Sri Maha Lakshmi Ashtottara Sata Naamaavali In Telugu – శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

Sri Maha Lakshmi Ashtottara Sata Naamaavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్టయే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం సదాసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతాయై నమః
ఓం నందాయై నమః (90)

ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

మరిన్ని అష్టోత్తరములు

Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

Sri Sai Baba Ashtottara Shatanamavali

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

(ప్రతి నామమునకు ముందు ఓం శ్రీసాయి అనియు చివర నమః అనియు చదువవలెను.)

  1. ఓం శ్రీ సాయినాథాయ నమః
  2. శ్రీ లక్ష్మీనారాయణాయ
  3. శ్రీ కృష్ణరామ శివ మారుత్యాదిరూపాయ
  4. శ్రీ శేషశాయినే
  5. గోదావరీ తట షిర్డివాసినే
  6. భక్తహృదయాలయాయ
  7. సర్వహృద్వాసినే
  8. భూతవాసాయ
  9. భూతభవిష్యద్భావ వర్జితాయ
  10. కాలాతీతాయ
  11. కాలాయ
  12. కాలకాలాయ
  13. కాల దర్పదమనాయ
  14. మృత్యంజయాయ
  15. అమర్త్యాయ
  16. మార్త్యాభయ ప్రదాయ
  17. జీవధారాయ
  18. సర్వాధారాయ
  19. భక్తావన సమర్థాయ
  20. భక్తావనప్రతిజ్ఞానసమరాయ
  21. అన్నవస్త్రదాయ
  22. ఆరోగ్య క్షేమదాయ
  23. ధనమాంగల్యదాయ
  24. బుద్ధి సిద్ధిప్రదాయ
  25. పుత్రమిత్రకళత్రబంధువే
  26. యోగ క్షేమవహాయ
  27. ఆపద్భాంధవాయ
  28. మార్గబంధవే
  29. భుక్తిముక్తిస్వర్గాపవర్గాదాయ
  30. ప్రియాయ
  31. ప్రీతి వర్ధనాయ
  32. అంతర్యామినే
  33. సచ్చిదాత్మనే
  34. నిత్యానందాయ
  35. పరమసుఖదాయ
  36. పరమేశ్వరాయ
  37. పరబ్రహ్మణే
  38. పరమాత్మనే
  39. జ్ఞాన స్వరూపిణే
  40. జగత్పిత్రే
  41. భక్తానాం మాతృధాతృ పితామహాయ
  42. భక్తాభయప్రదాయ
  43. భక్తవత్సలాయ
  44. భక్తానుగ్రహకారకాయ
  45. శరణాగత వత్సలాయ
  46. భక్తి శక్తిప్రదాయ
  47. జ్ఞాన వైరాగ్యదాయినే
  48. ప్రేమప్రదాయ
  49. సంసార దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయ కరాయ
  50. హృదయగ్రంధి భేదకాయ
  51. కర్మ ధ్వంసినే
  52. శుద్ధ సత్త ్వస్థితాయ
  53. గుణాతీత గుణాత్మనే
  54. అనంత కళ్యాణ గుణాయ
  55. అమిత పరాక్రమాయ
  56. జయనే
  57. దుర్ధర్షాక్షోభ్యాయ
  58. అపరాజితాయ
  59. త్రిలోకేష్వ స్కంధితగతయే
  60. అశక్యరహితాయ
  61. సర్వశక్తి మూర్తయే
  62. సురూప సుందరాయ
  63. సులోచనాయ
  64. బహురూప విశ్వమూర్తయే
  65. అరూపా వ్యక్తాయ
  66. అచింత్యాయ
  67. సూక్ష్మాయ
  68. సర్వాంతర్యామినే
  69. మనోవాగతీతాయ
  70. ప్రేమమూర్తయే
  71. సులభ దుర్లభాయ
  72. అసహాయ సహాయాయ
  73. అనాధనాధ దీనబాంధవే
  74. సర్వభార భృతే
  75. అకర్మానేక కర్మ సుకర్మణే
  76. పుణ్య శ్రవణ కీర్తనాయ
  77. తీర్ధాయ
  78. వాసుదేవాయ
  79. సతాంగతయే
  80. సత్పరాయణాయ
  81. లోకనాథాయ
  82. పాపనాశనాయ
  83. అమృతాంశవే
  84. భాస్కర ప్రభాయ
  85. బ్రహ్మచర్య తపశ్చర్యాదిసువ్రతాయ
  86. సత్యధర్మ పరాయణాయ
  87. సిద్ధేశ్వరాయ
  88. యోగీశ్వరాయ
  89. సిద్ధ సంకల్పనాయ
  90. భగవతే
  91. శ్రీభక్తవశ్యాయ
  92. సత్పురుషాయ
  93. పురుషోత్తమాయ
  94. సత్య తత్వబోధకాయ
  95. కామాది సర్వాజ్ఞాన ధ్వంసినే
  96. అభేదానందాను భవదాయ
  97. సమసర్వమత సమ్మతాయ
  98. శ్రీ దక్షిణామూర్తయే
  99. శ్రీ వేంకటేశ రమణాయ
  100. అద్భుతానంద చర్యాయ
  101. ప్రసన్నార్తి హరాయ
  102. సంసార సర్వదుఃఖక్షయాయ
  103. సర్వవిత్ సర్వతో ముఖా
  104. సర్వాంతర్భహి స్థితాయ
  105. సర్వమంగళ కరాయ
  106. సర్వాభీష్ట ప్రదాయ
  107. సమరస సన్మార్గ స్థాపనాయ
  108. శ్రీ సమర్థ సద్గురు సాయినాధాయ నమః

ధూపమాఘ్రాపయామి (అగరువత్తులు చూపించవలెను.)
దీపం దర్శయామి (దీపారాధన చేయవలెను.)
నైవేద్యం సమర్పయామి (నివేదనము సమర్పించవలెను)
తాంబూలం సమర్పయామి
నీరాజనం దర్శయామి (నివేదనము సమర్పించవలెను) మంత్రపుష్పం సమర్పయామి.

మంత్రపుష్పం

ధాతా పురస్తాద్య ముదాజహార, శక్రః ప్ర విద్వాన్ ప్ర దిశ శ్చతస్రః,
తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే.

మరిన్ని అష్టోత్తరములు

Ayodhya Kanda Sarga 26 In Telugu | అయోధ్యాకాండ షడ్వింశః సర్గః

Ayodhya Kanda Sarga 26 In Telugu

అయోధ్యా కాండ సర్గ 26 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో రాజకుటుంబంలో కొనసాగుతున్న భావోద్వేగ వాణిజ్యాలు మరియు పెరుగుతున్న విభేదాలను చూపిస్తుంది. ఈ విభాగంలో, భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి, తన ప్రియతమ అన్నయ్య రాముని వనవాసం గురించి తెలుసుకుంటాడు. తీవ్ర దుఃఖం మరియు అపరాధ భావనతో భరతుడు తన తల్లి కైకేయితో ఎదుర్కొని, ఆమె చర్యలపై తన ఆవేదన మరియు నిరాశను వ్యక్తం చేస్తాడు. ఈ అధ్యాయం కుదుళ్ళ బంధాలను మరియు ఇతిహాసాన్ని లక్షణపరచే బలమైన ధర్మబద్ధతను ఎత్తిచూపుతుంది. రాముడికి భరతుడి విశ్వాసం మరియు అతన్ని తిరిగి అయోధ్యకు తీసుకురావాలనే నిర్ణయం సోదర ప్రేమ, కర్తవ్య మరియు న్యాయం కోసం తపన అంశాలను ప్రదర్శిస్తుంది.

సీతాప్రత్యవస్థాపనమ్

అభివాద్య తు కౌసల్యాం రామః సంప్రస్థితో వనమ్ |
కృతస్వస్త్యయనో మాత్రా ధర్మిష్ఠే వర్త్మని స్థితః ||

1

విరాజయన్రాజసుతో రాజమార్గం నరైర్వృతమ్ |
హృదయాన్యామమంథేవ జనస్య గుణవత్తయా ||

2

వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్వినీ |
తదేవ హృది తస్యాశ్చ యౌవరాజ్యాభిషేచనమ్ ||

3

దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞా హృష్టచేతనా |
అభిజ్ఞా రాజధర్మానాం రాజపుత్రం ప్రతీక్షతే ||

4

ప్రవివేశాథ రామస్తు స్వ వేశ్మ సువిభూషితమ్ |
ప్రహృష్టజనసంపూర్ణం హ్రియా కించిదవాఙ్ముఖః ||

5

అథ సీతా సముత్పత్య వేపమానా చ తం పతిమ్ |
అపశ్యచ్ఛోకసంతప్తం చింతావ్యాకులితేంద్రియమ్ ||

6

తాం దృష్ట్వా స హి ధర్మాత్మా న శశాక మనోగతమ్ |
తం శోకం రాఘవః సోఢుం తతో వివృతతాం గతః ||

7

వివర్ణవదనం దృష్ట్వా తం ప్రస్విన్నమమర్షణమ్ |
ఆహ దుఃఖాభిసంతప్తా కిమిదానీమిదం ప్రభో ||

8

అద్య బార్హస్పతః శ్రీమానుక్తః పుష్యో ను రాఘవ |
ప్రోచ్యతే బ్రాహ్మణైః ప్రాజ్ఞైః కేన త్వమసి దుర్మనాః ||

