Ayodhya Kanda Sarga 11 In Telugu – అయోధ్యాకాండ ఏకాదశః సర్గః

Ayodhya Kanda Sarga 11

“అయోధ్యాకాండం” వాల్మీకి మహర్షి రామాయణంలోని రెండవ భాగం. ఈ భాగంలో రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లడం, రాముని పాదుకలను భరతుడు పట్టాభిషేకం చేయడం వంటి సంఘటనలు ఉంటాయి. “ఏకాదశ సర్గ” అంటే “అయోధ్యాకాండంలో పదకొండవ అధ్యాయం”. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని అరణ్యవాసానికి పంపిన తర్వాత కలిగిన విచారం మరియు దుఃఖాన్ని వివరించబడింది. సుమంతుడిని పంపి, రాముడు, సీత, లక్ష్మణులని తీసుకురావడానికి ప్రయత్నించినా, వారు తిరిగి రాకపోవడం కూడా ఇందులో ప్రస్తావించబడింది.

వరద్వయనిర్బంధః 

తం మన్మథశరైర్విద్ధం కామవేగవశానుగమ్ |
ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః || ౧ ||

నాస్మి విప్రకృతాదేవ కేనచిన్నావమానితా |
అభిప్రాయస్తు మే కశ్చిత్తమిచ్ఛామి త్వయా కృతమ్ || ౨ ||

ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్ఛసి |
అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా || ౩ ||

తామువాచ మహాతేజాః కైకేయీమీషదుత్స్మితః |
కామీ హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితామ్ || ౪ ||

అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతరో మమ |
మనుజో మనుజవ్యాఘ్రాద్రామాదన్యో న విద్యతే || ౫ ||

తేనాజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మనా |
శపే తే జీవనార్హేణ బ్రూహి యన్మనసేచ్ఛసి || ౬ ||

యం ముహూర్తమపశ్యంస్తు న జీవేయమహం ధ్రువమ్ |
తేన రామేణ కైకేయి శపే తే వచనక్రియామ్ || ౭ ||

ఆత్మనా వాత్మజైశ్చాన్యైర్వృణేయం మనుజర్షభమ్ |
తేన రామేణ కైకేయి శపే తే వచనక్రియామ్ || ౮ ||

భద్రే హృదయమప్యేతదనుమృశ్యోద్ధరస్వ మే |
ఏతత్సమీక్ష్య కైకేయి బ్రూహి యత్సాధు మన్యసే || ౯ ||

బలమాత్మని పశ్యంతీ న మాం శంకితుమర్హసి |
కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే || ౧౦ ||

సా తదర్థమనా దేవీ తమభిప్రాయమాగతమ్ |
నిర్మాధ్యస్థ్యాచ్చ హర్షాచ్చ బభాషే దుర్వచం వచః || ౧౧ ||

తేన వాక్యేన సంహృష్టా తమభిప్రాయమాగతమ్ |
వ్యాజహార మహాఘోరమభ్యాగతమివాంతకమ్ || ౧౨ ||

యథా క్రమేణ శపసి వరం మమ దదాసి చ |
తచ్ఛృణ్వంతు త్రయస్త్రింశద్దేవాః సాగ్నిపురోగమాః || ౧౩ ||

చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహా రాత్ర్యహనీ దిశః |
జగచ్చ పృథివీ చేయం సగంధర్వా సరాక్షసా || ౧౪ ||

నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః |
యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ || ౧౫ ||

సత్యసంధో మహాతేజాః ధర్మజ్ఞః సుసమాహితః |
వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః || ౧౬ ||

ఇతి దేవీ మహేష్వాసం పరిగృహ్యాభిశస్య చ |
తతః పరమువాచేదం వరదం కామమోహితమ్ || ౧౭ ||

స్మర రాజన్పురా వృత్తం తస్మిన్ దైవాసురే రణే |
తత్ర చాచ్యావయచ్ఛత్రుస్తవ జీవితమంతరా || ౧౮ ||

తత్ర చాపి మయా దేవ యత్త్వం సమభిరక్షితః |
జాగ్రత్యా యతమానాయాస్తతో మే ప్రాదదా వరౌ || ౧౯ ||

తౌ తు దత్తౌ వరౌ దేవ నిక్షేపౌ మృగయామ్యహమ్ |
తథైవ పృథివీపాల సకాశే సత్యసంగర || ౨౦ ||

తత్ప్రతిశ్రుత్య ధర్మేణ న చేద్దాస్యసి మే వరమ్ |
అద్యైవ హి ప్రహాస్యామి జీవితం త్వద్విమానితా || ౨౧ ||

వాఙ్మాత్రేణ తదా రాజా కైకేయ్యా స్వవశే కృతః |
ప్రచస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మనః || ౨౨ ||

తతః పరమువాచేదం వరదం కామమోహితమ్ |
వరౌ యౌ మే త్వయా దేవ తదా దత్తౌ మహీపతే || ౨౩ ||

తౌ తావదహమద్యైవ వక్ష్యామి శృణు మే వచః |
అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః || ౨౪ ||

అనేనైవాభిషేకేణ భరతో మేఽభిషేచ్యతామ్ |
యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన మే త్వయా || ౨౫ ||

తదా దైవాసురే యుద్ధే తస్య కాలోఽయమాగతః |
నవ పంచ చ వర్షాణి దండకారణ్యమాశ్రితః || ౨౬ ||

చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకంటకమ్ || ౨౭ ||

ఏష మే పరమః కామో దత్తమేవ వరం వృణే |
అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనమ్ || ౨౮ ||

స రాజరాజో భవ సత్యసంగరః
కులం చ శీలం చ హి రక్ష జన్మ చ |
పరత్రవాసే హి వదంత్యనుత్తమం
తపోధనాః సత్యవచో హితం నృణామ్ || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాదశః సర్గః || ౧౧ ||

Ayodhya Kanda Sarga 11 Meaning In Telugu

దశరథమహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మధ బాణములకు బలి అయిన, తన మీది కామానికి దాసోహం అన్న, తన భర్త దశరథమహారాజుతో ఇలా అంది. “మహారాజా! మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు. ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగ వలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధకలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా!” అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక.

ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకొని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు. దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు ఆరోప్రాణమ. నా ఐదు ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న ఆరో ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా!

ఓ కైకా! రాముని రక్షించుకోడానికి నేను నా ప్రాణాలను, నా ముగ్గురు కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉ న్నాను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏముందో తెలుసుకోడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయయుంచి నీ కోరిక వెల్లడించు.

అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము. నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా! నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు. నేను ఇప్పటి దాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీదకూడా ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. ఇంక నైనా నీ మనసులోని కోరిక బయట పెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు.” అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంక తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లి మెల్లిగా తన మనసులోని కోరికలు దశరథుని తో వెల్లడించసాగింది.

“ఓ దశరథ మహారాజా! మీరు ఎంతో ఒట్టు పెట్టుకొన్నారు. కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షీభూతంగా విన్నారు. వారే కాదు సూర్య చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్లు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశా చరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా! సకల దేవతలారా! వినండి. నాకు, నా భర్త దశరథమహారాజుగారు, పూర్వముదేవాసుర యుద్ధములలో నాకు ఇస్తాను అని వాగ్దానము చేసిన రెండు వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు.” అని పలికి కైక దశరథుని వచన బద్ధుని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరోగత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైకమీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నిటికీ మరోమాట మాట్లాడకుండా తలూపుతున్నాడు.

“ఓ దశరథ మహారాజా! ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా! ఆ యుద్ధములో మీరు ఓడిపోయే పరిస్తితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించి పోయాయి. అప్పుడు నేను మిమ్ములను రెండు సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసారు. మీకు గుర్తు ఉంది కదా! కాని నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినపుడు కోరుకుంటాను అని అన్నాను. . మీరు సత్యవాక్పరిపాలకులు. ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆవరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యము అవుతుంది.” అని నేర్పుగా దశరథుని తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామ పాశములలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తలూపాడు. “నీవు ఏం కోరితే అది ఇస్తాను. సందేహించకు” అని వాగ్దానం చేసాడు దశరథుడు.

“ఓ దశరథమహారాజా! ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆ నాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటు న్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా! ఎన్నో ఏర్పాట్లు చేసారు కదా! నగరమంతా అలంకరింపచేసారు కదా! చాలాసంతోషము. కాని ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో, రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యౌవ్వరాజ్య పట్టాభిషేకము జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము.” అంది కైక.

దశరథునికి తలతిరిగినట్టయింది. “మరి రాముడు! రాముడు ఏమవుతాడు!” అని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక “రాముడు పదునాలుగు సంవత్సరములు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరము.” అని పలికింది కైక.

దశరథునికి నోటి మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉ న్నాడు దశరథుడు. మరలా ఇలా అంది. “నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ చేయాలి. (అంటే రాముడు భరతునికి శత్రుసమానుడు అని చెప్పకనే చెప్పింది కైక). అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్లాలి. రాముడు వనవాసమునకు వెళ్లడం నేను కళ్లారా చూడాలి. ఓ దశరథ మహారాజా! ఓ సత్యవాక్పరిపాలకా! మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్న మాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మము. అన్న మాట నిలబెట్టుకుంటే నీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయి.” అని తేల్చి చెప్పింది కైక. (ఇంక ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అప్రయత్నంగా కైక నోటినుండి వెలువడింది.).

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్వాదశః సర్గః (12) >>

Balakanda Sarga 10 In Telugu – బాలకాండ దశమః సర్గః

Balakanda Sarga 10 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ దశమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాలను రక్షించడానికి దశరథ మహారాజును కలిసి, రాముడిని సహాయం చేయమని అడుగుతాడు. తొలుత దశరథుడు ససేమిరా అంటాడు, కానీ వసిష్ఠ మహర్షి సలహా మేరకు, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రతో కలిసి యజ్ఞాలను రక్షించడానికి బయలుదేరుతారు.

