Ayodhya Kanda Sarga 70 In Telugu – అయోధ్యాకాండ సప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 70

అయోధ్యాకాండ సప్తతితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయి మీద ఆగ్రహంతో తన బాధను వ్యక్తం చేస్తాడు. భరతుడు రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పాలించే అర్హత కలిగినవారు కాదని కైకేయికి చెప్పుతాడు. భరతుడు రాముని అన్వేషణ కోసం, ఆయనను తిరిగి తీసుకురావడానికి నిర్ణయించుకుంటాడు. దశరథ మహారాజు మరణం, రాముని వనవాసం కారణంగా అయోధ్య నగరం విషాదంలో మునిగిపోతుంది. భరతుడు రాముని తిరిగి తీసుకురావడానికి పండితులతో, మంత్రులతో కలిసి వనానికి బయలుదేరుతాడు. ఈ సర్గ భరతుని ధర్మపాలన, రాముని పట్ల అతని భక్తి, కుటుంబ బాంధవ్యాలను ప్రధానంగా ప్రతిబింబిస్తుంది.

భరతప్రస్థానమ్

భరతే బ్రువతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహనాః |
ప్రవిశ్యాసహ్య పరిఖం రమ్యం రాజ గృహం పురమ్ || ౧ ||

సమాగమ్య తు రాజ్ఞా చ రాజపుత్రేణ చార్చితాః |
రాజ్ఞః పాదౌ గృహీత్వా తు తమూచుర్భరతం వచః || ౨ ||

పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః |
త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా || ౩ ||

ఇమాని చ మహార్హాణి వస్త్రాణ్యాభరణాని చ |
ప్రతిగృహ్య విశాలాక్ష మాతులస్య చ దాపయ || ౪ ||

అత్ర వింశతికోట్యస్తు నృపతేర్మాతులస్య తే |
దశకోట్యస్తు సంపూర్ణాస్తథైవ చ నృపాత్మజ || ౫ ||

ప్రతిగృహ్య చ తత్సర్వం స్వనురక్తః సుహృజ్జనే |
దూతానువాచ భరతః కామైః సంప్రతిపూజ్య తాన్ || ౬ ||

కచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ |
కచ్చిచ్చారోగతా రామే లక్ష్మణే చ మహాత్మని || ౭ ||

ఆర్యా చ ధర్మనిరతా ధర్మజ్ఞా ధర్మదర్శినీ |
అరోగా చాపి కౌసల్యా మాతా రామస్య ధీమతః || ౮ ||

కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞా జననీ లక్ష్మణస్య యా |
శత్రుఘ్నస్య చ వీరస్య సాఽరోగా చాపి మధ్యమా || ౯ ||

ఆత్మకామా సదా చండీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చాపి మే మాతా కైకేయీ కిమువాచ హ || ౧౦ ||

ఏవముక్తాస్తు తే దూతాః భరతేన మహాత్మనా |
ఊచుః సంప్రశ్రయం వాక్యమిదం తం భరతం తదా || ౧౧ ||

కుశలాస్తే నరవ్యాఘ్ర యేషాం కుశలమిచ్ఛసి |
శ్రీశ్చ త్వాం వృణుతే పద్మా యుజ్యతాం చాపి తే రథః || ౧౨ ||

భరతశ్చాపి తాన్ దూతాన్ ఏవముక్తోఽభ్యభాషత |
ఆపృచ్చేఽహం మహారాజం దూతాః సంత్వరయంతి మామ్ || ౧౩ ||

ఏవముక్త్వా తు తాన్ దూతాన్ భరతః పార్థివాత్మజః |
దూతైః సంచోదితః వాక్యం మాతామహమువాచ హ || ౧౪ ||

రాజన్ పితుర్గమిష్యామి సకాశం దూతచోదితః |
పునరప్యహమేష్యామి యదా మే త్వం స్మరిష్యసి || ౧౫ ||

భరతేనైవముక్తస్తు నృపో మాతామహస్తదా |
తమువాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవమ్ || ౧౬ ||

గచ్ఛ తాతానుజానే త్వాం కైకేయీసుప్రజాస్త్వయా |
మాతరం కుశలం బ్రూయాః పితరం చ పరంతప || ౧౭ ||

పురోహితం చ కుశలం యే చాన్యే ద్విజ సత్తమాః |
తౌ చ తాత మహేష్వాసౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౮ ||

తస్మై హస్త్యుత్తమాంశ్చిత్రాన్ కంబలానజినాని చ |
అభిసత్కృత్య కైకేయో భరతాయ ధనం దదౌ || ౧౯ ||

రుక్మనిష్కసహస్రే ద్వే షోడశాశ్వశతాని చ |
సత్కృత్య కైకేయీపుత్రం కేకయో ధనమాదిశత్ || ౨౦ ||

తథాఽమాత్యానభిప్రేతాన్ విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్ |
దదావశ్వపతిః క్షిప్రం భరతాయానుయాయినః || ౨౧ ||

ఐరావతానైంద్రశిరాన్ నాగాన్వై ప్రియదర్శనాన్ |
ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్తాన్ మాతులోఽస్మై ధనం దదౌ || ౨౨ ||

అంతఃపురేఽతి సంవృద్ధాన్ వ్యాఘ్రవీర్యబలాన్వితాన్ |
దంష్ట్రాఽఽయుధాన్ మహాకాయాన్ శునశ్చోపాయనం దదౌ || ౨౩ ||

స దతం కేకయేంద్రేణ ధనం తన్నాభ్యనందత |
భరతః కైకయీపుత్రః గమనత్వరయా తదా || ౨౪ ||

బభూవ హ్యస్య హృదతే చింతా సుమహతీ తదా |
త్వరయా చాపి దూతానాం స్వప్నస్యాపి చ దర్శనాత్ || ౨౫ ||

స స్వవేశ్మాభ్యతిక్రమ్య నరనాగశ్వసంవృతమ్ |
ప్రపేదే సుమహచ్ఛ్రీమాన్ రాజమార్గమనుత్తమమ్ || ౨౬ ||

అభ్యతీత్య తతోఽపశ్యదంతః పురముదారధీః |
తతస్తద్భరతః శ్రీమానావివేశానివారితః || ౨౭ ||

స మాతా మహమాపృచ్ఛ్య మాతులం చ యుధాజితమ్ |
రథమారుహ్య భరతః శత్రుఘ్నసహితో యయౌ || ౨౮ ||

రథాన్ మండల చక్రాంశ్చ యోజయిత్వా పరః శతమ్ |
ఉష్ట్ర గోఽశ్వఖరైః భృత్యా భరతం యాంతమన్వయుః || ౨౯ ||

బలేన గుప్తః భరతః మహాత్మా
సహార్యకస్యాఽత్మ సమైరమాత్యైః |
ఆదాయ శత్రుఘ్నమపేతశత్రుః
గృహాత్ యయౌ సిద్ధైవేంద్రలోకాత్ || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తతితమః సర్గః || ౭౦ ||

Ayodhya Kanda Sarga 70 Meaning In Telugu

భరతుడు తనకు వచ్చిన కల గురించి తనస్నేహితునికి చెబుతున్న సమయంలో అయోధ్యనుండి వచ్చిన దూతలు భరతుని వద్దకు వచ్చారు. కేకయ రాజును కలుసుకున్నారు. కేకయ రాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్యనుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకయ రాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు.

“రాజకుమారా! తమ కులగురువు వసిష్ఠుడు, తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వసిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరము ఉన్నదట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మని చెప్పారు. అ దూతలు వసిష్ఠుడు చెప్పినట్టు చెప్పారు.

భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. “దూతలారా! నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా. నా అన్న రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా! రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉన్నదా! లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నదా! స్వాతిశయము కలదీ, ఎల్లప్పుడూ తన సుఖము మాత్రమే చూచుకొనేదీ, కోపస్వభావము కలదీ, గర్విష్టీ అయిన మా తల్లి కైక క్షేమంగా ఉన్నదా! మా అమ్మ నాతో చెప్పమని ఏమైనా సమాచారము పంపినదా! ” అని ఆతురతగా అడిగాడు భరతుడు.

ఆ మాటలకు దూతలు ఇలా బదులు చెప్పారు. “రాకుమారా! నీవు ఎవరెవరినీ అయితే అడిగావో వారందరూ క్షేమంగా ఉన్నారు. నిన్ను లక్ష్మీదేవి వరించినది. (నిన్ను రాజ్యలక్ష్మి వరించినది. అయోధ్యకు రాజు కాబోతున్నావు అని నర్మగర్భంగా చెప్పారు). తమరు మాత్రం వెంటనే అయోధ్యకు బయలుదేరండి.” అని అన్నారు. దూతలు తొందర పెట్టడం చూచిన భరతుడు తన మేనమామ, తాతగారికి నమస్కరించి వారితో ఇలా అన్నాడు.

“మహారాజా! అయోధ్యనుండి నన్నుతీసుకొని పోవుటకు దూతలు వచ్చారు. మా కులగురువు వసిష్టులవారు నన్ను వెంటనే రమ్మన్నారట. అందుకని నాకు అనుమతి ఇస్తే నేను, శత్రుఘ్నుడు అయోధ్యకు వెళతాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము.” అనికేకయ రాజు అనుమతి కోరాడు భరతుడు. కేకయ రాజు సంతోషంగా అనుమతించాడు. “నాయనా! భరతా! నీ తండ్రి దశరథుని, నీ తల్లి కైక క్షేమము అడిగినట్టు చెప్పు. పురోహితులు వసిష్ఠునికి, బ్రాహ్మణులకు నా నమస్కారములు తెలియచెయ్యి. నీసోదరులు రామ లక్ష్మణులకు నా ఆశీర్వచనములు తెలియచెయ్యి.” అని పలికాడు.

తరువాత కేకయ రాజు అనేక విలువైన వస్తువులను కానుకలను అయోధ్యకు పంపాడు. భరత శత్రుఘ్నులకు కూడా విలువైన కానుకలు ఇచ్చాడు. మార్గములో సహాయానికి విశ్వాసము గల సైనికులను పంపాడు. భరతునికి తనకు వచ్చిన స్వప్నము, ఇప్పుడు దూతలు తొందర పెట్టడం చూచి ఏదో కీడు శంకిస్తున్నాడు. అందుకని తాతగారు, మేనమామ ఇచ్చిన కానుకలు అతనికి సంతోషము కలిగించడం లేదు. భరత శత్రుఘ్నులు రథంఎక్కారు. వారు ఎక్కిన రథము అయోధ్యకు బయలుదేరింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Balakanda Sarga 69 In Telugu – బాలకాండ ఏకోనసప్తతితమః సర్గః

Balakanda Sarga 69 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనసప్తతితమః సర్గలో, దశరథుడు మిథిలాకు వస్తాడు మరియు జనకుడు ఇక్ష్వాకులు అని పిలువబడే పట్టాభిషేక వంశానికి చెందినవాడు కాబట్టి అతన్ని గౌరవప్రదంగా స్వీకరిస్తాడు. అప్పుడు, రాజభోగాలు మరియు ప్రోటోకాల్ యొక్క సాధారణ మార్పిడి తర్వాత, వారందరూ హాయిగా మిథిలాలో ఉంటారు.

