Ayodhya Kanda Sarga 13 In Telugu – అయోధ్యాకాండ త్రయోదశః సర్గః

Ayodhya Kanda Sarga 13

“రామాయణం” లో అయోధ్యాకాండ త్రయోదశః సర్గం (13వ సర్గ) ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ సర్గలో, రాముడు తన తండ్రి ఆజ్ఞను గౌరవించి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సుమంతుడు, రాముడు, సీత, మరియు లక్ష్మణులను వనానికి చేరవేయడానికి రథాన్ని సిద్ధం చేస్తాడు. అయోధ్య ప్రజలు రాముడి వనవాసానికి తీవ్ర విచారంలో కూరుకుపోతారు. వారు రథం వెంబడి దూరం వరకూ నడుస్తూ, తమ ప్రేమను మరియు ఆందోళనను వ్యక్తం చేస్తారు. సీత మరియు లక్ష్మణులు కూడా రాముడితో వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో రాముడు తన తల్లి కౌసల్య మరియు సుమిత్రలతో, మరియు తన గురువు వశిష్ఠునితో సన్మానంగా నడుచుకుంటాడు. ఈ సర్గలో రాముడు తన ధైర్యం, విధేయత మరియు ధర్మాన్ని పాటించే గుణాలను ప్రదర్శిస్తాడు, ఇది కథలో కీలకమైన మలుపు తెస్తుంది.

దశరథవిలాపః

అతదర్హం మహారాజం శయానమతథోచితమ్ |
యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్పరిచ్యుతమ్ || ౧ ||

అనర్థరూపా సిద్ధార్థా హ్యభీతా భయదర్శినీ |
పునరాకారయామాస తమేవ వరమంగనా || ౨ ||

త్వం కత్థసే మహారాజ సత్యవాదీ దృఢవ్రతః |
మమ చేమం వరం కస్మాద్విధారయితుమిచ్ఛసి || ౩ ||

ఏవముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా |
ప్రత్యువాచ తతః క్రుద్ధో ముహూర్తం విహ్వలన్నివ || ౪ ||

మృతే మయి గతే రామే వనం మనుజపుంగవే |
హంతానార్యే మమామిత్రే సకామా సుఖినీ భవ || ౫ ||

స్వర్గేఽపి ఖలు రామస్య కుశలం దైవతైరహమ్ |
ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం బత || ౬ ||

కైకేయ్యాః ప్రియకామేన రామః ప్రవ్రాజితో మయా |
యది సత్యం బ్రవీమ్యేతత్తదసత్యం భవిష్యతి || ౭ ||

అపుత్రేణ మయా పుత్రః శ్రమేణ మహతా మహాన్ |
రామో లబ్ధో మహాబాహుః స కథం త్యజ్యతే మయా || ౮ ||

శూరశ్చ కృతవిద్యశ్చ జితక్రోధః క్షమాపరః |
కథం కమలపత్రాక్షో మయా రామో వివాస్యతే || ౯ ||

కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలమ్ |
అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్ || ౧౦ ||

సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ |
దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః || ౧౧ ||

యది దుఃఖమకృత్వాఽద్య మమ సంక్రమణం భవేత్ |
అదుఃఖార్హస్య రామస్య తతః సుఖమవాప్నుయామ్ || ౧౨ ||

నృశంసే పాపసంకల్పే రామం సత్యపరాక్రమమ్ |
కిం విప్రియేణ కైకేయి ప్రియం యోజయసే మమ || ౧౩ ||

అకీర్తిరతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే |
తథా విలపతస్తస్య పరిభ్రమితచేతసః || ౧౪ ||

అస్తమభ్యగమత్సూర్యో రజనీ చాభ్యవర్తత |
సా త్రియామా తథాఽఽర్తస్య చంద్రమండలమండితా || ౧౫ ||

రాజ్ఞో విలపమానస్య న వ్యభాసత శర్వరీ |
తథైవోష్ణం వినిశ్వస్య వృద్ధో దశరథో నృపః || ౧౬ ||

విలలాపార్తవద్దుఃఖం గగనాసక్తలోచనః |
న ప్రభాతం తయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే || ౧౭ ||

క్రియతాం మే దయా భద్రే మయాఽయం రచితోఽంజలిః |
అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణామ్ || ౧౮ ||

నృశంసాం కేకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్ |
ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంయతాంజలిః || ౧౯ ||

ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్ |
సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః || ౨౦ ||

ప్రసాదః క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః |
శూన్యే న ఖలు సుశ్రోణి మయేదం సముదాహృతమ్ || ౨౧ ||

కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయా హ్యసి |
ప్రసీద దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయమ్ || ౨౨ ||

లభతామసితాపాంగే యశః పరమవాప్నుహి |
మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ |
ప్రియమేతద్గురుశ్రోణి కురు చారుముఖేక్షణే || ౨౩ ||

విశుద్ధభావస్య హి దుష్టభావా
తామ్రేక్షణస్యాశ్రుకలస్య రాజ్ఞః |
శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం
భర్తుర్నృశంసా న చకార వాక్యమ్ || ౨౪ ||

తతః స రాజా పునరేవ మూర్ఛితః
ప్రియామదుష్టాం ప్రతికూలభాషిణీమ్ |
సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి
క్షితౌ విసంజ్ఞో నిపపాత దుఃఖితః || ౨౫ ||

ఇతీవ రాజ్ఞో వ్యథితస్య సా నిశా
జగామ ఘోరం శ్వసతో మనస్వినః |
విబోధ్యమానః ప్రతిబోధనం తదా
నివారయామాస స రాజసత్తమః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశః సర్గః || ౧౩ ||

Ayodhya Kanda Sarga 13 Meaning In Telugu

దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కానీ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసరం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు. భంగపడ్డాడు. కానీ కైక మనసు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది.

“ఓ దశరథమహారాజా! నీవేదో సత్యవాక్పరిపాలకుడవు అనీ, ఆడినమాట తప్పవనీ, అడిగినవి అన్నీ ఇస్తావనీ, లోకమంతా గొప్పగా చెప్పుకుంటారుకదా! ఇదేనా తమరి సత్యవాక్పరిపాలన! ఇదేనా తమరిసత్యసంధత! నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతావు. కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు? ఏది ఏమైనా, మిన్ను విరిగి మీద పడ్డా, రాముడు వనవాసానికి వెళ్లాలి. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది తప్పదు.” అని ఖరాఖండిగా చెప్పింది కైక. తాను ఇంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపమూ దు:ఖము ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కిందపడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ—

” ఓసి దుర్మార్గురాలా! నువ్వు నాకు భార్యవా! శత్రువువా! నా చావు కోరుకుంటావా! రాముడు అరణ్యాలకు వెళ్లిన తరువాత నేను బతికి ఉండటం కలలోని మాట! నా చావు కోరే నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకొనే నీవు, నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు ‘ఓ దశరథమహారాజా! భూలోకములో రాముడు క్షేమముగా ఉన్నాడా’ అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి. ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్నకొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా! నా వంటి వాడు అలా చేసాడు అంటే ఎవరన్నా నమ్ముతారా! ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను, ఈ నాడు నాకు పుత్రులు కలిగితే. వారిని అడవుల పాలు ఎలా చెయ్యను.
ఓ కైకా! నన్ను చంపెయ్యి. రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపు నన్ను చంపు” అని ఆవేశంతో అంటూ కూలబడిపోయాడు దశరథుడు.

కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. కైకను బతిమాలి లాభం లేదనుకొని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ” ఓ చంద్రా! ఈ రాత్రి కాళరాత్రి కానీకు. రేపు తెల్లవారనీయకు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైక ముఖం చూడటం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు.” అని మనసులోనే అనుకున్నాడు.

కాని దశరథునికి ఆశ చావలేదు. “ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో! మరొక సారి అడిగి చూద్దాం.” అని అనుకున్నాడు దశరథుడు. మరలా కైకను చూచి ఇలా అన్నాడు.

ఓ నా ముద్దుల భార్య కైకా! నువ్వు చాలా మంచిదానివి కదూ! అది తెలియక ఏదేదో అన్నానులే! పట్టించుకోకు. అయినా నా లాంటి వృద్ధునితో పరాచికాలేమిటి చెప్పు. అయినా అయోధ్యకు రాజును కదా! నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా! నీలాంటి మంచి వాళ్లు ఇలా చెయ్యవచ్చా! నా మీద కాస్త కరుణ చూపు. నీ దయ నామీద ప్రసరింపచెయ్యి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చెయ్యడం ఏమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా! నువ్వు ఆ పని చేసావనుకో నేను, అయోధ్య ప్రజలు, సమస్తలోకాలు, గురువులు అంతరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామ పట్టాభిషేకము చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు. కాబట్టి రామ పట్టాభిషేకము నీ చేతులమీదుగా జరిపించు.” అని దీనంగా ప్రార్థించాడు.

కాని కైక మనసు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశకూడా వమ్ము అయి పోయింది. మనసు ఆ దు:ఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్దశః సర్గః (13) >>

Balakanda Sarga 12 In Telugu – బాలకాండ ద్వాదశః సర్గః

Balakanda Sarga 12 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాదశః సర్గః రామాయణంలోని మరో కీలక అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి రాముడు, లక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ, రాక్షసులు మరో యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు వారికి ధైర్యంగా ఎదురించి, యజ్ఞాన్ని కాపాడతాడు. అనంతరం, విశ్వామిత్రుడు రాముడికి మహాబలశాలి వాయుదేవుని కుమారుడు హనుమంతుని కథ చెబుతాడు.

అశ్వమేధసంభారః

తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే |
వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోఽభవత్ ||

1

తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్ |
యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ ||

2

తథేతి చ రాజానమువాచ చ సుసత్కృతః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

3

[* సరవ్యాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ | *]
తతో రాజాఽబ్రవీద్వాక్యం సుమంత్రం మంత్రిసత్తమమ్ |
సుమంత్రావాహయ క్షిప్రమృత్విజో బ్రహ్మవాదినః ||

4

సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః ||

5

తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్స తాన్విప్రాన్సమస్తాన్వేదపారగాన్ ||

6

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ధర్మార్థసహితం యుక్తం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

7

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||

8

తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా |
ఋషిపుత్రప్రభావేణ కామాన్ప్రాప్స్యామి చాప్యహమ్ ||

9

తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్ ||

10

ఋశ్యశృంగపురోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం తదా |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

11

సర్వథా ప్రాప్స్యసే పుత్రాంశ్చతురోఽమితవిక్రమాన్ |
యస్య తే ధర్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా ||

12

తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వా తు ద్విజభాషితమ్ |
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్ ||

13

సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ |
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ ||

14

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ |
శాంతయశ్చాపి వర్తంతాం యథాకల్పం యథావిధి ||

15

శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా |
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే ||

16

ఛిద్రం హి మృగయంతేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః |
విహతస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి ||

17

తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే |
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ ||

18

తథేతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |
పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తమకుర్వత ||

19

తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్పార్థివర్షభమ్ |
అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతమ్ ||

20

గతేష్వథ ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్నరాధిపః |
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వాదశః సర్గః || ౧౨ ||

Balakanda Sarga 12 Meaning In Telugu

వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్టుడైన ఋష్యశృంగుని వద్దకుపోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్ధించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు.

” ఓ దశరథ మహారాజా! అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి, దానిని యజ్ఞాశ్వముగా విడువుము.” అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు.

“సుమంతా! మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వసిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము,” అని ఆదేశించాడు.

సుమంతుడు దశరధుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరధుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు.

“బ్రాహ్మణోత్తములారా! నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి.” అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు.

“రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు”అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి, దశరథుడు అంతఃపురమునకు వెళ్లాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పన్నెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రయోదశః సర్గః (13) >>

Ayodhya Kanda Sarga 12 In Telugu – అయోధ్యాకాండ ద్వాదశః సర్గః

Ayodhya Kanda Sarga 12

“రామాయణం” లో అయోధ్యాకాండము ద్వాదశః సర్గం (12వ సర్గ) చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ సర్గలో దశరథుడు రాముని వనవాసానికి పంపించడానికి సిద్ధమవుతాడు. కైకేయి, తన భర్తకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని దశరథుని పై ఒత్తిడి తెస్తుంది. రాముడు తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి, సీత మరియు లక్ష్మణులతో పాటు వనవాసానికి బయలుదేరుతాడు. ఈ సర్గ రాముడి విధేయత, ధైర్యం, మరియు పితృవాక్య పరిపాలన అనే గొప్ప గుణాలను ప్రతిబింబిస్తుంది. అయోధ్య ప్రజలు రాముని వనవాసానికి చాలా బాధపడతారు. రాముడు, సీత మరియు లక్ష్మణులు వనానికి వెళ్ళడం ద్వారా కథలో కీలక మలుపు వస్తుంది.

