మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. భక్తి యోగం అనేది మనస్సును శుద్ధి చేసే, ఆత్మ అధ్యాత్మిక ప్రయత్నము. అనుష్ఠానాల్లో ప్రార్థన, భజన, ధ్యాన, పరమాత్మ సేవ మరియు ముక్తి సాధన ముందుగా ఉంటుంది. భక్తి యోగం యోగుడును ఆత్మశుద్ధి, సర్వోత్తమ ప్రమేయాలు మరియు ఆనందంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ రోజు మన వెబ్సైట్ నందు శ్రీ మాధవ నగర సాయి క్షేత్రముగురించి తెలుసుకుందాం…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దివ్య మంగళ స్వరూపుడైన భగవానుడు సాయిబాబ రూపంలో శ్రీరామ నవమి పర్వదినమున ఈ అవనిపై అవతరించాడు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాన్ సమీపాన గోదావరి తీరంలో గల షిరిడీలోని మసీదును కోవెలగా మలచుకొని కొలువైనాడు. ప్రాణుల పట్ల దయను కలిగియుండాలని, అందరి దైవం ఒక్కడేనని చాటి, కనులుండి చూడలేని లోకానికి వెలుగు దారిని చూపాడు. బాబా నివసించు మసీదులో ఎల్లప్పుడు ‘ధుని’ (హోమ గుండం)ని వెలిగించేవారు. ప్రతి అణువులో నిండియుండి ప్రతి ఇంటిలో పూజలందుకొంటున్న పరమేశుడు సాయి. ఆయన లీలలు తెలుపగ ఈ జీవితం చాలదు. వ్రాయడానికి ఎన్ని పుటలైనా సరిపోవు.
ఇందూరుకు 5 కి.మీ. దూరంలో ఇప్పుడు మాధవనగర్ సాయిబాబ దేవస్థానం ఉన్న స్థానంలో క్రీ.శ. 1930-35 సం॥ ప్రాంతంలో అంజయ్య అనే భక్తుడు రావిచెట్టు క్రింద బాబా ఫోటో పెట్టి ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో పూజనాచరించేవాడు. ప్రతి గురువారము రోజున సాయి పల్లకితో ఒంటెద్దు బండిపై ఇందూరు పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేసేవాడు. క్రీ.శ. 1945-55 సం॥ ప్రాంతంలో ద్వారకామాయిని ఏర్పాటు చేసి షిరిడీలో మాదిరిగా ‘ధుని’ని వెలిగించేవారు.
అలా అంజయ్య అనే భక్తుడు సాయినాథుని సేవ చేస్తున్న రోజులలో 1962-63 సం॥ ప్రాంతంలో నవీపేట్ వాస్తవ్యులు శ్రీ కిష్టాపురం బాలాగౌడ్ గారు ఈ దారి వెంట ప్రయాణిస్తూ తన వాహనం చెడిపోగా ఆ రాత్రి ఇక్కడే బస చేశారు. ఆ రాత్రి సాయినాథుడు అంజయ్య, బాలాగౌడ్ గార్లకు స్వప్నంలో కనిపించి తనకు ఆలయము నిర్మించండని చెప్పినాడట.
జైపూర్ నుండి శ్రీ సాయిబాబ పాలరాతి విగ్రహాన్నితీసుకొని వచ్చి 21 రోజులు 101 మంది పురోహితులచే పూజా హోమాదులను జరిపించి క్రీ.శ. 1964 సం||లో బాబా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సాక్షాత్తు శ్రీ సాయినాథుని ద్వారా నవ నాణెములు పొందిన సాయి భక్తురాలు శ్రీమతి లక్ష్మీ బాయి షిండే గారు షిరిడీ నుండి వచ్చారు. 1972 సం॥లో ఈ దేవస్థానం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 6 ఎకరాల 30 గుంటల భూమిని శ్రీ సుబ్బారెడ్డి (మోస్రా) గారు ఆలయానికి విరాళముగా అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్లుగా పదవీ బాధ్యతలను చేపట్టేవారు, అభివృద్ధికై కృషి చేసినారు. ఆలయ సిబ్బంది, అర్చక . బృందము మరియు భక్తుల సహాయ సహకారములతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.
ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి, శివుడు, నాగేంద్రుడు, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, శ్రీ పద్మావతీ శ్రీనివాసులు, దత్తాత్రేయులు, నవగ్రహాలు మొదలగు దేవతామూర్తులు దర్శనమిస్తారు. ఎల్లప్పుడు ద్వారకామాయిలో వెలుగొందే ‘ధుని’ లోని విభూతి సర్వరోగహరిణి, సర్వ పాప నివారిణి.
ఇక్కడి మందిరములో షిరిడీలో మాదిరిగా నాలుగు వేళలందు హారతులివ్వడం జరుగుతుంది. ఉ॥ 5-15 ని॥లకు కాకడ హారతి, మ॥ 12-00 గం॥లకు మధ్యాహ్న హారతి, సాయం సంధ్యా సమయంలో సంధ్యా హారతి, రాత్రి 10 గం॥లకు శేజారతి ఉంటుంది. ప్రతి గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నిండైన మనస్సుతో బాబాను కొలుస్తారు. ఇదే రోజున సాయంత్రం సాయికి పల్లకీ సేవ జరుగుతుంది.
సాయి జన్మదినమైన శ్రీరామనవమి, సద్గురుని శ్రీ గురు పౌర్ణిమ సాయినాథుని పుణ్యతిథియైన విజయదశమి (బాబా సమాధియైన రోజు), దత్త రూపుని శ్రీ దత్త జయంతి రోజులలో అశేష భక్తజనావళి తరలిరాగ ఘనముగా వేడుకలు జరుగుతాయి.
అష్టదిక్కులే అప్లైశ్వర్యములుగా, పంచభూతములే పంచభక్ష పరమాన్నములుగా మలచుకొన్న సచ్చిదానంద రూపునకు ఈ ఇందూరు అవని తన మదినే మందిరముగా చేయగా నిత్య పూజలతో మరో షిరిడీగా మారిపోయింది.
భక్తుల కొరకు నీటి సరఫరా, వసతిగృహాలు, వంట గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యములను కల్పించడం జరిగినది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవముగురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవము గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి భారతీయ హిందూ సామ్రాజ్యాలులో పూజించబడును ఉన్న ప్రధాన దేవి. ఆమె ధన, సమృద్ధి, ఆరోగ్య, ధర్మ, కీర్తి, ప్రేమ, ఆశీర్వాద మరియు సౌందర్యమును సూచించేవారు. మహాలక్ష్మీదేవి విష్ణువుని పత్ని మరియు ఐశ్వర్యము, ధనము, లక్ష్మీ రూపముగా ఉన్నారు. ఆమెను పరమేశ్వరుడు మరియు విష్ణువు చేత ప్రేమపూర్వకముగా పూజించబడుతారు.
చరాచర సృష్టిలోని సకల జీవావళికి తల్లి ఆ జగన్మాత లక్ష్మీదేవి. కంటికి రెప్పలా ఆ తల్లి మనలంనదరినీ రక్షిస్తూ వుండటం వల్లనే మనం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఈ భువిలో జీవించ గలుగుతున్నాము. సకల శుభాలూ, సంపదలూ, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ అలౌకిక ఆనందదాయిని, పరతత్వ సంధాయిని, మోక్షప్రదాయిని కూడా అయిన ఆ తల్లిని సమస్త దేవతాగణం సదా సేవిస్తూ వుంటారు. ఆ తల్లి నిత్య సత్యస్వరూపిణి. శాశ్వతమైన, నిజమైన ఆనందం ఆ మాతఅనుగ్రహంవల్లనే లభిస్తుంది. నిజానికి మనమందరం ఆ తల్లి ప్రతిరూపాలమే. అందరి హృదయాలలోను ఆమెనివాసమై వుంటుంది. ఆ విషయం తెలుసు కోవడమే నిజమైనజ్ఞానం. ఆజ్ఞానం కూడా ఆతల్లిని సేవించటంవల్లనే లభిస్తుంది.
జీవులందరిలోనూ చైతన్యశక్తి రూపంగా ఆ విశ్వమాత నెలకొని వుంటుంది. అన్ని రకాల శక్తులూ ఆ తల్లి కరుణ వల్లనే లభిస్తాయి. బ్రహ్మరుద్ర ఇంద్రాదులచే సేవించబడే ఆ మాత స్థితికారకుడైన శ్రీమహావిష్ణువుకు ఇల్లాలు. మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నీచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్” అన్నారు. స్థితికారకుడైన విష్ణుమూర్తి సాత్వికమూర్తి. స్థితి నిర్వాహణ బాధ్యతలో ఆ శ్రీమన్నారాయణమూర్తికి చేదోడు వాదోడుగా తన వంతు పాత్రని ఎంతో సమర్థవంతంగా పోషిస్తుంది విష్ణుపత్ని అయిన శ్రీమహాలక్ష్మీదేవి. దుష్టశిక్షణ చేసి సజ్జనులను రక్షించి ధర్మసంస్థాపన చేయటం కోసం, ఆ జగత్పిత శ్రీమహావిష్ణువు ఏకంగా వివిధ రూప విశేషాలతో అవతారాలను దాల్చటం జరిగిందో, అదే విధంగా జగన్మాత లక్ష్మీదేవి కూడా లోక కళ్యాణానికై అష్టలక్ష్మీ రూప ధారణ చేసింది. ఆ తల్లి ఆ అవతారాలన్నీ తన పిల్లలమైన మన అభ్యున్నతి కోసమే దాల్చింది.
శ్రీ అనే పదం ద్వారా లక్ష్మీదేవి వేదాలలో సంపద, ఐశ్వర్యము, శక్తి, శుభం అనే అర్థాలలో గుర్తించబడింది. విష్ణుపురాణం ద్వారా లక్ష్మీదేవి పుట్టు పూర్వోత్తరాలు, బ్రహ్మవైవర్త, మార్కండేయ పురాణాల ద్వారా లక్ష్మీదేవి ప్రశస్తి, ఆమె నివాస స్థానాలు గురించి వివరంగా తెలుస్తోంది. వేదాంగాలలో ముఖ్యమైనది అయిన శతపథ బ్రాహ్మణంలో లక్ష్మి అందానికి అధిష్ఠానదేవతగా చెప్పటం జరిగింది.
నిత్యం ఆ లక్ష్మీదేవి ఆరాధన జరిగే వారి గృహంలో సమస్త శుభాలూ నెలకొని వుంటాయి. ఋగ్వేదంలోని శ్రీసూక్తంలో లక్ష్మీదేవి దివ్యమైన గజేంద్రాలు (ఏనుగులు) యిరువైపులా సేవిస్తూ వుండగా మహా పద్మంలో పద్మాసన భంగిమలో కూర్చుని వుంటుంది అని వర్ణించబడింది. ఆ గజేంద్రాలు బంగారు కలశాలతో ఆ తల్లిపై అమృతవర్షం కురిపిస్తూ వుంటాయి. లోక వ్యవహారాలలో “లక్ష్మి” అనే పదం మన నిత్య జీవితంతో పెనవేసుకు పోయిన ఒక మహత్తరమైన ప్రజ్ఞావిశేషం. గృహానికి శోభనిచ్చే ఇల్లాలుని గృహలక్ష్మిగా సంభావిస్తూ వుంటాం. అదృష్టవంతుడైన ఒక వ్యక్తిని గూర్చి చెప్పాలంటే వాడికేమిరా లక్ష్మీ పుత్రుడు అంటాం. అలాగే ఒక అందమైన ఆడపిల్లని చూసినప్పుడు ఆహా ఈ పిల్ల మొహంలో లక్ష్మీకళ తాండవిస్తోంది అని అనుకుంటాం. విరిసిన ముద్ద మందారం, తామరపూవులను చూసినపుడు మనసు దైవీకమైన భావనతో నిండిపోయి ఆ తల్లి లక్ష్మీదేవే గుర్తుకు వస్తుంది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. మంత్ర పుష్ప అనేది పూజల ముగింపులో, హిందూ దేవతలకు పుష్పాలను సమర్పించే సమయంలో, పాడే వేద శ్లోకం. మంత్రం, వేద మంత్రాల పుష్పగా, పరిగణించబడుతుంది. ఈ మంత్రం యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకం నుండి తీసుకోబడింది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవముగురించి భక్తి యోగం లో తెలుసుకుందాం… అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు లభించడం వంటి విషయాలు చెప్పబడినవి.
అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు
అష్టలక్ష్మి అనగా ఎనిమిది లక్ష్ములు అను అర్దం వచ్చును. అష్టలక్ష్మి మూర్తుల శక్తులు అనగా, అష్ట దేవతా మూర్తులు మనకి ప్రసాదించే అష్ట శక్తులు. ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఏ, ఏ లక్ష్ములు ఏమేమి శక్తులని ప్రసాదిస్తారో, క్రింద ఇచ్చిన విదముగా తెలుసుకుందాము.
1. శ్రీ ఆదిలక్ష్మిదేవి
ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత
సకల సస్యసంపదలకి, పాడి పంటలకి అధిష్టాన దేవత, శారీరక ధారుఢ్యాన్న ప్రసాదించే తల్లి.
3. శ్రీ దైర్యలక్ష్మీమాత
ధైర్య సాహసాలు, మనోబలం ప్రసాదించే తల్లి.
4. శ్రీ గజలక్ష్మీమాత
సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.
5. శ్రీ సంతాన లక్ష్మీ మాత
సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
6. శ్రీ విజయలక్ష్మీ మాత
సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయసాధనకి అధిష్టాన దేవత.
7. శ్రీ విద్యాలక్ష్మి మాత
విద్యావివేకాలకి, మన అర్హతలకి తగిన గుర్తింపు రాణింపు కలిగేలా చేసే చల్లని తల్లి దేవత.
8. శ్రీ ధనలక్ష్మీ మాత
సకలైశ్వర్య ప్రదాయిని. అన్ని సంపదలకి అధిష్టాన.
ఈ శ్రీఅష్టలక్ష్మీ ఆరాధన వైభవం పుస్తకం ద్వారా శ్రీమన్మహలక్ష్మీదేవి ప్రాదుర్భావం, వైభవ కటాక్షాలతో మొదలు పెట్టి వరుసగా ఎనిమిది మంది అష్టలక్ష్మీ మాతల స్వరూప, వైభవ, ఆగ్రహానుగ్రహ ప్రభావాలు, ఆరాధన పద్ధతులు, వీటి వల్ల కలిగే ఫలితాల గురించి వివరించటం జరిగింది. శ్రద్ధా భక్తులతో ఈ పుస్తకాన్ని చదివి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని మా ఆకాంక్ష.
మన అపోహలు – సందేహాలు
సకల జీవావళికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించే నిమిత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలను ధరించింది. తన పిల్లలమైన మన అభ్యున్నతికోసం అహరహం ఆరాటపడుతుంది జగన్మాత. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం గురించి, స్వభావం గురించి మనలో ఎన్నో అపోహలు వున్నాయి. పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం బాగా వంటబట్టిన మన నేటితరం వారికి మన సనాతన సాంప్రదాయం, పూజా పునస్కారాల గురించి ఎన్నో సందేహాలు అవి ఏమిటో చూద్దాం.
లక్ష్మీదేవి అనగానే మనకి స్ఫురణకి వచ్చేది. తన చేతుల నుంచి బంగారు కాసులను అనుగ్రహించే శ్రీ ధనలక్ష్మీదేవి రూపమే అందువల్లనే లక్ష్మీపూజ అనగానే ధనాన్ని కోరి చేసే పూజ మాత్రమే అనే అపోహ జనబాహుళ్యంలో వుంది.
ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమైనదని, ఆ తల్లి అనుగ్రహం ఎంత కాలం మనవద్ద వుంటుందో తెలియదని, ఎప్పుడు వదలి వెళ్ళిపోతుందో తెలియదనే తప్పు అభిప్రాయం కూడా జనానీకంలో నెలకొని వుంది.
అదే విధంగా లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు అనీ, లక్ష్మి వున్న చోట విద్య వుండదు అనీ, విద్య వున్నచోట లక్ష్మి వుండదు. అని అంటూ వుంటారు. ఇదీ అపోహే.
ఇక అష్టలక్ష్మీ ఆరాధన విషయానికి వస్తే, ఇలా ఎనిమిది రకాల లక్ష్మీ రూపాలను ఎందుకు పూజించాలి? ఒక మహాలక్ష్మీ రూపాన్ని పూజిస్తే చాలదా? అనేది కూడా ఒక ప్రశ్న.
లోకంలో అందరూ వారి వారి పద్ధతులలో భగవదారాధన చేసుకుంటూ తమ తమ కోరికలను, అవసరాలని నెరవేర్చుకుంటూ వుండగా ప్రత్యేకంగా అష్టలక్ష్మీ ఆరాధన, పూజ, వైభవాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?
