Balakanda Sarga 22 In Telugu – బాలకాండ ద్వావింశః సర్గః

Balakanda Sarga 22 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 22వ సర్గ. ఈ సర్గలో, విష్వామిత్రుడు రాముడు, లక్ష్మణులతో కలిసి మిథిలాపురికి చేరుకుంటారు. మిథిలాపురి చేరుకున్న తరువాత, వారు జనక మహారాజు నిర్వహించిన శివధనుర్థ్సవం గురించి తెలుసుకుంటారు. శివధనుస్సు ఒక మహా శక్తివంతమైన విల్లు, దానిని ఎవరైతే తీరిగించగలరో, ఆ వ్యక్తి సీతాదేవిని వరించవచ్చు. ఈ విషయం రాముడికి తెలిసిన వెంటనే, ఆయన ధనుస్సును చూడాలని ఆసక్తి చూపిస్తాడు.

విద్యాప్రదానమ్

తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథః సుతమ్ |
ప్రహృష్టవదనో రామమాజుహావ సలక్ష్మణమ్ ||

1

కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ |
పురోధసా వసిష్ఠేన మంగలైరభిమంత్రితమ్ ||

2

స పుత్రం మూర్ధ్న్యుపాఘ్రాయ రాజా దశరథః ప్రియమ్ |
దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాంతరాత్మనా ||

3

తతో వాయుః సుఖస్పర్శో విరజస్కో వవౌ తదా |
విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనమ్ ||

4

పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదుందుభినిఃస్వనైః |
శంఖదుందుభినిర్ఘోషః ప్రయాతే తు మహాత్మని ||

5

విశ్వామిత్రో యయావగ్రే తతో రామో మహాయశాః |
కాకపక్షధరో ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత్ ||

6

కలాపినౌ ధనుష్పాణీ శోభయానౌ దిశో దశ |
విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావివ పన్నగౌ |
అనుజగ్మతురక్షుద్రౌ పితామహమివాశ్వినౌ ||

7

తదా కుశికపుత్రం తు ధనుష్పాణీ స్వలంకృతౌ |
బద్ధగోధాంగులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ ||

8

కుమారౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |
అనుయాతౌ శ్రియా జుష్టౌ శోభయేతామనిందితౌ ||

9 [దీప్త్యా]

స్థాణుం దేవమివాచింత్యం కుమారావివ పావకీ |
అధ్యర్ధయోజనం గత్వా సరయ్వా దక్షిణే తటే ||

10

రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోఽభ్యభాషత |
గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయః ||

11

మంత్రగ్రామం గృహాణ త్వం బలామతిబలాం తథా |
న శ్రమో న జ్వరో వా తే న రూపస్య విపర్యయః ||

12

న చ సుప్తం ప్రమత్తం వా ధర్షయిష్యంతి నైరృతాః |
న బాహ్వోః సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన ||

13

త్రిషు లోకేషు వై రామ న భవేత్సదృశస్తవ |
న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే ||

14

నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ |
ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః ||

15

బలా చాతిబలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ |
క్షుత్పిపాసే న తే రామ భవిష్యేతే నరోత్తమ ||

16

బలామతిబలాం చైవ పఠతస్తవ రాఘవ |
[* గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన | *]
విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి ||

17

పితామహసుతే హ్యేతే విద్యే తేజఃసమన్వితే |
ప్రదాతుం తవ కాకుత్స్థ సదృశస్త్వం హి ధర్మిక ||

18

కామం బహుగుణాః సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః |
తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః ||

19

తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనః శుచిః |
ప్రతిజగ్రాహ తే విద్యే మహర్షేర్భావితాత్మనః ||

20

విద్యాసముదితో రామః శుశుభే భూరివిక్రమః |
సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః ||

21

గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే |
ఊషుస్తాం రజనీం తీరే సరయ్వాః సుసుఖం త్రయః ||

22

దశరథనృపసూనుసత్తమాభ్యాం
తృణశయనేఽనుచితే సహోషితాభ్యామ్ |
కుశికసుతవచోఽనులాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వావింశః సర్గః ||

Balakanda Sarga 22 Meaning In Telugu

వసిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. వెంటనే స్వయంగా వెళ్లి రాముని, రాముని వెంట లక్ష్మణుని సభా భవనము నకు తీసుకొని వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేసారు. తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు. దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు. రాముడు, లక్ష్మణుడు వెంట నడువగా, విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు.

ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఆయన వెనుక కోదండము చేతబూని కోదండ రాముడు, రాముని వెనుక ధనుర్ధారియైన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు రాముని “రామా!” అంటూ ప్రేమగా పిలిచాడు. రాముడు విశ్వామిత్రుని దగ్గరగా వచ్చాడు.

“రామా! నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా! నీకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము, ఉండవు.. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు. రామా! నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీ తో సమానమైన వీరుడు, పరాక్రమ వంతుడు ముల్లోకములలో ఉండడు.

రామా! సౌభాగ్యమునందు గానీ, సామర్ధ్యము నందు గానీ, జ్ఞానము నందు గానీ, బుద్ధి యందు గానీ, నీతో సమానమైన వాడు ముల్లోకములలో లేడు. దానికి తోడు నీవు ఈ బల, అతిబల అనే విద్యలు నేర్చుకుంటే, నీతో సమానమైన వాడు వర్తమానములో గానీ, భవిష్యత్తులో గాని ఉండడు, ఉండబోడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి, వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడవు.” అని పలికాడు విశ్వామిత్రుడు.

ఆ మాటలను సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామి ముందు కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల, అతిబల అనే విద్యలను స్వీకరించాడు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరమున విశ్రమించాడు. అంతకు ముందు అలవాటు లేని దర్భ చాపలపై పడుకొనుటకు రామ లక్ష్మణులు కొంచం ఇబ్బంది పడ్డారు. కాని విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రయోవింశః సర్గః (23) >>

Balakanda Sarga 21 In Telugu – బాలకాండ ఏకవింశః సర్గః

Balakanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము.  బాలకాండ లోని ఏకవింశః సర్గలో, ఋషి విశ్వామిత్రుని కోపం దశరథ రాజుపై చూపబడింది. విశ్వామిత్ర ఋషిని శాంతింపజేయడానికి, వశిష్ట ఋషి జోక్యం చేసుకుని, రాముడిని విశ్వామిత్ర ఋషితో పంపమని దశరథ రాజును ఒప్పించాడు. అలా చేస్తున్నప్పుడు, వశిష్ట ఋషి విశ్వామిత్ర మహర్షి యొక్క సామర్థ్యాలను, అతని ఆయుధ జ్ఞానాన్ని వివరించాడు. రాముడిని విశ్వామిత్రునితో పంపిస్తే ఆ ఆయుధాలన్నీ రాముడికి ఇవ్వబడతాయని వశిష్ఠుడు కూడా సూచిస్తాడు. చివరికి దశరథుడు రాముని పంపడానికి అంగీకరించాడు.