కైకేయీనివర్తనప్రయాసః 

తతః శృత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః |
చింతామభిసమాపేదే ముహూర్తం ప్రతతాప చ || ౧ ||

కిం ను మే యది వా స్వప్నశ్చిత్తమోహూఽపి వా మమ |
అనుభూతోపసర్గో వా మనసో వాఽప్యుపద్రవః || ౨ ||

ఇతి సంచింత్య తద్రాజా నాభ్యగచ్ఛత్తదాసుఖమ్ |
ప్రతిలభ్య చిరాత్సంజ్ఞాం కైకేయీవాక్యతాపితః || ౩ || [తాడితః]

వ్యథితో విక్లవశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః |
అసంవృతాయామాసీనో జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ || ౪ ||

మండలే పన్నగో రుద్ధో మంత్రైరివ మహావిషః |
అహో ధిగితి సామర్షో వాచముక్త్వా నరాధిపః || ౫ ||

మోహమాపేదివాన్భూయః శోకోపహతచేతనః |
చిరేణ తు నృపః సంజ్ఞాం ప్రతిలభ్య సుదుఃఖితః || ౬ ||

కైకేయీమబ్రవీత్క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా |
నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని || ౭ ||

కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపిఽవా |
యదా తే జననీతుల్యాం వృత్తిం వహతి రాఘవః || ౮ ||

తస్యైవ త్వమనర్థాయ కిం నిమిత్తమిహోద్యతా |
త్వం మయాఽఽత్మవినాశార్థం భవనం స్వం ప్రవేశితా || ౯ ||

అవిజ్ఞానాన్నృపసుతా వ్యాలీ తీక్ష్ణవిషా యథా |
జీవలోకో యదా సర్వో రామస్యాహ గుణస్తవమ్ || ౧౦ ||

అపరాధం కముద్దిశ్య త్యక్ష్యామీష్టమహం సుతమ్ |
కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమపి వా శ్రియమ్ || ౧౧ ||

జీవితం వాఽఽత్మనో రామం న త్వేవ పితృవత్సలమ్ |
పరా భవతి మే ప్రీతిర్దృష్ట్వా తనయమగ్రజమ్ || ౧౨ ||

అపశ్యతస్తు మే రామం నష్టా భవతి చేతనా |
తిష్ఠేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా || ౧౩ ||

న తు రామం వినా దేహే తిష్ఠేత్తు మమ జీవితమ్ |
తదలం త్యజ్యతామేషః నిశ్చయః పాపనిశ్చయే || ౧౪ ||

అపి తే చరణౌ మూర్ధ్నా స్పృశామ్యేష ప్రసీద మే |
కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణమ్ || ౧౫ ||

అథ జీజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియాప్రియే |
అస్తు యత్తత్త్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి || ౧౬ ||

స మే జ్యేష్ఠః సుతః శ్రీమాన్ధర్మజ్యేష్ఠ ఇతీవ మే |
తత్త్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్ || ౧౭ ||

తచ్ఛ్రుత్వా శోకసంతప్తా సంతాపయసి మాం భృశమ్ |
ఆవిష్టాఽసి గృహం శూన్యం సా త్వం పరవశం గతా || ౧౮ ||

ఇక్ష్వాకూణాం కులే దేవి సంప్రాప్తః సుమహానయమ్ |
అనయో నయసంపన్నే యత్ర తే వికృతా మతిః || ౧౯ ||

న హి కించిదయుక్తం వా విప్రియం వా పురా మమ |
అకరోస్త్వం విశాలాక్షి తేన న శ్రద్దధామ్యహమ్ || ౨౦ ||

నను తే రాఘవస్తుల్యో భరతేన మహాత్మనా |
బహుశో హి సుబాలే త్వం కథాః కథయసే మమ || ౨౧ ||

తస్య ధర్మాత్మనో దేవి వనే వాసం యశస్వినః |
కథం రోచయసే భీరు నవ వర్షాణి పంచ చ || ౨౨ ||

అత్యంతసుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః |
కథం రోచయసే వాసమరణ్యే భృశదారుణే || ౨౩ ||

రోచయస్యభిరామస్య రామస్య శుభలోచనే |
తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాసనమ్ || ౨౪ ||

రామో హి భరతాద్భూయస్తవ శుశ్రూషతే సదా |
విశేషం త్వయి తస్మాత్తు భరతస్య న లక్షయే || ౨౫ ||

శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచనక్రియామ్ |
కస్తే భూయస్తరం కుర్యాదన్యత్ర మనుజర్షభాత్ || ౨౬ ||

బహూనాం స్త్రీసహస్రాణాం బహూనాం చోపజీవినామ్ |
పరివాదోఽపవాదో వా రాఘవే నోపపద్యతే || ౨౭ ||

సాంత్వయన్ సర్వభూతాని రామః శుద్ధేన చేతసా |
గృహ్ణాతి మనుజవ్యాఘ్రః ప్రియైర్విషయవాసినః || ౨౮ ||

సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః |
గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధి శాత్రవాన్ || ౨౯ ||

సత్యం దానం తపస్త్యాగో మిత్రతా శౌచమార్జవమ్ |
విద్యా చ గురుశుశ్రూషా ధ్రువాణ్యేతాని రాఘవే || ౩౦ ||

తస్మిన్నార్జవసంపన్నే దేవి దేవోపమే కథమ్ |
పాపమాశంససే రామే మహర్షిసమతేజసి || ౩౧ ||

న స్మరామ్యప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః |
స కథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియమ్ || ౩౨ ||

క్షమా యస్మిన్దమస్త్యాగః సత్యం ధర్మః కృతజ్ఞతా |
అప్యహింసా చ భూతానాం తమృతే కా గతిర్మమ || ౩౩ ||

మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య తపస్వినః |
దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి || ౩౪ ||

పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే |
తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురావిశేత్ || ౩౫ ||

అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్పృశామి తే |
శరణం భవ రామస్య మాఽధర్మో మామిహ స్పృశేత్ || ౩౬ ||

ఇతి దుఃఖాభిసంతప్తం విలపంతమచేతనమ్ |
ఘూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతమ్ || ౩౭ ||

పారం శోకార్ణవస్యాశు ప్రార్థయంతం పునః పునః |
ప్రత్యువాచాథ కైకేయీ రౌద్రా రౌద్రతరం వచః || ౩౮ ||

యది దత్త్వా వరౌ రాజన్ పునః ప్రత్యనుతప్యసే |
ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి || ౩౯ ||

యదా సమేతా బహవస్త్వయా రాజర్షయః సహ |
కథయిష్యంతి ధర్మజ్ఞాస్తత్ర కిం ప్రతివక్ష్యసి || ౪౦ ||

యస్యాః ప్రయత్నే జీవామి యా చ మామభ్యపాలయత్ | [ప్రసాదే]
తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి || ౪౧ ||

కిల్బిషత్వం నరేంద్రాణాం కరిష్యసి నరాధిప |
యో దత్వా వరమద్యైవ పునరన్యాని భాషసే || ౪౨ ||

శైబ్యః శ్యేనకపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ |
అలర్కశ్చక్షుషీ దత్త్వా జగామ గతిముత్తమామ్ || ౪౩ ||

సాగరః సమయం కృత్వా న వేలామతివర్తతే |
సమయం మాఽనృతం కార్షీః పుర్వవృత్తమనుస్మరన్ || ౪౪ ||

స త్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేఽభిషిచ్య చ |
సహ కౌలస్యయా నిత్యం రంతుమిచ్ఛసి దుర్మతే || ౪౫ ||

భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది వాఽనృతమ్ |
యత్త్వయా సంశ్రుతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః || ౪౬ ||

అహం హి విషమద్యైవ పీత్వా బహు తవాగ్రతః |
పశ్యతస్తే మరిష్యామి రామో యద్యభిషిచ్యతే || ౪౭ ||

ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరమ్ |
అంజలిం ప్రతిగృహ్ణంతీం శ్రేయో నను మృతిర్మమ || ౪౮ ||

భరతేనాత్మనా చాహం శపే తే మనుజాధిప |
యథా నాన్యేన తుష్యేయమృతే రామవివాసనాత్ || ౪౯ ||

ఏతావదుక్త్వా వచనం కైకేయీ విరరామ హ |
విలపంతం చ రాజానం న ప్రతివ్యాజహార సా || ౫౦ ||

శ్రుత్వా తు రాజా కైకేయ్యా వృతం పరమదారుణమ్ | [పరమశోభనమ్]
రామస్య చ వనే వాసమైశ్వర్యం భరతస్య చ || ౫౧ ||

నాభ్యభాషత కైకేయీం ముహూర్తం వ్యాకులేంద్రియః |
ప్రైక్షతానిమిషో దేవీం ప్రియామప్రియవాదినీమ్ || ౫౨ ||

తాం హి వజ్రసమాం వాచమాకర్ణ్య హృదయాప్రియామ్ |
దుఃఖశోకమయీం ఘోరాం రాజా న సుఖితోఽభవత్ || ౫౩ ||

స దేవ్యా వ్యవసాయం చ ఘోరం చ శపథం కృతమ్ |
ధ్యాత్వా రామేతి నిఃశ్వస్య చ్ఛిన్నస్తరురివాపతత్ || ౫౪ ||

నష్టచిత్తో యథోన్మత్తో విపరీతో యథాఽతురః |
హృతతేజా యథా సర్పో బభూవ జగతీపతిః || ౫౫ ||

దీనయా తు గిరా రాజా ఇతి హోవాచ కైకయీమ్ |
అనర్థమిమమర్థాభం కేన త్వముపదర్శితా || ౫౬ ||

భూతోపహతచిత్తేవ బ్రువంతీ మాం న లజ్జసే |
శీలవ్యసనమేతత్తే నాభిజానామ్యహం పురా || ౫౭ ||

బాలాయాస్తత్త్విదానీం తే లక్షయే విపరీతవత్ |
కుతో వా తే భయం జాతం యా త్వమేవంవిధం వరమ్ || ౫౮ ||

రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే |
విరమైతేన భావేన త్వమేతేనానృతేన వా || ౫౯ ||

యది భర్తుః ప్రియం కార్యం లోకస్య భరతస్య చ |
నృశంసే పాపసంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి || ౬౦ ||

కిం ను దుఃఖమలీకం వా మయి రామే చ పశ్యసి |
న కథంచిదృతే రామాద్భరతో రాజ్యమావసేత్ || ౬౧ ||

రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరమ్ |
కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్ఛేతి భాషితే || ౬౨ ||

ముఖవర్ణం వివర్ణం తం యథైవేందుముపప్లుతమ్ |
తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితామ్ || ౬౩ ||

కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివ హతాం చమూమ్ |
కిం మాం వక్ష్యంతి రాజానో నానాదిగ్భ్యః సమాగతాః || ౬౪ ||

బాలో బతాయమైక్ష్వాకశ్చిరం రాజ్యమకారయత్ |
యదా తు బహవో వృద్ధాః గుణవంతో బహుశ్రుతాః || ౬౫ ||

పరిప్రక్ష్యంతి కాకుత్స్థం వక్ష్యామి కిమహం తదా |
కైకేయ్యా క్లిశ్యమానేన రామః ప్రవ్రాజితో మయా || ౬౬ ||

యది సత్యం బ్రవీమ్యేతత్తదసత్యం భవిష్యతి |
కిం మాం వక్ష్యతి కౌసల్యా రాఘవే వనమాస్థితే || ౬౭ ||

కిం చైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశమ్ |
యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ || ౬౮ ||

భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి |
సతతం ప్రియకామా మే ప్రియపుత్రా ప్రియంవదా || ౬౯ ||

న మయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ |
ఇదానీం తత్తపతి మాం యన్మయా సుకృతం త్వయి || ౭౦ ||

అపథ్యవ్యంజనోపేతం భుక్తమన్నమివాతురమ్ |
విప్రకారం చ రామస్య సంప్రయాణం వనస్య చ || ౭౧ ||

సుమిత్రా ప్రేక్ష్య వై భీతా కథం మే విశ్వసిష్యతి |
కృపణం బత వైదేహీ శ్రోష్యతి ద్వయమప్రియమ్ || ౭౨ ||

మాం చ పంచత్వమాపన్నం రామం చ వనమాశ్రితమ్ |
వైదేహీ బత మే ప్రాణాన్ శోచంతీ క్షపయిష్యతి || ౭౩ ||

హీనా హిమవతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ |
న హి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే || ౭౪ ||

చిరం జీవితుమాశంసే రుదంతీం చాపి మైథిలీమ్ |
సా నూనం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి || ౭౫ ||

న హి ప్రవాజితే రామే దేవి జీవితుముత్సహే |
సతీం త్వామహమత్యంతం వ్యవస్యామ్యసతీం సతీమ్ || ౭౬ ||