ఋశ్యశృంగస్యాంగదేశానయనప్రకారః

సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా |
యథర్శ్యశృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ ||

1

రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః |
ఉపాయో నిరపాయోఽయమస్మాభిరభిమంత్రితః ||

2

ఋశ్యశృంగో వనచరస్తపః స్వాధ్యాయనే రతః |
అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ ||

3

ఇంద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభిః |
పురమానాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతామ్ ||

4

గణికాస్తత్ర గచ్ఛంతు రూపవత్యః స్వలంకృతాః |
ప్రలోభ్య వివిధోపాయైరానేష్యంతీహ సత్కృతాః ||

5

శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్ |
పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా ||

6

వారముఖ్యాస్తు తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్ |
ఆశ్రమస్యావిదూరేఽస్మిన్యత్నం కుర్వంతి దర్శనే ||

7

ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః |
పితుః స నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ ||

8

న తేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా |
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సత్త్వం నగరరాష్ట్రజమ్ ||

9

తతః కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా |
విభండకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాంగనాః ||

10

తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యో మధురస్వరైః |
ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్ ||

11

కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ |
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః ||

12

అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః |
హార్దాత్తస్య మతిర్జాతా హ్యఖ్యాతుం పితరం స్వకమ్ ||

13

పితా విభండకోఽస్మాకం తస్యాహం సుత ఔరసః |
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి ||

14

ఇహాశ్రమపదేఽస్మాకం సమీపే శుభదర్శనాః |
కరిష్యే వోఽత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్ ||

15

ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై |
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముః సర్వాశ్చ తేన తాః ||

16

ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార హ |
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలమిదం ఫలమ్ ||

17

ప్రతిగృహ్య తు తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః |
ఋషేర్భీతాస్తు శీఘ్రం తా గమనాయ మతిం దధుః ||

18

అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ |
గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్ ||

19

తతస్తాస్తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః |
మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ శుభాన్ ||

20

తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే |
అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్ ||

21

ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ |
గచ్ఛంతి స్మాపదేశాత్తాః భీతాస్తస్య పితుః స్త్రియః ||

22

గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః |
అస్వస్థహృదయశ్చాసీద్దుఃఖాత్సంపరివర్తతే ||

23

తతోఽపరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్ |
[* విభండకసుతః శ్రీమాన్మనసా చింతయన్ముహుః | *]
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాః స్వలంకృతాః ||

24

దృష్ట్వైవ చ తదా విప్రమాయాంతం హృష్టమానసాః |
ఉపసృత్య తతః సర్వాస్తాస్తమూచురిదం వచః ||

25

ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్ |
[* చిత్రాణ్యత్ర బహూని స్యుర్మూలాని చ ఫలని చ | *]
తత్రాప్యేష విధిః శ్రీమాన్విశేషేణ భవిష్యతి ||

26

శ్రుత్వా తు వచనం తాసాం మునిస్తద్ధృదయం‍గమమ్ |
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తధా స్త్రియః ||

27

తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా ||

28

వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః |
ప్రత్యుద్గమ్య మునిం ప్రీతః శిరసా చ మహీం గతః ||

29 [ప్రహ్వ]

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై నియతః సుసమాహితః |
వవ్రే ప్రసాదం విప్రేంద్రాన్మా విప్రం మన్యురావిశేత్ ||

30

అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్త్వా యథావిధి |
శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాప సః ||

31

ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః |
ఋశ్యశృంగో మహాతేజాః శాంతయా సహ భార్యయా ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే దశమః సర్గః ||

Balakanda Sarga 10 Meaning In Telugu

దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు.

“మహారాజా! రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు.

“మహారాజా! ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటినుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావవిలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము.” అని అన్నారు. దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిగి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు.

ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగ సాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు.

“ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? ఇక్కడు ఏమి చేస్తున్నారు.” అని అడిగారు.

“నేను విభాండకుని పుత్రుడను. నాపేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు. ఇలా ఎందుకు ఉన్నారు.” అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్లాడు. వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. కాని ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడి వడిగా అక్కడి నుండి వెళ్లాలి అనుకున్నారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురము లైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు.

“ ఓ బ్రాహ్మణోత్తమా! ఇవి మధుర ఫలములు. ఆరగింపుడు.” అని అన్నారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకొన్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకొన్నాడు. కడుపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్లిపోయారు.

వారు వెళ్లి పోయిన తరువాత ఋశ్యశృంగునికి మనసు వికలమయింది. వారినే తలచు కుంటూ, వారి స్పర్శసుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు.

మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువ లేదు. ఆ వేశ్యలను మరలా కలుసు కోడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు ఆక్కడకు వెళ్లారు. అతనితో ఇలా అన్నారు.

“ఓ బ్రాహ్మణోత్తమా! నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిధ్యము స్వీకరించ వలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. వాటిని తమరు తనివిదీరా ఆరగింప వచ్చును” అని అన్నారు.

ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ, అంగదేశమునకు తీసుకొని వెళ్లారు. ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే గా వానలు కురిసాయి. పంటలు పండాయి. కరువుకాటకాలు తీరిపోయాయి.

రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చిసత్కరించాడు. “మహాత్మా! తమరి రాకచే మా అంగరాజ్యము పావనము అయింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నాకుమార్తె శాంతను వివాహమాడండి. ” అని ప్రార్థించాడు.

ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంత కాలం పాటు అంగరాజ్యములోనే ఉన్నాడు.

ఇది
వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ  ఏకాదశః సర్గః  (11>>

Balakanda Sarga 9 In Telugu – బాలకాండ నవమః సర్గః

Balakanda Sarga 9 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో నవమ సర్గము ఒక ముఖ్యమైన భాగము. దశరథ రాజు మంత్రిగా ఉన్న సుమంత్రుడు, ఋషిశృంగ మహర్షి యొక్క ముఖ్యతనను వివరించాడు. ఆ మహర్షిని ఆలోచించిన వైదిక కర్మకు అధ్యక్షత వహించడానికి రాజుని ఆహ్వానించాడు. రాజు వేడుకున్నాడు, ఆ మహర్షి ఏ రాజ్యంలో ప్రవేశించడం మరియు ఆ దేశానికి ప్రజలకు శుభదాయకంగా ఉండడం సంబంధించింది.

ఋశ్యశృంగోపాఖ్యానమ్

ఏతచ్ఛ్రుత్వా రహః సూతో రాజానమిదమబ్రవీత్ |
[* శ్రూయతాం తత్ పురా వృత్తం పురాణే చ మయా శ్రుతమ్ | *]
ఋత్విగ్భిరుపదిష్టోఽయం పురావృత్తో మయా శ్రుతః ||

1

సనత్కుమారో భగవాన్పూర్వం కథితవాన్కథామ్ |
ఋషీణాం సన్నిధౌ రాజంస్తవ పుత్రాగమం ప్రతి ||

2

కాశ్యపస్య తు పుత్రోఽస్తి విభండక ఇతి శ్రుతః |
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి ||

3

స వనే నిత్యసంవృద్ధో మునిర్వనచరః సదా |
నాన్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రానువర్తనాత్ ||

4

ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః |
లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా ||

5

తస్యైవం వర్తమానస్య కాలః సమభివర్తతే |
అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినమ్ ||

6

ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్ |
అంగేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః ||

7

తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా |
అనావృష్టిః సుఘోరా వై సర్వభూతభయావహా ||

8

అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖసమన్వితః |
బ్రాహ్మణాఞ్శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి ||

9

భవంతః శ్రుతధర్మాణో లోకచారిత్రవేదినః |
సమాదిశంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ ||

10

[* ఇత్యుక్తాస్తే తతో రాజ్ఞా సర్వే బ్రాహ్మణసత్తమాః | *]
వక్ష్యంతి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగాః |
విభండకసుతం రాజన్సర్వోపాయైరిహానయ ||

11

ఆనీయ చ మహీపాల ఋశ్యశృంగం సుసత్కృతమ్ |
ప్రయచ్ఛ కన్యాం శాంతాం వై విధినా సుసమాహితః ||

12

తేషాం తు వచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపత్స్యతే |
కేనోపాయేన వై శక్యమిహానేతుం స వీర్యవాన్ ||

13

తతో రాజా వినిశ్చిత్య సహ మంత్రిభిరాత్మవాన్ |
పురోహితమమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్ ||

14

తే తు రాజ్ఞో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః |
న గచ్ఛేమ ఋషేర్భీతా అనునేష్యంతి తం నృపమ్ ||

15

వక్ష్యంతి చింతయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్క్షమాన్ |
ఆనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి ||

16

ఏవమంగాధిపేనైవ గణికాభిరృషేః సుతః |
ఆనీతోఽవర్షయద్దేవః శాంతా చాస్మై ప్రదీయతే ||

17

ఋశ్యశృంగస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి |
సనత్కుమారకథితమేతావద్వ్యాహృతం మయా ||

18

అథ హృష్టో దశరథః సుమంత్రం ప్రత్యభాషత |
యథార్శ్యశృంగస్త్వానీతో విస్తరేణ త్వయోచ్యతామ్ ||

19

ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు.

“మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే…..

కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు.

ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ వర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తనరాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి.” అని అడిగాడు.

దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజా! నీ పాపము పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం.” అని అన్నారు.

ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉ పాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనేపోయి ఋష్యశృంగుని తీసుకొనిరండి.” అని ఆజ్ఞాపిం చాడు. విభాండకునికి భయపడి వారు “మేము వెళ్లము” అని అన్నారు. కాని వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్పారు. అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీసాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమము రుచి చూపించి, తీసుకొని రావచ్చును అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొన వచ్చును అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేసారు.

రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని, తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేసాడు. ఓ దశరధమహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను.”అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు.