9

న తే శతశలాకేన జలఫేననిభేన చ |
ఆవృతం వదనం వల్గు ఛత్రేణాభివిరాజతే ||

10

వ్యజనాభ్యాం చ ముఖ్యాభ్యాం శతపత్రనిభేక్షణమ్ |
చంద్రహంసప్రకాశాభ్యాం వీజ్యతే న తవాననమ్ ||

11

వాగ్మినో వందినశ్చాపి ప్రహృష్టాస్త్వం నరర్షభ |
స్తువంతో నాత్ర దృశ్యంతే మంగలైః సూతమాగధాః ||

12

న తే క్షౌద్రం చ దధి చ బ్రాహ్మణా వేద పారగాః |
మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య దధతి స్మ విధానతః ||

13

న త్వాం ప్రకృతయః సర్వాః శ్రేణీముఖ్యాశ్చ భూషితాః |
అనువ్రజితుమిచ్చంతి పౌరజాపపదాస్తథా ||

14

చతుర్భిర్వేగసంపన్నైర్హయైః కాంచనభూషణైః |
ముఖ్యః పుష్యరథో యుక్తః కిం న గచ్ఛతి తేఽగ్రతః ||

15

న హస్తీ చాగ్రతః శ్రీమాంస్తవ లక్షణపూజితః |
ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణమేఘగిరిప్రభః ||

16

న చ కాంచనచిత్రం తే పశ్యామి ప్రియదర్శన |
భద్రాసనం పురస్కృత్య యాతం వీరపురస్కృతమ్ ||

17

అభిషేకో యదా సజ్జః కిమిదానీమిదం తవ |
అపూర్వో ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే ||

18

ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందనః |
సీతే తత్రభవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనమ్ ||

19

కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి |
శృణు జానకి యేనేదం క్రమేణాభ్యాగతం మమ ||

20

రాజ్ఞా సత్యప్రతిజ్ఞేన పిత్రా దశరథేన మే |
కైకేయ్యై మమ మాత్రే తు పురా దత్తో మహావరౌ ||

21

తయాఽద్య మమ సజ్జేఽస్మిన్నభిషేకే నృపోద్యతే |
ప్రచోదితః ససమయో ధర్మేణ ప్రతినిర్జితః ||

22

చతుర్దశ హి వర్షాణి వస్తవ్యం దండకే మయా |
పిత్రా మే భరతశ్చాపి యౌవరాజ్యే నియోజితః ||

23

సోఽహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనమ్ |
భరతస్య సమీపే తే నాహం కథ్యః కదాచన ||

24

ఋద్ధియుక్తా హి పురుషా న సహంతే పరస్తవమ్ |
తస్మాన్న తే గుణాః కథ్యా భరతస్యాగ్రతో మమ ||

25

నాపి త్వం తేన భర్తవ్యా విశేషేణ కదాచన |
అనుకూలతయా శక్యం సమీపే తస్య వర్తితుమ్ ||

26

తస్మై దత్తం నృపతినా యౌవరాజ్యం సనాతనమ్ |
స ప్రసాద్యస్త్వయా సీతే నృపతిశ్చ విశేషతః ||

27

అహం చాపి ప్రతిజ్ఞాం తాం గురోః సమనుపాలయన్ |
వనమద్యైవ యాస్యామి స్థిరా భవ మనస్వినీ ||

28

యాతే చ మయి కల్యాణి వనం మునినిషేవితమ్ |
వ్రతోపవాసపరయా భవితవ్యం త్వయానఘే ||

29

కాల్యముత్థాయ దేవానాం కృత్వా పూజాం యథావిధి |
వందితవ్యో దశరథః పితా మమ నరేశ్వరః ||

30

మాతా చ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్శితా |
ధర్మమేవాగ్రతః కృత్వా త్వత్తః సమ్మానమర్హతి ||

31

వందితవ్యాశ్చ తే నిత్యం యాః శేషా మమ మాతరః |
స్నేహప్రణయసంభోగైః సమా హి మమ మాతరః ||

32

భ్రాతృపుత్రసమౌ చాపి ద్రష్టవ్యౌ చ విశేషతః |
త్వయా భరతశత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ ||

33

విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన |
స హి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ ||

34

ఆరాధితా హి శీలేన ప్రయత్నైశ్చోపసేవితాః |
రాజానః సంప్రసీదంతి ప్రకుప్యంతి విపర్యయే ||

35

ఔరసానపి పుత్రాన్హి త్యజంత్యహితకారిణః |
సమర్థాన్సంప్రగృహ్ణంతి పరానపి నరాధిపాః ||

36

సా త్వం వసేహ కల్యాణి రాజ్ఞః సమనువర్తినీ |
భరతస్య రతా ధర్మే సత్యవ్రతపరాయణా ||

37

అహం గమిష్యామి మహావనం ప్రియే
త్వయా హి వస్తవ్యమిహైవ భామిని |
యథా వ్యలీకం కురుషే న కస్యచి-
-త్తథా త్వయా కార్యమిదం వచో మమ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 26 Meaning In Telugu

తల్లి కౌసల్య నుండి ఆశీర్వాదములు పొందిన రాముడు అక్కడనుండి బయలు దేరాడు. ఇంక వనవాసమునకు వెళ్లడానికి మనస్సును సిద్ధం చేసుకుంటున్నాడు. కౌసల్య మందిరమునుండి బయటకు వచ్చాడు.

రాత్రి అంతా ఉపవాసము చేసి జాగరణ చేసిన సీత ఉదయము రాముని రాకకై ఎదురు చూస్తూ ఉంది. “పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది. కాని రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమయి ఉంటుంది” అని తనలో తాను తర్కించుకుంటూ
ఉంది.

ఇంతలో రాముడు సీత ఉన్న మందిరములోకి ప్రవేశించాడు. రాముని ముఖంలో కనపడుతున్న బాధను, వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచి పెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేకపోయాడు.

రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూచి సీత “ప్రభూ! ఏమి జరిగింది. ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు. ఈరోజు పుష్యమీ నక్షత్రము. తమరి పట్టాభిషేకము జరుగురోజు. వసిష్ఠుల వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా! ఆనందము గా ఉండక ఎందుకు మీరు బాధతో విలవిలలాడిపోతున్నారు.

ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమింప బడ్డ వంది మాగధులు కనపడటం లేదు. ఏమి కారణము? ఇంకనూ పట్టాభి షేకము జరగలేదా! తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా!

తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు. తమరు కాలి నడకన వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథము ఏమయినది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవ వలసిన మదగజము కనపడటం లేదు. అసలు తమరి ముఖంలో పట్టాభిషేకము చేసుకొనబోవు రాకుమారుడి సంతోషము ఆనందము కనబడటం లేదు. కారణమేమి?” అని పరి పరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత.

దానికిరాముడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా తండ్రి నన్ను అరణ్యవాసమునకు వెళ్లమన్నాడు. నీకు ధర్మములు అన్నీ తెలుసు కదా! ఈ విపరీత పరిణామము ఎందు వల్ల సంభవించినదో వివరంగా
చెబుతాను విను. నా తండ్రి దశరథమహారాజు నిత్యసత్యవ్రతుడు. ఎన్నడూ ఆడిన మాట తప్పడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము రెండువరములు ఇచ్చాడట.

నా పట్టాభిషేక వార్త విన్న కైక, నా తండ్రిని ఆ రెండు వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. రెండవ వరము–నాకు మారుగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను.

నేను లేని సమయములో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి గానీ, నా గుణగణములు గురించి గానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడటం సహించలేరు. ఇంకొకమాట. నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు.

నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంత కాలమే నీవు ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉనా తండ్రి దశరథుడు వంశపారంపర్యముగా జ్యేష్టునికి చెందవలసిన రాజ్యమును, భరతునికి ఇచ్చాడు. కాబట్టి నీవు నీమామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.

నేను వనవాసము వెళు తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయములో నీవు వ్రతములు, ఉపవాసవ్రతములు చేస్తూ ఉండు. నీవు పొద్దుటే లేచి, పూజాదికములు అయిన తరువాత, నా తండ్రి దశరథునికి నమస్కరించడం మరిచిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు, వృద్ధురాలు అయిన కౌసల్య నేను అడవులకు వెళుతున్నాను. అని కృంగి, కృశించి పోవుచున్నది. ఆమె యోగక్షేమములు చూడటం నీ ధర్మము. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతేకాదు. నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారి నందరినీ గౌరవించు.

నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్రసమానులు. వారిని తగురీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాకుకులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించేవారిని ఆదరిస్తారు. లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుని నువ్వు ఒక రాజుగా ఆదరించు.

నీ ధర్మమును నువ్వు నిర్వర్తించు. ఈ పదునాలుగు సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నాను అని మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్వత్.

అయోధ్యాకాండ సప్తవింశః సర్గః (27) >>

Ayodhya Kanda Sarga 25 In Telugu | అయోధ్యాకాండ పంచవింశః సర్గః

Ayodhya Kanda Sarga 25 In Telugu

అయోధ్యా కాండ సర్గ 25 రామాయణంలో ఒక కీలకమైన అధ్యాయం, ఇందులో పాత్రలు ఎదుర్కొనే భావోద్వేగ మరియు నైతిక సంక్లిష్టతలను ముందుకు తీసుకువస్తుంది. ఈ విభాగంలో, తన కుమారుడి వనవాసాన్ని ఒప్పుకోవడానికి దశరథ మహారాజు అనుభవిస్తున్న కష్టాన్ని మనం చూస్తాము. రాముని విడిపోవడం వల్ల అయోధ్య ప్రజలు అనుభవిస్తున్న గాఢమైన దుఃఖాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ ఇతిహాస భాగం రాముని వనవాసం అతని కుటుంబం మరియు రాజ్యం మీద పడిన ప్రగాఢ ప్రభావాన్ని ఎత్తిచూపుతూ, విశ్వాసం, ప్రేమ మరియు ధర్మం (నైతిక కర్తవ్యము) కోరుకునే బాధాకరమైన త్యాగాల అంశాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. రాముని తిరుగు ప్రయాణానికి ముంగిలి సిద్ధం చేస్తుంది.