రూపిణీం విషసంయుక్తాం పీత్వేవ మదిరాం నరః |
అనృతైర్బత మాం సాంత్వైః సాంత్వయంతీ స్మ భాషసే || ౭౭ ||

గీతశబ్దేన సంరుద్ధ్య లుబ్ధో మృగమివావధీః |
అనార్య ఇతి మామార్యాః పుత్రవిక్రాయకం ధ్రువమ్ || ౭౮ ||

ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా |
అహో దుఃఖమహో కృచ్ఛ్రం యత్ర వాచః క్షమే తవ || ౭౯ ||

దుఃఖమేవంవిధం ప్రాప్తం పురాకృతమివాశుభమ్ |
చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షితా || ౮౦ ||

అజ్ఞానాదుపసంపన్నా రజ్జురుద్బంధినీ యథా |
రమమాణస్త్వయా సార్ధం మృత్యుం త్వాం నాభిలక్షయే || ౮౧ ||

బాలో రహసి హస్తేన కృష్ణసర్పమివాస్పృశమ్ |
మయా హ్యపితృకః పుత్రః స మహాత్మా దురాత్మనా || ౮౨ ||

తం తు మాం జీవలోకోఽయం నూనమాక్రోష్టుమర్హతి |
బాలిశో బత కామాత్మా రాజా దశరథో భృశమ్ || ౮౩ ||

యః స్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి |
వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్శితః || ౮౪ ||

భోగకాలే మహత్కృచ్ఛ్రం పునరేవ ప్రపత్స్యతే |
నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుమ్ || ౮౫ ||

స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి |
యది మే రాఘవః కుర్యాద్వనం గచ్ఛేతి చోదితః || ౮౬ ||

ప్రతికూలం ప్రియం మే స్యాత్ న తు వత్సః కరిష్యతి |
శుద్ధభావో హి భావం మే న తు జ్ఞాస్యతి రాఘవః || ౮౭ ||

స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి |
రాఘవే హి వనం ప్రాప్తే సర్వలోకస్య ధిక్కృతమ్ || ౮౮ ||

మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయమ్ |
మృతే మయి గతే రామే వనం మనుజపుంగవే || ౮౯ ||

ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యసే |
కౌసల్యా మాం చ రామం చ పుత్రౌ చ యది హాస్యతి || ౯౦ ||

దుఃఖాన్యసహతీ దేవీ మామేవానుమరిష్యతి |
కౌసల్యాం చ సుమిత్రాం చ మాం చ పుత్రైస్త్రిభిః సహ || ౯౧ ||

ప్రక్షిప్య నరకే సా త్వం కైకేయి సుఖితా భవ |
మయా రామేణ చ త్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః || ౯౨ ||

ఇక్ష్వాకుకులమక్షోభ్యమాకులం పాలయిష్యసి |
ప్రియం చేద్భరతస్యైతద్రామప్రవ్రాజనం భవేత్ || ౯౩ ||

మా స్మ మే భరతః కార్షీత్ప్రేతకృత్యం గతాయుషః |
హంతానార్యే మమామిత్రే సకామా భవ కైకయి || ౯౪ ||

మృతే మయి గతే రామే వనం పురుషపుంగవే |
సేదానీం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి || ౯౫ ||

త్వం రాజపుత్రీవాదేన న్యవసో మమ వేశ్మని |
అకీర్తిశ్చాతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే || ౯౬ ||

సర్వభూతేషు చావజ్ఞా యథా పాపకృతస్తథా |
కథం రథైర్విభుర్యాత్వా గజాశ్వైశ్చ ముహుర్ముహుః || ౯౭ ||

పద్భ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి |
యస్య త్వాహారసమయే సూదాః కుండలధారిణః || ౯౮ ||

అహంపుర్వాః పచంతి స్మ ప్రశస్తం పానభోజనమ్ |
స కథం ను కషాయాణి తిక్తాని కటుకాని చ || ౯౯ ||

భక్షయన్వన్యమాహారం సుతో మే వర్తయిష్యతి |
మహార్హవస్త్రసంవీతో భూత్వా చిరసుఖోషితః || ౧౦౦ ||

కాషాయపరిధానస్తు కథం భూమౌనివత్స్యతి |
కస్యైతద్దారుణం వాక్యమేవంవిధమచింతితమ్ || ౧౦౧ ||

రామస్యారణ్యగమనం భరతస్యాభిషేచనమ్ |
ధిగస్తు యోషితో నామ శఠాః స్వార్థపరాః సదా |
న బ్రవీమి స్త్రియః సర్వా భరతస్యైవ మాతరమ్ || ౧౦౨ ||

అనర్థభావేఽర్థపరే నృశంసే
మమానుతాపాయ నివిష్టభావే |
కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం
హితానుకారిణ్యథవాఽపి రామే || ౧౦౩ ||

పరిత్యజేయుః పితరో హి పుత్రా-
-న్భార్యాః పతీంశ్చాపి కృతానురాగాః |
కృత్స్నం హి సర్వం కుపితం జగత్స్యా-
-ద్దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నమ్ || ౧౦౪ ||

అహం పునర్దేవకుమారరూప-
-మలంకృతం తం సుతమావ్రజంతమ్ |
నందామి పశ్యన్నపి దర్శనేన
భవామి దృష్ట్వా చ పునర్యువేవ || ౧౦౫ ||

వినాఽపి సూర్యేణ భవేత్ప్రవృత్తి-
-రవర్షతా వజ్రధరేణ వాఽపి |
రామం తు గచ్ఛంతమితః సమీక్ష్య
జీవేన్న కశ్చిత్త్వితి చేతనా మే || ౧౦౬ ||

వినాశకామామహితామమిత్రా-
-మావాసయం మృత్యుమివాత్మనస్త్వామ్ |
చిరం బతాంకేన ధృతాసి సర్పీ
మహావిషా తేన హతోఽస్మి మోహాత్ || ౧౦౭ ||

మయా చ రామేణ చ లక్ష్మణేన
ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ |
పురం చ రాష్ట్రం చ నిహత్య బాంధవాన్
మమాహితానాం చ భవాభిహర్షిణీ || ౧౦౮ ||

నృశంసవృత్తే వ్యసనప్రహారిణి
ప్రసహ్య వాక్యం యదిహాద్య భాషసే |
న నామ తే కేన ముఖాత్పతంత్యధో
విశీర్యమాణా దశనాః సహస్రధా || ౧౦౯ ||

న కించిదాహాహితమప్రియం వచో
న వేత్తి రామః పరుషాణి భాషితుమ్ |
కథం ను రామే హ్యభిరామవాదిని
బ్రవీషి దోషాన్గుణ నిత్యసమ్మతే || ౧౧౦ ||

ప్రతామ్య వా ప్రజ్వల వా ప్రణశ్య వా
సహస్రశో వా స్ఫుటితా మహీం వ్రజ |
న తే కరిష్యమి వచః సుదారుణం
మమాహితం కేకయరాజపాంసని || ౧౧౧ ||

క్షురోపమాం నిత్యమసత్ప్రియంవదాం
ప్రదుష్టభావాం స్వకులోపఘాతినీమ్ |
న జీవితుం త్వాం విషహేఽమనోరమాం
దిధక్షమాణాం హృదయం సబంధనమ్ || ౧౧౨ ||

న జీవితం మేఽస్తి పునః కుతః సుఖం
వినాఽఽత్మజేనాఽత్మవతః కుతో రతిః |
మమాహితం దేవి న కర్తుమర్హసి
స్పృశామి పాదావపి తే ప్రసీద మే || ౧౧౩ ||

స భూమిపాలో విలపన్ననాథవత్
స్త్రియా గృహీతో హృదయేఽతిమాత్రయా |
పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారితా-
-వుభావసంస్పృశ్య యథాఽతురస్తథా || ౧౧౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాదశః సర్గః || ౧౨ ||

Ayodhya Kanda Sarga 12 Meaning In Telugu

కైక మాటలు విన్న దశరథుడికి నోటమాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కలా నిజమా అనే భ్రమలో పడ్డాడు. లేక తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనసు, కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమ క్రమంగా స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది.

కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కళ్లుతెరిచాడు. కైకను చూచాడు. “ఛీ ఛీ పాపాత్మురాలా నీవా” అంటూ మరలా సృహ తప్పాడు. చాలా సేపటివరకూ అలాగే ఉన్నాడు. కైక తగు ఉ పచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకూ గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కైక వంక చూచి ఇలా అన్నాడు.

“ఓసి దుర్మార్గురాలా! నీవేనా ఈ మాటలు అన్నది. నా రాముడు కానీ, నేను కానీ, నీకు ఏమి అపకారము చేసాము. మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు. తాను పుట్టినప్పటినుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా! ఇది నీకు న్యాయమా! నీవు రాచ పుట్టుక పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకొని మా కుటుంబంలోకి తీసుకొని వచ్చాను. కాని ఏం ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతావు అని అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది.

అది సరే. రాముని వనములకు పంపమన్నావు కదా! లోకము అంతా రాముని సకల సద్గుణ సంపన్నుడు అని కీర్తిస్తుంటే, అతనిలో ఏ దోషము చూపి నేను రాముని వనములకు పంపాలి. ఓ కైకా! నీకు తెలుసో లేదో! నేను నా భార్యలైన కౌసల్యను, సుమిత్రను, నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముని మాత్రం వదలను తెలుసా! రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనపడక పోతే నాకు పై ప్రాణాలు పైకేపోతాయి. ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కాని, నీరు లేకుండా పంటలు పండుతా యోమే కానీ, రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. ఇది యదార్థము.

కైకా! కోపంలో ఏదేదో అన్నాను. నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకు పట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో ఇస్తాను. ” అని కైక మొహంలోకి చూచాడు. కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. మరలా దశరథుని కోపం తారస్థాయికి చేరింది.
“ఓసి దుర్మార్గురాలా! అసలు ఇంతటి పరమదారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే!” అని అరిచాడు.

అంతలోనే తేరుకొని “అలా కాదులే! ఆ! నాకు తెలిసిందిలే! నాకు భరతుని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదూ! అంతే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరతావు! ఎందుకంటే నీవు ఇదివరకు మాట్లాడేటప్పుడు ‘రాముడే నా పెద్ద కుమారుడు. భరతుడు నా రెండవ కుమారుడు’ అని ఎన్నిసార్లు నువ్వు అనలేదు. ఆ మాటలు మేమందరమూ విని ఎంతో సంతోషించాము కదా! ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు అని నాకు తెలుసు. అలాగే అగుగాక! లేకపోతే నీకు రాముని మీద ద్వేషభావం ఎందుకు ఉంటుంది. ఏమో!

అది సరే! రాముని పట్టాభిషేక వార్త విని రాముడు అంటే పడని వాళ్లు నీకు ఏమన్నా దుర్భోధలు చేసారా! ఆ మాటలు విని నువ్వు కోపగృహంలో పడుకున్నావా! కైకా! నీవు వివేకము కలదానవు. నీతి మంతురాలివి. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా! కైకా! నీవు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడావా! అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద దయయుంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుటపడుతుంది.

ఓ కైకా! నీవు చిన్నప్పటినుండి రాముని, భరతుని నీ ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నో కథలు చెప్పావు కదా! నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్లపొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడు అని అనుకుంటున్నావు. రాముడు మాత్రం తక్కువ వాడా! తన కన్నతల్లి కౌసల్య కన్నా నీకు ఎక్కువ సేవలు చేసాడు కదా! అలాంటి రాముని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఎంతో మంది దాసదాసీ జనము ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేసాడు కదా రాముడు. అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్లు వేరే ఎవరు ఉన్నారో చెప్పు.
పోనీ రాముడు ఏమన్నా అకృత్యాలు చేసాడా అంటే… అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైన వాడు. తాను చేసిన మంచి కార్యములకు అందరి చేతా మన్ననలు పొందిన వాడు. అతని మీద కొంచెం కూడా అపనింద పడే అవకాశము లేదు. మరి ఎందుకు రాముని అరణ్యవాసము చెయ్యమంటున్నావు. ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు.

ఓ కైకా! రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసు. అయినా మరొకసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దాన ధర్మములతో దీనజనమును, తన శుశ్రూషులతో గురువు లను, తన వీరత్వముతో శత్రువులను జయించాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువులకు శుశ్రూష, ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనేమాటకు రామునికి అర్థం తెలియదు. అటువంటి “రామునికి అపకారము చెయ్యవలెనని దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది.

కైకా! రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి రామునితో నీ కోసం పరుషంగా ఎలా మాట్లాడమంటావు. అడవులకు పో అని ఎలా చెప్పమంటావు?

ఓ కైకా! మరలా వేడుకుంటున్నాను. నాకా వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నాకు రాముని దూరం చెయ్యకు. నువ్వు కావాలంటే నా రాజ్యము యావత్తు నీకు ధారపోస్తాను. రాముని మాత్రం నాకు విడిచిపెట్టు. ఓ కైకా! నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముని విడిచిపెట్టు నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించు.” అని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు.