వసిష్ఠవాక్యమ్

తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరమ్ |
సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్ ||

1

పూర్వమర్థం ప్రతిశ్రుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి |
రాఘవాణామయుక్తోఽయం కులస్యాస్య విపర్యయః ||

2

యదీదం తే క్షమం రాజన్గమిష్యామి యథాగతమ్ |
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖీ భవ సబాంధవాః ||

3

తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః |
చచాల వసుధా కృత్స్నా వివేశ చ భయం సురాన్ ||

4

త్రస్తరూపం తు విజ్ఞాయ జగత్సర్వం మహానృషిః |
నృపతిం సువ్రతో ధీరో వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||

5

ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః |
ధృతిమాన్సువ్రతః శ్రీమాన్న ధర్మం హాతుమర్హసి ||

6

త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ |
స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి ||

7

సంశ్రుత్యైవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ |
ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామం విసర్జయ ||

8

కృతాస్త్రమకృతాస్త్రం వా నైవం శక్ష్యంతి రాక్షసాః |
గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా ||

9

ఏష విగ్రహవాన్ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణమ్ ||

10

ఏషోఽస్త్రాన్వివిధాన్వేత్తి త్రైలోక్యే సచరాచరే |
నైనమన్యః పుమాన్వేత్తి న చ వేత్స్యంతి కేచన ||

11

న దేవా నర్షయః కేచిన్నాసురా న చ రాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||

12

సర్వాస్త్రాణి కృశాశ్వస్య పుత్రాః పరమధార్మికాః |
కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి ||

13

తేఽపి పుత్రా కృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః |
నైకరూపా మహావీర్యా దీప్తిమంతో జయావహాః ||

14

జయా చ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే |
తే సువాతేఽస్త్రశస్త్రాణి శతం పరమభాస్వరమ్ ||

15

పంచాశతం సుతాఁల్లేభే జయా నామ పరాన్పురా |
వధాయాసురసైన్యానామమేయాన్ కామరూపిణః ||

16

సుప్రభాఽజనయచ్చాపి పుత్రాన్పంచాశతం పునః |
సంహారాన్నామ దుర్ధర్షాన్దురాక్రామాన్బలీయసః ||

17

తాని చాస్త్రాణి వేత్త్యేష యథావత్కుశికాత్మజః |
అపూర్వాణాం చ జననే శక్తో భూయశ్చ ధర్మవిత్ ||

18

తేనాస్య మునిముఖ్యస్య సర్వజ్ఞస్య మహాత్మనః |
న కించిదప్యవిదితం భూతం భవ్యం చ రాఘవ ||

19

ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాతపాః | [మహాయశాః]
న రామగమనే రాజన్సంశయం గంతుమర్హసి ||

20

తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః |
తవ పుత్రహితార్థాయ త్వాముపేత్యాభియాచతే ||

21

ఇతి మునివచనాత్ప్రసన్నచిత్తో
రఘువృషభశ్చ ముమోద భాస్వరాంగః |
గమనమభిరురోచ రాఘవస్య
ప్రథితయశాః కుశికాత్మజాయ బుధ్యా ||

22

Balakanda Sarga 21 In Telugu Pdf With Meaning

ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్ధము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో, విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆయన కోపం తారస్థాయి కి చేరుకుంది.

“దశరథీ! ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘు వంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్లిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగాఉండు.” అనిఅన్నాడు విశ్వామిత్రుడు కోపంగా.

విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వసిష్టుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు.

“ఓ దశరథ మహారాజా! నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు. మంచి ధైర్యవంతుడివి. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా! నీవు నీ ధర్మమును ఆచరించి. అధర్మమును విడిచిపెట్టు. ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటి దాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు.

ఓ దశరథ మహారాజా! నా మాట విను. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్ర శస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్ర శస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవరికీ తెలియవు. పూర్వము భృశాశ్వసుడు తనకు తెలిసిన అస్త్ర శస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి భృశాశ్వసునకు దక్షప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి.

పూర్వము దక్షప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసులను సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది. వారు కామ రూపులు, మహాబలురు. పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్ధుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు?

నీకు ఇంకో విషయం తెలుసా! ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు. కాని నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్ఠలు తీసుకు రావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకొని రాముని విశ్వామిత్రుని వెంట పంపు.” అని పలికాడు.

కులగురువు వసిష్టుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు. రాముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ద్వావింశః సర్గః (22) >>

Balakanda Sarga 20 In Telugu – బాలకాండ వింశః సర్గః

Balakanda Sarga 20 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండ వింశః సర్గః: ఇందులో, విష్వామిత్ర మహర్షి రామ-లక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమంలో ప్రవేశిస్తారు. అక్కడ వారు యజ్ఞం ప్రారంభిస్తారు. రాక్షసులు యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు తన వీర్యాన్ని ప్రదర్శించి, రాక్షసులను సంహరిస్తాడు. యజ్ఞం విజయవంతంగా పూర్తవుతుంది. విష్వామిత్రుడు రాముడి ధైర్యాన్ని మరియు శక్తిని ప్రశంసిస్తాడు.

దశరథవాక్యమ్

తచ్ఛ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్ |
ముహూర్తమివ నిఃసంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీత్ ||

1

ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః |
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః ||

2

ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః |
అనయా సంవృతో గత్వా యోద్ధాఽహం తైర్నిశాచరైః ||

3

ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యా మేఽస్త్రవిశారదాః |
యోగ్యా రక్షోగణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి ||

4

అహమేవ ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని |
యావత్ప్రాణాన్ధరిష్యామి తావద్యోత్స్యే నిశాచరైః ||

5

నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా |
అహం తత్ర గమిష్యామి న రామం నేతుమర్హసి ||

6

బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్ |
న చాస్త్రబలసంయుక్తో న చ యుద్ధవిశారదః ||

7

న చాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధా హి తే ధ్రువమ్ |
విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే ||

8

జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి |
యది వా రాఘవం బ్రహ్మన్నేతుమిచ్ఛసి సువ్రత ||

9

చతురంగసమాయుక్తం మయా చ సహ తం నయ |
షష్టిర్వర్షసహస్రాణి జాతస్య మమ కౌశిక ||

10

దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి |
చతుర్ణామాత్మజానాం హి ప్రీతిః పరమికా మమ ||

11

జ్యేష్ఠం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి |
కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కే చ తే ||

12

కథం ప్రమాణాః కే చైతాన్రక్షంతి మునిపుంగవ |
కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్ ||

13

మామకైర్వా బలైర్బ్రహ్మన్మయా వా కూటయోధినామ్ |
సర్వం మే శంస భగవన్కథం తేషాం మయా రణే ||

14

స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః |
తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోఽభ్యభాషత ||

15

పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః |
స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశమ్ ||

16

మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః |
శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః ||

17

సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః |
యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః ||

18

తేన సంచోదితౌ ద్వౌ తు రాక్షసౌ సుమహాబలౌ |
మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః ||

19

ఇత్యుక్తో మునినా తేన రాజోవాచమునిం తదా |
న హి శక్తోఽస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః ||

20

స త్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే |
మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్గురుః ||

21

దేవదానవగంధర్వా యక్షాః పతగపన్నగాః |
న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవా యుధి ||

22

స హి వీర్యవతాం వీర్యమాదత్తే యుధి రాక్షసః |
తేన చాహం న శక్నోమి సంయోద్ధుం తస్య వా బలైః ||

23

సబలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః |
కథమప్యమరప్రఖ్యం సంగ్రామాణామకోవిదమ్ ||

24

బాలం మే తనయం బ్రహ్మన్నైవ దాస్యామి పుత్రకమ్ |
అథ కాలోపమౌ యుద్ధే సుతౌ సుందోపసుందయోః ||

25

యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకమ్ |
మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ ||

26

తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః |

[* అన్యథా త్వనునేష్యామి భవంతం సహ బాంధవైః | *]

ఇతి నరపతిజల్పనాద్ద్విజేంద్రం
కుశికసుతం సుమహాన్వివేశ మన్యుః |
సుహుత ఇవ మఖేఽగ్నిరాజ్యసిక్తః
సమభవదుజ్జ్వలితో మహర్షివహ్నిః ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే వింశః సర్గః ||

Balakanda Sarga 20 Meaning In Telugu

దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు.

