Balakanda Sarga 37 In Telugu – బాలకాండ సప్తత్రింశః సర్గః

Balakanda Sarga 37 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి గంగ యొక్క భూమార్గం గురించి, ఆమె కార్తికేయను కనడం, కృత్తిక నక్షత్రాలు ఆ అబ్బాయికి తల్లిపాలు ఇవ్వడం, దేవతలు ఆ అబ్బాయికి కార్తికేయ అని పేరు పెట్టడం మరియు ఆ బాలుడు ఖగోళ సైన్యాలకు అధిపతిగా అభిషేకం చేయడం గురించి తన కథనాన్ని కొనసాగిస్తున్నాడు.

కుమారోత్పత్తిః

తప్యమానే తపో దేవే దేవాః సర్షిగణాః పురా |
సేనాపతిమభీప్సంతః పితామహముపాగమన్ ||

1

తతోఽబ్రువన్సురాః సర్వే భగవంతం పితామహమ్ |
ప్రణిపత్య శుభం వాక్యం సేంద్రాః సాగ్నిపురోగమాః ||

2

యో నః సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా |
[* అధికపాఠః –
స న జాతోఽద్య భగవన్నస్మద్వైరినిబర్హణః |
తత్పితా భగవాన్ శర్వో హిమవచ్ఛిఖరేఽద్య వై |
*]
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా ||

3

యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా |
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హి నః పరమా గతిః ||

4

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః |
సాన్త్వయన్మధురైర్వాక్యైస్త్రిదశానిదమబ్రవీత్ ||

5

శైలపుత్ర్యా యదుక్తం తన్న ప్రజాః సంతు పత్నిషు |
తస్యా వచనమక్లిష్టం సత్యమేవ న సంశయః ||

6

ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః |
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్ ||

7

జ్యేష్ఠా శైలేంద్రదుహితా మానయిష్యతి తం సుతమ్ |
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః ||

8

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన |
ప్రణిపత్య సురాః సర్వే పితామహమపూజయన్ ||

9

తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్ |
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః ||

10

దేవకార్యమిదం దేవ సంవిధత్స్వ హుతాశన |
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ ||

11

దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః |
గర్భం ధారయ వై దేవి దేవతానామిదం ప్రియమ్ ||

12

అగ్నేస్తు వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ |
దృష్ట్వా తన్మహిమానాం స సమంతాదవకీర్యత ||

13

సమంతతస్తదా దేవీమభ్యషించత పావకః |
సర్వస్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన ||

14

తమువాచ తతో గంగా సర్వదేవపురోగమమ్ |
అశక్తా ధారణే దేవ తవ తేజః సముద్ధతమ్ ||

15

దహ్యమానాఽగ్నినా తేన సంప్రవ్యథితచేతనా |
అథాబ్రవీదిదం గంగాం సర్వదేవహుతాశనః ||

16

ఇహ హైమవతే పాదే గర్భోఽయం సన్నివేశ్యతామ్ |
శ్రుత్వా త్వగ్నివచో గంగా తం గర్భమతిభాస్వరమ్ ||

17

ఉత్ససర్జ మహాతేజాః స్రోతోభ్యో హి తదాఽనఘ |
యదస్యా నిర్గతం తస్మాత్తప్తజాంబూనదప్రభమ్ ||

18

కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభమ్ |
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యదేవాభ్యజాయత ||

19

మలం తస్యాభవత్తత్ర త్రపు సీసకమేవ చ |
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత ||

20

నిక్షిప్తమాత్రే గర్భే తు తేజోభిరభిరంజితమ్ |
సర్వం పర్వతసంనద్ధం సౌవర్ణమభవద్వనమ్ ||

21

[* అధిక శ్లోకం –
తం దేశం తు తతో బ్రహ్మా సంప్రాప్యైనమభాషత |
జాతస్య రూపం యత్తస్మాజ్జాతరూపం భవిష్యతి ||
*]

జాతరూపమితి ఖ్యాతం తదాప్రభృతి రాఘవ |
సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశనసమప్రభమ్ ||

22

తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనమ్ |
తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః ||

23

క్షీరసంభావనార్థాయ కృత్తికాః సమయోజయన్ |
తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమమ్ ||

24

దదుః పుత్రోఽయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః |
తతస్తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ ||

25

పుత్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః |
తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే ||

26

స్నాపయన్పరయా లక్ష్మ్యా దీప్యమానం యథాఽనలమ్ |
స్కంద ఇత్యబ్రువన్దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్ ||

27

కార్తికేయం మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్ |
ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికానామనుత్తమమ్ ||

28

షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః |
గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా ||

29

అజయత్స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్విభుః |
సురసేనాగణపతిం తతస్తమమలద్యుతిమ్ ||

30

అభ్యషించన్సురగణాః సమేత్యాగ్నిపురోగమాః |
ఏష తే రామ గంగాయా విస్తరోఽభిహితో మయా ||

31

కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ |
భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః |
ఆయుష్మాన్పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ ||

32

Balakanda Sarga 37 In Telugu Pdf With Meaning

ఓ రామా! పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధి పతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు పోయి అగ్ని దేవుని ముందు పెట్టుకొని తమ కోరిక ను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు.

“ ఓ బ్రహ్మ దేవా! ఇప్పటి దాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధి పతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధి పతిని నీవే ఏర్పరుప వలెను.” అని వేడుకున్నారు.

ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.

” ఓ దేవతలారా! ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతానయోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధి పతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా. అగ్ని దేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్ని దేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరపెట్టదు.” అని అన్నాడు.

బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు.

అగ్నిదేవుడు గంగ దేవి దగ్గరకు పోయి ” ఓ గంగాదేవీ! దేవతల కోరిక మేరకు నీవు నావలన గర్భము ధరింపుము.” అని కోరాడు.

గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయూ తాపంతో రగిలిపోయింది.

“ఓ అగ్నీ! నేను ఈ వీర్యమును ధరింపలేను. నా వళ్లు అంతా దహించికుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పి పోతూ ఉంది. నా వల్ల కాదు.” అని చెప్పింది.

“ఓ గంగాదేవీ! అటులయిన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడువుము.” అని అన్నాడు అగ్ని.

గంగానది అగ్ని దేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది.

మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శివసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువ బడ్డాడు.

గంగాదేవి గర్భము నుండి జారి పడ్డాడు కాబట్టి స్కంధుడు అని కూడా పిలువ బడ్డాడు. కృత్తికలు ఆరుగురు. ఆరుగు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము (చనుబాలు) ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకే సారి ఆరుముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది.

తరువాత ఆ కుమారుడు దేవ సేనలకు సైన్యాధి పతి గా నియమింప బడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామా! దీనినే కుమార సంభవము అని అంటారు.” అని విశ్వామిత్రుడు రామునికి కుమార స్వామి జననము గురించి చెప్పాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ అష్టత్రింశః సర్గః (38) >>

Ayodhya Kanda Sarga 30 In Telugu | అయోధ్యాకాండ త్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 30 In Telugu

అయోధ్యా కాండ సర్గ 30 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది. “రామా! నీవు అసలు మగాడివేనా! కాదు.

నీవు పురుషరూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా… రాముల వారిని తన వెంట తీసుకెళ్లమని…పరి పరి విదాలు వేడుకొన్న సీతా దేవి… రాములవారి పరాక్రమము గూర్చి అడిగిన సందర్భం లోనిది…

వనగమనాభ్యుపపత్తిః

సాంత్వ్యమానా తు రామేణ మైథిలీ జనకాత్మజా |
వనవాసనిమిత్తాయ భర్తారమిదమబ్రవీత్ ||

1

సా తముత్తమసంవిగ్నా సీతా విపులవక్షసమ్ |
ప్రణయాచ్చాభిమానాచ్చ పరిచిక్షేప రాఘవమ్ ||

2

కిం త్వాఽమన్యత వైదేహః పితా మే మిథిలాధిపః |
రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుషవిగ్రహమ్ ||

3

అనృతం బత లోకోఽయమజ్ఞానాద్యద్ధి వక్ష్యతి |
తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే ||

4

కిం హి కృత్వా విషణ్ణస్త్వం కుతో వా భయమస్తి తే |
యత్పరిత్యక్తుకామస్త్వం మామనన్యపరాయణామ్ ||

5

ద్యుమత్సేనసుతం వీర సత్యవంతమనువ్రతామ్ |
సావిత్రీమివ మాం విద్ధి త్వమాత్మవశవర్తినీమ్ ||