దశరథుని దీన మైన మాటలు కైకలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వార్ధం ఆమె హృదయంలో కరుడు గట్టిపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా ములుకుల వంటి మాటలు మాట్లాడింది.

“ఓ దశరథమహారాజా! నీవు వీరుడవు. యుద్ధరంగంలో నిన్ను రెండు సార్లు కాపాడి నీ ప్రాణాలు రక్షించి నందుకు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నావు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. ఏవోవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా! ఇది ధర్మాత్ములు చేసే పనేనా! ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా! ఈ విషయం నీవు భక్తితో పూజించే ఋషులకు, మునులకు చెప్పు.
‘అయ్యా! నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. కైక అనుగ్రహము వలననే నేను బతుకుతున్నాను. అలాంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను.’ అని చెప్పు. వాళ్లు నిన్ను ధర్మాత్ముడు అంటారా! లేక మాట తప్పిన వాడంటారా!

ఓ దశరథ మహారాజా! ఆడిన మాట తప్పి నువ్వు నీ వంశమునకు, నీ పూర్వీకులకు కళంకము తీసుకొని వస్తున్నావు. ఆడిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరమునే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రములను దానం చేసాడు. వారంతా నీ వంశములోని వారే. సముద్రుడు దేవతలకు ఇచ్చినమాట ప్రకారము చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా! నీకేమయింది. ఇచ్చిన వరాలను వెనక్కు తీసుకుంటున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముని యువరాజుగా చేసి కౌసల్యను పట్టపురాణిగా చేసి నన్ను నా కుమారుని అనాధలుగా చెయ్యాలని చూస్తున్నావు..

ఇంతెందుకు. ఓ దశరధమహారాజా! నేను అడిగింది ధర్మమ అధర్మమో, సత్యమో అసత్యమో, నాకు అనవసరము. మీరు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు నాకు ఇవ్వాలి అంతే. దీనికి తిరుగు లేదు. నా మాటలు లక్ష్యపెట్టకుండా రామునికి పట్టాభిషేకము చేస్తే నేను నీ ఎదుటనే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజు అని విర్రవీగుతున్న నా సవతి కౌసల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు.
ఓ దశరథ మహారాజా! నా మీద నా కొడుకు భరతుని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు అరణ్యములకు వెళ్లాలి.

నాకుమారుడు యువరాజు కావాలి. అంతే. ఇంక దేనికీ నేను ఒప్పుకోను. ఆ రెండు తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కరలేదు. తరువాత తమరి ఇష్టం.” అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది. కైకేయి మనోనిశ్చయము విని దశరథుడు నోటమాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకము కన్నా రామ వనవాసము దశరథుని మనసు బాగా కలచి వేసింది. అటువంటి దుర్గార్గపు వరములు కోరిన కైక వంక చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. దశరథునికి మతిభ్రమించి నట్టు అయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అమాయకంగా కైక వంక చూచాడు.

“ఓ కైకా! నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేసారే అనుకో! నువ్వు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా! నీకే మన్నా దయ్యం పట్టిందా. లేక పిశాచము ఆవహించిందా. ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు. నీకు చిన్నప్పటినుండీ ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్లు నాకు చెప్పనేలేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించలేదు. ఈరోజు నీకేం పుట్టింది. ఇలా మాట్లాడుతున్నావు.

ఇంతకూ నీకు ఎవరి వల్ల భయము. రాముని వల్లనా! లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసము ఎందుకు కోరుతున్నావు. రాముడంటే నీకు ఎందుకు అంత భయం? కైకా! మరలా చెబుతున్నాను. నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోద్యకు క్షేమం కోరేదానివయితే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో. బాగుపడతావు.” అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడుఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిట్టడం మొదలెట్టాడు.

“ఓసి పాపాత్మురాలా! క్రూరురాలా! క్షుద్రురాలా! దుర్మార్గురాలా! నాలో నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయే! మేము నీకు ఏం ద్రోహం చేసామే! నీకు తెలుసో లేదో. భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంతమాత్రమూ అంగీకరించడు. నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు. రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు. ధర్మాచరణములో రాముని కన్నా భరతుడే మిన్న.” దశరథుడు వెంటనే దీనంగా మారిపోయాడు.

“కైకా! కైకా! నేను రాముని వద్దకు పోయి ‘రామా! నీవు అరణ్యములకు పోవాలి’ అని ఎలా చెప్పగలను. అలా చెప్పిన తరువాత రాముని మొహం ఎలా చూడగలను. అది అటుండనీ. నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదము పొందిన తరువాతనే తీసుకున్నాను. సామంత రాజులందరినీ ఆహ్వానించాను. ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్లందరూ ఏమంటారు? ఈ ప్రకారంగా క్షణక్షణమూ నిర్ణయాలు మార్చుకొనేవాడు ఇన్నాళ్లు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా! అది నీకు ఇష్టమా! ఇప్పుడు రాముడు వనవాసమునకు వెళితే, రేపు పురప్రముఖులు అంతా వచ్చి “మా రాముడు ఏడీ!” అని అడిగితే నేను వారికి ఏమని సమాధానము చెప్పగలను.
“అయ్యా! నా భార్య కైక మాట విని రాముని అరణ్యములకు పంపాను” అని చెబితే ఎవరూ నా మాట వినరు. దశరథుడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటారు. అది నీకు సమ్మతమా!

కౌసల్య వచ్చి నా కుమారుడు రాముని అరణ్యములకు ఎందుకు పంపావు? కారణం ఏమిటి? అన్ని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను. నా మూడోభార్య మాటవిని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నాగురించి కౌసల్య ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా!

కైకా! నీకుమారునికి పట్టాభిషేకము అంటే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అనుకోవచ్చు. కాని రాముని అరణ్యములకు పంపే హక్కు నీకూ నాకూ ఎక్కడిది! ఆలోచించు. నా కుమారుని అడవులకు పంపే అధికారము మీకు ఎక్కడిది అని కౌసల్య నన్ను నిలదీస్తే, నేను ఏమని సమాధానము చెప్పను? కైకా! నీకు ప్రీతి కలిగించడం కోసరం నేను కౌసల్యను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా! ఆమె నాకు సేవలు చెయ్యడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను. ఎవరి కోసం? నీ కోసమే కదా! కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా! అవునులే! చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏమి లాభం! రోగంతో బాధపడేవాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు అయింది.

కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే, సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది! ఇంక నన్ను నమ్ముతుందా! తనకుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుంది అని అనుకోదూ! వీళ్లు సరే కన్న తల్లులు. మరి రాముని నమ్ముకొని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్థాంగి సీత. ఆమె గతేం కావాలి. భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా! ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశము చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బ్రద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నీవు, హాయిగా విధవరాలుగా, కొడుకుతో సహా రాజ్యము ఏలుకుంటావు. ఇదేగా నీవు కోరుకొనేది. నీ కోరికల ఫలితం.

కైకా! నీ అందచందాలు చూసి నీవు మంచిదానవు అనుకున్నాను కానీ నీ కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు. కడుపులో ఇంత విషం దాచుకొని నాతో ఇన్నాళ్లు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడావన్నమాట! ఎంత మోసం? అవునులే. నిన్ను అనుకోని ఏం లాభం. నా ఖర్మ ఇలా కాలింది. ‘రాజ్యము ఇస్తాననని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు’ అని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటుంటే, వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు పట్టింది. నీమాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టాలు దాపు రించాయి. ఏ జన్మలో ఏం పాపం చేసానో ఈ జన్మలో అనుభవి స్తున్నాను. లేకపోతే ఎక్కడో కేకయ దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను. నువ్వే నా మృత్యు దేవతవు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను.

కన్నకొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడూ ఒక తండ్రేనా! ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్నకొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు’ అని అయోధ్యావాసులు అందరూ నన్ను దూషిస్తారు. పాపం రాముడు. వాడికి చిన్నప్పటి నుండీ అన్నీ కష్టాలే. చిన్నపుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయింది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో!

పోనీ రాముడైనా “నేను అరణ్యాలకు పోను” అంటే అదొకదారి. కాని నేను రాముడిని పిలిచి “రామా! నీవు పధ్నాలుగేళ్లు అరణ్యములకు వెళ్లాలి అంటే చాలు” మరుక్షణం వెళ్లిపోతాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలనను పక్కన పెట్టి “నేనెందుకు అరణ్యాలు పోవాలి. నేను వెళ్లను” అని రాముడు అంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే రామునికి కపటం తెలియదు. నిర్మలహృదయుడు. నా మాట ధిక్కరించడం, అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టం అని రామునికి ఎలా తెలిసేది! నేనా చెప్ప లేను. రామునికి ఎవరు రాముడు అరణ్యములకు పోయిన తరువాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అని సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చెయ్యకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను కాదు, కొడుకు అరణ్యాలకు పోయి, భర్త మరణిస్తే కౌసల్య ఎలా జీవించి ఉంటుంది. తాను కూడా నాతోపాటు స్వర్గం చేరుకుంటుంది.

ఓ కైకా! మేమందరమూ పోయిన తరువాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకూ రాజ్యం ఏలుకోండి. ఇప్పటిదాకా ఇక్ష్వాకు వంశము మచ్చలేకుండా నడిచింది. ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయని మచ్చ పడింది. ఇదిగో కైకా! ఇప్పుడే చెబుతున్నాను. రాముని వనవాసము, నా మరణము, ఒకేసారి సంభవిస్తాయి. భరతుని నాకు పితృకార్యాలు చెయ్యవద్దని చెప్పు. రాముని కాదని రాజ్యమేలే వాడు నా కొడుకు కాదు.
ఓసి దుర్మార్గురాలా! ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదా! నీది మనసా లేక బండరాయా! నా కొడుకు అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలిగా సుఖాలు అనుభవిద్దాము అనుకుంటున్నావా!

నీ వలన మా వంశం అంతా సర్వ నాశనము అయింది కదే దుర్మార్గురాలా! ఇంతకాలమూ ఒక రాజకుమారుడిగా, రథములమీద, హయముల మీదా తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో, కటిక రాళ్ల మీద ఒట్టి కాళ్లతో తిరగాలా! ఇన్నాళ్లు రాచభవనంలో షడ్రసోపేతమైన విందుభోజనము చేసిన వాడు అడవులలో కంద మూలములు తినాలా! అనుక్షణమూ పీతాంబరములు, పట్టువస్త్ర ములు తప్ప వేరు వస్త్రములు ధరించని రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు. రాముడు అరణ్యములకు వెళ్లాలి అన్న దురాలోచన నీ మస్తిష్కములో ఎవరు జొప్పించారు కైకా!

నీ ప్రవర్తన చూస్తుంటే మీ ఆడవాళ్లందరూ పైకి ప్రేమ నటిస్తూ లోలోపల గొంతులు కోస్తారని తెలుస్తూ ఉంది. కాని అందరు స్త్రీలు నీ మాదిరి ఉండరులే. మహాపతివ్రతలు కూడా ఉంటారు. ఓ కైకా! ఓ స్వార్థపరురాలా! ఓ దుర్మార్గురాలా! ఓ క్రూరురాలా! ఈరోజు కేవలం నన్ను అష్టకష్టాల పాలు చెయ్యాలని కంకణం కట్టుకున్నావా. ఇలా మాట్లాడు తున్నావు. రాముడు అడవులలో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తు అంతా నిన్ను దూషించక మానదు. పురుషులంతా నీ లాంటి భార్యలను వదిలివేస్తారు.

ఓ కైకా! నామాట వినవే. ఒక్కసారి ఆ కల్యాణ రాముని చూడవే! రాముడిని చూస్తుంటే నయనాదం కలగడం లేదా నీకు. కైకా! ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బతక వచ్చు. ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బతక వచ్చు కానీ రాముడు లేనిది ఎవరూ బతకలేరు. అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను. నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం. ఇన్నాళ్లు. పాములాంటి నిన్ను పక్కనపెట్టుకొని ఈ నాడు నీ చేత కాటు వేయించుకున్నాను.

ఓ కైకా! మూర్ఖురాలా! నా రాముని అరణ్యములకు పంపి, నన్ను చంపి, నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలగించ దలచుకున్నారా! ఇలాంటి మాటలు మాట్లాడినందుకూ ఇటువంటి కోరికలు కోరినందుకూ నీ తల ఎందుకు వెయ్యివక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం తెలియని రామునికి అపకారం చెయ్యడం, అడవులకు పంపాలి అని కోరడం లాంటి మహాపాపం చేసిన తరువాత నువ్వు ఇంకా బతికి ఉండటమా!