మాతృస్వస్త్యయనమ్

సాఽపనీయ తమాయాసముపస్పృశ్య జలం శుచిః |
చకార మాతా రామస్య మంగలాని మనస్వినీ ||

1

న శక్యసే వారయితుం గచ్ఛేదానీం రఘూత్తమ |
శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాంక్రమే ||

2

యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ |
స వై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు ||

3

యేభ్యః ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ |
తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః ||

4

యాని దత్తాని తేఽస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా |
తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా ||

5

పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా |
సత్యేన చ మహాబాహో చిరం జీవాభిరక్షితః ||

6

సమిత్కుశపవిత్రాణి వేద్యశ్చాయతనాని చ |
స్థండిలాని విచిత్రాణి శైలా వృక్షాః క్షుపా హ్రదాః ||

7

పతంగాః పన్నగాః సింహాస్త్వాం రక్షంతు నరోత్తమ |
స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయః ||

8

స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగోఽర్యమా |
లోకపాలాశ్చ తే సర్వే వాసవప్రముఖాస్తథా ||

9

ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః |
దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా ||

10

స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః |
స్కందశ్చ భగవాన్దేవః సోమశ్చ సబృహస్పతిః ||

11

సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః |
యే చాపి సర్వతః సిద్ధా దిశశ్చ సదిగీశ్వరాః ||

12

స్తుతా మయా వనే తస్మిన్పాంతు త్వాం పుత్ర నిత్యశః |
శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ ||

13

ద్యౌరంతరిక్షం పృథివీ నద్యః సర్వాస్తథైవ చ |
నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహదేవతాః ||

14

అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితమ్ |
ఋతవశ్చైవ షట్ పుణ్యా మాసాః సంవత్సరాస్తథా ||

15

కలాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే |
మహావనే విచరతో మునివేషస్య ధీమతః ||

16

తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా |
రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణామ్ ||

17

క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్పుత్రక తే భయమ్ |
ప్లవగా వృశ్చికా దంశా మశకాశ్చైవ కాననే ||

18

సరీసృపాశ్చ కీటాశ్చ మా భూవన్గహనే తవ |
మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రా ఋక్షాశ్చ దంష్ట్రిణః ||

19

మహిషాః శృంగిణో రౌద్రా న తే ద్రుహ్యంతు పుత్రక |
నృమాంసభోజినో రౌద్రా యే చాన్యే సత్త్వజాతయః ||

20

మా చ త్వాం హింసిషుః పుత్ర మయా సంపూజితాస్త్విహ |
ఆగమాస్తే శివాః సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః ||

21

సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్గచ్ఛ పుత్రక |
స్వస్తి తేఽస్త్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః ||

22

సర్వేభ్యశ్చైవ దేవేభ్యో యే చ తే పరిపంథినః |
శుక్రః సోమశ్చ సూర్యశ్చ ధనదోఽథ యమస్తథా || [గురుః]

23

పాంతు త్వామర్చితా రామ దండకారణ్యవాసినమ్ |
అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షిముఖాచ్చ్యుతాః ||

24

ఉపస్పర్శనకాలే తు పాంతు త్వాం రఘునందన |
సర్వలోకప్రభుర్బ్రహ్మా భూతభర్తా తథర్షయః ||

25

యే చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినమ్ |
ఇతి మాల్యైః సురగణాన్గంధైశ్చాపి యశస్వినీ ||

26

స్తుతిభిశ్చానురూపాభిరానర్చాయతలోచనా | [అనుకూలాభిః]
జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా ||

27

హావయామాస విధినా రామమంగలకారణాత్ |
ఘృతం శ్వేతాని మాల్యాని సమిధః శ్వేతసర్షపాన్ ||

28

ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా |
ఉపాధ్యాయః స విధినా హుత్వా శాంతిమనామయమ్ ||

29

హుతహవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్ |
మధుదధ్యక్షతఘృతైః స్వస్తివాచ్య ద్విజాంస్తతః ||

30

వాచయామాస రామస్య వనే స్వస్త్యయనక్రియాః |
తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్వినీ ||

31

దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్ |
యన్మంగలం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే ||

32

వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగలమ్ |
యన్మంగలం సుపర్ణస్య వినతాఽకల్పయత్పురా ||

33

అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగలమ్ |
అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ ||

34

అదితిర్మంగలం ప్రాదాత్తత్తే భవతు మంగలమ్ |
త్రీన్విక్రమాన్ప్రక్రమతో విష్ణోరమితతేజసః ||

35

యదాసీన్మంగలం రామ తత్తే భవతు మంగలమ్ |
ఋతవః సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే ||

36

మంగలాని మహాబాహో దిశంతు శుభమంగలాః |
ఇతి పుత్రస్య శేషాంశ్చ కృత్వా శిరసి భామినీ ||

37

గంధైశ్చాపి సమాలభ్య రామమాయతలోచనా |
ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభామ్ ||

38

చకార రక్షాం కౌసల్యా మంత్రైరభిజజాప చ |
ఉవాచాతిప్రహృష్టేవ సా దుఃఖవశవర్తినీ ||

39

వాఙ్మాత్రేణ న భావేన వాచా సంసజ్జమానయా |
ఆనమ్య మూర్ధ్ని చాఘ్రాయ పరిష్వజ్య యశస్వినీ ||

40

అవదత్పుత్ర సిద్ధార్థో గచ్ఛ రామ యథాసుఖమ్ |
అరోగం సర్వసిద్ధార్థమయోధ్యాం పునరాగతమ్ ||

41

పశ్యామి త్వాం సుఖం వత్స సుస్థితం రాజవర్త్మని |
ప్రనష్టదుఃఖసంకల్పా హర్షవిద్యోతితాననా ||

42

ద్రక్ష్యామి త్వాం వనాత్ప్రాప్తం పూర్ణచంద్రమివోదితమ్ |
భద్రాసనగతం రామ వనవాసాదిహాగతమ్ || [భద్రం]

43

ద్రక్ష్యామి చ పునస్త్వాం తు తీర్ణవంతం పితుర్వచః |
మంగలైరుపసంపన్నో వనవాసాదిహాగతః |
వధ్వా మమ చ నిత్యం త్వం కామాన్ సంవర్ధ యాహి భో ||

44

మయార్చితా దేవగణాః శివాదయో
మహర్షయో భూతమహాసురోరగాః |
అభిప్రయాతస్య వనం చిరాయ తే
హితాని కాంక్షంతు దిశశ్చ రాఘవ ||

45

ఇతీవ చాశ్రుప్రతిపూర్ణలోచనా
సమాప్య చ స్వస్త్యయనం యథావిధి |
ప్రదక్షిణం చైవ చకార రాఘవం
పునః పునశ్చాపి నిపీడ్య సస్వజే ||

46

తథా తు దేవ్యా స కృతప్రదక్షిణో
నిపీడ్య మాతుశ్చరణౌ పునః పునః |
జగామ సీతానిలయం మహాయశాః
స రాఘవః ప్రజ్వలితః స్వయా శ్రియా ||

47

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 25 Meaning In Telugu

మనసు దిటవు పరచుకొన్న కౌసల్య, కళ్లు తుడుచుకొని, ముఖం కడుక్కొని, పాదప్రక్షాళనముచేసుకొని ఆచమనము చేసి, రామునికి మంగళకరమైన పనులు చేయుటకు ఉపక్రమించింది. “రామా! నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపుటకు సర్వవిధాలా ప్రయత్నించాను. కాని నీ పట్టు విడవకున్నావు.

నాయనా రామా! ధర్మం తప్పకుండా, మంచి మార్గములో నడుస్తూ, వనవాసము పూర్తి చేసుకొని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో! నీకు సదా శుభంగుతుంది. రామా! నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యములకు వెళు తున్నావో, ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండును గాక!. రామా! నీవు దేవాలయములకు వెళ్లి సమస్త దేవతలకు ప్రణామం చెయ్యి. ఆ దేవతలే నిన్ను సదా కాపాడుదురు గాక!

నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు, శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక! రామా! నీవు నమ్ముకున్న సత్యము, నీవు ఇప్పటి వరకూ చేసిన మాతృ సేవ, పితృ సేవ నిన్ను రక్షించును గాక! ఓ రామా! మంగళ కరములైన సమిధలు, దర్భలు, అగ్నిహోత్రము, దైవ

సన్నిది నిన్ను అనునిత్యమూ రక్షించు గాక! ఈ ప్రకృతి లోని వృక్షములు, నదులు, పక్షులు, క్రూరమృగములు, సరీసృపములు నీకు ఎలాంటి హానీ చెయ్యకుండా, నిన్ను సదా కాపాడుగాక! ఓ రామా! సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విశ్వేదేవతలు, మరుత్తులు, మహర్షులు, బ్రహ్మదేవుడు, విధి, సూర్యుడు, దేవేంద్రుడు, లోకపాలకులు నీకు సదా మేలు చేయుదురు గాక!