6

న త్వహం మనసాఽప్యన్యం ద్రష్టాస్మి త్వదృతేఽనఘ |
త్వయా రాఘవ గచ్ఛేయం యథాన్యా కులపాంసనీ ||

7

స్వయం తు భార్యాం కౌమారీం చిరమధ్యుషితాం సతీమ్ |
శైలూష ఇవ మాం రామ పరేభ్యో దాతుమిచ్ఛసి ||

8

యస్య పథ్యం చ రామాత్థ యస్య చార్థేఽవరుధ్యసే |
త్వం తస్య భవ వశ్యశ్చ విధేయశ్చ సదాఽనఘ ||

9

స మామనాదాయ వనం న త్వం ప్రస్థాతుమర్హసి |
తపో వా యది వాఽరణ్యం స్వర్గో వా స్యాత్త్వయా సహ ||

10

న చ మే భవితా తత్ర కశ్చిత్పథి పరిశ్రమః |
పృష్ఠతస్తవ గచ్ఛంత్యా విహారశయనేష్వివ ||

11

కుశకాశశరేషీకా యే చ కంటకినో ద్రుమాః |
తూలాజినసమస్పర్శా మార్గే మమ సహ త్వయా ||

12

మహావాతసముద్ధూతం యన్మామవకరిష్యతి |
రజో రమణ తన్మన్యే పరార్ధ్యమివ చందనమ్ ||

13

శాద్వలేషు యదా శిశ్యే వనాంతే వనగోచర |
కుథాస్తరణతల్పేషు కిం స్యాత్సుఖతరం తతః ||

14

పత్రం మూలం ఫలం యత్త్వమల్పం వా యది వా బహు |
దాస్యసి స్వయమాహృత్య తన్మేఽమృతరసోపమమ్ ||

15

న మాతుర్న పితుస్తత్ర స్మరిష్యామి న వేశ్మనః |
ఆర్తవాన్యుపభుంజానా పుష్పాణి చ ఫలాని చ ||

16

న చ తత్ర గతః కించిద్ద్రష్టుమర్హసి విప్రియమ్ |
మత్కృతే న చ తే శోకో న భవిష్యతి దుర్భరా ||

17

యస్త్వయా సహ స స్వర్గో నిరయో యస్త్వయా వినా |
ఇతి జానన్పరాం ప్రీతిం గచ్ఛ రామ మయా సహ ||

18

అథ మామేవమవ్యగ్రాం వనం నైవ నయిష్యసి |
విషమద్యైవ పాస్యామి మా విశం ద్విషతాం వశమ్ ||

19

పశ్చాదపి హి దుఃఖేన మమ నైవాస్తి జీవితమ్ |
ఉజ్ఝితాయాస్త్వయా నాథ తదైవ మరణం వరమ్ ||

20

ఇమం హి సహితుం శోకం ముహూర్తమపి నోత్సహే |
కిం పునర్దశ వర్షాణి త్రీణి చైకం చ దుఃఖితా ||

21

ఇతి సా శోకసంతప్తా విలప్య కరుణం బహు |
చుక్రోశ పతిమాయస్తా భృశమాలింగ్య సస్వరమ్ ||

22

సా విద్ధా బహుభిర్వాక్యైర్దిగ్ధైరివ గజాంగనా |
చిరసన్నియతం బాష్పం ముమోచాగ్నిమివారణిః ||

23

తస్యాః స్ఫటికసంకాశం వారి సంతాపసంభవమ్ |
నేత్రాభ్యాం పరిసుస్రావ పంకజాభ్యామివోదకమ్ ||

24

తచ్చైవామలచంద్రాభం ముఖమాయతలోచనమ్ |
పర్యశుష్యత బాష్పేణ జలోద్ధృతమివాంబుజమ్ ||

25

తాం పరిష్వజ్య బాహుభ్యాం విసంజ్ఞామివ దుఃఖితామ్ |
ఉవాచ వచనం రామః పరివిశ్వాసయంస్తదా ||

26

న దేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే |
న హి మేఽస్తి భయం కించిత్స్వయంభోరివ సర్వతః ||

27

తవ సర్వమభిప్రాయమవిజ్ఞాయ శుభాననే |
వాసం న రోచయేఽరణ్యే శక్తిమానపి రక్షణే ||

28

యత్సృష్టాఽసి మయా సార్ధం వనవాసాయ మైథిలి |
న విహాతుం మయా శక్యా కీర్తిరాత్మవతా యథా ||

29

ధర్మస్తు గజనాసోరు సద్భిరాచరితః పురా |
తం చాహమనువర్తేఽద్య యథా సూర్యం సువర్చలా ||

30

న ఖల్వహం న గచ్ఛేయం వనం జనకనందిని |
వచనం తన్నయతి మాం పితుః సత్యోపబృంహితమ్ ||

31

ఏష ధర్మస్తు సుశ్రోణి పితుర్మాతుశ్చ వశ్యతా |
ఆజ్ఞాం చాహం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే ||

32

స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుమ్ |
అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే ||

33

యత్త్రయం తత్త్రయో లోకాః పవిత్రం తత్సమం భువి |
నాన్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాధ్యతే ||

34

న సత్యం దానమానౌ వా న యజ్ఞాశ్చాప్తదక్షిణాః |
తథా బలకరాః సీతే యథా సేవా పితుర్హితా ||

35

స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాః పుత్రాః సుఖాని చ |
గురువృత్త్యనురోధేన న కించిదపి దుర్లభమ్ ||

36

దేవగంధర్వగోలోకాన్బ్రహ్మలోకాంస్తథా నరాః |
ప్రాప్నువంతి మహాత్మానో మాతాపితృపరాయణాః ||

37

స మాం పితా యథా శాస్తి సత్యధర్మపథే స్థితః |
తథా వర్తితుమిచ్ఛామి స హి ధర్మః సనాతనః ||

38

మమ సన్నా మతిః సీతే త్వాం నేతుం దండకావనమ్ |
వసిష్యామీతి సా త్వం మామనుయాతుం సునిశ్చితా ||

39

సా హి సృష్టాఽనవద్యాంగీ వనాయ మదిరే క్షణే |
అనుగచ్ఛస్వ మాం భీరు సహధర్మచరీ భవ ||

40

సర్వథా సదృశం సీతే మమ స్వస్య కులస్య చ |
వ్యవసాయమతిక్రాంతా సీతే త్వమతిశోభనమ్ ||

41

ఆరభస్వ గురుశ్రోణి వనవాసక్షమాః క్రియాః |
నేదానీం త్వదృతే సీతే స్వర్గోఽపి మమ రోచతే ||

42

బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని భిక్షుకేభ్యశ్చ భోజనమ్ |
దేహి చాశంసమానేభ్యః సంత్వరస్వ చ మా చిరమ్ ||

43

భూషణాని మహార్హాణి వరవస్త్రాణి యాని చ |
రమణీయాశ్చ యే కేచిత్క్రీడార్థాశ్చాప్యుపస్కరాః ||

44

శయనీయాని యానాని మమ చాన్యాని యాని చ |
దేహి స్వభృత్యవర్గస్య బ్రాహ్మణానామనంతరమ్ ||

45

అనుకూలం తు సా భర్తుర్జ్ఞాత్వా గమనమాత్మనః |
క్షిప్రం ప్రముదితా దేవీ దాతుమేవోపచక్రమే ||

46

తతః ప్రహృష్టా ప్రతిపూర్ణమానసా
యశస్వినీ భర్తురవేక్ష్య భాషితమ్ |
ధనాని రత్నాని చ దాతుమంగనా
ప్రచక్రమే ధర్మభృతాం మనస్వినీ ||

47

ఇతి శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 30 Meaning In Telugu

రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది.

“రామా! నీవు అసలు మగాడివేనా! కాదు. నీవు పురుషరూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా.

ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి. అలాంటి పరాక్రమ వంతుడివి…. నన్ను అడవులకు తీసుకొనివెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా! ఉంటే అదేమిటి? కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్లడానికి కారణమేమి? భయమా! లేక పరాక్రమము లేకనా! నీ భయమునకు కారణమేమి?

మీరు సావిత్రీ సత్యవంతుల కథ వినలేదా! సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్లింది. నేను కేవలం అడవులకు మాత్రం వస్తాను అంటున్నాను. అంతే కదా! నాధా! నేనుసామాన్య స్త్రీల వంటి దానను కాను. పరపురుషుని కన్నెత్తి కూడా చూడను. నేను ఇక్కడ ఒకరి పంచన బతకలేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నేను స్వయంగా నీ భార్యను.