“సుమంతా! రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకు రాగలిగాడు. వివరంగా చెప్పు.” అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో తొమ్మిదవసర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ దశమః సర్గః (10) >>

Ayodhya Kanda Sarga 3 In Telugu – అయోధ్యాకాండ తృతీయః సర్గః

Ayodhya Kanda Sarga 3 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. తృతీయ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో ముఖాముఖి అవుతాడు. ఈ సమయంలో, దశరథ మహారాజు కైకేయి ఇచ్చిన వరాల ప్రభావంతో రాముని అరణ్యవాసానికి పంపించవలసిన అవసరం గురించి చర్చ జరుగుతుంది. ఈ సర్గ రాముని విధేయత, పితృవాక్యపాలన, ధర్మం పట్ల అతని అచంచల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాముడు తన తండ్రి మాటలను గౌరవిస్తూ, కైకేయి కోరిన వరాలను అంగీకరించి, అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. ఈ సర్గ రాముని మహానుభావతను మరియు అతని ధార్మికతను స్పష్టంగా చూపిస్తుంది.

పుత్రానుశాసనమ్

తేషామంజలిపద్మాని ప్రగృహీతాని సర్వశః |
ప్రతిగృహ్యాబ్రవీద్రాజా తేభ్యః ప్రియహితం వచః ||

1

అహోఽస్మి పరమప్రీతః ప్రభావశ్చాతులో మమ |
యన్మే జ్యేష్ఠం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థమిచ్ఛథ ||

2

ఇతి ప్రత్యర్చ్య తాన్రాజా బ్రాహ్మణానిదమబ్రవీత్ |
వసిష్ఠం వామదేవం చ తేషామేవోపశృణ్వతామ్ ||

3

చైత్రః శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః |
యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్ ||

4

రాజ్ఞస్తూపరతే వాక్యే జనఘోషో మహానభూత్ |
శనైస్తస్మిన్ప్రశాంతే చ జనఘోషే జనాధిపః ||

5

వసిష్ఠం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్ |
అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదమ్ ||

6

తదద్య భగవాన్సర్వమాజ్ఞాపయితుమర్హసి |
తచ్ఛ్రుత్వా భూమిపాలస్య వసిష్ఠో ద్విజసత్తమః ||

7

ఆదిదేశాగ్రతో రాజ్ఞః స్థితాన్యుక్తాన్కృతాంజలీన్ |
సువర్ణాదీని రత్నాని బలీన్సర్వౌషధీరపి ||

8

శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధుసర్పిషీ |
అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి ||

9

చతురంగబలం చైవ గజం చ శుభలక్షణమ్ |
చామరవ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురమ్ ||

10

శతం చ శాతకుంభానాం కుంభానామగ్నివర్చసామ్ |
హిరణ్యశృంగమృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ||

11

ఉపస్థాపయత ప్రాతరగ్న్యగారం మహీపతేః |
యచ్చాన్యత్కించిదేష్టవ్యం తత్సర్వముపకల్ప్యతామ్ ||

12

అంతఃపురస్య ద్వారాణి సర్వస్య నగరస్య చ |
చందనస్రగ్భిరర్చ్యంతాం ధూపైశ్చ ఘ్రాణహారిభిః ||

13

ప్రశస్తమన్నం గుణవద్దధిక్షీరోపసేచనమ్ |
ద్విజానాం శతసాహస్రే యత్ప్రకామమలం భవేత్ ||

14

సత్కృత్య ద్విజముఖ్యానాం శ్వః ప్రభాతే ప్రదీయతామ్ |
ఘృతం దధి చ లాజాశ్చ దక్షిణాశ్చాపి పుష్కలాః ||

15

సూర్యేఽభ్యుదితమాత్రే శ్వో భవితా స్వస్తివాచనమ్ |
బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యంతాం కల్ప్యంతామాసనాని చ ||

16

ఆబధ్యంతాం పతాకాశ్చ రాజమార్గశ్చ సిచ్యతామ్ |
సర్వే చ తాలావచరా గణికాశ్చ స్వలంకృతాః ||

17

కక్ష్యాం ద్వితీయామాసాద్య తిష్ఠంతు నృపవేశ్మనః |
దేవాయతనచైత్యేషు సాన్నభక్షాః సదక్షిణాః ||

18

ఉపస్థాపయితవ్యాః స్యుర్మాల్యయోగ్యాః పృథక్ పృథక్ |
దీర్ఘాసిబద్ధా యోధాశ్చ సన్నద్ధా మృష్టవాససాః ||

19

మహారాజాంగణం సర్వే ప్రవిశంతు మహోదయమ్ |
ఏవం వ్యాదిశ్య విప్రౌ తౌ క్రియాస్తత్ర సునిష్ఠితౌ ||

20

చక్రతుశ్చైవ యచ్ఛేషం పార్థివాయ నివేద్య చ |
కృతమిత్యేవ చాబ్రూతామభిగమ్య జగత్పతిమ్ ||

21

యథోక్తవచనం ప్రీతౌ హర్షయుక్తౌ ద్విజర్షభౌ |
తతః సుమంత్రం ద్యుతిమాన్రాజా వచనమబ్రవీత్ ||

22

రామః కృతాత్మా భవతా శీఘ్రమానీయతామితి |
స తథేతి ప్రతిజ్ఞాయ సుమంత్రో రాజశాసనాత్ ||

23

రామం తత్రానయాంచక్రే రథేన రథినాం వరమ్ |
అథ తత్ర సమాసీనాస్తదా దశరథం నృపమ్ ||

24

[* ఉపవిష్టాశ్చ సచివాః రాజానశ్చ సనైగమాః | *]
ప్రాచ్యోదీచ్యాః ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ భూమిపాః |
మ్లేచ్ఛాశ్చార్యాశ్చ యే చాన్యే వనశైలాంతవాసినః ||

25

ఉపాసాంచక్రిరే సర్వే తం దేవా ఇవ వాసవమ్ |
తేషాం మధ్యే స రాజర్షిర్మరుతామివ వాసవః ||

26

ప్రాసాదస్థో రథగతం దదర్శాయాంతమాత్మజమ్ |
గంధర్వరాజప్రతిమం లోకే విఖ్యాతపౌరుషమ్ ||

27

దీర్ఘబాహుం మహాసత్త్వం మత్తమాతంగగామినమ్ |
చంద్రకాంతాననం రామమతీవ ప్రియదర్శనమ్ ||

28

రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్ |
ఘర్మాభితప్తాః పర్జన్యం హ్లాదయంతమివ ప్రజాః ||

29

న తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః |
అవతార్య సుమంత్రస్తం రాఘవం స్యందనోత్తమాత్ ||

30

పితుః సమీపం గచ్ఛంతం ప్రాంజలిః పృష్ఠతోఽన్వగాత్ |
స తం కైలాసశృంగాభం ప్రాసాదం నరపుంగవః ||

31

ఆరురోహ నృపం ద్రష్టుం సహ సూతేన రాఘవః |
స ప్రాం‍జలిరభిప్రేత్య ప్రణతః పితురంతికే ||

32

నామ స్వం శ్రావయన్రామో వవందే చరణౌ పితుః |
తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే కృతాంజలిపుటం నృపః ||

33

గృహ్యాంజలౌ సమాకృష్య సస్వజే ప్రియమాత్మజమ్ |
తస్మై చాభ్యుదితం సమ్యఙ్మణికాంచనభూషితమ్ ||

34

దిదేశ రాజా రుచిరం రామాయ పరమాసనమ్ |
తదాసనవరం ప్రాప్య వ్యదీపయత రాఘవః ||

35

స్వయైవ ప్రభయా మేరుముదయే విమలో రవిః |
తేన విభ్రాజతా తత్ర సా సభాఽభివ్యరోచత ||

36

విమలగ్రహనక్షత్రా శారదీ ద్యౌరివేందునా |
తం పశ్యమానో నృపతిస్తుతోష ప్రియమాత్మజమ్ ||

37

అలంకృతమివాత్మానమాదర్శతలసంస్థితమ్ |
స తం సస్మితమాభాష్య పుత్రం పుత్రవతాం వరః ||

38

ఉవాచేదం వచో రాజా దేవేంద్రమివ కశ్యపః |
జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశః సుతః ||

39

ఉత్పన్నస్త్వం గుణశ్రేష్ఠో మమ రామాత్మజః ప్రియః |
త్వయా యతః ప్రజాశ్చేమాః స్వగుణైరనురంజితాః || [యతస్త్వయా]

40

తస్మాత్త్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్నుహి |
కామతస్త్వం ప్రకృత్యైవ వినీతో గుణవానసి ||

41

గుణవత్యపి తు స్నేహాత్పుత్ర వక్ష్యామి తే హితమ్ |
భూయో వినయమాస్థాయ భవ నిత్యం జితేంద్రియః ||

42

కామక్రోధసముత్థాని త్యజేథా వ్యసనాని చ |
పరోక్షయా వర్తమానో వృత్త్యా ప్రత్యక్షయా తథా ||

43

అమాత్యప్రభృతీః సర్వాః ప్రకృతీశ్చానురంజయ |
కోష్ఠాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాన్బహూన్ ||

44

తుష్టానురక్తప్రకృతిర్యః పాలయతి మేదినీమ్ | [ఇష్టా]
తస్య నందంతి మిత్రాణి లబ్ధ్వాఽమృతమివామరాః ||

45

తస్మాత్పుత్ర త్వమాత్మానం నియమ్యైవం సమాచర | [తస్మాత్త్వమపి చాత్మానం]
తచ్ఛ్రుత్వా సుహృదస్తస్య రామస్య ప్రియకారిణః ||

46

త్వరితాః శీఘ్రమభ్యేత్య కౌసల్యాయై న్యవేదయన్ |
సా హిరణ్యం చ గాశ్చైవ రత్నాని వివిధాని చ ||

47

వ్యాదిదేశ ప్రియాఖ్యేభ్యః కౌసల్యా ప్రమదోత్తమా |
అథాఽభివాద్య రాజానం రథమారుహ్య రాఘవః |
యయౌ స్వం ద్యుతిమద్వేశ్మ జనౌఘైః ప్రతిపూజితః ||

48

తే చాపి పౌరా నృపతేర్వచస్త-
-చ్ఛ్రుత్వా తదా లాభమివేష్టమాశు |
నరేంద్రమామంత్ర్య గృహాణి గత్వా
దేవాన్సమానర్చురభిప్రహృష్టాః ||

49

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే తృతీయ సర్గః ||

Ayodhya Kanda Sarga 3 Meaning In Telugu

పై విధంగా రాముని గుణగణాలను కీర్తించి, రాముడే యౌవరాజ్య పట్టాభిషేకమునకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు.