ఓ రామా! నీకు కాలము, ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రింబగళ్లు, సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక! ఓ రామా! స్మృతులు, శ్రుతులు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు, చంద్రుడు, కుమారస్వామి నిన్ను దయతో కాపాడుడుదురు గాక!

నీ అరణ్యవాస కాలములో దిక్కులు నిన్ను సదా కాపాడుగాక! అరణ్యములలో ఉన్న పర్వతములు, కొండలు, గుహలు, భూమి, ఆకాశము, స్వర్గము, నక్షత్రములు, గృహములు, వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింబగళ్లు, రెండు సంధ్యవేళల్లో కాపాడుదురు గాక ! నీవు అరణ్యములలో ఉన్న ప్రతిదినము, మాసము, సంవత్సరము, నీకు సదా సుఖము నిచ్చు గాక! నీ అరణ్య వాస కాలములో సమస్త దేవతలు, దైత్యులు, నిన్ను కాపాడుదురు గాక!

నీ వనవాస కాలములో నీకు రాక్షసుల నుండి, రుద్రులు, పిశాచముల నుండి క్రూరమృగముల నుండి నీకు భయము లేకుండు గాక! అరణ్యములో ఉన్న కోతులు, తేళ్లు, పాములు, ఇతర కీటకములు, అలాగే సింహములు, పులులు, ఏనుగులు ఇతర
మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండు గాక!

ఆకాశంలోనూ, భూమి మీదా ఉందే సమస్త దేవతలు నీకు శుభం కలిగించు గాక! నీకు శత్రుభయం లేకుండు గాక! రామా! అనునిత్యము నేను పూజించే విష్ణువు, మహేశ్వరుడు, పంచ భూతములు, నవగ్రహములు, నా పూజలకు సంతసించి నిన్ను సదా రక్షింతురు గాక!” అని కౌసల్య సమస్త దేవతల రక్షలను రామునికి అందించింది.

సమస్త దేవతలకు పూజలు చేసింది. బ్రాహ్మణుల చేత హెూమములు చేయించింది. మంగళాచరణము చేయించింది. హోమము చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దక్షిణలు ఇచ్చింది. కౌసల్యకు ఇంకా తృప్తి కలగ లేదు. తాను స్వయంగా మంగళా చరణము చేయసాగింది.

“ఓ రామా! వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రునికి కలిగిన మంగళము నీకు కలుగుగాక! పూర్వము అమృతము తీసుకు రావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినత చేసిన మంగళాశాసనము నీకు కలుగుగాక! వామనావతారములో విష్ణువు మూడు అడుగులు కొలిచినప్పుడు విష్ణువునకు కలిగిన మంగళము నీకు కలుగు గాక!”

అని రాముని తలమీద అక్షతలు వేసి ఆశీర్వదించింది కౌసల్య విశల్యకరణి అనే ఓషధిని రామునికి రక్షగా కట్టింది. కౌసల్య ఇవన్నీ చేస్తూ ఉంది కానీ లోపల దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. బలవంతాన అణుచుకుంటూ ఉంది.

“రామా! నీవు వనవాసకాలమును అతి త్వరగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చి రాజ్యాధికారమును చేపట్టు. నన్ను, నీ భార్య సీతను సంతోషపెట్టు. రామా! శుభంగా వెళ్లిరా. నేను నిత్యమూ పూజించే శివుడు, విష్ణువు, మహర్షులు, సమస్త దేవతలు
నిన్ను సదా రక్షించుదురు గాక!

“అని కళ్ల నిండా నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది. రాముడు కూడా తల్లి కౌసల్యకు భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి, ఆమె దగ్గర సెలవు తీసుకొని సీత ఉన్న మందిరమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచవింశః సర్గః (26) >>

Ayodhya Kanda Sarga 24 In Telugu | అయోధ్యాకాండ చతుర్వింశః సర్గః

Ayodhya Kanda Sarga 24 In Telugu

అయోధ్యా కాండ చతుర్వింశః సర్గః రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇందులో పాత్రల భావోద్వేగాలు మరియు సందిగ్ధతలు ముందు వస్తాయి. ఈ విభాగంలో, దశరథ మహారాజు తన ప్రియమైన కుమారుడు రాముడు వనవాసానికి వెళ్లడం వలన, కైకేయికి ఇచ్చిన మాట యొక్క ఫలితాలను ఎలా ఎదుర్కొంటున్నాడో చూపిస్తుంది. ఈ అధ్యాయం ధర్మం (నైతిక కర్తవ్యము), త్యాగం మరియు ఆవశ్యకమైన బాధ వంటి అంశాలను ప్రదర్శిస్తుంది. ఈ హృదయ విదారక భాగం రాముని యాత్రలో తరువాత జరిగే సంఘటనలకు పునాదిగా ఉండి, ఇతిహాసంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది.

కౌసల్యార్తిసమాశ్వాసనమ్

తం సమీక్ష్య త్వవహితం పితుర్నిర్దేశపాలనే |
కౌసల్యా బాష్పసంరుద్ధా వచో ధర్మిష్ఠమబ్రవీత్ ||

1

అదృష్టదుఃఖో ధర్మాత్మా సర్వభూతప్రియంవదః |
మయి జాతో దశరథాత్కథముంఛేన వర్తయేత్ ||

2

యస్య భృత్యాశ్చ దాసాశ్చ మృష్టాన్యన్నాని భుంజతే |
కథం స భోక్ష్యతే నాథో వనే మూలఫలాన్యయమ్ ||

3

క ఏతచ్ఛ్రద్దధేచ్ఛ్రుత్వా కస్య వా న భేవద్భయమ్ |
గుణవాన్దయితో రాజా రాఘవో యద్వివాస్యతే ||

4

నూనం తు బలవాఁల్లోకే కృతాంతః సర్వమాదిశన్ |
లోకే రామాభిరామస్త్వం వనం యత్ర గమిష్యసి ||

5

అయం తు మామాత్మభవస్తవాదర్శనమారుతః |
విలాపదుఃఖసమిధో రుదితాశ్రుహుతాహుతిః ||

6

చింతాబాష్పమహాధూమస్తవాదర్శనచిత్తజః |
కర్శయిత్వా భృశం పుత్ర నిఃశ్వాసాయాససంభవః ||

7

త్వయా విహీనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ |
ప్రధక్ష్యతి యథా కక్షం చిత్రభానుర్హిమాత్యయే ||

8

కథం హి ధేనుః స్వం వత్సం గచ్ఛంతం నానుగచ్ఛతి |
అహం త్వాఽనుగమిష్యామి పుత్ర యత్ర గమిష్యసి ||

9

తథా నిగదితం మాత్రా తద్వాక్యం పురుషర్షభః |
శ్రుత్వా రామోఽబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

10

కైకేయ్యా వంచితో రాజా మయి చారణ్యమాశ్రితే |
భవత్యా చ పరిత్యక్తో న నూనం వర్తయిష్యతి ||

11

భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |
స భవత్యా న కర్తవ్యో మనసాఽపి విగర్హితః ||

12

యావజ్జీవతి కాకుత్స్థః పితా మే జగతీపతిః |
శుశ్రూషా క్రియతాం తావత్స హి ధర్మః సనాతనః ||

13

ఏవముక్తా తు రామేణ కౌసల్యా శుభదర్శనా |
తథేత్యువాచ సుప్రీతా రామమక్లిష్టకారిణమ్ ||

14

ఏవముక్తస్తు వచనం రామో ధర్మభృతాం వరః |
భూయస్తామబ్రవీద్వాక్యం మాతరం భృశదుఃఖితామ్ ||

15

మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః |
రాజా భర్తా గురుః శ్రేష్ఠః సర్వేషామీశ్వరః ప్రభుః ||

16

ఇమాని తు మహారణ్యే విహృత్య నవ పంచ చ |
వర్షాణి పరమప్రీతః స్థాస్యామి వచనే తవ ||

17

ఏవముక్తా ప్రియం పుత్రం బాష్పపూర్ణాననా తదా |
ఉవాచ పరమార్తా తు కౌసల్యా పుత్రవత్సలా ||

18

ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యే న మే క్షమమ్ |
నయ మామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీమివ ||

19

యది తే గమనే బుద్ధిః కృతా పితురపేక్షయా |
తాం తథా రుదతీం రామో రుదన్వచనమబ్రవీత్ ||

20

జీవంత్యా హి స్త్రియా భర్తా దైవతం ప్రభురేవ చ |
భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభుః ||

21

న హ్యనాథా వయం రాజ్ఞా లోకనాథేన ధీమతా |
భరతశ్చాపి ధర్మాత్మా సర్వభూతప్రియం‍వదః ||

22

భవతీమనువర్తేత స హి ధర్మరతః సదా |
యథా మయి తు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివః ||

23

శ్రమం నావాప్నుయాత్కించిదప్రమత్తా తథా కురు |
దారుణశ్చాప్యయం శోకో యథైనం న వినాశయేత్ ||

24

రాజ్ఞో వృద్ధస్య సతతం హితం చర సమాహితా |
వ్రతోపవాసనిరతా యా నారీ పరమోత్తమా ||

25

భర్తారం నానువర్తేత సా తు పాపగతిర్భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమమ్ ||

26

అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ |
శుశ్రూషామేవ కుర్వీత భర్తుః ప్రియహితే రతా ||

27

ఏష ధర్మః పురా దృష్టో లోకే వేదే శ్రుతః స్మృతః |
అగ్నికార్యేషు చ సదా సుమనోభిశ్చ దేవతాః ||

28

పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణాశ్చైవ సువ్రతాః |
ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమనకాంక్షిణీ ||

