు గుంపుగా వచ్చాయి. ఈ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది. కాని మిగిలిన లేళ్లు ఈ మాయలేడిని వాసన చూచి ఎందుకో దూరంగా పరుగెడుతున్నాయి. మారీచునకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరా కరా నమిలి తినాలని మహాకోరికగా ఉంది. కాని తాను ఉన్న పరిస్థితులలో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు.
అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చింది. ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది. ఇంతలో ఆ మాయలేడి సీత కంటపడింది. బంగారు వర్ణంతో మిలా మిలా మెరిసిపోతున్న ఆ లేడి వంక కుతూహలంగా చూచింది సీత. ఆ అరణ్యంలో అంతవరకూ అటువంటి లేడిని సీత చూడలేదు. అందుకని ఆశ్చర్యం ఆ లేడి వంక చూస్తూ ఉంది.
అమ్మయ్య వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచుడు. సీత దగ్గరగా వెళ్లి ఆమె తనను అందుకొనేటట్టు ఆమెకు దగ్గరగా అటు ఇటు తిరుగుతున్నాడు.
అయోధ్యాకాండలోని 117వ సర్గలో, శూర్పణఖా తన పరాభవం గురించి రావణుని చెబుతుంది. రాముడు, లక్ష్మణుడు ఖరుడు, దూషణుడు, త్రిశిరులను హతమార్చిన విషయాన్ని వివరిస్తుంది. రావణుడు ఆ వార్తలు విని తీవ్రంగా కోపంతో రగిలిపోతాడు. అతను సీత యొక్క సౌందర్యం గురించి విన్నప్పటి నుండి, ఆమెను తన భార్యగా చేసుకోవాలని సంకల్పిస్తాడు. రావణుడు మారీచుని సహాయంతో తన కూటి తంత్రాల ప్రణాళికను సిద్ధం చేస్తాడు. మారీచుడు స్వర్ణమృగ రూపంలో సీతను మోహింపజేయడానికి ముందుకు వస్తాడు. ఈ సర్గ రామాయణంలో కీలక మలుపు, ఎందుకంటే ఇది సీతాపహరణానికి దారితీస్తుంది, తద్వారా రాముని మరియు రావణుని మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతుంది.
మునులందరూ వెళ్లిపోయిన తరువాత రాముడు ఆలోచనలో పడ్డాడు. మునులు చెప్పినది నిజమే అనిపించింది. ఆ ప్రదేశంలో ఉండటం క్షేమం కాదనుకున్నాడు. దానికి తోడు రామునికి పాతజ్ఞాపకాలు వెంటాడ సాగాయి. ఆ పర్ణశాలలోనే రాముడు భరతుని, శత్రుఘ్నుని, తనతల్లులను కలుసుకున్నాడు. ఇప్పుడు వారు లేకపోవడంతో మాటి మాటికీ వారే మనసులో మెదులు తున్నారు. వారి జ్ఞాపకాలతోనే మనసు నిండిపోయింది. స్థలం మారితేనే గానీ ప్రయోజనం లేదు అని అనుకున్నాడు.
దానికి తోడు భరతుడు తన సేనలతో వచ్చిఅక్కడ ఉన్నాడు. వారు అక్కడ ఉన్న కాలంలో వారు వాడేసిన వ్యర్థ పదార్థాలు, గుర్రములు, ఏనుగులు వదిలిన మలమూత్రములతో ఆ ప్రదేశం అంతా దుర్గంధం వ్యాపించింది. ఆ కారణం చేత కూడా ఆ ప్రదేశం తమ నివాసమునకు అనుకూలంగా లేదు అని అనుకున్నాడు రాముడు.
అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో, లక్ష్మణునితోకలిసి అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్లాడు. అత్రి మహాముని రాముని తన కుమారుని వలె ఆదరించాడు. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు. తినడానికి ఫలములు ఇచ్చాడు. తన భార్య వృద్ధురాలు అయిన అనసూయకు రాముని, సీతను పరిచయం చేసాడు.