“పుర ప్రముఖులారా! నా జ్యేష్టపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు, అయిన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభమగు గాక!” అనిపలికి తన పురోహితు లైన వసిష్ఠుడు, వామదేవులను చూచి ఇలా అన్నాడు.

“రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము. చైత్ర మాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు.

ఆమాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేసారు. తరువాత దశరథుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! రాబోవు చైత్రమాసములో జరుగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి.” అని అన్నాడు.

ఆ మాటలు వినిన వసిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు.

పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పములు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథములు, ఆయుధములు, చతురంగ బలములు,శు భలక్షణములు ఉన్న గజములు, ఛత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారముతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము, పులి చర్మములు, వీటిని అన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయు గృహములో సిద్ధంగా ఉంచాలి.

అంతఃపురమును, ద్వారములను పుష్పమాలలతో అలంక రింపుడు. సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండి పోవాలి. పాలు,పెరుగు, నెయ్యి మొదలగు ఆహారపదార్థములను సమృద్ధిగా ఉండేట్టు చూడండి. బ్రాహ్మణ సంతర్పణలు ఏ లోటూ లేకుండా జరగాలి. బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనము పలకాలి. అందుకు కావలసినవి సిద్ధం చేయండి. ఇంక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకములు కట్టండి. అరటి స్తంభములు, తోరణములు కట్టండి. రామునికి స్వాగతము పలకడానికి వేశ్యాస్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి. సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి, పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకొని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేయించండి.” అని ఆదేశాలు ఇచ్చారు.

వసిష్ఠుడు వామదేవుడు తాము చేసిన ఏర్పాట్లు గురించి దశరథునికి తెలియజేసారు. తాను అనుకొన్న ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంతుని పిలిచాడు.

“సుమంతా! నీవుపోయి రాముని నా దగ్గరకు తీసుకొనిరా.” అని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంతుడు రాముని వద్దకు వెళ్లాడు.

దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంంతులందరితో సమావేశము అయ్యాడు. ఇంతలో సుమంతుడు పోయి రాముని రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకొని వచ్చాడు. రాముని రాకను దూరంనుండే చూచాడు దశరథుడు. రథము మీద ఠీవిగా కూర్చున్న రాముని చూడడానికి దశరథునికి వేయి కన్నులు ఉ న్నా ఇంకా చాలవేమో అనిపించింది. “ఎంత చూచినా ఇంకా చూడాలని పించే సౌందర్యము రామునిది” అని అనుకున్నాడు దశరథుడు.

రాముడు రథం దిగాడు. రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకొని నడుస్తున్నాడు. రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రాముని రెండు చేతులతో పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. తరువాత తన పక్కను ఉన్న ఒక ఉ న్నతాసనము మీద కూర్చోపెట్టాడు.

దశరథుడు రామునితో ఇలా అన్నాడు. ” ఓ రామా! నీవు నాకు జ్యేష్ట పుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య. పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చేయాలని సంకల్పించాను. రాబోవు పుష్యమీ నక్షత్రము నందు నీకు యౌవరాజ్య పట్టాభిషేకము జరుపనిశ్చయించాను. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడుగా కొన్ని విషయాలు చెబుతున్నాను. శ్రద్ధగా విను.

నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. నీవు అందరితో వినయంగా ఉండాలి. నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. కామము, క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానీయకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ధనముతోనూ, ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేట్టు చూచుకోవాలి. ఆ ప్రకారంగా రాజ్యపాలన చెయ్యాలి.” అనిఅన్నాడు దశరథుడు.

ఇంతలో రాముని మిత్రులు ఈసంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు. కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగి పోయింది. ఆ వార్త తెచ్చినవారికి బంగారు ఆభరణములు బహు మానంగా ఇచ్చి సత్కరించింది.

దశరథుని వద్ద ఉన్న రాముడు, తండ్రికి నమస్కరించి, తన గృహమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము తృతీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్థః సర్గః (4) >>

Balakanda Sarga 8 In Telugu – బాలకాండ అష్టమః సర్గః

Balakanda Sarga 8 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టమః సర్గః రామాయణంలోని కీలకమైన భాగం. ఈ సర్గ రాముడి జననం మరియు బాల్యాన్ని వివరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించి, పుత్రులను పొందుతాడు. కౌసల్య, కైకేయి, సుమిత్రలు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడుగా పుత్రులను ప్రసాదిస్తారు. వసిష్ఠ మహర్షి సలహా మేరకు, ఈ పిల్లలు పెరుగుతారు.

సుమంత్రవాక్యమ్

తస్య త్వేవం‍ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః |
సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరః సుతః ||

1

చింతయానస్య తస్యేయం బుద్ధిరాసీన్మహాత్మనః |
సుతార్థీ వాజిమేధేన కిమర్థం న యజామ్యహమ్ ||

2

స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్ |
మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః ||

3

తతోఽబ్రవీదిదం తేజాః సుమంత్రం మంత్రిసత్తమమ్ |
శీఘ్రమానయ మే సర్వాన్గురూంస్తాన్సపురోహితాన్ ||

4

తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్స తాన్సర్వాన్గురూంస్తాన్వేదపారగాన్ ||

5

సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః ||

6

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ఇదం ధర్మార్థసహితం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

7

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||

8

తదహం యష్టుమిచ్ఛమి శాస్త్రదృష్టేన కర్మణా |
కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతామ్ ||

9

తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖేరితమ్ ||

10

ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

11

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ |
సర్వథా ప్రాప్స్యసే పుత్రానభిప్రేతాంశ్చ పార్థివ ||

12

యస్య తే ధర్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా |
తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వైతద్ద్విజభాషితమ్ ||

13

అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షపర్యాకులేక్షణః |
సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ ||

14

సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ |
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ ||

15

శాంతయశ్చాభివర్ధంతాం యథాకల్పం యథావిధి |
శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా ||

16

నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే |
ఛిద్రం హి మృగయంతేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః ||

17

విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి | [విహతస్య]
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే ||

18

తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ |
తథేతి చాబ్రువన్సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ ||

19

పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్య తే |
తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్థయంతో నృపోత్తమమ్ ||

20

అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతమ్ |
విసర్జయిత్వా తాన్విప్రాన్సచివానిదమబ్రవీత్ ||

21

ఋత్విగ్భిరుపసందిష్టో యథావత్క్రతురాప్యతామ్ |
ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్సముపస్థితాన్ ||

22

విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః |
తతః స గత్వా తాః పత్నీర్నరేంద్రో హృదయప్రియాః ||

23

ఉవాచ దీక్షాం విశత యక్ష్యేఽహం సుతకారణాత్ |
తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసామ్ |
ముఖపద్మాన్యశోభంత పద్మానీవ హిమాత్యయే ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టమః సర్గః ||

 

Balakanda Sarga 8 Meaning In Telugu

అటువంటి పుణ్యచరితుడైన దశరధమహారాజుకు చాలా కాలం వరకూ పుత్రసంతానము కలగలేదు. వంశాంకురము లేడని దశరధ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్యయించాడు. వెంటనే పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరధుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్టవామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు, ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు.

దశరథుడు వారి నందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉ చితాసనముల మీద కూర్చో పెట్టాడు. “మహాత్ములారా! మీకు తెలుసు కదా! నాకు పుత్రసంతానము లేరు. ఈ విషయము నన్ను నిరంతరమూ బాధించుచున్నది. పుత్రసంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలచుకొన్నాను. ఆ యాగము ఎలా చేయవలెనో మీరు చెప్పండి.” అని అడిగాడు.

దశరధుని నిర్ణయమును వశిష్టవామదేవులు ప్రశంసించారు.

“ఓ దశరథమహారాజా! మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజస మైనదే. మీకు తప్పక పుత్రసంతానము కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి.” అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమనీ, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు. సరమూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతి యాగములను జరిపించమని, ఆదేశించాడు. ఇంకా ఇలా పలికాడు దశరధుడు.

“ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగచేయుటకు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారు. యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును. మీరందరూ విద్వాంసులే కదా. కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధమూ లేకుండా జరిపించండి.” అని పలికాడు దశరథుడు.

“తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించెదము.” అని పలికారు పురోహితులు. తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్లిపోయారు. దశరథుడు తన మంత్రులను చూచి “మీరందరూ పురోహితులకు సహకరించండి. యాగము నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి.” అని ఆజ్ఞాపించాడు.

తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్లాడు. తన భార్యలను చూచి “నేను పుత్రసంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను. నాతో పాటుమీరూ యాగ దీక్ష వహించండి.” అని చెప్పాడు. ఆమాటలు విని దశరధుని భార్యలుసంతోషించారు. తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనంద పడ్డారు. భర్త చెప్పిన ప్రకారము యాగ దీక్ష స్వీకరించారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ నవమః సర్గః (9>>

Ayodhya Kanda Sarga 2 In Telugu – అయోధ్యాకాండ ద్వితీయః సర్గః

Ayodhya Kanda Sarga 2 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. ద్వితీయ సర్గలో, శ్రీ రాముడి పట్టాభిషేకం, కైకేయి బూనిన కుట్రలు, రాముడి అరణ్యవాసం మొదలైన అంశాలు చర్చకు వస్తాయి. ఈ సర్గ ప్రారంభంలో, దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు రాముడిని అయోధ్యా రాజ్యానికి యోగ్యుడిగా ప్రకటించి, పట్టాభిషేకానికి సన్నాహాలు చేస్తాడు. అయితే, కైకేయి తన రెండు వరాల కారణంగా, రాముడిని పదినాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపిస్తాడు. ఈ సర్గలో ఉన్న సంఘటనలు రాముని, సీతమ్మ మరియు లక్ష్మణుని ధర్మనిరతిని, విధేయతను, మరియు క్షమను ప్రతిబింబిస్తాయి.