“ఓ మునీశ్వరా! నా రాముడు పదహారు సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకూ యాగ సంరక్షణ చేస్తాను.

ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్రా! ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు. యుద్ధ తంత్రములు తెలియని వాడు. ఇంకా యుద్ధ విద్యలు పూర్తి గానేర్వని వాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేత కాదు.

ఓ మునీంద్రా! రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకొని వెళ్లండి. రాముడు నా పెద్దకుమారుడు. చాలాకాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను.

ఇంతకూ మునీంద్రా! ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి?” అని వినయంగా అడిగాడు. దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! పౌలస్త్య వంశంలో పుట్టిన వాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహా బలవంతుడు. వీర్య వంతుడు. బ్రహ్మ చేత వరములు పొందిన వాడు. లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకముల లోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనే వారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగ చేస్తున్నారు.” అని చెప్పాడు విశ్వామిత్రుడు.

ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! మీరు చెప్పినదానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలువ లేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా! తమరు చెప్పినట్టు దేవ, దానవ, గంధర్వులే రావణునికి ఎదురు నిలువ లేనపుడు మానవులము మేమెంత! కాబట్టి నేను గానీ నా కుమారులు గానీ ఆ రాక్షసులతో యుద్ధ చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకమునుండి రక్షించే వాడు. అతనిని తమరి వెంట రాక్షసులతో యుద్ధమునకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చినా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. ఈ సారికి మమ్ములను మన్నించి వదిలివేయండి.” అని ప్రార్థించాడు దశరథుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ఏకవింశః సర్గః (21) >>

Ayodhya Kanda Sarga 5 In Telugu – అయోధ్యాకాండ పంచమః సర్గః

Ayodhya Kanda Sarga 5 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. పంచమః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.

వ్రతచర్యావిధానమ్

సందిశ్య రామం నృపతిః శ్వోభావిన్యభిషేచనే |
పురోహితం సమాహూయ వసిష్ఠం చేదమబ్రవీత్ ||

1

గచ్ఛోపవాసం కాకుత్స్థం కారయాద్య తపోధన |
శ్రీయశోరాజ్యలాభాయ వధ్వా సహ యతవ్రతమ్ ||

2

తథేతి చ స రాజానముక్త్వా వేదవిదాం వరః |
స్వయం వసిష్ఠో భగవాన్యయౌ రామనివేశనమ్ ||

3

ఉపవాసయితుం రామం మంత్రవన్మంత్రకోవిదః |
బ్రాహ్మం రథవరం యుక్తమాస్థాయ సుదృఢవ్రతః ||

4

స రామభవనం ప్రాప్య పాండురాభ్రఘనప్రభమ్ |
తిస్రః కక్ష్యా రథేనైవ వివేశ మునిసత్తమః ||

5

తమాగతమృషిం రామస్త్వరన్నివ ససంభ్రమః |
మానయిష్యన్స మానార్హం నిశ్చక్రామ నివేశనాత్ ||

6

అభ్యేత్య త్వరమాణశ్చ రథాభ్యాశం మనీషిణః |
తతోఽవతారయామాస పరిగృహ్య రథాత్స్వయమ్ ||

7

స చైనం ప్రశ్రితం దృష్ట్వా సంభాష్యాభిప్రసాద్య చ |
ప్రియార్హం హర్షయన్రామమిత్యువాచ పురోహితః ||

8

ప్రసన్నస్తే పితా రామ యౌవరాజ్యమవాప్స్యసి |
ఉపవాసం భవానద్య కరోతు సహ సీతయా ||

9

ప్రాతస్త్వామభిషేక్తా హి యౌవరాజ్యే నరాధిపః |
పితా దశరథః ప్రీత్యా యయాతిం నహుషో యథా ||

10

ఇత్యుక్త్వా స తదా రామముపవాసం యతవ్రతమ్ |
మంత్రవిత్కారయామాస వైదేహ్యా సహితం మునిః ||

11

తతో యథావద్రామేణ స రాజ్ఞో గురురర్చితః |
అభ్యనుజ్ఞాప్య కాకుత్స్థం యయౌ రామనివేశనాత్ ||

12

సుహృద్భిస్తత్ర రామోఽపి సుఖాసీనః ప్రియంవదైః |
సభాజితో వివేశాఽథ తాననుజ్ఞాప్య సర్వశః ||

13

ప్రహృష్టనరనారీకం రామవేశ్మ తదా బభౌ | [హృష్టనారీనరయుతం]
యథా మత్తద్విజగణం ప్రఫుల్లనలినం సరః ||

14

స రాజభవనప్రఖ్యాత్తస్మాద్రామనివేశనాత్ |
నిఃసృత్య దదృశే మార్గం వసిష్ఠో జనసంవృతమ్ || [నిర్గత్య]

15

బృందబృందైరయోధ్యాయాం రాజమార్గాః సమంతతః |
బభూవురభిసంబాధాః కుతూహలజనైర్వృతాః ||

16

జనబృందోర్మిసంఘర్షహర్షస్వనవతస్తదా |
బభూవ రాజమార్గస్య సాగరస్యేవ నిస్వనః ||

17

సిక్తసంమృష్టరథ్యా చ తదహర్వనమాలినీ |
ఆసీదయోధ్యా నగరీ సముచ్ఛ్రితగృహధ్వజా ||

18

తదా హ్యయోధ్యానిలయః సస్త్రీబాలాబలో జనః |
రామాభిషేకమాకాంక్షన్నాకాంక్షదుదయం రవేః ||

19

ప్రజాలంకారభూతం చ జనస్యానందవర్ధనమ్ |
ఉత్సుకోఽభూజ్జనో ద్రష్టుం తమయోధ్యామహోత్సవమ్ ||

20

ఏవం తం జనసంబాధం రాజమార్గం పురోహితః |
వ్యూహన్నివ జనౌఘం తం శనై రాజకులం యయౌ ||

21

సితాభ్రశిఖరప్రఖ్యం ప్రాసాదమధిరుహ్య సః |
సమీయాయ నరేంద్రేణ శక్రేణేవ బృహస్పతిః ||

22

తమాగతమభిప్రేక్ష్య హిత్వా రాజాసనం నృపః |
పప్రచ్ఛ స చ తస్మై తత్కృతమిత్యభ్యవేదయత్ ||

23

తేన చైవ తదా తుల్యం సహాసీనాః సభాసదః |
ఆసనేభ్యః సముత్తస్థుః పూజయంతః పురోహితమ్ ||

24

గురుణా త్వభ్యనుజ్ఞాతో మనుజౌఘం విసృజ్య తమ్ |
వివేశాంతఃపురం రాజా సింహో గిరిగుహామివ ||

25

తదగ్ర్యరూపం ప్రమదాజనాకులం [గణాకులం]
మహేంద్రవేశ్మప్రతిమం నివేశనమ్ |
విదీపయంశ్చారు వివేశ పార్థివః
శశీవ తారాగణసంకులం నభః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచమః సర్గః ||

Ayodhya Kanda Sarga 5 Meaning In Telugu

తన దగ్గరనుండి రాముడు వెళ్లిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వసిష్ఠుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు.