“రామా! ఈమె నా భార్య అనసూయ. నా సహధర్మచారిణి. ఒకసారి పది సంవత్సరములు కరువు వచ్చి లోకము అంతా దగ్ధము అయిపోతున్న సమయంలో, జనులకు ఫలములను జలములను ఇచ్చి కాపాడింది. ఈమె గొప్ప తపస్వి. ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సార్థక నామధేయురాలు. అసూయ అంటే ఏమిటో తెలియని అనసూయ. పైగా వృద్ధురాలు. సీతకు ఆమె గురించి చెప్పి పరిచయం చెయ్యి.” అని అన్నాడు అత్రి.
రాముడు సీతతో ఇలా అన్నాడు. “సీతా! విన్నావుగా మహాఋషి మాటలు. మహాతపస్వి అనసూయా దేవిని సేవించు. నీకు శుభం కలుగుతుంది.”అనిఅన్నాడు. వెంటనే సీత అనసూయవద్దకు వెళ్లి ఆమెకు ప్రదక్షణ పూర్వకంగా నమస్కారము చేసింది. తన పేరు, తన గురించి చెప్పుకుంది. వృద్ధురాలు అనసూయ కూడా సీతను ఆలింగనము చేసుకొని ఆమెను కుశలప్రశ్నలు వేసింది.
ఇంకా ఇలా అంది. “సీతా! నీవు ధర్మమును పాటిస్తున్నావు. అందుకే ఏ మాత్రంఅహంకారము, అభిజాత్యము, కోపం లేకుండా, నీ రాజభోగములను, ఐశ్వర్యమును వదిలిపెట్టి, పతి వెంట వనవాసము నకు వచ్చావు. నీ వంటి సౌభాగ్యవతి ఎక్కడా లేదు. తన భర్త రాజుగా రాజాంతఃపురములలో ఉన్నా, లేక వనములలో కష్టాలు పడుతూ ఉన్నా, తన భర్త పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా, భర్తను విడిచిపెట్టకుండా సదా అనుసరించి ఉంటుందో ఆ భార్య ఉత్తమలోకములను పొందుతుంది. ఉత్తమ స్త్రీలకు తన భర్త ధనవంతుడైనా, దరిద్రుడైనా, గుణవంతుడైనా, దురభ్యాసాలకు అలవాటు పడినవాడైనా, అతడే దైవము. అటువంటి స్త్రీ తన భర్తమును దైవము వలె పూజిస్తుంది. స్త్రీలకు భర్తను మించిన ఆప్త బంధువు వేరొకరు లేరు అనడంలో అతిశయోక్తిలేదు. కాని కొంత మంది స్త్రీలు కోరికలకు బానిసలై, తన భర్త తాను కోరిన కోరికలు తీర్చలేదని భర్తను నిరాదరిస్తుంటారు. భర్తలమీద అధికారము చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు ధర్మభ్రంశమును పొంది అపకీర్తి పాలవుతారు. (అనసూయ కైకను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్పిందా అనిపిస్తుంది.)
కాని నీ వంటి స్త్రీలు మంచి చెడ్డలను పరిశీలించి భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమలోకములు పొందుతారు. అందుకని నీవు కూడా ఎల్లప్పుడూ నీ భర్తనే అనుసరిస్తూ, భర్త మాట జవదాటకుండా, ఉత్తమ స్త్రీగా వర్ధిల్లు. దాని వలన నీకు కీర్తి, సౌభాగ్యము సంప్రాప్తిస్తాయి.”అని పలికింది అనసూయ.