పరిషదనుమోదనమ్

తతః పరిషదం సర్వామామంత్ర్య వసుధాధిపః |
హితముద్ధర్షణం చైవమువాచ ప్రథితం వచః ||

1

దుందుభిస్వనకల్పేన గంభీరేణానునాదినా |
స్వరేణ మహతా రాజా జీమూత ఇవ నాదయన్ ||

2

రాజలక్షణయుక్తేన కాంతేనానుపమేన చ |
ఉవాచ రసయుక్తేన స్వరేణ నృపతిర్నృపాన్ ||

3

విదితం భవతామేతద్యథా మే రాజ్యముత్తమమ్ |
పూర్వకైర్మమ రాజేంద్రైః సుతవత్పరిపాలితమ్ ||

4

[* సోఽహమిక్ష్వాకుభిః సర్వైర్నరేంద్రైః పరిపాలితమ్ | *]

శ్రేయసా యోక్తుకామోఽస్మి సుఖార్హమఖిలం జగత్ |
మయాఽప్యాచరితం పూర్వైః పంథానమనుగచ్ఛతా ||

5

ప్రజా నిత్యమనిద్రేణ యథాశక్త్యభిరక్షితాః |
ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితమ్ ||

6

పాండురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా |
ప్రాప్య వర్షసహస్రాణి బహూన్యాయూంషి జీవతః ||

7

జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే |
రాజప్రభావజుష్టాం హి దుర్వహామజితేంద్రియైః ||

8

పరిశ్రాంతోఽస్మి లోకస్య గుర్వీం ధర్మధురం వహన్ |
సోఽహం విశ్రమమిచ్ఛామి రామం కృత్వా ప్రజాహితే || [పుత్రం]

9

సన్నికృష్టానిమాన్సర్వాననుమాన్య ద్విజర్షభాన్ |
అనుజాతో హి మాం సర్వైర్గుణైర్జ్యేష్ఠో మమాత్మజః ||

10

పురందరసమో వీర్యే రామః పరపురంజయః |
తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాం వరమ్ ||

11

యౌవరాజ్యే నియోక్తాస్మి ప్రీతః పురుషపుంగవమ్ |
అనురూపః స వై నాథో లక్ష్మీవాఁల్లక్ష్మణాగ్రజః ||

12

త్రైలోక్యమపి నాథేన యేన స్యాన్నాథవత్తరమ్ |
అనేన శ్రేయసా సద్యః సంయోక్ష్యే తామిమాం మహీమ్ || [సంయోజ్యైవమిమాం]

13

గతక్లేశో భవిష్యామి సుతే తస్మిన్నివేశ్య వై |
యదీదం మేఽనురూపార్థం మయా సాధు సుమంత్రితమ్ ||

14

భవంతో మేఽనుమన్యంతాం కథం వా కరవాణ్యహమ్ |
యద్యప్యేషా మమ ప్రీతిర్హితమన్యద్విచింత్యతామ్ ||

15

అన్యా మధ్యస్థచింతా హి విమర్దాభ్యధికోదయా |
ఇతి బ్రువంతం ముదితాః ప్రత్యనందన్నృపా నృపమ్ ||

16

వృష్టిమంతం మహామేఘం నర్దంత ఇవ బర్హిణః |
స్నిగ్ధోఽనునాదీ సంజజ్ఞే తత్ర హర్షసమీరితః ||

17

జనౌఘోద్ఘుష్టసన్నాదో విమానం కంపయన్నివ |
తస్య ధర్మార్థవిదుషో భావమాజ్ఞాయ సర్వశః ||

18

బ్రాహ్మణా జనముఖ్యాశ్చ పౌరజానపదైః సహ |
సమేత్య మంత్రయిత్వా తు సమతాగతబుద్ధయః ||

19

ఊచుశ్చ మనసా జ్ఞాత్వా వృద్ధం దశరథం నృపమ్ |
అనేకవర్షసాహస్రో వృద్ధస్త్వమసి పార్థివ ||

20

స రామం యువరాజానమభిషించస్వ పార్థివమ్ |
ఇచ్ఛామో హి మహాబాహుం రఘువీరం మహాబలమ్ ||

21

గజేన మహతాఽఽయాంతం రామం ఛత్రావృతాననమ్ |
ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియమ్ ||

22

అజానన్నివ జిజ్ఞాసురిదం వచనమబ్రవీత్ |
శ్రుత్వైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్ఛథ ||

23

రాజానః సంశయోఽయం మే కిమిదం బ్రూత తత్త్వతః |
కథం ను మయి ధర్మేణ పృథివీమనుశాసతి ||

24

భవంతో ద్రష్టుమిచ్ఛంతి యువరాజం మమాత్మజమ్ |
తే తమూచుర్మహాత్మానం పౌరజానపదైః సహ ||

25

బహవో నృప కళ్యాణా గుణాః పుత్రస్య సంతి తే |
గుణాన్గుణవతో దేవ దేవకల్పస్య ధీమతః ||

26

ప్రియానానందనాన్కృత్స్నాన్ప్రవక్ష్యామోఽద్య తాన్ శృణు |
దివ్యైర్గుణైః శక్రసమో రామః సత్యపరాక్రమః ||

27

ఇక్ష్వాకుభ్యోఽపి సర్వేభ్యో హ్యతిరిక్తో విశాంపతే |
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః ||

28

సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ |
ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయాః క్షమాగుణైః ||

29

బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యే సాక్షాచ్ఛచీపతేః |
ధర్మజ్ఞః సత్యసంధశ్చ శీలవాననసూయకః ||

30

క్షాంతః సాంత్వయితా శ్లక్ష్ణః కృతజ్ఞో విజితేంద్రియః |
మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యోఽనసూయకః ||

31

ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః |
బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాముపాసితా ||

32

తేనాస్యేహాతులా కీర్తిర్యశస్తేజశ్చ వర్ధతే |
దేవాసురమనుష్యాణాం సర్వాస్త్రేషు విశారదః ||

33

సర్వవిద్యావ్రతస్నాతో యథావత్సాంగవేదవిత్ | [సమ్యక్]
గాంధర్వే చ భువి శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః ||

34

కళ్యాణాభిజనః సాధురదీనాత్మా మహామతిః |
ద్విజైరభివినీతశ్చ శ్రేష్ఠైర్ధర్మార్థదర్శిభిః || [నైపుణైః]

35

యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా |
గత్వా సౌమిత్రిసహితో నావిజిత్య నివర్తతే ||

36

సంగ్రామాత్పునరాగమ్య కుంజరేణ రథేన వా |
పౌరాన్స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి ||

37

పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్యశిష్యగణేషు చ |
నిఖిలేనానుపూర్వ్యాచ్చ పితా పుత్రానివౌరసాన్ ||

38

శుశ్రూషంతే చ వః శిష్యాః కచ్చిత్కర్మసు దంశితాః |
ఇతి నః పురుషవ్యాఘ్రః సదా రామోఽభిభాషతే ||

39

వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః |
ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి ||

40

సత్యవాదీ మహేష్వాసో వృద్ధసేవీ జితేంద్రియః |
స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనా శ్రితః ||

41

సమ్యగ్యోక్తా శ్రేయసాం చ న విగ్రహకథారుచిః | [విగృహ్య]
ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా ||

42

సుభ్రూరాయతతామ్రాక్షః సాక్షాద్విష్ణురివ స్వయమ్ |
రామో లోకాభిరామోఽయం శౌర్యవీర్యపరాక్రమైః ||

43

ప్రజాపాలనసంయుక్తో న రాగోపహతేంద్రియః | [తత్త్వజ్ఞః]
శక్తస్త్రైలోక్యమప్యేకో భోక్తుం కిం ను మహీమిమామ్ ||

44

నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోఽస్తి కదాచన |
హంత్యేవ నియమాద్వధ్యానవధ్యే న చ కుప్యతి ||

45

యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తమసౌ యత్ర తుష్యతి |
దాంతైః సర్వప్రజాకాంతైః ప్రీతిసంజననైర్నృణామ్ || [శాంతైః]

46

గుణైర్విరురుచే రామో దీప్తః సూర్య ఇవాంశుభిః |
తమేవం‍గుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ ||

47

లోకపాలోపమం నాథమకామయత మేదినీ |
వత్సః శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవ ||

48

దిష్ట్యా పుత్రగుణైర్యుక్తో మారీచ ఇవ కాశ్యపః |
బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః ||

49

దేవాసురమనుష్యేషు గంధర్వేషూరగేషు చ |
ఆశంసంతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా ||

50

ఆభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌరజానపదో జనః |
స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః ||

51

సర్వాన్దేవాన్నమస్యంతి రామస్యార్థే యశస్వినః |
తేషామాయాచితం దేవ త్వత్ప్రసాదాత్సమృద్ధ్యతామ్ ||

52

రామమిందీవరశ్యామం సర్వశత్రునిబర్హణమ్ |
పశ్యామో యౌవరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజమ్ ||

53

తం దేవదేవోపమమాత్మజం తే
సర్వస్య లోకస్య హితే నివిష్టమ్ |
హితాయ నః క్షిప్రముదారజుష్టం
ముదాఽభిషేక్తుం వరద త్వమర్హసి ||

54

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గః ||

Ayodhya Kanda Sarga 2 Meaning In Telugu

రాజ సభ ఏర్పాటు అయింది. దశరథ మహారాజు సింహాసనం అలంకరించాడు. సభను అలంకరించిన సామంత రాజులను, మంత్రులను, పుర ప్రముఖులను ఇతర పౌరులను చూచి ఇలాఅన్నాడు.

“సభాసదులారా! మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తర తరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశపురాజుల పాలనలో మీ రందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడనైన నేను కూడా అనేక సంవత్సరములుగా ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గములోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనమునకు ఉన్న శ్వేతఛత్రము నీడలో గడిచి పోయింది. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉంది. రాజ్య భారము వహించడం చాలా కష్టమైన విషయము. జితేంద్రియుడు కాని వాడు ఈ రాజ్య భారము మోయలేడు. అందుకని నేను వసిష్ఠుల వారిని, పురోహితు లను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమ వంతుడు, శత్రువులకు భయంకలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముని అయోధ్యకు యువరాజుగా చేయడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారమును రామునికి అప్పగించి, విశ్రాంతి తీసుకోదలచాను. ఇది నా నిర్ణయము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయము తీసుకున్నాను. నా నిర్ణయము అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనములు కలిగిస్తుందని అనుకుంటున్నాను. నా నిర్ణయాని కన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు తోస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయము గౌరవించాలి. అది పాలకుల విధి. నేను రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.కాని మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా నాకు శిరోధార్యము.” అని అన్నాడు దశరథుడు.