తార్కిక దృష్టితో మాత్రమే ఆలోచించే నేటి ఆధునికులు లోకంలో ఏ పని అయినా సరే మనం కష్టపడి శ్రద్ధగా చేయటం వల్లనే పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతాం అంటారు. అంతే కాని ఆ పని సఫలం కావటానికి లక్ష్మీదేవో, మరే దేవతో అనుగ్రహం కావాలనటం మూర్ఖత్వం అని కూడా అంటూ వుంటారు.
అదే విధంగా చేసే పనిని శ్రద్ధగా చేస్తే చాలు, అదే అసలైన పూజ అనే వారూవున్నారు. ఇవి ఎంత వరకు నిజం?
అయినా ఈ యిరవై ఒకటవ శతాబ్దంలో సైన్సు విపరీతంగా అభివృద్ధి చెంది పోయి సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఉవ్విళ్లూరుతున్న మానవ సమాజంలో, యీ విధంగా పూజల వల్ల బీజాక్షర జపాల వల్ల ఫలితాలు కలుగుతాయంటే నమ్మేవారు ఎందరు?
ఆధునిక యుగంలో ప్రతినిత్యం తమ తమ దైనందిన కార్యక్రమాలలో తలమునకలై ప్రతిక్షణం హడావుడి పడిపోతూ జీవించే నేటి తరం వారికి ఈ విధమైన భగవదారాధనకి సమయం ఎక్కడిది?
భక్తిశ్రద్ధలతో కూడిన పూజా పురస్కారాలు వగైరా వయస్సు మళ్ళి, ఓపిక తగ్గిన వృద్ధులకే గాని భుక్తికోసం కోటి విద్యలు నేర్చుకుని అహరహం ధనార్జనలో సతమతమయ్యే యువతకి ఈ ఆరాధనల అవసరం ఏమిటి?
ఇలా అనేక సందేహాలు వస్తూ వుంటాయి. ఇవన్నీ చాలా సహజమైన సందేహాలే. ఏ విషయాన్నైనా సశాస్త్రీయంగా విశ్లేషిస్తే గాని నేటితరం అంగీకరించదు. అలాంటివారి కోసమే ఈ పుస్తకం. ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే పైన చెప్పిన అన్ని సందేహాలకి సమాధానాలు దొరికి మనకి ఏం కావాలో కూడా మనకి తెలుస్తుంది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు గజేంద్రమోక్షము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
గజేంద్రమోక్షము పూర్వకథ
శ్రీరాముడు ధర్మమే పురుషరూపము దాల్చిన శ్రీమన్నారాయణ దివ్యావతారము. ఆ రామచంద్ర ప్రభువు కరుణతో గజేంద్రమోక్షము అనబడు ఈ భాగవతకథ బమ్మెరపోతనామాత్యుని దివ్యప్రసాదము. “ఎవ్వనిచే జనించు…” అని రోజూ ప్రార్థన చేసుకునే నేను ఆ మహానుభావుడి స్ఫూర్తితో మరల ఆయన స్పూర్తిగైకొని అతితేలికయైన తెలుగులో ఆ కథను అందిస్తున్నాను.
సూతమహర్షి శౌనికాది మునులకు భాగవతం వినిపించారు. ఈభాగవతగాధ మానవుని దిగజారుడు తనం ‘కలి’ ప్రభావమే అని సూచించింది.
ధర్మరాజంతటి ధర్మమూర్తికి మనుమడై అభిమన్యువంటి శూరుని కుమారుడై, తల్లిగర్భంలోనే అశ్వత్థామచే బ్రహ్మశిరోనామకాస్త్రంతో చంపబడి, శ్రీమన్నారాయణుడైన కృష్ణునిచే మృత్యుముఖం నుంచి బైటపడి పుట్టిపెరిగి తనపాలనలో ధర్మప్రభు వనిపించుకున్న పరీక్షిన్మహారాజుకు కలిపురుషుడి ప్రభావం సోకింది. మునులను దైవసమంగా చూచే అతను వేట కెళ్ళి దాహం వల్ల తపించి, ఒక మునిని దాహం అడిగి సమాధానం రాక ఒక చచ్చిన పామును ఆయన మెడలో వేసి, కోపంతో వెడలిపోయాడు ఆముని కొడుకు తండ్రి అవమానం తనదని భావించి ఆవని చేసిన అధముడు ఏడవ రోజున పాముకాటుతో మరణించు గాక! అని శపిస్తాడు. విషయం తెలిసి తండ్రి మందలించి ధర్మమూర్తియైన రాజుకీ సంగతి నెరింగించాడు. చేతులు కాలాక ఆకులు పట్టి లాభమేమి? అయినా రాజుకు పాపనివృత్తి జరిగి మరణానంతరం సద్గతులు కలగాలని భాగవతం వినమని బోధిస్తాడు ఆముని.
భాగవతం చెప్పగల సమర్ధుడు వ్యాస మహర్షి పుత్రుడైన శ్రీ శుకమహర్షి అని తలచి శుకుని ప్రార్థించి అర్థించమంటాడు, నారధుడు. ఆవిధంగా శుకమహర్షి పరీక్షిత్తునకు భాగవతం వినిపించి, శాపానంతరం మోక్షం ప్రాప్తింప జేశాడు.
ఆ క్రమంలో గజేంద్రమోక్షము అనే ఈదివ్యగాధ వెలుగులో కొచ్చింది. శ్రీశుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. “ఓరాజా! నాలుగవ మనువు పేరు తామసుడు. ఆయన మూడవ మనువైన ఉత్తముని తమ్ముడు. ఉత్తముని సుతులు కేతువు, పృధువు, నరుడు మొదలైన వారు పదిమంది కలరు. భూమిని పంచుకొని వారు ధర్మపాలన చేశారు. వారి వంశములోని హరిమేధుడను మహారాజు భార్య హరిణి. వారి పూర్వపుణ్య వశమున శ్రీమన్నారాయణుడు విష్ణువై పుత్రునిగ అవతరించెను.
ఆ విష్ణువు లోకముల పాలనము జేయుచూ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయుచుండెను. పరమ దయాళువైన ఆశ్రీహరి కొలనులో మొసలికి జిక్కి ప్రాణ భీతితో తనను పాహి పాహి అని వేడుకొనిన గజేంద్రుని సంరక్షించుటకు తన చక్రాయుధంతో ఆ మొసలి శిరస్సును ఖండించాడు అట్లా రక్షించబడిన ఆ గజేంద్రుడు మోక్షం పొందాడు!”
అప్పుడు పరీక్షిత్తు “మునిశ్రేష్ఠ! నీటనుండు మొసలికి కారడవుల దిరిగెడి గజేంద్రునకు వైరమెట్లు జరిగెను? ఆ గజేంద్రుని బాధ విష్ణువెట్లు తీర్చెను? నాకు దయచేసి వినిపించండి. నాశ్రవణేంద్రియములకు ఆనందం చేకూర్చండి శ్రద్ధగా వింటాను. భగవన్నామ సంకీర్తనలు పుణ్యప్రదములనిగదా జ్ఞానులు మిక్కిలి మక్కువతో విష్ణు కథలు వింటారు” అన్నాడు.
గజేంద్రమోక్షము
అప్పుడు శుకమహర్షి “ఓ మహారాజా! క్షీరసాగరమున త్రికూటమను గొప్ప పర్వతము కలదు. దాని వెడల్పు పదివేల యోజనములు (ఎనుబదివేల మైళ్ళు) ఎత్తుకూడా అంతే. దానికి మూడు శిఖరాలున్నాయి. అవి బంగారు, వెండి ఇనుములవై యున్నాయి. వాటిలో అనేకమైన దివ్యమణులున్నాయి. అవి దిక్కులను భూమ్యాకాశములను వెలిగించునట్లుంటాయి.
అనేకములైన చెట్లు, పాదులు తీగెలు అల్లుకున్న వనాలు, వాటిలో ఉంటాయి. గొప్పధ్వనితో సెలయేళ్ళు పారుతుంటాయి. దేవతలు ఆపర్వతాలపైకి తమ విమానాలతో విహారానికి వస్తారు. ఆ కొండ చరియలలో కిన్నెర దంపతులు స్వేచ్ఛగా విహరిస్తుంటారు. ఆ పర్వతములలో అనేకమైన వృక్షములు ఋతుభేదంబు లేక సదా వసంత ఋతువునందు వలె వివిధ జాతులకు చెందిన మొలకలతో చిగుళ్ళతో, పుష్పములతో, కాయలతో పండ్లతో శోభించుచుండును. రత్నములు విశేషముగా గల యిసుక మిక్కుటముగా నున్న యిసుక తిన్నెలు గల నదులతీరములందలి వింతైన పగడపుతీగలు గల ఉద్యానవనంబులందు విహరించు, చిలుకల వంటి పక్షులు తమ ధృడమైన ముక్కుపుటుములతో బొడుచుట చేత చెట్టు కొమ్మ సందుల నుండి మ్రోగిన పండ్ల నుండి కాఱు రసముతో ఆ ప్రదేశము నిండియుండెను.
ఆనేకములైన తామరకొలనులలోని తామర తూండ్లను ఆహారముగా భుజించి తమ ప్రియులతో విహరించెడి హంసలు మున్నగు పక్షులు శ్రావ్యముగా కూయుచుండగా, భూనభోంతరాళములు దద్దరిల్లు చుండును. ఆ పర్వతము లందు సిద్ధులను దేవజాతి తిరుగొడుచుండును ఆ దేవతలాలపించు సంగీతము మధురముగా నుండును. అచ్చటనుండు సింహశార్దూలములు పోరులో యమకింకరులనైన నోడించగలవు. అటువంటి పర్వతమున… బోయలు, బోయతలు, సింహశార్దూలముల వంటి మృగములు కూడా నివసిస్తుంటాయి.
ఆ అరణ్యంలో ఎల్లప్పుడూ భీతినిగరిగించునట్లు దిగ్గజములను కూడా గెలువగలిగిన బలమున్న అడవి ఏనుగుల గుంపు, పర్వత గుహలలో తిరిగి తిరిగి దప్పిక కలిగి, నీటిపై నుండి వచ్చు తడిగాలిని, గమనించి అచట నున్న కొలనులో విహరించవలెనని నిశ్చయించిన వయ్యెను. ఆ ఏనుగులు గుహల నుండి బయటకు వెడలుట సూర్యునికి వెఱచిన అంధకారము గుహలలో దాగి, యతడు క్రుంగిన పిదప విజృంభించి బయల్వెడలినట్లున్నది. రాజనీతి ప్రకారము రాజులు తమ శత్రువుల కన్న తాము దుర్బలులమని భావించినచో, అజ్ఞాతమునదాగి యుండి, తమ శత్రువులబలం తగ్గినంతనే, విజృంభించి దండెత్తి శత్రు నిర్మూలనం చేస్తుంటారు. అట్లే శత్రురాజు దినకరుడు క్రుంగగానే గజయూధము చీకటివలె విజృభించి చెలరేగినది.
అతి యౌవనగర్వంతో విర్రవీగుతున్న కరియూధము పర్వతములెదురైనను ఢీకొని ద్రోచికొని (తోసుకొని) పోవును. సింహము లెదురైనను ఎదిరించి పోరాడగలవు. ఆ ఏనుగులు పిడుగులు పడిననూ బెదరవు. అవి ఎటువంటి వనగా… సకలమృగంబులను వెఱపించు ఆ భద్రగజములు సంచరించుట జూచిన బెబ్బులులు బెదరుచున్నవై పొదలలో నక్కుచున్నవి. భీకరమైన ఎలుగుబంట్లు బెదరి గుహలలో దాగినవి. పందులు తమతమ కలుగులలో దూరినవి. జింకలు బిక్కచచ్చి దిక్కులందు పారిపోయినవి. చమరమృగంబులు యెటూ పారిపోవు సమయమూ ధైర్యమూలేక, తమ తోకలను ఎత్తిపట్టుకుని వినయముగా వింజామరలు విసురుచున్నవి.
ఏనుగులు మదించి యున్నప్పుడు వాని గండంబుల (చెక్కిళ్ళు) నుండి మదజలము స్రవించుచుండును ఆమదజలము మనోహరమైన వాసన కలిగియుండును. ఈ వనములోని మత్తేభముల మదజలంబాఘ్రాణించిన తుమ్మెదలు కోఱవయసులోనుండుట జేత చెలరేగి ఝంకారముల సేయుచూ మూగుచున్నవి. తన ప్రియురాలైన ఆడతుమ్మెద సిగ్గువిడిచి తన ఎదుటనే ఆ మదజల మాఘ్రాణించుట జూచి ఒక మొగతుమ్మెద ఓర్వలేక ఈ సుగంధము నాప్రియురాలైన ఈ తుమ్మెదకు నేనే ఇతర తుమ్మెదలు వారి వారి ప్రియురాళ్ళకిచ్చు దాని కంటే అధికంబుగా నిచ్చి నాప్రియురాలి కానందము సేసి దాని వలపులను సంపూర్తిగా అనుభవింతునని విజృంభించు చున్నవి. ఆహా! ఎంత మాయాసంసారము. ఈ కామవాంఛ జేతనే జీవులు (పరమాత్ముని ధ్యాసమఱచి) తమసుఖము తమవారి సుఖము కొరకే తనువున్నంత వరకు తనివి దీరక తపనజెంది తమినెరుంగక తహతహ లాడుచున్నారు.
తా॥ తన స్త్రీలపై వ్యామోహముతో పురుషుడు వారిని సంతోషపెట్టుటకు మంచి చెడు తెలుసుకోకుండా సన్మార్గము నొదలి గజేంద్రునివలె కష్టాల పాలవుచున్నాడు.
ఏనుగు గున్నలు, ఫలవృక్షంబులను ఒరిసి కొనుచు, చిగుళ్ళ గుబురులను వేగముగా కబళించుచు, తమ కంటబడిన అడవిదున్నలను, జింకలను, పులులను బెదిరించి గదమాయించుచు, నీటిగుంటలలో దిగి నీరంతా కెలికి బురదమయంచేసి పాడుచేస్తూ, కొండశిఖరములను గొబ్బిళ్ళు ఆడుచున్నట్లు దంతములతో పొడిచి పెల్లగించి దవ్వునకు విసిరి వేసి మట్టిరేపుచూ, ఎగజిమ్ముచూ యధేచ్ఛగా దిరుగుచుండినవి. ఆ ఏనుగుల గుంపు తమ తొండములతో గొట్టుచూ జెక్కిళ్ళతో నొరయుచూ, కుంభస్థలములతో బొడుచుచూ, పర్వతములను తలక్రిందులు జేయుచూ, దిక్కులను బలహీన పరచుచూ, ముల్లోక వాసులను భయ విహ్వలులను జేసినవి. (అతిశయోక్తి అలంకారం గమనించవలెను.)
ఈవిధంగా లెక్కలేకుండా సంచరించుచున్న ఆ ఏనుగుల గుంపులోని గజేంద్రుడు మిక్కిలి బలగర్వితుడై తన ప్రియురాండ్రయిన ఆడ ఏనుగులతో ఆ కూటమి నుండి విడివడి, దారి తప్పిన దాయెను. కానీ ఆడ ఏనుగులపై గల ఆశ దానికి రాబోవు ఆపదను గ్రహింప లేని దానిగా జేసెను.
ఆ గజేంద్రుడు తనముందు వెనుక నిరుప్రక్కల గల ఏనుగులను గమనించుచు, దారితప్పి ఏమియు తోచక దైవ వశంబున తనప్రియురాండ్రయిన ఆడేనుగులతో తాను మరొక్కదారి బట్టిబోయెను. మదోన్మత్తుడైన ఆ గజేంద్రుడు తన ప్రియురాండ్రతో ఆ గూడి సంచరిస్తూ వారిపైగల అమిత మోహముచే వాటికి పచ్చిక పడియలల్లో గలలేత పచ్చిక తనతొండముతో నందిస్తూ, చిగుళ్ళతోనిండిన రెమ్మలను తొండముతో విరిచి పక్షపాతము లేక తనప్రియురాండ్రకు సమంగా అందిస్తూ, వనమందు తిరుగుట చేత తడిసిన తనప్రియురాండ్ర చెమటను పెద్దవైన చెవులతో విసరుచూ, తనకాంతల అందమైన మెడలను నిమురుచూ, వాటిపై తనకుగల మోహమునెరిగించుచూ, తనతొండమును పైకెత్తి నీళ్ళు జిమ్మెను. తన చెలియుల ఋతుకాలం కనిపెట్టి వాటి మోహావేశానుగుణంగా నడుచుటలో గజరాజు నేర్పరి. తన యువతులను ఉత్సాహపరచుచూ అతను వారితో విహరించుచూ తన అలసట దీర్చుకొనుచుండెను.