యవ్వనంలో ఉన్నాను. నీతో కొంతకాలము కాపురము చేసాను. అటువంటి నన్ను దిక్కులేని దాని మాదిరి పరాయి వాళ్ల ఇంట ఉంచడం ఉచితమా! నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలిగా ఉండమంటున్నావు. రామా! నీకు నీ వారు ఎక్కువ కానీ నాకు కాదు కదా! నాకు నా భర్త ఎక్కువ. ఎవరి కోసరమో నేను నిన్ను విడిచి ఒంటరిగా అయోధ్యలో ఉండలేను.

మీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం ఉచితము కాదు. మీ సన్నిధిలో నాకు అరణ్యమైనా స్వర్గమైనా సమానమే! మీరు ఎక్కడ ఉంటే అదే నాకు రాజభవనము. నేను రాజభవనములో ఎలాఉంటానో అరణ్యములో కూడా అలాగే ఉంటాను. మీతో కలిసి ప్రయాణము చేస్తుంటే నాకు ముళ్లు కూడా పూల మాదిరి ఉంటాయి.

అడవులలో ఉన్న దుమ్ముకూడా చందనముతో సమానమే. హాయిగా, ఆకాశమే పందిరిగా పచ్చికబయళ్లే పూల పానుపుగా మీతో పాటు శయనించడం కన్నా, రాజభవనములలో ఉన్న హంసతూలికా తల్పములు ఎక్కువ సుఖాన్ని ఇవ్వవు. మీరు తీసుకొని వచ్చిన కందమూలములు, ఫలములే నాకు పంచభక్ష్య పరమాన్నములు.

నేను అడవులలో ఉన్నప్పుడు మా పుట్టింటికానీ నా తల్లితండ్రులను గానీ తలచుకొని బెంగపెట్టుకోను. నా వలన మీకు ఎలాంటి కష్టము కలగనీయను. నాకు అది కావాలి ఇది కావాలి అని అడగను. దొరికిన
దానితో తృప్తిపడతాను.

నాధా! మరలాచెబుతున్నాను. నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేనిచోట నరకమే. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యము. అంతే గాని, అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను. ఎందుకంటే, మీ వియోగముతో నేను కొంతకాలము తరువాత అయినా కృంగి కృశించి చచ్చిపోతాను. అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా!

ఒక్కక్షణమైనా మిమ్ములను విడిచి బతకలేని నేను పదునాలుగు సంవత్సరములు మిమ్ములను విడిచి పరాయి పంచన ఎలా ఉంటాను అని అనుకుంటున్నారు.” అంటూ సీత రాముని కౌగలించుకొని పెద్దగా ఏడవసాగింది. సీత కళ్లనుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శరీరం వశం తప్పుతూ ఉంది. అలాగే రాముని చేతులలో నుండి కిందికి జారిపోయింది. రాముడు సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఓదారుస్తున్నాడు.

“ఓ సీతా! ఎందుకీ ఏడుపు. నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నాకు స్వర్గములో కూడా సుఖము లభించదు. నేను ఎవరికీ భయపడను. తుదకు ఆ బ్రహ్మదేవునికికూడా! నేను నిన్ను సర్వవేళలా రక్షించు కొనుటకు సమర్థుడను. కానీ నీ అభిప్రాయము తెలుసుకొనడానికి అలా అన్నాను.

అలా కాకుండా, నిన్ను నా వెంట అరణ్యములకు రమ్మంటే, పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నీవు నన్ను అపార్థము చేసుకొనే అవకాశము ఉంది కదా! ఓ సీతా! నేను మాత్రము నిన్ను విడిచి క్షణమైనా బతుక గలనా! ఆ బ్రహ్మ మన ఇద్దరికీ వనవాసము చెయ్యమని రాసి పెట్టినట్టున్నాడు. అందుకే ఈ విపరీత పరిణామము.

సీతా! ఇంక నేను వనవాసమునకు ఎందుకు వెళుతున్నానో వివరిస్తాను. పితృవాక్యపరిపాలన మా కులధర్మము. దానిని నేను పాటించి తీరవలెను. కారణములు ఏవైనా, నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు. ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళు తున్నాను. ఒకకుమారుడిగా తల్లి తండ్రుల ఎడల నా ధర్మమును అతిమ్రించుటకు నేను ఇష్టపడను.

నాకు నా తల్లి, తండ్రి, గురువు మూడు లోకములతో సమానము. వీరి తరువాతే నాకు దేవుడు. నా తల్లి తండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు. నా తండ్రి ఆజ్ఞను పాలించడంతోనే, నాకు స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, సంతానము, రాజభోగములు లభించినట్టు భావిస్తాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు, నాకు ఇవేవీ దొరకవు.

మాతాపితరుల సేవతో నేను ఉత్తమ లోకములు పొందుతాను. ఎందుకంటే పితృవాక్య పరిపాలన మన సనాతన ధర్మము. నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకొని పోయి కష్టముల పాటు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నీ ధృఢనిశ్చయము విని నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను.

నా సహధర్మ చారిణిగా నా వెంట అడవులకు రా. నీవు నాతో వస్తాను అని అనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని మన వంశగౌరవము కాపాడావు. కాబట్టి సీతా! మనకు వనవాసమునకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. నిన్ను విడిచి నేనుకూడా ఒక క్షణము కూడా ఉండలేను కదా!

బ్రాహ్మణులకు దానధర్మములు చెయ్యి. వారికి భోజనము పెట్టి సంతృప్తి పరుచు. నీవు ధరించు ఆభరణములు, విలువైన వస్త్రములు, వస్తువులు అన్నీ నీ పరిచారికలకు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు.” అని అన్నాడు రాముడు.

రాముని మాటలు విని సీత సంతోషంతో పొంగి పోయింది. రాముడు చెప్పినట్టు తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చివేసింది. విలువైన బంగారు ఆభరణములు, రత్నములు, మణులు, పట్టు వస్త్రములు తన పరిచారికలకు ఇచ్చింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ముప్పదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకత్రింశః సర్గః (31) >>

Ayodhya Kanda Sarga 29 In Telugu | అయోధ్యాకాండ ఏకోనత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 29 In Telugu

అయోధ్యా కాండ సర్గ 29 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది. ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి. అని కుతూహలంతో రాములవారిని వేడుకున్నా సందర్భం లోనిది…

వనానుగమనయంచానిర్బంధః

ఏతత్తు వచనం శ్రుత్వా సీతా రామస్య దుఃఖితా |
ప్రసక్తాశ్రుముఖీ మందమిదం వచనమబ్రవీత్ ||

1

యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణానిత్యేవ తాన్విద్ధి తవ స్నేహపురస్కృతాన్ ||

2

మృగాః సింహా గజాశ్చైవ శార్దూలాః శరభాస్తథా |
పక్షిణః సృమరాశ్చైవ యే చాన్యే వనచారిణః ||

3

అదృష్టపూర్వరూపత్వాత్సర్వే తే తవ రాఘవః |
రూపం దృష్ట్వాఽపసర్పేయుర్భయే సర్వే హి బిభ్యతి ||

4

త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా |
త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితమ్ ||

5

న చ మాం త్వత్సమీపస్థామపి శక్నోతి రాఘవ |
సురాణామీశ్వరః శక్రః ప్రధర్షయితుమోజసా ||

6

పతిహీనా తు యా నారీ న సా శక్ష్యతి జీవితుమ్ |
కామమేవంవిధం రామ త్వయా మమ విదర్శితమ్ ||

7

అథ వాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతమ్ |
పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిల మే వనే ||

8

లక్షణిభ్యో ద్విజాతిభ్యః శ్రుత్వాఽహం వచనం పురా |
వనవాసకృతోత్సాహా నిత్యమేవ మహాబల ||

9

ఆదేశో వనవాసస్య ప్రాప్తవ్యః స మయా కిల |
సా త్వయా సహ తత్రాహం యాస్యామి ప్రియ నాన్యథా ||

10

కృతాదేశా భవిష్యామి గమిష్యామి సహ త్వయా |
కాలశ్చాయం సముత్పన్నః సత్యవాగ్భవతు ద్విజః ||

11

వనవాసే హి జానామి దుఃఖాని బహుధా కిల |
ప్రాప్యంతే నియతం వీర పురుషైరకృతాత్మభిః ||

12

కన్యయా చ పితుర్గేహే వనవాసః శ్రుతో మయా |
భిక్షిణ్యాః సాధువృత్తాయా మమ మాతురిహాగ్రతః ||