ఓ కైకా! నా నిర్ణయం విను. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఆఖరుకు చచ్చినా నువ్వు కోరిన కోరికలు తీర్చను. నీ మాట నెరవేర్చను. నాకు అసత్యదోషం అంటినా సరే. లెక్క చేయను. ఎందుకంటే మంచి వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడం ధర్మం కానీ, నీ లాంటి దుర్మార్గులకు, అబద్ధాలు ఆడేవాళ్లకు, దుష్టురాలకు, కులనాశకులకు, నా మనసుకు కష్టము కలిగించిన దానికి, ఆఖరుకు నా హృదయంలో చిచ్చుపెట్టిన పాషండురాలికి ఇస్తానన్న వరాలు ఇవ్వక పోవడమే ధర్మం.

ఓ కైకా! మరలా మరలా చెబుతున్నాను. రాముని విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బతుకలేను. ఇంక నాకు సుఖసంతోషాలు ఎక్కడ ఉంటాయి. కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను, లోకాన్ని రక్షించు.” అని కైక పాదాలమీద పడబోయాడు దశరథుడు.

అప్పటి దాకా మౌనంగా అన్నీ వింటూ ఉంది కైక. సహజంగా ఉ త్తమురాలైన కైక మనసు ద్రవించి పోయింది. దీనంగా రోదిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్లు పట్టుకుంటాడో, తనపాతివ్రత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది. కైక కాళ్లు పట్టుకోకుండానే దశరథుడు కిందపడిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రయోదశః సర్గః (13) >>

Balakanda Sarga 11 In Telugu – బాలకాండ ఏకాదశః సర్గః

Balakanda Sarga 11 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకాదశః సర్గములో, తన మంత్రి సుమంత్రుని సలహా మేరకు, దశరథుడు ఋష్యశృంగ మహర్షి మరియు అతని భార్య శాంతను తన రాజధాని అయోధ్యకు తీసుకురావడానికి అంగ రాజ్యానికి వెళ్తాడు.

ఋశ్యశృంగస్యాయోధ్యాప్రవేశః

భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితమ్ |
యథా స దేవప్రవరః కథయామేవమబ్రవీత్ ||

1

ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |
రాజా దశరథో రాజా శ్రీమాన్సత్యప్రతిశ్రవః ||

2

అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి |
[* కన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి | *]
పుత్రస్తు సోఽఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుతః ||

3

తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః |
అనపత్యోఽస్మి ధర్మాత్మన్ శాంతా భర్తా మమ క్రతుమ్ ||

4

ఆహరేత త్వయాజ్ఞప్తః సంతానార్థం కులస్య చ |
శ్రుత్వా రాజ్ఞోఽథ తద్వాక్యం మనసాపి విమృశ్య చ ||

5 [విచింత్య]

ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భర్తారమాత్మవాన్ |
ప్రతిగృహ్యం చ తం విప్రం స రాజా విగత జ్వరః ||

6

ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాంతరాత్మనా |
తం చ రాజా దశరథో యష్టుకామః కృతాంజలిః ||

7

ఋశ్యశృంగం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ |
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః ||

8

లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాం పతిః |
పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారోఽమితవిక్రమాః ||

9

వంశప్రతిష్ఠానకరాః సర్వలోకేషు విశ్రుతాః |
ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్కథామ్ ||

10

సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః |
స త్వం పురుషశార్దూల తమానయ సుసత్కృతమ్ ||

11

స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః |
[* సుమంత్రస్య వచః శ్రుత్వా హృష్టో దశరథోఽభవత్ | *]
అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశామ్య చ ||

12

వసిష్ఠేనాభ్యనుజ్ఞాతో రాజా సంపూర్ణమానసః |
సాంతఃపురః సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః ||

13

వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః |
అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః ||

14

ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్ |
ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్ ||

15

తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః |
సఖిత్వాత్తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా ||

16

రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే |
సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్ ||

17

ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః |
సప్తాష్ట దివసాన్రాజా రాజానమిదమబ్రవీత్ ||

18

శాంతా తవ సుతా రాజన్సహ భర్త్రా విశాంపతే |
మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతమ్ ||

19

తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః |
ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా ||

20

ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా |
స నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా ||

21

తావాన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా |
ననందతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్ ||

22

తతః సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః |
పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామినః ||

23

క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతమ్ |
ధూపితం సిక్త సమ్మృష్టం పతాకాభిరలంకృతమ్ ||

24

తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్ |
తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా ||

25

తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ |
శంఖదుందుభినిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభమ్ ||

26

తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్ |
ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణా ||

27

[* యథా దివి సురేంద్రేణ సహస్రాక్షేణ కాశ్యపమ్ | *]
అంతఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః |
కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్ ||

28

అంతఃపురాణి సర్వాణి శాంతాం దృష్ట్వా తథాగతామ్ |
సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందముపాగమన్ ||

29

పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః |
ఉవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా ||

30 [సహద్విజా]

“ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి.

‘రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.’ అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను.

కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని సుమంతుడు చెప్పాడు.

ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారములు చేసాడు. అంగరాజు పక్కన అగ్ని వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేసాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు.

దశరథుడు అంగరాజ్యములో ఏడురోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు.

“ఓ అంగరాజా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది.” అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు.

ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగా నే అయోధ్యావాసులకు తెలియజేసాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు.

దశరధుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్యానిం చారు. శాంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదకొండవసర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ద్వాదశః సర్గః (12) >>

Balakanda Sarga 13 In Telugu – బాలకాండ త్రయోదశః సర్గః

Balakanda Sarga 13 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో త్రయోదశః సర్గలో రాజు దశరథుడు వైదిక కర్మకు సంబంధించిన పనులను ప్రారంభించమని రాజ పురోహితుడైన వశిష్ట ఋషిని అభ్యర్థించాడు. వశిష్ఠ మహర్షి కార్యాలను అమలు చేయడంలో పాటించాల్సిన క్రమశిక్షణ గురించి సంబంధిత వారందరికీ సూచించాడు. వశిష్ఠ మహర్షి మంత్రివర్యుడైన సుమంత్రుడికి ఇతర దేశాలలోని వివిధ రాజులను ఆహ్వానించమని ఆదేశిస్తాడు, మరియు ఆ రాజులను గొప్ప ఆతిథ్యంతో స్వాగతిస్తారు. దశరథ రాజు తన భార్యలతో కలిసి కర్మ ప్రతిజ్ఞ చేసి కర్మ మందిరంలోకి ప్రవేశిస్తాడు.

యజ్ఞశాలాప్రవేశః

పునః ప్రాప్తే వసంతే తు పూర్ణః సంవత్సరోఽభవత్ |
ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్ ||

1

అభివాద్య వసిష్ఠం చ న్యాయతః ప్రతిపూజ్య చ |
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమమ్ ||

2

యజ్ఞో మే ప్రీయతాం బ్రహ్మన్యథోక్తం మునిపుంగవ | [క్రియతాం]
యథా న విఘ్నః క్రియతే యజ్ఞాంగేషు విధీయతామ్ ||

3

భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ |
వోఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః ||

4

తథేతి చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః |
కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్ ||

5

తతోఽబ్రవీద్ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్ |
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్పరమధార్మికాన్ ||

6

కర్మాంతికాన్ శిల్పకరాన్వర్ధకీన్ఖనకానపి |
గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ ||

7

తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్సుబహుశ్రుతాన్ |
యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసనాత్ ||

8

ఇష్టకా బహుసాహస్రా శీఘ్రమానీయతామితి |
ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞాం బహుగుణాన్వితాః ||

9

బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః |
భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః ||

10

తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః |
[* అధికపాఠః –
ఆగతానాం సుదూరాచ్చ పార్థివానాం పృథక్ పృథక్ |
వాజివారణశాలాశ్చ తథా శయ్యాగృహాణి చ |
భటానాం మహదావాసా వైదేశికనివాసినామ్ |
*]
ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితాః ||

11

తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్ |
దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా ||

12

సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి ||

13

యజ్ఞకర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా |
తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్ ||

14

తే చ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ |
యథా సర్వం సువిహితం న కించిత్పరిహీయతే ||

15

తథా భవంతః కుర్వంతు ప్రీతిస్నిగ్ధేన చేతసా |
తతః సర్వే సమాగమ్య వసిష్ఠమిదమబ్రువన్ ||

16

యథోక్తం తత్సువిహితం న కించిత్పరిహీయతే |
తతః సుమంత్రమాహూయ వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||

17

నిమంత్రయస్వ నృపతీన్పృథివ్యాం యే చ ధార్మికాః |
బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః ||

18

సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్ |
మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్ ||

19

నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్ |
తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్ ||

20

పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే |
తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్ ||

21

సద్వృత్తం దేవసంకాశం స్వయమేవానయస్వ హ |
తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్ ||

22

శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ |
అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతమ్ ||

23

వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్ |
ప్రాచీనాన్సింధుసౌవీరాన్సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ ||

24

దాక్షిణాత్యాన్నరేంద్రాశ్చ సమస్తానానయస్వ హ |
సంతి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే ||

25

తానానయ తతః క్షిప్రం సానుగాన్సహబాంధవాన్ |
[* ఏతాన్ దూతైః మహాభాగైః ఆనయస్వ నృపాజ్ఞ్యా | *]
వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమంత్రస్త్వరితస్తదా ||

26

వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్ |
స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్ ||

27

సుమంత్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః |
తే చ కర్మాంతికాః సర్వే వసిష్ఠాయ చ ధీమతే ||

28

సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితమ్ |
తతః ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్సర్వానిదమబ్రవీత్ ||

29

అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా |
అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః ||

30

తతః కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షితః |
బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య హ ||

31

తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్ |
ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్ ||

32

మయా చ సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః |
యజ్ఞియం చ కృతం రాజన్పురుషైః సుసమాహితైః ||

33

నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమంతికాత్ |
సర్వకామైరుపహృతైరుపేతం వై సమంతతః ||

34

ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితమ్ |
తథా వసిష్ఠవచనాద్దృశ్యశృంగస్య చోభయోః ||

35

శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః |
తతో వసిష్ఠప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః ||

36

ఋశ్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తదా |
యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి |
శ్రీమాంశ్చ సహపత్నీభీ రాజా దీక్షాముపావిశత్ ||

37

Balakanda Sarga 13 In Telugu Pdf With Meaning

యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్టులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. “మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి.” అని వారిని ప్రార్థించాడు.

“మహారాజా! మీరు కోరినట్లే జరుగుతుంది” అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు.

తరువాత పురోహితుడైన వశిష్టుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, శిల్పులను, కొయ్యపనిచేసే వారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, “దశరథమహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఏలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధపెట్టకండి. ఈయజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకరర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు.” అని ఆదేశించాడు వశిష్టుడు.

పిమ్మట వశిష్టుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. “సుమంతా! నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపది జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొని రా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధి పతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పుదేశపు రాజులను, దక్షిణదేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ, సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు.” అని పలికాడు వశిష్టుడు.

వశిష్టుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు. ఆయాకార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయాపనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు. వసిష్టుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేసాడు. ఆవిషయము దశరథునికి చెప్పాడు.

వశిష్టుడు, ఋష్యశృంగుడు దశరథమహారాజు వద్దకు పోయి ” ఓ దశరథమహారాజా! మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞ శాలకు రావాలి.” అనిపలికారు.

ఒక శుభముహూర్తమున దశరథమహారాజు, తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వసిష్టుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదమూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ చతుర్దశః సర్గః (14) >>

Ayodhya Kanda Sarga 11 In Telugu – అయోధ్యాకాండ ఏకాదశః సర్గః

Ayodhya Kanda Sarga 11

“అయోధ్యాకాండం” వాల్మీకి మహర్షి రామాయణంలోని రెండవ భాగం. ఈ భాగంలో రాముడు, సీతా, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లడం, రాముని పాదుకలను భరతుడు పట్టాభిషేకం చేయడం వంటి సంఘటనలు ఉంటాయి. “ఏకాదశ సర్గ” అంటే “అయోధ్యాకాండంలో పదకొండవ అధ్యాయం”. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని అరణ్యవాసానికి పంపిన తర్వాత కలిగిన విచారం మరియు దుఃఖాన్ని వివరించబడింది. సుమంతుడిని పంపి, రాముడు, సీత, లక్ష్మణులని తీసుకురావడానికి ప్రయత్నించినా, వారు తిరిగి రాకపోవడం కూడా ఇందులో ప్రస్తావించబడింది.

