Aranya Kanda Sarga 57 In Telugu – అరణ్యకాండ సప్తపంచాశః సర్గః

Aranya Kanda Sarga 57 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57వ సర్గ), సీతను కనిపెట్టలేక రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాన్ని మరింత విస్తృతంగా పరిశీలిస్తాడు. సీత కోసం ఈ ఇద్దరూ నిరంతరంగా అన్వేషణ చేస్తారు. రాముడు తన వ్యాకులతతో, సీత లేకుండా జీవించడం అసాధ్యమని భావిస్తాడు. లక్ష్మణుడు రాముని ధైర్యం చెప్పి, సీతను కనుగొనడం కోసం మరింత కృషి చేస్తాడు. అరణ్యంలో అనేక రాక్షసులను ఎదుర్కొంటారు, కానీ సీతను కనుగొనలేరు.

రామప్రత్యాగమనమ్

రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణమ్ |
నిహత్య రామో మారీచం తూర్ణం పథి నివర్తతే ||

1

తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీమ్ |
క్రూరస్వనోఽథ గోమాయుర్విననాదాస్య పృష్ఠతః ||

2

స తస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణమ్ |
చింతయామాస గోమాయోః స్వరేణ పరిశంకితః ||

3

అశుభం బత మన్యేఽహం గోమాయుర్వాశ్యతే యథా |
స్వస్తి స్యాదపి వైదేహ్యా రాక్షసైర్భక్షణం వినా ||

4

మారీచేన తు విజ్ఞాయ స్వరమాలంబ్య మామకమ్ |
విక్రుష్టం మృగరుపేణ లక్ష్మణః శృణుయాద్యది ||

5

స సౌమిత్రిః స్వరం శ్రుత్వా తాం చ హిత్వా చ మైథిలీమ్ |
తయైవ ప్రహితః క్షిప్రం మత్సకాశమిహైష్యతి ||

6

రాక్షసైః సహితైర్నూనం సీతాయా ఈప్సితో వధః |
కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మామ్ ||

7

దూరం నీత్వా తు మారీచో రాక్షసోఽభూచ్ఛరాహతః |
హా లక్ష్మణ హతోఽస్మీతి యద్వాక్యం వ్యాజహార చ ||

8

అపి స్వస్తి భవేత్తాభ్యాం రహితాభ్యాం మహావనే |
జనస్థాననిమిత్తం హి కృతవైరోఽస్మి రాక్షసైః ||

9

నిమిత్తాని చ ఘోరాణి దృశ్యంతేఽద్య బహూని చ |
ఇత్యేవం చింతయన్ రామః శ్రుత్వా గోమాయునిఃస్వనమ్ ||

10

ఆత్మనశ్చాపనయనాన్ మృగరూపేణ రక్షసా |
ఆజగమ జనస్థానం రాఘవః పరిశంకితః ||

11

తం దీనమనసో దీనమాసేదుర్మృగపక్షిణః |
సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుః స్వరాన్ ||

12

తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాణి రాఘవః |
న్యవర్తతాథ త్వరితో జవేనాశ్రమమాత్మనః ||

13

స తు సీతాం వరారోహాం లక్ష్మణం చ మహాబలమ్ |
ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః ||

14

తతో లక్ష్మణమాయాంతం దదర్శ విగతప్రభమ్ |
తతోఽవిదూరే రామేణ సమీయాయ స లక్ష్మణః ||

15

విషణ్ణః సువిషణ్ణేన దుఃఖితో దుఃఖభాగినా |
సంజగర్హేఽథ తం భ్రాతా జ్యేష్ఠో లక్ష్మణమాగతమ్ ||

16

విహాయ సీతాం విజనే వనే రాక్షససేవితే |
గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః ||

17

ఉవాచ మధురోదర్కమిదం పరుషమార్తిమత్ |
అహో లక్ష్మణ గర్హ్యం తే కృతం యస్త్వం విహాయ తామ్ ||

18

సీతామిహాగతః సౌమ్య కంచిత్ స్వస్తి భవేదిహ |
న మేఽస్తి సంశయో వీర సర్వథా జనకాత్మజా ||

19

వినష్టా భక్షితా వాపి రాక్షసైర్వనచారిభిః |
అశుభాన్యేవ భూయిష్ఠం యథా ప్రాదుర్భవంతి మే ||

20

అపి లక్ష్మణ సీతాయాః సామగ్ర్యం ప్రాప్నుయావహే |
జీవంత్యాః పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై ||

21

యథా వై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవమ్ |
వాశ్యంతే శకునాశ్చాపి ప్రదీప్తామభితో దిశమ్ |
అపి స్వస్తి భవేత్తస్యా రాజపుత్ర్యా మహాబల ||

22

ఇదం హి రక్షో మృగసన్నికాశం
ప్రలోభ్య మాం దూరమనుప్రయాతమ్ |
హతం కథంచిన్మహతా శ్రమేణ
స రాక్షసోఽభూన్మ్రియమాణ ఏవ ||

23

మనశ్చ మే దీనమిహాప్రహృష్టం
చక్షుశ్చ సవ్యం కురుతే వికారమ్ |
అసంశయం లక్ష్మణ నాస్తి సీతా
హృతా మృతా వా పథి వర్తతే వా ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 57 Meaning In Telugu PDF

లంకలో సీత పరిస్థితి ఇలాఉంటే, అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు, వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకున సూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణా అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి.

“అయ్యో! ఆ అరుపులు నావి అనుకొని, నాకేమైనా ఆపద కలిగిందని శంకించి, సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా! ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో! అవును ఇప్పుడు అంతా అర్థం అయింది. ఇది రాక్షసులు మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకొని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినపుడు హా సీతా! హా లక్ష్మణా! అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది.

నేను, లక్ష్మణుడు, దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా! అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో!దానికి తోడు అప శకునములు కూడా కనపడుతున్నాయి.” ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడి వడిగా వస్తున్నాడు.

ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి లక్ష్మణుని గురించి వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనను వెదుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది. దానితో పాటు దుఃఖం కూడా వచ్చింది. లక్ష్మణుని చేతులుపట్టుకొని ఇలా అన్నాడు.

“నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను. కానీ నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచి వచ్చావు. అలా ఎందుకు చేసావు. ఇంకా సీత క్షేమంగా ఉందంటావా? లక్ష్మణా! నాకు అన్నీ అపశకునములు కనపడుతున్నాయి. సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది. లేదా సీత సంహరింపబడి ఉంటుంది. రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు. ఇందులో సందేహం ఉండటానికి వీలు లేదు.

లక్ష్మణా! మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలము అంటావా! ఆ మృగాల అరుపులు, నక్కల కూతలు వింటుంటే సీత క్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది.

అసలు జరిగిందేమిటంటే, సీత ఆ మృగము కావాలని కోరిన తరువాత నేను ఆ మృగమును వెంబడించాను. ఆ మృగాన్ని నా బాణంతో కొట్టాను. నా బాణం తగిలిన ఆ మృగం పెద్దరాక్షసునిగా మారిపోయింది. అప్పుడు అర్థం అయింది అది రాక్షస మాయ అని. అందుకే అంటున్నాను.

ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి. లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒక వేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే, ఎంతో దూరం వెళ్లి ఉ డరు. మార్గ మధ్యంలోనే ఉంటారు.” అని రాముడు తనలో తాను అనుకుంటూ వడి వడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. అక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Aranya Kanda Sarga 56 In Telugu – అరణ్యకాండ షట్పంచాశః సర్గః

Aranya Kanda Sarga 56 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56వ సర్గ), సీతను రక్షించేందుకు రాముడు పంచవటిని చుట్టుముట్టి అన్వేషిస్తాడు, అనేక రాక్షసులను ఎదుర్కొంటాడు. సీతను కనుగొనలేక, రాముడు లక్ష్మణుడితో కలిసి మరింత విస్తృతంగా వెతుకుతాడు. ఈ సమయంలో, రాముడు సీత కోసం విచారంగా పాటలు పాడుతాడు. సీత కోసం తన ప్రాణాలను అర్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

వత్సరావధికరణమ్

సా తథోక్తా తు వైదేహీ నిర్భయా శోకకర్శితా |
తృణమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత ||

1

రాజా దశరథో నామ ధర్మసేతురివాచలః |
సత్యసంధః పరిజ్ఞాతో యస్య పుత్రః స రాఘవః ||

2

రామో నామ స ధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః |
దీర్ఘబాహుర్విశాలాక్షో దైవతం హి పతిర్మమ ||

3

ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతిః |
లక్ష్మణేన సహ భ్రాత్రా యస్తే ప్రాణాన్ హరిష్యతి ||

4

ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా స్యాం ధర్షితా బలాత్ |
శయితా త్వం హతః సంఖ్యే జనస్థానే యథా ఖరః ||

5

య ఏతే రాక్షసాః ప్రోక్తా ఘోరరూపా మహాబలాః |
రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పన్నగా యథా ||

6

తస్య జ్యావిప్రముక్తాస్తే శరాః కాంచనభూషణాః |
శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయః ||

7

అసురైర్వా సురైర్వా త్వం యద్యవధ్యోఽసి రావణ |
ఉత్పాద్య సుమహద్వైరం జీవంస్తస్య న మోక్ష్యసే ||

8

స తే జీవితశేషస్య రాఘవోంతకరో బలీ |
పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభమ్ ||

9

యది పశ్యేత్ స రామస్త్వాం రోషదీప్తేన చక్షుషా |
రక్షస్త్వమద్య నిర్దగ్ధో గచ్ఛేః సద్యః పరాభవమ్ ||

10

యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేత వా |
సాగరం శోషయేద్వాపి స సీతాం మోచయేదిహ ||

11

గతాయుస్త్వం గతశ్రీకో గతసత్త్వో గతేంద్రియః |
లంకా వైధవ్యసంయుక్తా త్వత్కృతేన భవిష్యతి ||

12

న తే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి |
యాఽహం నీతా వినాభావం పతిపార్శ్వాత్త్వయా వనే ||

13

స హి దైవతసంయుక్తో మమ భర్తా మహాద్యుతిః |
నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యో వసతి దండకే ||

14

స తే దర్పం బలం వీర్యముత్సేకం చ తథావిధమ్ |
అపనేష్యతి గాత్రేభ్యః శరవర్షేణ సంయుగే ||

15

యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః |
తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశం గతాః ||

16

మాం ప్రధృష్య స తే కాలః ప్రాప్తోఽయం రాక్షసాధమ |
ఆత్మనో రాక్షసానాం చ వధాయాంతఃపురస్య చ ||

17

న శక్యా యజ్ఞమధ్యస్థా వేదిః స్రుగ్భాండమండితా |
ద్విజాతిమంత్రపూతా చ చండాలేనావమర్దితుమ్ ||

18

తథాఽహం ధర్మనిత్యస్య ధర్మపత్నీ పతివ్రతా |
త్వయా స్ప్రష్టుం న శక్యాఽస్మి రాక్షసాధమ పాపినా ||

19

క్రీడంతీ రాజహంసేన పద్మషండేషు నిత్యదా |
హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకమ్ ||

20

ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధ వా ఖాదయస్వ వా |
నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస ||

21

న తు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః |
ఏవముక్త్వా తు వైదేహీ క్రోధాత్ సుపరుషం వచః ||

22

రావణం మైథిలీ తత్ర పునర్నోవాచ కించన |
సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణమ్ ||

23

ప్రత్యువాచ తతః సీతాం భయసందర్శనం వచః |
శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని ||