13

ప్రసాదితశ్చ వై పూర్వం త్వం వై బహువిధం ప్రభో |
గమనం వనవాసస్య కాంక్షితం హి సహ త్వయా ||

14

కృతక్షణాఽహం భద్రం తే గమనం ప్రతి రాఘవ |
వనవాసస్య శూరస్య చర్యా హి మమ రోచతే ||

15

శుద్ధాత్మన్ప్రేమభావాద్ధి భవిష్యామి వికల్మషా |
భర్తారమనుగచ్ఛంతీ భర్తా హి మమ దైవతమ్ ||

16

ప్రేత్యభావేఽపి కల్యాణః సంగమో మే సహ త్వయా |
శ్రుతిర్హి శ్రూయతే పుణ్యా బ్రాహ్మణానాం తపస్వినామ్ ||

17

ఇహ లోకే చ పితృభిర్యా స్త్రీ యస్య మహామతే |
అద్భిర్దత్తా స్వధర్మేణ ప్రేత్యభావేఽపి తస్య సా ||

18

ఏవమస్మాత్స్వకాం నారీం సువృత్తాం హి పతివ్రతామ్ |
నాభిరోచయసే నేతుం త్వం మాం కేనేహ హేతునా ||

19

భక్తాం పతివ్రతాం దీనాం మాం సమాం సుఖదుఃఖయోః |
నేతుమర్హసి కాకుత్స్థ సమానసుఖదుఃఖినీమ్ ||

20

యది మాం దుఃఖితామేవం వనం నేతుం న చేచ్ఛసి |
విషమగ్నిం జలం వాహమాస్థాస్యే మృత్యుకారణాత్ ||

21

ఏవం బహువిధం తం సా యాచతే గమనం ప్రతి |
నానుమేనే మహాబాహుస్తాం నేతుం విజనం వనమ్ ||

22

ఏవముక్తా తు సా చింతాం మైథిలీ సముపాగతా |
స్నాపయంతీవ గాముష్ణైరశ్రుభిర్నయనచ్యుతైః ||

23

చింతయంతీం తథా తాం తు నివర్తయితుమాత్మవాన్ |
క్రోధావిష్టాం చ తామ్రోష్ఠీం కాకుత్స్థో బహ్వసాంత్వయత్ ||

24

ఇతి శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనత్రింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 29 Meaning In Telugu

అదీ కాకుండా, భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది.

ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి.

నాధా! మీరు చెప్పినట్టు అరణ్యవాసములో ఎన్నో దు:ఖములు ఉంటాయి. కాని అవి అన్నీ అధైర్యపరులకు కానీ తమరి వంటి ధీరోదాత్తులకు కాదు కదా! అవునండోయ్! మరిచి పోయాను. నేను మిథిలలో ఉండగా ఒక రోజు ఒక బిక్షుకి కూడా నా జాతకములో వనవాసము రాసి పెట్టి ఉన్నదని జోస్యము చెప్పినది.

అవి అన్నీ ఇప్పుడు నిజము అవుతున్నాయి. నాడు జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుండి, భిక్షుకి చెప్పినప్పటినుండి ఎప్పుడెప్పుడు వనవాసమునకు వెళదామా అని ఉత్సాహంతో ఉన్నాను. కాబట్టి తమరి వెంట నన్నుకూడా వనములకు తీసుకొని వెళ్లండి.

ఏమండీ! ఏమండీ! అక్కడ నేను మిమ్ములను ఎంతో ప్రేమగా చూచుకుంటానండీ. మీరు ఎక్కడికి పోతే అక్కడకు వస్తాను. ఎందుకంటే నా భర్తయే నాకు దైవము. మీరు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే కదా!

ఒక్క వనవాసమే కాదు, మరణంలో కూడా నేను మిమ్ములను అనుసరించి వస్తాను. ఏనాడైతే తల్లి తండ్రులు తమ కుమార్తెను ఎవరికైతే మంత్రపూర్వకముగా ధారపోసారో ఆ నాటి నుండి ఆమె అతనికి సహధర్మచారిణి అవుతుంది. మరణానంతరము కూడా ఆమె అతనినే అనుసరిస్తుంది అని వేదములు ఘోషిస్తున్నాయి కదా!

ఆ వేదవాక్కును అనుసరించి మీరు ఎక్కడకు పోతే అక్కడకు నేను మిమ్ములను ఒక భార్యగా అనుసరిస్తాను. చివరకు మరణంలో కూడా. అది సరే. అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు. నేను మంచి దాననుగానా?నేను పతివ్రతనండీ. పైగా మీ భక్తురాలను.

సుఖదుఃఖములను సమంగా చూడగలిగిన నేర్పు కల దానను. మీసుఖమే నా సుఖమనీ, మీ కష్టమే నా కష్టమనీ భావించే మనసు కలదానను. ఇవన్నీ మీకు తెలుసు కదా! అటువంటప్పుడు నన్ను వెంట తీసుకొని పోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు. కాబట్టి నేను మీ వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడు ఇక్కడే ప్రాణములు వదులుతాను.” అని నయానా భయానా బతిమాలింది సీత.

సీత ఎన్ని చెప్పినను అటువంటి సుకుమారిని వనములకు తీసుకొని పోయి ఆమెను కష్టముల పాలు చేయడం ఇష్టం లేని రాముడు, ఆమె తన వెంట రావడానికి సుతరామూ ఒప్పుకోలేదు. సీతకూడా తన పట్టు విడవ లేదు. ఏడుపు మానలేదు. సీత ఏడుపు మానడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను తనతో రాకుండా నివారించడానికి రాముడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రింశః సర్గః (౩౦) >>

Aadi Lakshmi Devi Vaibhavam In Telugu – శ్రీ ఆదిలక్ష్మి దేవి వైభవము

Aadi Lakshmi Devi Vaibhavam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆదిలక్ష్మి దేవి వైభవము గురించి తెలుసుకుందాం.

ప్రాణశక్తి ప్రదాయిని శ్రీ ఆదిలక్ష్మిదేవి

సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ పరిపాలయమాం.

శ్రీమన్మహాలక్ష్మీదేవి తన అష్ట విధ అంశలతో లీలా రూపంగా ధరించిన అష్టలక్ష్మీ అవతారాలలో ప్రధమమైనది శ్రీ ఆదిలక్ష్మీదేవి. ఈ తల్లి ప్రాణశక్తికి అధిష్టాన దేవత. ఆది అనే పదంలోనే సనాతనమైనది, మూలాధారమైనటువంటిది అనే అర్థాలు స్ఫురిస్తాయి. జీవించడానికి అత్యవసరమైనది ప్రాణశక్తి. అదికంటికి కనబడని శక్తి. సమస్త జీవరాశులలోనూ ప్రాణశక్తి పరిపుష్టంగా వున్నప్పుడే మిగిలిన శక్తులు రాణిస్తాయి. ఆ రకంగా ప్రాణశక్తి మీద వ్యక్తి వికాసం, తద్వారా సమాజ వికాసం కూడా ఆధారపడి వుంటాయి అంటే అతిశయోక్తి కాదు. జీవి తల్లి గర్భంలో పాంచ భౌతిక శరీరాన్ని దాల్చటానికి అవసరమైన మొదటి శక్తి ప్రాణశక్తే. “ప్రాణాధ్యైవ ఖల్విమాని భూతాని జాయన్తి ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయన్త్యభిసం విశంతీతి” అని తైత్తీరియోపనిషత్లోని భృగువల్లిలో ప్రాణశక్తి ప్రభావం గురించి చెప్పబడింది.

శ్రీ ఆదిలక్ష్మీదేవి స్వరూప స్వభావాలు

ఆదిలక్ష్మీదేవి శుద్ధ జ్ఞానానికి ప్రతిరూపమైన పద్మంలో చతుర్భుజమూర్తిగా మనకి దర్శనం యిస్తుంది. అరుణకాంతులు వెదజల్లే ఎర్రని పట్టుచీరధరించి, రెండు చేతులలో పద్మాలను పట్టుకుని, రెండు చేతులతో భక్తులకు అభయ ప్రదానం చేస్తూ వుంటుంది. ‘సుమనస వందిత’ మంచి మనస్సుతో ఆరాధించే వారికి సత్వరం మంచి ఫలితాలను యిస్తుంది. ఆదిలక్ష్మీ మాత. భక్తుల ఎడల ఎంతో కరుణని చూపించే ఆ తల్లి స్వభావరీత్యా అలక్ష్యాన్నీ, నిరాదరణనీ, మర్యాదా ఉల్లంఘనాన్ని ఎంతమాత్రమూ సహించదు. తనకి చేసే ఉపచారాల విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా సహించదు. వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తూ ఆ ప్రదేశాన్ని వీడిపోతుంది. భక్తులు తప్పు తెలుసుకుని ప్రార్థిస్తే తప్పకుండా మళ్ళీ కరుణిస్తుంది. ఆమె ఆగ్రహం కూడా చివరికి అనుగ్రహంగా పరిణమిస్తుంది. ప్రణవ స్వరూపిణిగా, గాయత్రి రూపిణిగా, సర్వదేవ నమస్కృతగా వినుతికెక్కిన ఈ తల్లిని దేవతలు కూడా సదా ఆరాధిస్తూ వుంటారు. సర్వమంత్ర ఫలప్రద, సర్వతీర్థ స్థిత, అపరాజిత అయిన ఈ తల్లి భవబంధవినాశిని.