దశరథుని మాటలు విన్నపౌరులందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చేసారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించారు. కాని సభలో ఉన్న బ్రాహ్మణులు, పురప్రముఖులు, పురోహితులు, అందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారు. ఆలోచించుకున్నారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత దశరథునితో ఇలా అన్నారు.

“ఓ దశరథమహారాజా! మీ నిర్ణయాన్ని మేమందరమూ సమర్ధిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు. అందుకని తమరి పెద్దకుమారుడైన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నారు. అది మాకందరకూ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానుబాహుడు. మహావీరుడు. రాముడు అయోధ్య యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఉత్సాహపడుతున్నారు.” అని అన్నారు.

అప్పుడు దశరథుడు పురప్రముఖులతో ఇలా అన్నాడు. “పురప్రముఖులారా! నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమో అని మీరు నా నిర్ణయం ఆమోదించినట్టు ఉంది. మీకు ఆ సందేహము అక్కరలేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాను గదా! మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు. రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి.” అని అడిగాడు.

అప్పుడు ఆ పురప్రముఖులు ఇలా చెప్పసాగారు.

“ఓ దశరథమహారాజా! నీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ధర్మపరుడు. పరాక్రమ వంతుడు. దేవేంద్రునితో సమానమైన వాడు. ఇప్పటి వరకూ ఇక్ష్వాకు వంశములో జన్మించిన రాజులందరిలోకీ శ్రేష్టుడు. సత్యము పలకడంలోనూ, ధర్మము ఆచరించడం లోనూ రామునికి ఆసక్తి మెండు. చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు. రాముడు క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మము లేదు. రామునికి ఎవరి మీదా అసూయ, ద్వేషము లేవు. ఓర్పు మెండు. మృదువుగా మాట్లాడుతాడు. బాధలలో ఉన్నవారిని చూస్తే ఆ బాధలు తనవిగా బాధపడతాడు రాముడు. రాముడు ఇంద్రియ నిగ్రహము కలవాడు.

ఓ దశరథ మహారాజా! రాముడు ఎల్లప్పుడూ స్థిర చిత్తముతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవము. రాముడు వివిధ శాస్త్రములను అధ్యయనం చేసాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్ర శస్త్రములు ప్రయోగ, ఉపసంహారములతో సహా, రామునికి తెలుసు. రాముడు వేద వేదాంగములను శ్రద్ధతో అధ్యయనం చేసాడు. అంతే కాదు, రామునికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. అనేకములైన ధర్మసూక్ష్మములను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్ర యాత్రకు వెళితే విజయుడైగాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత, రాముడు తల్లి తండ్రులకు నమస్కరించి, అంతఃపురములోని వారినీ, బంధువులను, స్నేహితులను, పౌరులనూ పేరు పేరునా వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు.

ఓ దశరథ మహారాజా! ఎవరికైనా బాధ కలిగితే రాముడు తనకు కలిగినట్టు బాధ పడతాడు. ఎవరికైనా సంతోషము కలిగితే తానుకూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మరక్షణలో రాముని మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలో తత్వమును బాగాతెలిసినవాడు రాముడు. మూర్తీభవించిన శాంతస్వరూపుడు రాముడు. అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు ముల్లోకములను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడుగా జన్మించడం మీ పూర్వజన్మ సుకృతము. అటువంటి రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని అయోధ్యా వాసులు, స్త్రీలు, వృద్ధులు, నిరంతరమూ సర్వదేవతలకూ మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యండి. మేము చూచి ఆనందిస్తాము.” అని పలికారు అయోధ్య పురప్రముఖులు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ద్వితీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ తృతీయః సర్గః (3) >>

Balakanda Sarga 6 In Telugu – బాలకాండ షష్ఠః సర్గః

Balakanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షష్ఠ సర్గలో, అయోధ్యలో రాముడి జననం, బాల్యం వర్ణించబడతాయి. దశరథ మహారాజుకు నలుగురు కుమారులు జన్మిస్తారు – రాముడు, లక్ష్మణుడు, భారతుడు, శత్రుఘ్నుడు. రాముడు జన్మించినప్పుడు, అయోధ్యలో ఆనందం వ్యాపిస్తుంది. వశిష్ఠ మహర్షి రాముడు సహా ఇతర రాజకుమారులకు విద్యాబ్యాసం అందిస్తారు.

రాజవర్ణనా

తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్సర్వసంగ్రహః |
దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః ||

1

ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మరతో వశీ |
మహర్షికల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశ్రుతః ||

2

బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియః |
ధనైశ్చ సంచయైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః ||

3

యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా |
తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్ ||

4

తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్ఠతా |
పాలితా సా పురీ శ్రేష్ఠా ఇంద్రేణేవామరావతీ ||

5

తస్మిన్పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః |
నరాస్తుష్టా ధనైః స్వైః స్వైరలుబ్ధాః సత్యవాదినః ||

6

నాల్పసంనిచయః కశ్చిదాసీత్తస్మిన్పురోత్తమే |
కుటుంబీ యో హ్యసిద్ధార్థోఽగవాశ్వధనధాన్యవాన్ ||

7

కామీ వా న కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ |
ద్రష్టుం శక్యమయోధ్యాయాం నావిద్వాన్న చ నాస్తికః ||

8

సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః |
ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః ||

9

నాకుండలీ నాముకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్ |
నామృష్టో నానులిప్తాంగో నాసుగంధశ్చ విద్యతే ||

10

నామృష్టభోజీ నాదాతా నాప్యనంగదనిష్కధృక్ |
నాహస్తాభరణో వాఽపి దృశ్యతే నాప్యనాత్మవాన్ ||

11

నానాహితాగ్నిర్నాయజ్వా న క్షుద్రో వా న తస్కరః |
కశ్చిదాసీదయోధ్యాయాం న చ నిర్వృత్తసంకరః ||

12

స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః |
దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే ||

13

న నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః |
నాసూయకో న చాఽశక్తో నావిద్వాన్విద్యతే క్వచిత్ ||

14

నాషడంగవిదత్రాసీన్నావ్రతో నాసహస్రదః |
న దీనః క్షిప్తచిత్తో వా వ్యథితో వాపి కశ్చన ||

15

కశ్చిన్నరో వా నారీ వా నాశ్రీమాన్నాప్యరూపవాన్ |
ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాపి రాజన్యభక్తిమాన్ ||

16

వర్ణేష్వగ్ర్యచతుర్థేషు దేవతాతిథిపూజకాః |
కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమసంయుతాః ||

17

దీర్ఘాయుషో నరాః సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః |
సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే ||

18

క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వైశ్యాః క్షత్రమనువ్రతాః |
శూద్రాః స్వధర్మ నిరతాస్త్రీన్వర్ణానుపచారిణః ||

19

సా తేనేక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా |
యథా పురస్తాన్మనునా మానవేంద్రేణ ధీమతా ||

20

యోధానామగ్నికల్పానాం పేశలానామమర్షిణామ్ |
సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణామివ ||

21

కాంభోజవిషయే జాతైర్బాహ్లీకైశ్చ హయోత్తమైః |
వనాయుజైర్నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః ||

22

వింధ్యపర్వతజైర్మత్తైః పూర్ణా హైమవతైరపి |
మదాన్వితైరతిబలైర్మాతంగైః పర్వతోపమైః ||

23

ఐరావతకులీనైశ్చ మహాపద్మకులైస్తథా |
అంజనాదపి నిష్పన్నైర్వామనాదపి చ ద్విపైః ||

24

భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్థథా |
భద్రమంద్రైర్భద్రమృగైర్మృగమంద్రైశ్చ సా పురీ ||

25

నిత్యమత్తైః సదా పూర్ణా నాగైరచలసన్నిభైః |
సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే ||

26

యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్ |
తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్ |
శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాః ||

27

తాం సత్యనామాం దృఢతోరణార్గలాం
గృహైర్విచిత్రైరుపశోభితాం శివామ్ |
పురీమయోధ్యాం నృసహస్రసంకులాం
శశాస వై శక్రసమో మహీపతిః ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్ఠః సర్గః ||

Balakanda Sarga 6  Meaning In Telugu

అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమ వంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు. దశరథుడు ఎన్నో యజ్ఞము లను యాగములను చేసాడు. రాజర్షి. దశరథుని మంచితనము మూడులోకములలో చెప్పుకొనెడి వారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే నేర్పుకలవాడు. అధిక మైన సంపదలు కలవాడు.

అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించిన వాడు. జితేంద్రియుడు అని పేరు గాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు. అసత్యము అన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు.

ఇంక అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు. నిత్యసంతోషులు. ఉన్నదానితో తృప్తిపడేవారు. ధర్మము తప్పని వారు.

వేదములను చదివినవారు. అత్యాశాపరులు కారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడి వారు. దశరధుని రాజ్యములో పేదవాడు గానీ, విద్యలేని వాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు. మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు. నిర్మలమైన మనస్సుకలవారు.

అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొనని వాడు, ప్రతిరోజూ అభ్యంగనస్నానముచేయని వాడూ. చూద్దామన్నా కానరారు. అలాగే కడుపునిండా భోజనము చేయని వాడు కానీ, అతిధికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దానధర్మములు చేయని వాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు.

అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పనిమాత్రమే చేసేవాడు. యజ్ఞములు, యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యమూ అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిథి పూజ, దానధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు.

దశరధునిపాలనలో నాస్తికులు గానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయా ద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్యనేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికీ ఎటువంటిబాధలు ఉండేవి కావు. అందరు ప్రజలూ సుఖసంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారుకానీ, మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే గానీ పేదవారు లేరు.

అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘా యుష్షులు. పెద్ద వారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకొనే వారు.

అయోధ్యలో యోధులకు కొదవ లేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్యా నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంభోజ, బాహ్లిక, దేశముల నుండి అశ్వములను తెప్పించుకొనెడి వారు. వింధ్య పర్వత ప్రాంతమునుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకొనెడి వారు. అందులో కూడా భద్రగజములు, మంద్ర గజములు, భద్ర మంద్ర గజములు, మదగజములు మొదలగు జాతులు ఏనుగులతో అయోధ్య నిండి ఉండెడిది. అయోధ్య చుట్టు రెండు యోజనముల దూరములో శత్రువు అనే వాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ సప్తమః సర్గః (7) >>

Balakanda Sarga 7 In Telugu – బాలకాండ సప్తమః సర్గః

Balakanda Sarga 7 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండం లోని సప్తమః సర్గఃలో రాముడు మరియు లక్ష్మణుల ధైర్యం మరియు పరాక్రమం వర్ణించబడింది. ఇందులో విష్వామిత్రుడు తన యాగానికి రక్షణగా రాముడు మరియు లక్ష్మణులను తీసుకువెళ్ళడం గురించి చెప్పబడింది. విష్వామిత్రుడు అయోధ్యకు వచ్చి, దశరథుని పుత్రులు రాముడు మరియు లక్ష్మణులను తపస్సు చేస్తూ ఉండగా రాక్షసుల నుండి యాగానికి రక్షణ కోరారు. దశరథుడు మొదట అభ్యంతరం చూపినా, వశిష్ఠ మహర్షి సలహా మేరకు, ఆయన వారు వెళ్లడానికి అంగీకరించారు. రాముడు మరియు లక్ష్మణుడు విష్వామిత్రుడి తోపాటు వెళ్లి యాగాన్ని రక్షించారు.

అమాత్యవర్ణనా

తస్యామాత్యా గుణైరాసన్నిక్ష్వాకోస్తు మహాత్మనః |
మంత్రజ్ఞాశ్చేంగితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః ||

1

అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః |
శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః ||

2

ధృష్టిర్జయంతో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః |
అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోఽభవత్ ||

3

ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తామృషిసత్తమౌ |
వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే ||

4

అధికపాఠః –
సుయజ్ఞోప్యథ జాబాలిః కాశ్యపోఽప్యథ గౌతమః |
మార్కండేయస్తు దీర్ఘాయుస్తథా కాత్యాయనో ద్విజః |
ఏతైర్బ్రహ్మర్షిభిర్నిత్యమృత్విజస్తస్య పూర్వకాః ||

5

విద్యావినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః |
పరస్పరానురక్తాశ్చ నీతిమంతో బహుశ్రుతాః ||

6

శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా ధృఢవిక్రమాః |
కీర్తిమంతః ప్రణిహితా యథావచనకారిణః ||

7

తేజః క్షమా యశః ప్రాప్తాః స్మితపూర్వాభిభాషిణః |
క్రోధాత్కామార్థహేతోర్వా న బ్రూయురనృతం వచః ||

8

తేషామవిదితం కించత్ స్వేషు నాస్తి పరేషు వా |
క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితమ్ ||

9

కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః |
ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి ||

10

కోశసంగ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే |
అహితం వాఽపి పురుషం న విహింస్యురదూషకమ్ ||

11

వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్రమనువ్రతాః |
శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినామ్ ||

12

బ్రహ్మక్షత్రమహింసంతస్తే కోశం సమవర్ధయన్ | [సమపూరయన్]
సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలమ్ ||

13

శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్ |
నాసీత్పురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్ ||

14

కశ్చిన్న దుష్టస్తత్రాసీత్పరదారరతో నరః |
ప్రశాంతం సర్వమేవాసీద్రాష్ట్రం పురవరం చ తత్ ||

15

సువాససః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః |
హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నయచక్షుషా ||

16

గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే |
విదేశేష్వపి విఖ్యాతాః సర్వతో బుద్ధినిశ్చయాత్ ||

17

[* అభితో గుణవంతశ్చ న చాసన్ గుణవర్జితాః | *]
సంధివిగ్రహతత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః |
మంత్రసంవరణే యుక్తాః శ్లక్ష్ణాః సూక్ష్మాసు బుద్ధిషు ||

18

నీతిశాస్త్రవిశేషజ్ఞాః సతతం ప్రియవాదినః |
ఈదృశైస్తైరమాత్యైశ్చ రాజా దశరథోఽనఘః ||

19

ఉపపన్నో గుణోపేతైరన్వశాసద్వసుంధరామ్ |
అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రంజయన్ ||

20

ప్రజానాం పాలనం కుర్వన్నధర్మం పరివర్జయన్ |
విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః ||

21

స తత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథివీమిమామ్ |
నాధ్యగచ్ఛద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః ||

22

మిత్రవాన్నతసామంతః ప్రతాపహతకంటకః |
స శశాస జగద్రాజా దివం దేవపతిర్యథా ||

23

తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తై-
-ర్వృతోఽనురక్తైః కుశలైః సమర్థైః |
స పార్థివో దీప్తిమవాప యుక్త-
-స్తేజోమయైర్గోభిరివోదితోఽర్కః ||

24

Balakanda 7 Sarga In Telugu Meaning

ఆవిధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్ధులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు. మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. ఎల్లప్పుడు రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతి మంతులు. అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు. వారి పేర్లు ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు,సుమంతుడు.

వీరుగాక వసిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండే వారు. వారందరూ అన్ని విద్యలందూ నేర్పరులు. బుద్ధిమంతులు. ఇంద్రియములను నిగ్రహించినవారు. శ్రీమంతులు. గొప్పవారు. శాస్త్రపరిజ్ఞానము కలవారు. పరాక్రమ వంతులు. కీర్తిమంతులు. కార్యశూరులు. చెప్పిన పని చేసేవారు. మంచి తేజస్సు కలవారు. క్షమాగుణము కలవారు. ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు. కోపంలో గానీ, కామ ప్రకోపము వలన గానీ, ధనము కోసం గానీ, అబద్ధము చెప్పరు.

వారు గూఢ చారుల ద్వారా స్వదేశములో గానీ, పరదేశములో గానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు
దశరథుడు.

దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర బేధము లేకుండా స్వంతకుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండెడి వారు. తమకు ఏ విధమైన అపకారము చేయని వాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు.

దశరథుని మంత్రులు వీరులు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు బేధాభిప్రాయములు లేకుండా ఒకే తాటి మీద నిలబడి రాచ కార్యములు నిర్వర్తించేవారు.

అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు గానీ, పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరధుని మంత్రులకు తమ రాజ్యము లోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలుఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రు రాజులతో సంధి చేసుకొనవలెనో, ఏ ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ, తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోడం లోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతి శాస్త్రమును చదివినవారు. ఎదుటి వారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పుకలవారు.

ఇటువంటి సకలసద్గుణ సంపన్నులగు మంత్రుల తో దశరధుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరధుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచూ, రాజ్యపాలన సాగించాడు. దశరధునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంత రాజులు ఉండెడి వారు. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడి వాడు. అందుకే దశరధునకు శత్రువులే లేరు.
సమర్ధులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు.

(ఇక్కడ ఒక గమనిక. మనకు ప్రాచీన గ్రంధములలో, కధతో పాటు ఆ నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చెప్పేవారు పూర్వపు ఋషులు. దాదాపు 5,000 ఏళ్ల కిందట రాయబడిన రామాయణములో ఆనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను ఎలా వివరించారో చదివారు కదా. రాజు (అంటే నేటి ముఖ్యమంత్రి), మంత్రులు (నేటి మంత్రులు) ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, వారికి ఏఏ అర్హతలు ఉండాలో. మంత్రులు ఎంత నీతిగాఉండాలో, ఎలా మాట్లాడాలో, చక్కగా వివరించారు. నేటి పాలకులను వారితో పోల్చుకోగలమా చెప్పండి.)

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఏడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ అష్టమః సర్గః (8) >>

Balakanda Sarga 4 In Telugu – బాలకాండ చతుర్థః సర్గః

Balakanda Sarga 4 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుర్థ సర్గలో, వాల్మీకి మహర్షి నారదుని మాటలతో ప్రేరేపితుడై రామాయణాన్ని రాయాలని నిర్ణయిస్తారు. ఆశ్రమానికి వెళ్తూ, వేటగాడు ఒక క్రౌంచ పక్షిని చంపినప్పుడు, దుఃఖంలో మునిగిన పక్షి దంపతులను చూసి వాల్మీకి మహర్షి బాధపడతారు. ఆ బాధలో సహజసిద్ధంగా ఒక శ్లోకాన్ని శాపం రూపంలో పలుకుతారు. ఈ సంఘటన వలన వాల్మీకికి పద్యరచన ప్రతిభ వ్యక్తమవుతుంది.