24

కాలేనానేన నాభ్యేషి యది మాం చారుహాసిని |
తతస్త్వాం ప్రాతరాశార్థం సూదాశ్ఛేత్స్యంతి లేశశః ||

25

ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణః శత్రురావణః |
రాక్షసీశ్చ తతః క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ ||

26

శీఘ్రమేవ హి రాక్షస్యో వికృతా ఘోరదర్శనాః |
దర్పమస్యా వినేష్యధ్వం మాంసశోణితభోజనాః ||

27

వచనాదేవ తాస్తస్య సుఘోరా రాక్షసీగణాః |
కృతప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్ ||

28

స తాః ప్రోవాచ రాజా తు రావణో ఘోరదర్శనః |
ప్రచాల్య చరణోత్కర్షైర్దారయన్నివ మేదినీమ్ ||

29

అశోకవనికామధ్యే మైథిలీ నీయతామియమ్ |
తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారితా ||

30

తత్రైనాం తర్జనైర్ఘోరైః పునః సాంత్వైశ్చ మైథిలీమ్ |
ఆనయధ్వం వశం సర్వా వన్యాం గజవధూమివ ||

31

ఇతి ప్రతిసమాదిష్టా రాక్షస్యో రావణేన తాః |
అశోకవనికాం జగ్ముర్మైథిలీం ప్రతిగృహ్య తు ||

32

సర్వకాలఫలైర్వృక్షైర్నానాపుష్పఫలైర్వృతామ్ |
సర్వకాలమదైశ్చాపి ద్విజైః సముపసేవితామ్ ||

33

సా తు శోకపరీతాంగీ మైథిలీ జనకాత్మజా |
రాక్షసీవశమాపన్నా వ్యాఘ్రీణాం హరిణీ యథా ||

34

శోకేన మహతా గ్రస్తా మైథిలీ జనకాత్మజా |
న శర్మ లభతే భీరుః పాశబద్ధా మృగీ యథా ||

35

న విందతే తత్ర తు శర్మ మైథిలీ
విరూపనేత్రాభిరతీవ తర్జితా |
పతిం స్మరంతీ దయితం చ దైవతం
విచేతనాఽభూద్భయశోకపీడితా ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 56 Meaning In Telugu

తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకూ రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలాఅంది..

“ఓ రావణా! ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజాను బాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు, నా భర్త. నా భర్తే నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయివేసినట్టయితే, నీసోదరుడు ఖర, దూషణులకు పట్టిన గతే నీకూపట్టి ఉండేది.

ఇందాకటినుండి, నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా! నా రాముని ధనుస్సునుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో!

నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావక పోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెరనుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది. నీ వైభవం నశించింది. నీ లంకా రాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది. అది తెలుసుకో!

నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీకు కూడా రాబోవు జన్మలలో భార్యవియోగం తప్పదు. వినాశకాలే విపరీతబుద్ధి అని నీకు పోయేకాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధిపుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞభూమిని. నన్ను నీ వంటి ఛండాలుడు తాకనుకూడా తాక జాలడు. నేను రాముని ధర్మ పత్నిని. నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలవని దానను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు.

నేను రాజహంసను. నీవు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు. చిత్రహింసలకు గురిచెయ్యి.. లేకపోతే చంపెయ్యి. నీనుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను. జాగ్రత్త!” అని పలికి తలవంచుకొని నిలుచుంది సీత.

సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు. కానీ సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు.

“ఓ సీతా! ఇంక నీవు ఏమి చెప్పినా నేను వినదలచుకోలేదు. నీకు పన్నెండు మాసాలు గడువు విధిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి, ముక్కలు ముక్కలు గా నరికించి, నాకు ఆహారంగా తయారు చేయించు కుంటాను. జాగ్రత్త!” అని పలికాడు.

సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. “మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చేయండి.” అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టు వలయాకారంలో నిలబడ్డారు.

“ఈ సీత రాజాంతఃపురములో ఉండటానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోక వనమునకు తీసుకొని వెళ్లండి. ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి. ప్రతిరోజూ ఈమెను బతిమాలో భయపెట్టో ఆమె మనసు నా మీద లగ్నం అయేట్టు చేయండి.” అని ఆదేశించాడు.

వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకొని వెళ్లారు. లంకారాజ్యములో ఉన్న అశోక వనము ఫలవృక్షములతోనూ పూల తోటలతోనూ, చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయ మానంగా ఉంది. ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండిసుకుమారంగా పెరిగిన సీత, భయంకారాకారులైన ఆ రాక్షసస్త్రీల ఆకారములు చూచి, అరుపులు విని భయంతో మూర్ఛపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57) >>

Aranya Kanda Sarga 55 In Telugu – అరణ్యకాండ పంచపంచాశః సర్గః

Aranya Kanda Sarga 55 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55వ సర్గ), శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవితో కలిసి పంచవటిలో నివసిస్తున్నారు. పంచవటిలో ఉన్నప్పుడు, రావణాసురుడు హరిణి రూపంలో వచ్చి సీతను అపహరిస్తాడు. సీతను రక్షించేందుకు లక్ష్మణుడికి ఆదేశాలు ఇచ్చిన రాముడు, సీత అందుబాటులో లేకపోవడంతో విచారంలో పడతాడు.

సీతావిలోభనోద్యమః

సందిశ్య రాక్షసాన్ ఘోరాన్ రావణోఽష్టౌ మహాబలాన్ |
ఆత్మానం బుద్ధివైక్లవ్యాత్ కృతకృత్యమమన్యత ||

1

స చింతయానో వైదేహీం కామబాణసమర్పితః |
ప్రవివేశ గృహం రమ్యం సీతాం ద్రష్టుమభిత్వరన్ ||

2

స ప్రవిశ్య తు తద్వేశ్మ రావణో రాక్షసాధిపః |
అపశ్యద్రాక్షసీమధ్యే సీతాం శోకపరాయణామ్ ||

3

అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితామ్ |
వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నావమర్ణవే ||

4

మృగయూథపరిభ్రష్టాం మృగీం శ్వభిరివావృతామ్ |
అధోముఖముఖీం సీతామభ్యేత్య చ నిశాచరః ||

5

తాం తు శోకపరాం దీనామవశాం రాక్షసాధిపః |
స బలాద్దర్శయామాస గృహం దేవగృహోపమమ్ ||

6

హర్మ్యప్రాసాదసంబాధం స్త్రీసహస్రనిషేవితమ్ |
నానాపక్షిగణైర్జుష్టం నానారత్నసమన్వితమ్ ||

7

కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి |
వజ్రవైడూర్యచిత్రైశ్చ స్తంభైర్దృష్టిమనోహరైః ||

8

దివ్యదుందుభినిర్హ్రాదం తప్తకాంచనతోరణమ్ |
సోపానం కాంచనం చిత్రమారురోహ తయా సహ ||

9

దాంతికా రాజతాశ్చైవ గవాక్షాః ప్రియదర్శనాః |
హేమజాలావృతాశ్చాసంస్తత్ర ప్రాసాదపంక్తయః ||

10

సుధామణివిచిత్రాణి భూమిభాగాని సర్వశః |
దశగ్రీవః స్వభవనే ప్రాదర్శయత మైథిలీమ్ ||

11

దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ నానావృక్షసమన్వితాః |
రావణో దర్శయామాస సీతాం శోకపరాయణామ్ ||

12

దర్శయిత్వా తు వైదేహ్యాః కృత్స్నం తద్భవనోత్తమమ్ |
ఉవాచ వాక్యం పాపాత్మా సీతాం లోభితుమిచ్ఛయా ||

13

దశ రాక్షసకోట్యశ్చ ద్వావింశతిరథాపరాః |
తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణామ్ ||

14

వర్జయిత్వా జరావృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్ |
సహస్రమేకమేకస్య మమ కార్యపురఃసరమ్ ||

15

యదిదం రాజతంత్రం మే త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ |
జీవితం చ విశాలాక్షి త్వం మే ప్రాణైర్గరీయసీ ||

16

బహూనాం స్త్రీసహస్రాణాం మమ యోఽసౌ పరిగ్రహః |
తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్యా భవ ప్రియే ||

17

సాధు కిం తేఽన్యథా బుద్ధ్యా రోచయస్వ వచో మమ |
భజస్వ మాఽభితప్తస్య ప్రసాదం కర్తుమర్హసి ||

18

పరిక్షిప్తా సహస్రేణ లంకేయం శతయోజనా |
నేయం ధర్షయితుం శక్యా సేంద్రైరపి సురాసురైః ||

19

న దేవేషు న యక్షేషు న గంధర్వేషు పక్షిషు |
అహం పశ్యామి లోకేషు యో మే వీర్యసమో భవేత్ ||

20

రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుషా |
కిం కరిష్యసి రామేణ మానుషేణాల్పతేజసా ||

21

భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశస్తవ |
యౌవనం హ్యధ్రువం భీరు రమస్వేహ మయా సహ ||

22

దర్శనే మా కృథా బుద్ధిం రాఘవస్య వరాననే |
కాఽస్య శక్తిరిహాగంతుమపి సీతే మనోరథైః ||

23

న శక్యో వాయురాకాశే పాశైర్బద్ధుం మహాజవః |
దీప్యమానస్య చాప్యగ్నేర్గ్రహీతుం విమలాం శిఖామ్ ||

24

త్రయాణామపి లోకానాం న తం పశ్యామి శోభనే |
విక్రమేణ నయేద్యస్త్వాం మద్బాహుపరిపాలితామ్ ||

25

లంకాయాం సుమహద్రాజ్యమిదం త్వమనుపాలయ |
త్వత్ప్రేష్యా మద్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరాః ||

26

అభిషేకోదకక్లిన్నా తుష్టా చ రమయస్వ మామ్ |
దుష్కృతం యత్పురా కర్మ వనవాసేన తద్గతమ్ ||

27

యశ్చ తే సుకృతో ధర్మస్తస్యేహ ఫలమాప్నుహి |
ఇహ మాల్యాని సర్వాణి దివ్యగంధాని మైథిలీ ||

28

భూషణాని చ ముఖ్యాని సేవస్వ చ మయా సహ |
పుష్పకం నామ సుశ్రోణి భ్రాతుర్వైశ్రవణస్య మే ||

29

విమానం సూర్యసంకాశం తరసా నిర్జితం మయా |
విశాలం రమణీయం చ తద్విమానమనుత్తమమ్ ||

30

తత్ర సీతే మయా సార్ధం విహరస్వ యథాసుఖమ్ |
వదనం పద్మసంకాశం విమలం చారుదర్శనమ్ ||

31

శోకార్తం తు వరారోహే న భ్రాజతి వరాననే |
ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన వరాంగనా ||

32

పిధాయేందునిభం సీతా ముఖమశ్రూణ్యవర్తయత్ |
ధ్యాయంతీం తామివాస్వస్థాం దీనాం చింతాహతప్రభామ్ ||

33

ఉవాచ వచనం పాపో రావణో రాక్షసేశ్వరః |
అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ||

34

ఆర్షోఽయం దైవనిష్యందో యస్త్వామభిగమిష్యతి |
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ ||

35

ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసోఽహమస్మి తే |
ఇమాః శూన్యా మయా వాచః శుష్యమాణేన భాషితాః |
న చాపి రావణః కాంచిన్మూర్ధ్నా స్త్రీం ప్రణమేత హ ||

36

ఏవముక్త్వా దశగ్రీవో మైథీలీం జనకాత్మజామ్ |
కృతాంతవశమాపన్నో మమేయమితి మన్యతే ||

37

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 55 Meaning In Telugu

ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు, ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచంచడం మొదలెట్టాడు. సీతను తలచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంతఃపురమునకు వెళ్లాడు.

రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్లనుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమెతలవంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు ఆమెను చెయ్యిపట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంతఃపురము అంతా చూపించాడు.

రావణుని అంతఃపురము అనేక మేడలతోనూ, ప్రాసాదము లతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖ ద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి.

రావణుడు సీతను తీసుకొని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు రావణుడు. తన ఐశ్వర్యము అంతా చూచి సీత తనకు వశము అవుతుందని రావణుని భ్రమ.

“ఓ సీతా! ఈ లంకలో బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారి కందరికీ నేనే రాజును. నేను కనుసైగ చేస్తే చాలు వేయి మంది పరిచారికలు నాముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను. నా పరిచారికలు అందరూ నీ ఆజ్ఞానువర్తులు అవుతారు.

నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకొని వచ్చి నా అంతఃపురములో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నీవు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఇంకా సందేహిస్తావు ఎందుకు. వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు. నా రాణిగా ఉండు.

నాచే పరిపాలింపబడు అంకారాజ్యము నూరు యోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టు భయంకరమైన సముద్రము ఉంది. అందువలన మానవమాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు సురులు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు. ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు.

నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు. నేను లంకాధీశుడను. రాముడు ముని వృత్తిలో ఉన్నాడు. నేను రాజభోగములు అనుభవించుచున్నాను. రాముడు మానవమాత్రుడు. నేను దైవాంశసంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు. నాకు చావు లేకుండా బ్రహ్మ వరం ఉంది. ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు.

ఓ సీతా! రా! నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యౌవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము. నేటి సుఖం నేటిదే. రేపురాదు కదా!

ఓ సీతా! ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళతాడని ఆశపడుతున్నావేమో! అది ఒట్టి మాట. రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒక వేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా, నా రక్షణలో ఉన్న నిన్ను చూడటం, తాకడం, తీసుకొని వెళ్లడం అసాధ్యం.

నీవు నన్ను వరించి నా రాణివి అయితే, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను లంకారా సింహాసనము మీదకూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము.

సీతా! నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములను, మైపూతలను తెప్పించాను. వాటిని అలంకరించుకో.

ఓ సీతా! నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్దనుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకొని వచ్చాను. ఆ విమానము అద్భుతమైనది. విశాలమైనది. నీవు నేను కలిసి పుష్పకవిమానములో విహరిద్దాము.

నేను ఇన్ని చెప్పినా, నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు. నాపట్ల ప్రసన్నంగా ఉండు.” అని పరి పరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు.

రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడటం చూచాడు రావణుడు సీతలో ఇలా అన్నాడు.

“ఓ సీతా! నీకు పెళ్లి అయిందనీ, నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందనీ అపోహ పడవద్దు. బహు భార్యాత్వము మాదిరి మా రాక్షసులలో బహుభర్తృత్వము ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులుపడవద్దు. ఓ సీతా! నాకు నీ పాదములే శరణ్యము నీ పాదములు అంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు. నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో! ఈ రావణుడు ఇంతవరకూ ఏ స్త్రీ ముందరా ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది.” అని ప్రాధేయ పడ్డాడు. లోలోపల ఇంక నాకు సీత వశము అయింది అని సంతోషంతో పొంగిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56) >>

Ayodhya Kanda Sarga 89 In Telugu – అయోధ్యాకాండ ఏకోననవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 89

అయోధ్యాకాండలోని ఏకోననవతితమః సర్గ అంటే 89వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని అశ్రువులతో వేడుకుంటాడు, అతని తండ్రి మరణం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించమని కోరతాడు. రాముడు తన వనవాస ప్రతిజ్ఞను విరమించలేదని భరతునికి చెప్తాడు. భరతుడు తన ప్రార్థనలు విఫలమయ్యాక, రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళతాడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పాలించవలసిన బాధ్యతను స్వీకరిస్తాడు. భరతుడు రాముని సాక్షిగా కాబట్టి తాను పాలకుడు కాకుండా సేవకుడిగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా భరతుడు రాముని ఆజ్ఞలను పాటిస్తూ ధర్మాన్ని కాపాడతాడు.

గంగాతరణమ్

పుష్య రాత్రిం తు తత్రైవ గంగాకూలే స రాఘవః |
భరతః కాల్యముత్థాయ శత్రుఘ్నమిదమబ్రవీత్ || ౧ ||

శత్రుఘ్నోత్తిష్ఠ కిం శేషే నిషాదాధిపతిం గుహమ్ |
శీఘ్రమానయ భద్రం తే తారయిష్యతి వాహినీమ్ || ౨ ||

జాగర్మి నాహం స్వపిమి తమేవార్యం విచింతయన్ |
ఇత్యేవమబ్రవీద్భ్రాత్రా శత్రుఘ్నోఽపి ప్రచోదితః || ౩ ||

ఇతి సంవదతోరేవమన్యోన్యం నరసింహయోః |
ఆగమ్య ప్రాంజలిః కాలే గుహో భరతమబ్రవీత్ || ౪ ||

కచ్చిత్సుఖం నదీతీరేఽవాత్సీః కాకుత్స్థ శర్వరీమ్ |
కచ్చిత్తే సహసైన్యస్య తావత్సర్వమనామయమ్ || ౫ ||

గుహస్య వచనం శ్రుత్వా తత్తు స్నేహాదుదీరితమ్ |
రామస్యానువశో వాక్యం భరతోఽపీదమబ్రవీత్ || ౬ ||

సుఖా నః శర్వరీ రాజన్ పూజితాశ్చాపి తే వయమ్ |
గంగాం తు నౌభిర్బహ్వీభిర్దాశాః సంతారయంతు నః || ౭ ||

తతో గుహః సంత్వరితం శ్రుత్వా భరతశాసనమ్ |
ప్రతిప్రవిశ్య నగరం తం జ్ఞాతిజనమబ్రవీత్ || ౮ ||

ఉత్తిష్ఠత ప్రబుధ్యధ్వం భద్రమస్తు చ వః సదా |
నావః సమనుకర్షధ్వం తారయిష్యామ వాహినీమ్ || ౯ ||

తే తథోక్తాః సముత్థాయ త్వరితా రాజశాసనాత్ |
పంచనావాం శతాన్యాశు సమానిన్యుః సమంతతః || ౧౦ ||

అన్యాః స్వస్తికవిజ్ఞేయాః మహాఘంటాధరా వరాః |
శోభమానాః పతాకాభిర్యుక్తవాతాః సుసంహతాః || ౧౧ ||

తతః స్వస్తికవిజ్ఞేయాం పాండుకంబలసంవృతామ్ |
సనందిఘోషాం కళ్యాణీం గుహో నావముపాహరత్ || ౧౨ ||

తామారురోహ భరతః శత్రుఘ్నశ్చ మహాబలః |
కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా రాజయోషితః || ౧౩ ||

పురోహితశ్చ తత్పూర్వం గురవో బ్రాహ్మణాశ్చ యే |
అనంతరం రాజదారాస్తథైవ శకటాపణాః || ౧౪ ||

ఆవాసమాదీపయతాం తీర్థం చాప్యవగాహతామ్ |
భాండాని చాదదానానాం ఘోషస్త్రిదివమస్పృశత్ || ౧౫ ||

పతాకిన్యస్తు తా నావః స్వయం దాశైరధిష్ఠితాః |
వహంత్యో జనమారూఢం తదా సంపేతురాశుగాః || ౧౬ ||

నారీణామభిపూర్ణాస్తు కాశ్చిత్ కాశ్చిచ్చ వాజినామ్ |
కాశ్చిదత్ర వహంతి స్మ యానయుగ్యం మహాధనమ్ || ౧౭ ||

తాః స్మ గత్వా పరం తీరమవరోప్య చ తం జనమ్ |
నివృత్తాః కాండచిత్రాణి క్రియంతే దాశబంధుభిః || ౧౮ ||

సవైజయంతాస్తు గజాః గజారోహప్రచోదితాః |
తరంతః స్మ ప్రకాశంతే సధ్వజా ఇవ పర్వతాః || ౧౯ ||

నావస్త్వారురుహుశ్చాన్యే ప్లవైస్తేరుస్తథాపరే |
అన్యే కుంభఘటైస్తేరురన్యే తేరుశ్చ బాహుభిః || ౨౦ ||

సా పుణ్యా ధ్వజినీ గంగా దాశైః సంతారితా స్వయమ్ |
మైత్రే ముహూర్తే ప్రయయౌ ప్రయాగవనముత్తమమ్ || ౨౧ ||

ఆశ్వాసయిత్వా చ చమూం మహాత్మా
నివేశయిత్వా చ యథోపజోషమ్ |
ద్రష్టుం భరద్వాజమృషిప్రవర్యమ్
ఋత్విగ్వృతః సన్భరతః ప్రతస్థే || ౨౨ ||

స బ్రాహ్మణస్యాఽశ్రమమభ్యుపేత్య
మహాత్మనో దేవపురోహితస్య |
దదర్శ రమ్యోటజవృక్షషండమ్
మహద్వనం విప్రవరస్య రమ్యమ్ || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోననవతితమః సర్గః || ౮౯ ||

Ayodhya Kanda Sarga 89 Meaning In Telugu

భరతుని మాటలకు అక్కడున్నవారికి దు:ఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. “శత్రుఘ్నా! సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకొని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు.” అని అన్నాడు.

అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. “నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొనిపడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను.”అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు.

“రాజకుమారులారా! మీకు మీసైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా! గంగాతీరమున మీరుసుఖంగా నిద్రించారుకదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు గుహుడు. “మిత్రమా! మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు.” అని అన్నాడు.

వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ పిలిచాడు. “భరతుని ఆదేశము ప్రకారము మనమందరమూ భరతుని ఆయన పరివారమును, సైన్యమును గంగానదిని దాటించవలెను. పడవలను సిద్ధం చేయండి.” అని ఆదేశించాడు.

గుహుని ఆదేశము ప్రకారము ఐదువందల పడవలను సిద్ధం చేసారు. భరతుని కోసరము బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేసాడు గుహుడు. ముందుగా వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులు ఆ పడవలో ఎక్కారు. తరువాత రాజ మాతలు ఎక్కారు. తరువాత భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కారు. భరతుని వెంట వచ్చిన పరివారము, సైన్యములు వారి వారికి నియమింపబడ్డ పడవలలో ఎక్కారు. అందరూగంగానదిని క్షేమంగా దాటారు.

ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరాయి. మరి కొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు. అందరూ ప్రయాగ వనమును చేరుకున్నారు. అందరినీ అక్కడవిడిది చేయమని చెప్పి, భరతుడు వసిష్ఠుడు మొదలగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమమునకువెళ్లారు. అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమము చేరుకున్నారు.

శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
ఎనుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ నవతితమః సర్గః (90) >>

Aranya Kanda Sarga 54 In Telugu – అరణ్యకాండ చతుఃపంచాశః సర్గః

Aranya Kanda Sarga 54 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃపంచాశః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో, రాముడు మరియు లక్ష్మణులు సీతను వెతుకుతూ శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి ఒక దివ్య భక్తురాలిగా, రాముడిని కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. రాముడు ఆమె భక్తిని, విశ్వాసాన్ని ప్రశంసిస్తూ సత్సంగం చేస్తాడు.