అయోధ్యాకాండలోని 116వ సర్గలో, శూర్పణఖా తనతో జరిగిన అవమానాన్ని తన సోదరులైన ఖరుడు, దూషణుడు, త్రిశిరులకు తెలియజేస్తుంది. కోపంతో, వారు రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఖరుడు, దూషణుడు, త్రిశిరులు తమ సైన్యంతో కలిసి రాముడు, లక్ష్మణులపై దాడి చేస్తారు. రాముడు, లక్ష్మణుడు ధైర్యంగా పోరాడి, రాక్షస సైన్యాన్ని ఓడిస్తారు. ఈ యుద్ధంలో రాముడి ధైర్యం, శౌర్యం మరియు లక్ష్మణుడి పరాక్రమం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సీత రాముడి విజయం చూసి ఆనందిస్తుంది. ఈ సంఘటన రాముని పరాక్రమాన్ని, రాక్షసులపై అతని విజయాన్ని ప్రతిబింబిస్తుంది, తద్వారా రామాయణ కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
భరతుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు, సీత, వనవాసము చేస్తున్నారు. రాముడు అక్కడున్న ఋషుల మొహాల్లో ఏదోభయాన్ని చూచాడు. వారు ఆందోళనగా ఉన్నట్టు గమనించాడు. వారు ఆ ప్రదేశమును వదిలి వెళ్లబోతున్నట్టు తెలుసుకున్నాడు. రాముని చూచి వారు ఏదో గుసగుసగా రహస్యంగా మాట్లాడుకోవడం చూచాడు రాముడు.
రామునికి ఏమీ కావడం లేదు. తాము అక్కడ ఉండటం వలన ఆ ఋషులకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో అని అనుమాన పడ్డాడు. ఏమైనా సరే అనుమానము నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ఋషుల కందరిలోకీ పెద్దవాడి దగ్గరకు వెళ్లాడు. ఆయనకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు.
“మహాత్మా! గత కొద్దిరోజులుగా ఇక్కడ ఉన్న ఋషుల ప్రవర్తనలో ఏదో మార్పుకనపడుతూ ఉంది. కారణం తెలియడం లేదు. మా వల్ల ఏదైనా అపరాధము జరిగిందా? నా తమ్ముడు తమరి పట్ల ప్రమాదవశాత్తు అనుచితంగా ప్రవర్తించాడా! నా భార్య సీత తమరికి కూడా సేవలు చేస్తూ ఉంది కదా. ఆమెసేవలలో ఏమైనా లోపం కనిపించిందా! మా వల్ల ఏమైనా అపరాధము జరిగితే చెప్పండి సరిదిద్దుకుంటాము.” అని అన్నాడు రాముడు. దానికి ఆ వృద్ధుడైన ఋషి ఇలాఅన్నాడు. “రామా! నీ భార్య సీత కల్యాణి. కల్యాణ స్వభావము కలది. ఆమె వల్ల లోపం ఎందుకుంటుంది. కాని ఒకవిషయం నీకు చెప్పాలి. మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా. మీమీద రాక్షసులకు వైరము ఉంది. మీకూ రాక్షసులకు ఉన్న వైరము కారణంగా మా తాపసులకు ఏమైనా అపకారము కలుగుతుందేమో అని ఈ ఋషులు భయపడుతున్నారు. దాని గురించి వారు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. నీ ఎదుట పడి చెప్పడానికి భయపడుతున్నారు.
రామా! ఇక్కడ రావణుని తమ్ముడు ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు సామాన్యుడు కాడు. అతి క్రూరుడు. నరమాంస భక్షకుడు. మహావీరుడు. వాడు జనస్థానములో తపస్సు చేసుకుంటున్న ఋషులను అందరినీ చంపాడు. వాడికి నీ మీద కోపముగ ఉందని తెలిసింది. నీవు ఇక్కడకు వచ్చి పర్ణశాల నిర్మించుకొన్నది మొదలు ఆ రాక్షసుల బాధ ఎక్కువ అయింది.
రాక్షసులు మమ్ములను నానాబాధలకు గురి చేస్తున్నారు. వారు చూడటానికే భయంకరంగా ఉండే ఆకారాలతో వచ్చి మమ్ములను బాధిస్తున్నారు. మేము చేసు కొనే హోమములలో తినకూడని పదార్థములను వేస్తున్నారు. మా ఎదుటనే ఋషులను చంపుతూ మమ్ములను భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్లు ఎక్కడుంటారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. హటాత్తుగా వస్తారు.