ఇక ఆ గజేంద్రుని దేహసౌష్ఠవమును గజభామినుల అందములతో పోల్చిన సారూప్యమే లేదు. ఆగజేంద్రుని కుంభస్థలియొక్క గబ్బితనమును, ఆభామలే తమస్తన సంపదతో సరిపోల్చుకొని సిగ్గుపడునట్లుండెను. ఆ గజకాంతలు తమ స్తనములు కప్పుకొనుటకు పైట చెంగులేనందు వలన తమనడకల వేగం తగ్గించి తమ తమ కుంభస్థలములు అడ్డువచ్చి కనిపించకుండయుండునట్లు చేసికొనుచున్నవి. వాటినడక జూచిన కొత్తగా కాలి అందెలు దాల్చిన చిన్నదాని నడకకు పోల్చదగినట్లున్నది. అయిననూ తమ తొండముల కాంతి గజేంద్రుని తొండపు కాంతితో సరిపోల్చలే నందువలననూ, స్త్రీల తొడలకాంతి మిక్కుట మగుటకు ఒడ్డాణము ధరించిరో అన్నట్లుండియూ దంతముల కాంతిసరిపోలుటకు తమ చిరునవ్వు చంద్రకాంతిని జతపరచునట్లుండి, దంతములకాంతులు సరి పోల్చుకొదగినట్లున్నవి. ఈ పృధ్వీమండలమును అష్టదిగ్గజములు మోయుచుండును. వాటి భార్యలు ‘అంజన’ మున్నగు దిగ్గజాంగనలు ఈ గజేంద్రుని ఠీవి, సౌందర్యము ఆ దిగ్గజాంగనలను సైతము భ్రమింపజేయునేమో అన్నట్లుండెను.
ఆ గజేంద్రుడు తనకాంతలతో అడవి తర్వాత ఇంకకొ ఆడవిని దాటుచూ చాలదూరముపోయి అమితమైన దాహముచే పీడితుడై, నీరుండు మడుగులను వెదకుచూ తన ప్రియురాండ్రతో చాల దూరము పోయెను. అచ్చట అప్పుడే పూచిన తాముర పూలతో కూడియున్నది యును, ఆపూలపై తిరుగు భ్రమరములచే శోభిల్లునదియు, మొసళ్ళు మొదలగు జల జంతువులతో గూడినదియు, లోపలికి దిగుటకు దుస్సాధ్యంబైనదియు, నాలుగువైపులా దట్టమైన మర్రి, మామిడి మొదలగు వృక్షములతో కూడినది, హంస, సారస, కారండవ మొదలగు పక్షులకు నివాసమగు నదియునైన కొలను చూచి ఆ గజేంద్రుడు సంతసించెను. ఆ యరణ్యమునందు జనసంచారము లేనందువల్ల స్వచ్ఛమైన నీరు గల ఒక తామరకొలను చూచి గజేంద్రుడు అందు జలకమాడవలెనను కోర్కెను మిక్కుటముగా పొందెను.
ఆ తామరకొలనులోని తామరపూల వాసనతో గూడిన శైత్య, సౌరభ్య, మాంద్యములను మూడు గుణములు గల గాలి వీచుచుండగా తమదేహముల బడలిక తీరుట చేతను, ఆ కొలనులోని తామరతూండ్లను తిని, మనోహరముగా కూయుచున్న రాజహంసల రవములు తమ వీనులకు ఇంపు గలుగుటచేతను, ఆ పద్మములు తమ నాసికలకు కమ్మనివాసన నందించుటచేతను, తేటనీటి అలల తుంపరలు నోటికి రుచిగా అనిపించుట చేతను, ఆకొలను సౌందర్యము ముల్లోకములలోను అరుదైనదిగా దోచుటచే తను ఎంతకూ తనివి తీరకుండుట చేతను, ఆమదపుటేనుగులు గుంపు తమ పంచేద్రియములకు’ కావలసిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములైదింటినీ ఆ కొలని యందే బడయుటచేత ఆ కొలను విడిచి పోవుటకు మనసురాక ఆ కొలనును విడువలేకుండెను.
ఆ ఏనుగుల నీటిని తమ తొండములతో బీల్చుకొనుచు, పెకెత్తి వాటిని తమ ముఖమునందలి చెక్కిళ్ళపై జల్లుకొనుచు, తలలు పెకెత్తి గళగళ ధ్వని కలుగునట్లు చేయుచూ, కడుపు నిండ నీరుద్రావినవై యుండిన తదనంతరంబున… ఆ ఏనుగులు ఆ కొలనులో చెలరేగి జలకము లాడుచుండెను. ఆ గజేంద్రునికున్న అపరిమితమైన బలముచేత తొండముతో నిండుగా నీటిని పీల్చగానే కొలనులోని చిరుచేపలు, ఎండ్రకాయలు నీటితోపాటు తొండమున దూరి, భీతిల్లి. ఆపదనున్నవారు తమ జాతివారిలో ఉన్నతులను ఆశ్రయించి రక్షణ బొందుటకు యత్నించునట్లు శింశుమార చక్రమునందు (జోడియక్ సైన్) గల మీన, కర్కాటక రాసులను తలచుకొని ప్రార్థించుచూ ఆశ్రయించెను. అదిచూచి దేవతలుకూడా నివ్వెరపోయిరి.
ఇక యీగజేంద్రుడు సంతోషముతో తొండమున పూరించిన నీటిని అమితవేగమున ఆకసము వరకు నెగజిమ్ముచు అతిశయించుచుండెను. ఇవ్విధంబుగా ఆ గజేంద్రుడు అడ్డు లేకుండ విహరించు చుండెను. ఇక ఆ జలక్రీడలలో పైకెగజిమ్మిన నీటి నుండి అతని ముఖముపై బడిన తుంపరలతో ఎత్తైన ఆనల్లని గజరాజు ఎట్లా ఉన్నాడంటే…..
నల్లని కాటుక కొండయో అన్నట్లున్నాడు. తమ తొండముతో తామరపూల రేకులను విడదీసి ఆ గజేంద్రునిపై ఆడ ఏనుగులు వేయుట చేత వేయి కన్నులున్న దేవేంద్రుడా ఏమి ఇతగాడు అన్నట్లున్నాడు. ఆ తామరపూల పుప్పొడిని కూడా చల్లుటచేత అది బంగారు రంగులో మెరయుచూ పసిడి కొండ అయిన మేరుపర్వతమా ఏమి అనునట్లున్నాడు. తెల్లని తామరపూతూడులు దేహమంతా కప్పగా, తెల్లని నాగులను దాల్చిన పరమేశ్వరుని వలెనున్నాడు. ఆ నల్లని ఏనుగుపై వేసిన ఆ తెల్లని తామరతూడులు. కారుమేఘమందలి విద్యుల్లతలవలె వెలిగిపోతున్నాయి. ఈ విధంగా వారి జలక్రీడ అద్భుతంగా ఉన్నది.
(కామినివలె ఆ కరేణువలను (ఆడేనుగులను వర్ణించుట ఉత్ప్రేక్షాలంకారచమత్కృతి, స్త్రీని ఏనుగుతో పోల్చుట పురాతన కవుల సంప్రదాయము. గజగమనలు, కుంభస్థలిని బోలిన స్తనద్వయం అనాది కవుల సంప్రదాయం). ఆకొలనులో గజేంద్రుడట్లు స్వైర విహారము సలుపుచుండగా ఆ కొలనులో నివసించుచున్న ఒక మకరేంద్రుడు వెఱచి నీటిపైకి వచ్చెడి వేగమునకు కొలనులో భుగభుగ, మనెడి గొప్ప ధ్వనితో బుడగలు వస్తుండగా, వెఱపు కలిగించు పూత్కారపు ధ్వని చేయుచు, దానికి మిగిలిన మొసళ్ళు, ఎండ్రికలు బెదరుచుండగా తన బలమైన తోకను విసరుట చేత అణచలేని గొప్పధ్వనితో గాలివీచగా, దానివలన నీటిలో సుడులు ఏర్పడగా, దానివలన గొప్ప అలలు వ్యాపించి సరస్సు ఒడ్డు కోయబడి అచ్చటనున్న చెట్లు కూకటి వ్రేళ్ళతో కూలిపోగా, కొలనిలో నుండి పైకివచ్చి తత్తరపాటును వెఱపును బొంది, తన ఊపిరి బిగియ బట్టి తెగతోప్పుచూ, ఆ గజేంద్రుని చెంత జేరి రాహువు సూర్యుణ్ణి కబళించుటకై బట్టినట్లు ఆ గజేంద్రుని కాలిని ఒడిసిబట్టెను.
ఆ మొసలి తేడుకు తన కాలు చిక్కినదని గ్రహించిన గజేంద్రుడు తన బలమైన తొండమునెత్తి శక్తికొలదీ మొసలిని గట్టిగా కొట్టిన దాయెను. ఆ దెబ్బకు మకరి చచ్చినదానివలె నీటి అడుగునకు జారిపోయి చటుక్కున బైకి వచ్చి ఆగజేంద్రుని రెండు కాళ్ళను గట్టిగా తన నోటితో పట్టుకొనెను.
రెంటినీ అట్లు మకర విభుడు తనముందు కాళ్ళను బట్టుకొన్ననూ వెఱువక ఆ కరీంద్రుడు తన దంతంబులతో ఆ మొసలి చర్మంబుపై బుడిపెలు ఊడిపోవునేమో అన్నంత బలమున ఆ మొసలి వీపుపై గుచ్చెను. ఆ కుమ్మునకు మొసలి పట్టు విడిచి వేగముగా గజము వెనుకకుబోయి దానితోకను తన నోటితో పట్టి కొరికి బాధించెను.
సందు చిక్కినంతనే మొసలి ఏనుగు కాళ్ళను పట్టుకుని కొలనులోని కీడ్వదొడంగెను. బలశాలియైన ఏనుగు మొసలిని కొలను బయటకు ఈడ్చి తొక్కుటకు ప్రయత్నించు చుండెను. కొలనులోని మొసళ్ళన్నియు తమ మొసలి గెలువగలదని ఆశ పడుచుండగా, కొలను వెలుపలనున్న గజము లన్నియూ తమనాధుడు గెలుచునను ఆశతో నుండెను.
ఇట్లు ఆ ఏనుగు, మొసలి రెండునూ క్రమముగా భరింపరాని బాధకలిగి నప్పటికీ తీవ్రముగా పోరుచూ చూచువారలకు భీతిని కలిగించుచూ, ఒండొరుల విజయలక్ష్మిని బలాత్కారముగా పరిగ్రహించుటకు యత్నించుచూ, తామరకొలనును గలత పెట్టుచూ, సింహముతో మరొక సింహము, కొండతో మరియొక కొండ ఢీ కొనుచున్నట్లు పోరాడుచూ, వెనుదిరుగక బెనగులాడుచు నీళ్ళలో జరుగు నట్టి జగడములో ఈ వైపుకూ ఆ వైపుకూ లాగుకొనుచూ, తొట్రుపాటు నొందక బుడబుడమను ధ్వనులతో బుగుల్ బుగుల్ అను విచిత్రమైన చప్పుళ్ళతోనూ నురగలు రప్పించుచూ, నోటిరంధ్రములతో బట్టిన నీటిని ఆ కరీంద్రుడు ఆకాశమునకు వెదజిమ్ముచూ, మిక్కిలి వాడియైన దంతంబులతో బల్లెములవలె పొడుచుచూ మొసలి యొక్క చిన్నచిన్న తునకలైపోతున్న ఎముకలు తలపుర్రెపగిలి తలపై రక్తము స్రవించుచుండగా ఒండొరలు నీడ్చుకొనుచుండిరి. కాని మొసలితనపట్టును సడలించదాయెను.
వాటి మధ్యపోరు వలన చిన్న చిన్న జంతువులైన తాబేళ్ళూ, ఎండ్రకాయలూ, కప్పలూ, గండకములూ (ఒకరకమైన చేపలు) మొదలైన వాటి ప్రాణములు క్షోభిల్లుచుండెను తామరపూవులను చిందరవందర జేయుచూ, నీటిపాచి యొక్కయు నత్తగుల్లల యొక్కయు చిఱుకప్పలయొక్కయు గుంపులను తమ ఒండొరులు దెబ్బల మధ్య నలిగిననూ లెక్కచేయక “నాజయమే నిశ్చయము” అనే మొండిపట్టుదలతో రాత్రింబగళ్ళ వలె ఒకదానిని ఇంకొకటి అనుసరించుచూ చెలరేగి చిరకాలము పోరాడినవి. నిద్రాహారంబులను మానివేసినవి. సాటిలేని మగటిమితో (మగతనంతో) పోరు సల్పినవి.
పోరులో గజేంద్రునిదిపై చెయ్యి అయినందున మకరికి రాబోవు దుస్థితికి భయమందిన భూలోకంలోని మకర, మీన, కర్కాటకములన్నియు మిత్రనిలయంబులను చేరినవో అనునట్లుండెను. (అనగా మకర, కర్కాటక, మీన రాశులు నింగిలో కలగలుపై ఒకే కూటమిగా జేరి రాశి చక్రములలో నిలిచియున్నట్లుండెనని భావము. ప్రకృతి సిద్ధముగా నాకాశములోనున్న మకరమీన, కర్కాటక రాశు ల కూటమి వన జంతువులకూటమిగా భావించబడుచున్నది. ఇది చక్కని ఉత్ప్రేక్షాలంకారము.)
ఆ మకరము కరీంద్రుని మాటి మాటికీ నీటిలోకి లాగుటకు ప్రయత్నించుచుండగా ఓర్వలేనిదై గజేంద్రము ఆ మకరినోడించుటకు దంభములాడుచూ భయంకరముగా వజ్రాయుధముతో సమానమైన తన దంతములతో ఆమకరి తొమ్ము చీలునట్లు ఎగురగొట్టి పడేసి, తొండముతో కొట్టు చుండెను ఈ విధముగా కరి మకరముల ద్వంద్య యుద్ధము జరుగుచున్నప్పుడు…
తా॥ ఏనుగు, మొసలి ఘోరముగా పోరుట జూచి తమ ప్రియుని వదలివైచి పోవుట ఆ ఆడు ఏనుగులకు చేతగాక గజేంద్రుని దురవస్థను జూచి పరితపించినవి. ఎక్కడనైనా తమ నాధుని వీడి తమ దారిన తాము బోయే ఆడువారిని చూడగలరా?
అంతట మొసలికి నీళ్ళే స్థావరమైనందున దాని బలము రానురాను హెచ్చుచుండెను. ఉత్సాహము పెరుగుచుండెను. కరికి నానాటికి బలము క్షీణించుచుండెను మొసలితో బోరాడుట కాక నానాటికీ కృష్ణపక్ష చంద్రునివలె క్షీణించుచుండెను. అంతటనా మొసలి కరి కుంభస్థలముపై నెగురు సింగంబువలె దుమికి హుంకారముతో గజేంద్రుని పాదములను బట్టుకొని నీటిలోపలికి లాగుచు మెడమీద, వీపు మీద గొట్టుచూ అలక్ష్యముతో నాకరిరాజు పై ఎగురుచూ ఏనుగును నీళ్ళలోముంచుచు, దానును మునుగుచు ఎముకలను, దంతములను విరుగగొట్టుచు, కరీంద్రుని నీటి బయటికి పోనీక కాళ్ళుపట్టి సరసులోనికి లాగుచు బాధించుచుండెను.
ఆ మకరము గజేంద్రునికి కనబడకుండ నీళ్ళలో దాగి ఆ ఏనుగు బయటకు వచ్చునపుడు దానికాళ్ళకడ్డుపడి కదలనీయక కాళ్ళను జుట్టుకుని హఠాత్తుగా లోపలికి లాగుచూ బాధించగా కరిరాజు భీతిల్లి చతికిలబడి నడచుచు, ఆకరి నీళ్ళ నుండి తొలగిపోవునప్పుడు ఆ మొసలి గజేంద్రుని కాళ్ళనొడిసి పట్టుకుని బాధించుచుండెను.
ఆ విధమున నామొసలి తక్కిన జలజంతువులన్నీ ఆశ్చర్యముపడునట్లు, అల్పుని జ్ఞాన జ్యోతిని ఆక్రమించు అజ్ఞాన తిమిరములవలె అంతకంతకూ అధికమవుతున్న ఉత్సాహము గలదై ఎక్కువ తెంపు చూపుచుండెను. ఆ మకరము గూడ పట్టు బిగించ దలచి తన రెండు పాదములు నేలకానించి బిగియబట్టి పంచేద్రియముల గర్వాన్ని అణచికొని బుద్ధిస్థైర్యంబుగలదై ఏనుగుయొక్క పాదములను అడ్డులేకుండ బట్టి, యోగిపుంగవుడు బ్రహ్మపదం కోసం దుఃఖవిముక్తుడై సమాధియందు తన యుచ్ఛ్వాస నిస్వాసలను బంధించి యుంచినట్లు నిశ్చలముగా నుండెను.