లంకాప్రాపణమ్

హ్రియమాణా తు వైదేహీ కంచిన్నాథమపశ్యతీ |
దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానరపుంగవాన్ ||

1

తేషాం మధ్యే విశాలాక్షీ కౌశేయం కనకప్రభమ్ |
ఉత్తరీయం వరారోహా శుభాన్యాభరణాని చ ||

2

ముమోచ యది రామాయ శంసేయురితి మైథిలీ |
వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణమ్ ||

3

సంభ్రమాత్తు దశగ్రీవస్తత్కర్మ న స బుద్ధవాన్ |
పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరనిమిషైరివ ||

4

విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః |
స చ పంపామతిక్రమ్య లంకామభిముఖః పురీమ్ ||

5

జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వరః |
తాం జహార సుసంహృష్టో రావణో మృత్యుమాత్మనః ||

6

ఉత్సంగేనేవ భుజగీం తీక్ష్ణదంష్ట్రాం మహావిషామ్ |
వనాని సరితః శైలాన్ సరాంసి చ విహాయసా ||

7

స క్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివ చ్యుతః |
తిమినక్రనికేతం తు వరుణాలయమక్షయమ్ ||

8

సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరమ్ |
సంభ్రమాత్పరివృత్తోర్మీ రుద్ధమీనమహోరగః ||

9

వైదేహ్యాం హ్రియమాణాయాం బభూవ వరుణాలయః |
అంతరిక్షగతా వాచః ససృజుశ్చారణాస్తదా ||

10

ఏతదంతో దశగ్రీవ ఇతి సిద్ధాస్తదాఽబ్రువన్ |
స తు సీతాం వివేష్టంతీమంకేనాదాయ రావణః ||

11

ప్రవివేశ పురీం లంకాం రూపిణీం మృత్యుమాత్మనః |
సోఽభిగమ్య పురీం లంకాం సువిభక్తమహాపథామ్ ||

12

సంరూఢకక్ష్యాబహులం స్వమంతఃపురమావిశత్ |
తత్ర తామసితాపాంగాం శోకమోహపరాయణామ్ ||

13

నిదధే రావణః సీతాం మయో మాయామివ స్త్రియమ్ |
అబ్రవీచ్చ దశగ్రీవః పిశాచీర్ఘోరదర్శనాః ||

14

యథా నేమాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యత్యసమ్మతః |
ముక్తామణిసువర్ణాని వస్త్రాణ్యాభరణాని చ ||

15

యద్యదిచ్ఛేత్తదేవాస్యా దేయం మచ్ఛందతో యథా |
యా చ వక్ష్యతి వైదేహీం వచనం కించిదప్రియమ్ ||

16

అజ్ఞానాద్యది వా జ్ఞానాన్న తస్యా జీవితం ప్రియమ్ |
తథోక్త్వా రాక్షసీస్తాస్తు రాక్షసేంద్రః ప్రతాపవాన్ ||

17

నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్కిం కృత్యమితి చింతయన్ |
దదర్శాష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిశితాశనాన్ ||

18

స తాన్ దృష్ట్వా మహావీర్యో వరదానేన మోహితః |
ఉవాచైతానిదం వాక్యం ప్రశస్య బలవీర్యతః ||

19

నానాప్రహరణాః క్షిప్రమితో గచ్ఛత సత్వరాః |
జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయమ్ ||

20

తత్రోష్యతాం జనస్థానే శూన్యే నిహతరాక్షసే |
పౌరుషం బలమాశ్రిత్య త్రాసముత్సృజ్య దూరతః ||

21

బలం హి సుమహద్యన్మే జనస్థానే నివేశితమ్ |
సదూషణఖరం యుద్ధే హతం రామేణ సాయకైః ||

22

తత్ర క్రోధో మమామర్షాద్ధైర్యస్యోపరి వర్తతే |
వైరం చ సుమహజ్జాతం రామం ప్రతి సుదారుణమ్ ||

23

నిర్యాతయితుమిచ్ఛామి తచ్చ వైరమహం రిపోః |
న హి లప్స్యామ్యహం నిద్రామహత్వా సంయుగే రిపుమ్ ||

24

తం త్విదానీమహం హత్వా ఖరదూషణఘాతినమ్ |
రామం శర్మోపలప్స్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధనః ||

25

జనస్థానే వసద్భిస్తు భవద్భీ రామమాశ్రితా |
ప్రవృత్తిరుపనేతవ్యా కిం కరోతీతి తత్త్వతః ||

26

అప్రమాదాచ్చ గంతవ్యం సర్వైరపి నిశాచరైః |
కర్తవ్యశ్చ సదా యత్నో రాఘవస్య వధం ప్రతి ||

27

యుష్మాకం చ బలజ్ఞోఽహం బహుశో రణమూర్ధని |
అతశ్చాస్మిన్ జనస్థానే మయా యూయం నియోజితాః ||

28

తతః ప్రియం వాక్యముపేత్య రాక్షసా
మహార్థమష్టావభివాద్య రావణమ్ |
విహాయ లంకాం సహితాః ప్రతస్థిరే
యతో జనస్థానమలక్ష్యదర్శనాః ||

29

తతస్తు సీతాముపలభ్య రావణః
సుసంప్రహృష్టః పరిగృహ్య మైథిలీమ్ |
ప్రసజ్య రామేణ చ వైరముత్తమం
బభూవ మోహాన్ముదితః స రాక్షసః ||

30

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 54 Meaning In Telugu PDF

రావణాసురుడు సీతను తీసుకొని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండశిఖరం మీద కొంత మంది వానరులు కూర్చుని ఉండటం గమనించింది సీత.

సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు. ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు.

తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుడు, రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వేపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణదిక్కుగా వెళ్లాడు.

రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు.

నేరుగా తన అంతఃపురానికి వెళ్లాడు రావణుడు. సీతను తన అంతఃపురములో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు.

“ఈమెను నేను చెరబట్టి తీసుకొని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీలులేదు. బయట వాళ్లు పురుషులు కానీ, స్త్రీలుకానీ ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరు రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇదినా ఆజ్ఞ” అని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు.

తరువాత రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే నరమాంసమును తినే ఎనిమిది మంది రాక్షసులను పిలిచాడు.

“మీరు ఆయుధ ధారులై వెంటనే జనస్థానమునకు వెళ్లండి. అక్కడ ఇదివరకు ఖరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానములో జనస్థానములో నివసించండి. జనస్థానములో ఉన్న ఖరదూషణులను, 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధము ఏర్పడింది.

ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారము తీర్చుకోవాలి. రాముని చంపిన గాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానములో నివసిస్తూ, ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియజేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధములలో నాతో పాటు పాల్గొని మీ ధైర్యసాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్ములను ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను.” అని పలికాడు.

రావణుని మాటలను శిరస్సున దాల్చారు ఆ ఎనిమిది మంది రాక్షసులు. రావణుడికి నమస్కరించి, లంకను విడిచి జనస్థానము నకు బయలుదేరారు.

అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ ఎనిమిది మంది రాక్షసుల చేతిలో రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55) >>

Ayodhya Kanda Sarga 86 In Telugu – అయోధ్యాకాండ షడశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 86

అయోధ్యాకాండంలో షడశీతితమః సర్గ అంటే 86వ సర్గ. ఈ సర్గలో దశరథ మహారాజు శ్రీరాముని వలక పంపించడంపై దుఃఖంతో మరణిస్తాడు. ఆయన మరణం తరువాత, భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి తీవ్ర దుఃఖంలో ఉంటారు. భారతుడు, శత్రుఘ్నుడు తల్లిదండ్రుల మరణవార్త విని శోకసముద్రంలో మునిగిపోతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఇతర సకల గురువులు, మరియు మంత్రి వర్గం దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. దశరథుడి మరణం తర్వాత ప్రజలు విసిగిపోతారు. రాజ్యంలో ఈ విషాదం మహోన్నతమైన సంఘటనగా ప్రజలు బాధపడతారు. ఇది రామాయణం యొక్క ప్రధాన సంఘటనలలో ఒకటి.

గుహవాక్యమ్

ఆచచక్షేఽథ సద్భావం లక్ష్మణస్య మహాత్మనః |
భరతాయాప్రమేయాయ గుహో గహనగోచరః || ౧ ||

తం జాగ్రతం గుణైర్యుక్తం శరచాపాసిధారిణమ్ |
భ్రాతృగుప్త్యర్థమత్యంతమహం లక్ష్మణమబ్రవమ్ || ౨ ||

ఇయం తాత సుఖా శయ్యా త్వదర్థముపకల్పితా |
ప్రత్యాశ్వసి హి శేష్వాస్యాం సుఖం రాఘవనందన || ౩ ||

ఉచితోఽయం జనః సర్వో దుఃఖానాం త్వం సుఖోచితః |
ధర్మాత్మంస్తస్య గుప్త్యర్థం జాగరిష్యామహే వయమ్ || ౪ ||

న హి రామాత్ప్రియతరో మమాస్తి భువి కశ్చన |
మోత్సుకోభూర్బ్రవీమ్యేతదప్యసత్యం తవాగ్రతః || ౫ ||

అస్య ప్రసాదాదాశంసే లోకేఽస్మిన్ సుమహద్యశః |
ధర్మావాప్తిం చ విపులామర్థావాప్తిం చ కేవలామ్ || ౬ ||

సోఽహం ప్రియసఖం రామం శయానం సహ సీతయా |
రక్షిష్యామి ధనుష్పాణిః సర్వైః స్వైర్జ్ఞాతిభిః సహ || ౭ ||

న హి మేఽవిదితం కించిద్వనేఽస్మింశ్చరతః సదా |
చతురంగం హ్యపి బలం ప్రసహేమ వయం యుధి || ౮ ||

ఏవమస్మాభిరుక్తేన లక్ష్మణేన మహాత్మనా |
అనునీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యతా || ౯ ||

కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా || ౧౦ ||

యో న దేవాసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య గుహ సంవిష్టం తృణేషు సహ సీతయా || ౧౧ ||

మహతా తపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమైః |
ఏకో దశరథస్యైష పుత్రః సదృశలక్షణః || ౧౨ ||

అస్మిన్ప్రవ్రాజితే రాజా న చిరం వర్తయిష్యతి |
విధవా మేదినీ నూనం క్షిప్రమేవ భవిష్యతి || ౧౩ ||

వినద్య సుమహానాదం శ్రమేణోపరతాః స్త్రియః |
నిర్ఘోషోపరతం నూనమద్య రాజనివేశనమ్ || ౧౪ || [విరతో]

కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ |
నాశంసే యది జీవేయుః సర్వే తే శర్వరీమిమామ్ || ౧౫ ||

జీవేదపి హి మే మాతా శత్రుఘ్నస్యాన్వవేక్షయా |
దుఃఖితా యా తు కౌసల్యా వీరసూర్వినశిష్యతి || ౧౬ ||

అతిక్రాంతమతిక్రాంతమనవాప్య మనోరథమ్ |
రాజ్యే రామమనిక్షిప్య పితా మే వినశిష్యతి || ౧౭ ||

సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్కాలే హ్యుపస్థితే |
ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపమ్ || ౧౮ ||

రమ్యచత్వరసంస్థానాం సువిభక్త మహాపథామ్ |
హర్మ్యప్రాసాదసంపన్నాం సర్వరత్నవిభూషితామ్ || ౧౯ ||

గజాశ్వరథసంబాధాం తూర్యనాదవినాదితామ్ |
సర్వకల్యాణసంపూర్ణాం హృష్టపుష్టజనాకులామ్ || ౨౦ ||

ఆరామోద్యానసంపూర్ణాం సమాజోత్సవశాలినీమ్ |
సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ || ౨౧ ||

అపి సత్యప్రతిజ్నేన సార్ధం కుశలినా వయమ్ |
నివృత్తే సమయే హ్యస్మిన్ సుఖితాః ప్రవిశేమహి || ౨౨ ||

పరిదేవయమానస్య తస్యైవం సుమహాత్మనః |
తిష్ఠతో రాజపుత్రస్య శర్వరీ సాఽత్యవర్తత || ౨౩ ||

ప్రభాతే విమలే సూర్యే కారయిత్వా జటావుభౌ |
అస్మిన్ భాగీరథీతీరే సుఖం సంతారితౌ మయా || ౨౪ ||

జటా ధరౌ తౌ ద్రుమచీరవాససౌ
మహాబలౌ కుంజర యూథపోపమౌ |
వరేషుచాపాసిధరౌ పరంతపౌ
వ్యవేక్షమాణౌ సహ సీతయా గతౌ || ౨౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడశీతితమః సర్గః || ౮౬ ||

Ayodhya Kanda Sarga 86 Meaning In Telugu

ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు. “ఓ మహారాజా! రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు.