వరద్వయనిర్బంధః 

తం మన్మథశరైర్విద్ధం కామవేగవశానుగమ్ |
ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః || ౧ ||

నాస్మి విప్రకృతాదేవ కేనచిన్నావమానితా |
అభిప్రాయస్తు మే కశ్చిత్తమిచ్ఛామి త్వయా కృతమ్ || ౨ ||

ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్ఛసి |
అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా || ౩ ||

తామువాచ మహాతేజాః కైకేయీమీషదుత్స్మితః |
కామీ హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితామ్ || ౪ ||

అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతరో మమ |
మనుజో మనుజవ్యాఘ్రాద్రామాదన్యో న విద్యతే || ౫ ||

తేనాజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మనా |
శపే తే జీవనార్హేణ బ్రూహి యన్మనసేచ్ఛసి || ౬ ||

యం ముహూర్తమపశ్యంస్తు న జీవేయమహం ధ్రువమ్ |
తేన రామేణ కైకేయి శపే తే వచనక్రియామ్ || ౭ ||

ఆత్మనా వాత్మజైశ్చాన్యైర్వృణేయం మనుజర్షభమ్ |
తేన రామేణ కైకేయి శపే తే వచనక్రియామ్ || ౮ ||

భద్రే హృదయమప్యేతదనుమృశ్యోద్ధరస్వ మే |
ఏతత్సమీక్ష్య కైకేయి బ్రూహి యత్సాధు మన్యసే || ౯ ||

బలమాత్మని పశ్యంతీ న మాం శంకితుమర్హసి |
కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే || ౧౦ ||

సా తదర్థమనా దేవీ తమభిప్రాయమాగతమ్ |
నిర్మాధ్యస్థ్యాచ్చ హర్షాచ్చ బభాషే దుర్వచం వచః || ౧౧ ||

తేన వాక్యేన సంహృష్టా తమభిప్రాయమాగతమ్ |
వ్యాజహార మహాఘోరమభ్యాగతమివాంతకమ్ || ౧౨ ||

యథా క్రమేణ శపసి వరం మమ దదాసి చ |
తచ్ఛృణ్వంతు త్రయస్త్రింశద్దేవాః సాగ్నిపురోగమాః || ౧౩ ||

చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహా రాత్ర్యహనీ దిశః |
జగచ్చ పృథివీ చేయం సగంధర్వా సరాక్షసా || ౧౪ ||

నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః |
యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ || ౧౫ ||

సత్యసంధో మహాతేజాః ధర్మజ్ఞః సుసమాహితః |
వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః || ౧౬ ||

ఇతి దేవీ మహేష్వాసం పరిగృహ్యాభిశస్య చ |
తతః పరమువాచేదం వరదం కామమోహితమ్ || ౧౭ ||

స్మర రాజన్పురా వృత్తం తస్మిన్ దైవాసురే రణే |
తత్ర చాచ్యావయచ్ఛత్రుస్తవ జీవితమంతరా || ౧౮ ||

తత్ర చాపి మయా దేవ యత్త్వం సమభిరక్షితః |
జాగ్రత్యా యతమానాయాస్తతో మే ప్రాదదా వరౌ || ౧౯ ||

తౌ తు దత్తౌ వరౌ దేవ నిక్షేపౌ మృగయామ్యహమ్ |
తథైవ పృథివీపాల సకాశే సత్యసంగర || ౨౦ ||

తత్ప్రతిశ్రుత్య ధర్మేణ న చేద్దాస్యసి మే వరమ్ |
అద్యైవ హి ప్రహాస్యామి జీవితం త్వద్విమానితా || ౨౧ ||

వాఙ్మాత్రేణ తదా రాజా కైకేయ్యా స్వవశే కృతః |
ప్రచస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మనః || ౨౨ ||

తతః పరమువాచేదం వరదం కామమోహితమ్ |
వరౌ యౌ మే త్వయా దేవ తదా దత్తౌ మహీపతే || ౨౩ ||

తౌ తావదహమద్యైవ వక్ష్యామి శృణు మే వచః |
అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః || ౨౪ ||

అనేనైవాభిషేకేణ భరతో మేఽభిషేచ్యతామ్ |
యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన మే త్వయా || ౨౫ ||

తదా దైవాసురే యుద్ధే తస్య కాలోఽయమాగతః |
నవ పంచ చ వర్షాణి దండకారణ్యమాశ్రితః || ౨౬ ||

చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకంటకమ్ || ౨౭ ||

ఏష మే పరమః కామో దత్తమేవ వరం వృణే |
అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనమ్ || ౨౮ ||

స రాజరాజో భవ సత్యసంగరః
కులం చ శీలం చ హి రక్ష జన్మ చ |
పరత్రవాసే హి వదంత్యనుత్తమం
తపోధనాః సత్యవచో హితం నృణామ్ || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాదశః సర్గః || ౧౧ ||

Ayodhya Kanda Sarga 11 Meaning In Telugu

దశరథమహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మధ బాణములకు బలి అయిన, తన మీది కామానికి దాసోహం అన్న, తన భర్త దశరథమహారాజుతో ఇలా అంది. “మహారాజా! మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు. ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగ వలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధకలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా!” అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు మాట్లాడింది కైక.

ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకొని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు. దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు ఆరోప్రాణమ. నా ఐదు ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న ఆరో ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా!

ఓ కైకా! రాముని రక్షించుకోడానికి నేను నా ప్రాణాలను, నా ముగ్గురు కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉ న్నాను. అటువంటి రాముని మీద ఒట్టుపెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏముందో తెలుసుకోడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయయుంచి నీ కోరిక వెల్లడించు.

అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము. నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా! నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముని మీదనే కాదు. నేను ఇప్పటి దాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీదకూడా ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. ఇంక నైనా నీ మనసులోని కోరిక బయట పెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు.” అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంక తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లి మెల్లిగా తన మనసులోని కోరికలు దశరథుని తో వెల్లడించసాగింది.

“ఓ దశరథ మహారాజా! మీరు ఎంతో ఒట్టు పెట్టుకొన్నారు. కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షీభూతంగా విన్నారు. వారే కాదు సూర్య చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్లు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశా చరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా! సకల దేవతలారా! వినండి. నాకు, నా భర్త దశరథమహారాజుగారు, పూర్వముదేవాసుర యుద్ధములలో నాకు ఇస్తాను అని వాగ్దానము చేసిన రెండు వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు.” అని పలికి కైక దశరథుని వచన బద్ధుని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరోగత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైకమీది మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలకు అన్నిటికీ మరోమాట మాట్లాడకుండా తలూపుతున్నాడు.

“ఓ దశరథ మహారాజా! ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా! ఆ యుద్ధములో మీరు ఓడిపోయే పరిస్తితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించి పోయాయి. అప్పుడు నేను మిమ్ములను రెండు సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసారు. మీకు గుర్తు ఉంది కదా! కాని నేను అప్పుడు ఆ వరములు కోరలేదు. నాకు ఇష్టం వచ్చినపుడు కోరుకుంటాను అని అన్నాను. . మీరు సత్యవాక్పరిపాలకులు. ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆవరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యము అవుతుంది.” అని నేర్పుగా దశరథుని తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామ పాశములలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తలూపాడు. “నీవు ఏం కోరితే అది ఇస్తాను. సందేహించకు” అని వాగ్దానం చేసాడు దశరథుడు.

“ఓ దశరథమహారాజా! ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆ నాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటు న్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా! ఎన్నో ఏర్పాట్లు చేసారు కదా! నగరమంతా అలంకరింపచేసారు కదా! చాలాసంతోషము. కాని ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో, రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యౌవ్వరాజ్య పట్టాభిషేకము జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము.” అంది కైక.

దశరథునికి తలతిరిగినట్టయింది. “మరి రాముడు! రాముడు ఏమవుతాడు!” అని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక “రాముడు పదునాలుగు సంవత్సరములు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరము.” అని పలికింది కైక.

దశరథునికి నోటి మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉ న్నాడు దశరథుడు. మరలా ఇలా అంది. “నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ చేయాలి. (అంటే రాముడు భరతునికి శత్రుసమానుడు అని చెప్పకనే చెప్పింది కైక). అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్లాలి. రాముడు వనవాసమునకు వెళ్లడం నేను కళ్లారా చూడాలి. ఓ దశరథ మహారాజా! ఓ సత్యవాక్పరిపాలకా! మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్న మాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మము. అన్న మాట నిలబెట్టుకుంటే నీకు పరలోకములో సుఖశాంతులు కలుగుతాయి.” అని తేల్చి చెప్పింది కైక. (ఇంక ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అప్రయత్నంగా కైక నోటినుండి వెలువడింది.).

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్వాదశః సర్గః (12) >>

Balakanda Sarga 10 In Telugu – బాలకాండ దశమః సర్గః

Balakanda Sarga 10 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ దశమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాలను రక్షించడానికి దశరథ మహారాజును కలిసి, రాముడిని సహాయం చేయమని అడుగుతాడు. తొలుత దశరథుడు ససేమిరా అంటాడు, కానీ వసిష్ఠ మహర్షి సలహా మేరకు, రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రతో కలిసి యజ్ఞాలను రక్షించడానికి బయలుదేరుతారు.

ఋశ్యశృంగస్యాంగదేశానయనప్రకారః

సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా |
యథర్శ్యశృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ ||

1

రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః |
ఉపాయో నిరపాయోఽయమస్మాభిరభిమంత్రితః ||

2

ఋశ్యశృంగో వనచరస్తపః స్వాధ్యాయనే రతః |
అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ ||

3

ఇంద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభిః |
పురమానాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతామ్ ||

4

గణికాస్తత్ర గచ్ఛంతు రూపవత్యః స్వలంకృతాః |
ప్రలోభ్య వివిధోపాయైరానేష్యంతీహ సత్కృతాః ||

5

శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్ |
పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా ||

6

వారముఖ్యాస్తు తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్ |
ఆశ్రమస్యావిదూరేఽస్మిన్యత్నం కుర్వంతి దర్శనే ||

7

ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః |
పితుః స నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ ||

8

న తేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా |
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సత్త్వం నగరరాష్ట్రజమ్ ||

9

తతః కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా |
విభండకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాంగనాః ||

10

తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యో మధురస్వరైః |
ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్ ||

11

కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ |
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః ||

12

అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః |
హార్దాత్తస్య మతిర్జాతా హ్యఖ్యాతుం పితరం స్వకమ్ ||

13

పితా విభండకోఽస్మాకం తస్యాహం సుత ఔరసః |
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి ||

14

ఇహాశ్రమపదేఽస్మాకం సమీపే శుభదర్శనాః |
కరిష్యే వోఽత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్ ||

15

ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై |
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముః సర్వాశ్చ తేన తాః ||

16

ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార హ |
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలమిదం ఫలమ్ ||

17

ప్రతిగృహ్య తు తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః |
ఋషేర్భీతాస్తు శీఘ్రం తా గమనాయ మతిం దధుః ||

18

అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ |
గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్ ||

19

తతస్తాస్తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః |
మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ శుభాన్ ||

20

తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే |
అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్ ||

21

ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ |
గచ్ఛంతి స్మాపదేశాత్తాః భీతాస్తస్య పితుః స్త్రియః ||

22

గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః |
అస్వస్థహృదయశ్చాసీద్దుఃఖాత్సంపరివర్తతే ||

23

తతోఽపరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్ |
[* విభండకసుతః శ్రీమాన్మనసా చింతయన్ముహుః | *]
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాః స్వలంకృతాః ||

24

దృష్ట్వైవ చ తదా విప్రమాయాంతం హృష్టమానసాః |
ఉపసృత్య తతః సర్వాస్తాస్తమూచురిదం వచః ||

25

ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్ |
[* చిత్రాణ్యత్ర బహూని స్యుర్మూలాని చ ఫలని చ | *]
తత్రాప్యేష విధిః శ్రీమాన్విశేషేణ భవిష్యతి ||

26

శ్రుత్వా తు వచనం తాసాం మునిస్తద్ధృదయం‍గమమ్ |
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తధా స్త్రియః ||

27

తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా ||

28

వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః |
ప్రత్యుద్గమ్య మునిం ప్రీతః శిరసా చ మహీం గతః ||

29 [ప్రహ్వ]

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై నియతః సుసమాహితః |
వవ్రే ప్రసాదం విప్రేంద్రాన్మా విప్రం మన్యురావిశేత్ ||

30

అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్త్వా యథావిధి |
శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాప సః ||

31

ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః |
ఋశ్యశృంగో మహాతేజాః శాంతయా సహ భార్యయా ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే దశమః సర్గః ||

Balakanda Sarga 10 Meaning In Telugu

దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు.

“మహారాజా! రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు.

“మహారాజా! ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటినుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావవిలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము.” అని అన్నారు. దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిగి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు.

ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగ సాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు.

“ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? ఇక్కడు ఏమి చేస్తున్నారు.” అని అడిగారు.