అనుక్రమణికా

ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవానృషిః |
చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్ ||

1

చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవానృషిః |
తథా సర్గశతాన్పంచ షట్కాండాని తథోత్తరమ్ ||

2

కృత్వాపి తన్మహాప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరమ్ |
చింతయామాస కో న్వేతత్ప్రయుంజీయాదితి ప్రభుః ||

3

తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః |
అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ ||

4

కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ |
భ్రాతరౌ స్వరసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ ||

5

స తు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ |
వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః ||

6

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ |
పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః ||

7

పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితమ్ |
జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయసమన్వితమ్ ||

8

[* పాఠభేదః –
రసైః శృంగార కరుణ హాస్య రౌద్ర భయానకైః |
విరాదిభీ రసైర్యుక్తం కావ్యమేతదగాయతామ్ ||
*]

9

హాస్యశృంగారకారుణ్యరౌద్రవీరభయానకైః |
బీభత్సాద్భుతసంయుక్తం కావ్యమేతదగాయతామ్ ||

10

తౌ తు గాంధర్వతత్త్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ |
భ్రాతరౌ స్వరసంపన్నౌ గంధర్వావివ రూపిణౌ ||

11

రూపలక్షణసంపన్నౌ మధురస్వరభాషిణౌ |
బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్తథాపరౌ ||

12

తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన ధర్మాఖ్యానమనుత్తమమ్ |
వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ ||

13

ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే |
యథోపదేశం తత్త్వజ్ఞౌ జగతుస్తౌ సమాహితౌ ||

14

మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్ష్ణలక్షితౌ |
తౌ కదాచిత్సమేతానామృషీణాం భావితాత్మనామ్ ||

15

ఆసీనానాం సమీపస్థావిదం కావ్యమగాయతామ్ |
తచ్ఛ్రుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః ||

16

సాధు సాధ్వితి చాప్యూచుః పరం విస్మయమాగతాః |
తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః ||

17

ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయంతౌ తౌ కుశీలవౌ |
అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః ||

18

చిరనిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితమ్ |
ప్రవిశ్య తావుభౌ సుష్టు తథా భావమగాయతామ్ ||

19

సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసంపదా |
ఏవం ప్రశస్యమానౌ తౌస్తపః శ్లాఘ్యైర్మహాత్మభిః ||

20

సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతామ్ |
ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సస్మితః కలశం దదౌ ||

21[సంస్థితః]

ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాతపాః | [మహాయశాః]
అన్యః కృష్ణాజినం ప్రాదాన్మౌంజీమన్యో మహామునిః ||

22

కశ్చిత్కమండలుం ప్రాదాద్యజ్ఞసూత్రమథాపరః |
బ్రుసీమన్యస్తదా ప్రాదత్కౌపీనమపరో మునిః ||

23

తాభ్యాం దదౌ తదా హృష్టః కుఠారమపరో మునిః |
కాషాయమపరో వస్త్రం చీరమన్యో దదౌ మునిః ||

24

జటాబంధనమన్యస్తు కాష్ఠరజ్జుం ముదాన్వితః |
యజ్ఞభాండమృషిః కశ్చిత్ కాష్ఠభారం తథాపరః ||

25

ఔదుంబరీం బ్రుసీమన్యో జపమాలామథాపరః |
ఆయుష్యమపరే ప్రాహుర్ముదా తత్ర మహర్షయః ||

26

దదుశ్చైవ వరాన్సర్వే మునయః సత్యవాదినః |
ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితమ్ ||

27

పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమమ్ |
అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ||

28

ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరమ్ |
ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయనౌ ||

29

రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః |
స్వవేశ్మ చానీయ తతో భ్రాతరౌ చ కుశీలవౌ ||

30

పూజయామాస పుజార్హౌ రామః శత్రునిబర్హణః |
ఆసీనః కాంచనే దివ్యే స చ సింహాసనే ప్రభుః ||

31

ఉపోపవిష్టః సచివైర్భ్రాతృభిశ్చ పరంతప |
దృష్ట్వా తు రూపసంపన్నౌ తావుభౌ నియతస్తదా ||

32

ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా |
శ్రూయతామిదమాఖ్యానమనయోర్దేవవర్చసోః ||

33

విచిత్రార్థపదం సమ్యగ్గాయనౌ సమచోదయత్ |
తౌ చాపి మధురం వ్యక్తం స్వంచితాయతనిఃస్వనమ్ ||

34

తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతామ్ |
హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ |
శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంసది ||

35

ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
కుశీలవౌ చైవ మహాతపస్వినౌ |
మమాపి తద్భూతికరం ప్రచక్షతే
మహానుభావం చరితం నిబోధత ||

36

తతస్తు తౌ రామవచః ప్రచోదితా-
-వగాయతాం మార్గవిధానసంపదా |
స చాపి రామః పరిషద్గతః శనై-
-ర్బుభూషయా సక్తమనా బభూవ హ ||

37

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుర్థః సర్గః ||

Balakanda Sarga 4  Meaning In Telugu

వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యమును 24,000 శ్లోకములలో, 500 సర్గలలో, ఆరు కాండలలో, రామ పట్టాభిషేకము, మరియు అశ్వమేధ యాగము వరకు రచించాడు. తరువాత ఘట్టములను ఉత్తర కాండలో రచించాడు.

రామాయణ కధను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకికి ముని వేషధారులైన ఇద్దరు గాయకులు తారసిల్లారు. వారిపేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న వారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు.

వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామ కధను, రామాయణము అనీ, సీతా చరితము అనీ, పౌలస్త్య వధ అనీ పిలువ సాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో, శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానము చేయసాగారు.

ఇంకొక విశేషము ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురూ గంధర్వ కుమారులవలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా, శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేసారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా, ఋషుల సమక్షము లోనూ, బ్రాహ్మణుల సమక్షము లోనూ, సభల యందూ, సత్పురుషుల సమావేశములలోనూ ఎవ్వరూ తప్పపట్టలేని విధంగా గానం చేస్తున్నారు.

ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షములో గానం చేసారు. ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. “వీరి కంఠము మధురముగా ఉంది. ఎన్నడో జరిగిన రామ కథను కళ్లకు కట్టినట్టు గానం చేసారు. వీరి జన్మ ధన్యమైనది.” అని వేనోళ్ల పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును, మరొక ఋషి వీణను బహూకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజ మార్గముల యందు, వీధులలోనూ రామాయణ గానము చేస్తున్నారు.

ఈ విషయము ఆ నోటా ఆనోటా శ్రీరాముని చెవికి చేరింది. శ్రీ రాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు. తాను, తన సోదరులు, మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీ రాముని కోరిక మేరకు కుశలవులు రామ కధను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేసారు. వినువారికి వీనుల విందు చేసారు.

కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు.

“మహాజనులారా! ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషములలో ఉన్నను, వీరి మొహంలో రాచ కళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానము చేసిన నా కధ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది. నా మనస్సుకు శాంతి చేకూరింది.” అని అన్నాడు శ్రీరాముడు.

వాల్మీకి ఉపదేశింపగా, కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కధ ఈ విధంగా ఉంది.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ పంచమః సర్గః (5>>

Balakanda Sarga 5 In Telugu – బాలకాండ పంచమః సర్గః

Balakanda Sarga 5 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచమః సర్గలో రాముని జన్మవివరాలు వర్ణించబడ్డాయి. ఈ సర్గలో, రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు అనే దశరథ మహారాజు యొక్క నాలుగు కుమారుల జన్మకథ చెప్పబడుతుంది. వశిష్ఠ మహర్షి యజ్ఞం నిర్వహించి దశరథుని మూడు భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పాయసం ప్రసాదంగా ఇచ్చాడు. వారు ఈ పాయసాన్ని పూజగా స్వీకరించి, పవిత్రమైన సంతానాలను పొందారు. ఈ సర్గలో పిల్లల జన్మ సంభవాలు మరియు వారి బాల్యం ప్రధానాంశాలు. ఈ విభాగం రామాయణంలోని అత్యంత పుణ్యమైన ఘట్టాల్లో ఒకటిగా చెప్పబడుతుంది.

అయోధ్యావర్ణనా

సర్వా పూర్వమియం యేషామాసీత్కృత్స్నా వసుంధరా |
ప్రజపతిముపాదాయ నృపాణం జయశాలినామ్ ||

1

యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః |
షష్టిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ||

2

ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్ |
మహదుత్పన్నమాఖ్యనం రామాయణమితి శ్రుతమ్ ||

3

తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః |
ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా ||

4

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్టః సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్ ||

5

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోకవిశ్రుతా |
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్ ||

6

ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తామహాపథా ||

7

రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా |
ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః ||

8

తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధనః |
పురీమావాసయామాస దివం దేవపతిర్యథా ||

9

కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణామ్ |
సర్వయంత్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభిః ||

10

సూతమాగధసంబాధాం శ్రీమతీమతులప్రభామ్ |
ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీశతసంకులామ్ ||

11

వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీమ్ |
ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలామ్ ||

12

దుర్గగంభీరపరిఖాం దుర్గామన్యైర్దురాసదమ్ |
వాజివారణసంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా ||

13

సామంతరాజసంఘైశ్చ బలికర్మభిరావృతామ్ |
నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్ ||

14

ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్ |
కూటాగారైశ్చ సంపూర్ణామింద్రస్యేవామరావతీమ్ ||

15

చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్ |
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ ||

16

గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితామ్ |
శాలితండులసంపూర్ణామిక్షుదండరసోదకామ్ ||

17

దుందుభీభిర్మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా |
నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్ ||

18

విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి |
సునివేశితవేశ్మాంతాం నరోత్తమసమావృతామ్ ||

19

యే చ బాణైర్న విధ్యంతి వివిక్తమపరావరమ్ |
శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః ||

20

సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే |
హంతారోనిశితైర్బాణైర్బలాద్బాహుబలైరపి ||

21

తాదృశానాం సహస్రైస్తామభిపూర్ణాం మహారథైః |
పురీమావాసయామాస రాజా దశరథస్తదా ||

22

తామగ్నిమద్భిర్గుణవద్భిరావృతాం
ద్విజోత్తమైర్వేదషడంగపారగైః |
సహస్రదైః సత్యరతైర్మహాత్మభి-
-ర్మహర్షికల్పైరృషిభిశ్చ కేవలైః ||

23

Balakanda 5 Sarga In Telugu Meaning

పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశములోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర.

సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్ఠులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలుపల లోతైన అగడ్త ఉండేది.

ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల పదేశములో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము వదిలి పెట్టబడలేదు.

ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతో మంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు. శబ్దవేది విద్యలో ప్రావీణ్యము సంపాదించినవారు.

(శబ్దవేది అంటే టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండివెలువడే శబ్దమును విని టార్గెట్ను కొట్టడం.)

మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించికానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య. కోసలదేశ రాజధాని.

అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరధ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో నాలుగు జాతులవారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్ఠులు. ప్రతిరోజూ అగ్నిహోత్రము చేసేవారు. వారందరూ వేద వేదాంగములు చదివిన వారు. మంచి గుణములతో అలరారే వారు. నిత్యము అతిధులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికే వారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఐదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ షష్ఠః సర్గః (6) >>