ఆ సమయంలో నేను లక్ష్మణునితో “లక్ష్మణా! నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేసారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా! మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేలుకొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్లి నిద్రించు.

మిత్రమా లక్ష్మణా! నాకు రాముని కంటే ప్రియమైన వాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకూ రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేత బూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పచెప్పి నీవు వెళ్లి సుఖముగా నిద్రించు.” అని అన్నాను.

నామాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. “మిత్రమా! నాతోపాటు రాజభోగములు అనుభవించిన రాముడు కటికనేల మీద నిద్రించుచుండగా నాకు సుఖమైన శయ్యమీద నిద్ర ఎలా పడుతుంది. అటుచూడు. హంసతూలికా తల్పము మీద శయనించ వలసిన రాముడు గడ్డి మీద పడుకొని ఉన్నాడు.

ఈ రాముడు సామాన్యుడు కాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేస్తే, ఆయాగముల ఫలితంగా రాముడు జన్మించాడు. ఈ రాముని వదిలి దశరథుడు ఎంతోకాలము జీవించలేడు. నా ఉద్దేశ్యము ప్రకారము దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోకగతుడై ఉంటాడు. నా తల్లి సుమిత్ర, రాముని తల్లి కౌసల్యకూడా రాముని విడిచి జీవించలేరు. కనీసము నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని, రాముని వదిలి కౌసల్య జీవించలేదు.

రాముని రాజ్యాభిషిక్తుని చేయలేక పోగా, అరణ్యములకు పంపిన దు:ఖంతో దశరథుడు మరణించడం తథ్యం. ఆ సమయంలో దశరథునికి ప్రేతసంస్కారములు చేయు అదృష్టము కలిగిన భరతుడు, శత్రుఘ్నుడు ధన్యులు. తరువాత భరతుడు పట్టాభిషిక్తుడగును. అందరూ సంతోషంగా ఉంటారు. కాని మేమే ఈ పదునాలుగు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టగలమా అని అనుమానము.” అని లక్ష్మణుడు ఆ రాత్రి పరి పరి విధములు గా చింతించుచూ నిద్రలేకుడా గడిపాడు.

మరునాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు. ఆ నావను నేనే వారికి సమకూర్చాను. రాముడు ఇక్కడే మర్రిపాలు పూసుకొని జటలు కట్టుకున్నాడు. నారచీరలు ధరించాడు. వారు గంగానదిని దాటివెళ్లిపోయారు.” అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతమును వివరించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తాశీతితమః సర్గః (87) >>

Ayodhya Kanda Sarga 88 In Telugu – అయోధ్యాకాండ అష్టాశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 88

అయోధ్యాకాండంలోని అష్టాశీతితమః సర్గ అంటే 88వ సర్గ. ఈ సర్గలో భరతుడు, శత్రుఘ్నుడు, గురువులు, మరియు ఇతర ఆస్తికులు రాముని కోసం చిత్రకూటానికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో వారు పలు ఆశ్రమాలు వద్ద ఆగి మహర్షులతో భేటీ అవుతారు. భరతుడు, రాముడిని కలిసినప్పుడు, రాముడు తండ్రి మరణవార్త విని దిగ్బ్రాంతికి గురవుతాడు. భరతుడు రాముడిని అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని పాలించాలని కోరతాడు. కానీ రాముడు తన తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ, తన వనవాసాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకొని, వాటిని పెట్టి రాజ్యం పాలిస్తానని నిర్ణయించుకుంటాడు.

శయ్యానువీక్షణమ్

తచ్ఛ్రుత్వా నిపుణం సర్వం భరతః సహ మంత్రిభిః |
ఇంగుదీమూలమాగమ్య రామశయ్యామవేక్ష్య తామ్ || ౧ ||

అబ్రవీజ్జననీః సర్వా ఇహ తేన మహాత్మనా |
శర్వరీ శయితా భూమౌ ఇదమస్య విమర్దితమ్ || ౨ ||

మహాభాగకులీనేన మహాభాగేన ధీమతా |
జాతో దశరథేనోర్వ్యాం న రామః స్వప్తుమర్హతి || ౩ ||

అజినోత్తరసంస్తీర్ణే వరాస్తరణ సంచయే |
శయిత్వా పురుషవ్యాఘ్రః కథం శేతే మహీతలే || ౪ ||

ప్రాసాదాగ్ర విమానేషు వలభీషు చ సర్వదా |
హైమరాజతభౌమేషు వరాస్తరణ శాలిషు || ౫ ||

పుష్పసంచయచిత్రేషు చందనాగరుగంధిషు |
పాండరాభ్ర ప్రకాశేషు శుకసంఘరుతేషు చ || ౬ ||

ప్రాసాదవరవర్యేషు శీతవత్సు సుగంధిషు |
ఉషిత్వా మేరుకల్పేషు కృతకాంచనభిత్తిషు || ౭ ||

గీత వాదిత్ర నిర్ఘోషైర్వరాభరణ నిస్స్వనైః |
మృదంగవరశబ్దైశ్చ సతతం ప్రతిబోధితః || ౮ ||

వందిభిర్వందితః కాలే బహుభిః సూతమాగధైః |
గాథాభిరనురూపాభిః స్తుతిభిశ్చ పరంతపః || ౯ ||

అశ్రద్ధేయమిదం లోకే న సత్యం ప్రతిభాతి మా |
ముహ్యతే ఖలు మే భావః స్వప్నోఽయమితి మే మతిః || ౧౦ ||

న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరమ్ |
యత్ర దాశరథీ రామో భూమావేవ శయీత సః || ౧౧ ||

విదేహరాజస్య సుతా సీతా చ ప్రియదర్శనా |
దయితా శయితా భూమౌ స్నుషా దశరథస్య చ || ౧౨ ||

ఇయం శయ్యా మమ భ్రాతురిదం హి పరివర్తితమ్ |
స్థండిలే కఠినే సర్వం గాత్రైర్విమృదితం తృణమ్ || ౧౩ ||

మన్యే సాభరణా సుప్తా సీతాఽస్మిన్ శయనోత్తమే |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః || ౧౪ ||

ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదా |
తథా హ్యేతే ప్రకాశంతే సక్తాః కౌశేయతంతవః || ౧౫ ||

మన్యే భర్తుః సుఖా శయ్యా యేన బాలా తపస్వినీ |
సుకుమారీ సతీ దుహ్ఖం న విజానాతి మైథిలీ || ౧౬ ||

హా హంతాఽస్మి నృశంసోఽహం యత్సభార్యః కృతేమమ |
ఈదృశీం రాఘవః శయ్యామధిశేతే హ్యనాథవత్ || ౧౭ ||

సార్వభౌమకులే జాతః సర్వలోకస్య సమ్మతః |
సర్వలోకప్రియస్త్యక్త్వా రాజ్యం సుఖమనుత్తమమ్ || ౧౮ ||

కథమిందీవర శ్యామో రక్తాక్షః ప్రియదర్శనః |
సుఖ భాగీ చ దుఃఖార్హః శయితో భువి రాఘవః || ౧౯ ||

ధన్యః ఖలు మహాభాగో లక్ష్మణః శుభలక్షణః |
భ్రాతరం విషమే కాలే యో రామమనువర్తతే || ౨౦ ||

సిద్ధార్థా ఖలు వైదేహీ పతిం యాఽనుగతా వనమ్ |
వయం సంశయితాః సర్వే హీనాస్తేన మహాత్మనా || ౨౧ ||

అకర్ణధారా పృథివీ శూన్యేవ ప్రతిభాతి మా |
గతే దశరథే స్వర్గం రామే చారణ్యమాశ్రితే || ౨౨ ||

న చ ప్రార్థయతే కచ్చిత్ మనసాఽపి వసుంధరామ్ |
వనేఽపి వసతస్తస్య బాహు వీర్యాభిరక్షితామ్ || ౨౩ ||

శూన్యసంవరణా రక్షామయంత్రిత హయద్విపామ్ |
అపావృతపురద్వారాం రాజధానీమరక్షితామ్ || ౨౪ ||

అప్రహృష్ట బలాం శూన్యాం విషమస్థామనావృతామ్ |
శత్రవో నాభిమన్యంతే భక్ష్యాన్విషకృతానివ || ౨౫ ||

అద్య ప్రభృతి భూమౌ తు శయిష్యేఽహం తృణేషు వా |
ఫల మూలాశనో నిత్యం జటాచీరాణి ధారయన్ || ౨౬ ||

తస్యార్థముత్తరం కాలం నివత్స్యామి సుఖం వనే |
తం ప్రతిశ్రవమాముచ్య నాస్య మిథ్యా భవిష్యతి || ౨౭ ||

వసంతం భ్రాతురర్థాయ శత్రుఘ్నో మాఽనువత్స్యతి |
లక్ష్మణేన సహత్వార్యో అయోధ్యాం పాలయిష్యతి || ౨౮ ||

అభిషేక్ష్యంతి కాకుత్స్థమయోధ్యాయాం ద్విజాతయః |
అపి మే దేవతాః కుర్యురిమం సత్యం మనోరథమ్ || ౨౯ ||

ప్రసాద్యమానః శిరసా మయా స్వయమ్
బహు ప్రకారం యది నభిపత్స్యతే |
తతోఽనువత్స్యామి చిరాయ రాఘవమ్
వనేచరన్నార్హతి మాముపేక్షితుమ్ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాశీతితమః సర్గః || ౮౮ ||

Ayodhya Kanda Sarga 88 Meaning In Telugu

గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు. అందరూ కలిసి ఆ రోజు రాముడు శయనించిన ఇంగుదీవృక్షము దగ్గరకు వెళ్లారు. రాముడు పడుకున్న గడ్డితో చేసిన శయ్యను చూచారు.

భరతుడు తన తల్లులను చూచి “అమ్మా! రాకుమారుడు అయిన రాముడు పడుకున్న శయ్య ఇదేనమ్మా! చూడమ్మా రామునికి ఎంత దుర్గతి పట్టిందో. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రాచబిడ్డ. రాచ మర్యాదలు, రాజభోగములు అనుభవించాడు. కానీ, ఈ నాడు నేల మీద గడ్డి పరుచుకొని పడుకుంటున్నాడు. ప్రతిరోజూ హంసతూలికా తల్పముల మీద శయనించిన రాముడు కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాజ ప్రాసాదములలో నివసించిన రాముడు కొండగుహలలో, పర్ణశాలలో ఎలా ఉంటాడో కదా! ప్రతిరోజూ మంగళవాద్య ఘోషలతో వంది మాగధుల కైవారములతో నిద్రలేచే రాముడు ఈ నాడు క్రూరమృగముల అరుపులతో నిద్రలేవడం ఎంతటి దౌర్భాగ్యం. ఎవరికైనా చెబితే నమ్మేట్టుగా లేదు. అందరూ ఇదినిజం కాదు అని అంటారు.