దశరథజనకసమాగమః

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయః సబాంధవః |
రాజా దశరథో హృష్టః సుమంత్రమిదమబ్రవీత్ ||

1

అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలమ్ |
వ్రజంత్వగ్రే సువిహితా నానారత్నసమన్వితాః ||

2

చతురంగబలం సర్వం శీఘ్రం నిర్యాతు సర్వశః |
మమాజ్ఞాసమకాలం చ యానయుగ్మమనుత్తమమ్ ||

3

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |
మార్కండేయః సుదీర్ఘాయురృషిః కాత్యాయనస్తథా ||

4

ఏతే ద్విజాః ప్రయాంత్వగ్రే స్యందనం యోజయస్వ మే |
యథా కాలాత్యయో న స్యాద్దూతా హి త్వరయంతి మామ్ ||

5

వచనాత్తు నరేంద్రస్య సా సేనా చతురంగిణీ |
రాజానమృషిభిః సార్ధం వ్రజంతం పృష్ఠతోఽన్వగాత్ ||

6

గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివాన్ |
రాజా తు జనకః శ్రీమాన్ శ్రుత్వా పూజామకల్పయత్ ||

7

తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపమ్ |
జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ ||

8

ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదాన్వితః |
స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ ||

9

పుత్రయోరుభయోః ప్రీతిం లప్స్యసే వీర్యనిర్జితామ్ |
దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవానృషిః ||

10

సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైర్దేవైరివ శతక్రతుః |
దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులమ్ ||

11

రాఘవైః సహ సంబంధాద్వీర్యశ్రేష్ఠైర్మహాత్మభిః |
శ్వః ప్రభాతే నరేంద్ర త్వం నిర్వర్తయితుమర్హసి ||

12

యజ్ఞస్యాంతే నరశ్రేష్ఠ వివాహమృషిసమ్మతమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిపః ||

13

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః ప్రత్యువాచ మహీపతిమ్ |
ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా ||

14

యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్ |
ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదినః ||

15

శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః |
తతః సర్వే మునిగణాః పరస్పరసమాగమే ||

16

హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్సుఖమ్ |
[* అధికపాఠః –
అథ రామో మహాతేజా లక్ష్మణేన సమం యయౌ |
విశ్వామిత్రం పురస్కృత్య పితుః పాదావుపస్పృశన్ |
*]
రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షితః ||

17

ఉవాస పరమప్రీతో జనకేనాభిపూజితః |
జనకోఽపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్ |
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ ||

18

Balakanda Sarga 69 In Telugu Pdf With Meaning

రాత్రి గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లరాజుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు.

“సుమంతా! రాముని వివాహమునకు మనకు మిథిలకు వెళు తున్నాము. ముందు ధనరాసులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్లాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు, మహాఋషులు జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. ఆలస్యము చేయవద్దు.” అని ఆదేశాలు ఇచ్చాడు.

సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేసాడు. నాలుగు రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్యానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేసాడు. దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనముఅయింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వసిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది.

ఓ దశరథమహారజా! మా భాగ్య వశమున రఘువంశ రాజులతో వియ్యమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమయింది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతిని ఇవ్వండి.” అని అన్నాడు జనకుడు.

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెపుతారో అలాగే చేస్తాము.” అని అన్నాడు దశరథుడు.

ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి దశరధుడు, ఆయన వెంట వచ్చిన మునులు, పురోహితులు, పరివారము మిథిలానగరములో సుఖంగా గడిపారు. దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో
ఆనందించాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరువదితొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తతితమః సర్గః (70) >>

Ayodhya Kanda Sarga 48 In Telugu – అయోధ్యాకాండ అష్టచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 48 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ అష్టచత్వారింశః సర్గ, “పౌరాంగనావిలాపః”, రామాయణంలోని ఒక భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత అయోధ్యలోని మహిళలు తీవ్ర విషాదంలో మునిగిపోతారు. రాముడి ప్రస్థానం వాళ్ళు అనుభవించిన వియోగాన్ని, దుఃఖాన్ని ఈ సర్గలో విపులంగా వర్ణించబడింది. రాముడి వినయం, ధర్మం, మరియు ప్రజల పట్ల అతని ప్రేమను గుర్తుచేసుకుంటూ మహిళలు ఆవేదనతో విలపిస్తారు. ఈ సర్గలో, మహిళల ఆక్రందన, రాముడి పట్ల వారి అభిమానం, మరియు వియోగం వలన కలిగిన బాధ హృదయానికి హత్తుకునేలా చూపబడుతుంది.

పౌరాంగనావిలాపః

తేషామేవం విషణ్ణానాం పీడితానామతీవ చ |
బాష్పవిప్లుతనేత్రాణాం సశోకానాం ముమూర్షయా ||

1

అనుగమ్య నివృత్తానాం రామం నగరవాసినామ్ |
ఉద్గతానీవ సత్త్వాని బభూవురమనస్వినామ్ ||

 2

స్వం స్వం నిలయమాగమ్య పుత్రదారైః సమావృతాః |
అశ్రూణి ముముచుః సర్వే బాష్పేణ పిహితాననాః ||

3

న చాహృష్యన్న చామోదన్వణిజో న ప్రసారయన్ |
న చాశోభంత పణ్యాని నాపచన్గృహమేధినః ||

4

నష్టం దృష్ట్వా నాభ్యనందన్విపులం వా ధనాగమమ్ |
పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత ||

5

గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతమ్ |
వ్యగర్హయంత దుఃఖార్తాః వాగ్భిస్తోత్రైరివ ద్విపాన్ ||

6

కిం ను తేషాం గృహైః కార్యం కిం దారైః కిం ధనేన వా |
పుత్రైర్వా కిం సుఖైర్వాఽపి యే న పశ్యంతి రాఘవమ్ ||

7

ఏకః సత్పురుషో లోకే లక్ష్మణః సహ సీతయా |
యోఽనుగచ్ఛతి కాకుత్స్థం రామం పరిచరన్వనే ||

8

ఆపగాః కృతపుణ్యాస్తాః పద్మిన్యశ్చ సరాంసి చ |
యేషు స్నాస్యతి కాకుత్స్థో విగాహ్య సలిలం శుచి ||

9

శోభయిష్యంతి కాకుత్స్థమటవ్యో రమ్యకాననాః |
ఆపగాశ్చ మహానూపాః సానుమంతశ్చ పర్వతాః ||

10

కాననం వాఽపి శైలం వా యం రామోఽభిగమిష్యతి |
ప్రియాతిథిమివ ప్రాప్తం నైనం శక్ష్యంత్యనర్చితుమ్ ||

11

విచిత్రకుసుమాపీడాః బహుమంజరిధారిణః |
రాఘవం దర్శయిష్యంతి నగా భ్రమరశాలినః ||

12

అకాలే చాఽపి ముఖ్యాని పుష్పాణి చ ఫలాని చ |
దర్శయిష్యంత్యనుక్రోశాద్గిరయో రామమాగతమ్ ||

13

ప్రస్రవిష్యంతి తోయాని విమలాని మహీధరాః |
విదర్శయంతః వివిధాన్భూయశ్చిత్రాంశ్చ నిర్ఝరాన్ ||

14

పాదపాః పర్వతాగ్రేషు రమయిష్యంతి రాఘవమ్ |
యత్ర రామో భయం నాత్ర నాస్తి తత్ర పరాభవః ||

15

స హి శూరో మహాబాహుః పుత్రో దశరథస్య చ |
పురా భవతి నో దూరాదనుగచ్ఛామ రాఘవమ్ ||

16

పాదచ్ఛాయా సుఖా భర్తుస్తాదృస్య మహాత్మనః |
స హి నాథో జనస్యాస్య స గతిః స పరాయణమ్ ||

17

వయం పరిచరిష్యామః సీతాం యూయం తు రాఘవమ్ |
ఇతి పౌరస్త్రియో భర్తృన్దుఃఖార్తాస్తత్తదబ్రువన్ ||

18

యుష్మాకం రాఘవోఽరణ్యే యోగక్షేమం విధాస్యతి |
సీతా నారీజనస్యాస్య యోగక్షేమం కరిష్యతి ||

19

కో న్వనేనాప్రతీతేన సోత్కంఠితజనేన చ |
సంప్రీయేతామనోజ్ఞేన వాసేన హృతచేతసా ||

20

కైకేయ్యా యది చేద్రాజ్యం స్యాదధర్మ్యమనాథవత్ |
న హి నో జీవితేనార్థః కుతః పుత్రైః కుతో ధనైః ||

21

యయా పుత్రశ్చ భర్తా చ త్యక్తావైశ్వర్యకారణాత్ |
కం సా పరిహరేదన్యం కైకేయీ కులపాంసనీ ||

22

కైకేయ్యా న వయం రాజ్యే భృతకా నివసేమహి |
జీవంత్యా జాతు జీవంత్యః పుత్రైరపి శపామహే ||

23

యా పుత్రం పార్థివేంద్రస్య ప్రవాసయతి నిర్ఘృణా |
కస్తాం ప్రాప్య సుఖం జీవేదధర్మ్యాం దుష్టచారిణీమ్ ||

24

ఉపద్రుతమిదం సర్వమనాలంబమనాయకమ్ |
కైకేయ్యా హి కృతే సర్వం వినాశముపయాస్యతి ||

25

న హి ప్రవ్రజితే రామే జీవిష్యతి మహీపతిః |
మృతే దశరథే వ్యక్తం విలోపస్తదనంతరమ్ ||

26

తే విషం పిబతాలోడ్య క్షీణపుణ్యాః సుదుర్గతాః |
రాఘవం వాఽనుగచ్ఛధ్వమశ్రుతిం వాఽపి గచ్ఛత ||

27

మిథ్యా ప్రవ్రాజితః రామః సభార్యః సహలక్ష్మణః |
భరతే సన్నిసృష్టాః స్మః సౌనికే పశవో యథా ||

28

పూర్ణచంద్రాననః శ్యామో గూఢజత్రురరిందమః |
ఆజానుబాహుః పద్మాక్షో రామో లక్ష్మణపూర్వజః ||

29

పూర్వాభిభాషీ మధురః సత్యవాదీ మహాబలః |
సౌమ్యశ్చ సర్వలోకస్య చంద్రవత్ప్రియదర్శనః ||

30

నూనం పురుషశార్దూలో మత్తమాతంగవిక్రమః |
శోభయుశ్యత్యరణ్యాని విచరన్స మహారథః ||

31

తాస్తథా విలపంత్యస్తు నగరే నాగరస్త్రియః |
చుక్రుశుర్దుఃఖసంతప్తా మృత్యోరివ భయాగమే ||

32

ఇత్యేవం విలపంతీనాం స్త్రీణాం వేశ్మసు రాఘవమ్ |
జగామాస్తం దినకరో రజనీ చాభ్యవర్తత ||

33

నష్టజ్వలనసంపాతా ప్రశాంతాధ్యాయసత్కథా |
తిమిరేణాభిలిప్తేవ సా తదా నగరీ బభౌ ||

34

ఉపశాంతవణిక్పణ్యా నష్టహర్షా నిరాశ్రయా |
అయోధ్యా నగరీ చాసీన్నష్టతారమివాంబరమ్ ||

35

తథా స్త్రియో రామనిమిత్తమాతురాః
యథా సుతే భ్రాతరి వా వివాసితే |
విలప్య దీనా రురుదుర్విచేతసః
సుతైర్హి తాసామధికో హి సోఽభవత్ ||

36

ప్రశాంతగీతోత్సవనృత్తవాదనా
వ్యపాస్తహర్షా పిహితాపణోదయా |
తదా హ్యయోధ్యా నగరీ బభూవ సా
మహార్ణవః సంక్షపితోదకో యథా ||

37

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 48 Meaning In Telugu

రామునితో వెళ్లిన పౌరులు తిరిగి రావడం చూచారు అయోధ్యపుర స్త్రీలు. వారు రాముని తిరిగి తీసుకొని వస్తారు అని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలు అన్నీ నిరాశలు అయ్యాయి. రాముని అడవిలో వదిలి ఇళ్లు చేరిన పౌరులు తమ తమ భార్యా పుత్రులకు తమ ముఖములు చూపించలేక పోయారు. అయోధ్యలో ఎవరూ తమ తమ ఇళ్లలో వంటచేసుకోలేదు. దేవాలయములలో పూజలు జరగలేదు. వర్తకవాణిజ్యములు మూతబడ్డాయి.

రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దు:ఖము శోకము తాండిస్తూ ఉంది. రాముని లేని అయోధ్యలో తమకు సుఖసంతోషాలు ఎక్కడివని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యము చేసుకున్న వాడు ఉన్నాడు అంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యములకు వెళ్లాడు. రామునికి సేవచేస్తున్నాడు. ఇది వారందరి నిశ్చితాభిప్రాయము. రామునికి అనునిత్యమూ ఫలములను ఇస్తూ సేవ చేసే వృక్షములు తమ కన్నా ఎంతో మేలు అని అనుకొన్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధరకములైన పూలు తమకన్నా ఎంత పుణ్యం చేసు కున్నాయి అని అనుకొన్నారు.

కొండల మీదినుండి పర్వతముల మీది నుండి జలజలపారే సెల ఏళ్లు రామునికి స్నానమునకు కావలసిన నీటిని సమకూరు స్తున్నాయి. ఇవి తమ కన్నా ఎంతో మేలైనవి అని అనుకొన్నారు. తాము అయోధ్యలో ఉన్నా సుఖపడలేమని, రాముని తో పాటు అరణ్యములలో ఉంటేనే తాము సుఖసంతోషాలతో ఉండగల మని అనుకొన్నారు. అయోధ్యావాసము తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని వారి నిశ్చితాభిప్రాయము.

ప్రస్తుతము అయోధ్యకు రాణి కైక. దశరథుడు నామమాత్రపు రాజు. రాజ్యము కొరకు రాముని, తనభర్తను వదిలి వేసిన కైక ఇంక ఎవరిని లక్ష్యపెడుతుంది. కైక రాజ్యములో ఆమెకు సేవకులుగా ఎంతమాత్రము ఉండజాలము అని అందరూ అనుకున్నారు. రాముని అడవికి పంపిన దుర్మార్గురాలు. ఆమె పాలనలో ఎవరు సుఖపడతారు. సుఖంగా జరుగుతున్న అయోధ్య పాలన, కైక వలన అస్తవ్యస్తము అయింది. సర్వనాశనము అయింది.

రాముడు అరణ్యములకు వెళ్లాడు, రాముని చూడనిదో దశరథుడు జీవించలేడు. దశరథుని మరుణానంతరము అయోధ్యలో సుఖము, సంతోషము కరువవుతాయి. అంతా శోకమయం అవుతుంది. అయోధ్యా వాసుల పుణ్యము అంతరించింది. అందుకే రాముడు మనలను విడిచి వెళ్లిపోయాడు. ఇప్పుడు రాముడు వెంట అడవులకు వెళ్లడమో లేక విషంతాగి చావడమో రెండే మార్గాలు అయోధ్యా వాసులకు మిగిలి ఉన్నాయి. అంతేగాని భరతుని పాలనలో బతకడం అసాధ్యము. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వెన్నెల
ఉంటాయి.”

ఈ ప్రకారంగా అయోధ్యలో ఉన్న స్త్రీపురుషులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో సూర్యాస్తమయము అయింది. చీకట్లు అలుముకుంటున్నాయి. నగరంలో జనసంచారము తగ్గిపోయింది. ఆరోజు అయోధ్యలో ఉన్న ప్రజలు తమ తమ కుమారు లను, సోదరులను పోగొట్టుకున్నట్టు శోకసముద్రంలో మునిగి పోయారు. అయోధ్యలో ఎటువంటి వినోదకార్యక్రమములు, ఉత్సవములు జరగడం లేదు. అయోధ్యలో ఆనందమే కరువైపోయింది. చంద్రుడి లేని ఆకాశమువలె నీరులేని సముద్రము వలె రాముడు లేని అయోధ్య అనాధ అయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనపంచాశః సర్గః (49) >>

Balakanda Sarga 67 In Telugu – బాలకాండ సప్తషష్టితమః సర్గః

Balakanda Sarga 67 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తషష్టితమః సర్గలో, శివుడి ధనుస్సు యొక్క బిగువును పరిశీలించాలనుకున్నప్పుడు రాముడు దానిని విరిచాడు. జనకుడు కలవరపడ్డాడు, మరికొందరు విల్లు విరిచే పేలుడుకు మూర్ఛపోయారు, మరియు జనకుడు సీతను రాముడికి వివాహ ప్రతిపాదన చేస్తాడు. ఆ ప్రతిపాదనకు విశ్వామిత్రుని ఆమోదం మేరకు జనకుడు తన సర్వాధికారులను అయోధ్యకు పంపుతాడు.

ధనుర్భంగః

జనకస్య వచః శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివమ్ ||

1

తతః స రాజా జనకః సచివాన్వ్యాదిదేశ హ |
ధనురానీయతాం దివ్యం గంధమాల్యవిభూషితమ్ ||

2

జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్పురీమ్ |
తద్ధనుః పురతః కృత్వా నిర్జగ్ముః పార్థివాజ్ఞయా ||

3

నృణాం శతాని పంచాశద్వ్యాయతానాం మహాత్మనామ్ |
మంజూషామష్టచక్రాం తాం సమూహుస్తే కథంచన ||

4

తామాదాయ తు మంజూషామాయసీం యత్ర తద్ధనుః |
సురోపమం తే జనకమూచుర్నృపతిమంత్రిణః ||

5

ఇదం ధనుర్వరం రాజన్పూజితం సర్వరాజభిః |
మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి ||

6

తేషాం నృపో వచః శ్రుత్వా కృతాంజలిరభాషత |
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ ||

7

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితమ్ |
రాజభిశ్చ మహావీర్యైరశక్తైః పూరితుం పురా ||

8

నైతత్సురగణాః సర్వే నాసురా న చ రాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||

9

క్వ గతిర్మానుషాణాం చ ధనుషోఽస్య ప్రపూరణే |
ఆరోపణే సమాయోగే వేపనే తోలనేఽపి వా ||

10

తదేతద్ధనుషాం శ్రేష్ఠమానీతం మునిపుంగవ |
దర్శయైతన్మహాభాగ అనయో రాజపుత్రయోః ||

11

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ ||

12

బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్ధనుః |
మంజూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్ ||

13

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా |
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపి వా ||

14

బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత |
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః ||

15

పశ్యతాం నృసహస్రాణాం బహూనాం రఘునందనః |
ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్ధనుః ||

16

ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస వీర్యవాన్ |
తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||

17

తస్య శబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిఃస్వనః |
భూమికంపశ్చ సుమహాన్పర్వతస్యేవ దీర్యతః ||

18

నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః |
వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ ||

19

ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతసాధ్వసః |
ఉవాచ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుంగవమ్ ||

20

భగవన్దృష్టవీర్యో మే రామో దశరథాత్మజః |
అత్యద్భుతమచింత్యం చ న తర్కితమిదం మయా ||

21

జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా |
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజమ్ ||

22

మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక |
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా ||

23

భవతోఽనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్ఛంతు మంత్రిణః |
మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథైః ||

24

రాజానం ప్రశ్రితైర్వాక్యైరానయంతు పురం మమ |
ప్రదానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః ||

25

మునిగుప్తౌ చ కాకుత్స్థౌ కథయంతు నృపాయ వై |
ప్రీయమాణం తు రాజానమానయంతు సుశీఘ్రగాః ||

26

కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్య మంత్రిణః |
అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్ ||

27

[* యథావృత్తం సమాఖ్యాతుమానేతుం చ నృపం తదా | *]

Balakanda Sarga 67 In Telugu Pdf With Meaning

జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. “ఓ జనక మహారాజా! నీవు చెప్పినది అంతా విన్నాము. నీవద్ద ఉన్న ధనుస్సును రామునికి చూపించు.” అని అన్నాడు.

జనకుడు పూజా మందిరములో పూజలందుకుంటున్న ఆ ధనుస్సును తీసుకొని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞాను అనుసరించి సామంతులు ఎనిమిది చక్రముల గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివ ధనుస్సును తీసుకొని వచ్చారు. 5,000 మంది ధృడకాయులు ఆ ధనుస్సు ఉన్న వాహనమును లాగుకొని వచ్చారు.

“జనక మహారాజా! తమరు ఆదేశించినట్టు, నీవు రామునికి చూపదలచుకొన్న శివధనుస్సును తీసుకొని వచ్చాము.” అని అన్నారు సామంత రాజులు.

జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ ధనుస్సు మాకు వంశపారంపర్యముగా వచ్చింది. దీనిని ఎంతో మంది రాజులు, రాజకుమారులు

ఎక్కుబెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనుస్సును ఎత్తుటకు గానీ, ఎక్కుబెట్టుటకు కానీ మానవ మాత్రులకు సాధ్యము కాదుకదా! ఓ విశ్వామిత్ర మహర్షీ! దీనిని రామలక్ష్మణులకు చూపుము.”అని అన్నాడు జనకుడు.

విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. “రామా! ఈ ధనుస్సును చూడు.” అన్నాడు.

విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు “అలాగే మహాత్మా! తమరు చెప్పినట్టు నేను ఆ ధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనుస్సును చూస్తాను. తాకుతాను. ఆ ధనుస్సును ఎత్తడానికి, నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను.” అని అన్నాడు.

అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనుస్సును ఏ మాత్రం శమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు ఒంగింది. ఫెడేల్ మని మధ్యకు విరిగిపోయింది. రెండు ముక్కలు అయింది.

ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగు పడ్డట్టు భయంకర మైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు.

తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బలపరాక్రమ ములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగుర్పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కలా నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అత్యద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత, దశరథపుత్రుడు రాముని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను. సీతను “వీరశుల్క” గా అనగా సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణసమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను.