అనాదిమూర్తిరంభోజా మంభోజగర్భ వాసినీం
అంభోజ నాభజననీ, మంభోరుహ గర్భమాతృకా
కరుణాంభోనిధిః భక్త సర్వకామప్రదాయినీ
సదాస్మరామి దేవేశీ ఆదిలక్ష్మీ నమోస్తుతే॥

విష్ణు పురాణగాధల ననుసరించి ఆదిలక్ష్మి భృగుమహర్షి పుత్రికగా తెలియవస్తోంది. ఆ తల్లికి “భార్గవి” అనే పేరు అందువల్లనే వచ్చింది. భృగువు బ్రహ్మమానస పుత్రుడని ప్రతీతి. భృగుమహర్షి జ్ఞానానికి ప్రతీక. అపార తపశ్శక్తి సంపన్నుడు, జ్ఞాన వృద్ధుడు అయిన ఈ మహర్షికి బ్రహ్మ అనుగ్రహం వల్ల అరికాలిలో జ్ఞాననేత్రం వుండేది. అలాంటి జ్ఞాన సంపన్నుడైన భృగువు ఎంతో కాలం ఘోర తపస్సు చేసి లక్ష్మీదేవి తన ఔరస పుత్రిక అయ్యేటట్లు వరం పొందాడు. తద్వారా వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడు భృగువుకి అల్లుడయ్యాడు. విష్ణుమూర్తి సంకల్పశక్తి అయిన ఆదిలక్ష్మీదేవి నారాయణిగా, వైకుంఠ లక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

శ్రీ ఆదిలక్ష్మీదేవి ప్రభావము

శ్రీ ఆదిలక్ష్మీదేవి స్వభావాన్ని, ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహ ప్రభావాలను తెలిపే -రెండు కథలు పురాణాలలో విస్తృత ప్రాచుర్యంలో వున్నాయి.

Ashta Lakshmi Stotram – అష్టలక్ష్మీ స్తోత్రం

Ayodhya Kanda Sarga 28 In Telugu | అయోధ్యాకాండ అష్టావింశః సర్గః

Ayodhya Kanda Sarga 28 In Telugu

అయోధ్యా కాండ సర్గ 28 రామాయణంలోని ఆసక్తికరమైన భాగం. సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనా ఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. ‘ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లోగానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము. సీతా దేవి తో రాముడు అరణ్యమునకు వద్దని అరణ్యము గూర్చి వివరించే ప్రస్తావనను కళ్ళకు కట్టినట్టు చెప్పిన సందర్భము…

వనదుఃఖప్రతిబోధనమ్

స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సలః |
న నేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ ||

1

సాంత్వయిత్వా పునస్తాం తు బాష్పపర్యాకులేక్షణామ్ |
నివర్తనార్థే ధర్మాత్మా వాక్యమేతదువాచ హ ||

2

సీతే మహాకులీనాఽసి ధర్మే చ నిరతా సదా |
ఇహాచర స్వధర్మం త్వం మా యథా మనసః సుఖమ్ ||

3

సీతే యథా త్వాం వక్ష్యామి తథా కార్యం త్వయాఽబలే |
వనే దోషా హి బహవో వదతస్తాన్నిబోధ మే ||

4

సీతే విముచ్యతామేషా వనవాసకృతా మతిః |
బహుదోషం హి కాంతారం వనమిత్యభిధీయతే ||

5

హితబుద్ధ్యా ఖలు వచో మయైతదభిధీయతే |
సదా సుఖం న జానామి దుఃఖమేవ సదా వనమ్ ||

6

గిరినిర్ఝరసంభూతా గిరికందరవాసినామ్ |
సింహానాం నినదా దుఃఖాః శ్రోతుం దుఃఖమతో వనమ్ ||

7

క్రీడమానాశ్చ విస్రబ్ధా మత్తాః శూన్యే మహామృగాః |
దృష్ట్వా సమభివర్తంతే సీతే దుఃఖమతో వనమ్ ||

8

సగ్రాహాః సరితశ్చైవ పంకవత్యశ్చ దుస్తరాః |
మత్తైరపి గజైర్నిత్యమతో దుఃఖతరం వనమ్ ||

9

లతాకంటకసంకీర్ణాః కృకవాకూపనాదితాః |
నిరపాశ్చ సుదుర్గాశ్చ మార్గా దుఃఖమతో వనమ్ ||

10

సుప్యతే పర్ణశయ్యాసు స్వయం భగ్నాసు భూతలే |
రాత్రిషు శ్రమఖిన్నేన తస్మాద్దుఃఖతరం వనమ్ ||

11

అహోరాత్రం చ సంతోషః కర్తవ్యో నియతాత్మనా |
ఫలైర్వృక్షావపతితైః సీతే దుఃఖమతో వనమ్ ||

12

ఉపవాసశ్చ కర్తవ్యో యథాప్రాణేన మైథిలి |
జటాభారశ్చ కర్తవ్యో వల్కలాంబరధారిణా ||

13

దేవతానాం పితృణాం చ కర్తవ్యం విధిపూర్వకమ్ |
ప్రాప్తానామతిథీనాం చ నిత్యశః ప్రతిపూజనమ్ ||

14

కార్యస్త్రిరభిషేకశ్చ కాలే కాలే చ నిత్యశః |
చరతా నియమేనైవ తస్మాద్దుఃఖతరం వనమ్ ||

15

ఉపహారశ్చ కర్తవ్యః కుసుమైః స్వయమాహృతైః |
ఆర్షేణ విధినా వేద్యాం బాలే దుఃఖమతో వనమ్ ||

16

యథాలబ్ధేన సంతోషః కర్తవ్యస్తేన మైథిలి |
యతాహారైర్వనచరైర్నిత్యం దుఃఖమతో వనమ్ ||

17

అతీవ వాతాస్తిమిరం బుభుక్షా చాత్ర నిత్యశః |
భయాని చ మహాంత్యత్ర తతో దుఃఖతరం వనమ్ ||

18

సరీసృపాశ్చ బహవో బహురూపాశ్చ భామిని |
చరంతి పృథివీం దర్పాత్తతో దుఃఖతరం వనమ్ ||

19

నదీనిలయనాః సర్పా నదీకుటిలగామినః |
తిష్ఠంత్యావృత్య పంథానం తతో దుఃఖతరం వనమ్ ||

20

పతంగా వృశ్చికాః కీటా దంశాశ్చ మశకైః సహ |
బాధంతే నిత్యమబలే తస్మాద్దుఃఖతరం వనమ్ ||

21

ద్రుమాః కంటకినశ్చైవ కుశకాశాశ్చ భామిని |
వనే వ్యాకులశాఖాగ్రాస్తేన దుఃఖతరం వనమ్ ||

22

కాయక్లేశాశ్చ బహవో భయాని వివిధాని చ |
అరణ్యవాసే వసతో దుఃఖమేవ తతో వనమ్ ||

23

క్రోధలోభౌ విమోక్తవ్యౌ కర్తవ్యా తపసే మతిః |
న భేతవ్యం చ భేతవ్యే నిత్యం దుఃఖమతో వనమ్ ||

24

తదలం తే వనం గత్వా క్షమం న హి వనం తవ |
విమృశన్నిహ పశ్యామి బహుదోషతరం వనమ్ ||

25

వనం తు నేతుం న కృతా మతిస్తదా
బభూవ రామేణ యదా మహాత్మనా |
న తస్య సీతా వచనం చకార త-
-త్తతోఽబ్రవీద్రామమిదం సుదుఃఖితా ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టావింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 28 Meaning In Telugu

సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనాఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. ‘ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లోగానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము.