29

నియతా నియతాహారా భర్తృశుశ్రూషణే రతా |
ప్రాప్స్యసే పరమం కామం మయి ప్రత్యాగతే సతి ||

30

యది ధర్మభృతాం శ్రేష్ఠో ధారయిష్యతి జీవితమ్ |
ఏవముక్తా తు రామేణ బాష్పపర్యాకులేక్షణా ||

31

కౌసల్యా పుత్రశోకార్తా రామం వచనమబ్రవీత్ |
గమనే సుకృతాం బుద్ధిం న తే శక్నోమి పుత్రక ||

32

వినివర్తయితుం వీర నూనం కాలో దురత్యయః |
గచ్ఛ పుత్ర త్వమేకాగ్రో భద్రం తేఽస్తు సదా విభో ||

33

పునస్త్వయి నివృత్తే తు భవిష్యామి గతక్లమా |
ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే ||

34

పితురానృణ్యతాం ప్రాప్తే త్వయి లప్స్యే పరం సుఖమ్ |
కృతాంతస్య గతిః పుత్ర దుర్విభావ్యా సదా భువి ||

35

యస్త్వాం సంచోదయతి మే వచ ఆచ్ఛిద్య రాఘవ |
గచ్ఛేదానీం మహాబాహో క్షేమేణ పునరాగతః ||

36

నందయిష్యసి మాం పుత్ర సామ్నా వాక్యేన చారుణా |
అపీదానీం స కాలః స్యాద్వనాత్ప్రత్యాగతం పునః |
యత్త్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణమ్ ||

37

తథా హి రామం వనవాసనిశ్చితం
సమీక్ష్య దేవీ పరమేణ చేతసా |
ఉవాచ రామం శుభలక్షణం వచో
బభూవ చ స్వస్త్యయనాభికాంక్షిణీ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్వింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 24 Meaning In Telugu

రాముని నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లి పోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలచు కొని తల్లడిల్లి పోయింది. “రామా! ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో మున్యాశ్రమములలో వారు ఇచ్చు ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీ కన్నా మెరుగైన భోజనము చేస్తుంటారు కదా! నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు. రామా! నీవంటి సద్గుణములు కలవాడిని, ప్రీతి పాత్రుడిని, నిర్దయగా రాజు అరణ్యము లకు పంపుతున్నాడే ఇంక మాలాంటి వారిగతి ఏమిటి? రామా! నీవు వెళ్లిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది.

రామా! నీవు చెప్పినది సత్యము. నీ లాంటి వాడినే అరణ్యము లకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్లిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది. ఆ శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం. అందుకే రామా! నన్ను కూడా నీ వెంట తీసుకొనిపో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరము. పద పోదాము.” అని రాముని వెంట వెళ్లడానికి కౌసల్య

ఉద్యుక్తురాలయింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు. “అమ్మా! అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను. నీకు తెలుసు గదా! కైక తండ్రి గారిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చి నట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేక పోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు. నీవు కూడా తండ్రిగారిని విడిచి పెట్టి నాతో అరణ్యములకు వస్తే, తండ్రిగారు జీవించడం కల్ల.

కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటే ఇక్కడే ఉండాలి. పైగా, నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చెయ్యడం నీ కర్తవ్యము. ధర్మము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.” అన్నాడు రాముడు.

రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేక పోయింది. “రామా! నీవు చెప్పినట్టే చేస్తాను.” అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు. “అమ్మా! నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు. మనల నందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము. నీవు అలా చూస్తూ ఉండగానే పదునాలుగేళ్ల వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ కళ్లముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తాను.” అని

అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క దుఃఖము, మరొక పక్క సంతోషమూ కలిగాయి. కాని రాముడు వెళ్లిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలచుకొనే సరికి ఆమెకు శరీరం వణికిపోయింది.
“రామా! నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతుకనీయరు. నన్ను నీ వెంట తీసుకొని పో” అని భోరున ఏడవసాగింది. వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు. రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దుఃఖము పార్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరలా మరొక సారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు.

“అమ్మా! అదేంటమ్మా అలా అంటావు. నీవు అయోధ్యకు పట్టమహిషిని. దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు. అందరూ నీ కనుసన్నలలో మెలగవలసిన వారే కదా! పైగా మహారాజు గారు నేవెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది. రాజు ఉన్నంతకాలము నీవు అనాధవు ఎలా అవుతావు? పైగా నా తరువాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీవు అంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాటా విని అధర్మమునకు తలవంచడు. ఇంక నీకేం భయం. కాబట్టి ఆ భయాలు, అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు. వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు.

ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము. అమ్మా! స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉప వాసములు, పుణ్య కార్యములు చేసినను, భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెబుతుంది కదా! అలాగే ఏ దేవతలకూ పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా! భర్తకు అనుకూలవతిగా, ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండటం భార్యకు పరమధర్మము అని వేదములు, శాస్త్రములు, శ్రుతులు, స్మృతులలో చెప్పబడింది కదా!

అమ్మా! నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించు కుంటూ, నా క్షేమం కోసం వ్రతాలూ, పూజలూ చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధా లేకుండా క్షేమంగా ఉంటానమ్మా! నీవు చేసే పూజలూ, వ్రతాలూ నన్ను సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటయమ్మా! నీవు ఇలా చేసావనుకో ఈ పదునాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తరువాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను.” అని తల్లిని బుజ్జగించాడు రాముడు.

కౌసల్య కొడుకు మాటలకు మారు మాటాడలేకపోయింది. కళ్లు తుడుచుకొంది. “రామా! విధి బలీయమయింది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్లిరా.

నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగు గాక! నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగి పోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను. కాని రామా! మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యము లకు వెళ్లమని ప్రేరేపించు చున్న ఆ దైవము యొక్క లీలలను ఎవరూ అర్థం చేసుకోలేరు.

రామా! నీ పద్నాలుగేళ్ల వనవాసము ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనములనుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది!’ అని ఆశాభావంతో పలికింది కౌసల్య. తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచవింశః సర్గః (25) >>

Ayodhya Kanda Sarga 42 In Telugu – అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గ, “దశరథాక్రందః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముడు వనవాసానికి వెళ్లిన దుఃఖంలో ఉండి కన్నీళ్లు కారుస్తాడు. రాముడు తన దగ్గర లేనందుకు, అతను చనిపోయే సమయానికి కూడా తన కుమారుడిని చూడలేనందుకు, దశరథ మహారాజు గాఢమైన వ్యధతో విలపిస్తాడు. ఈ సర్గ దశరథుడి బాధ, అతని ప్రేమ, మరియు రాముడి వలన కలిగిన శూన్యతను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది. ఈ కథనం దశరథ మహారాజు, ఆయన కుమారుడు రాముడి మధ్య ఉన్న అనుబంధం, మరియు విధి పట్ల ఆయన బాధ్యతలను ప్రతిబింబిస్తుంది.

దశరథాక్రందః

యావత్తు నిర్యతస్తస్య రజోరూపమదృశ్యత |
నైవేక్ష్వాకువరస్తావత్సంజహారాత్మచక్షుషీ ||

1

యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యత్యంతధార్మికమ్ |
తావద్వ్యవర్ధతేవాస్య ధరణ్యాం పుత్రదర్శనే ||

2

న పశ్యతి రజోఽప్యస్య యదా రామస్య భూమిపః |
తదాఽర్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే ||

3

తస్య దక్షిణమన్వాగాత్కౌసల్యా బాహుమంగనా |
వామం చాస్యాన్వగాత్పార్శ్వం కైకేయీ భరతప్రియా ||

4

తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ |
ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యథితేంద్రియః ||

5

కైకేయి మా మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణీ |
న హి త్వాం ద్రష్టుమిచ్ఛామి న భార్యా న చ బాంధవీ ||

6

యే చ త్వామనుజీవంతి నాహం తేషాం న తే మమ |
కేవలార్థపరాం హి త్వాం త్యక్తధర్మాం త్యజామ్యహమ్ ||

7

అగృహ్ణాం యచ్చ తే పాణిమగ్నిం పర్యణయం చ యత్ |
అనుజానామి తత్సర్వమస్మిన్ లోకే పరత్ర చ ||

8

భరతశ్చేత్ప్రతీతః స్యాద్రాజ్యం ప్రాప్యేదమవ్యయమ్ |
యన్మే స దద్యాత్పిత్రర్థం మామాం తద్దత్తమాగమత్ ||

9

అథ రేణుసముధ్వస్తం తముత్థాప్య నరాధిపమ్ |
న్యవర్తత తదా దేవీ కౌసల్యా శోకకర్శితా ||

10

హత్వేవ బ్రాహ్మణం కామాత్స్పృష్ట్వాఽగ్నిమివ పాణినా |
అన్వతప్యత ధర్మాత్మా పుత్రం సంచింత్య తాపసమ్ ||

11

నివృత్యైవ నివృత్యైవ సీదతో రథవర్త్మసు |
రాజ్ఞో నాతిబభౌ రూపం గ్రస్తస్యాంశుమతో యథా ||

12

విలలాప చ దుఃఖార్తః ప్రియం పుత్రమనుస్మరన్ |
నగరాంతమనుప్రాప్తం బుద్ధ్వా పుత్రమథాబ్రవీత్ ||

13

వాహనానాం చ ముఖ్యానాం వహతాం తం మమాత్మజమ్ |
పదాని పథి దృశ్యంతే స మహాత్మా న దృశ్యతే ||