“ఓ వసిష్ఠ మహామునీ! రేపే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్లి, రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్టు రామునితో, సీతతో ఈ రోజు ఉపవాసవ్రతము చేయించండి.” అని అన్నాడు.

దశరథుని ఆదేశాను సారము వసిష్ఠుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వసిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి, స్వాగత సత్కారములు చేసాడు. ఉచితా సనము మీద కూర్చో పెట్టాడు. అప్పుడు వసిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! రేపు ఉదయము నీకు యౌవరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి.” అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వసిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాసవ్రతము చేయించాడు. రాముడు సీత తమ గురువు గారైన వసిష్ఠును యధోచితంగా పూజించారు. తరువాత వసిష్ఠుడు రాముని మందిరము నుండి వెళ్లిపోయాడు.

ఈ వార్తవిన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది.

మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిట కిట లాడుతున్నాయి. నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పుర వీధులు అన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు. తోరణాలు కట్టారు. జండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. రామ మందిరము నుండి బయలు దేరిన వసిష్ఠుడు, దారిలో క్రిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు. దశరథుని కలుసుకున్నాడు.

” ఓ వసిష్ట మహామునీ! రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా!” అని అడిగాడు.

“అంతా మీరుచెప్పినట్టే చేయించాను.” అని చెప్పాడు వసిష్ఠుడు.

అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వసిష్టుడు వచ్చిన తరువాత, వారందరినీ పంపివేసాడు. తాను కూడా తన అంతఃపురములోకి వెళ్లాడు.

శ్రీమదామాయణము
అయోధ్యాకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షష్ఠః సర్గః (6) >>

Ayodhya Kanda Sarga 16 In Telugu – అయోధ్యాకాండ షోడశః సర్గః

Ayodhya Kanda Sarga 16

“రామాయణం” లో అయోధ్యాకాండ షోడశః సర్గం (16వ సర్గ)లో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు భద్రత కోసం చిత్రకూటం చేరుకుంటారు. అక్కడ, వారు తపస్వులు మరియు సన్యాసులతో కలుస్తారు. చిత్రకూటంలో సుఖశాంతులతో నివసిస్తూ, రాముడు తన తండ్రి దశరథుని మరణవార్త వింటాడు. ఈ వార్త రాముని, సీత మరియు లక్ష్మణులను తీవ్రంగా కలచివేస్తుంది. రాముడు పితృవేదనతో తపస్సులో మునిగిపోతాడు. ఈ సర్గలో, రాముడి ధర్మపరమైన కట్టుబాట్లు మరియు తండ్రి పట్ల ప్రేమ స్పష్టంగా తెలుస్తాయి. త్రయం చిత్రకూటంలో శోకంతో పాటు శాంతిని అనుభవిస్తారు.

రామప్రస్థానమ్

స తదంతఃపురద్వారం సమతీత్య జనాకులమ్ |
ప్రవివిక్తాం తతః కక్ష్యామాససాద పురాణవిత్ || ౧ ||

ప్రాసకార్ముకబిభ్రద్భిర్యువభిర్మృష్టకుండలైః |
అప్రమాదిభిరేకాగ్రైః స్వనురక్తైరధిష్ఠితామ్ || ౨ ||

తత్ర కాషాయిణో వృద్ధాన్వేత్రపాణీన్ స్వలంకృతాన్ |
దదర్శ విష్ఠితాన్ద్వారిః త్ర్యధ్యక్షాన్సుసమాహితాన్ || ౩ ||

తే సమీక్ష్య సమాయాంతం రామప్రియచికీర్షవః |
సహసోత్పతితాః సర్వే స్వాసనేభ్యః ససంభ్రమాః || ౪ ||

తానువాచ వినీతాత్మా సూతపుత్రః ప్రదక్షిణః |
క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రో ద్వారి తిష్ఠతి || ౫ ||

తే రామముపసంగమ్య భర్తుః ప్రియచికీర్షవః |
సహభార్యాయ రామాయ క్షిప్రమేవాచచక్షిరే || ౬ ||

ప్రతివేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం పితుః |
తత్రైవానాయయామాస రాఘవప్రియకామ్యయా || ౭ ||

తం వైశ్రవణసంకాశముపవిష్టం స్వలంకృతమ్ |
దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే సోత్తరచ్ఛదే || ౮ ||

వరాహరుధిరాభేణ శుచినా చ సుగంధినా |
అనులిప్తం పరార్ధ్యేన చందనేన పరంతపమ్ || ౯ ||

స్థితయా పార్శ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా |
ఉపేతం సీతయా భూతశ్చిత్రయా శశినం యథా || ౧౦ ||

తం తపంతమివాదిత్యముపపన్నం స్వతేజసా |
వవందే వరదం వందీ వినయజ్ఞో వినీతవత్ || ౧౧ ||

ప్రాంజలిస్తు సుఖం పృష్ట్వా విహారశయనాసనే |
రాజపుత్రమువాచేదం సుమంత్రో రాజసత్కృతః || ౧౨ ||

కౌసల్యా సుప్రజా రామ పితా త్వాం ద్రష్టుమిచ్ఛతి |
మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్ర మా చిరమ్ || ౧౩ ||

ఏవముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతిః |
తతః సమ్మానయామాస సీతామిదమువాచ హ || ౧౪ ||

దేవి దేవశ్చ దేవీ చ సమాగమ్య మదంతరే |
మంత్రయేతే ధ్రువం కించిదభిషేచనసంహితమ్ || ౧౫ ||

లక్షయిత్వా హ్యభిప్రాయం ప్రియకామా సుదక్షిణా |
సంచోదయతి రాజానం మదర్థం మదిరేక్షణే || ౧౬ ||

సా ప్రహృష్టా మహారాజం హితకామానువర్తినీ |
జననీ చార్థకామా మే కేకయాధిపతేః సుతా || ౧౭ ||

దిష్ట్యా ఖలు మహారాజో మహిష్యా ప్రియయా సహ |
సుమంత్రం ప్రాహిణోద్దూతమర్థకామకరం మమ || ౧౮ ||

యాదృశీ పరిషత్తత్ర తాదృశో దూత ఆగతః |
ధ్రువమద్యైవ మాం రాజా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి || ౧౯ ||

అహం శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిమ్ | [హంత]
సహ త్వం పరివారేణ సుఖమాస్వ రామస్వ చ || ౨౦ ||

పతిసమ్మానితా సీతా భర్తారమసితేక్షణా |
ఆద్వారమనువవ్రాజ మంగళాన్యభిదధ్యుషీ || ౨౧ ||

రాజ్యం ద్విజాతిభిర్జుష్టం రాజసూయాభిషేచనమ్ |
కర్తుమర్హతి తే రాజా వాసవస్యేవ లోకకృత్ || ౨౨ ||

దీక్షితం వ్రతసంపన్నం వరాజినధరం శుచిమ్ |
కురంగశృంగపాణిం చ పశ్యంతీ త్వాం భజామ్యహమ్ || ౨౩ ||

పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతు తే యమః |
వరుణః పశ్చిమామాశాం ధనేశస్తూత్తరాం దిశమ్ || ౨౪ ||

అథ సీతామనుజ్ఞాప్య కృతకౌతుకమంగళః |
నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాత్ || ౨౫ ||

పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయః |
లక్ష్మణం ద్వారి సోఽపశ్యత్ప్రహ్వాంజలిపుటం స్థితమ్ || ౨౬ ||