అందినవాడిని అందినట్టు చంపుతారు. ఆనందంతో కేరింతలు కొడతారు. హెూమగుండంలో నీళ్లు పోసి ఆర్పుతారు. మేము వాడుకొనే పాత్రలు పగుల కొడతారు. తరువాత అందకుండా పారిపోతారు.
వారి బాధలు భరించలేకుండా ఉన్నాము. ఈ చోటు విడిచి వేరేచోటికి పోదామని అందరూ అనుకుంటున్నారు. వాళ్లు మమ్ములను శారీరకంగా హింసిస్తున్నారు. వారి బాధలు పడలేకుండా ఉన్నాము. ఇక్కడికి సమీపములోనే మరొక అరణ్యము ఉంది. అక్కడ ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. మేము తపస్సు చేసుకోడానికి అక్కడ అనువుగా ఉంటుంది. అందుచేత అక్కడకు పోదామని నన్ను బలవంతం చేస్తున్నారు. ఇంతలో నువ్వే అడిగావు. అందుకని వివరంగా చెప్పాను.
ఆ ఖరుడు మమ్ములనే కాదు నిన్ను కూడా బాధించగలడు. నీకు కూడా ప్రాణాపాయము కలుగుతుంది. అందుకని నీకు ఇష్టం అయితే నువ్వు కూడా ఈ ప్రదేశము విడిచి మా వెంట వచ్చెయ్యి. ఎందుకంటే మీ తోపాటు నీ భార్యకూడా ఉంది. ఆమెను ఎల్లప్పుడూ రక్షించుకోడం కష్టం కదా! ఎప్పుడో ఒకప్పుడు ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న సీతకు రాక్షసుల వలన ఏదో ఒక ఆపద కలుగుతుంది. అందువలన మీరు ఇక్కడ ఉండటం అంతక్షేమంకాదు. ” అన్ని గబా గబా చెప్పాడు.
తరువాత ఆ మునులందరూ ఆ ప్రదేశమును విడిచి వెళ్లడానికి ఉద్యుక్తులవు తున్నారు. రాముడు మాత్రము అక్కడ నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకని ఆ మునులందరూ రాముని అక్కడే విడిచి వెళ్లిపోయారు. రాముడు కొంతదూరము వారితో వెళ్లి వారికి వీడ్కోలు చెప్పాడు. తిరిగి తన పర్ణశాల వద్దకు వచ్చాడు. ఆరోజుదాకా ఋషులతో వారి వేదఘోషలతో మార్మోగిన ఆ ప్రదేశములో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది.
అయోధ్యాకాండలోని 115వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివాసం ఏర్పరుస్తారు. ఈ సర్గలో శూర్పణఖా అనే రాక్షసి రాముని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముని ప్రేమ కోసం ప్రాధేయపడుతుంది, కానీ రాముడు సీతపై తన ప్రేమను చూపిస్తూ ఆమెను తిరస్కరించుతాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడి వద్దకు వెళుతుంది, కానీ అతను కూడా ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా సీతను హాని చేయడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. ఈ సంఘటన రామాయణంలో కీలకంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాముడు మరియు రావణుని మధ్య శత్రుత్వానికి పునాది వేస్తుంది.
భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయ ములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.
తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామ మునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు.
వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.
భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. “గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు.”అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు సీతను వెతికేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో, రాముడు తన సంకేత రింగ్ను హనుమంతుడికి ఇస్తాడు, ఇది సీతకు రాముడి గుర్తుగా ఉంటుంది. హనుమంతుడు ఆ రింగ్ను తీసుకుని లంకకు ప్రయాణిస్తాడు.
రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు. తను చెప్పిన పని చెయ్యకపోతే రావణుడు చంపుతాడు. ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు. అందుకని మరలా ఒకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అనుకున్నాడు మారీచుడు. అయితే ఈ సారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు.
“ఓ రావణా! నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు? వాళ్లు చెప్పినా నీవు ఎలా విన్నావు?నాకు తెలుసు. నీవు సుఖంగా ఉండటం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్లు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు. ఇంతకూ వారు ఎవరో నాకు తెలియాలి. నీ చావు చూడాలని కోరుకొనే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి.