14

యః సుఖేషూషధానేషు శేతే చందనరూషితః |
వీజ్యమానో మహార్హాభిః స్త్రీభిర్మమ సుతోత్తమః ||

15

స నూనం క్వచిదేవాద్య వృక్షమూలముపాశ్రితః |
కాష్ఠం వా యది వాఽశ్మానముపధాయ శయిష్యతే ||

16

ఉత్థాస్యతి చ మేదిన్యాః కృపణః పాంసుకుంఠితః |
వినిశ్శ్వసన్ప్రస్రవణాత్కరేణూనామివర్షభః ||

17

ద్రక్ష్యంతి నూనం పురుషాః దీర్ఘబాహుం వనేచరాః |
రామముత్థాయ గచ్ఛంతం లోకనాథమనాథవత్ ||

18

సా నూనం జనకస్యేష్టా సుతా సుఖసదోచితా |
కంటకాక్రమణక్రాంతా వనమద్య గమిష్యతి ||

19

అనభిజ్ఞా వనానాం సా నూనం భయముపైష్యతి |
శ్వాపదానర్ధితం శ్రుత్వా గంభీరం రోమహర్షణమ్ ||

20

సకామా భవకైకేయి విధవా రాజ్యమావస |
న హి తం పురుషవ్యాఘ్రం వినా జీవితుముత్సహే ||

21

ఇత్యేవం విలపన్రాజా జనౌఘేనాభిసంవృతః |
అపస్నాత ఇవారిష్టం ప్రవివేశ పురోత్తమమ్ ||

22

శూన్యచత్వరవేశ్మాంతాం సంవృతాపణదేవతామ్ |
క్లాంతదుర్బలదుఃఖార్తాం నాత్యాకీర్ణమహాపథామ్ ||

23

తామవేక్ష్య పురీం సర్వాం రామమేవానుచింతయన్ |
విలపన్ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవాంబుదమ్ ||

24

మహాహ్రదమివాక్షోభ్యం సుపర్ణేన హృతోరగమ్ |
రామేణ రహితం వేశ్మ వైదేహ్యా లక్ష్మణేన చ ||

25

అథ గద్గదశబ్దస్తు విలపన్మనుజాధిపః |
ఉవాచ మృదుమందార్థం వచనం దీనమస్వరమ్ ||

26

కౌసల్యాయాం గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మామ్ |
న హ్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి ||

27

ఇతి బ్రువంతం రాజానమనయన్ద్వారదర్శినః |
కౌసల్యాయా గృహం తత్ర న్యవేశ్యత వినీతవత్ ||

28

తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయా నివేశనమ్ |
అధిరుహ్యాపి శయనం బభూవ లులితం మనః ||

29

పుత్రద్వయవిహీనం చ స్నుషయాఽపి వివర్జితమ్ |
అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివాంబరమ్ ||

30

తచ్చ దృష్ట్వా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ హారాఘవ జహాసి మామ్ ||

31

సుఖితా బత తం కాలం జీవిష్యంతి నరోత్తమాః |
పరిష్వజంతో యే రామం ద్రక్ష్యంతి పునరాగతమ్ ||

32

అథ రాత్ర్యాం ప్రపన్నాయాం కాలరాత్ర్యామివాత్మనః |
అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్ ||

33

రామం మేఽనుగతా దృష్టిరద్యాపి న నివర్తతే |
న త్వా పశ్యామి కౌసల్యే సాధుమాం పాణినా స్పృశ ||

34

తం రామమేవానువిచింతయంతం
సమీక్ష్య దేవీ శయనే నరేంద్రమ్ |
ఉపోపవిశ్యాధికమార్తరూపా
వినిశ్వసంతీ విలలాప కృచ్ఛ్రమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 42 Meaning In Telugu

రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు.

దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను.” అని అన్నాడు దశరథుడు.

చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథములో కూర్చోపెట్టింది. తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయింది. దశరథుడు రాముని తల్చుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులువచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్లిపోయాడు అని చెప్పారు.

“అవును. రాముడు వెళ్లిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనపడటం లేదు. ప్రతిరోజూ చందనము పూసుకొని హంసతూలికా తల్పము మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్లంతా మట్టికొట్టుకొని ఉండగా, కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణమును తల కిందపెట్టుకొని నిద్రిస్తాడేమో! అయోధ్యలో స్నేహితులు, వందిమాగధులు వెంట రాగా
విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంట రాగా అడవులలో విహరిస్తాడేమో! మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కంది పోయే సీత పాదాలు, రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూరమృగములు అంటేనే భయపడే సీత రేపటినుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో!” అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు.

ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.

“ఓకైకా! నీ కోరిక తీరిందా! నీకళ్లు చల్లబడ్డాయా! ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు. నీవు విధవరాలవు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈరాజ్యాన్ని పాలించుకో.”అని అరుస్తున్నాడు.

ఈ విధంగా దశరథుడు రాముని కోసరం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవ బడలేదు. ఏ ఇంటి ముందరా జనం లేరు. దేవాలయాలు, అంగళ్లు, అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారము లేదు. అటువంటి అయోధ్య వీధులగుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు.

ఆరోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంత:పురములో ఉండలేకపోయూడు దశరథుడు. “నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే కౌసల్యమందిరమునకు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు. వెంటనే పరిచారికలు దశరథుని కౌసల్య మందిరము నకు తీసుకొని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్యమీద పడుకొన్నాడు.

కొడుకులు కోడళ్లు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడులేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉ లిక్కిపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. “రామా నన్ను విడిచి వెళ్లిపోయావా” అని అరుస్తున్నాడు. “పద్నాలుగేళ్ల వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపుడు, ఈ అయోధ్యా పౌరులం దరూ రామునికి ఘనస్వాగతము ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా! ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా!” అని వాపోతున్నాడు. దశరథుడు.

రాత్రి అయింది. దశరథుడు భోజనము చేయలేదు. నిద్రపోలేదు. అర్థరాత్రి కౌసల్యను పిలిచాడు. “కౌసల్యా! నాకుకళ్లు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్లిపోయింది. రాముని చూచిన కళ్లతో నేను దేనినీ చూడలేను. నన్ను తాకు. నిన్ను గుర్తుపడతాను.” అని అన్నాడు దశరథుడు.

భర్తమాటలకు కౌసల్యకు దుఃఖము ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యివేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిరెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>

Balakanda Sarga 44 In Telugu – బాలకాండ చతుశ్చత్వారింశః సర్గః

Balakanda Sarga 44 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – చతుశ్చత్వారింశః సర్గలో, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణులతో సిద్దాశ్రమానికి చేరుకుంటాడు. రాముడు యజ్ఞానికి రక్షణగా ఉంటాడు. అప్పుడు మారీచుడు, సుబాహుడు దానవ సైన్యంతో యజ్ఞాన్ని భంగం చేయడానికి వస్తారు. రాముడు మారీచుడిని దూరం పంపి, సుబాహును చంపేస్తాడు. రాముని శక్తి విశ్వామిత్రుని ఆనందపరుస్తుంది. రాముడు ధైర్యం, కర్తవ్యం, ధర్మపరిపాలనతో యజ్ఞాన్ని రక్షిస్తాడు.

సాగరోద్ధారః

స గత్వా సాగరం రాజా గంగయాఽనుగతస్తదా |
ప్రవివేశ తలం భూమేర్యత్ర తే భస్మసాత్కృతాః ||

1

భస్మన్యథాప్లుతే రామ గంగాయాః సలిలేన వై |
సర్వలోకప్రభుర్బ్రహ్మా రాజానమిదమబ్రవీత్ ||

2

తారితా నరశార్దూల దివం యాతాశ్చ దేవవత్ |
షష్టిః పుత్రసహస్రాణి సగరస్య మహాత్మనః ||

3

సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ |
సగరస్యాత్మజాస్తావత్స్వర్గే స్థాస్యంతి దేవవత్ ||

4

ఇయం హి దుహితా జ్యేష్ఠా తవ గంగా భవిష్యతి |
త్వత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుతా ||

5

గంగా త్రిపథగా నామ దివ్యా భాగీరథీతి చ |
[* త్రీన్ పథో భావయంతీతి తతస్త్రిపథగా స్మృతా | *]
పితామహానాం సర్వేషాం త్వమేవ మనుజాధిప ||

6

కురుష్వ సలిలం రాజన్ప్రతిజ్ఞామపవర్జయ |
పూర్వకేణ హి తే రాజంస్తేనాతియశసా తదా ||

7

ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథః |
తథైవాంశుమతా తాత లోకేఽప్రతిమతేజసా ||

8

గంగాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నాపవర్జితా |
రాజర్షిణా గుణవతా మహర్షిసమతేజసా ||

9

మత్తుల్యతపసా చైవ క్షత్రధర్మే స్థితేన చ |
దిలీపేన మహాభాగ తవ పిత్రాతితేజసా ||

10

పునర్న శంకితా నేతుం గంగాం ప్రార్థయతాఽనఘ |
సా త్వయా సమతిక్రాంతా ప్రతిజ్ఞా పురుషర్షభ ||

11

ప్రాప్తోఽసి పరమం లోకే యశః పరమసంమతమ్ |
యచ్చ గంగావతరణం త్వయా కృతమరిందమ ||

12

అనేన చ భవాన్ప్రాప్తో ధర్మస్యాయతనం మహత్ |
ప్లావయస్వ త్వమాత్మానం నరోత్తమ సదోచితే ||

13

సలిలే పురుషవ్యాఘ్ర శుచిః పుణ్యఫలో భవ |
పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియామ్ ||

14

స్వస్తి తేఽస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప |
ఇత్యేవముక్త్వా దేవేశః సర్వలోకపితామహః ||

15

యథాఽఽగతం తథాగచ్ఛద్దేవలోకం మహాయశాః |
భగీరథోఽపి రాజర్షిః కృత్వా సలిలముత్తమమ్ ||

16

యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశాః |
కృతోదకః శుచీ రాజా స్వపురం ప్రవివేశ హ ||

17

సమృద్ధార్థో నరశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస హ |
ప్రముమోద చ లోకస్తం నృపమాసాద్య రాఘవ ||

18

నష్టశోకః సమృద్ధార్థో బభూవ విగతజ్వరః |
ఏష తే రామ గంగాయా విస్తరోఽభిహితో మయా ||

19

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలోఽతివర్తతే |
ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్యం స్వర్గ్యమతీవ చ ||

20

యః శ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ |
ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ||

21

ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభమ్ |
యః శృణోతి చ కాకుత్స్థ సర్వాన్కామానవాప్నుయాత్ |
సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుశ్చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 44 Meaning In Telugu

భగీరథుని మనోరథమునెరవేరినది. గంగా జలము సగర పుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు.

” నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్లినారు. సాగరములు ఉన్నంత వరకూ వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది. ఈ గంగ దేవ లోకము నుండి భూలోకమునకు అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధ అనే పేరుతో కూడా పిలువ బడుతుంది.

ఓ భగీరథా! ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్షణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు, ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారము చేసావు. అఖండ మైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజూ ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీతుడవు కా! నీకు పుణ్యం వస్తుంది.” అని పలికాడు ‘బ్రహ్మ.. తరువాత బ్రహ్మ తనలోకమునకు వెళ్లిపోయాడు.

తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జల తరణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేసాడు.

ఓ రామా! ఇదీ గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివిన వాడు, విన్న వాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామా! సంధ్యాకాలము అయినది. వెళ్లి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించెదము.” అని పలికాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ పంచచత్వారింశః సర్గః (45) >>

Ayodhya Kanda Sarga 41 In Telugu – అయోధ్యాకాండ ఏకచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 41 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ  ఏకచత్వారింశః సర్గ రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, రాముడు తన పిత దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకుంటాడు. ఈ వార్త రాముడు, సీత మరియు లక్ష్మణులను మరింత దుఃఖంలోకి నెట్టివేస్తుంది. ఈ సర్గలో, రాముడు తన పిత ను స్మరించుకుంటూ, ఆయనతో గడిపిన అనుభవాలను తలుచుకుంటాడు. ఇది రాముడి వ్యక్తిత్వంలోని మరిన్ని పార్శ్వాలను మరియు అతని జీవితంలో కష్టకాలాలను పరిచయం చేస్తుంది. ఈ సంఘటనలు, రాముడి ధైర్యం, విధి నిష్ఠను, మరియు అతని ధార్మికతను ప్రతిఫలింపజేస్తాయి.

నగరసంక్షోభః

తస్మింస్తు పురుషవ్యాఘ్రే వినిర్యాతే కృతాంజలౌ |
ఆర్తశబ్దోఽథ సంజజ్ఞే స్త్రీణామంతఃపురే మహాన్ ||

1

అనాథస్య జనస్యాస్య దుర్బలస్య తపస్వినః |
యో గతిః శరణం చాసీత్స నాథః క్వను గచ్ఛతి ||

2

న క్రుధ్యత్యభిశప్తోఽపి క్రోధనీయాని వర్జయన్ |
క్రుద్ధాన్ప్రసాదయన్సర్వాన్సమదుఃఖః క్వచిద్గతః ||

3

కౌసల్యాయాం మహాతేజాః యథా మాతరి వర్తతే |
తథా యో వర్తతేఽస్మాసు మహాత్మా క్వ ను గచ్ఛతి ||

4

కైకేయ్యా క్లిశ్యమానేన రాజ్ఞా సంచోదితో వనమ్ |
పరిత్రాతా జనస్యాస్య జగతః క్వ ను గచ్ఛతి ||

5

అహో నిశ్చేతనో రాజా జీవలోకస్య సంప్రియమ్ |
ధర్మ్యం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్యతి ||

6

ఇతి సర్వా మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః |
రురుదుశ్చైవ దుఃఖార్తాః సస్వరం చ విచుక్రుశుః ||

7

స తమంతఃపురే ఘోరమార్తశబ్దం మహీపతిః |
పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా చాసీత్సుదుఃఖితః ||

8

నాగ్నిహోత్రాణ్యహూయంత నాపచన్గృహమేధినః |
అకుర్వన్న ప్రజాః కార్యం సూర్యశ్చాంతరధీయత ||

9

వ్యసృజన్కబలాన్నాగాః గావో వత్సాన్నపాయయన్ |
పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత ||

10

త్రిశంకుర్లోహితాంగశ్చ బృహస్పతిబుధావపి |
దారుణాః సోమమభ్యేత్య గ్రహాః సర్వే వ్యవస్థితాః ||

11

నక్షత్రాణి గతార్చీంషి గ్రహాశ్చ గతతేజసః |
విశాఖాస్తు సధూమాశ్చ నభసి ప్రచకాశిరే ||

12

కాలికానిలవేగేన మహోదధిరివోత్థితః |
రామే వనం ప్రవ్రజితే నగరం ప్రచచాల తత్ ||

13

దిశః పర్యాకులాః సర్వాస్తిమిరేణేవ సంవృతాః |
న గ్రహో నాపి నక్షత్రం ప్రచకాశే న కించన ||

14

అకస్మాన్నాగరః సర్వో జనో దైన్యముపాగమత్ |
ఆహారే వా విహారే వా న కశ్చిదకరోన్మనః ||

15

శోకపర్యాయసంతప్తః సతతం దీర్ఘముచ్ఛ్వసన్ |
అయోధ్యాయాం జనః సర్వః శుశోచ జగతీపతిమ్ ||

16

బాష్పపర్యాకులముఖో రాజమార్గగతో జనః |
న హృష్టః లక్ష్యతే కశ్చిత్సర్వః శోకపరాయణః ||

17

న వాతి పవనః శీతో న శశీ సౌమ్యదర్శనః |
న సూర్యస్తపతే లోకం సర్వం పర్యాకులం జగత్ ||

18

అనర్థినః సుతాః స్త్రీణాం భర్తారో భ్రాతరస్తథా |
సర్వే సర్వం పరిత్యజ్య రామమేవాన్వచింతయన్ ||

19

యే తు రామస్య సుహృదః సర్వే తే మూఢచేతసః |
శోకభారేణ చాక్రాంతాః శయనం న జుహుస్తదా ||

20

తతస్త్వయోధ్యా రహితా మహాత్మనా
పురందరేణేవ మహీ సపర్వతా |
చచాల ఘోరం భయశోకపీడితా
సనాగయోధాశ్వగణా ననాద చ ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 41 Meaning In Telugu

ఎప్పుడైతే రాముడు అంత:పురస్త్రీలకు అందరికీ నమస్కరించి బయటు దేరాడో, వారందరూ ఏడవడం మొదలుపెట్టారు.

“ఇంత కాలమూ రాముడు మాకు రక్షకుడుగా ఉండేవాడు. ఆ రాముడు ఇప్పుడు ఏడీ! మనము ఎలా బతకాలి!” అని వాపోతున్నారు. రాముని మంచి గుణములను తలచుకుంటూ ఏడుస్తున్నారు.

“రాముడికి అసలు కోపమే రాదు. ఎవరి మీద కోపగించడు. ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించిన, తిరిగి వారి మీద కోపింపడు. అటువంటి ఉత్తముడు రాముడు. అందరి కష్టసుఖములు తనవిగా అనుకొని ఆదరించెడి వాడు రాముడు. రాముడు తన తల్లి కౌసల్యను ఏ మాదిరి ఆదరించేవాడో మా అందరిని కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు. ఈ నాడు ఈ కైకేయి వలన మాకు రాముని అండలేకుండా పోయింది. అయినా కైక వరాలు కోరిందే అనుకో. మహారాజుగారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపుచ్చవచ్చుకదా. ఆమె మాట విని రాముని వనములకు పంపాలా! బుద్ధిలేకపోతే సరి!” అని దశరథుని కూడా నిందిస్తున్నారు.

అసలే రాముడు అడవులకుపోయిన దుఃఖంతో ఉన్న దశరథునికి అంత:పుర స్త్రీల సూటిపోటీ మాటలు భరించరానివిగా ఉన్నాయి. కానీ ఏమీ అనలేడు. తను చేసిన పని అటువంటిది కదా!

రాముడు లేని అయోధ్యలో బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించలేదు. ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించలేదు. రాముడే లేని మాకు అన్నము ఎందుకు అని అనుకున్నారు ప్రజలు. వారి మూలపురుషుడైన సూర్యుడు కూడా మొహం చాటేసాడా అన్నట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఏనుగులు ఆహారం తీసుకోలేదు. ఆవులు తమ దూడలకు పాలు ఇవ్వలేదు.