ఇక ఆ గజేంద్రుని దుస్థితిజూచి స్వజాత్యభిమానము పీడించగా ఇంద్రుని వాహనమైన ఐరావతము మన బంధున కిట్టి దుర్దశ వచ్చినదే అని తల్లడిల్లి, ఇంద్రుని దించివైచి ఆకసమువైపుకు పరుగుతీసెను. అది దేవతలకు సైతము జిక్కకుండెను. ఒక ప్రాణి అధికమైన అవివేకము చేత సంసార కూపంలో బడి బయటకు రాలేక బుద్ధి నిలకడ లేక చింత పడునట్లు గజేంద్రుడు మకరి పట్టు విడిపించుకొనలేక మిక్కిలి దిగులు పడుచుండెను ఈ విధముగా… ఆ గజేంద్రుడు బడలిక నొందక, మూర్ఛనొందక, విసుగుపుట్టక వేయిసంవత్సరముల కాలము రేయింబవళ్ళూ సంధ్యయూ నెరుంగక యెడతెగక ఆ మొసలితో పోరెను.
అవ్విధంబున గజేంద్రుడు పోరాడి మిక్కిలి అలిసిపోయి ఇక దీనితో సాటిగా తనుపోరాడలేనని తలచి తన పూర్వజన్మ పుణ్యము పరిపక్వమగుటచే దివ్యజ్ఞానము నొంది, దిగులును విడనాడి ఇవ్విధంబున చింతింప సాగెను…
ఉ॥ ఎవ్విధి దీనిగెల్వనగు ఎవ్వని బిల్తును తోడు నాకవన్
ఎవ్వరు అడ్డమయ్యెదరు ఈ జలజంతువునెట్లు వంచెదన్
ఎవ్వరు దిక్కులేని మొరనీయెడ విందురు నాకు దైవమై
ఎవ్వడొ యొక్కడైన ననుయేలుచు ఆదుకొనండె ఈశ్వరా!
(పోతనగారి ‘ఏరూపంబున దీనిగెల్తు…’ ఆధారంగా)
తా॥ ఓ ఈశ్వరా! దీనిని ఏవిధముగా గెలువగలను? నాకు తోడై యుండుటకు ఎవ్వనిని పిలిచెదను? ఎవరు అడ్డు పడి నన్ను కాపాడెదరు? ఈ మొసలిని ఏ విధముగా ఓడించగలను? నా దిక్కుమాలిన ఆవేదన ఎవరు వింటారు? నన్ను ఏ దైవమైనా రక్షించి పాలింపరాడేల?.
ఉ॥ కాననమందు మత్తకరి కన్యల గూడుచువారి నామదం
బైన జలంబులన్ దడిపి అద్భుత చందన వృక్ష ఛాయలన్
బూనిపరుండ లేక దిగిమోదక మందున మందబుద్ధినై
నేనిటు దీనిపాలబడి నీల్గుచు నుంటిని దిక్కుతెల్వకన్
(పోతనగారి ‘నానానేక పయోథము…’ ఆధారంగా)
తా॥ అడవిలో మదించిన ఆడు ఏనుగులతో కలిసి వానిని నా మదజలాలతో తడిపి, అద్భుతమైన చందన వృక్షములనీడలో హాయిగా నిదురించుచు ఉండలేక, ఈ కొలనులో దిగి నాగ్రహచారం కొద్ది ఈ దురవస్థను పొందాను. ఈ స్థితినెట్లు దాటెదనో తెలియుటలేదు.
ఈ జగములావిర్భవించుటకు కారకుడెవరు? సర్వము ఎవనిలో పుట్టి, ఉండి, చివరకు లీనమై ఈవిశ్వం కన్పించక అదృశ్యమవుతున్నది? అన్నిటికీ మూలకారణమైన ఆ ప్రభువెవ్వడు. ఆది మద్యాంతరహితుడైన ఆ సర్వేశ్వరుడెవడు? అట్టి ఆత్మయందావిర్భవించు వాడని ఆర్హుడనై శరణు జొచ్చెదను.
సకలలోకములను ఒక పర్యాయము తనలోనికి గొని నశింప చేయుచూ, ఒక సారి వెలుపలికి రప్పించుచూ, జీవకోటిని సృజించుచూ, రెండు బాధ్యతలను తన ఇష్టానుసారము నిర్వర్తించుచూ, సాక్షియై గమనించుచూ అకళంకుడూ, జ్ఞాన రూపియైన ఆ సర్వేశ్వరుని నా మనసునందు ధ్యానించెదను.
తా॥ ఈ లోకములు, లోకపాలకులు, లోకములందు నివసించువారు చనిపోయిన తరువాత గొప్ప గాఢాంధకారము దాటిన పిదప ఒక్క ఆకారముతో నుండు వాడెవడో ఆపరంధాముని ధ్యానించెదను. నాటకశాలయందు వేషగాడు పలువేషములు దాల్చును, అట్లే పలురూపములతోనెవడు జీవించునో, ఎవరు సకల భూతముల లోపల నుండి నటించుచున్నాడో, ఎవరి మహిమ మునీంద్రులకుగాని, దేవతలకు గాని గోచరము కాదో, ఆ భగవంతుని నేను ఇప్పుడు తలచుచున్నాను.
సంసార సుఖంబులను త్యజించిన మునులు బ్రహ్మసాక్షాత్కారము గోరువారయి సర్వభూతహితులు సత్పురుషలునై తామెంత సచ్ఛీలురైయున్ననూ, ఏభగవంతు నెరుంగ జాలరో అతనిని నేను స్తోత్రించెదను. అతడు నన్నుకాపాడు గాక!. స్వయముగా జన్మము, పాపము, నామ రూపములు, గుణక్రియలు లేనివాడును పరాత్పరుడును, తేజోరూపుడును, రూపరహితుడును, సృష్టి స్థితిలయల నిమిత్తమై నామ రూపక్రియాది గుణములు గలిగి మాయను తనవశము నందుంచుకొన్నవాడును, అపరిమిత బలము గలవాడునూ, వింతలగు అసమాన చరిత్రములు కలవాడునూ, అవాజ్మానసగోచరుడును, సాత్వికులైన, సంసార విముఖులకు మాత్రమే ప్రత్యక్షమగువాడునూ అయిన ఆ భగవంతునికి నేను మ్రొక్కెదను.
తా॥ తమరి కర్మలన్నీ యోగాగ్నిలో దగ్ధమైపోగా అన్యము నెరుగక యోగులు ఏ మహాత్ముని చక్కటి ధ్యానముచే వెలిగెడి మనస్సులలో బాగుగా వీక్షించగలరో అతనిని నేను భజింతును.
సకల వేదాగమములకు నిధియైన వాడును, మోక్షస్వరూపుడును, సజ్జన సేవితుడును, త్రిగుణాత్మకునిగా తోచినప్పటికీ లోపలి జ్ఞాన దీపముచే వెలుగు చుండువాడును, స్వయంప్రకాశ స్వరూపుడును, గుణాతీతుడగుటచే జ్వలించు మనస్సుకలవాడును, సకలకర్మానుష్ఠాన పరులచే బొందబడు వాడును, దిక్కులేని నాబోటి వారి మొరలాలించి కాపాడు వాడును, సర్వాంతర్యామియై వెలుగువాడును, సంసారతాపత్రయమున బడినవారికి అగోచరుడును, అయిన ఆ భగవంతునికి నమస్కరించుచున్నాను. మరియు… ధర్మార్థకామముల యందు ఆశ పరిత్యజించిన జ్ఞానులు ఎవ్వని గొల్చుచూ తమ కీప్సితమైన మోక్షమును సాధించుచున్నారో, అట్లు తనను భజించినవారికే భగవంతుడు నాశరహితమగు ఏమోక్షమునందించు చున్నాడో, ముముక్షువులు కోరి ఎవ్వనిచే తమ ఈప్సితములు బొంది ఆనందమున నోలలాడుచున్నారో, అట్టి మహేశ్వరుడును, త్రికరణములకును అగోచరుడైనవాడును, నిశ్చల భక్తిచేత పొందదగిన వాడును, సర్వత్రా నిండియున్నవాడును, బ్రహ్మస్వరూపుడును, స్థూలసూక్ష్మరూపములుగలవాడును, ఇంద్రియాలకు అగోచరుడును, పరాత్పరుడును అయిన భగవంతుని నేనిదే ధ్యానించుచున్నాను.
సూర్యుడును, అగ్నియును ఒకప్పుడుతమ కాంతులను బయటకు విరజిమ్ముచూ, ఒకప్పుడు తమ లోనికీడ్చుకొనుచున్నారు. అట్లు ఆ భగంతుడు శ్రీమన్నారాయణుడు భూమ్యాది లోకములను, బ్రహ్మాది దేవతలను చరాచరములగు సమస్త వస్తుజాలమును, సృజించి, వానికి నామరూపముల నొసంగి, ప్రళయ కాలమున తనలోనికి జేర్చుకొనుచున్నాడు. ఎవ్వడు మనోబుద్ధి చిత్తాహంకారములును జ్ఞానేంద్రియ కర్మేంద్రియములును తానుగానే అయియుండి త్రిగుణంబులు కార్యంబులు చేయుచుండి, పిమ్మట తనకే సంబంధము లేని వానిగానే యుండునో, త్రిలింగములూ తనేయై ఎవ్వరున్నాడో, సమస్త దేవ, మానవ, అసుర, జంతు పశుపక్ష్యాది రూపములై ఎవడున్నాడో, కర్మంబులు గుణంబులు మొదలగువానిచే |కలుగు భేదములనొందక, సత్స్వరూపుడునూ అసత్స్వ రూపుడునుగాక యుండియు, ప్రళయంబున అన్నింటినీ తనలోనికి జేర్చుకొను పరమాత్మ స్వరూపుండును, నిర్గుణ నిర్వికార నిరంజన స్వరూపుడును, సర్వ స్వరూపుడయిన ఆ భగవంతుని దలచుచున్నాను.
తా॥ గొప్ప శ్రేష్ఠులైన యోగులలో ఆ పరమాత్మకలడు అంటారు. కరుణ గొనుటచే దీనులలోకూడా ఆ భగవంతుడున్నాడని అందురు. అన్ని దిక్కులలోనూ ఉన్నాడంటారు. ఇంతమంది కలడు అంటున్నారు గాని ఆ కలడనే వాడు ఉన్నాడో! లేడో!.
జనన మరణములు లేని జగన్నాధుడు నాపాల నున్నవాడో లేడో ! దుష్టశిక్షణ శిష్టరక్షణచేస్తాడంటారే మరి ఆ పరాత్పరుడు నన్నీ మొసలి నుంచి రక్షించడేమి? నాకడ్డము ఎందుకురాడు? జితేంద్రియులైన జ్ఞానులను తన కడజేర్చుకొను ఆ భగంతుడు నా అవస్థను కన్నులార జూచి కూడా నన్ను పాలించకున్నాడే? కపట భక్తుల జిత్తులను గమనించి, వారికే నాటికీ ప్రత్యక్షముగాని భగంతుడు నా దీనాలాపముల నాలింపడేమి? ఇదంతా చూస్తుంటే నాకు సందేహం వస్తోంది. ప్రపంచమంతా తనరూపమే అయినవాడు సృష్టిస్థితిలయలు చేస్తూ సర్వకాల సర్వావస్థల యందు వెలుగు చుండువాడును, తనను కొలిచెడి భక్తులు వేదనతో కాపాడమని ధ్యానించినప్పుడు సత్వరమే వచ్చి కాపాడు ఆ పరమేశ్వరుడు నామొరలను వినడేమి? నా అవస్థనుచూడడేమి? అసలు ఇంత దురవస్థలో నున్న నన్ను తలచుకోడేమి? నన్ను కాపాడుటకు సత్వరంగా రాడేమి?
ఈ విశ్వ సృష్టికర్తను, విశ్వానికి బాహ్యముగా నుండు వానిని, విశ్వస్వరూపిని, విశ్వమంతటిచేత తెలియదగిన వానిని, విశ్వమే తానయినవానిని, విశ్వముతో ఏ సంబంధమూ లేనివానిని, శాశ్వతుడైన వానిని, పుట్టుకలేని బ్రహ్మకంటే శ్రేష్టుని, పరమపురుషుడైన ఈశ్వరుని నేనిదే సేవించు చున్నాను. ఇకపై గజేంద్రుడు తనెదుటనే ఆ పరాత్పరడున్నట్లు భావించుచు తనమొరలను నేరుగా ఆ స్వామికే విన్న వించుకుంటున్నాడు.
తా॥ హే జగద్విభో! నాకు ఇంక శక్తిలేదు. ధైర్యం పోయి ప్రాణములు వాటి వాటి స్థానములను విడిచిపెట్టాయి మూర్ఛవస్తున్నది. నీరసము కమ్మింది. ఎంతయో శ్రమను పొందుతున్నాను. అన్యమైన గతి నెరుగు కున్నాను. ఈశ్వరా! ఈదీనుని మన్నించు. ఓవరదా! నన్ను రక్షింపుము. నీకే అది సాధ్యము.
ఓ దయా సాగరా! నీవు ఆపన్నులమాటలను వినెదవనియు, బోవనసాధ్యమైన తావులకు పోదువనియు, శరణాగతులు పిలిస్తే “వస్తున్నాను” అని పలుకుతావనియు, పదే పదే జెప్పుచుండగా వినియున్నాను. అయితే నామొరలెంతసేపటికీ వినక పోవటంచేత నీవు రాకుండుటచేత ఈ మాటలు నిజమా అనిపిస్తున్నది.
సీ॥ ఓ కమలేక్షణ! ఓభక్తమందార!
వైరి భావము లేని వరద! నాధ!
ఓకవిమునివంద్య! ఓసుగుణోత్తమ!
విమలప్రభావ! ఓవేదవినుత!
ఓ కల్పవృక్షమా! ఉత్తమ శరణార్థి
త్రాతవై నిలిపెడి హితప్రదాత!
ఓ మునిశ్రేష్టుల ఉల్లంబులన్ నిల్చి
సద్దతినందించు సత్యవచన!
తా॥ కమలములవంటికన్నులు గల ఓభక్త కల్పవృక్షమా! మిత్రులు శత్రువులు అను భేద భావంలేని ప్రభూ! పండిత మునిజన సేవితా! సుగుణములు గలవారందరిలోకి ఉత్తముడా! స్వచ్ఛమైన ప్రభావం గలవాడా! వేదములచే కొని యాడబడువాడా! ఓ కల్పవృక్షము వంటి ప్రభూ! ఉత్తములైన శరణార్థులను కాపాడి హితముల నొసగువాడా, మునిశ్రేష్ఠుల మనస్సులలో తిష్ఠ వేసుకొని నిలిచి వారికి సద్గతి నందించే శ్రీహరీ! రావేమయ్యా? ఓ భూరమణా! నాకునీవె శరణు. పరమపురుష! నన్ను తలచవెందులకు? కాపాడుట కేలరావు?
ఆ గజేంద్రుడట్లు చాలసేపు చింతించి యనాధ రక్షకుడైన ఆ పరమాత్మ తన నేల రక్షించడని ఆకసము వైపు తన మోముద్రిప్పి తన తొండము నెత్తి ఆ పరమపురుషునికి నమస్కరించుచు ఒక వేళ ఆయన తనకు ప్రత్యుత్తరమిడుచున్నాడేమో నని తన చెవులను రిక్కరించి వినుచు తన ఆవేదన నెరిగించుచుండెను.
ఆ గజేంద్రుడు విశ్వవ్యాప్తుడైన పరమాత్ముని వేడుచున్నాడు కదా! మనకేమి లెమ్మని బ్రహ్మాది దేవతలు వానిని వినియు మిన్నకుండిరి. ఇక ఆ మహావిష్ణువు విశ్వరూపుడు, విశ్వవ్యాప్తుడు విశ్వ మయుడు ఆగుటంజేసి సర్వోత్కృష్టుడైనందున ఆకరిని రక్షించు బాధ్యత తనదేనని ఆ గజేంద్రుని కాపాడ నిశ్చయించినవాడాయెను.
తా॥ వైకుంఠపురములో, నగరియందు ముఖ్యమైన ఒక గొప్ప భవంతి ఉన్నది. దానిదగ్గరలో, కల్పవృక్షం ఉంది. దాని దగ్గర చక్కటి తోట ఉంది. అక్కడ తియ్యటి అమృతం వంటి నీరు గల సరస్సున్నది. దాని ఒడ్డున దివ్యమైన చంద్రకాంతమణులతో నగిషీలు చెక్కబడిన కలువపూల పాన్పు ఉన్నది. అందులో లక్ష్మీదేవితో విహరించు శ్రీహరి, శరణు వేడుచూ దీనుడై ఆర్తనాదం చేస్తున్న గజేంద్రుని మొర ఆలకించి వానిని కాపాడదలచి మనసంతా కరుణతో నిండిపోగా సిద్ధమయ్యెను.