ఓ విశ్వామిత్ర మహర్షీ! తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి, రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉ న్నారని తెలిపి, రాముడు శివధనుర్భంగము చేయడం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథమహారాజుకు వివరంగా చెప్పి, దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతము గా మిధిలకు తోడ్కొని రాగలరు. ” అని వినయంగా పలికాడు.

అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు. అయోధ్యకు వెళ్లి దశరధమహారాజుకు జరిగిన విషయములు అన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథిలకు తీసుకొని వచ్చుటకు మంత్రులను పంపించాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ అష్టషష్టితమః సర్గః (68) >>

Ayodhya Kanda Sarga 69 In Telugu – అయోధ్యాకాండ ఏకోనసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 69

అయోధ్యాకాండ ఏకోనసప్తతితమః సర్గ రామాయణంలోని కీలకమైన ఘట్టం. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయిని ఎదుర్కొంటాడు. దశరథుని మరణానికి, రాముని వనవాసానికి కారణమైందని ఆగ్రహంతో ఉంటాడు. భరతుడు కైకేయికి తన బాధను, తన తండ్రి, సోదరుడు రాముడి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తాడు. కైకేయి చేసిన ద్రోహాన్ని ఖండిస్తాడు. ఈ సందర్భంగా భరతుడు తల్లి చర్యలను తిరస్కరించి, రాముడు తప్ప మరెవ్వరు కూడా అయోధ్య పట్నానికి రాజుగా అర్హులు కాదని ప్రకటిస్తాడు. రాముడి వనవాసం ముగించడానికి, అయోధ్య రాజ్యానికి తీసుకురావడానికి నిర్ణయిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మపాలన, భక్తి, కుటుంబ బాంధవ్యాలను ప్రతిబింబిస్తుంది.

భరతదుఃస్వప్నః

యామేవ రాత్రిం తే దూతాః ప్రవిశంతి స్మ తాం పురీమ్ |
భరతేనాపి తాం రాత్రిం స్వప్నో దృష్టోఽయమప్రియః || ౧ ||

వ్యుష్టామేవ తు తాం రాత్రిం దృష్ట్వా తం స్వప్నమప్రియమ్ |
పుత్రః రాజాధిరాజస్య సుభృశం పర్యతప్యత || ౨ ||

తప్యమానం సమాజ్ఞాయ వయస్యాః ప్రియవాదినః |
ఆయాసం హి వినేష్యంతః సభాయాం చక్రిరే కథాః || ౩ ||

వాదయంతి తథా శాంతిం లాసయంత్యపి చాపరే |
నాటకాన్యపరే ప్రాహుర్హాస్యాని వివిధాని చ || ౪ ||

స తైః మహాత్మా భరతః సఖిభిః ప్రియవాదిభిః |
గోష్ఠీ హాస్యాని కుర్వద్భిర్న ప్రాహృష్యత రాఘవః || ౫ ||

తమబ్రవీత్ప్రియసఖో భరతం సఖిభిర్వృతమ్ |
సుహృద్భిః పర్యుపాసీనః కిం సఖే నానుమోదసే || ౬ ||

ఏవం బ్రువాణం సుహృదం భరతః ప్రత్యువాచ హ |
శృణు త్వం యన్నిమిత్తం మే దైన్యమేతదుపాగతమ్ || ౭ ||

స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్ధజమ్ |
పతంతమద్రిశిఖరాత్ కలుషే గోమయేహ్రదే || ౮ ||

ప్లవమానశ్చ మే దృష్టః స తస్మిన్ గోమయహ్రదే |
పిబన్నంజలినా తైలం హసన్నపి ముహుర్ముహుః || ౯ ||

తతస్తిలౌదనం భుక్త్వా పునః పునరధః శిరాః |
తైలేనాభ్యక్త సర్వాంగస్తైలమేవావగాహత || ౧౦ ||

స్వప్నేఽపి సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి |
ఉపరుద్ధాం చ జగతీం తమసేవ సమావృతమ్ || ౧౧ ||

ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతమ్ |
సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసమ్ || ౧౨ ||

అవతీర్ణాం చ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్ |
అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్ || ౧౩ ||

పీఠే కార్ష్ణాయసే చైనం నిషణ్ణం కృష్ణవాససమ్ |
ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగలాః || ౧౪ ||

త్వరమాణశ్చ ధర్మాత్మా రక్తమాల్యానులేపనః |
రథేన ఖరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖః || ౧౫ ||

ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్తవాసినీ |
ప్రకర్షంతీ మయా దృష్టా రాక్షసీ వికృతాననా || ౧౬ ||

ఏవమేతన్మయా దృష్టమిమాం రాత్రిం భయావహామ్ |
అహం రామోఽథవా రాజా లక్ష్మణో వా మరిష్యతి || ౧౭ ||

నరః యానేన యః స్వప్నే ఖరయుక్తేన యాతి హి |
అచిరాత్తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే || ౧౮ ||

ఏతన్నిమిత్తం దీనోఽహం తన్నవః ప్రతిపూజయే |
శుష్యతీవ చ మే కంఠో న స్వస్థమివ మే మనః || ౧౯ ||

న పశ్యామి భయస్థానం భయం చైవోపధారయే |
భ్రష్టశ్చ స్వరయోగో మే ఛాయా చోపహతా మమ || ౨౦ ||

జుగుప్సన్నివ చాత్మానం న చ పశ్యామి కారణమ్ |
ఇమాం హి దుఃస్వప్న గతిం నిశామ్య తామ్
అనేక రూపామవితర్కితాం పురా |
భయం మహత్తద్ధృదయాన్న యాతి మే
విచింత్య రాజానమచింత్య దర్శనమ్ || ౨౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనసప్తతితమః సర్గః || ౬౯ ||

Ayodhya Kanda Sarga 69 Meaning In Telugu

అయోధ్యనుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలో ప్రవేశించిన రాత్రి, భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అదీ తెల్లవారు జామున వచ్చింది. మరునాడు భరతుని మనస్సు అంతా వ్యాకులంగా ఉండింది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలుపంచుకోలేక పోయాడు. విదూషకుల హాస్యపు మాటలకు స్పందించడంలేదు. మనసంతా వికలమయింది.

ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండటానికి కారణం అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు. “మిత్రమా! ఈ రోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టికొట్టుకొని, వెంట్రుకలు విరబోసుకొని, ఆవు పేడ ఉన్న గుంటలో పడిపోయినట్టు కలవచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె తాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిసిన అన్నం తింటున్నాడు. తరువాత తలవంచుకొని నూనెలో మునిగి పోయాడు. మిత్రమా! ఇంకా నాకు సముద్రము ఎండిపోయినట్టు గానూ, చంద్రుడు నేలమీద పడిపోయినట్టుగానూ, పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగానూ. అయోధ్యలో ఉన్న రాజులు ఊరేగే ఏనుగునకు దంతములు విరిగినట్టుగానూ, ప్రతి ఇంట్లోనూ వెలిగే అగ్నులు ఆరిపోయినట్టుగానూ, భూకంపము వచ్చినట్టుగానూ, నాకు కలలో కనపడింది. మిత్రమా!ఇదే కాకుండా నా తండ్రి ఇనపసింహాసనము మీద నల్లని దుస్తులు ధరించి కూర్చున్నట్టుగానూ, ఆయనను చూచి అందరూ నవ్వుతున్నట్టుగానూ, నా తండ్రి గాడిదలు కట్టిన రథము మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగానూ కల వచ్చింది.

ఈ స్వప్నములను బట్టి చూస్తే మా కుటుంబములో ఎవరో ఒకరికి మరణము ఆసన్నమయినది అని అర్థం అవుతూ ఉంది. ప్రస్తుతము వృద్ధుడు మా తండ్రి. ఆయన గురించే నాకు చింతగా ఉంది. ఎందుకంటే ఎవరైతే గాడిదలు కట్టిన రథంమీద దక్షిణ దిక్కుగా వెళ్లినట్టు కల వస్తుందో, అతని యొక్క చితి మంటలు త్వరలోనే చూడబడతాయి అని శాస్త్రప్రమాణము. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని నా మనస్సులో చాలా ఆందోళనగా ఉంది. మరలా నా తండ్రిని చూస్తానా లేదా అని మనసంతా వ్యాకులంగా ఉంది.” అని అన్నాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తతితమః సర్గః (70) >>

Ayodhya Kanda Sarga 68 In Telugu – అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 68

అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీత, లక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వతానికి చేరుకొని అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. అయోధ్యలో, దశరథ మహారాజు రాముని వాత్సల్యం, వనవాసం వల్ల కలిగిన శోకంతో మరణిస్తాడు. రాముని తండ్రి మరణవార్త తెలుసుకున్న భరతుడు, శత్రఘ్నుడు దుఃఖంలో పడతారు. భరతుడు రాముని వెతకడానికి, వనవాసం ముగించమని విజ్ఞప్తి చేయడానికి చిత్రకూటానికి వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటాడు. భరతుడు తన తల్లి కైకేయి మీద కోపంతో ఉన్నా, రాముని పట్ల భక్తిని, ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఈ సర్గలో కుటుంబ బాంధవ్యాలు, ధర్మపాలన, భక్తి ప్రధానాంశాలుగా ఉంటాయి.

దూతప్రేషణమ్

తేషాం హి వచనం శ్రుత్వా వసిష్ఠః ప్రత్యువాచ హ |
మిత్రామాత్యగణాన్ సర్వాన్ బ్రాహ్మణాంస్తానిదం వచః || ౧ ||

యదసౌ మాతులకులే దత్తరాజ్యః పరం సుఖీ |
భరతః వసతి భ్రాత్రా శత్రుఘ్నేన సమన్వితః || ౨ ||

తచ్ఛీఘ్రం జవనా దూతా గచ్ఛంతు త్వరితైః హయైః |
ఆనేతుం భ్రాతరౌ వీరౌ కిం సమీక్షామహే వయమ్ || ౩ ||

గచ్ఛంత్వితి తతః సర్వే వసిష్ఠం వాక్యమబ్రువన్ |
తేషాం తద్వచనం శ్రుత్వా వసిష్ఠో వాక్యమబ్రవీత్ || ౪ ||

ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోక నందన |
శ్రూయతామితికర్తవ్యం సర్వానేవ బ్రవీమి వః || ౫ ||

పురం రాజగృహం గత్వా శీఘ్రం శీఘ్రజవైః హయైః |
త్యక్తశోకైరిదం వాచ్యః శాసనాద్భరతో మమ || ౬ ||

పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః |
త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా || ౭ ||

మా చాస్మై ప్రోషితం రామం మా చాస్మై పితరం మృతమ్ |
భవంతః శంసిషుర్గత్వా రాఘవాణామిమం క్షయమ్ || ౮ ||

కౌశేయాని చ వస్త్రాణి భూషణాని వరాణి చ |
క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ భరతస్య చ గచ్ఛత || ౯ ||

దత్తపథ్యశనా దూతాజగ్ముః స్వం స్వం నివేశనమ్ |
కేకయాంస్తే గమిష్యంతో హయానారుహ్య సమ్మతాన్ || ౧౦ ||