“నేను విభాండకుని పుత్రుడను. నాపేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు. ఇలా ఎందుకు ఉన్నారు.” అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్లాడు. వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. కాని ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడి వడిగా అక్కడి నుండి వెళ్లాలి అనుకున్నారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురము లైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు.

“ ఓ బ్రాహ్మణోత్తమా! ఇవి మధుర ఫలములు. ఆరగింపుడు.” అని అన్నారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకొన్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములు అనుకొన్నాడు. కడుపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్లిపోయారు.

వారు వెళ్లి పోయిన తరువాత ఋశ్యశృంగునికి మనసు వికలమయింది. వారినే తలచు కుంటూ, వారి స్పర్శసుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు.

మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువ లేదు. ఆ వేశ్యలను మరలా కలుసు కోడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు ఆక్కడకు వెళ్లారు. అతనితో ఇలా అన్నారు.

“ఓ బ్రాహ్మణోత్తమా! నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిధ్యము స్వీకరించ వలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చెదము. వాటిని తమరు తనివిదీరా ఆరగింప వచ్చును” అని అన్నారు.

ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ, అంగదేశమునకు తీసుకొని వెళ్లారు. ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే గా వానలు కురిసాయి. పంటలు పండాయి. కరువుకాటకాలు తీరిపోయాయి.

రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చిసత్కరించాడు. “మహాత్మా! తమరి రాకచే మా అంగరాజ్యము పావనము అయింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నాకుమార్తె శాంతను వివాహమాడండి. ” అని ప్రార్థించాడు.

ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంత కాలం పాటు అంగరాజ్యములోనే ఉన్నాడు.

ఇది
వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదవసర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ  ఏకాదశః సర్గః  (11>>

Balakanda Sarga 9 In Telugu – బాలకాండ నవమః సర్గః

Balakanda Sarga 9 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో నవమ సర్గము ఒక ముఖ్యమైన భాగము. దశరథ రాజు మంత్రిగా ఉన్న సుమంత్రుడు, ఋషిశృంగ మహర్షి యొక్క ముఖ్యతనను వివరించాడు. ఆ మహర్షిని ఆలోచించిన వైదిక కర్మకు అధ్యక్షత వహించడానికి రాజుని ఆహ్వానించాడు. రాజు వేడుకున్నాడు, ఆ మహర్షి ఏ రాజ్యంలో ప్రవేశించడం మరియు ఆ దేశానికి ప్రజలకు శుభదాయకంగా ఉండడం సంబంధించింది.

ఋశ్యశృంగోపాఖ్యానమ్

ఏతచ్ఛ్రుత్వా రహః సూతో రాజానమిదమబ్రవీత్ |
[* శ్రూయతాం తత్ పురా వృత్తం పురాణే చ మయా శ్రుతమ్ | *]
ఋత్విగ్భిరుపదిష్టోఽయం పురావృత్తో మయా శ్రుతః ||

1

సనత్కుమారో భగవాన్పూర్వం కథితవాన్కథామ్ |
ఋషీణాం సన్నిధౌ రాజంస్తవ పుత్రాగమం ప్రతి ||

2

కాశ్యపస్య తు పుత్రోఽస్తి విభండక ఇతి శ్రుతః |
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి ||

3

స వనే నిత్యసంవృద్ధో మునిర్వనచరః సదా |
నాన్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రానువర్తనాత్ ||

4

ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః |
లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా ||

5

తస్యైవం వర్తమానస్య కాలః సమభివర్తతే |
అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినమ్ ||

6

ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్ |
అంగేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః ||

7

తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా |
అనావృష్టిః సుఘోరా వై సర్వభూతభయావహా ||

8

అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖసమన్వితః |
బ్రాహ్మణాఞ్శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి ||

9

భవంతః శ్రుతధర్మాణో లోకచారిత్రవేదినః |
సమాదిశంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ ||

10

[* ఇత్యుక్తాస్తే తతో రాజ్ఞా సర్వే బ్రాహ్మణసత్తమాః | *]
వక్ష్యంతి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగాః |
విభండకసుతం రాజన్సర్వోపాయైరిహానయ ||

11

ఆనీయ చ మహీపాల ఋశ్యశృంగం సుసత్కృతమ్ |
ప్రయచ్ఛ కన్యాం శాంతాం వై విధినా సుసమాహితః ||

12

తేషాం తు వచనం శ్రుత్వా రాజా చింతాం ప్రపత్స్యతే |
కేనోపాయేన వై శక్యమిహానేతుం స వీర్యవాన్ ||

13

తతో రాజా వినిశ్చిత్య సహ మంత్రిభిరాత్మవాన్ |
పురోహితమమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్ ||

14

తే తు రాజ్ఞో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః |
న గచ్ఛేమ ఋషేర్భీతా అనునేష్యంతి తం నృపమ్ ||

15

వక్ష్యంతి చింతయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్క్షమాన్ |
ఆనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి ||

16

ఏవమంగాధిపేనైవ గణికాభిరృషేః సుతః |
ఆనీతోఽవర్షయద్దేవః శాంతా చాస్మై ప్రదీయతే ||

17

ఋశ్యశృంగస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి |
సనత్కుమారకథితమేతావద్వ్యాహృతం మయా ||

18

అథ హృష్టో దశరథః సుమంత్రం ప్రత్యభాషత |
యథార్శ్యశృంగస్త్వానీతో విస్తరేణ త్వయోచ్యతామ్ ||

19

ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు.

“మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే…..

కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు.

ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ వర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తనరాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి.” అని అడిగాడు.

దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజా! నీ పాపము పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం.” అని అన్నారు.

ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉ పాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనేపోయి ఋష్యశృంగుని తీసుకొనిరండి.” అని ఆజ్ఞాపిం చాడు. విభాండకునికి భయపడి వారు “మేము వెళ్లము” అని అన్నారు. కాని వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్పారు. అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీసాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమము రుచి చూపించి, తీసుకొని రావచ్చును అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొన వచ్చును అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేసారు.

రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని, తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేసాడు. ఓ దశరధమహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను.”అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు.

“సుమంతా! రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకు రాగలిగాడు. వివరంగా చెప్పు.” అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో తొమ్మిదవసర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ దశమః సర్గః (10) >>

Ayodhya Kanda Sarga 3 In Telugu – అయోధ్యాకాండ తృతీయః సర్గః

Ayodhya Kanda Sarga 3 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. తృతీయ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో ముఖాముఖి అవుతాడు. ఈ సమయంలో, దశరథ మహారాజు కైకేయి ఇచ్చిన వరాల ప్రభావంతో రాముని అరణ్యవాసానికి పంపించవలసిన అవసరం గురించి చర్చ జరుగుతుంది. ఈ సర్గ రాముని విధేయత, పితృవాక్యపాలన, ధర్మం పట్ల అతని అచంచల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాముడు తన తండ్రి మాటలను గౌరవిస్తూ, కైకేయి కోరిన వరాలను అంగీకరించి, అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. ఈ సర్గ రాముని మహానుభావతను మరియు అతని ధార్మికతను స్పష్టంగా చూపిస్తుంది.

పుత్రానుశాసనమ్

తేషామంజలిపద్మాని ప్రగృహీతాని సర్వశః |
ప్రతిగృహ్యాబ్రవీద్రాజా తేభ్యః ప్రియహితం వచః ||

1

అహోఽస్మి పరమప్రీతః ప్రభావశ్చాతులో మమ |
యన్మే జ్యేష్ఠం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థమిచ్ఛథ ||

2

ఇతి ప్రత్యర్చ్య తాన్రాజా బ్రాహ్మణానిదమబ్రవీత్ |
వసిష్ఠం వామదేవం చ తేషామేవోపశృణ్వతామ్ ||

3

చైత్రః శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః |
యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్ ||

4

రాజ్ఞస్తూపరతే వాక్యే జనఘోషో మహానభూత్ |
శనైస్తస్మిన్ప్రశాంతే చ జనఘోషే జనాధిపః ||

5

వసిష్ఠం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్ |
అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదమ్ ||

6

తదద్య భగవాన్సర్వమాజ్ఞాపయితుమర్హసి |
తచ్ఛ్రుత్వా భూమిపాలస్య వసిష్ఠో ద్విజసత్తమః ||

7

ఆదిదేశాగ్రతో రాజ్ఞః స్థితాన్యుక్తాన్కృతాంజలీన్ |
సువర్ణాదీని రత్నాని బలీన్సర్వౌషధీరపి ||

8

శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధుసర్పిషీ |
అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి ||

9

చతురంగబలం చైవ గజం చ శుభలక్షణమ్ |
చామరవ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురమ్ ||

10

శతం చ శాతకుంభానాం కుంభానామగ్నివర్చసామ్ |
హిరణ్యశృంగమృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ||

11

ఉపస్థాపయత ప్రాతరగ్న్యగారం మహీపతేః |
యచ్చాన్యత్కించిదేష్టవ్యం తత్సర్వముపకల్ప్యతామ్ ||

12

అంతఃపురస్య ద్వారాణి సర్వస్య నగరస్య చ |
చందనస్రగ్భిరర్చ్యంతాం ధూపైశ్చ ఘ్రాణహారిభిః ||

13

ప్రశస్తమన్నం గుణవద్దధిక్షీరోపసేచనమ్ |
ద్విజానాం శతసాహస్రే యత్ప్రకామమలం భవేత్ ||

14

సత్కృత్య ద్విజముఖ్యానాం శ్వః ప్రభాతే ప్రదీయతామ్ |
ఘృతం దధి చ లాజాశ్చ దక్షిణాశ్చాపి పుష్కలాః ||

15

సూర్యేఽభ్యుదితమాత్రే శ్వో భవితా స్వస్తివాచనమ్ |
బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యంతాం కల్ప్యంతామాసనాని చ ||

16

ఆబధ్యంతాం పతాకాశ్చ రాజమార్గశ్చ సిచ్యతామ్ |
సర్వే చ తాలావచరా గణికాశ్చ స్వలంకృతాః ||

17

కక్ష్యాం ద్వితీయామాసాద్య తిష్ఠంతు నృపవేశ్మనః |
దేవాయతనచైత్యేషు సాన్నభక్షాః సదక్షిణాః ||

18

ఉపస్థాపయితవ్యాః స్యుర్మాల్యయోగ్యాః పృథక్ పృథక్ |
దీర్ఘాసిబద్ధా యోధాశ్చ సన్నద్ధా మృష్టవాససాః ||

19

మహారాజాంగణం సర్వే ప్రవిశంతు మహోదయమ్ |
ఏవం వ్యాదిశ్య విప్రౌ తౌ క్రియాస్తత్ర సునిష్ఠితౌ ||

20

చక్రతుశ్చైవ యచ్ఛేషం పార్థివాయ నివేద్య చ |
కృతమిత్యేవ చాబ్రూతామభిగమ్య జగత్పతిమ్ ||

21

యథోక్తవచనం ప్రీతౌ హర్షయుక్తౌ ద్విజర్షభౌ |
తతః సుమంత్రం ద్యుతిమాన్రాజా వచనమబ్రవీత్ ||

22

రామః కృతాత్మా భవతా శీఘ్రమానీయతామితి |
స తథేతి ప్రతిజ్ఞాయ సుమంత్రో రాజశాసనాత్ ||

23

రామం తత్రానయాంచక్రే రథేన రథినాం వరమ్ |
అథ తత్ర సమాసీనాస్తదా దశరథం నృపమ్ ||

24

[* ఉపవిష్టాశ్చ సచివాః రాజానశ్చ సనైగమాః | *]
ప్రాచ్యోదీచ్యాః ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ భూమిపాః |
మ్లేచ్ఛాశ్చార్యాశ్చ యే చాన్యే వనశైలాంతవాసినః ||

25

ఉపాసాంచక్రిరే సర్వే తం దేవా ఇవ వాసవమ్ |
తేషాం మధ్యే స రాజర్షిర్మరుతామివ వాసవః ||

26

ప్రాసాదస్థో రథగతం దదర్శాయాంతమాత్మజమ్ |
గంధర్వరాజప్రతిమం లోకే విఖ్యాతపౌరుషమ్ ||

27

దీర్ఘబాహుం మహాసత్త్వం మత్తమాతంగగామినమ్ |
చంద్రకాంతాననం రామమతీవ ప్రియదర్శనమ్ ||

28

రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్ |
ఘర్మాభితప్తాః పర్జన్యం హ్లాదయంతమివ ప్రజాః ||

29

న తతర్ప సమాయాంతం పశ్యమానో నరాధిపః |
అవతార్య సుమంత్రస్తం రాఘవం స్యందనోత్తమాత్ ||

30

పితుః సమీపం గచ్ఛంతం ప్రాంజలిః పృష్ఠతోఽన్వగాత్ |
స తం కైలాసశృంగాభం ప్రాసాదం నరపుంగవః ||