అథ మధ్యమకక్ష్యాయాం సమాగమ్య సుహృజ్జనైః |
స సర్వానర్థినో దృష్ట్వా సమేత్య ప్రతినంద్య చ || ౨౭ ||

తతః పావకసంకాశమారురోహ రథోత్తమమ్ |
వైయాఘ్రం పురుషవ్యాఘ్రో రాజతం రాజనందనః || ౨౮ ||

మేఘనాదమసంబాధం మణిహేమవిభూషితమ్ |
ముష్ణంతమివ చక్షూంషి ప్రభయా హేమవర్చసమ్ || ౨౯ ||

కరేణుశిశుకల్పైశ్చ యుక్తం పరమవాజిభిః |
హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవాశుగమ్ || ౩౦ ||

ప్రయయౌ తూర్ణమాస్థాయ రాఘవో జ్వలితః శ్రియా |
స పర్జన్య ఇవాకాశే స్వనవానభినాదయన్ || ౩౧ ||

నికేతాన్నిర్యయౌ శ్రీమాన్మహేంద్రాదివ చంద్రమాః |
ఛత్రచామరపాణిస్తు లక్ష్మణో రాఘవానుజః || ౩౨ ||

జుగోప భ్రాతరం భ్రాతా రథమాస్థాయ పృష్ఠతః |
తతో హలహలాశబ్దస్తుములః సమజాయత || ౩౩ ||

తస్య నిష్క్రమమాణస్య జనౌఘస్య సమంతతః |
తతో హయవరా ముఖ్యాః నాగాశ్చ గిరిసన్నిభాః || ౩౪ ||

అనుజగ్ముస్తదా రామం శతశోఽథ సహస్రశః |
అగ్రతశ్చాస్య సన్నద్ధాశ్చందనాగరురూషితాః || ౩౫ ||

ఖడ్గచాపధరాః శూరాః జగ్మురాశంసవో జనాః |
తతో వాదిత్రశబ్దాస్తు స్తుతిశబ్దాశ్చ వందినామ్ || ౩౬ ||

సింహనాదాశ్చ శూరాణాం తథా శుశ్రువిరే పథి |
హర్మ్యవాతాయనస్థాభిర్భూషితాభిః సమంతతః || ౩౭ ||

కీర్యమాణః సుపుష్పౌఘైర్యయౌ స్త్రీభిరరిందమః |
రామం సర్వానవద్యాంగ్యో రామపిప్రీషయా తతః || ౩౮ ||

వచోభిరగ్ర్యైర్హర్మ్యస్థాః క్షితిస్థాశ్చ వవందిరే |
నూనం నందతి తే మాతా కౌసల్యా మాతృనందన || ౩౯ ||

పశ్యంతీ సిద్ధయాత్రం త్వాం పిత్ర్యం రాజ్యమవస్థితమ్ |
సర్వసీమంతినీభ్యశ్చ సీతాం సీమంతినీం వరామ్ || ౪౦ ||

అమన్యంత హి తా నార్యో రామస్య హృదయప్రియామ్ |
తయా సుచరితం దేవ్యా పురా నూనం మహత్తపః || ౪౧ ||

రోహిణీవ శశాంకేన రామసంయోగమాప యా |
ఇతి ప్రాసాదశృంగేషు ప్రమదాభిర్నరోత్తమః || ౪౨ ||

శుశ్రావ రాజమార్గస్థః ప్రియా వాచ ఉదాహృతాః |
ఆత్మసంపూజనైః శృణ్వన్యయౌ రామో మహాపథమ్ || ౪౩ ||

స రాఘవస్తత్ర కథాప్రపంచాన్
శుశ్రావ లోకస్య సమాగతస్య |
ఆత్మాధికారా వివిధాశ్చ వాచః
ప్రహృష్టరూపస్య పురో జనస్య || ౪౪ ||

ఏష శ్రియం గచ్ఛతి రాఘవోఽద్య
రాజప్రసాదాద్విపులాం గమిష్యన్ |
ఏతే వయం సర్వసమృద్ధకామాః
యేషామయం నో భవితా ప్రశాస్తా || ౪౫ ||

లాభో జనస్యాస్య యదేష సర్వం
ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ |
న హ్యప్రియం కించన జాతు కశ్చి-
-త్పశ్యేన్న దుఃఖం మనుజాధిపేఽస్మిన్ || ౪౬ ||

స ఘోషవద్భిశ్చ హయైర్మతంగజైః
పురఃసరైః స్వస్తికసూతమాగధైః |
మహీయమానః ప్రవరైశ్చ వాదకై-
-రభిష్టుతో వైశ్రవణో యథా యయౌ || ౪౭ ||

కరేణుమాతంగరథాశ్వసంకులం
మహాజనౌఘప్రతిపూర్ణచత్వరమ్ |
ప్రభూతరత్నం బహుపణ్యసంచయం
దదర్శ రామో రుచిరం మహాపథమ్ || ౪౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశః సర్గః || ౧౬ ||

Ayodhya Kanda Sarga 16 Meaning In Telugu

రాముని అంతఃపురములో ఒక్కొక్క ద్వారమును దాటు కుంటూ వెళుతున్నాడు సుమంత్రుడు. రాముని అంత:పురము బయట కాపలా ఉన్న భటులతో “రాముని దర్శనము కొరకు సుమంత్రుడు వచ్చి ఉన్నాడు” అని చెప్పండి అని చెప్పి పంపించాడు. సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంత్రుడు వచ్చాడు అన్న మాటను చెప్పారు. “సుమంత్రుని సాదరంగా లోపలకు తీసుకొని రండి” అని ఆదేశించాడు రాముడు.
సుమంత్రుడు రాముని అంతఃపురములోకి వెళ్లాడు. రాముని చూచాడు. రామునికి నమస్కరించాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
” ఓ కౌసల్యా నందనా! రామా! మీ తండ్రిగారు దశరథ మహారాజు గారూ, తమరి తల్లి కైకేయీ మహారాణి గారూ తమరిని చూడవలెనని అనుకుంటున్నారు. తమరు వెంటనే దశరథుల వారి అంతఃపురమునకు బయలు దేరండి.” అని పలికాడు.

ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు. “సీతా! నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలెనని అనుకుంటున్నారు. నన్ను తీసుకొని రమ్మని సుమంత్రుని పంపారు. నేను వెంటనే నా తల్లి తండ్రుల వద్దకు వెళ్లుతున్నాను.” అని చెప్పాడు.

సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారము దాకా తోడు వచ్చింది. “ఆర్యపుత్రా! మీకు జయమగుగాక! తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు. తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమరిని సదా రక్షించు గాక! శు భంగా వెళ్లిరండి.” అని భర్తను సాగనంపింది సీత. సీత వద్దనుండి అనుమతి తీసుకున్న రాముడు, సుమంత్రునితో సహా దశరధ మహారాజు మందిరమునకు బయలుదేరాడు.

ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసరము వేచి ఉన్నాడు. లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు. ముగ్గురూ కలిసి వెళు తున్నారు. దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి ‘తండ్రిగారిని కలుసుకొని ఇప్పుడే వస్తాను’ అని చెప్పాడు. రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు. రాముడు ఎక్కిన రథము రాజాంతఃపురమునకు బయలుదేరింది. లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముని అప్రత్తంగా రక్షిస్తున్నాడు. రాముని రథము వెంట గుర్రములు, ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు. కవచములు, ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు.

రాముని చూచి మార్గమునకు అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రాముని గుణగణములను స్తుతిస్తున్నారు. మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు. దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు. అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు. “పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముని భర్తగా పొందినది”, సీత అదృష్టాన్ని పొగిడారు.

వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు. ఈ నాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు. ఇంక మనకోరికలు అన్నీ తీరుతాయి. ఇంక అయోధ్యా ప్రజలకు దుఃఖము అనే మాట వినపడదు. అని అయోధ్యావాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.
ఆ ప్రకారంగా రాముడు, ముందు వంది మాగధులు కైవారములు చేస్తూ ఉంటే, వెనక ఆశ్విక బలము, గజబలము వెంట వస్తూ ఉంటే, రాజాంతఃపురమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తదశః సర్గః (17) >>

Balakanda Sarga 18 In Telugu – బాలకాండ అష్టాదశః సర్గః

Balakanda Sarga 18 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టాదశః సర్గంలో, విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులతో కలిసి మిథిలానగరికి ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గంలో, విశ్వామిత్రుడు సుగ్రీవుడి కథను రాముడికి వివరిస్తారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలి చేత అవమానితుడై, తన రాజ్యం కోల్పోయాడు. తరువాత, వారు గంగా నది తీరానికి చేరుకుంటారు. అక్కడ విశ్వామిత్రుడు గంగా నది ఉద్భవ కథను వివరిస్తాడు. ఈ ప్రయాణంలో రాముడు, లక్ష్మణుడు గురువు మాటలను ఆసక్తితో వింటారు.

శ్రీరామాద్యవతారః

నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్హయమేధే మహాత్మనః |
ప్రతిగృహ్య సురా భాగాన్ ప్రతిజగ్ముర్యథాగతమ్ ||

1

సమాప్తదీక్షానియమః పత్నీగణసమన్వితః |
ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః ||

2

యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః |
ముదితాః ప్రయయుర్దేశాన్ప్రణమ్య మునిపుంగవమ్ ||

3

శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః |
బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే ||

4

గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా |
ప్రవివేశ పురీం శ్రీమాన్పురస్కృత్య ద్విజోత్తమాన్ ||

5

శాంతయా ప్రయయౌ సార్ధమృశ్యశృంగః సుపూజితః |
అన్వీయమానో రాజ్ఞాఽథ సానుయాత్రేణ ధీమతా ||

6

ఏవం విసృజ్య తాన్సర్వాన్రాజా సంపూర్ణమానసః |
ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్ ||

7

తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః |
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ ||

8

నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ||

9

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్ |
కౌసల్యాఽజనయద్రామం దివ్యలక్షణసంయుతమ్ ||

10

విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనమ్ |
[* లోహితాక్షం మహాబాహుం రక్తోష్ఠం దుందుభిస్వనమ్ | *]
కౌసల్యా శుశుభే తేన పుత్రేణామిత తేజసా ||

11

యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా |
భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః ||

12

సాక్షాద్విష్ణోశ్చతుర్థభాగః సర్వైః సముదితో గుణైః |
అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ ||

13

సర్వాస్త్రకుశలౌ వీరౌ విష్ణోరర్ధసమన్వితౌ |
పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః ||

14

సార్పే జాతౌ చ సౌమిత్రీ కులీరేఽభ్యుదితే రవౌ |
రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పృథక్ ||

15

గుణవంతోఽనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః |
జగుః కలం చ గంధర్వా ననృతుశ్చాప్సరోగణాః ||

16

దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా |
ఉత్సవశ్చ మహానాసీదయోధ్యాయాం జనాకులః ||

17

రథ్యాశ్చ జనసంబాధా నటనర్తకసంకులాః |
గాయనైశ్చ విరావిణ్యో వాదకైశ్చ తథాఽపరైః ||

18

[* విరేజుర్విపులాస్తత్ర సర్వ రత్న సమన్వితాః | *]
ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినామ్ |
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః ||

19

అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాఽకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్ ||

20

సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా |
వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా ||

21

బ్రాహ్మణాన్భోజయామాస పౌరజానపదానపి |
అదదద్బ్రాహ్మణానాం చ రత్నౌఘమమితం బహు ||

22

తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్ |
తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః ||

23

బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సంమతః |
సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః ||

24

సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః |
తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః ||

25

ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః |
గజస్కంధేఽశ్వపృష్టే చ రథచర్యాసు సంమతః ||

26

ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః |
బాల్యాత్ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః ||

27

రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః |
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః ||

28

లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిఃప్రాణ ఇవాపరః |
న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః ||

29

మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా |
యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః ||

30

తదైనం పృష్ఠతోఽభ్యేతి సధనుః పరిపాలయన్ |
భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః ||

31

ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః |
స చతుర్భిర్మహాభాగైః పుత్రైర్దశరథః ప్రియైః ||

32

బభూవ పరమప్రీతో వేదైరివ పితామహః |
తే యదా జ్ఞానసంపన్నాః సర్వే సముదితా గుణైః ||

33

హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః |
తేషామేవం ప్రభావానాం సర్వేషాం దీప్తతేజసామ్ ||

34

పితా దశరథో హృష్టో బ్రహ్మా లోకాధిపో యథా |
తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః ||

35

పితృశుశ్రూషణరతా ధనుర్వేదే చ నిష్ఠితాః |
అథ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి ||

36

చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః |
తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః ||

37

అభ్యాగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
స రాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ ||

38

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్ |
తచ్ఛ్రుత్వా వచనం త్రాసాద్రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః ||

39

సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితాః |
తే గత్వా రాజభవనం విశ్వామిత్రమృషిం తదా ||

40

ప్రాప్తమావేదయామాసుర్నృపాయైక్ష్వాకవే తదా |
తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమాహితః ||

41

ప్రత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మాణమివ వాసవః |
తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంశితవ్రతమ్ ||

42

ప్రహృష్టవదనో రాజా తతోఽర్ఘ్యం సముపాహరత్ |
స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్టేన కర్మణా ||

43

కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపమ్ |
పురే కోశే జనపదే బాంధవేషు సుహృత్సు చ ||

44

కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృచ్ఛత్సుధార్మికః |
అపి తే సన్నతాః సర్వే సామంతా రిపవో జితాః ||

45

దైవం చ మానుషం చాపి కర్మ తే సాధ్వనుష్ఠితమ్ |
వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుంగవః ||

46

ఋషీంశ్చాన్యాన్యథాన్యాయం మహాభాగానువాచ హ |
తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనమ్ ||

47

వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్హతః |
అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్ ||

48

ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్ |
యథాఽమృతస్య సంప్రాప్తిర్యథా వర్షమనూదకే ||

49

యథా సదృశదారేషు పుత్రజన్మాప్రజస్య వై |
ప్రనష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే ||

50

తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే |
కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః ||

51

పాత్రభూతోఽసి మే బ్రహ్మన్దిష్ట్యా ప్రాప్తోఽసి ధార్మిక |
అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్ ||

52

[* యస్మాద్విప్రేంద్రమద్రాక్షం సుప్రభాతా నిశా మమ | *]
పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః |
బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోఽసి బహుధా మయా ||

53

తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ |
శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ప్రభో ||

54

బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి |
ఇచ్ఛామ్యనుగృహీతోఽహం త్వదర్థపరివృద్ధయే ||

55

కార్యస్య న విమర్శం చ గంతుమర్హసి కౌశిక |
కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్మమ ||

56

మమ చాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ |
తవాగమనజః కృత్స్నో ధర్మశ్చానుత్తమో మమ ||

57

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |
ప్రథితగుణయశా గుణైర్విశిష్టః
పరమ ఋషిః పరమం జగామ హర్షమ్ ||

58

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టాదశః సర్గః ||

Balakanda Sarga 18 Meaning In Telugu

దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. పత్నీ సమేతంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్య శృంగుడు తన భార్య శాంతతోనూ, రోమపాదుని తోనూ అంగదేశము నకు వెళ్లిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు.