తతః ప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరమ్ |
వసిష్ఠేనాభ్యనుజ్ఞాతా దూతాః సంత్వరితా యయుః || ౧౧ ||

న్యంతేనాపరతాలస్య ప్రలంబస్యోత్తరం ప్రతి |
నిషేవమాణాస్తే జగ్ముర్నదీం మధ్యేన మాలినీమ్ || ౧౨ ||

తే హస్తినాపురే గంగాం తీర్త్వా ప్రత్యఙ్ముఖా యయుః |
పాంచాలదేశమాసాద్య మధ్యేన కురుజాంగలమ్ || ౧౩ ||

సరాంసి చ సుపూర్ణాని నదీశ్చ విమలోదకాః |
నిరీక్షమాణాస్తే జగ్ముర్ధూతాః కార్యవశాద్ద్రుతమ్ || ౧౪ ||

తే ప్రసన్నోదకాం దివ్యాం నానావిహగసేవితామ్ |
ఉపాతిజగ్ముర్వేగేన శరదండాం జనాకులామ్ || ౧౫ ||

నికూలవృక్షమాసాద్య దివ్యం సత్యోపయాచనమ్ |
అభిగమ్యాభివాద్యం తం కులింగాం ప్రావిశన్ పురీమ్ || ౧౬ ||

అభికాలం తతః ప్రాప్యతే బోధిభవనాచ్చ్యుతామ్ |
పితృపైతామహీం పుణ్యాం తేరురిక్షుమతీం నదీమ్ || ౧౭ ||

అవేక్ష్యాంజలిపానాంశ్చ బ్రాహ్మణాన్ వేదపారగాన్ |
యయుర్మధ్యేన బాహ్లీకాన్ సుదామానం చ పర్వతమ్ || ౧౮ ||

విష్ణోః పదం ప్రేక్షమాణా విపాశాం చాపి శాల్మలీమ్ |
నదీర్వాపీస్తటాకాని పల్వలాని సరాంసి చ || ౧౯ ||

పస్యంతో వివిధాంశ్చాపి సింహవ్యాగ్రమృగద్విపాన్ |
యయుః పథాఽతిమహతా శాసనం భర్తురీప్సవః || ౨౦ ||

తే శ్రాంతవాహనా దూతాః వికృష్ణేన పథా తతః |
గిరివ్రజం పురవరం శీఘ్రమాసేదురంజసా || ౨౧ ||

భర్తుః ప్రియార్థం కులరక్షణార్థమ్
భర్తుశ్చ వంశస్య పరిగ్రహార్థమ్ |
అహేడమానాస్త్వరయా స్మ దూతాః
రాత్ర్యాం తు తే తత్పురమేవ యాతాః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టషష్ఠితమః సర్గః || ౬౮ ||

Ayodhya Kanda Sarga 68 Meaning In Telugu

ఋషులు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు వసిష్ఠుడు. మంత్రులతో ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మహా ఋషులారా! ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి మేమమామగారి ఇంట ఉన్నారు. వారిని తీసుకొని వచ్చుటకు వెంటనే దూతలను పంపెదను. దశరథుడు, తాను చనిపోకముందే భరతునికి రాజ్యము ఇస్తానని కైకకు మాట ఇచ్చిఉన్నాడు. కాబట్టి రాజ్యము ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకము జరిపించెదము.” అని చెప్పాడు.

వసిష్ఠుని ఆదేశము ప్రకారము సిద్దార్ధుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. “దూతలారా! జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్లండి. అతనికి దశరథుని మరణ వార్త తెలియనీయకండి. మీ మొహంలో ఎక్కడా విషాద చ్ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి. “పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు. నీతో ఒక అవసరమైన పని ఉన్నది. నీవు వెంటనే అయోధ్యకు రావలెను.” అని చెప్పండి. రాముడు వనవాసమునకు వెళ్లిన విషయము ఏమాత్రము భరతునికి తెలియనీయకండి. మీరు వెళ్లునపుడు కేకయ రాజుకు భరతునికి శత్రుఘ్నునికి అనేక కానుకలు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు.
వసిష్ఠుని ఆదేశము ప్రకారము ఆ దూతలు భరతుని వద్దకు బయలుదేరారు. ఆ దూతలు హస్తినాపురము దాటి తరువాత గంగానదిని చేరుకొని, అక్కడి నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశము చేరుకొని అక్కడి నుండి శరండా నదిని దాటి కులింగా నగరిని చేరుకున్నారు. అక్కడి నుండి ఇక్షుమతీ నదిని దాటి బాహ్లిక దేశము గుండా సుదామ పర్వతమును చేరుకున్నారు. అక్కడి నుండి విపాసా నదిని దాటి గిరివ్రజపురమును ప్రవేశించారు.

( పైన చెప్పబడిన పట్టణములు, ప్రదేశములు, నదుల పేర్లు ప్రస్తుతము మనకు తెలియక పోవచ్చు. కాని క్రీ.పూ. మన భారత దేశ పటమును చూచినట్టయితే కొన్ని అన్నా కనపడే అవకాశము ఉంది. ఆనాటి మహాకవులు ఇతిహాసములు చెబుతూ నాటి దేశ కాల మాన పరిస్థితులను తరువాతి తరాలకు తెలియజేయడానికి పడే తపన దీనిని బట్టి మనకు అర్థం అవుతుంది. కిష్కింధా కాండలో కూడా సీత ను ఎక్కడెక్కడ వెతకాలో సుగ్రీవుడు వివరించేటప్పుడు నాటి భారతదేశములో ఉన్న ప్రదేశములను పర్వతములను నదులను గురించి పూర్తిగా వర్ణిస్తాడు. అలాగే న్యాయ సూత్రముల గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. నాటి ధర్మసూత్రముల ప్రకారము రాజ్యము జ్యేష్టుడికి చెందుతుంది. జ్యేష్ఠుడు రాజ్యమును త్యజించి అడవులకు వెళ్లిపోతే తరువాతి వాడికి చెందుతుంది. అందుకని నేర్పుగా రాముని అడవులకు పంపింది కైక. అలాగే 14 సంవత్సరములు కాల పరిమితి విధించడం. సాధారణంగా 12 సంవత్సరములు దాటితే ఆస్తి మీద హక్కు పోతుంది. కాని రామాయణ కాలంలో 14 సంఖ్యకు ప్రాధాన్యము ఉంది. అదేమిటో ముందు ముందు మీరు చూస్తారు. ఇక్కడ యుగ ధర్మం గురించి కూడా మనకు అవగాహన కలుగుతుంది. కృతయుగంలో అంతా సిద్ధంగా ఉంచారు. కేవలం మానవులు ఆ ప్రకారం నడుచుకోవడమే ఆనాటి వారి కర్తవ్యము. కృతము అనగా చేయబడినది అని అర్థం. కాని త్రేతాయుగములో అలా కాదు. వాదమునకు ప్రతి వాదము అమలులో కి వచ్చింది. ఇది లక్ష్మణుని వాదనలో కనపడుతుంది. రాముడు— రాజు ఏమి చేసినా అది న్యాయమే అవుతుంది. రాజాజ్ఞను శిరసావహించడమే మన విధి– అని అంటాడు. దానికి ప్రతిగా లక్ష్మణుడు,– రాజు కామాతురుడై చేసిన నిర్ణయాన్ని ప్రజలు అమలు పరచనవసరం లేదు– అని వాదిస్తాడు. రాజు మీద తిరుగుబాటుకు ఇది నాంది.

అలాగే దశరథుడు కూడా ఆలోచిస్తాడు. ఒక సందర్భంలో దశరథుడు “నేను అడవులకు వెళ్లమన్నాను. కానీ రాముడు “ఇది అధర్మము, నేను వెళ్లను” అని అనవచ్చు కదా. అలా అంటే నేను కాదంటానా! ఎవరైనా రామునికి ఆ ప్రకారము చెయ్యమని చెప్పవచ్చు కదా” అని అంటాడు. ఈ నాడు కూడా కొంతమంది ప్రభుత్వాధి కారులు లొసుగులతో కూడిన ఉత్తర్వులను జారీ చేసి, అవతల వారితో “మేము చేసింది చేసాము, మీరు వెంటనే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొండి.” అని అనడం, వారే ఫలానా అడ్వొకేట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇవ్వడం, సర్వసాధారణం అయిపోయింది.
పోలీసులు కూడా పై అధికారుల మెప్పుకోసరం ఎడా పెడా అరెస్టులు చేసి, అలా అరెస్టులు చేసిన వారి పక్షాన పోలీసులే ప్లీడర్లను కూడా నియమించి అరెస్టులు చేసిన వారికి బెయిలు ఇప్పిస్తున్నారు.

ఇలాంటివి ముందు ముందు రామాయణంలో మనకు ఎన్నో కనపడతాయి.)

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకోనసప్తతితమః సర్గః (69) >>

Balakanda Sarga 65 In Telugu – బాలకాండ పంచషష్టితమః సర్గః

Bala kanda Sarga 65 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచషష్టితమః సర్గలో, విశ్వామిత్రుడు సర్వ లోకాలను నివ్వెరపోయేలా చేసిన సుదీర్ఘ ఆశ్రమం తర్వాత బ్రహ్మ ఋషి అవుతాడు. అన్ని దేవతలు బ్రహ్మను విశ్వామిత్రునిపై సర్వ మర్త్యమైన మలినాలనుండి శుద్ధి చేయబడినందున అతనిపై సర్వోన్నతమైన బ్రహ్మ-జ్ఞానాన్ని ఇవ్వమని అభ్యర్థించారు మరియు బ్రహ్మ అతనిపై ఆ అత్యున్నత క్రమాన్ని అంగీకరిస్తాడు. ఈ విధంగా శతానంద మహర్షి విశ్వామిత్రుని పురాణం గురించి తన కథనాన్ని ముగించాడు.