ఉ॥ చెప్పడు శ్రీ రమామణికి, చేత ధరించడు శంఖు చక్రముల్
అప్పరి వారమున్ గొనడు అభ్రగనాధుని ప్రీతి నేడున్
కొప్పునుజుట్టడాయె హరి కోమలితో తన వాద మాపుచున్
అప్పుడె, ఆమెపైట విడనాడకయే కరిబ్రోవ నేతాన్
(పోతనగారి ‘సిరికింజెప్పుడు..’ ఆధారంగా)
తా॥ ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి తనెక్కడికి పోతున్నది చెప్పుటలేదు, శంఖచక్రాయుధములు చేత బట్టుకొనడు, ఏ పరివారమునూ తనవెంట కొనిపోడు, ఏ: తనవెంటవచ్చు గరుత్మంతుని ఆదరించడు. తన తలవెంట్రుకలు చెదిరిపోగా వాటిని చక్కబెట్టుకోడు చిన్న వాగ్వాదంవచ్చి లక్ష్మీదేవి పైట చెంగులాగినవాడు అదితన చేతితో పట్టుకొని వదలకుండానే ఆ గజేంద్రుని రక్షించుటకు సిద్ధపడెను.
ఈ విధముగా భక్తజనుల నాదుకొనుటయే దీక్షగా గల శ్రీమన్నారాయణుడు సర్వప్రాణులను శరణన్న రక్షించుటే వ్రతముగా గలవాడగుటచే, ప్రాణికోటి హృదయకమల నివాసియగుటచే, ఆకరిరాజుదీనాలాపన ఆలకించినవాడై లక్ష్మీదేవితో సరస సంభాషణకునూ స్వస్తి చెప్పి గంజేంద్రుని కాపాడుటకు మనస్సున నిశ్చయించుకొని గరుత్మంతుని కోసం నిరీక్షించేపాటి సమయం కూడా వృధా చేయక ఆకసమునకెగిరెను.
అప్పుడు శంఖచక్రాది ఆయుధములకు గరుత్మంతునికి, చివరికి శ్రీదేవికి కూడా ఏం చేయాలో తోచక వినువీధీలో శ్రీహరిని అనుసరిస్తూ వారు కూడా ఎగురుతూ అనుసరించారు. ఆదృశ్యం వినువీధిలో మున్నెన్నడూ జూడని అపురూప దృశ్యం. శ్రీహరివెంట లక్ష్మీ, ఆమెవెంట అంతఃపుర పరివారం, వారివెంట గరుత్మంతుడు, అతనివెంట శంఖ, చక్రగద, ధనస్సులు, వాటి వెంట నారదముని, ఆయనవెంట విష్వక్సేనుడూ, వైకుంఠపురంలోని పిల్లాపాప గోగణాలు కూడా ఆ దేవుని అనుసరిస్తూ వచ్చాయి. పదునాలుగు భువనాలలో ఎవరూ మునుపు ఈదృశ్యం చూడలేదు.
ఆ లక్ష్మీదేవి ముఖకమలము నుండి స్రవించు పూదేనెను త్రాగుటకై తుమ్మెదలు మోముపై వ్రాలగా తనపైట కొంగు విడిచి పెట్టక శ్రీహరి మఱపుచే గుంజుతూ పోవుచుండగా ఆతనిని వెంబడించి పోవుచూ శ్రీదేవి ఇట్లు తలచింది.
శ్రీమన్నారాయణుడు ఎక్కడికి పోవుచున్నాడో చెప్పడు. దిక్కునెరుగని ఏ స్త్రీలు నాధా మమ్ము రక్షించు అనిపిలిచిన వారి మాటలు వినెనేమో, సోమకుడు వంటి రాక్షసుడెవరన్నా మరల వేదాపరహరణం చేయుచున్నాడేమో అసురులు మరల అమరావతిని ముట్టడించి ఇంద్రుణ్ణి తిరిగి పదవీచ్యుతుని గావించిరేమో, దుర్జనులు భక్తులను బాధించుచూ, ఏడిరా మీ విష్ణువును చూపించు అని వేధిస్తున్నారేమో, అని తర్జనభర్జనలలను సలుపుచు… (ఆ లక్ష్మీదేవి) తన భర్త ఏల పోవు చున్నాడో? ఎక్కడికి పోవుచున్నాడో తెలియక పోవుటచేత ఆ వివరము తెలుసు కొనుటకు, స్థానభ్రంశము నొందిన తన పయ్యెదను కూడా సరిజేసుకొనుట మఱచినదాయెను. వీడి పోయిన కొప్పును సరిదిద్ద దాయెను. వదలుగా నుండి జారుచున్న మొలనూలును బిగించుకొనదాయెను. కోటి చంద్రకాంతులీను ముఖమున నొసటి బొట్టు చెదరిపోయి, పైట చెంగుగుంజుకుని పోతున్న ప్రాణనాధుని నిలువరించలేక స్తన భారంచే వంగిన నడుముగలదైయుండెను.
తా॥ వేగముగాబోవుచున్న పతిని (ఎక్కడికి పోవుచున్నదీ) అడుగుదునా అని ఆమె తడబడెను. ఆశ్రీదేవి యొక్కజడ ముడి ఊడిపోయింది. అతడు నడుస్తున్న తన అడుగులను ఆపడు. పోనీ తనెక్కడికి పోతున్నదీ చెప్పడు. సుడిగాలిలొ విడిపోయి తన భార్య : జంటను ఆశ్రీహరి విడిచిపెట్టాడు.
తన పయ్యెదను వీడక వేగముగా బోవుచున్న పతి ననుసరించు లక్ష్మీదేవి, కారుమేఘము వెంబడి ఆకాశవీధిలో పరుగులెత్తెడి మెరుపుతీగవలె తోచినది. ఆమె యొక్క ముంగురులను జూచి తుమ్మెదలు (వాటి కాంతికి భ్రమపడి) ఆదేవి మోము నిండా మూగినవి. ఎటులనోవానిని వదలించుకుంటే, ఆమె పెదవులని దొండపండ్లని భ్రమపడి చిలుకలు వాటిని తినుటకు యత్నించినవి. వాటిని ఎట్లో వదలించుకుంటే, మందాకినీ నదియందుండు గండుమీనములు ఆ రమాదేవి నేత్రములను చలించు చేపపిల్లలని తలంచి వానిని కబళించుటకు యత్నించినవి. వాటిని ఏదోవిధముగా తరిమివేస్తే ఆమె శరీరమును లతయని భ్రమించి దానితో పోటీపడుటకు మెఱుపులు ఆకాశమునందు వరుసలు దీరినవి. ఆ మెఱుపులను గెలుచుటకై చక్రవాకము లేతెంచి, ఆదేవి కుచములను తమ వంటి పిట్టలుగా భావించి తమ పరాక్రమమును వాటిపై చూపుటకు యత్నించ సాగినవి. (ఇచ్చట భ్రాంతిమదాలంకారము విశేషముగా ఉపయోగించబడినది. జరిగిన సంఘటన మెరిసే దేహచ్ఛాయ గల లక్ష్మీదేవి నల్లని మేఘ సదృశ శరీరుడైన విష్ణువుని వెంబడి పరువులెట్టింది అని అర్థం)
ఆ ఆకాశమార్గంలో శ్రీమహావిష్ణువు పరుగెడుతున్నాడు. రాక్షసులప్రాణములను కడతేర్చువాడును, దయాసాగరుడును, యోగీంద్రులహృదయ మందు స్థిరంగా నివసించువాడును, తనభక్తులకు గూడ మహిమలు గల్పించువాడును, తన ఆశ్రితుల తప్పిదములను మన్నించు వాడునూ, సర్వకాలములయందును నూతన వధువు వలె అలంకరించుకోనువాడును అయిన ఆ విష్ణుమూర్తి ఆకాశమార్గమున ఆ కరిని బ్రోచుటకు అరుదెంచుచుండెను.
ఈ విధముగా పోవుచున్న విష్ణుని జూచి ఆకాశమార్గమున వేల్పులందరూ మూకగా గుమ్మిగూడి “అదిగో విష్ణువు వచ్చుచున్నాడు. అదిగో! లక్ష్మీదేవి అతని వెంబడి వచ్చుచున్నది. అదిగో పాంచజన్యము యొక్క గంభీరమైన ధ్వని ఎంత గొప్పగా వినబడుచున్నది! అదిగో! సుదర్శన చక్రము ఎంత అద్భుతంగా కనబడుచున్నది. అదిగో! వాటి వెంట అతి వేగముగా అరుదెంచుచున్న గరుత్మంతుడు అని చెప్పుకొనుచు ఆ గజేంద్రుని కాపాడుటకు పోవుచున్న ఆ చక్రియైన ఆవిష్ణువునకు ‘ఓం నమో నారాయణాయ’ యని కీర్తించుచున్నారు.
అట్లు దేవతలు కీర్తించుచున్న వారైయుండగా గజరాజును రక్షించుటయే తన పనియని పరుగిడుచున్న విష్ణువు వేల్పుల నమస్కారములను సైతము స్వీకరింపక మనోవేగమునకు సాటియగు వేగము గలవాడై చాల దూరము పోయి, కొంత దవ్వున శింశుమార చక్రమును దలపించు ఒక కొలనును గాంచెను.
(ఆ కొలనులో గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల జంటలు కలవు. శింశుమార చక్రమున గురు, మకర, కర్కాటక, మీన, మిథున రాశులున్నవి అని భావము). ఆ కొలను కుబేరుని కోశగారమును తలపింపజేయుచున్నది. దానివలె స్వచ్ఛ వరకచ్ఛపములతో భాగ్యవంతుని కోశాగార భాగ్యధేయము వలె పరాగ జీవనంబై యున్నది. (ఆ కొలనులో తెల్లని తాబేళ్ళతో, విరజిమ్మబడిన పుప్పొడితోనూ ఉ న్నదనియు, కుబేరుని భాండాగారము వరకచ్ఛపములు అను పేరుగల నిధులతో ఉన్నది). ఆ కొలను వైకుంఠ పట్టణమువలె నున్నది. (వైకుంఠపురమున పాంచజన్యము అను శంఖము, సుదర్శనమనెడి చక్రము, కమల అనబడు లక్ష్మీదేవి ఉన్నాయి. కొలనులో శంకువులు, చక్రవాకపక్షులు, పద్మములు గలవు). పరస్పరము వైరిభావముగల కరి, మకరములు సంఘర్షణ జరుపుచు కరి దైవప్రార్థనము నందు, మొసలి శత్రు నిర్మూలనా వ్యూహమందు (సంసార తాపత్రయముతో) సతమత మగుచున్నారు. మకరి వలెనుండు వారికి నశించుట తిరుగులేని విధి. ఇట్టి ఆ తామరకొలనును విష్ణుమూర్తి తిలకించెను.
బాధజెందు వారి కష్టములను జూచి ఓర్వలేని దయాళు వైన నారాయణుడు ఆ మకరమును ఖండింప దలంచి, వేగముగా బోవునదియు, భూమండలమునంతయూ కదిలించ గలిగినదియు, సూర్యుని కంటే ఎక్కువ కాంతి గలిగిన మిణుగురులను రాల్చునదియు, పదునాలుగు భువనములలో గల బ్రహ్మాండమునందు అడ్డము లేక వ్యాపించునట్టిదియు, వేల్పుల నందరిని వారి శత్రువులనుండి రక్షించునదియునైన తన సుదర్శన చక్రాయుధమును బంపెను.
ఆ సుదర్శన చక్రము ఆ తామర కొలనులో నళినీ కాంతతో గూడి, కౌగిలించి, జలక్రీడలాడుచు యధేచ్ఛగా ఆ పూబాలకు ప్రీతి సలుపుట కేతెంచిన వేడివెలుగుల సూర్యుడను పురుషుడా అన్నట్లున్నది. ఆ సుదర్శన చక్రము గుభిల్ుభిల్లను ధ్వనితో ఆ కొలనంతయూ క్రుంగిపోవునట్లు లోపలికి ప్రవేశించి, క్రూరమైన ఆ మగమొసలి యున్న చోటికి బోయి మనోవేగమును బోలు వేగము గలదై…
ఆ సుదర్శన చక్రము అతి భయంకరంగా, బంగారు కాంతులు ప్రదర్శిస్తూ, భీతిచేత మనస్సులో అనేక విధముల ప్రార్థించుచున్న గజేంద్రుని నిలిపిరక్షించగా, కామక్రోధములతో నిండినదై మంచియత్నము ఆచక్రము చేయగ రక్తములు చిందెను. ఆ విష్ణువు ఆ దుర్మార్గమొందిన మొసలి శిరస్సును ఖండించెను. ఈ విధముగా ఒక్క వేటున ఆ సుదర్శన చక్రము ఆమకరి యొక్క శిరచ్ఛేదనముగావించెను.
ఆ వెంటనే ఒక మకరము రాశిచక్రమును జేరెను. (మకరరాశి) ఒకమకరము కుబేరుని బొక్కసమునదాగెను. ఆమకరాలయంబున (కొలనుయందు) సంచరించు తక్కిన మకరములు ఆదికూర్మము యొక్క మరుగున జొచ్చెను. అనగా విష్ణువునే శరణువేడెననవి భావము. (చమత్కారము గమనించిన ఇది అతిశయోక్తి, సూర్యుని వద్దను, కుబేరుని వద్దను, కూర్మముల వద్దను ఉన్న రాశి, ధన, సహచర రూపమకరములన్నియూ, ఇచ్చటివేనని అభిప్రాయము)
రాహువు మ్రింగబడి విడిచిపెట్టబడిన చంద్రుని వలె, సంసారమున జిక్కియల్లాడి విముక్తుడయిన విరాగివలె ఆ గజేంద్రుడు మొసలి బారి నుంచి తప్పించుకుని, కాళ్ళు విదిలించి దిగ్గజేంద్రముల రాణులయిన ఆశకరిణి మొదలయిన వారు తమ తొండములతో జిమ్మిన చల్లని జలములయందు సేదదీరి మిక్కిలి అందముతో ప్రకాశించెను.
అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగరమున బుట్టినదియు, తన గొప్పధ్వనిచే భూతములనన్నింటినీ కదలించు నదియునూ, తెల్లనైన తన తేజస్సుతో ఇంద్రాదులను సైతము భయపెట్టగలిగినదియు, భక్తుల ఆపదలు బాపు నట్టిదియు, శత్రుసేనలనుదిక్కులందు దరిమిగొట్ట గలదియు యైన తన పాంచజన్య శంఖమును పూరించెను. శ్రీమహావిష్ణువు శంఖము పూరించు నప్పుడు దేవదుందుంభులు మ్రోగెను. మంద మారుతము తామరపూల వాసనతో మిళితమై వీచెను. ముసురు పట్టి పుష్పవర్షము కురిసెను. వేడుకతో అప్సరసలు నృత్యములను సలిపిరి. అన్నివైపులా జయజయ ధ్వానములు మారు మ్రోగెను.
సముద్రుడనెడి పురుషుడు తన అలలు అనెడి చేతులతో ఆకాశగంగ అనెడి లలనా రత్నము యొక్క ముఖమును ముద్దాడ నాసించుచున్నాడా అన్నట్లు సముద్రుడు మిన్ను ముట్టు అలలను పైకి విస్తరింప జేసెను. (శుకమహర్షి ఇట్లునుచున్నాడు) ఓ పరీక్షిన్మహారాజా! విష్ణువు తన పొడవైన చేతితో నా కరిరాజును మడుగునుండి మెల్లగా బయటకు తీసి, దానిమదజల మరకలను శుభ్రపడునట్లు తుడిచి, వీపునమెల్లగా చరచి దాని భయమును తొలగించెను.
అట్లు విష్ణువు గజేంద్రుని భయమును నిర్మూలించగానే ఆ కరిరాజు దేహము యొక్క బడలిక విడిచిపెట్టి ఆడ ఏనుగులతో జేరి ఎక్కువ మక్కువతో శ్రోతల వీనులకు విందుగా ఘీంకారము చేసెను. గజేంద్రుడు ఆ విధముగా శ్రీహరి దయచే బ్రతికి వచ్చుట జూచి ఆడ ఏనుగులన్నియు మహానురాగము గలవై దానిని జుట్టుకొని తమ తొండములతో దొండములను బెనవైచికొనినవి.
ఓ పరీక్షిన్మహారాజా! తొల్లి దేవల మహర్షి శాపముచే మొసలి రూపంబునొందిన ‘హూహూ’ అని పిలవుబడు గంధర్వుడు నేడు విష్ణు చక్రంబుచే సంహరించబడి శాపవిముక్తుడై పూర్వరూపము దాల్చి నాశరహితుడగు నారాయణుని అధికమైన భక్తితో మ్రొక్కి పట్టుదలతో విష్ణుని బాగుగా కీర్తించి భగవన్నామ సంకీర్తనము జేయుచు తన పాపంబుల నెల్ల ప్రక్షాళనము గావించుకొని తన గంధర్వరూపమును తిరిగి బొందుటచే గంధర్వలోకము జేరెను. అప్పుడా గజేంద్రుని శ్రీహరి తన చేతితో తాకి, ఆ కరి అవిద్యనశించి విష్ణురూపియై వెలుగొందుచుండెను. ఆ విధంగా కరిమోక్షమెందెను.