యజ్ఞము పూర్తి అయి ఒక సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో, చైత్రమాసములో, పునర్వసు నక్షత్రము నాడు, నవమి తిథి యందు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో ఉండగా, కర్కాటక లగ్నమందు, కౌసల్యాదేవి గర్భవాసమున, సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింప తగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ ఐన వాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన రాముడు జన్మించాడు.

విష్ణువులో నాల్గవభాగము అయిన వాడు, సత్యవంతుడు, పరాక్రమ వంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భ వాసమున జన్మించాడు.

సర్వ అస్త్ర కుశలురు, వీరులు, విష్ణువులో నాలుగవ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భ వాసాన జన్మించారు.

ఆ ప్రకారంగా దశరథునకు ముగ్గురు భార్యల యందు నలుగురు కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేసారు. దేవ దుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేసాడు. పారితోషికాలు ఇచ్చాడు.

పదకొండవ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ట పుత్రునకు రాముడు అనీ, తరువాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడు అనీ, తరువాత పుట్టిన సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనీ కుల గురువు, పురోహితుడు అయిన వసిష్టుడు నామకరణం చేసాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్యా పౌరులకు, జానపదులకు, సంతర్పణలు చేసాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు.

తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము తరువాత జరిగే అన్ని సంస్కారములు యధావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు.

దశరధుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కియుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదము నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చెయ్యడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు.

రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచి పెట్టి క్షణం కూడా ఉండే వాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కానీ, ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడంది ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్లు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార, నిద్రా, విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు.

రామ లక్ష్మణులు ఇలా ఉంటే, భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు. నా కన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు.

ఇంతలో రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. నలుగురికీ వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ, బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా, ఒక రోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకొన్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేసాడు.

“ఓ దశరథ మహారాజా! నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా! నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా! నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా! నీ సామంత రాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా! నీకు శత్రుభయము లేదు కదా! నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞ యాగములు చేయుచున్నావా! ” అని అడిగాడు. తరువాత దశరథుని ఆస్థానములో ఉన్న వసిష్టుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేసాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకొన్నాడు విశ్యామిత్రుడు.

” ఓ విశ్వామిత్ర మహర్షీ! నీరాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరమూ క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు. మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి! సెలవివ్వండి! అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు.” అని వినయంగా అడిగాడు దశరథుడు.

దశరథుడు పలికిన మాటలు వినిన విశ్యామిత్రుడు ఎంతో సంతోషించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Balakanda Sarga 19 In Telugu – బాలకాండ ఏకోనవింశః సర్గః

Balakanda Sarga 19 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము.  బాలకాండ లోని ఏకోనవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి దశరథుడు తాను నిర్వహిస్తున్న వైదిక కర్మను నిరంతరం భంగపరిచే రాక్షసుల నుండి రక్షించడానికి రాముడిని పంపమని అడుగుతాడు. తనకు మరియు దశరథుని ఆస్థానంలో ఉన్న ఇతర ఋషులకు రాముని సామర్థ్యాలు తెలుసునని మరియు రాముడు తన యుక్తవయస్సులో ఉన్నప్పటికీ, అతను రాక్షసులను సులభంగా చంపగలడని ఋషి దశరథ రాజును నొక్కి చెప్పాడు. కానీ ఈ అభ్యర్థనపై దశరథుడు కలత చెందాడు.

విశ్వామిత్రవాక్యమ్

తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్ |
హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథా |
మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః ||

2

యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్ |
కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవః ||

3

అహం నియమమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ |
తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ ||

4

వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ |
[* మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ | *]
తౌ మాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్ ||

5

అవధూతే తథాభూతే తస్మిన్నియమనిశ్చయే |
కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే ||

6

న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ |
తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే ||

7

స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమమ్ |
కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి ||

8

శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా |
రాక్షసా యే వికర్తారస్తేషామపి వినాశనే ||

9

శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః |
త్రయాణామపి లోకానాం యేన ఖ్యాతిం గమిష్యతి ||

10

న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన |
న చ తౌ రాఘవాదన్యో హంతుముత్సహతే పుమాన్ ||

11

వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ కాలపాశవశం గతౌ |
రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః ||

12

న చ పుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ |
అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ ||

13

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
వసిష్ఠోఽపి మహాతేజా యే చేమే తపసి స్థితాః ||

14

యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి |
స్థిరమిచ్ఛసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి ||

15

యద్యభ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః |
వసిష్ఠప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ ||

16

అభిప్రేతమసంసక్తమాత్మజం దాతుమర్హసి |
దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్ ||

17

నాత్యేతి కాలో యజ్ఞస్య యథాఽయం మమ రాఘవ |
తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః ||

18

ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః |
విరరామ మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

19

స తన్నిశమ్య రాజేంద్రో విశ్వామిత్రవచః శుభమ్ |
శోకమభ్యాగమత్తీవ్రం వ్యషీదత భయాన్వితః ||

20

ఇతి హృదయమనోవిదారణం
మునివచనం తదతీవ శుశ్రువాన్ |
నరపతిరగమద్భయం మహ-
-ద్వ్యథితమనాః ప్రచచాల చాసనాత్ ||

21

దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.

” ఓ దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశంలో పుట్టి, వసిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధికొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కానీ వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు, మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ
రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వెనకాడకుము. నీ రాముని కి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను.

ఓ దశరథ మహారాజా! రాముని గురించి నీకన్నా నాకు వసిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు, నీ కుమారుడు రాముడు సామాన్యుడు గా కనపడుతున్నాడు. కాని రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా! నీవు ధర్మాత్ముడవైతే, నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వసిష్ఠుని, మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. కాని తొందరగా పంపు. ఎందుకంటే నా యాగము పదిదినములు జరుగుతుంది. ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించి పోకుండా ఒక నిర్ణయము తీసుకో. నీకు క్షేమం కలుగుతుంది.” అని పలికాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటు లాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పందొమ్మిదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ వింశః సర్గః (20) >>

Ayodhya Kanda Sarga 15 In Telugu – అయోధ్యాకాండ పంచదశః సర్గః

Ayodhya Kanda Sarga 15

“రామాయణం” లో అయోధ్యాకాండ పంచదశః సర్గం (15వ సర్గ)లో, రాముడు, సీత మరియు లక్ష్మణులు గంగానది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ, గౌహ్నుడు వారిని కలుస్తాడు. గౌహ్నుడు రాముని ప్రాముఖ్యతను తెలుసుకొని, తన సేవలను అర్పిస్తాడు. గౌహ్నుడు తన పడవలో రాముడు, సీత మరియు లక్ష్మణులను నదిని దాటిస్తాడు. నది దాటిన తర్వాత, రాముడు తన భవిష్యత్ ప్రణాళికలను చర్చిస్తాడు, దండకారణ్యంలో వాసం చేయాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గలో రాముడి ధైర్యం, విధేయత, మరియు ధర్మపరమైన కట్టుబాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. త్రయం గంగానది దాటి తమ వనవాసాన్ని కొనసాగిస్తారు.