బ్రహ్మర్షిత్వప్రాప్తిః

అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః |
పూర్వాం దిశమనుప్రాప్య తపస్తేపే సుదారుణమ్ ||

1

మౌనం వర్షసహస్రస్య కృత్వా వ్రతమనుత్తమమ్ |
చకారాప్రతిమం రామ తపః పరమదుష్కరమ్ ||

2

పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్ |
విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిశత్ ||

3

స కృత్వా నిశ్చయం రామ తప ఆతిష్ఠదవ్యయమ్ |
తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః ||

4

భోక్తుమారబ్ధవానన్నం తస్మిన్కాలే రఘూత్తమ |
ఇంద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత ||

5

తస్మై దత్త్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః |
నిఃశేషితేఽన్నే భగవానభుక్త్వైవ మహాతపాః ||

6

న కించిదవదద్విప్రం మౌనవ్రతముపాస్థితః |
అథ వర్షసహస్రం వై నోచ్ఛ్వసన్మునిపుంగవః ||

7

తస్యానుచ్ఛ్వసమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత |
త్రైలోక్యం యేన సంభ్రాంతమాదీపితమివాభవత్ ||

8

తతో దేవాః సగంధర్వాః పన్నగోరగరాక్షసాః |
మోహితాస్తేజసా తస్య తపసా మందరశ్మయః ||

9

కశ్మలోపహతాః సర్వే పితామహమథాబ్రువన్ |
బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః ||

10

లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్ధతే |
న హ్యస్య వృజినం కించిద్దృశ్యతే సూక్ష్మమప్యథ ||

11

న దీయతే యది త్వస్య మనసా యదభీప్సితమ్ |
వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరమ్ ||

12

వ్యాకులాశ్చ దిశః సర్వా న చ కించిత్ప్రకాశతే |
సాగరాః క్షుభితాః సర్వే విశీర్యంతే చ పర్వతాః ||

13

భాస్కరో నిష్ప్రభశ్చైవ మహర్షేస్తస్య తేజసా |
ప్రకంపతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః ||

14

బ్రహ్మన్న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః |
సంమూఢమివ త్రైలోక్యం సంప్రక్షుభితమానసమ్ ||

15

బుద్ధిం న కురుతే యావన్నాశే దేవ మహామునిః |
తావత్ప్రసాద్యో భగవానగ్నిరూపో మహాద్యుతిః ||

16

కాలాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతేఽఖిలమ్ |
దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతమ్ ||

17

తతః సురగణాః సర్వే పితామహపురోగమాః |
విశ్వామిత్రం మహాత్మానం వాక్యం మధురమబ్రువన్ ||

18

బ్రహ్మర్షే స్వాగతం తేఽస్తు తపసా స్మ సుతోషితాః |
బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక ||

19

దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్దదామి సమరుద్గణః |
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్ఛ సౌమ్య యథాసుఖమ్ ||

20

పితామహవచః శ్రుత్వా సర్వేషాం త్రిదివౌకసామ్ |
కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః ||

21

బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ |
ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మామ్ ||

22

క్షత్రవేదవిదాం శ్రేష్ఠో బ్రహ్మవేదవిదామపి |
బ్రహ్మపుత్రో వసిష్ఠో మామేవం వదతు దేవతాః ||

23

యద్యయం పరమః కామః కృతో యాంతు సురర్షభాః |
తతః ప్రసాదితో దేవైర్వసిష్ఠో జపతాం వరః ||

24

సఖ్యం చకార బ్రహ్మర్షిరేవమస్త్వితి చాబ్రవీత్ |
బ్రహ్మర్షిస్త్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ ||

25

ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతమ్ |
విశ్వామిత్రోఽపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమమ్ ||

26

పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరమ్ |
కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః ||

27

ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా |
ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాంస్తపః ||

28

ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణమ్ |
ఏవముక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః ||

29

శతానందవచః శ్రుత్వా రామలక్ష్మణసన్నిధౌ |
జనకః ప్రాంజలిర్వాక్యమువాచ కుశికాత్మజమ్ ||

30

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవ |
యజ్ఞం కాకుత్స్థసహితః ప్రాప్తవానసి కౌశిక ||

31 [ధార్మిక]

పావితోఽహం త్వయా బ్రహ్మన్దర్శనేన మహామునే |
విశ్వామిత్ర మహాభాగ బ్రహ్మర్షీణాం వరోత్తమ ||

32

గుణా బహువిధాః ప్రాప్తాస్తవ సందర్శనాన్మయా |
విస్తరేణ చ తే బ్రహ్మన్కీర్త్యమానం మహత్తపః ||

33

శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా |
సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః ||

34

అప్రమేయం తపస్తుభ్యమప్రమేయం చ తే బలమ్ |
అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజ ||

35

తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో |
కర్మకాలో మునిశ్రేష్ఠ లంబతే రవిమండలమ్ ||

36

శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః |
స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతుమర్హసి ||

37

ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభమ్ |
విససర్జాశు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా ||

38

ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో మిథిలాధిపః |
ప్రదక్షిణం చకారాథ సోపాధ్యాయః సబాంధవః ||

39

విశ్వామిత్రోఽపి ధర్మాత్మా సరామః సహలక్ష్మణః |
స్వవాటమభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః ||

40

Balakanda Sarga 65 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా నిర్ణయించుకొన్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచి పెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్లాడు. అచ్చట ఆశ్రమమును నిర్మించుకొని వేయి సంవత్సరములు ఘోరమైన తపస్సుచేసాడు.

విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కాని విశ్వామిత్రుడు చలించలేదు. ఇంద్రియములకు లోబడలేదు.

వేయి సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఇంక తపస్సు పూర్తి అయింది అనుకొని ఆహారము తీసుకొనడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను. అన్నం పెట్టమని యాచించాడు. మారు మాటాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు.

బ్రాహ్మణ వేషములో ఉన్న ఇంద్రుని ఒక్కమాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోప పడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు.

మరలా తపస్సుకు పూనుకొన్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు.

“ ఓ బ్రహ్మదేవా! విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు. కాని ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము. ఆమెను రాయిని చేసాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము. కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరంనుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి.

తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు. గాలి వీచడం లేదు. భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి.” అని వేడుకున్నారు.

దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ బ్రహ్మర్షీ! నీవు బ్రాహ్మణత్వమును పొందావు. బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు. నీకు శుభం కలుగుతుంది.” అని వరాలు ఇచ్చాడు బ్రహ్మ.

విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ” ఓ బ్రహ్మదేవా! మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగును గాక! వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించును గాక! యజ్ఞములు యాగములు చేయించు అధికారము నాకు కలుగు గాక! బ్రహ్మర్షి అయిన వసిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీరించును గాక! ఇవి కూడా నాకు ప్రసాదించండి.” అని అడిగాడు.

బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. “ఓ వసిష్ట మహర్షీ ! విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని “బ్రహ్మర్షి” అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని “బ్రహ్మర్షి” అని అంగీకరించండి.” అని ప్రార్థించారు.

ఆ మాటలకు వసిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. “ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షివి. నేను అంగీకరిస్తున్నాను.” అని అన్నాడు.

వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములు అన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంక మేము వెళుతున్నాము.” అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్లిపోయారు.

వెంటనే విశ్వామిత్రుడు లేచి వసిష్ఠునిసాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించి పూజించాడు.

ఓ రామా! విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు. ధర్మాత్ముడు. వీరుడు.” అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించాడు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతమును విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేసాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహాదానందముగా ఉంది. తమరి దర్శనభాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందులవారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను.

నీ గుణగణములను మేము అందరమూ విని తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము. పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సుచెయ్యడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషము లను ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు. కాని ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు.

తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యములు నిర్వర్తించవలెను కదా! కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయము తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకొని వెళతాను.” అని వినయంగా పలికాడు జనకమహారాజు.

ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చాడు.

జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసాడు. తరువాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్షష్టితమః సర్గః (66) >>

Balakanda Sarga 76 In Telugu – బాలకాండ షట్సప్తతితమః సర్గః

Balakanda Sarga 76 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండం 76వ సర్గలో, విష్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణులను సీతా స్వయంవరానికి తీసుకెళతారు. మార్గమధ్యంలో గంగానదిని దాటి గౌతమ ముని ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వారు ఆహల్య శాప విమోచన కథను వింటారు. ఇంద్రుడు ధర్మానికి విరుద్ధంగా ఆహల్యతో ఉండి, గౌతముని కోపానికి గురవుతాడు.

|| జామదగ్న్యప్రతిష్టంభః ||

శ్రుత్వా తజ్జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా |
గౌరవాద్యంత్రితకథః పితూ రామమథాబ్రవీత్ ||

1

శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ |
అనురుధ్యామహే బ్రహ్మన్పితురానృణ్యమాస్థితః ||

2

వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ |
అవజానాసి మే తేజః పశ్య మేఽద్య పరాక్రమమ్ ||

3

ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్ |
శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమః ||

4

ఆరోప్య స ధనూ రామః శరం సజ్యం చకార హ |
జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధోఽబ్రవీద్వచః ||

5

బ్రాహ్మణోఽసీతి మే పూజ్యో విశ్వామిత్రకృతేన చ |
తస్మాచ్ఛక్తో న తే రామ మోక్తుం ప్రాణహరం శరమ్ ||

6

ఇమాం పాదగతిం రామ తపోబలసమార్జితాన్ | [వా త్వద్గతిం]
లోకానప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి ||

7

న హ్యయం వైష్ణవో దివ్యః శరః పరపురంజయః |
మోఘః పతతి వీర్యేణ బలదర్పవినాశనః ||

8

వరాయుధధరం రామం ద్రష్టుం సర్షిగణాః సురాః |
పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సర్వశః ||

9

గంధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణకిన్నరాః |
యక్షరాక్షసనాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్ ||

10

జడీకృతే తదా లోకే రామే వరధనుర్ధరే |
నిర్వీర్యో జామదగ్న్యోఽథ రామో రామముదైక్షత ||

11

తేజోఽభిహతవీర్యత్వాజ్జామదగ్న్యో జడీకృతః |
రామం కమలపత్రాక్షం మందం మందమువాచ హ ||

12

కాశ్యపాయ మయా దత్తా యదా పూర్వం వసుంధరా |
విషయే మే న వస్తవ్యమితి మాం కాశ్యపోఽబ్రవీత్ ||

13

సోఽహం గురువచః కుర్వన్పృథివ్యాం న వసే నిశామ్ |
తదా ప్రతిజ్ఞా కాకుత్స్థ కృతా భూః కాశ్యపస్య హి ||

14

తదిమాం త్వం గతిం వీర హంతుం నార్హసి రాఘవ |
మనోజవం గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమమ్ ||

15

లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా |
జహి తాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః ||

16

అక్షయం మధుహంతారం జానామి త్వాం సురోత్తమమ్ |
ధనుషోఽస్య పరామర్శాత్స్వస్తి తేఽస్తు పరంతప ||

17

ఏతే సురగణాః సర్వే నిరీక్షంతే సమాగతాః |
త్వామప్రతిమకర్మాణమప్రతిద్వంద్వమాహవే ||

18

న చేయం మమ కాకుత్స్థ వ్రీడా భవితుమర్హతి |
త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః ||

19

శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత |
శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమమ్ ||

20

తథా బ్రువతి రామే తు జామదగ్న్యే ప్రతాపవాన్ |
రామో దాశరథిః శ్రీమాంశ్చిక్షేప శరముత్తమమ్ ||

21

స హతాన్దృశ్య రామేణ స్వాఁల్లోకాంస్తపసార్జితాన్ |
జామదగ్న్యో జగామాశు మహేంద్రం పర్వతోత్తమమ్ ||

22

తతో వితిమిరాః సర్వా దిశశ్చోపదిశస్తథా |
సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధమ్ ||

23

రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ |
తతః ప్రదక్షిణం కృత్వా జగామాత్మగతిం ప్రభుః ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్సప్తతితమః సర్గః ||

Balakanda Sarga 76 Meaning In Telugu

అప్పటి వరకూ శ్రీ రాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంక ఊరుకోలేక పోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు.