నా మటుకు నాకు ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంది. కాని ఇది అంతా యదార్థము అని తెలిసిన నాడు మనస్సు తల్లడిల్లి పోతూ ఉంది. అంతా కాలమహిమ అని సరిపెట్టుకోక తప్పదు. ఎందుకంటే రాజాధిరాజులకంటే, వారి బలప్రతాపముల కంటే, కాలము బలవత్తరమైనది అనుట యదార్థము.

రాముడు సరే తండ్రి మాట ప్రకారము అరణ్యములలో కష్టములు పడుతున్నాడు. మరి జనకరాజ పుత్రి సీతకూడా రాముని తోపాటు కష్టములు అనుభవిస్తూ ఉంది కదా. దీనికి ఏమను కొనవలెను. అంతా విధివిలాసము అనుకోడం తప్ప.

అమ్మా! చూడండమ్మా! రాముడు, సీత పడుకొన్న ఈ గడ్డి శయ్య. ఈ శయ్యల మీద బంగారు ఆభరణముల చిహ్నములు కనపడుతూఉన్నాయి. సీత ఈ శయ్యమీద తన ఆభరణములతోనే శయనించినట్టు ఉంది. సీత మహా పతివ్రత. భర్తతో పాటు ఉంటే కష్టములు కూడా ఆమెకు సుఖముల మాదిరి కనపడుతున్నట్టు ఉంది.

అయినా, నేను అనుకున్నట్టు, ఇందులో విధి విలాసము ఏమున్నది, నా కోసరము నా తల్లి చేసిన ఘాతుకము తప్ప. నేనే లేకపోతే నా తల్లి ఇంతటి ఘోరమునకు ఒడికట్టదు కదా! దీని కంతటికీ నేనే కారణము. నా వలననే రాముడు సీత లక్ష్మణుడు అరణ్యముల పాలయ్యారు. నా తండ్రి దశరథుడు అకాల మరణం చెందాడు. రాముడు ఇక్ష్వాకు వంశపు రాజు అయి ఉండి కూడా, తన రాజ్యమును సుఖములను త్యజించి నేడు ఇలా కటిక నేల మీదనిద్రిస్తున్నాడు.

రాముని అరణ్యములకు అనుసరించిన సీత, లక్ష్మణులు అదృష్టవంతులు. నేనే అదృష్టహీనుడను. రాముని విడిచి జీవచ్ఛవము మాదిరి బతుకుతున్నాను. లేక పోతే రాజు కావలసిన రాముడు అరణ్యములకు పోవడం ఏమిటి! మహారాజు మరణించడం ఏమిటి! ఈ రాజ్యభారము నా పాలబడటం ఏమిటి! నేను దిక్కుతోచకుండా ఈ అరణ్యములలో తిరగడం ఏమిటి!

అయినా రామునికి రాజ్యము, నాకు అరణ్యము సముచితమే. రాముడు అరణ్యములలో ఉన్నా రాజే. నేను అయోధ్యలో ఉన్నా అడవులలో ఉన్నట్టే. అందుకని నేను కూడా నారచీరలు ధరించి ఈ అడవిలోనే ఉంటాను. నాతో పాటు శతృఘ్నుడు కూడా అడవిలోనే ఉంటాడు. మేము ఇద్దరం జడలు కట్టుకొని మునివృత్తి అవలంబిస్తాము.

అయోధ్యలో రాజులేడు. సైన్యము లేదు. పరిపాలన లేదు. అరాచకం ప్రబలుతోంది. ఈ విషమ పరిస్థితులలో నైనా రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టడా! ఈ మూలంగానైనా రాముడు రాజ్యపాలన చేపడితే అయోధ్యా ప్రజలే కాదు దేవతలు కూడా సంతోషిస్తారు.

అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. రాముని వద్దకు పోయి నా తలను ఆయన పాదాల మీద పెట్టి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టమని ప్రార్ధిస్తాను. అప్పటికీ రాముడు ఒప్పుకోకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. రాముడు నన్ను కాదనడు. ఇదే నా నిశ్చయము.” అని ధృఢంగా అనుకున్నాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోననవతితమః సర్గః (89)>>

Ayodhya Kanda Sarga 87 In Telugu – అయోధ్యాకాండ సప్తాశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 87

అయోధ్యాకాండంలోని సప్తాశీతితమః సర్గ అంటే 87వ సర్గ. ఈ సర్గలో భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణవార్త విని తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. భరతుడు తన తల్లి కైకేయిని మరిచిపోలేడు, ఆమె కారణంగా తన ప్రియ అన్న రాముడు అరణ్యవాసం చేశాడు. భరతుడు దశరథ మహారాజు అంత్యక్రియలను నిర్వహించిన తర్వాత, రాముని అన్వేషణ కోసం అరణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను రాముని తీసుకురావడానికి తన సోదరుడు శత్రుఘ్నుడితో పాటు ప్రజలు, మంత్రి వర్గం మరియు గురువులను కూడా తీసుకొని అరణ్యానికి బయలుదేరాడు. ఈ సర్గలో భరతుడు రాముని రాజ్యానికి తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయాణం గురించి వర్ణించబడింది.

రామశయనాదిప్రశ్నః

గుహస్య వచనం శ్రుత్వా భరతో భృశమప్రియమ్ |
ధ్యానం జగామ తత్రైవ యత్ర తచ్ఛ్రుతమప్రియమ్ || ౧ ||

సుకుమారో మహాసత్త్వః సింహస్కంధో మహాభుజః |
పుండరీకవిశాలాక్షస్తరుణః ప్రియదర్శనః || ౨ ||

ప్రత్యాశ్వస్య ముహూర్తం తు కాలం పరమదుర్మనాః |
పపాత సహసా తోత్రైః హ్యతివిద్ధ ఇవ ద్విపః || ౩ ||

తదవస్థం తు భరతం శత్రుఘ్నోఽనంతర స్థితః |
పరిష్వజ్య రురోదోచ్చైర్విసంజ్ఞః శోకకర్శితః || ౫ ||

తతః సర్వాః సమాపేతుర్మాతరో భరతస్య తాః |
ఉపవాసకృశా దీనా భర్తుర్వ్యసనకర్శితాః || ౬ ||

తాశ్చ తం పతితం భూమౌ రుదంత్యః పర్యవారయన్ |
కౌసల్యా త్వనుసృత్యైనం దుర్మనాః పరిషస్వజే || ౭ ||

వత్సలా స్వం యథా వత్సముపగూహ్య తపస్వినీ |
పరిపప్రచ్ఛ భరతం రుదంతీ శోకలాలసా || ౮ ||

పుత్ర వ్యాధిర్న తే కచ్చిత్ శరీరం పరిబాధతే |
అద్య రాజకులస్యాస్య త్వదధీనం హి జీవితమ్ || ౯ ||

త్వాం దృష్ట్వా పుత్ర జీవామి రామే సభ్రాతృకే గతే |
వృత్తే దశరథే రాజ్ఞి నాథైకస్త్వమద్య నః || ౧౦ ||

కచ్చిన్ను లక్ష్మణే పుత్ర శ్రుతం తే కించిదప్రియమ్ |
పుత్రే వా హ్యేకపుత్రాయాః సహభార్యే వనం గతే || ౧౧ ||

స ముహూర్తం సమాశ్వస్య రుదన్నేవ మహాయశాః |
కౌసల్యాం పరిసాంత్వేదం గుహం వచనమబ్రవీత్ || ౧౨ ||

భ్రాతా మే క్వావసద్రాత్రౌ క్వ సీతా క్వ చ లక్ష్మణః |
అస్వపచ్ఛయనే కస్మిన్ కిం భుక్త్వా గుహ శంస మే || ౧౩ ||

సోఽబ్రవీద్భరతం హృష్టో నిషాదాధిపతిర్గుహః |
యద్విధం ప్రతిపేదే చ రామే ప్రియహితేఽతిథౌ || ౧౪ ||

అన్నముచ్చావచం భక్షాః ఫలాని వివిధాని చ |
రామాయాభ్యవహారార్థం బహు చోపహృతం మయా || ౧౫ ||

తత్సర్వం ప్రత్యనుజ్ఞాసీద్రామః సత్య పరాక్రమః |
న తు తత్ప్రత్యగృహ్ణాత్స క్షత్ర ధర్మమనుస్మరన్ || ౧౬ ||

న హ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే దేయం తు సర్వదా |
ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా || ౧౭ ||

లక్ష్మణేన సమానీతం పీత్వా వారి మహాయశాః |
ఔపవాస్యం తదాఽకార్షీద్రాఘవః సహ సీతయా || ౧౮ ||

తతస్తు జలశేషేణ లక్ష్మణోఽప్యకరోత్తదా |
వాగ్యతాస్తే త్రయః సంధ్యాం సముపాసత సంహితాః || ౧౯ ||

సౌమిత్రిస్తు తతః పశ్చాదకరోత్స్వాస్తరం శుభమ్ |
స్వయమానీయ బర్హీంషి క్షిప్రం రాఘవకారణాత్ || ౨౦ ||

తస్మిన్ సమావిశద్రామః స్వాస్తరే సహ సీతయా |
ప్రక్షాళ్య చ తయోః పాదౌ అపచక్రామ లక్ష్మణః || ౨౧ ||

ఏతత్తదింగుదీమూలమిదమేవ చ తత్తృణమ్ |
యస్మిన్ రామశ్చ సీతా చ రాత్రిం తాం శయితావుభౌ || ౨౨ ||

నియమ్య పృష్ఠే తు తలాంగులిత్రవాన్
శరైః సుపూర్ణావిషుధీ పరంతపః |
మహద్ధనుః సజ్యముపోహ్య లక్ష్మణో
నిశామతిష్ఠత్పరితోఽస్య కేవలమ్ || ౨౩ ||

తతస్త్వహం చోత్తమబాణ చాపధృత్
స్థితోఽభవం తత్ర స యత్ర లక్ష్మణః |
అతంద్రిభిర్జ్ఞాతిభిరాత్త కార్ముకైః
మహేంద్రకల్పం పరిపాలయంస్తదా || ౨౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తాశీతితమః సర్గః || ౮౭ ||

Ayodhya Kanda Sarga 87 Meaning In Telugu

గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న భరతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. రాముని వనవాసము తండ్రిమరణము లక్ష్మణుని వాక్కులు అతని మనసును కలచి వేసాయి. ఆ మానసిక క్షోభకు తట్టుకోలేక భరతుడు కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు. పక్కన ఉన్న శతృఘ్నుడు పట్టుకున్నాడు. శయ్యమీద పడుకోబెట్టాడు.

ఈ వార్త తెలిసి కౌసల్య, సుమిత్ర కైక పరుగు పరుగున అక్కడకు వచ్చారు. కౌపల్య స్పృహ తప్పిన భరతుని చూచి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది.
“నాయనా! భరతా! ఇక్ష్వాకు వంశమునకు నీవే దిక్కు. నీకేమయింది. ఏదైనా శారీరక వ్యాధి వచ్చిందా. రామ లక్ష్మణులు అడవులకు వెళ్లారు. ఎక్కడున్నారో ఏమి చేస్తున్నారో తెలియదు. మహారాజుగారు పరమపదించారు. నువ్వు ఒక్కడివే ఈ సామ్రాజ్యానికి వారసుడివి. మాకు రక్షకుడవు. నిన్ను చూచుకొని మేమందరమూ ప్రాణాలు నిలుపుకొని ఉన్నాము. నాయనా! భరతా! రామలక్ష్మణుల గురించి గానీ, సీత గురించి గానీ ఏమైనా దుర్వార్త తెలిసినదా! చెప్పు భరతా! ఏం జరిగింది. మామనసులు తల్లడిల్లిపోతున్నాయి.” అని రోదిస్తూ ఉంది కౌసల్య పరిచారికలు భరతునికి పరిచర్యలు చేసారు.