రాముని శత్రువులు ఎవరో కానీ వాళ్లు రాముని చంపలేక, మహా పరాక్రమ వంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు. వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు. నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. వాళ్లు ఎవరో నాకు చెప్పు. వాళ్లు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపెయ్యి.
నీవు దారి తప్పి నడిచినా, నిన్ను సక్రమ మార్గంలో పెట్టే వాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరే వారు నీకు మంత్రులు, హితులు ఎలా అవుతారు? రాజు చెడ్డ మార్గంలో పోతుంటే, మంత్రులు రాజుకు హితం చెప్పి, మంచి మార్గంలో నడిచేట్టు చెయ్యాలి. అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను!
(మారీచుడు చెప్పిన ఈ మాటలు నేటికి కూడా వర్తిస్తాయి. ముఖ్యమంత్రి చెడు నిర్ణయాలు తీసుకుంటుంటే కాబినెట్ మంత్రులు అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే సెక్రటరీలు (ఐ.ఏ.యస్ ఆఫీసర్లు) వారికి మార్గనిర్దేశం చెయ్యాలి. వారి తప్పుడు నిర్ణయాలను అడ్డుకోవాలి. ప్రజాక్షేమాన్ని కాపాడాలి. కానీ ఈ నాడు జరుగుతున్నదేమిటి. ముఖ్యమంత్రికి కాబినెట్ మంత్రులు తాన అంటే తందానా అంటున్నారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. లేకపోతే వారి మంత్రి పదవులు పోతాయని భయం.
అలాగే సెక్రటరీలు మంత్రులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తప్పని తేలితే మాదేం లేదు అంతా మంత్రులు చెప్పినట్టే చేసాము అని సమర్ధించు కుంటున్నారు. మంత్రులు చెప్పింది చెయ్యడానికి ఐ.ఏ.యస్ లు ఎందుకు. గుమాస్తాలు చాలు కదా. పాలకులను సక్రమమార్గంలో నడిపించడమే కార్యదర్శుల పని. ఈ విషయాన్నే నాడు మారీచుడు రావణునికి స్పష్టంగా చెప్పాడు.)
రాజు మంచి వాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది. రాజు చెడ్డ వాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. రాజ్యానికి మూలం రాజు. అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి, రాజును రక్షించుకోవడం మంత్రులవిధి. ప్రజావ్యతిరేకుడైన రాజు, ప్రజలను పీడించేరాజు ప్రజాభిమానము చూరగొనలేడు. అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు.
రాజు మంచి వాడైనా, మంత్రులు చెడ్డ వారైతే, మంత్రుల చెడు సలహాల ఫలితంగా, రాజు కూడా వారితో పాటు నశించి పోతాడు. ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలవుతారు. ఇప్పుడు నీవు తీసుకునే ఈ నిర్ణయంతో నీతోపాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు.
ఓ రావణా! నాకు ఎటూ చావు తప్పదు. అది నాకు తెలుసు. నా బాధ అంతా నీ గురించే. పోతే నేను ఒక్కడినే పోతాను. కానీ నీవు, నీ ప్రజలు, సైన్యంతో సహా నశించిపోతావు. నీవు చెప్పిన పని నేను చేస్తాను. రాముడి చేతిలో చస్తాను. కాని నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు.
నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు. రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు. కాని సీతను అపహరించిన తరువాత, లంకను పాలించ డానికి నీవు ఉండవు అని తెలుసుకో!
కాబట్టి ఓ రావణా! ఇదే మన ఆఖరు సమావేశము. నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకొని వెళ్లగానే నేను చస్తాను. సీతను అపహరించగానే నీవు చస్తావు. అప్పుడు ఈ లంకా ఉండదు. ఈ రాక్షసులూ ఉండరు.
నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు. కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఇంక పోదాం పద.” అని అన్నాడు మారీచుడు.