ఓ పరీక్షిన్మహారాజా! మకరముతో బోరు సలిపి పలు ఇక్కట్లు పాలయిన గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతమును తెలిపెదను వినుము. అతను గత జన్మంబున ఇంద్రద్యుమ్నుడను రాజు. గొప్ప విష్ణుభక్తుడూ అతడొక్క కొండకొనపై కూర్చుండి మౌనవ్రతుండై సర్వేశ్వరుడగు నారాయణమూర్తి ధ్యానములో ఆతని పూజయందు నిమగ్నుడైయుండెను.
మౌనవ్రతుడై నిశ్చల చిత్తుడైయున్న ఆ ఇంద్రద్యుమ్నుని జూచి ఆగస్త్యమహాముని అతని సమీపంబున కొచ్చి, తనను చూచి వందన పూర్వకముగా నిలువబడని అతనిపై ఆగ్రహించి మునులకు అతిథి సత్కారముగాని, మన్ననగాని చేయకమదపుటేనుగు వలె ప్రవర్తించిన నీవు అడవిలో ఏనుగువై బలగర్వముతో అజ్ఞానిపై జీవింపుము అని శపించెను. స్వతహా బుద్ధిమంతుడైనప్పటికీ, ఆగస్త్యుని వంటి బ్రాహ్మణుని అవమానించిన ఫలితంగా అడవిమృగమైన కరిజన్మనొందెను. ఓరాజా! తపస్సే జీవనంగా జీవించే బ్రాహ్మణులను ఏనాడు అవమానపరచరాదు. అట్లుచేసిన ఫలితములు ప్రమాదకరముగా నుండునని గ్రహింపుము.
ఆతని విష్ణుభక్తి విశేషముచే ఏనుగులకు రాజై గొప్పబలవంతు డాయెను. ఆరాజ పరివారంకూడా ఏనుగు జన్మలనే బొందిరి. ఈ విధముగా కరిజన్మమునకూడ విష్ణు ధ్యానము మానక ఆయన కటాక్షము చేత శాశ్వత మోక్షప్రాప్తినొందెను.
నేల విడిచి కత్తిసాము చేయుట యెంత ప్రమాదమో నరులకు తమ కర్తవ్యము వదలి అన్యధర్మముల నాశ్రయించుటయూ అంత అపాయకరమే. ఇహపరములను రెంటినీ దలచుచు సమముగా వర్తించవలెను. అదియే భగవంతుని సంతోషపెట్టును. ఒక చిన్న తప్పిదమువల్ల ఇంద్రద్యుమ్నుడంతటి ఉత్తముడు మృగజన్మము నెత్తిననూ ఆ పరమాత్మకృప అతని వెంట సదా నీడలా ఉన్నది. కనుకనే భగవంతుని ప్రార్థించ గలిగి ముక్తుడైనాడు. ఇంద్రద్యుమ్నునిగా సాధించలేనిది కరీంద్రునిగా సాధించగలిగాడు. కర్మఫలం క్షీణించవలెనంటే విష్ణు భక్తి అత్యావశ్యకము. గర్వము మొదలైన చెడు గుణములను తొలగించి ఆ భక్తి సన్మార్గంలో నడుపుతుంది. చిన్న విత్తనంగా నాటబడిన విష్ణుప్రియత్వం భక్తి అనే గొప్ప వటవృక్షమై కాపాడుతుంది.
భగవద్భక్తి లేని అల్పబుద్ధులకు ఏనుగులు, గుర్రములు, ధనములు, వంటి భోగములు నశించిపోవును. తన సతీ సుతులు చెడిపాడై పోయెదరు. సుగుణవంతులైన వారికి పై జెప్పిన భోగములన్నీ జీవితకాలమున కలుగుటయే గాక చెడని వస్తువైన విష్ణు భక్తి కలిగి, అధికమై ముక్తి అప్పుడు జగన్నాయకుడైన ఆ పరమేశ్వరుడు (శ్రీమహావిష్ణువు) గజేంద్రుని శాప విమోచనా వృత్తాంతమంతయు పద్మముఖియైన లక్ష్మీదేవి కెరింగించి, ఆమెతో ఇట్లనెను. ఓ పద్మముఖీ! నీవు నావెంబడివచ్చు నప్పుడు నీ పైట కూడా నా చేత బట్టుకొని వదలకుండా ఈడ్చుకొని పోవుచున్న నన్ను జూచి ఏమనుకొంటివి? దేవి!
ఆ॥ మఱతు వారి నేను మఱచిన నను వారు
మఱువబోను నన్ను మఱువకున్న
మొఱలు బాపి కాతు మొఱలెరుంగక గొల్వ
పరిగణించి నన్ను పరమ గతిగ
(పోతన గారి ‘ఏఱుగుదు దెఱువా…’ ఆధారంగా)
తా॥ ఓదేవీ! నన్ను మఱచిన వారిని నేను మఱతును. నన్ను మఱువని వారిని నేను మఱువను. కపటములేక నన్నే పరమగతిగ యెంచిన వారి దుఃఖములను తొలగించి రక్షించెదను.
అట్లు విష్ణుమూర్తి పలికిన పలుకుల నాలకించి కమల నివాసినియైన లక్ష్మీదేవి చిరునవ్వుతో నిట్లనియె. సకలలోక నాయకుడవైన ఓ ప్రాణేశ్వరా! తమరి దివ్యపాదారవిందములను నామనంబున నిలుపుకొని ధ్యానించుటకంటే నాకు వేరేపని ఏముండును? కావున అసంకల్పితముగా నిన్ననుసరించితిని గాని వేరేమి కాదు.
స్వామి! దు:ఖితుల ఆర్తిని దీర్చుటకు వారికి లోబడి వారి మొరలనువిని వారి ఆపదలను దొలగించి వారిని కాపాడి. వారిచే కీర్తించబడెదవు. నీకు తప్ప అన్యులకు, దీనులను కాపాడుట సాధ్యము కాదు.
ఆ శ్రీ లక్ష్మీదేవి ముందు చెప్పిన మాటలే గాక యింకను ఎన్నియో తగు మాటలు మాట్లాడి ప్రేమ తొణికిస లాడు చూపులతో పతిని వీక్షించగా ఆమెను కౌగిలించి శ్రీహరి, నారద, విష్వక్సేన సహితమౌ పరివారము వెంట రాగా సతితో గరుత్మంతు నధిరోహించి వైకుంఠమున కేగెను. ఈప్రకారంబు గజేంద్రుని వృత్తాంతము నెరింగించి, ఇంకను ఇట్లననెను. ఓ పరీక్షిన్మహారాజా! నీకు నేను వినిపించిన శ్రీకృష్ణుని మహిమను దెలిపెడి గజేంద్ర మోక్షము కథ వినువారికి నెక్కువ కీర్తికలుగును. ఈ గజేంద్ర మోక్షము పాపంబుల నన్నింటిని పోగొట్టి మేలుజేయును. ఈ కథను విన్నవారికి దుస్స్వప్నములు రావు. దిగులు, ఆరాటములు నశించును.
ప్రతిదినము వేకువ జామున మేల్కొని పరిశుద్ధ మనస్కులై దీనిని పఠించిన విప్రులకు, పండితులకు సకలైశ్వర్యములు కలుగును. సకలవ్యాధులును నెమ్మళించును. సకల సౌఖ్యములు కలుగును. మేలుపొందును. ఇక తనువు చాలించిన పిదప మోక్షసిద్ధి తధ్యము. సకలానందములు కలుగును, అని శ్రీమహావిష్ణువు సంతోష పూర్వకముగా నానతిచ్చెను. గజేంద్రునిబోలిన నాభక్తులకు నాలుగు విధములైన మోక్షముల నిచ్చెదను.
ఆపైన హృషీకేశుడయిన శ్రీహరి గజేంద్రునికి మోక్షము నిప్పించిన ఈ కొలను అనిన నాకెంతో ప్రీతి. త్రిమూర్తుల మయిన బ్రహ్మ, శంకరుడు, నేనునూ విహరించెదము. అనిచెప్పి పక్షిణేడు గరుత్మంతునిపై శ్రీలక్ష్మి నారాయణుడు వైకుంఠము జేరెను, అని శుకమహార్షి పరీక్షిన్మహారాజు కిట్లనియె ఈ గజేంద్ర మోక్షమును శ్రద్ధగా పఠించినా, వినినా ఇహలోకంబున శ్రీహరి గజ, తురగ, రథములు మొదలైన వాహన సౌఖ్యము కలుగు జేయును. అంత్యకాలమున నారాయణుని నామము బలుకు శక్తినొసంగును.
ఇది మహాకవి బమ్మెర పోతనామాత్యునిచే రచించబడిన శ్రీమత్ భాగవతములోని నవమస్కందమున నున్న గజేంద్రమోక్షమను ఉపాఖ్యానము ననుసరించి సరళ తెలుగు వచనములో కీ॥శే॥ అలమరవాది రామకృష్ణయ్య, సుబ్బమ్మ గార్ల పుత్రుడైన సుబ్రహ్మణ్య దీక్షితులచే శ్రీమన్నారాయణుని కృపా భాగ్యప్రాప్తిచే వ్రాయబడిన కృతి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము
2. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు
3. ఈ బౌతికదేహానంతరం నేను అప్రమత్తుడను.
4. నాభక్తులకు రక్షణ నాసమాధినుండియే వెలువడుచుండును. 5. నా సమాధినుండియే నామనుష్యరూపము మాట్లాడును.
6. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నా యందు యెవరికి దృష్టికలదో, వారియందే నా కటాక్షము. 8. మీ భారములు నా పై పడవేయుడు. నేను మోసెదను.
9. నా సహాయముగాని, సలహాగాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
10. నా భక్తుల యింట ‘లేమి’ యను శబ్దము పొడసూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో మంత్ర పుష్పం అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్సైట్ నందు మంత్ర పుష్పం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
નૈમીષારણ્યના ક્ષેત્રમાં ગંગા અને યમુનાના સંગમ સ્થળ પર એક ખુબજ મોટા યજ્ઞુ અનુષ્ઠાન થયું. તેમાં વ્યાસજના શિષ્ય સુતજી પણ આવ્યા.મુનિયોએ સુતજીનુ સ્વાગત કર્યુ અને તત્વ જ્ઞાન સંભળાવવાની પ્રાર્થના કરી. સુતજીએ કહ્યું કે સંપૂર્ણ વિદ્યાઓમાં ચૌદ વિદ્યાનો સમાવેશ થાય છે.આ ચૌદ-ચાર વેદ, છ શાસ્ત્ર અને મીમાંસી ધર્મ શાસ્ત્ર, ન્યાય તથા પૃરાણ મળીને થાય છે.એમાં જ્યારે ધનુર્વેદ,આયુર્વેદ, ગંધર્વવેદ અને અર્થશાસ્રનં મેળળી
દેવામાં આવે તો અઠાર થઈ જાય છે.સુતજી એ બતાવ્યુ ક ભગવાન શંકર અઢાર વિદ્યાઓના જન્મદાતા છે અને તેમણે સૌથી પહેલા બ્રહ્માજને આ વિદા આપી અને પછી વિષ્ણુજીએ સંસારને રક્ષા માટે શક્તિ આપી.બ્રહ્માજીએ પુરાણોનો વિસ્તાર કર્યો અને પછી પોતાના ચાર મુખેથી ચાર વેદોની રચના કરી વેદો પછી બધા શાસ્રનની ઉત્પતિ થઈ.
વિષ્ગુજએ વેદ શાસ્ત્રનો ઉયોગ્યરૂપે વિસ્તાર કરવા માટે વ્યાસજીના રૂપમાં અવતાર લીધો તેમણે વેદોને ચારભાગમાં વિભાજીત કર્યા અને પછી ચાર લાખ શ્લોકોની રચના કરીને પુરાણોને સામાન્ય જન સુધી સુલભ બનાવ્યુ.એક સમયે બધા મુનિ ઈશ્વરિય સત્તાના રહસ્યોને ન જાંણતા હોવાથી બ્રહહ્માની પાસે ગયા. બ્રહ્માજીએ મુનિઓને બતાવ્યુ કે ભગવાન શંકરજ એકમાત્ર પરમેશ્વર છે અને હું તેમની ઈછ્છાથી જ પ્રજાપતિ પદ પામ્યો છું ભગવાન શંકરના ત્રણ રૂપ છે સ્થુથ, સુક્ષ્મ અને સુક્ષ्માતિ સુક્ષ्મ સ્થુળ રૂ૫ દેવોને સુક્ષ्મ યોગિઓને અને અતિસુક્ષ्મા તિસુક્ષ્મ રૂ૫ ભક્તોને દેખાય છે.ગુરનુ ખુબ મહત્ત્વ છે કારણ ક ગુરૂની કૃપાથી સાધકના માર્ગના વિધ્નો દુર થાય છે.
બ્રહ્માજીએ ઋષિઓને કહ્યું ક ઈજ્વરિય શિવતત્વને જાણવા માટે તમે લોકો યજનુ આયોજન કરો. યજની સમાપ્તિથી તમને શિવ તત્વનો મર્મ આવાહિત વાયુ દ્વારા સમજાવવામાં આવશે ત્યારબાદ તમે વારાણસીમાં જઈને શિવ પાર્વતીની પુજા કરી કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરશો. હું તમને મનોમય ચક્ર આપુ છું તમે તેની પાછળ પાછળ જાવ જયાં તેની નેમી તુટી જાય ત્યાં એક મોટા યજનુ આયોજન કરો.
ચક્ર નૈમિષારણ્યમાં ૫ડયુ અને ત્યાંજ યજ કરવામાં आव्यो. યશ્ઞ સમામ્ત થતા વાયુદેવ પ્રગટ થયા અને તેમણે મુનિઓએ શિવતત્વને સમજાવવાનુ નિવેદન કર્યુ ત્યારે વાયુદેવે તેમને બતાવ્યુ કે શ્વેતરૂપ એકવીસમાન કલ્પમાં વિર્યના નિર્માણ માટે બ્રહ્માજીએ ઘોર તપ કરીને શિવજીને પ્રસન કર્યા શિવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રહ્માજને બ્રહ્મ જાન આપી તે બ્રહ જાનને में પોતાના તપના બળ પર બ્રહ્માજી પાસેથી મેળવ્યુ આ જાન પશુ, પાશ અને ગતિની સંજાવાળા છે.
ક્ષર મ્રકૃતિ માયા છે અને તેના મૂળ કર્મથી યોગ રાખવાવાળો પુરૂષ છે. આ માયા શિવજીની જ શક્તિ છે ચિદ્રરૂપ માયાથી આવૃત થનાર છે અને આવૃત કરવાવાળા છે શિવના દ્વારા ઉત્પન્ન મલ તે ક્પ્પિ છે. આ ચિદ્રૂપ જીવ કર્મફળ ભોગવવા માટે માયાથી આચ્છાદિત થઈને મૂથ વગેરેથી ઉત્પન્ન થાય છે અને મલના વિનાશ થવાથી મુક્ત થર્ઈ જા.ય છે.
પુરૂષને જાન ઉત્પન્ન કરાવવા વાળી શક્તિ એક વિદ્યા છે. ક્રિયા તેની કલા છે કાળ તેનો રાગ પ્રવર્તક અને દેશ ભક્તિ તેનુ નિયમન કરવાવાળી છે સત્ રજ અને તમ રૂપ પ્રકૃતિ જ અવ્યક્તનુ કારણ છે કલા ક્રિયાત્મક છે અને ઈશ્વરીય શક્તિને વ્યજંતિ કરવાવાળી છે તેનાથી સૃષ્ટીના પહેલા અનભિવ્યક્તિ હતા અને સૃટીની દશામાં અભિવ્યક્તિ થર્ઈ અને આ અભિવ્યક્તિમાં વિમોહિત આત્મા ત્રણેય ગુછોનો ભોક્તા છે આ આત્મા બુધ્ધિ,ઈન્દ્રિય શરીરથી અલગ છે કારણ સહિત તેનુ જ્ઞાન ખુબજ અઘરૂ છે આત્મા સર્વવ્યાપ્ત હોવા છતાં પણ જોઈ શકાતો નથી અને ન તો ગ્રહણ કરી શકાય છે તે નો માત્ર અનુભવ જજ કરી શકાય છે.