ఇంతలో భరతుడు తేరుకున్నాడు. కౌసల్యను ఓదార్చాడు. గుహుని చూచి ఇలా అన్నాడు. “మిత్రమా! ఆ రోజు రాత్రి రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడ . ఏ ఆహారము తీసుకున్నారు. వివరంగా చెప్పు” అని భరతుడు ఆరోగ్యంగా ఉండటం చూచి గుహుడు అడిగాడు.

సంతోషించాడు. రాముని చూచి ఇలా అన్నాడు. “రాకుమారా! ఆరోజు రాత్రి నేను ఎన్నోరకములైన ఆహారపదార్థములను రాముని కొరకు తీసుకొని వచ్చాను. కాని రాముడు వాటిని ముట్ట లేదు. వెనుకకు తీసుకొని వెళ్లమన్నాడు. ఆ రోజు రాత్రి రాముడు కేవలము నీటిని ఆహారంగా తీసుకున్నాడు. రామునితో పాటు సీత, లక్ష్మణుడు కూడా జలమునే ఆహారంగా తీసుకున్నారు.

తర్వాత లక్ష్మణుడు రామునికి సీతకు శయ్యలను ఏర్పాటు చేసాడు. రాముడు సీత ఆ శయ్యల మీద శయనించారు. లక్ష్మణుడు వారి పాదముల వద్ద నిలబడి వారిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు. ఆ రాత్రి రాముడు సీత ఇదుగో ఈ ఇంగుదీ వృక్షము కిందనే శయనించారు. వారు శయనించిన గడ్డి శయ్యలను నేను భద్రపరిచాను. లక్ష్మణుడు ఆ రాత్రి అంతా ధనుస్సును చేతబూని కునుకు లేకుండా కాపలా కాసాడు. నేను కూడా నా వారితో కూడా పరిసరప్రాంతములలో ఉండి రామునికి ఏ ఆపదా రాకుండా కాపలాగా నిలబడి ఉన్నాము.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అష్టాశీతితమః సర్గః (88) >>

Aranya Kanda Sarga 53 In Telugu – అరణ్యకాండ త్రిపంచాశః సర్గః

Aranya Kanda Sarga 53 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిపంచాశః సర్గం రామాయణంలో అత్యంత కీలకమైనది. రాముడు మరియు లక్ష్మణులు సీత కోసం వెతుకుతారు. ఈ క్రమంలో, వారు గాయపడిన జటాయువును కనుగొంటారు. రావణుడు సీతను అపహరించేప్పుడు జటాయువు ఆపడానికి ప్రయత్నించి గాయపడతాడు. జటాయువు సీతను రావణుడు లంకకు తీసుకెళ్లిన విషయాన్ని రాముడికి చెబుతాడు.

రావణభర్త్సనమ్

ఖముత్పతంతం తం దృష్ట్వా మైథిలీ జనకాత్మజా |
దుఃఖితా పరమోద్విగ్నా భయే మహతి వర్తినీ ||

1

రోషరోదనతామ్రాక్షీ భీమాక్షం రాక్షసాధిపమ్ |
రుదంతీ కరుణం సీతా హ్రియమాణేదమబ్రవీత్ ||

2

న వ్యపత్రపసే నీచ కర్మణాఽనేన రావణ |
జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే ||

3

త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుమిచ్ఛతా |
మమాపవాహితో భర్తా మృగరూపేణ మాయయా ||

4

యో హి మాముద్యతస్త్రాతుం సోఽప్యయం వినిపాతితః |
గృధ్రరాజః పురాణోఽసౌ శ్వశురస్య సఖా మమ ||

5

పరమం ఖలు తే వీర్యం దృశ్యతే రాక్షసాధమ |
విశ్రావ్య నామధేయం హి యుద్ధే నాస్మి జితా త్వయా ||

6

ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే |
స్త్రియాశ్చ హరణం నీచ రహితే తు పరస్య చ ||

7

కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితమ్ |
సునృశంసమధర్మిష్ఠం తవ శౌండీర్యమానినః ||

8

ధిక్ తే శౌర్యం చ సత్త్వం చ యత్త్వం కథితవాంస్తదా |
కులాక్రోశకరం లోకే ధిక్ తే చారిత్రమీదృశమ్ ||

9

కిం కర్తుం శక్యమేవం హి యజ్జవేనైవ ధావసి |
ముహూర్తమపి తిష్ఠస్వ న జీవన్ ప్రతియాస్యసి ||

10

న హి చక్షుష్పథం ప్రాప్య తయోః పార్థివపుత్రయోః |
ససైన్యోఽపి సమర్థస్త్వం ముహూర్తమపి జీవితుమ్ ||

11

న త్వం తయోః శరస్పర్శం సోఢుం శక్తః కథంచన |
వనే ప్రజ్వలితస్యేవ స్పర్శమగ్నేర్విహంగమః ||

12

సాధు కృత్వాఽఽత్మనః పథ్యం సాధు మాం ముంచ రావణ |
మత్ప్రధర్షణరుష్టో హి భ్రాత్రా సహ పతిర్మమ ||

13

విధాస్యతి వినాశాయ త్వం మాం యది న ముంచసి |
యేన త్వం వ్యవసాయేన బలాన్మాం హర్తుమిచ్ఛసి ||

14

వ్యవసాయః స తే నీచ భవిష్యతి నిరర్థకః |
న హ్యహం తమపశ్యంతీ భర్తారం విబుధోపమమ్ ||

15

ఉత్సహే శత్రువశగా ప్రాణాన్ ధారయితుం చిరమ్ |
న నూనం చాత్మనః శ్రేయః పథ్యం వా సమవేక్షసే ||

16

మృత్యుకాలే యథా మర్త్యో విపరీతాని సేవతే |
ముమూర్షూణాం హి సర్వేషాం యత్పథ్యం తన్న రోచతే ||

17

పశ్యామ్యద్య హి కంఠే త్వాం కాలపాశావపాశితమ్ |
యథా చాస్మిన్ భయస్థానే న బిభేషి దశానన ||

18

వ్యక్తం హిరణ్మయాన్ హి త్వం సంపశ్యసి మహీరుహాన్ |
నదీం వైతరణీం ఘోరాం రిధిరౌఘనివాసినీమ్ ||

19

అసిపత్రవనం చైవ భీమం పశ్యసి రావణ |
తప్తకాంచనపుష్పాం చ వైడూర్యప్రవరచ్ఛదామ్ ||

20

ద్రక్ష్యసే శాల్మలీం తీక్ష్ణామాయసైః కంటకైశ్చితామ్ |
న హి త్వమీదృశం కృత్వా తస్యాలీకం మహాత్మనః ||

21

ధరితుం శక్ష్యసి చిరం విషం పీత్వేవ నిర్ఘృణః |
బద్ధస్త్వం కాలపాశేన దుర్నివారేణ రావణ ||

22

క్వ గతో లప్స్యసే శర్మ భర్తుర్మమ మహాత్మనః |
నిమేషాంతరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే ||

23

రాక్షసా నిహతా యేన సహస్రాణి చతుర్దశ |
స కథం రాఘవో వీరః సర్వాస్త్రకుశలో బలీ ||

24

న త్వాం హన్యాచ్ఛరైస్తీక్ష్ణైరిష్టభార్యాపహారిణమ్ |
ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహీ రావణాంకగా |
భయశోకసమావిష్టా కరుణం విలలాప హ ||

26

తథా భృశార్తాం బహు చైవ భాషిణీం
విలాపపూర్వం కరుణం చ భామినీమ్ |
జహార పాపః కరుణం వివేష్టతీం
నృపాత్మజామాగతగాత్రవేపథుమ్ ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రిపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 53 Meaning In Telugu

రావణుడు ఆకాశమార్గాన ఎగురుతున్నాడు. సీత వాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది. రావణుని చూచి సీత ఇలా అంది.

“ఓరి రావణా! నీచుడా!నాభర్త ఇంటలేని సమయంలో, కుక్క మాదిరి ఇంట్లోకి దూరి, దొంగమాదిరి నన్ను అపహరించుకొని పోతున్నావే. నీకు సిగ్గులేదట్రా! నీదీ ఒక పరాక్రమమేనా! దమ్ముంటే, ధైర్యం ఉంటే నా భర్త ఉన్నప్పుడు నా వంక కన్నెత్తిచూడు. నా భర్త నిన్ను భస్మం చేస్తాడు.

ఒక ఆడదాన్ని అపహరించడానికి ఇంత పన్నాగమా! ఒక లేడిని పంపి, నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా! నీదీ ఒక మగతనమేనా నీచుడా! నా మామగారి చిరకాల మిత్రుడు అయిన జటాయువు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా! నీ దుర్మార్గానికి హద్దులేదా! నీ పేరు గొప్ప గా చెప్పుకుంటున్నావు. ఇదా నీ పరాక్రమము. పక్షిని చంపడమా నీ వీరత్వము.

ఎటువంటి దుర్మార్గుడైనా ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తి కూడా చూడడే. అటువంటిది నువ్వు ఎంతటి నీచుడివి అయితే నన్ను అపహరించుకు పోతావు! ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా! ఇటువంటి సిగ్గుమాలిని పని చేసినందుకు, నీ ప్రజలే నిన్ను నిందిస్తారని నీకు తెలియదా!

నీవు పుట్టిన వంశము ఎట్టిది! నీవు చేసే పని ఎట్టిది! నీ వంశంలో చెడబుట్టావు కదా దుర్మార్గుడా! నీకు ధైర్యం ఉంటే కాసేపు నన్ను భూమి మీద దింపు. రామలక్ష్మణులు వచ్చేంత వరకూ ఆగు. అప్పుడు నీ సైన్యంతో కూడా రా. రాముడితో యుద్ధం చెయ్యి, నువ్వు యమపురికి వెళతావో నన్ను తీసుకొని లంకకు వెళుతావో అప్పుడు తెలుస్తుంది. రామలక్ష్మణుల బాణములు నిన్ను దహించి వేస్తాయి.

కాబట్టి ఓ రావణా! నా మాట విను. నన్ను విడిచిపెట్టు. లేకపోతే నీ సర్వనాశనం తథ్యం. నీవు నన్ను బలాత్కారంగా తీసుకుపోతే మాత్రం నేను నీకు లొంగుతాను అని అనుకుంటున్నావా! అది కలలో మాట. నేను నీకు ఏ మాత్రం లొంగను. నా ప్రాణాలు అన్నా విడుస్తాను కానీ నిన్ను తాకను. కాబట్టి నీ ప్రయాస అంతావ్యర్థము అవుతుంది. నీకు మరణకాలము సమీపించింది అందుకనే ఇటువంటి వ్యర్థమైన పనికి పూనుకున్నావు. నీకు నరకములో వైతరిణీ నది, కత్తులో బోను సిద్ధంగా ఉన్నాయి.