అయోధ్యలో ఉన్న ప్రజలలో ఎవరి మొహంలోనూ సంతోషము ఆనందమూ కనపడలేదు. అందరూ రాముని గురించే ఆలోచిస్తున్నారు. అయోధ్యావాసులందరూ తమ తమ దైనందిన పనులు చెయ్యడంలో ఆసక్తి చూపడం లేదు. రామునికి ఏమవు తుందో ఏమో అని దిగులుతో ఉన్నారు. ఇంక రాముని స్నేహితులు అయితే ఏకంగా మంచానికి అతుక్కుపోయారు. లేవడానికి కూడా వారికి ఓపిక లేదు. రాముడు లేని అయోధ్య ప్రాణం లేని శరీరంలాగా తయారయింది. రాముని వియోగము భరించలేక అయోధ్యలోని ప్రజలేకాదు, పశువులు, ఏనుగులు, గుర్రములు, పక్షులు కూడా ఆహారం ముట్టకుండా విలపిస్తున్నాయి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్విచత్వారింశః సర్గః (42) >>

Balakanda Sarga 33 In Telugu – బాలకాండ త్రయస్త్రింశః సర్గః

Balakanda Sarga 33 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయస్త్రింశః సర్గలో కుశనాభ కుమార్తెలు వాయుదేవుని చేష్టల గురించి నివేదిస్తారు. వారి ప్రవర్తనకు సంతోషించిన కుశనాభుడు ఆలోచించి, సాధువు రాజు బ్రహ్మదత్తతో వారి వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు. వివాహానంతరం, బ్రహ్మదత్తుని చేతి స్పర్శతో ఆడపిల్లలు తమ వికృతమైన శరీరాలను వదిలించుకుని, వారు మళ్లీ గొప్ప అందగాళ్లవుతారు.

బ్రహ్మదత్తవివాహః

తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః |
శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యాశతమభాషత ||

1

వాయుః సర్వాత్మకో రాజన్ప్రధర్షయితుమిచ్ఛతి |
అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే ||

2

పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛందే న వయం స్థితాః |
పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ ||

3

తేన పాపానుబంధేన వచనం నప్రతీచ్ఛతా |
ఏవం బ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశమ్ ||

4

తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః |
ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమమ్ ||

5

క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతమ్ |
ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ ||

6

అలంకారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా |
దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః ||

7

యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వాసామవిశేషతః |
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞశ్చ పుత్రికాః ||

8

క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్ |
విసృజ్య కన్యా కాకుత్స్థ రాజా త్రిదశవిక్రమః ||

9

మంత్రజ్ఞో మంత్రయామాస ప్రదానం సహ మంత్రిభిః |
దేశే కాలే ప్రదానస్య సదృశే ప్రతిపాదనమ్ ||

10

ఏతస్మిన్నేవ కాలే తు చూలీ నామ మహామునిః |
ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్ ||

11

తప్యంతం తమృషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే |
సోమదా నామ భద్రం తే ఊర్మిలాతనయా తదా ||

12

సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణా |
ఉవాస కాలే ధర్మిష్ఠా తస్యాస్తుష్టోఽభవద్గురుః ||

13

స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన |
పరితుష్టోఽస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియమ్ ||

14

పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా |
ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్ ||

15

లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః |
బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మికమ్ ||

16

అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్ |
బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతమ్ ||

17

తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ పుత్రం తథావిధమ్ |
బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినః సుతమ్ ||

18

స రాజా సౌమదేయస్తు పురీమధ్యవసత్తదా |
కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివమ్ ||

19

స బుద్ధిం కృతవాన్రాజా కుశనాభః సుధార్మికః |
బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాశతం తదా ||

20

తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః |
దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా ||

21

యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునందన |
బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా ||

22

స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః |
యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాః శతం తదా ||

23

స దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః |
బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః ||

24

కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః |
సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా ||

25

సోమదాఽపి సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్ |
యథాన్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత |
దృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ ||

26

తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు.

“వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు. మేము అస్వతంత్రులము. మా తండ్రి గారిని అడుగు.”అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేసాడు. ఇదీ జరిగిన సంగతి.” అని చెప్పారు.

వారి మాటలు విన్న కుశ నాభుడు వారితో ఇలా అన్నాడు.

“కుమార్తెలారా! మీరు మంచి పని చేసారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచి పెట్టారు. పురుషులకు, స్త్రీలకు ఓర్పు అలంకారము. ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి. ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాని దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను.” అని పలికాడు.

తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వ కాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూళి చాలా సంతోషించాడు.

“ఓ కన్యా! నీకు ఏమి కావాలో కోరుకో!” అని అడిగాడు.

“ఓ మహర్షీ! నాకు పుత్ర సంతానము కావాలి. కాని నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి.” అని అడిగింది.

చూళి ఆమె కోర్కెను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూళి మానస పుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మ దత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మ దత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మ దత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు.

బ్రహ్మ దత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు.

బ్రహ్మ దత్తుడు తన నూర్గురు భార్యలతో కాంపిల్యల నగరం చేరుకున్నాడు. సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది.

శ్రీమద్రామాయణము
బాల కాండ
ముప్పది మూడవ సర్గ సంపూర్ణము.

ఓంతత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుస్త్రింశః సర్గః (34) >>

Balakanda Sarga 42 In Telugu – బాలకాండ ద్విచత్వారింశః సర్గః

Balakanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – ద్విచత్వారింశః సర్గలో, రాముడు విశ్వామిత్రుని వెంట యజ్ఞాన్ని రక్షించేందుకు సిద్దమవుతాడు. యాత్రలో, వారు తాడకాతో ఎదురవుతారు. తాడక, దానవుల రాణి, యజ్ఞాలను దుష్ప్రభావం చేస్తుంది. రాముడు తన ధైర్యం మరియు శక్తితో తాడకను సమరంలో సంహరిస్తాడు. ఈ సంఘటన రాముని శక్తి, ధర్మనిరతత, మరియు గురుభక్తిని చూపిస్తుంది.

భగీరథవరప్రదానమ్

కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీజనాః |
రాజానం రోచయామాసురంశుమంతం సుధార్మికమ్ ||

1

స రాజా సుమహానాసీదంశుమాన్రఘునందన |
తస్య పుత్రో మహానాసీద్దిలీప ఇతి విశ్రుతః ||

2

తస్మిన్రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన |
హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణమ్ ||

3

ద్వాత్రింశచ్చ సహస్రాణి వర్షాణి సుమహాయశాః |
తపోవనం గతో రామ స్వర్గం లేభే మహాయశాః ||

4

దిలీపస్తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధమ్ |
దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చయం నాధ్యగచ్ఛత ||

5

కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా |
తారయేయం కథం చైతానితి చింతాపరోఽభవత్ ||

6

తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః |
పుత్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మికః ||

7

దిలీపస్తు మహాతేజా యజ్ఞైర్బహుభిరిష్టవాన్ |
త్రింశద్వర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్ ||

8

అగత్వా నిశ్చయం రాజా తేషాముద్ధరణం ప్రతి |
వ్యాధినా నరశార్దూల కాలధర్మముపేయివాన్ ||

9

ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణా |
రాజ్యే భగీరథం పుత్రమభిషిచ్య నరర్షభః ||

10

భగీరథస్తు రాజర్షిర్ధార్మికో రఘునందన |
అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజాః ||

11

మంత్రిష్వాధాయ తద్రాజ్యం గంగావతరణే రతః |
స తపో దీర్ఘమాతిష్ఠద్గోకర్ణే రఘునందన ||

12

ఊర్ధ్వబాహుః పంచతపా మాసాహారో జితేంద్రియః |
తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః ||

13

అతీతాని మహబహో తస్య రాజ్ఞో మహాత్మనః |
సుప్రీతో భగవాన్బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః ||

14

తతః సురగణైః సార్ధముపాగమ్య పితామహః |
భగీరథం మహాత్మానం తప్యమానమథాబ్రవీత్ ||

15

భగీరథ మహాభాగ ప్రీతస్తేఽహం జనేశ్వర |
తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత ||

16

తమువాచ మహాతేజాః సర్వలోకపితామహమ్ |
భగీరథో మహాభాగః కృతాంజలిరుపస్థితః ||

17

యది మే భగవన్ప్రీతో యద్యస్తి తపసః ఫలమ్ |
సగరస్యాత్మజాః సర్వే మత్తః సలిలమాప్నుయుః ||

18

గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనామ్ |
స్వర్గం గచ్ఛేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః ||

19

దేయా చ సంతతిర్దేవ నావసీదేత్కులం చ నః |
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏష మేఽస్తు వరః పరః ||

20

ఉక్తవాక్యం తు రాజానం సర్వలోకపితామహః |
ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరామ్ ||

21

మనోరథో మహానేష భగీరథ మహారథ |
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకుకులవర్ధన ||

22

ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠా హిమవతః సుతా |
తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతామ్ ||

23

గంగాయాః పతనం రాజన్పృథివీ న సహిష్యతి |
తాం వై ధారయితుం వీర నాన్యం పశ్యామి శూలినః ||

24

తమేవముక్త్వా రాజానం గంగాం చాభాష్య లోకకృత్ |
జగామ త్రిదివం దేవః సహ దేవైర్మరుద్గణైః ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విచత్వారింశః సర్గః ||

Balakanda Sarga 42 Meaning In Telugu

సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశు మంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశు మంతుని కుమారుడు దిలీపుడు. అంశు మంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు.

దిలీపుడు తన పితామహులకు స్వర్గ లోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు.

ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.

” ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో” అని అడిగాడు బ్రహ్మ.

“దేవా! నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమీ మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితా మహులకు జలతర్పణము వదులుతాను.” అని కోరుకున్నాడు.

” ఓ భగీరథా! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగను భూమి మీదికి తేవడం అత్యతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హిమవంతుని పెద్దకుమార్తె. హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగాప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి.” అని అన్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>