అరణ్యములలో ఉండే బాధలు నీకు తెలియవు. నీమేలు కోరి చెబుతున్నాను. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఏలోటూ రాదు. చిన్నప్పటి నుండి సుఖములలో పెరిగిన దానవు. ఆ అడవులలో కలిగే కష్టములను తట్టుకోలేవు. అడవులలో సుఖము అనే మాట వినపడదు. అన్నీ కష్టాలే. ఎత్తైన కొండల మీది నుండి దుమికే సెల ఏళ్ల ధ్వనులు, పులుల గాండ్రింపులు, సింహగర్జనలు, అడవి ఏనుగుల ఘీంకారములు, భయంకరంగా ఉంటాయి. అడవులలో సంచరించు క్రూరమృగములు మానవులను చూడగానే మీద పడతాయి. వాటి బారి నుండి తప్పించుకోడం చాలా కష్టం.

పైగా నగరములలో ఉన్నట్టు అడవులలో రాచ మార్గములు ఉండవు. అన్నీ ముళ్లు రాళ్లతో నిండిన కాలి మార్గములే. పైగా తాగడానికి మంచి నీరు కూడా దొరకదు. తినడానికి తిండి దొరకదు. రాలి పడిన పండ్లు తినాలి. లేకపోతే దొరికినవాటితో కడుపు నింపు కోవాలి. ఒక్కోసారి అవీ దొరక్కపోతే ఉపవాసములుచెయ్యాల్సి ఉంటుంది. పగలంతా నడక. రాత్రి నేలమీద పడక. నిద్రపట్టదు. జీవితం దుర్భరంగా ఉంటుంది. కట్టుకోడానికి బట్టలు ఉండవు. నారచీరలు, ఆకులు కట్టుకోవాలి.

వనవాసవ్రతములో ఉన్నవారు నిత్యమూ దేవతలను, పితరులను, అతిధులను పూజించాలి. మూడుపూట్లాస్నానం చెయ్యాలి. స్వయంగా పూలు పండ్లు కోసుకొని రావాలి. ఋషులకు, మునులకు పెట్టాలి. మిగిలింది మనం తినాలి. అదీ మితంగా తినాలి. దొరికింది తినాలి. అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు. అందుకే వనవాసము అత్యంత దుర్భరము. నీవు చేయలేవు.

ఇంకా సీతా! వనవాస సమయములో మనము ప్రకృతి వైపరీత్యములను తట్టుకోవాల్సి ఉంటుంది. పెనుగాలులు, వర్షాలు, గాడాంధకారమైన చీకటి, ఆ చీకట్లో సంచరించే వివిధ రకాలైన విషము చిమ్మే పాములు, దీనికి తోడు భయంకరమైన ఆకలి దప్పులు, సకాలమునకు దొరకని ఆహారము, ఇవన్నీ అంతులేని బాధలు….. వనవాసములో కలుగుతాయి.

వాటిని నీవు తట్టుకోలేవు. వీటికి తోడు వ్యాధులు కలిగించు కీటకములు, దోమలు, భయంకరమైన విషపూరితములైన తేళ్లు, స్వేచ్ఛగా సంచరించు అరణ్యములలో నీవు ఒక్క క్షణమైనా ఉండలేవు. అరణ్యములలో నివసించు వారు కామ, క్రోధములను విడిచి పెట్టి మనసును తపస్సుమీదనే లగ్నం చేయాలి. భయము అనే మాటను మనసులోకి రానీయకూడదు. అది నీ బోటి దానికి సాధ్యం కాదు.

కాబట్టి నీ వంటి సుకుమారికి అరణ్యవాసము యోగ్యము కాదు. నీవు ఇచ్చటనే వ్రతములు, ఉపవాసములు చేస్తూ నా క్షేమమును కోరుతూ ఉండు. నేను క్షణములో వనవాసమును పూర్తి చేసుకొని నీ చెంత వాలుతాను.” అని వనవాసములోని కష్టనష్టముల గురించి వివరంగా చెప్పాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Ayodhya Kanda Sarga 27 In Telugu | అయోధ్యాకాండ సప్తవింశః సర్గః

Ayodhya Kanda Sarga 27 In Telugu

అయోధ్యా కాండ సర్గ 27… రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. “ఏమిటండీ మీరు మాట్లాడేది. నాకు ఏమీ కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా. నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా. హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా! మీనోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి. ఒకవేళ అరణ్యానికి వెళ్లాల్సివస్తే, మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి?ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్లు వారందరూ వారి వారి పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు. ఈ విదంగా రాముల వారు వివరిస్తున్న సందర్బల్మ్లోనిది…

పతివ్రతాధ్యవసాయః

ఏవముక్తా తు వైదేహీ ప్రియార్హా ప్రియవాదినీ |
ప్రణయాదేవ సంక్రుద్ధా భర్తారమిదమబ్రవీత్ ||

1

కిమిదం భాషసే రామ వాక్యం లఘుతయా ధ్రువమ్ |
త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ ||

2

ఆర్యపుత్ర పితా మాతా భ్రాతా పుత్రస్తథా స్నుషా |
స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యముపాసతే ||

3

భర్తుర్భాగ్యం తు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ |
అతశ్చైవాహమాదిష్టా వనే వస్తవ్యమిత్యపి ||

4

న పితా నాత్మజో నాత్మా న మాతా న సఖీజనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతిః సదా ||

5

యది త్వం ప్రస్థితో దుర్గం వనమద్యైవ రాఘవ |
అగ్రతస్తే గమిష్యామి మృద్గంతీ కుశకంటకాన్ ||

6

ఈర్ష్యారోషౌ బహిష్కృత్య భుక్తశేషమివోదకమ్ |
నయ మాం వీర విస్రబ్ధః పాపం మయి న విద్యతే ||

7

ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయసగతేన వా |
సర్వావస్థాగతా భర్తుః పాదచ్ఛాయా విశిష్యతే ||

8

అనుశిష్టాఽస్మి మాత్రా చ పిత్రా చ వివిధాశ్రయమ్ |
నాస్మి సంప్రతివక్తవ్యా వర్తితవ్యం యథా మయా ||

9

అహం దుర్గం గమిష్యామి వనం పురుషవర్జితమ్ |
నానామృగగణాకీర్ణం శార్దూలవృకసేవితమ్ ||

10

సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః |
అచింతయంతీ త్రీఁల్లోకాంశ్చింతయంతీ పతివ్రతమ్ ||

11

శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణీ |
సహ రంస్యే త్వయా వీర వనేషు మధుగంధిషు ||

12

త్వం హి కర్తుం వనే శక్తో రామ సంపరిపాలనమ్ |
అన్యస్యాపి జనస్యేహ కిం పునర్మమ మానద ||

13

సహ త్వయా గమిష్యామి వనమద్య న సంశయః |
నాహం శక్యా మహాభాగ నివర్తయితుముద్యతా ||

14

ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయః |
న తే దుఃఖం కరిష్యామి నివసంతీ సహ త్వయా ||

15

ఇచ్ఛామి సరితః శైలాన్పల్వలాని వనాని చ |
ద్రష్టుం సర్వత్ర నిర్భీతా త్వయా నాథేన ధీమతా ||

16

హంసకారండవాకీర్ణాః పద్మినీః సాధుపుష్పితాః |
ఇచ్ఛేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగతా ||

17

అభిషేకం కరిష్యామి తాసు నిత్యం యతవ్రతా |
సహ త్వయా విశాలాక్ష రంస్యే పరమనందినీ ||

18

ఏవం వర్షసహస్రాణాం శతం వాఽహం త్వయా సహ |
వ్యతిక్రమం న వేత్స్యామి స్వర్గోపి న హి మే మతః ||

19

స్వర్గేఽపి చ వినా వాసో భవితా యది రాఘవ |
త్వయా భమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే ||

20

అహం గమిష్యామి వనం సుదుర్గమం
మృగాయుతం వానరవారణైర్యుతమ్ |
వనే నివత్స్యామి యథా పితుర్గృహే
తవైవ పాదావుపగృహ్య సంయతా ||

21

అనన్యభావామనురక్తచేతసం
త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితామ్ |
నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం
న తే మయాఽతో గురుతా భవిష్యతి ||

22

తథా బ్రువాణామపి ధర్మవత్సలో
న చ స్మ సీతాం నృవరో నినీషతి |
ఉవాచ చైనాం బహు సన్నివర్తనే
వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి ||

23

ఇతి శ్రిమద్రామయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 27 Meaning In Telugu

రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. “ఏమిటండీ మీరు మాట్లాడేది. నాకు ఏమీ కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా. నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా. హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా! మీనోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి. ఒకవేళ అరణ్యానికి వెళ్లాల్సివస్తే, మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి?ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్లు వారందరూ వారి వారి పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు.