“పరశురామా! మీ గురించి విన్నాను. నీవు తండ్రి ఋణమును తీర్చుకోడానికి యావత్తు క్షత్రియ లోకమును మట్టు బెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు.” అని పలికి పరశు రాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు.

“ఓ పరశురామా! మీరు బ్రాహ్మణులు. నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధాకారాదు. కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింప వలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆశక్తి మీద ప్రయోగింపనా. లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమలోకముల మీద సంధించనా! ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఈ విష్ణుబాణము వృధాకావడానికి వీలు లేదు. నీవు పట్టు బట్టి నా చేత ఈ బాణమును సంధింపజేసావు. ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి.” అని అడిగాడు రాముడు.

ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమములు నశించి పోయాయి. శరీరం నిర్వీర్యము అయింది. అలానే చూస్తూ ఉండి పోయాడు. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు పరశురాముడు. చేతులు జోడించి నమస్కరించాడు.

“ఓ రామా! నీవు సామాన్యుడవు కావు. విష్ణు ధనుస్సును ధరించిన విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరమూ కాదు. నీ చేతిలో నేను ఓడి పోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారము చేసి ఈ భూమి నంతా కశ్యపునకు ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశములో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్రపర్వతము మీద తపస్సుచేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమన శక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకముల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను.” అని అన్నాడు పరశు రాముడు.

పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణము ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములు అన్నీ ధ్వసం అయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి, తన దివ్యమైన గమన శక్తితో మహేంద్రపర్వతమునకు వెళ్లిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూచాడు దశరథుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ సప్తసప్తతితమః సర్గః (77) >>

Ayodhya Kanda Sarga 53 In Telugu | అయోధ్యాకాండ త్రిపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 53 In Telugu

అయోధ్యా కాండ సర్గ 30 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తిచేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! మన వనవాసములో ఒంటరిగా మొదటి రాత్రి గడప బోతున్నాము. సీత నిద్ర పోతుంటే నువ్వు, నేను, రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము.” అని అన్నాడు రాముడు…

రామసంక్షోభః 

స తం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య పశ్చిమామ్ |
రామః రమయతాం శ్రేష్ఠైతి హోవాచ లక్ష్మణమ్ ||

1

అద్యేయం ప్రథమా రాత్రిర్యాతా జనపదాద్బహిః |
యా సుమంత్రేణ రహితా తాం నోత్కంఠితుమర్హసి ||

2

జాగర్తవ్యమతంద్రిభ్యామద్య ప్రభృతి రాత్రిషు |
యోగక్షేమం హి సీతాయాః వర్తతే లక్ష్మణావయోః ||

3

రాత్రిం కథంచిదేవేమాం సౌమిత్రే వర్తయామహే |
ఉపావర్తామహే భూమౌ ఆస్తీర్య స్వయమార్జితైః ||

4

స తు సంవిశ్య మేదిన్యాం మహార్హశయనోచితః |
ఇమాః సౌమిత్రయే రామః వ్యాజహార కథాః శుభాః ||

5

ధ్రువమద్య మహారాజో దుఃఖం స్వపితి లక్ష్మణ |
కృతకామా తు కైకేయీ తుష్టా భవితుమర్హతి ||

6

సా హి దేవీ మహారాజం కైకేయీ రాజ్య కారణాత్ |
అపి న చ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతమాగతమ్ ||

7

అనాథశ్చ హి వృద్ధశ్చ మయా చైవ వినాకృతః |
కిం కరిష్యతి కామాత్మా కైకేయీ వశమాగతః ||

8

ఇదం వ్యసనమాలోక్య రాజ్ఞశ్చ మతివిభ్రమమ్ |
కామ ఏవార్ధధర్మాభ్యాం గరీయానితి మే మతిః ||

9

కో హ్యవిద్వానపి పుమాన్ ప్రమదాయా కృతే త్యజేత్ |
ఛందానువర్తినం పుత్రం తాతః మామివ లక్ష్మణ ||

10

సుఖీ బత సభార్యశ్చ భరతః కేకయీసుతః |
ముదితాన్ కోసలానేకః యో భోక్ష్యత్యధిరాజవత్ ||

11

స హి సర్వస్య రాజ్యస్య ముఖమేకం భవిష్యతి |
తాతే చ వయసాఽతీతే మయి చారణ్యమాస్థితే ||

12

అర్థ ధర్మౌ పరిత్యజ్య యః కామమనువర్తతే |
ఏవమాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా ||

13

మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజనాయ చ |
కైకేయీ సౌమ్య సంప్రాప్తా రాజ్యాయ భరతస్య చ ||

14

అపీదానీం న కైకేయీ సౌభాగ్య మదమోహితా |
కౌసల్యాం చ సుమిత్రాం చ సంప్రబాధేత మత్కృతే ||

15

మా స్మ మత్కారణాద్దేవీ సుమిత్రా దుఃఖమావసేత్ |
అయోధ్యామిత ఏవ త్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ ||

16

అహమేకో గమిష్యామి సీతయా సహ దండకాన్ |
అనాథాయా హి నాథస్త్వం కౌసల్యాయా భవిష్యసి ||

17

క్షుద్రకర్మా హి కైకేయీ ద్వేష్యమాన్యాయ్యమాచరేత్ |
పరిదద్యా హి ధర్మజ్ఞే భరతే మమ మాతరమ్ ||

18

నూనం జాత్యంతరే కస్మిన్ స్త్రియః పుత్రైః వియోజితాః |
జనన్యా మమ సౌమిత్రే తస్మాదేతదుపస్థితమ్ ||

19

మయా హి చిర పుష్టేన దుఃఖసంవర్ధితేన చ |
విప్రాయుజ్యత కౌసల్యా ఫలకాలే ధిగస్తుమామ్ ||

20

మా స్మ సీమంతినీ కాచిజ్జనయేత్ పుత్రమీదృశమ్ |
సౌమిత్రే యోఽహమంబాయాః దద్మి శోకమనంతకమ్ ||

21

మన్యే ప్రీతి విశిష్టా సా మత్తః లక్ష్మణ సారికా |
యస్యాస్తచ్ఛ్రూయతే వాక్యం శుక పాదమరేర్దశ ||

22

శోచంత్యాశ్చల్పభాగ్యాయాః న కించిదుపకుర్వతా |
పుత్రేణ కిమపుత్రాయాః మయా కార్యమరిందమ ||

23

అల్పభాగ్యా హి మే మాతా కౌసల్యా రహితా మయా |
శేతే పరమదుఃఖార్తా పతితా శోకసాగరే ||

24

ఏకో హ్యహమయోధ్యాం చ పృథివీం చాపి లక్ష్మణ |
తరేయమిషుభిః క్రుద్ధో నను వీర్యమకారణమ్ ||

25

అధర్మభయభీతశ్చ పరలోకస్య చానఘ |
తేన లక్ష్మణ నాద్యాహమాత్మానమభిషేచయే ||

26

ఏతదన్యచ్చ కరుణం విలప్య విజనే వనే |
అశ్రుపూర్ణముఖో రామర్నిశి తూష్ణీముపావిశత్ ||

27

విలప్యోపరతం రామం గతార్చిషమివానలమ్ |
సముద్రమివ నిర్వేగమాశ్వాసయత లక్ష్మణః ||

28

ధ్రువమద్య పురీ రాజన్ అయోధ్యాఽఽయుధినాం వర |
నిష్ప్రభా త్వయి నిష్క్రాంతే గతచంద్రేవ శర్వరీ ||

29

నైతదౌపయికం రామ యదిదం పరితప్యసే |
విషాదయసి సీతాం చ మాం చైవ పురుషర్షభ ||

30

న చ సీతా త్వయా హీనా న చాహమపి రాఘవ |
ముహూర్తమపి జీవావో జలాన్మత్స్యావివోద్ధృతౌ ||

31

న హి తాతం న శత్రుఘ్నం న సుమిత్రాం పరంతప |
ద్రష్టుమిచ్ఛేయమద్యాహం స్వర్గం వాఽపి త్వయా వినా ||

32

తతస్తత్ర సుఖాసీనౌ నాతిదూరే నిరీక్ష్యతామ్ |
న్యగ్రోధే సుకృతాం శయ్యాం భేజాతే ధర్మవత్సలౌ ||

33

స లక్ష్మణస్యోత్తమపుష్కలం వచో
నిశమ్య చైవం వనవాసమాదరాత్ |
సమాః సమస్తా విదధే పరంతపః |
ప్రపద్య ధర్మం సుచిరాయ రాఘవః ||

34

తతస్తు తస్మిన్ విజనే వనే తదా |
మహాబలౌ రాఘవవంశవర్ధనౌ |
న తౌ భయం సంభ్రమమభ్యుపేయతు
ర్యథైవ సింహౌ గిరిసానుగోచరౌ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 53 Meaning In Telugu

రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తిచేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! మన వనవాసములో ఒంటరిగా మొదటి | రాత్రి గడప బోతున్నాము. సీత నిద్ర పోతుంటే నువ్వు, నేను, రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము.” అని అన్నాడు.

లక్ష్మణుడు అదే ప్రకారము చెట్లఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేసాడు. వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణులు. సీత పోయింది. రామ లక్ష్మణులకు నిద్రపట్టలేదు. లక్ష్మణునితో రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! మన తండ్రి దశరథునికి రాత్రిళ్లు నిద్రపడుతుందంటావా! భరతుడు రాగానే, రాజ్యము కోసరము కైక మహారాజును చంపివేయదు కదా! ఏం చేస్తాం.

మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు. అందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కు లేదు. మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్థ కామములలో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతూ ఉంది. అర్థమును వదిలి కామమునకే ప్రాధాన్యము ఇచ్చువాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి
మన మహారాజే ఉదాహరణ.

అయినా కానీ అక్ష్మణా, లోకం లో ఎంత తెలివి తక్కువాడైనా, భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా! కాని మన మహారాజు అలా చేసుకున్నాడు. పోనీలే, భరతుడు తన భార్యా సమేతంగా అయోధ్యారాజ్యమును ఏలగలడు. రాజ్యసుఖాలు అనుభవించగలడు. ఎందుకంటే మహారాజు వృద్ధాప్యముతో మరణిస్తాడు. అగ్రజుడనైన నేను అడవులలో ఉన్నాను. ఇంక భరతునికి అడ్డేముంది. హాయిగా రాజ్యము చేసుకుంటాడు.

లక్ష్మణా! నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. కేవలము మన మహారాజును చంపడానికి, నన్ను అడవులకు పంపడానికి, భరతుని అయోధ్యకు రాజును చెయ్యడానికీ, కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి! అవి మహారాజు ఇస్తాను అనడం ఏమిటి! నేను అడవుల పాలు కావడం ఏమిటి అంతా వింతగా ఉంది కదూ.

లక్ష్మణా! ఇప్పుడు మన మహారాజు కైకమాటకు అడ్డు చెప్పడం లేదు కదా! అది సాకుగా తీసుకొని కైక మన తల్లులను బాధలు పెట్టదుకదా! లక్ష్మణా! నా వలన నువ్వు, నీతల్లి సుమిత్ర, బాధలు పడటం ఎందుకు. రేపు ఉదయమే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు. నీతల్లిని కైక నుండి రక్షించుకో. నేను, నా వెంట సీత, అరణ్యవాసము చేస్తాము.