આ શરીર દુ:ખોને પ્રામ કરતા નાશ થર્ઈ જનારૂ છે આત્મા અનેક શરીરોમાં રહે છે અને એક શરીરના જીર્ક થવાથી બીજાને પ્રામ કરી લે છે.આ આત્મા શરીરથી કયારેક સંયુક્ત હોય છે. ક્યરરકક વિભક્ત જે અજ્ઞાની છે તે સુખ છ્રઃનો વિષય હોવાને કારણે સ્વર્ગ-નર્કમાં જાય છે. પરમાત્માની પ્રેરણાથી ભરેલા પશુ મતલબ જવરર્તા રૂપમાં દેખાય છે. પરંતુ તે કર્તા હોતા નથી. કત્તા तो પરમેશ્વર છે.
પરમાત્મા ક્ષર અને અક્ષરના સંયોગથી સંપૂર્ણ દ્રશ્ય અને અદ્રશ્યને પ્રગટ કરે છે, ધારણ કરે છે અને તે પોતાનામાં વિશ્વ છે અને વિશ્યના વિનાશક છે. આ સંસાર એક વૃક્ષના રૂપમાં છે તેમાં સરખી અવસ્થાવાળ જ્રાત્મા અને પરમાત્મા નિવાસ કરે છે જીવાત્મા આ વૃક્ષના કડવા-મીઠા ફળ ખાય છે અને સુખ દુ:ખ વેઠે છે પરમાત્મા જ્રવાત્માના રૂપમાં જોતા રહે છે અનં દસેય દિશાઓમાં પોતાના તેજ પ્રકાશ કરતો સાક્ષીના રૂમાં સ્થિર રહે છે આજ પરબ્રહ છે, તેનાથી જ મૂનિઓએ જવાનુ છે એજ પરમેશ શંકર છે.
કાળની ઉંમર અથવા ગાળાનુ પ્રમાણ ધણુ જ અઘરૂ છે તેનુ પ્રથમ પરિમાણ નિમેષ છે ૧૫ નિમેષોની એક કાષ્ઠા,૩૦ કાષ્ઠાઓની એક કલા અને ૩૦ કલાઓનુ એક મૂર્સત અને ૩૦ મુરૂર્તોનો એક દિવસ-રાત તથા ૧૫ દિવસરાતોનો એક પક્ષ+ થાય છે બે પક્ષો (શુક્ત અને કૃષ્ણ) નો એક મહિનો થાય
છે છ મહિનાઓનુ એક અયન થાય છે અને બે ઉતરાતયણ અને દક્ષિણાયન અયનોનુ એક વર્ષ થાય છે. મનુષ્યનુ એક વર્ષ દેવતાઓનો એક દિવસ થાય છે.આ પરિમાણથી મનુષ્યોના ઉ૬૦ વર્ષોના વીતવાથી દેવતાઓનુ એક વર્ષ થાય છે.દેવતાઓના વર્ષને અનુરૂ ૪૦૦૦ વર્ષનો સતયુગ, ૩૦૦૦ વર્ષનો ત્રેતા અને ૨૦૦૦ વર્ષોનો द્વાપર અને ૧૦૦૦ વર્ષોનો કલિયુગ થાય છે અને ૧૦૦૦ કલ્યોના વિતવાથી એક મન્વંતર થાય છે હજ સુધી વિતેલા
હજારો મન્વંતરોની ગણતરી શક્ય નથી. બ્રહ્માજીનો કલ્પ એક દિવસના બરાબર હોય છે અને હજાર કલ્પ એક વર્ષના સમાન બ્રહાજીને માટે આઠ હજાર વર્ષોની ગાળો એક યુગ હોય છે એક હજાર યુગોનો એક સવન થાય છે અને બ્રહ્માજીનુ આખુ આયુષ્ય ૩૦૦૦ સવન છે બ્રહ્માજી એક દિવસમાં ૧૪ ઈન્દ્ર હોય છે અને આખા આયુष्यમાં ૫ લાખ, ૪૦ હજાર ઈન્द्रोનો જન્મ અને નાશ થાય છે વિષ્ણુના એક દિવસમાં બ્રહ્માજીની રૂદ્રના એક દિવસમાં વિષ્ણુજીની તથાં ઈશ્વરના એક દિવસમાં રૂદ્રનું આયુષ્ય સમાપ્ત થાય છે.
સૃષ્ટીથી પ્રલય સુધી બ્રહ્માજની પુર્વાર્ધ અને પરાર્ધ વાળુ આખુ આયુષ્ય પુરૂ થઈ જાય છે.જયારે અવ્યક્ત આત્મા વિકાર ભર્યો થઈ્ઈ જાય છે ત્યારે તે પ્રધાન અને પુરૂષ ધર્મી થઈ્ઈ જાય છે તેનામાં તમોગુણ અને સતોગુણ સરખા પ્રમાણમાં રહે છે પરંતુ ગુણોની આ સમાનતા તેને તમોમય કરી દે છે અને તેના વિભાગ નથી થતા તે સમયે શાંત વાયુથી નિશ્ચલ જળમાં કંઈપણ ખબર પડતી નથી અને આ અજાણ્યા જગતની વગ્ચે મહે શ્વર પરમ મહે શ્વરી નિશ્ણાનુ સેવન કરે છે સવાર થતા જ પ્રકૃતીના પુરૂષના મધ્ય પ્રવૃષ્ઠ થવાથી મહે શ્વર મહાયોગથી આ બંનેને શ્રુમિત કરે છે. ત્યારે પરમ બ્રહ્મ મહેશ્વરની આજાથી સૃષ્ટીની ઉત્પતિ તથા પછી લય થાય છે
સૌથી પહેલા પુરૂષ અધિષ્ઠિત અવ્યક્તથી બુધ્ધિ વગેરેથી લઈને અનેક વિકાર ઉત્પન્ન થયા અને આ વિકારોથી અપ્રતિહિત શક્તિ અને અણીમાં વગેરે સિધ્ધિમાં સંપન્ન બ્રહભ્મા પછી વિષ્ણુ અને રૂદ્ર ઉત્પન્ન થયા. આ ત્રણેય દ્વવતા આ પુરૂષ પ્રકૃતિની આત્મા છે. જે જગતના સૃષ્ટા અને ઈશ્વર તત્વમાં રહેલા છે. ત્યારબાદ બુધ્ધિ ખ્યાતિ અને મતિ ઉત્પન્ન થયા પછી પાંચ કર્મેન્દ્રિયા પાંચ જાનેન્દ્રિયા અને અગિયારમુ મન મનના અહંકારથી ભુતાટી,તન્માત્રા અને તેનાથી શબ્દ પછી આકાશ પછી સ્પર્શ પછી વાયુ રૂપ તેજ અને તેજથી રસ, રસથી જળ જળથી ગંધ, ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને આ બાજુ પંચ મહાભૂતોથી ભર્યા આ જગત ઉત્પન્ન થયું.આ બધું મળીને એક અંડ ઉત્પન્ન
ગયો.એ અંડથી બ્રહ્મા ઉત્પન્ન થયા.તેજ બ્રહ્મા સૃષ્ટિના કર્મમાં ચાર મુખવાળા વિભક્તિઓથી ત્રિગુણ,ચારથી ચતુવ્યૂહ કહેવાયા આ અંડને ચારેબાજુથી દસ ગણુ તેજ,તેજથી દસ ગણો વાયુ,વાયુથી દસ ગણુ આકાશ,આકાશને પંચભૂત, પંચભૂતને મહ તત્વ અને તેને પ્રકૃતિ ઢાંકેલા છે. સંપૂર્ણ બ્રહાંડ પ્રકૃતિની સાથે આવરણથી ઢંકાયેલા છે અને આ આવૃત સાપેક્ષ છે.સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરવાવાળા દેવ પરસ્પર એંકબીજાને ધારણ કરે છે.
બ્રહ્માજના એક દિવસમાં ચૌદ મન્વંતર હોય છે એ દ્રષ્ટીથી એ બધાનુ વર્ણન ન કરી શકાય.કારણ કे તે અસંખ્ય છે.વર્તમાન વારાહ કલ્પના ચૌદ (સાત સ્વયંભુ, તથા સાત સાવનિક) મન્વંતર છે. અને આ સમયે સાતમો મન્વંતર ચાલી રહ્યો છે. પહેલા કલ્પની સમાત્તીથી અગ્નિદેવે સંસારને સળગાવ્યો અને પછી પાણીથી ભરાયેલા જોઈને પિતામહ બ્રહ્મા નારાયણ સ્વરૂપે જળની ઉપરજ સુઈ ગયા.તેથીજ તેમનુ નામ નારાયણ પડ્યુ પછી સવારે મુનિઓએ તેમની સ્તુતી કરી તેમને જગાડ્યા.નારાયણે જાગીને જ્યારે પોતાને એકલા જોયા તો તેમણે શિવજીનુ સ્મરણ કર્યુ અને તેમને એ પણ ખબર પડી ક પૃથ્વી પાણીમાં હુબી ગઈ છે.તેથી પૃથ્વીના ઉધ્ધાર માટે તેમણે વરાહનુ રૂ૫ ધારણ કર્યુ અને રસાતલમાંથી પૃથ્વીને કાઢી.
જ્યારે બ્રહહાજીએ સૃષ્ટિની ચિંતા કરી તો સૌથી પહેલા તમો મોહ, મહામોહ, તામિર્ત, અંદ્ર અને અવિદ્યા આ પાંચેયનો પાદુર્ભાવ થયો અને પછી બીજના ધડાની જેમ અંધકારથી ઘેરાયેલુ જગત દેખાવા લાગ્યુ ત્યારબાદ આસ્છાદિત આત્માવાળા વૃક્ષ, પર્વત વગેરેની સૃષ્ટિ બની ત્યારબાદ તેમણે નવી સૃષ્ટિનો વિચાર કર્યો તો ત્રાંસી ચાલવાવાળી સૃષ્ટિ બની ત્યારબાદ ફરી તેમણે સાત્વિક દેવસૃષ્ટિ બનાવી પછી પિતામહે માનવ સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીની પાંચમી અનુગ્રહ સૃષ્ટિ ચાર રીતે રહેલી છે. મહત્ત સૃષ્ટિ, તન્માત્રાઓની સૃષ્ટિ, વૈકારિક સૃષ્ટિ અને ક્રાન કર્મેન્દ્રિય સૃષ્ટિ એ સાથે તિર્થક સ્થાવર દેવ અને મનુષ્ય સૃષ્ટિ જોડાઈને આઠસૃષ્ટિઓ બને છે.
આ સર્ગોમાં બ્રહ્માજીએ સૌથી પહેલા સનત કુમારજને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ તેમણે ઘણુ જ તપ કર્યુ ઘણા સમય સુધી તપ કરવા છતાં કોઈ ફળ ન મળતા બ્રહ્માજીની આંખમાં આંસુ આવી ગયા અને આ આંસુઓથી પ્રેતોની સૃષ્ટિ બની.ત્યારબાદ બ્રહ્માજને ઘણી ગ્લાની થઈ અને તેમણે પોતાનુ શરીર છોડી દીધુ. ત્યારે પ્રજાપતિ પ્રગટ થયા અને તેમનાથી અગિયાર રૂદ્ર પ્રગટ થયા અને સૃષ્ટિ રચનામાં જોડાઈ ગયા શિવજીએ બ્રહ્માજીમાં મ્રાછોનો સંચાર કર્યો.
આ બધા રૂપ. મહેશ્ચથી ઉત્પન્ન થયેલા છે.સાક્ષાત ભગવાન અનેકરૂપ ધારણ કરે છે અને આ ત્રણેય એકબીજાથી ઉત્પન્ન થાય છે. એક હોવા છતાં એકબીજાથી મોટા થવાની હોડમાં રહે છે.શિવથી વધારે શક્તિ માંગવાને કારણે બ્રહ્મા ત૫ કરે છે. મેઘવાહન કલ્પમાં ભગવાન વિષ્ઝુએ દેવતાઓને દસ હજાર વર્ષ સુધી સુખ આપ્યુ.જે જોઈને મહેશ્વરે તેમને સર્वોતમ ભાવથી અવ્યક્ત શક્તિ આપી. જ્યારે બ્રહ્મા પોતાની પ્રજામાં વૃધ્ધિ ન જોતા શિવજન શરણમાં જાય છે પછી મહેશ્વરની ઈચ્છાથી કાલસ્વરૂપ ભગવાન રૂદ્ર પુત્રના રૂપમાં મ્રગટ થઈને બ્રહાને અનુગૃહિત કરે છે.
બ્રહ્માજએ જ્યારે જોયુ તો મારી સૃષ્ટિ વધતી નથી તો તેમણે મૈયુન સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો પરંતુ શિવે નારી જાતને ઉત્પન જ કરી ન હતી ત્યારે બ્રહ્માજએ તપ કર્યુ અને શંકર અર્ધનારીશ્વરા રૂપમાં પ્રગટ થયા. તેમણે બ્રહ્માના મનની વાત જાણી લીધી અને એક પરમ શક્તિ દ્વેવીને ઉત્પત્ન કર્યા. આ દેવીની સામે બ્રહ્માજીએ મૈથુન સૃષ્ટિ પ્રારંભ કરવા માટે નારીકુળની ઉત્પતિની માગણી કરી આ શક્તિથી વ્રહ્માજી પોતાના આધા શરીરથી મનુ નામવાળા પુત્રને ઉત્પન્ન કર્યો અને બાકી અડધાથી શતરૂપા નામની ચ્રીને મનુ અને સતરૂપે પ્રિયઘ્રત અને ઉત્તનપાદ નામના બે પુત્ર આકૃતિ, દેવદુતિ અને પ્રસુતિ નામની ત્રણ કન્યાઓને ઉત્પન્ન કરી પ્રસુતિના લગ્ન
દક્ષ સાથે અને આકૃતિના રૂચી પ્રજાપતિ સાથે થયા આક્કૃતિના યજ અને દક્ષિણા પુત્રપુત્રીના રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસુતિને ચોવીસ કન્યા ઉત્પન્ન થર્ઈ તેમાં તેર કન્યાના ધર્મ સાથે લગ્ન કર્યા પછી બાકી અગિયાર કન્યાઓના ભૃગુ,રૂદ્ર વગેરે ઋષિઓ સાથે લગ્ન કર્યા.દક્ષ પ્રજપતિની પુત્રી જ પિતા દ્વારા પોતાના પતિના અપમાનને સહન ન કરી શકી.તેને કારણે યજની અગ્નિમાં ભસ્મ થઈ ગર.પછી તે હિમાલયના ધરમાં પ્રગટ થઈ્ઈ અને કઠરર ત૫ કરીને શિવને પતિના ३૫પમાં પ્રામ કર્યા.
ભૃગુએ ખ્યાતિથી વિષ્ણુ પ્રિયા લક્ષ્મી નામની એક પુત્રી અને બીધા ઘાતા,વિદ્યાતા નામના બે પુત્રોને જનન્મ આપ્યો.પછી ધાતા-વિદ્યાતાની પરંપરામાં હજારો પુત્ર ઉત્પન્ન થયા. જે ભાર્ગવ કહેવાયા મરિચીએ સંભૂતીથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યા.આ વંશમાં કશ્ય૫ ઋષિ ઉત્પન્ન થયા.અંગિરાએ સ્મૃતિથી અગ્નોથ અને સરભ બે પુત્રો તથા ચાર પુત્રીઓ અને સૃષ્ટિ રચનામાં જોડાઈ ગયા શિવજીએ બ્રહ્માજીમાં મ્રાછોનો સંચાર કર્યો.
આ બધા રૂપ. મહેશ્ચથી ઉત્પન્ન થયેલા છે.સાક્ષાત ભગવાન અનેકરૂપ ધારણ કરે છે અને આ ત્રણેય એકબીજાથી ઉત્પન્ન થાય છે. એક હોવા છતાં એકબીજાથી મોટા થવાની હોડમાં રહે છે.શિવથી વધારે શક્તિ માંગવાને કારણે બ્રહ્મા ત૫ કરે છે. મેઘવાહન કલ્પમાં ભગવાન વિષ્ઝુએ દેવતાઓને દસ હજાર વર્ષ સુધી સુખ આપ્યુ.જે જોઈને મહેશ્વરે તેમને સર્वોતમ ભાવથી અવ્યક્ત શક્તિ આપી. જ્યારે બ્રહ્મા પોતાની પ્રજામાં વૃધ્ધિ ન જોતા શિવજન શરણમાં જાય છે પછી મહેશ્વરની ઈચ્છાથી કાલસ્વરૂપ ભગવાન રૂદ્ર પુત્રના રૂપમાં મ્રગટ થઈને બ્રહાને અનુગૃહિત કરે છે.