31

ఆరురోహ నృపం ద్రష్టుం సహ సూతేన రాఘవః |
స ప్రాం‍జలిరభిప్రేత్య ప్రణతః పితురంతికే ||

32

నామ స్వం శ్రావయన్రామో వవందే చరణౌ పితుః |
తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే కృతాంజలిపుటం నృపః ||

33

గృహ్యాంజలౌ సమాకృష్య సస్వజే ప్రియమాత్మజమ్ |
తస్మై చాభ్యుదితం సమ్యఙ్మణికాంచనభూషితమ్ ||

34

దిదేశ రాజా రుచిరం రామాయ పరమాసనమ్ |
తదాసనవరం ప్రాప్య వ్యదీపయత రాఘవః ||

35

స్వయైవ ప్రభయా మేరుముదయే విమలో రవిః |
తేన విభ్రాజతా తత్ర సా సభాఽభివ్యరోచత ||

36

విమలగ్రహనక్షత్రా శారదీ ద్యౌరివేందునా |
తం పశ్యమానో నృపతిస్తుతోష ప్రియమాత్మజమ్ ||

37

అలంకృతమివాత్మానమాదర్శతలసంస్థితమ్ |
స తం సస్మితమాభాష్య పుత్రం పుత్రవతాం వరః ||

38

ఉవాచేదం వచో రాజా దేవేంద్రమివ కశ్యపః |
జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశః సుతః ||

39

ఉత్పన్నస్త్వం గుణశ్రేష్ఠో మమ రామాత్మజః ప్రియః |
త్వయా యతః ప్రజాశ్చేమాః స్వగుణైరనురంజితాః || [యతస్త్వయా]

40

తస్మాత్త్వం పుష్యయోగేన యౌవరాజ్యమవాప్నుహి |
కామతస్త్వం ప్రకృత్యైవ వినీతో గుణవానసి ||

41

గుణవత్యపి తు స్నేహాత్పుత్ర వక్ష్యామి తే హితమ్ |
భూయో వినయమాస్థాయ భవ నిత్యం జితేంద్రియః ||

42

కామక్రోధసముత్థాని త్యజేథా వ్యసనాని చ |
పరోక్షయా వర్తమానో వృత్త్యా ప్రత్యక్షయా తథా ||

43

అమాత్యప్రభృతీః సర్వాః ప్రకృతీశ్చానురంజయ |
కోష్ఠాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాన్బహూన్ ||

44

తుష్టానురక్తప్రకృతిర్యః పాలయతి మేదినీమ్ | [ఇష్టా]
తస్య నందంతి మిత్రాణి లబ్ధ్వాఽమృతమివామరాః ||

45

తస్మాత్పుత్ర త్వమాత్మానం నియమ్యైవం సమాచర | [తస్మాత్త్వమపి చాత్మానం]
తచ్ఛ్రుత్వా సుహృదస్తస్య రామస్య ప్రియకారిణః ||

46

త్వరితాః శీఘ్రమభ్యేత్య కౌసల్యాయై న్యవేదయన్ |
సా హిరణ్యం చ గాశ్చైవ రత్నాని వివిధాని చ ||

47

వ్యాదిదేశ ప్రియాఖ్యేభ్యః కౌసల్యా ప్రమదోత్తమా |
అథాఽభివాద్య రాజానం రథమారుహ్య రాఘవః |
యయౌ స్వం ద్యుతిమద్వేశ్మ జనౌఘైః ప్రతిపూజితః ||

48

తే చాపి పౌరా నృపతేర్వచస్త-
-చ్ఛ్రుత్వా తదా లాభమివేష్టమాశు |
నరేంద్రమామంత్ర్య గృహాణి గత్వా
దేవాన్సమానర్చురభిప్రహృష్టాః ||

49

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే తృతీయ సర్గః ||

Ayodhya Kanda Sarga 3 Meaning In Telugu

పై విధంగా రాముని గుణగణాలను కీర్తించి, రాముడే యౌవరాజ్య పట్టాభిషేకమునకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు.

“పుర ప్రముఖులారా! నా జ్యేష్టపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు, అయిన రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభమగు గాక!” అనిపలికి తన పురోహితు లైన వసిష్ఠుడు, వామదేవులను చూచి ఇలా అన్నాడు.

“రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము. చైత్ర మాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు.

ఆమాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేసారు. తరువాత దశరథుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! రాబోవు చైత్రమాసములో జరుగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి.” అని అన్నాడు.

ఆ మాటలు వినిన వసిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు.

పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పములు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథములు, ఆయుధములు, చతురంగ బలములు,శు భలక్షణములు ఉన్న గజములు, ఛత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారముతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము, పులి చర్మములు, వీటిని అన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయు గృహములో సిద్ధంగా ఉంచాలి.

అంతఃపురమును, ద్వారములను పుష్పమాలలతో అలంక రింపుడు. సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండి పోవాలి. పాలు,పెరుగు, నెయ్యి మొదలగు ఆహారపదార్థములను సమృద్ధిగా ఉండేట్టు చూడండి. బ్రాహ్మణ సంతర్పణలు ఏ లోటూ లేకుండా జరగాలి. బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనము పలకాలి. అందుకు కావలసినవి సిద్ధం చేయండి. ఇంక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకములు కట్టండి. అరటి స్తంభములు, తోరణములు కట్టండి. రామునికి స్వాగతము పలకడానికి వేశ్యాస్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించుటకు అన్న ప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి. సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి, పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకొని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేయించండి.” అని ఆదేశాలు ఇచ్చారు.

వసిష్ఠుడు వామదేవుడు తాము చేసిన ఏర్పాట్లు గురించి దశరథునికి తెలియజేసారు. తాను అనుకొన్న ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంతుని పిలిచాడు.

“సుమంతా! నీవుపోయి రాముని నా దగ్గరకు తీసుకొనిరా.” అని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంతుడు రాముని వద్దకు వెళ్లాడు.

దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంంతులందరితో సమావేశము అయ్యాడు. ఇంతలో సుమంతుడు పోయి రాముని రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకొని వచ్చాడు. రాముని రాకను దూరంనుండే చూచాడు దశరథుడు. రథము మీద ఠీవిగా కూర్చున్న రాముని చూడడానికి దశరథునికి వేయి కన్నులు ఉ న్నా ఇంకా చాలవేమో అనిపించింది. “ఎంత చూచినా ఇంకా చూడాలని పించే సౌందర్యము రామునిది” అని అనుకున్నాడు దశరథుడు.

రాముడు రథం దిగాడు. రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకొని నడుస్తున్నాడు. రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రాముని రెండు చేతులతో పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. తరువాత తన పక్కను ఉన్న ఒక ఉ న్నతాసనము మీద కూర్చోపెట్టాడు.

దశరథుడు రామునితో ఇలా అన్నాడు. ” ఓ రామా! నీవు నాకు జ్యేష్ట పుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య. పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చేయాలని సంకల్పించాను. రాబోవు పుష్యమీ నక్షత్రము నందు నీకు యౌవరాజ్య పట్టాభిషేకము జరుపనిశ్చయించాను. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడుగా కొన్ని విషయాలు చెబుతున్నాను. శ్రద్ధగా విను.

నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. నీవు అందరితో వినయంగా ఉండాలి. నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. కామము, క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానీయకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ధనముతోనూ, ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేట్టు చూచుకోవాలి. ఆ ప్రకారంగా రాజ్యపాలన చెయ్యాలి.” అనిఅన్నాడు దశరథుడు.

ఇంతలో రాముని మిత్రులు ఈసంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు. కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగి పోయింది. ఆ వార్త తెచ్చినవారికి బంగారు ఆభరణములు బహు మానంగా ఇచ్చి సత్కరించింది.

దశరథుని వద్ద ఉన్న రాముడు, తండ్రికి నమస్కరించి, తన గృహమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము తృతీయ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్థః సర్గః (4) >>

Balakanda Sarga 8 In Telugu – బాలకాండ అష్టమః సర్గః

Balakanda Sarga 8 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టమః సర్గః రామాయణంలోని కీలకమైన భాగం. ఈ సర్గ రాముడి జననం మరియు బాల్యాన్ని వివరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించి, పుత్రులను పొందుతాడు. కౌసల్య, కైకేయి, సుమిత్రలు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడుగా పుత్రులను ప్రసాదిస్తారు. వసిష్ఠ మహర్షి సలహా మేరకు, ఈ పిల్లలు పెరుగుతారు.

సుమంత్రవాక్యమ్

తస్య త్వేవం‍ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః |
సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరః సుతః ||

1

చింతయానస్య తస్యేయం బుద్ధిరాసీన్మహాత్మనః |
సుతార్థీ వాజిమేధేన కిమర్థం న యజామ్యహమ్ ||

2

స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్ |
మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః ||

3

తతోఽబ్రవీదిదం తేజాః సుమంత్రం మంత్రిసత్తమమ్ |
శీఘ్రమానయ మే సర్వాన్గురూంస్తాన్సపురోహితాన్ ||

4

తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్స తాన్సర్వాన్గురూంస్తాన్వేదపారగాన్ ||

5

సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః ||

6

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ఇదం ధర్మార్థసహితం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

7

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||

8

తదహం యష్టుమిచ్ఛమి శాస్త్రదృష్టేన కర్మణా |
కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్ర విచార్యతామ్ ||

9

తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖేరితమ్ ||

10

ఊచుశ్చ పరమప్రీతాః సర్వే దశరథం వచః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

11

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ |
సర్వథా ప్రాప్స్యసే పుత్రానభిప్రేతాంశ్చ పార్థివ ||

12

యస్య తే ధర్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా |
తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వైతద్ద్విజభాషితమ్ ||

13

అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షపర్యాకులేక్షణః |
సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ ||

14

సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ |
సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ ||

15

శాంతయశ్చాభివర్ధంతాం యథాకల్పం యథావిధి |
శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా ||

16

నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే |
ఛిద్రం హి మృగయంతేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః ||

17

విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి | [విహతస్య]
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే ||

18

తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ |
తథేతి చాబ్రువన్సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ ||

19

పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్య తే |
తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్థయంతో నృపోత్తమమ్ ||

20

అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతమ్ |
విసర్జయిత్వా తాన్విప్రాన్సచివానిదమబ్రవీత్ ||

21

ఋత్విగ్భిరుపసందిష్టో యథావత్క్రతురాప్యతామ్ |
ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్సముపస్థితాన్ ||

22

విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః |
తతః స గత్వా తాః పత్నీర్నరేంద్రో హృదయప్రియాః ||

23

ఉవాచ దీక్షాం విశత యక్ష్యేఽహం సుతకారణాత్ |
తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసామ్ |
ముఖపద్మాన్యశోభంత పద్మానీవ హిమాత్యయే ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టమః సర్గః ||

 

Balakanda Sarga 8 Meaning In Telugu

అటువంటి పుణ్యచరితుడైన దశరధమహారాజుకు చాలా కాలం వరకూ పుత్రసంతానము కలగలేదు. వంశాంకురము లేడని దశరధ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్యయించాడు. వెంటనే పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరధుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్టవామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు, ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు.

దశరథుడు వారి నందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉ చితాసనముల మీద కూర్చో పెట్టాడు. “మహాత్ములారా! మీకు తెలుసు కదా! నాకు పుత్రసంతానము లేరు. ఈ విషయము నన్ను నిరంతరమూ బాధించుచున్నది. పుత్రసంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలచుకొన్నాను. ఆ యాగము ఎలా చేయవలెనో మీరు చెప్పండి.” అని అడిగాడు.

దశరధుని నిర్ణయమును వశిష్టవామదేవులు ప్రశంసించారు.

“ఓ దశరథమహారాజా! మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజస మైనదే. మీకు తప్పక పుత్రసంతానము కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి.” అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమనీ, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు. సరమూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతి యాగములను జరిపించమని, ఆదేశించాడు. ఇంకా ఇలా పలికాడు దశరధుడు.

“ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగచేయుటకు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారు. యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును. మీరందరూ విద్వాంసులే కదా. కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధమూ లేకుండా జరిపించండి.” అని పలికాడు దశరథుడు.

“తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించెదము.” అని పలికారు పురోహితులు. తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్లిపోయారు. దశరథుడు తన మంత్రులను చూచి “మీరందరూ పురోహితులకు సహకరించండి. యాగము నిర్విఘ్నముగా జరిగేట్టు చూడండి.” అని ఆజ్ఞాపించాడు.

తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్లాడు. తన భార్యలను చూచి “నేను పుత్రసంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను. నాతో పాటుమీరూ యాగ దీక్ష వహించండి.” అని చెప్పాడు. ఆమాటలు విని దశరధుని భార్యలుసంతోషించారు. తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనంద పడ్డారు. భర్త చెప్పిన ప్రకారము యాగ దీక్ష స్వీకరించారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ నవమః సర్గః (9>>