ఎవరు చేసిన పుణ్యఫలములను కానీ పాప ఫలములను కానీ వారే అనుభవిస్తారు. కాని భార్య అలా కాదు. భార్య తన భర్త చేసిన పుణ్యములో కానీ పాపమలో కానీ భాగము పంచుకుంటుంది. భర్త కష్టసుఖములలో పాలు పంచుకుంటుంది. అది భార్య ధర్మము. దానిని ఎవరూ కాదనలేరు.

మామగారు తమరిని అడవులకు వెళ్లమంటే నన్నుకూడా వెళ్లమన్నట్టు కాదా! అది వేరుగా చెప్పవలెనా! ఎందుకంటే భార్యకు భర్తతో పాటు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. ఇహలోకంలో కానీ,పరలోకంలో గానీ భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు. కాబట్టి తమరి వెంటే నేను.

అది అడవి కానీ, అంతఃపురము కానీ. మీరు అడవులలో నడుస్తూ ఉంటే నేను మీ ముందు నడుస్తూ మీరు వెళ్లే దారిలో ముళ్లు రాళ్లు లేకుండా శుభ్రం చేస్తాను. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి. నా వల్ల తమరికి ఎలాంటి కష్టము కలగ కుండా నేను చూసుకుంటాను.

ఓ నాధా! నేను అంతఃపురములో ఉన్నను, అరణ్యములలో ఉన్నను, నాకు నా భర్తతోటిదే లోకము. మరే సుఖములు, భోగములు నాకు అక్కరలేదు. ఈ విషయములన్నీ నాకు నా తల్లి తండ్రులు నాకు ఇదివరకే ఉపదేశించారు. ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు ఎవరూ వేరుగా చెప్ప పనిలేదు. మీరు వెళ్లే ప్రదేశము క్రూరమృగము లతో నిండిన దుర్గమారణ్యము కానీ నేను కూడా మీతో వస్తాను.

నేను అడవిలో ఉన్నా నా పుట్టింట్లో ఉన్నట్లు ఉంటాను. ఏ కష్టములను లెక్కచెయ్యను. నేను నిత్యము తమరి సేవ చేసుకుంటూ బ్రహ్మ చర్యమును పాటిస్తూ, అడవులలో స్వేచ్ఛగా విహరిస్తాను. నేను కూడా తమరితో పాటు ఫలములు, కందమూలములు తింటూ బతుకుతాను. మిమ్మల్ని అది తెమ్మని ఇది తెమ్మని ఇబ్బంది పెట్టను.

నాకు కూడా ఎన్నాళ్లనుండో అడవులలో విహరించాలని, అక్కడ ఉన్న హంసలను, నెమళ్లను వాటి సౌందర్యమును చూడాలని, తామర పూల కొలనులో స్నానమాడాలని, ఎంతో కోరికగా ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతున్నందుకు ఎంతో ఆనందంగాఉంది. ఆ మాదిరిగా మీతో లక్ష సంవత్సరములు కూడా ఆనందంగా గడుపుతాను.

ఇంక నా భద్రత అంటారా. మహావీరులు మీరు నా పక్కన ఉండగా నా భద్రత గురించి నాకు భయమెందుకు. కాబట్టి మీరు ఎలా తండ్రిమాటను మన్నించి అడవులకు వెళ్లాలని నిర్ణయించు కున్నారో, నేను కూడా తమరి వెంట రావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పులేదు. ఎందుకంటే నాకు తమరు లేకుండా స్వర్గము కూడా తృణప్రాయము.

తమరు ఎదురుగా ఉంటే దుర్గమారణ్యము కూడా స్వర్గతుల్యము. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకొని మరణిస్తాను కాని మిమ్ములను విడిచి ఒక్క క్షణం కూడా బతకలేను.” అని సీత తన నిర్ణయాన్ని స్పష్టంగా రామునికి తెలిపింది.

సీత చెప్పిన మాటలను ఎంతో ఓపిగ్గా విన్నాడు రాముడు. అరణ్యము అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో వివరంగా చెప్పి సీతను తనతో పాటు వనవాసమునకు రావడాన్ని ఆపుదాము అని అనుకొన్నాడు రాముడు. సీతతో ఇలా చెప్పసాగాడు.

అయోధ్యాకాండ అష్టావింశః సర్గః (28) >>

Aditya Hrudayam In Telugu – ఆదిత్య హృదయం

aditya hrudayam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఆదిత్య హృదయం స్తోత్రము గురించి తెలుసుకుందాం…

ఆదిత్యుని విశిష్టత

సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం. ఆ ఆదిత్యుని స్థానము మన హృదయం “సౌరసూక్తం” సూర్యనమస్కారములు ద్వారా సకలరోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ. రుగ్మతలతో పాటు దారిద్ర్యము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ సూర్యనాయకుడు. దారిద్ర్యమునకు ములకారకుడైన శనిమహాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రుడు కనుక, సూర్యారాధన దారిద్య్రమును నిర్మూలింపగలదు. పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కాణములు కనిపిస్తాయి.

ఆదిత్య హృదయం స్తోత్రం

శ్రీ గురు గణేశ శారదా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం అస్యశ్రీ ఆదిత్య హృదయ స్తోత్రస్య ‘ అగస్త్యఋషి!’ అనుష్టుప్చందః శ్రీ ఆదిత్య దేవతా సర్వదేవాత్మక ఇతి బీజం ‘ తేజస్వీ ఇతి శక్తిః ! రశ్మిమాన్ ఇతి కీలకం ! మమ శ్రీ సూర్య ప్రసాద సిద్ధ్యర్ధే శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రపారే వినియోగః.

కరన్యాసం
ఓం హ్రాం – అంగుష్ఠాభ్యాం నమః
ఓం హ్రీం – తర్జనీ భ్యాం నమః
ఓం హ్రూం – మధ్యమాభ్యాం నమః
ఓం హ్రైం – అనామికాభ్యాం నమః
ఓం హౌం – కనిష్ఠికాభ్యాం నమః
ఓం హ్రః – కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసము
ఓం హ్రాం – జ్ఞానాయ హృదయాయ నమః
ఓం హ్రీం – ఐశ్వర్యాయ శిరసేస్వాహా
ఓం హ్రూం – శక్యై శిఖాయైవౌషట్
ఓం హ్రైం – బలాయ కవచాయ హుం
ఓం హౌం – తేజసే నేత్రాభ్యాం వషట్
ఓం హ్రః – వీర్యాయ అస్త్రాయ ఫట్ భూర్భు
వస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం

ఓం ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః
కేయూర వాన్మకరకుండల వాన్కిరీటీ
హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః ॥

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం
ఉపగమ్యా బ్రవీ ద్రామమగస్త్యో భగవాన్ ఋషిః
అగస్త్య ఉవాచ।।

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీ న్వత్ప సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేన్నిత్య మక్షయ్యం పరమం శుభం

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం
చింతాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమం

రశ్మిమంతం సుముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వ దేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్స్కందః ప్రజాపతిః
మహేందో ధనదః కాలో యమ స్సోమో హ్యపాంపతిః

పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయు ర్వహ్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యఃఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త సప్తి ర్మరీచిమాన్
తిమిరో న్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర సప్తనో భాస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్ర శ్శంఖ శ్శిశర నాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు స్వామపారగః
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమో నమః

పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమ స్సహంస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః
పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభి నిఘ్నాయ రుచయే లోక సాక్షిణే

నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభూః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్ని హోత్రంచ ఫలం చైవా గ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఏన మాపత్సు కృచేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావ సీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవ దేవం జగత్పతిం
ఏత త్రి గుణితం జప్వా యుద్దేషు విజయిష్యసి

ఆస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యధాగతం

ఏతచ్ఛుత్వా మహా తేజా నష్టశోకో భవత్తదా
ధారయా మాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్

అధ రవి రవదన్ని రీక్ష్య రామం ముదిత మనాః పరమం ప్రహృష్య మాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ||

మరిన్ని స్తోత్రములు

Sri Sainatha Dasanama Stotram In Telugu – శ్రీసాయినాథ దశనామస్తోత్రమ్

Sri Sainatha Dasanama Stotram

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథ దశనామస్తోత్రమ్

ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకమాయినే
తృతీయం తీర్థరాజాయ చతుర్ధం భక్తవత్సలే
పంచమం పరమాత్మయ షష్టంచ షిర్డివాసినే
సప్తమం సద్గురు నాథాయ అష్టమం అనాథనాథనే
నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారనే
ఏతాని దశనామాని త్రిసంధ్య యః పఠేన్నరః
సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథ గురు కృపాః

మరిన్ని స్తోత్రములు

Balakanda Sarga 46 In Telugu – బాలకాండ షట్చత్వారింశః సర్గః

Balakanda Sarga 46 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో 46వ సర్గ విశేషాల గురించి తెలుపుతుంది. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. యజ్ఞం ప్రారంభించడానికి సిద్ధమవుతాడు. యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటక, సుబాహు, మరిచిలాంటి రాక్షసులు వస్తారు. రాక్షసులను అడ్డుకోవడానికి రాముడు తన అస్త్రశస్త్రాలను ఉపయోగించి వారిని సంహరిస్తాడు.