నువ్వు వెళ్లి నా తల్లి కౌసల్యను భరతునికి అప్పగించు. భరతుడు ధర్మము తెలిసినవాడు. నా తల్లికి ఏ అపకారమూ చెయ్యడు. ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైక బారినుండి రక్షించు. లక్ష్మణా! నా తల్లి కౌసల్య, పూర్వజన్మలో, ఎప్పుడో, తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది. అందుకని ఈజన్మలో తనబిడ్డలకు దూరం అయింది. కొడుకులు పెరిగి పెద్దవారయి తల్లులను సుఖపెడతారని ప్రతీతి.

నేను పెరిగి, పెద్దవాడనయి, నా తల్లిని సుఖపెట్టవలసిన సమయమున, ఆమెకు దూరం అయి అమెను దుఃఖపెట్టుచున్నాను. నేను నా తల్లికి ఒకే కొడుకును. నా తల్లి దుఃఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఎంత పాపాత్ముడను. ఏ తల్లికీ నా మాదిరి తల్లికి కష్టములను కలిగించే పుత్రుడు కలగకూడదు.

లక్ష్మణా! నేను తల్చుకుంటే, ఒకే ఒక బాణంతో శత్రుసంహారము చేసి అయోధ్యను తిరిగి పొందగలను. కాని ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మణా! నేను అధర్మానికి భయపడుతున్నాను. నాకు అధర్మంగా రాజ్యమును పొందడం ఇష్టంలేదు. పైగా రాజ్యం కోసరం అధర్మంగా ప్రవర్తిస్తే, ఉత్తమలోకాలు కలుగవు కదా!” ఈ విధంగా రాముడు పరి పరి విధములుగా చింతిస్తున్నాడు.

రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు. రాముని ఓదారుస్తున్నాడు. “రామా! నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలే కాంతి విహీనంగా ఉంది. అయినా ధీరుడవైన నీవు భీరువు వలె ఈ ప్రకారం దుఃఖపడటం మంచిది కాదు. నీవు దుఃఖపడి, నన్ను సీతను కూడా దు:ఖపడేట్టు చేస్తున్నావు. రామా! నిన్ను చూసి నేను, సీత ఈ వనవాస కష్టములను తృణప్రాయంగా అనుభవిస్తున్నాము. నీవు లేకపోతే మేము నీటి లోనుండి బయటకు తీసిన చేపల మాదిరి గిలా గిలా కొట్టుకుంటాము.

ఓ రామా! నాకు నీవే సర్వస్వము. నీ తరువాతనే నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు. తుదకు నిన్నువిడిచి స్వర్గమునకు వెళ్లమన్నా వెళ్లను. ఇది నానిశ్చయము. కాబట్టి ఇంక నిశ్చింతగా నిద్రించు.” అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలతో కొంచెం ఊరట చెందాడు రాముడు. ఈ పదునాలుగేళ్లు వనవాసము లక్ష్మణుని సాయంతో సంపూర్ణం చేయాలి అని అనుకున్నాడు. ఆ ఊహలతోనే నిద్రలోకి జారుకున్నాడు రాముడు.

అయోధ్యాకాండ చతుఃపంచాశః సర్గః (౫౪) >>

Ayodhya Kanda Sarga 47 In Telugu – అయోధ్యాకాండ సప్తచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 47 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ సప్తచత్వారింశః సర్గ, “పౌరనివృత్తిః”, రామాయణంలోని ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు వనవాసం కోసం బయలుదేరిన తరువాత, అయోధ్య ప్రజలు రాముడిని తిరిగి రావాలని ఆశిస్తూ, అతడిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. కానీ రాముడు వారి అభ్యర్థనలను అంగీకరించక, వారు తిరిగి అయోధ్యకు వెళ్లిపోవాల్సిందిగా చెప్పి, ప్రజలను పంపిస్తాడు. ప్రజలు మనసు కఠినపరచుకుని, రాముడి ఆజ్ఞను పాటిస్తూ తిరిగి అయోధ్యకు వెళతారు. ఈ సర్గలో, ప్రజల విశ్వాసం, విధేయత, మరియు రాముడి పట్ల ఉన్న భక్తి హృదయానికి హత్తుకునేలా చూపబడుతుంది.

పౌరనివృత్తిః

ప్రభాతాయాం తు శర్వర్యాం పౌరాస్తే రాఘవం వినా |
శోకోపహతనిశ్చేష్టా బభూవుర్హతచేతసః ||

1

శోకజాశ్రుపరిద్యూనా వీక్షమాణాస్తతస్తతః |
ఆలోకమపి రామస్య న పశ్యంతి స్మ దుఃఖితాః ||

2

తే విషాదార్తవదనాః రహితాస్తేన ధీమతా |
కృపణాః కరుణా వాచో వదంతి స్మ మనస్వినః ||

3

ధిగస్తు ఖలు నిద్రాం తాం యయాఽపహృతచేతసః |
నాద్య పశ్యామహే రామం పృథూరస్కం మహాభుజమ్ ||

4

కథం నామ మహాబాహుః స తథాఽవితథక్రియః |
భక్తం జనం పరిత్యజ్య ప్రవాసం రాఘవో గతః ||

5

యో నః సదా పాలయతి పితా పుత్రానివౌరసాన్ |
కథం రఘూణాం స శ్రేష్ఠస్త్యక్త్వా నో విపినం గతః ||

6

ఇహైవ నిధనం యామో మహాప్రస్థానమేవ వా |
రామేణ రహితానాం హి కిమర్థం జీవితం హి నః ||

7

సంతి శుష్కాణి కాష్ఠాని ప్రభూతాని మహాంతి చ |
తైః ప్రజ్వాల్య చితాం సర్వే ప్రవిశామోఽథ పావకమ్ ||

8

కిం వక్ష్యామో మహాబాహురనసూయః ప్రియంవదః |
నీతః స రాఘవోఽస్మాభిరితి వక్తుం కథం క్షమమ్ ||

9

సా నూనం నగరీ దీనా దృష్ట్వాఽస్మాన్రాఘవం వినా |
భవిష్యతి నిరానందా సస్త్రీబాలవయోఽధికా ||

10

నిర్యాతాస్తేన వీరేణ సహ నిత్యం జితాత్మనా |
విహినాస్తేన చ పునః కథం పశ్యామ తాం పురీమ్ ||

11

ఇతీవ బహుధా వాచో బాహుముద్యమ్య తే జనాః |
విలపంతి స్మ దుఃఖర్తా వివత్సా ఇవ ధేనవః ||

12

తతః మార్గానుసారేణ గత్వా కించిత్ క్షణం పునః
మార్గనాశాద్విషాదేన మహతా సమభిప్లుతాః ||

13

రథస్య మార్గనాశేన న్యవర్తంత మనస్వినః |
కిమిదం కిం కరిష్యామో దైవేనోపహతా ఇతి ||

14

తతః యథాగతేనైవ మార్గేణ క్లాంతచేతసః |
అయోధ్యామగమన్సర్వే పురీం వ్యథితసజ్జనామ్ ||

15

ఆలోక్య నగరీం తాం చ క్షయవ్యాకులమానసాః |
ఆవర్తయంత తేఽశ్రూణి నయనైః శోకపీడితైః ||

16

ఏషా రామేణ నగరీ రహితా నాతిశోభతే |
ఆపగా గరుడేనేవ హ్రదాదుద్ధృతపన్నగా ||

17

చంద్రహీనమివాకాశం తోయహీనమివార్ణవమ్ |
అపశ్యన్నిహతానందం నగరం తే విచేతసః ||

18

తే తాని వేశ్మాని మహాధనాని
దుఃఖేన దుఃఖోపహతా విశంతః |
నైవ ప్రజజ్ఞుః స్వజనం జనం వా
నిరీక్షమాణాః ప్రవినష్టహర్షాః ||

19

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 47 Meaning In Telugu

రాముని వెంట అడవులకు వచ్చిన బ్రాహ్మణులు పౌరులు ఉదయమే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. సంధ్యా వందనము ఆచరించారు. రాముని కొరకు చూచారు. కాని సీతారామలక్ష్మణులు కనిపించలేదు. అడవి అంతా వెతికారు. కాని వారి జాడలేదు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు.

“ఏమిటీ మనము ఒళ్లు తెలియకుండా నిద్రపోయాము. ఉదయమే మెలుకువ రాలేదు. మన కోసం చూచి రాముడు తన దారిన తాను వెళ్లిపోయి ఉంటాడు. ఏం చేస్తాం. రాముడు ఇన్నాళ్లు మనలను కన్నబిడ్డలవలె చూచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అరణ్యవాసము దాపురించింది. అందుకే మనలను విడిచి వెళ్లి పోయాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు. రాముని విడిచి మనము జీవించలేము. మనము కూడా రాముడు వెళ్లిన ఉత్తర దిక్కుగా వెళ్ళాము. ఏనాటి కైనా రాముడు మనకు కనపడకపోతాడా! రాముడు లేకుండా జీవించడం కంటే రాముని వెదకడమే ఉత్తమము. లేకపోతే ఇక్కడే మనము పెద్ద చితి పేర్చుకొని అందులో అందరమూ అగ్ని ప్రవేశము చేస్తాము.

ఇప్పుడు మనము రాముడు లేకుండా అయోధ్యకు వెళితే, మన ఇంట్లో వాళ్లు “రాముడు ఏడీ!” అని అడిగితే ఏమని సమాధానము చెప్పగలము. రాముని అరణ్యములలో వదిలి వచ్చాము అని చెప్పాలా! మనమందరమూ రాముని తిరిగి తీసుకు వస్తామని అయోధ్యావాసులు అందరూ మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనము రాముడు లేకుండా వెళితే వారి దుఃఖమునకు అంతు ఉండదు.

రాముడు ఉన్నప్పుడు మనము అయోధ్యలో ఉన్నాము. రాముని వెంట అడవులకు వచ్చాము. రాముడు లేని అయోధ్యలో మరలా అడుగుపెట్టలేము. ఇప్పుడు ఏమి చెయ్యడం.” అంటూ తమలో తాము వ్యాకులపడుతున్నారు.

కొంత మంది రథము పోయిన జాడలు అనుసరించి పోదామన్నారు. అందరూ రథము జాడల అనుసరించి వెళ్లారు. కాని ప్రయోజనం లేకపోయింది. ఇంక చేసేది లేక అందరూ తిరిగి అయోధ్య దారి పట్టారు. సాయంత్రానికి అయోధ్యానగరము చేరుకున్నారు. రాముని లేని అయోధ్య వారికి పాడుబడినట్టు కనిపించింది. చంద్రుడు లేని ఆకాశము లాగా వెలవెలబోతున్న అయోధ్యను వారు చూడలేక పోయారు. రాముని వదిలివచ్చిన దు:ఖముతో ఎవరి గృహములకు వారు వెళ్లిపోయారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టచత్వారింశః సర్గః (48) >>