બ્રહ્માજએ જ્યારે જોયુ તો મારી સૃષ્ટિ વધતી નથી તો તેમણે મૈયુન સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો પરંતુ શિવે નારી જાતને ઉત્પન જ કરી ન હતી ત્યારે બ્રહ્માજએ તપ કર્યુ અને શંકર અર્ધનારીશ્વરા રૂપમાં પ્રગટ થયા. તેમણે બ્રહ્માના મનની વાત જાણી લીધી અને એક પરમ શક્તિ દ્વેવીને ઉત્પત્ન કર્યા. આ દેવીની સામે બ્રહ્માજીએ મૈથુન સૃષ્ટિ પ્રારંભ કરવા માટે નારીકુળની ઉત્પતિની માગણી કરી આ શક્તિથી વ્રહ્માજી
પોતાના આધા શરીરથી મનુ નામવાળા પુત્રને ઉત્પન્ન કર્યો અને બાકી અડધાથી શતરૂપા નામની ચ્રીને મનુ અને સતરૂપે પ્રિયઘ્રત અને ઉત્તનપાદ નામના બે પુત્ર આકૃતિ, દેવદુતિ અને પ્રસુતિ નામની ત્રણ કન્યાઓને ઉત્પન્ન કરી પ્રસુતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના રૂચી પ્રજાપતિ સાથે થયા આક્કૃતિના યજ અને દક્ષિણા પુત્રપુત્રીના રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસુતિને ચોવીસ કન્યા ઉત્પન્ન થર્ઈ તેમાં તેર કન્યાના ધર્મ સાથે લગ્ન કર્યા પછી બાકી અગિયાર કન્યાઓના ભૃગુ,રૂદ્ર વગેરે ઋષિઓ સાથે લગ્ન કર્યા.
દક્ષ પ્રજપતિની પુત્રી જ પિતા દ્વારા પોતાના પતિના અપમાનને સહન ન કરી શકી.તેને કારણે યજની અગ્નિમાં ભસ્મ થઈ ગર.પછી તે હિમાલયના ધરમાં પ્રગટ થઈ્ઈ અને કઠરર ત૫ કરીને શિવને પતિના ३૫પમાં પ્રામ કર્યા. ભૃગુએ ખ્યાતિથી વિષ્ણુ પ્રિયા લક્ષ્મી નામની એક પુત્રી અને બીધા ઘાતા,વિદ્યાતા નામના બે પુત્રોને જનન્મ આપ્યો.પછી ધાતા-વિદ્યાતાની પરંપરામાં હજારો પુત્ર ઉત્પન્ન થયા. જે ભાર્ગવ કહેવાયા મરિચીએ સંભૂતીથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યા.આ વંશમાં કશ્ય૫ ઋષિ ઉત્પન્ન થયા.અંગિરાએ સ્મૃતિથી અગ્નોથ અને સરભ બે પુત્રો તથા ચાર પુત્રીઓઉત્પન્ન કરી. પુલત્સ્યએ પ્રીતિથી દંતાગ્નિ પુત્ર ઉત્પન્ન કર્યો. જે અગત્સ્યા ના નામથી પ્રસિધ્ધ થયો.
થોડા સમય પછી પ્રજા વધવા લાગી અને શુંભ તથા નિશુંભ નામના દૈત્યો ઉત્પન્ન થયા આ हैત્યોએ ઈન્દ્રરાજને જીતીને સ્વર્ગ પર પોતાનુ અધિપત્ય જમાવી લીધુ આનાથી બ્રહ્માજ ઘણા ચિંતિત થયા અને તે શંકરની શરણમાં આવ્યા.ભક્તોના આગ્રહ કરવાથી ભોળાનાથ પાર્વતીની પાસે પહોંચ્યા અને નારી જાતિની નિંદા કરવા લાગ્યા. પાર્વતી બોલ્યા કે જો તમે નારીના નિંદનારા છો તો મારી સાથે કેમ રહો છો અને પાર્વતી એ તેમની પાસે તપ કરવા જવાની અનુમતિ માંગી. શિવજએ તેમને ઘણા સમજાવ્યા પરંતુ ઉમાને તે ભ્રમ થઈ ગયો ક શિવજીએ તેમના
કાળાપણાને કારણે નારીનુ અપમાન કર્યુ છે. તેમણે મોડે સુધી ત૫ કર્યુ ત્યાં એક સિંહ જે પહેલા ઉમાનુ માંસ ખાવા ઈં્છતો હતો તે તેમની સેવા કરવા લાગ્યો. આ બાજુ દાનવોથી ત્રાસીને દેવતાઓ ફરી બ્રહ્માજ પાસે આવી ગયા બ્રહ્માજીએ પાર્વતીની પાસ આવ્યા ત્યારે પાર્વતીજીએ તેમને કહ્યું ક શિવજીએ સૌથી પહેલા તમને ઉત્પન્ન કર્યા. તેથી તમે $જ$ મારા સૌથી પહેલા તમને ઉત્પન્ન કર્યા. તેથી તમે જ મારા સૌથી મોટા પુત્ર થયા અને પ્રજાની વૃધ્ધિ માટે ભગવાન શંકર તમારા મુખેથી પ્રગટ થયા આ નાતે તમે મારા સસરા થયા અને તમે મારા પિતા હિમાલયના પિતા છો તેથી તમે મારા પિતામહ થયા. મારા તપનો ઉદ્દેશ ગોરો વાન પ્રાપ્ત કરવાનો छे.
બ્રહ્માજીએ કહ્યું કે આ રૂપ પરિવર્તન તમે તમારી પસંદગીથી કરી શકો છો.આ સમયે તો તમે શુભ અને નિશુંભને મારવાની કૃપા કરો.પાર્વતી એ ગૌરીનુ ર૫ ધારણ કર્યુ અને ત્યાં ઉત્પન્ન કૌશિકી નામની કન્યા અનેક અસ્તશસ્ત્રને લઈને વિઘ્યાંચલની તરફ ચાલી નીકળી અને તેણે શુંભ-નિશુંભનો વધ કર્યો.ત્યારબાદ ગૌરી શિવજીની પાસે પાછા ફર્યા.શિવજએ તેમનુ સ્વાગત કર્યુ ઉમાએ કૌશીકી અને સિંહનો શિવજી સાથે પરિચય
કરાવ્યો ત્યારે શિવજીએ કૌशીકીને આરાધ્ય દેવીના રપમાં સિંહને નંદીના રૂપમાં પ્રતિષ્ઝિત કર્યા. શિવજએ વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે ઋષિઓને પૂછયુ કે હે ભગવાન એ બતાવો કે વેદોમાં શિવનુ સ્વરૂપ સવર્થા નિર્ગુણ કહેવામાં આવ્યું છે અને તેને સગુણ પણ કહેવામાં આવે છે. તો આ સગુણ અને નિર્ગુણ રૂપ જેમાં સંસાર રહેલો છે બંને એકજ છે કે અલગ-અલગ એક વિચારવાની વાત એ છે કે જો આ પરમ તત્વછ બધા પર પ્રેમ કરવાવાળુ છે તો બધાને એક સાથે મુક્ત કેમ નથી કરતા? પ્રારબ્ધ અને કર્મજ બંને ઈશ્વર પ્રદત્ત છે. આ બંનેમાં મુખ્ય કોણ છે.
મુનિઓની વાત સાંભળીને વાયુદેવ બોલ્યા-શિવજી સર્વતંત્ર છે પરંતુ સ્વતંત્રનો શબ્દનો અર્થ નિરપેક્ષ છે. જે વ્યક્તિ અનુગૃહિતને પરતંત્ર બનાવશે. તેનાથી નુકસાન થશે. જયાં સુધી અગુણ અને નિર્ગુણનો પ્રશન છે.સગુણ દ્વારા જ નિર્ગુણની પ્રાપ્તિ શક્ય છે. લાકડીમાં જે રીતે અગ્નિ હાજર રહે છે. દેખાતી નર્થી તેજ રીતે પરસ્પર સગુણ-નિર્ગુણ રહે છે. શિવજી અનુગ્રહ વાળા છે.નિગ્રહ નહીં જ્યારે કોઈ દોષ કરે છે.
તો શિવજી તેમને દંડ કરે છે. જો શિવ પોતાના ઈશરત્વને દંડ અને કૃપાથી સ્થાપિત ન કરે તો ઈશ્વર કેવી રીતે કહેવાશે. જો પાપીને દંડ ન આપવામાં આવે તો તે વધારે પાપ કરશે અને આ રીતે વ્યવસ્થા બગડશે. મૂર્તિમાં શિવનુ ઐદ્વર્ય છે શિવનો આદેશ જ શિવત્વ છે અને તેમનુ હિત અનુચ્રહં જેવી રીતે આગ સોનાને પિગળાવી દે છે. અંગારને પીગળાવતી નથી એજ રીતે શિવજી વ્યક્તિઓ પર કૃપ કરે છે અને દુષ્ટોને छંડ કરે છે.
જ્ઞાન અને અદ્વર્યની વિષમતા ઉંચી અને નીચી સ્થિતિનુ કારણ હોય છે. દેવતાઓની આઠ યોનિઓ ઘણી ઉત્તમ છે.મનુષ્ય મધ્ય યોનિમાં છે અને પશુની પાંચ યોનિઓ હોય છે ઉંચામાં (ંંચી યોનિમાં જવાનુ મનુષ્યના પોતાના વશમાં છે. પશુની આત્માના પણ સત રજ અને તમ ત્રણ ભેદ હોય છે. જો આ બધા ભેદો અને ઉપભેદોના કર્તા શિવજીની આજાનુ પાલન કરતા નથી તે દુ:ખી રહે છે.
જાનના બે પ્રકાર હોય છે. પરોક્ષ અને પ્રત્યક્ષ જે વ્યક્તિ અસ્થિર છે.તેને પરોક્ષ અને જે સ્થિર હોય છે.તેને અપરોક્ષ અથવા પ્રત્યેક્ષ કહેવામાં આવે છે હેતુ અને ઉદ્દેશ પરોક્ષ જાન છે.અપરોક્ષ માટે અનુष્ઠાન કરવામાં આવે છે અને ત્યારે તે પ્રાપ્પ થાય છે.તે માટે પ્રયત્ન જરૂરી છે. પ્રત્યક્ષ જાન મેળવવા માટે મોક્ષ મેળવવા માટે શિવની આરાધના મુખ્ય છે.આ પાંચ પ્રકારની છે ક્રિયા,જ્ય, તપ, ધ્યાન અને જાન વેદો પ્રમાણે ઉત્તમ અને અધર્મ ધર્મના બે રૂપ છે. ઈતિહાસ પુરાણ બધામાં શિવની આરાધનાને પરમ ધર્મના ૩૫માં માનવામાં આવે છે.શિવનુ રૂદ્રનામ એટલા માટે પડ્યુ કે તે દુ:ખ સુખને દુર કરવાવાળા છે તેમને પિતામહં એટલા માટે કહેવામાં આવે છે કે તે મૂર્તિમાન પિતા છે અને તેમની હંમેશાથી વિષ્ણુ નામની સંજા સર્વવ્યાપક હોવાને કારણે છે તે સર્વજ છે અને કોઈ અન્ય આત્માને આધિન નથી તેથી પરમાત્મા છે.
શિવજીનુ વ્રત ચૈત્રી પૂનમે કરવામાં આવે છે. તેરસના દિવસે નહાઈધોઈને આચાર્યની પુજી કરવી જોઈએ પછી તેમની આજા લઈને વર્ત્ર ધારણ કરીને માળા અને ચંદન વગેરેને ધારણ કરીને કુશના આસન પર બેસીને હાથમં કુશ લઈને આજીવન, બાર વરસ,છ વરસ,એક વરસ, મહિનો,દિવસ જેટલા દિવસ સુધી ઈચ્છા હોય તે સંકલ્પ કરો. ત્યારબાદ પંચાક્ષરી મંત્રનો પાઠ કરો અને પછી છાણનો એક કુંડ બનાવી તેને અગ્નીમાં રાખો અને જ હવિષ્ય અન્ન છે તેનુ ભોજન કરો.
બીજા દિવસે પણ અઆજ રીતે કરવુ જોઈએ. પુનમના દિવસે પહેલા બે દિવસની જેમજ પુજા કરવી બે વાર આચમન કરીને માથાથી પગ સુધી ત્રિપુંડ ષોડસોપચાર પુજા કરો. પુજાના પહેલા આવરણમાં શિવ, ગણેશ અને બ્રહા,બીજા આવરણમાં વિધ્નોનો નાશ કરવાવાળા અને ત્રીજા આવરણમાં વિધ્નોનો નાશ કરવાવાળા અને ત્રીજા આવરણમાં શિવની આઈ મૂર્તિઓ અને ચોથા આવરણમાં ગણેશ, મહાદેવના તથા પાં.યમાં આવરણમાં દિશાઓના સ્વામીઓનુ ધ્યાન કરવુ જોઈએ. રાત્રિમાં જમીન પર સુવુ જોઈએ અને અપવિત્ર વસ્તુઓથી દુર રહેવુ જોઈએ.
જુના સમયમાં વ્યાધ્રયાદના પુત્ર ઉપમન્યુ પોતાના પહેલા જન્મથીજ સિધ્ધ હતા અને તેજ કારણે મુનિ થઈઈ ગયા હતા. એક વખત તેમણે પોતાની માતા પાસે દુધ માંગ્યુ તો માં એ બનાવટી ઘોળ-ધોળીને દુધના રૂપમાં આપી દ્વીધુ.જ્યારે બાળકે ઘુંટડો ભર્યો ત્યારે માતાને ફરિયાદ કરી ક આ દુધ નથી. ત્યારે માં એ બાળકને સમજાવ્યું કે દુધ તો શિવજીની કૃપાથી મળશે.
શિવજીને પ્રસન્ન કરો. માં એ એ પણ કહ્યું ક પંચાક્ષર, મંત્રનો જાપ કરો. ત્યારે તેમણે ભસ્મ આપી અને કહ્યું કે આ ભસ્મથી ધણી-બધી મુશક્લીઓ ટળી જાય છે બાળકે પોતાના મનમાં આ વાતને ધારણ કરીને ભુખ્યો જ સુઈ ગયો.અડધી રાત્રે દરવાજામાં જોયુ તો શિવજી દુધનુ પાત્ર લઈને ઉભા છે.તેને લાગ્યુ કે શિવજ તેને બોલાવી રહ્યાં છે.શિવજને બહાર સમજને તે બહાર આવ્યો પરંતુ તેને કંઈજ દેખાયુ નહી તે છતાં પણ ચાલતો જ રહ્યો. થોડે દુર જઈને તેને શિવમંદિર દેખાયુ અને તેણે વિચાયું ક શિવજ તેમાં છુપાયેલા હશે. તેથી તે અંદર ચાલ્યો ગયો.
ત્યાં જઈને શિવલિંગથી વીંટળાઈને વારેવારે પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો.થોડી વારમાં એક પિશાચ મંદિરમાં આવ્યો અને તે બાળકને ઉઠાવીને નજીકના પર્વતમાં ગુફામાં લઈ ગયો. તો બાળકને ખાઈ જવાની ઈચ્છા થઈ. પરંતુ જેવો તે બાળકને મોમાં નાખવા લાગ્યો તેવા જ એક અજગરે તેને ૩સી લીધો બાળકનુ ગળુ સુકાઈ ગયુ હતું છતાં પણ તેના મુખમાંથી શિવજીના મંત્રનો જાપ ચાલુ હતો તેનુ ત૫ એટલુ પ્રભાવશાળી હતું કે તેનાથી વ્યાકુળ થઈને દેવતા લોકો શિવજની પાસે ગયા અને શિવજએ તેમને આશ્વાસ આપી પાછા મોકલી દીધા.
થોડીવાર પછી ઈન્દ્રનું ३૫ ધારણ કરીને શિવજ ઉપમન્યુની પાસે ગયા અને તેને વરદાન માંગવા માટે કહ્યુ. त्यારે ઉપમન્યુ બોલ્યો के મને શિવ ભક્તિનુ વરદાન આપો.તેના પર શિવજ બોલ્યા ક તુ શિવજની ભક્તિ છોડીને કોઈ બીજ દેવતાની ભક્તિ કરો અને પોતાનુ ઈસ્છિત ફળ મેળવો શિવજની નિંદા સાંભળી બાળક ઉપમન્યુ ધછો દુઃ: થયો અને ક્રોધિત થર્ઈ ગયો. તેછે પોતાની ભસ્મને મંત્ર બોલીને ઈન્દ્ર ઉપર ફંકી દીધી ઉપમન્યુ નીસા ભસ્મને નદીએ પોતાની ઉપર શ્રહછ કરી અને શિવજ બાળકની તપસ્યાથી પ્રસન્ન થયા તથા તેને પોતાના દર્શન કરાવ્યા ત્યારે ઉપમન્યુ ખુશ થઈન ભક્તિ વરદાન આપ્યુ. તે ઉપમન્યુ એ છે.જેણે શ્રીકૃષ્ઝે પાશુપાત વ્રતનુ જાન આપ્યુ. જેનાથી તેમને પુત્રની પ્રાપ્તિ થई.