దితిగర్భభేదః

హతేషు తేషు పుత్రేషు దితిః పరమదుఃఖితా |
మారీచం కశ్యపం రామ భర్తారమిదమబ్రవీత్ ||

1

హతపుత్రాఽస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః |
శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితమ్ ||

2

సాఽహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి |
బలవంతం మహేష్వాసం స్థితిజ్ఞం సమదర్శినమ్ ||

3

ఈశ్వరం శక్రహంతారం త్వమనుజ్ఞాతుమర్హసి |
తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా ||

4

ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితామ్ |
ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే ||

5

జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే |
పూర్ణే వర్షసహస్రే తు శుచిర్యది భవిష్యసి ||

6

పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి |
ఏవముక్త్వా మహాతేజాః పాణినా స మమార్జ తామ్ ||

7

సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ |
గతే తస్మిన్నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా ||

8

కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణమ్ |
తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకార హ ||

9

సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా |
అగ్నిం కృశాన్కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ ||

10 [కుశాన్]

న్యవేదయత్సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితమ్ |
గాత్రసంవహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా ||

11

శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ |
అథ వర్షసహస్రే తు దశోనే రఘునందన ||

12

దితిః పరమసంప్రీతా సహస్రాక్షమథాబ్రవీత్ |
యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా ||

13

వరో వర్షసహస్రాంతే మమ దత్తః సుతం ప్రతి |
తపశ్చరంత్యా వర్షాణి దశ వీర్యవతాం వర ||

14

అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః |
తమహం త్వత్కృతే పుత్రం సమాధాస్యే జయోత్సుకమ్ ||

15

త్రైలోక్యవిజయం పుత్ర సహ భోక్ష్యసి విజ్వరః |
ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే ||

16

నిద్రయాఽపహృతా దేవీ పాదౌ కృత్వాఽథ శీర్షతః |
దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజామ్ ||

17

శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ |
తస్యాః శరీరవివరం వివేశ చ పురందరః ||

18

గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్ |
భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా ||

19

రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత |
మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోఽభ్యభాషత ||

20

బిభేద చ మహాతేజా రుదంతమపి వాసవః |
న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరబ్రవీత్ ||

21

నిష్పపాత తతః శక్రో మాతుర్వచనగౌరవాత్ |
ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత ||

22

అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా |
తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే |
అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షంతుమర్హసి ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 46 Meaning In Telugu

“ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది.

“నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని అడిగింది.

ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. ” ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు.” అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు.

కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది.

ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు.

దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. “ఓ దేవేంద్రా! నేను పరాక్రమ వంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నాభర్త అయిన కశ్యపుని వరం అడిగాను. వేయి సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్తనాకు వరం ప్రసాదించాడు. ఇంకొక పది సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు, నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి.” అని పలికింది.

తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్లింది. కాని తొందరగా నిద్ర పోవలెనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించ వలసిన వైపు కాళ్లు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు.

తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరక బడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది.

ఇంద్రుడు ఆ పిండమును చూచి ” ఏడవ వద్దు ఏడవ వద్దు” అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు.

ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భము లోనుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు.

“తల్లీ! నన్ను క్షమించు. నీవు తల వైపు కాళ్లు పెట్టుకొని, నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేసావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు.” అని ప్రార్థించాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ నలుబది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ సప్తచత్వారింశః సర్గః (47) >>

Balakanda Sarga 35 In Telugu – బాలకాండ పంచత్రింశః సర్గః

Balakanda Sarga 35 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి మరికొందరు గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు మరియు వారు ఆ నదీతీరంలో విహారం చేస్తారు. అక్కడ గంగా నది గురించి రాముడు పరిశోధనాత్మకంగా అడిగినప్పుడు విశ్వామిత్రుడు గంగానది పురాణాన్ని వివరిస్తాడు, ఆమె తండ్రి హిమాలయాల నుండి దేవతలు ఆమెను ఎలా స్వర్గానికి తీసుకువెళ్లారు.

ఉమాగంగావృత్తాంతసంక్షేపః

ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః |
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ ||

2

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్ |
గమనం రోచయామాస వాక్యం చేదమువాచ హ ||

3

అయం శోణః శుభజలోగాధః పులినమండితః |
కతరేణ పథా బ్రహ్మన్సంతరిష్యామహే వయమ్ ||

4

ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోఽబ్రవీదిదమ్ |
ఏష పంథా మయోద్దిష్టో యేన యాంతి మహర్షయః ||

5

ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా |
పశ్యంతస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ ||

6

తే గత్వా దూరమధ్వానం గతేఽర్ధదివసే తదా |
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్ ||

7

తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారససేవితామ్ |
బభూవుర్మునయః సర్వే ముదితాః సహరాఘవాః ||

8

తస్యాస్తీరే తతశ్చక్రుస్త ఆవాసపరిగ్రహమ్ |
తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః ||

9

హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చానుత్తమం హవిః |
వివిశుర్జాహ్నవీతీరే శుచౌ ముదితమానసాః ||

10

విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః |
సంప్రహృష్టమనా రామో విశ్వామిత్రమథాబ్రవీత్ ||

11

భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథగాం నదీమ్ |
త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్ ||

12

చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః |
వృద్ధిం జన్మ చ గంగాయా వక్తుమేవోపచక్రమే ||

13

శైలేంద్రో హిమవాన్రామ ధాతూనామాకరో మహాన్ |
తస్య కన్యాద్వయం జాతం రూపేణాప్రతిమం భువి ||

14

యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా |
నామ్నా మేనా మనోజ్ఞా వై పత్నీ హిమవతః ప్రియా ||

15

తస్యాం గంగేయమభవజ్జ్యేష్ఠా హిమవతః సుతా |
ఉమా నామ ద్వితీయాభూత్కన్యా తస్యైవ రాఘవ ||

16

అథ జ్యేష్ఠాం సురాః సర్వే దేవతార్థచికీర్షయా |
శైలేంద్రం వరయామాసుర్గంగాం త్రిపథగాం నదీమ్ ||

17

దదౌ ధర్మేణ హిమవాంస్తనయాం లోకపావనీమ్ |
స్వచ్ఛందపథగాం గంగాం త్రైలోక్యహితకామ్యయా ||

18

ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోకహితకారిణః |
గంగామాదాయ తేఽగచ్ఛన్కృతార్థేనాంతరాత్మనా ||

19

యా చాన్యా శైలదుహితా కన్యాఽఽసీద్రఘునందన |
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా ||

20

ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరః సుతామ్ |
రుద్రాయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్ ||

21

ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే |
గంగా చ సరితాం శ్రేష్ఠా ఉమా దేవీ చ రాఘవ ||

22

ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ |
ఖం గతా ప్రథమం తాత గంగా గతిమతాం వర ||

23

సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా |
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ ||

24

Balakanda Sarga 35 In Telugu Pdf With Meaning

మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అంతరూ ప్రాతః కాలముననే నిద్ర లేచి, సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు.

గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదీలో స్నానములు చేసి పితృ తర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టు కూర్చున్నారు.

విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. ” ఓ మహర్షీ! ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది. ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది. వివరించండి.” అని అడిగాడు.

విశ్వామిత్రుడు గంగా నది గురించి దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు.

‘ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు. ఓషధులకు నిలయము.

హిమ వంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉ మ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు, తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్లిపోయింది.

హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదటు పెట్టింది. హిమ వంతుడు తనరెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేసాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్లు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్లింది. ఉమశివుని వెంట కైలాసమునకు వెళ్లింది.

గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
బాలకాండ 35వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్త్రింశః సర్గః (36) >>