నాకు ఇంత అపకారము చేసిన నీవు ఎంతో కాలము జీవించలేవు. నీవు నన్ను ఎక్కడ దాచి పెట్టినా నా భర్త ఆ చోటికి రాగలడు. నిన్ను చంపి నన్ను దక్కించుకుంటాడు. నా భర్త రాముని బారి నుండి తప్పించుకోడం నీ తరం కాదు. ఓ రావణా! నా రాముడు ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా, 14,000 మంది రాక్షసులను, నీ తమ్ములను చంపాడు అని గుర్తులేదా! అటువంటి రాముడు, తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే వాడిని తన బాణాలకు బలి చేయకుండా ఊరుకుంటాడా!”ఈ విధంగా సీత రాముని నిందిస్తూ ఉంది. సీత మాటలను రావణుడు లక్ష్యపెట్టలేదు. సీతను సందిట ఇరికించుకొని ఆకాశమార్గంలో అంకవైపు ప్రయాణం చేస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుఃపంచాశః సర్గః (54) >>

Aranya Kanda Sarga 52 In Telugu – అరణ్యకాండ ద్విపంచాశః సర్గః

Aranya Kanda Sarga 52 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విపంచాశః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. శబరిని కలుసుకున్న తర్వాత, రాముడు సీత కోసం వెతుకుతాడు. ఈ క్రమంలో, అతను హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వారి వానర సేనను కలుస్తాడు. రాముడు సుగ్రీవునికి సీత అపహరణ విషయం వివరిస్తూ, సహాయం కోరుతాడు. సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని సీత అన్వేషణకు అందిస్తాడు.

సీతావిక్రోశః

తమల్పజీవితం గృధ్రం స్ఫురంతం రాక్షసాధిపః |
దదర్శ భూమౌ పతితం సమీపే రాఘవాశ్రమాత్ ||

1

సా తు తారాధిపముఖీ రావణేన సమీక్ష్య తమ్ |
గృధ్రరాజం వినిహతం విలలాప సుదుఃఖితా ||

2

ఆలింగ్య గృధ్రం నిహతం రావణేన బలీయసా |
విలలాప సుదుఃఖార్తా సీతా శశినిభాననా ||

3

నిమిత్తం లక్షణజ్ఞానం శకునిస్వరదర్శనమ్ |
అవశ్యం సుఖదుఃఖేషు నరాణాం ప్రతిదృశ్యతే ||

4

నూనం రామ న జానాసి మహద్వ్యసనమాత్మనః |
ధావంతి నూనం కాకుత్స్థం మదర్థం మృగపక్షిణః ||

5

అయం హి పాపచారేణ మాం త్రాతుమభిసంగతః |
శేతే వినిహతో భూమౌ మమాభాగ్యాద్విహంగమః ||

6

త్రాహి మామద్య కాకుత్స్థ లక్ష్మణేతి వరాంగనా |
సుసంత్రస్తా సమాక్రందచ్ఛృణ్వతాం తు యథాంతికే ||

7

తాం క్లిష్టమాల్యాభరణాం విలపంతీమనాథవత్ |
అభ్యధావత వైదేహీం రావణో రాక్షసాధిపః ||

8

తాం లతామివ వేష్టంతీమాలింగంతీం మహాద్రుమాన్ |
ముంచ ముంచేతి బహుశః ప్రవదన్ రాక్షసాధిపః ||

9

క్రోశంతీం రామ రామేతి రామేణ రహితాం వనే |
జీవితాంతాయ కేశేషు జగ్రాహాంతకసన్నిభః ||

10

ప్రధర్షితాయాం సీతాయాం బభూవ సచరాచరమ్ |
జగత్సర్వమమర్యాదం తమసాఽంధేన సంవృతమ్ ||

11

న వాతి మారుతస్తత్ర నిష్ప్రభోఽభూద్దివాకరః |
దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా ||

12

కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహః |
ప్రహృష్టా వ్యథితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః ||

13

దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః |
రావణస్య వినాశం చ ప్రాప్తం బుధ్వా యదృచ్ఛయా ||

14

స తు తాం రామరామేతి రుదంతీం లక్ష్మణేతి చ |
జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వరః ||

15

తప్తాభరణవర్ణాంగీ పీతకౌశేయవాసినీ |
రరాజ రాజపుత్రీ తు విద్యుత్సౌదామినీ యథా ||

16

ఉద్ధూతేన చ వస్త్రేణ తస్యాః పీతేన రావణః |
అధికం ప్రతిబభ్రాజ గిరిర్దీప్త ఇవాగ్నినా ||

17

తస్యాః పరమకల్యాణ్యాస్తామ్రాణి సురభీణి చ |
పద్మపత్రాణి వైదేహ్యా అభ్యకీర్యంత రావణమ్ ||

18

తస్యాః కౌశేయముద్ధూతమాకాశే కనకప్రభమ్ |
బభౌ చాదిత్యరాగేణ తామ్రమభ్రమివాతపే ||

19

తస్యాస్తత్సునసం వక్త్రమాకాశే రావణాంకగమ్ |
న రరాజ వినా రామం వినాలమివ పంకజమ్ ||

20

బభూవ జలదం నీలం భిత్త్వా చంద్ర ఇవోదితః |
సులలాటం సుకేశాంతం పద్మగర్భాభమవ్రణమ్ ||

21

శుక్లైః సువిమలైర్దంతైః ప్రభావద్భిరలంకృతమ్ |
తస్యాస్తద్విమలం వక్త్రమాకాశే రావణాంకగమ్ ||

22

రుదితం వ్యపమృష్టాస్రం చంద్రవత్ప్రియదర్శనమ్ |
సునాసం చారుతామ్రోష్ఠమాకాశే హాటకప్రభమ్ ||

23

రాక్షసేన సమాధూతం తస్యాస్తద్వదనం శుభమ్ |
శుశుభే న వినా రామం దివా చంద్ర ఇవోదితః ||

24

సా హేమవర్ణా నీలాంగం మైథిలీ రాక్షసాధిపమ్ |
శుశుభే కాంచనీ కాంచీ నీలం మణిమివాశ్రితా ||

25

సా పద్మగౌరీ హేమాభా రావణం జనకాత్మజా |
విద్యుద్ఘనమివావిశ్య శుశుభే తప్తభూషణా ||

26

తరుప్రవాలరక్తా సా నీలాంగం రాక్షసేశ్వరమ్ |
ప్రాశోభయత వైదేహీ గజం కక్ష్యేవ కాంచనీ ||

27

తస్యా భూషణఘోషేణ వైదేహ్యా రాక్షసాధిపః |
బభౌ సచపలో నీలః సఘోష ఇవ తోయదః ||

28

ఉత్తమాంగాచ్చ్యుతా తస్యాః పుష్పవృష్టిః సమంతతః |
సీతాయా హ్రియమాణాయాః పపాత ధరణీతలే ||

29

సా తు రావణవేగేన పుష్పవృష్టిః సమంతతః |
సమాధూతా దశగ్రీవం పునరేవాభ్యవర్తత ||

30

అభ్యవర్తత పుష్పాణాం ధారా వైశ్రవణానుజమ్ |
నక్షత్రమాలా విమలా మేరుం నగమివోన్నతమ్ ||

31

చరణాన్నూపురం భ్రష్టం వైదేహ్యా రత్నభూషితమ్ |
విద్యున్మండలసంకాశం పపాత మధురస్వనమ్ ||

32

తాం మహోల్కామివాకాశే దీప్యమానాం స్వతేజసా |
జహారాకాశమావిశ్య సీతాం వైశ్రవణానుజః ||

33

తస్యాస్తాన్యగ్నివర్ణాని భూషణాని మహీతలే |
సఘోషాణ్యవకీర్యంత క్షీణాస్తారా ఇవాంబరాత్ ||

34

తస్యాః స్తనాంతరాద్భ్రష్టో హారస్తారాధిపద్యుతిః |
వైదేహ్యా నిపతన్ భాతి గంగేవ గగనాచ్చ్యుతా ||

35

ఉత్పన్నవాతాభిహతా నానాద్విజగణాయుతాః |
మా భైరితి విధూతాగ్రా వ్యాజహ్నురివ పాదపాః ||

36 [-జహ్ర]

నలిన్యో ధ్వస్తకమలాస్త్రస్తమీనజలేచరాః |
సఖీమివ గతోచ్ఛ్వాసామన్వశోచంత మైథిలీమ్ ||

37

సమంతాదభిసంపత్య సింహవ్యాఘ్రమృగద్విజాః |
అన్వధావంస్తదా రోషాత్ సీతాం ఛాయానుగామినః ||

38

జలప్రపాతాస్రముఖాః శృంగైరుచ్ఛ్రితబాహవః |
సీతాయాం హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వతాః ||

39

హ్రియమాణాం తు వైదేహీం దృష్ట్వా దీనో దివాకరః |
ప్రతిధ్వస్తప్రభః శ్రీమానాసీత్ పాండరమండలః ||

40

నాస్తి ధర్మః కుతః సత్యం నార్జవం నానృశంసతా |
యత్ర రామస్య వైదేహీం భార్యాం హరతి రావణః ||

41

ఇతి సర్వాణి భూతాని గణశః పర్యదేవయన్ |
విత్రస్తకా దీనముఖా రురుదుర్మృగపోతకాః ||

42

ఉద్వీక్ష్యోద్వీక్ష్య నయనైరాస్రపాతావిలేక్షణాః |
సుప్రవేపితగాత్రాశ్చ బభూవుర్వనదేవతాః ||

43

విక్రోశంతీం దృఢం సీతాం దృష్ట్వా దుఃఖం తథా గతామ్ |
తాం తు లక్ష్మణ రామేతి క్రోశంతీం మధురస్వరమ్ ||

44

అవేక్షమాణాం బహుశో వైదేహీం ధరణీతలమ్ |
స తామాకులకేశాంతాం విప్రమృష్టవిశేషకామ్ |
జహారాత్మవినాశాయ దశగ్రీవో మనస్వినీమ్ ||

45

తతస్తు సా చారుదతీ శుచిస్మితా
వినాకృతా బంధుజనేన మైథిలీ |
అపశ్యతీ రాఘవలక్ష్మణావుభౌ
వివర్ణవక్త్రా భయభారపీడితా ||

46

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్విపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 52 Meaning In Telugu

“అయ్యో! నన్ను కాపాడటానికి వచ్చిన జటాయువు కూడా ఈ దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయ్యాడే. ఈ పాపాత్ముడు ఈ జటాయువును పక్షి అని కూడా చూడకుండా చంపాడు. “ఓ రామా! ఓ లక్ష్మణా! ఎక్కడున్నారు. రండి. నన్ను రక్షించండి” అని ఎలుగెత్తి అరిచింది.

అది చూచిన రావణుడు సీత దగ్గరగా వెళ్లాడు. వికటాట్టహాసం చేసాడు. సీత జుట్టు పట్టుకున్నాడు. అది చూచి ప్రకృతి రోదించింది. వృక్షములు తలలు వంచాయి. గాలి వీచడం మానింది. సీత మాత్రం రామా రామా అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు సీతను జుట్టుపట్టుకొని లేవదీసి, తన సందిట ఇరికించుకొని ఆకాశంలో కి ఎగిరాడు. సీతను తీసుకొని ఆకాశమార్గంలో పోతున్నాడు.

ఆ సమయంలో తనను ఎవరన్నా రక్షిస్తారా అని సీత కిందకు చూస్తూ ఉంది. సీత కట్టుకున్న వస్త్రములు గాలికి ఎగురుతూ ఉన్యాయి. సీత పెట్టుకున్న ఆభరణములు చెల్లాచెదురుగా నేల మీద రాలి పడుతున్నాయి. సీత కళ్ల నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె జుట్టు ముడి వీడిపోయింది. సీత నోటి నుండి రామా రామా అనే మాట తప్ప మరోమాట రావడం లేదు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబదిరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ త్రిపంచాశః సర్గః (53) >>