సుమంత్రప్రేషణమ్

తే తు తాం రజనీముష్య బ్రాహ్మణా వేదపారగాః |
ఉపతస్థురుపస్థానం సహ రాజపురోహితాః || ౧ ||

అమాత్యా బలముఖ్యాశ్చ ముఖ్యా యే నిగమస్య చ |
రాఘవస్యాభిషేకార్థే ప్రీయమాణాస్తు సంగతాః || ౨ ||

ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యాగతేఽహని |
లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య చ స్థితే || ౩ ||

అభిషేకాయ రామస్య ద్విజేంద్రైరుపకల్పితమ్ |
కాంచనా జలకుంభాశ్చ భద్రపీఠం స్వలంకృతమ్ || ౪ ||

రథశ్చ సమ్యగాస్తీర్ణో భాస్వతా వ్యాఘ్రచర్మణా |
గంగాయమునయోః పుణ్యాత్సంగమాదాహృతం జలమ్ || ౫ ||

యాశ్చాన్యాః సరితః పుణ్యా హ్రదాః కూపాః సరాంసి చ |
ప్రాగ్వాహాశ్చోర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహాః సమాహితాః || ౬ ||

తాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వశః |
సలాజాః క్షీరిభిశ్ఛన్నాః ఘటాః కాంచనరాజతాః || ౭ ||

పద్మోత్పలయుతా భాంతి పూర్ణాః పరమవారిణా |
క్షౌద్రం దధి ఘృతం లాజాః దర్భాః సుమనసః పయః || ౮ ||

వేశ్యాశ్చైవ శుభాచారాః సర్వాభరణభూషితాః |
చంద్రాంశువికచప్రఖ్యం కాంచనం రత్నభుషితమ్ || ౯ ||

సజ్జం తిష్ఠతి రామస్య వాలవ్యజనముత్తమమ్ |
చంద్రమండలసంకాశమాతపత్రం చ పాండరమ్ || ౧౦ ||

సజ్జం ద్యుతికరం శ్రీమదభిషేకపురస్కృతమ్ |
పాండరశ్చ వృషః సజ్జః పాండరోఽశ్వశ్చ సుస్థితః || ౧౧ || [సంస్థితః]

ప్రసృతశ్చ గజః శ్రీమానౌపవాహ్యః ప్రతీక్షతే |
అష్టౌ చ కన్యా రుచిరాః సర్వాభరణభూషితాః || ౧౨ || [మాంగళ్యాః]

వాదిత్రాణి చ సర్వాణి వందినశ్చ తథాఽపరే |
ఇక్ష్వాకూణాం యథా రాజ్యే సంభ్రియేతాభిషేచనమ్ || ౧౩ ||

తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనమ్ |
తే రాజవచనాత్తత్ర సమవేతా మహీపతిమ్ || ౧౪ ||

అపశ్యంతోఽబ్రువన్కో ను రాజ్ఞో నః ప్రతివేదయేత్ |
న పశ్యామశ్చ రాజానముదితశ్చ దివాకరః || ౧౫ ||

యౌవరాజ్యాభిషేకశ్చ సజ్జో రామస్య ధీమతః |
ఇతి తేషు బ్రువాణేషు సార్వభౌమాన్మహీపతీన్ || ౧౬ ||

అబ్రవీత్తానిదం వాక్యం సుమంత్రో రాజసత్కృతః | [సర్వాన్]
రామం రాజ్ఞో నియోగేన త్వరయా ప్రస్థితోఽస్మ్యహమ్ || ౧౭ ||

పూజ్యా రాజ్ఞో భవంతస్తు రామస్య చ విశేషతః |
అహం పృచ్ఛామి వచనాత్సుఖమాయుష్మతామహమ్ || ౧౮ ||

రాజ్ఞః సంప్రతిబుధ్యస్య యచ్చాగమనకారణమ్ |
ఇత్యుక్త్వాంతఃపురద్వారమాజగామ పురాణవిత్ || ౧౯ ||

సదాఽసక్తం చ తద్వేశ్మ సుమంత్రః ప్రవివేశ హ |
తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య స విశాంపతేః || ౨౦ ||

శయనీయం నరేంద్రస్య తదసాద్య వ్యతిష్ఠత |
సోఽత్యాసాద్య తు తద్వేశ్మ తిరస్కరణిమంతరా || ౨౧ ||

ఆశీర్భిర్గుణయుక్తాభిరభితుష్టావ రాఘవమ్ |
సోమసూర్యౌ చ కాకుత్స్థ శివవైశ్రవణావపి || ౨౨ ||

వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే |
గతా భగవతీ రాత్రిః కృతం కృత్యమిదం తవ || ౨౩ ||

బుధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరమ్ |
బ్రాహ్మణా బలముఖ్యాశ్చ నైగమాశ్చాగతా నృప || ౨౪ ||

దర్శనం ప్రతికాంక్షంతే ప్రతిబుధ్యస్వ రాఘవ |
స్తువంతం తం తదా సూతం సుమంత్రం మంత్రకోవిదమ్ || ౨౫ ||

ప్రతిబుధ్య తతో రాజా ఇదం వచనమబ్రవీత్ |
రామమానయ సూతేతి యదస్యభిహితోఽనయా || ౨౬ ||

కిమిదం కారణం యేన మమాజ్ఞా ప్రతిహన్యతే |
న చైవ సంప్రసుప్తోఽహమానయేహాశు రాఘవమ్ || ౨౭ ||

ఇతి రాజా దశరథః సూతం తత్రాన్వశాత్పునః |
స రాజవచనం శ్రుత్వా శిరసా ప్రణిపత్య తమ్ || ౨౮ || [ప్రతిపూజ్య]

నిర్జగామ నృపావాసాన్మన్యమానః ప్రియం మహత్ |
ప్రపన్నో రాజమార్గం చ పతాకాధ్వజశోభితమ్ || ౨౯ ||

హృష్టః ప్రముదితః సూతో జగామాశు విలోకయన్ |
స సూతస్తత్ర శుశ్రావ రామాధికరణాః కథాః || ౩౦ ||

అభిషేచనసంయుక్తాః సర్వలోకస్య హృష్టవత్ |
తతో దదర్శ రుచిరం కైలాసశిఖరప్రభమ్ || ౩౧ ||

రామవేశ్మ సుమంత్రస్తు శక్రవేశ్మసమప్రభమ్ |
మహాకవాటవిహితం వితర్దిశతశోభితమ్ || ౩౨ ||

కాంచనప్రతిమైకాగ్రం మణివిద్రుమశోభితమ్ | [తోరణమ్]
శారదాభ్రఘనప్రఖ్యం దీప్తం మేరుగుహోపమమ్ || ౩౩ ||

మణిభిర్వరమాల్యానాం సుమహద్భిరలంకృతమ్ |
ముక్తామణిభిరాకీర్ణం చందనాగరుధూపితమ్ || ౩౪ ||

గంధాన్మనోజ్ఞాన్విసృజద్దార్దురం శిఖరం యథా |
సారసైశ్చ మయూరైశ్చ నినదద్భిర్విరాజితమ్ || ౩౫ ||

సుకృతేహామృగాకీర్ణం సుకీర్ణం భిత్తిభిస్తథా |
మనశ్చక్షుశ్చ భూతానామాదదత్తిగ్మతేజసా || ౩౬ ||

చంద్రభాస్కరసంకాశం కుబేరభవనోపమమ్ |
మహేంద్రధామప్రతిమం నానాపక్షిసమాకులమ్ || ౩౭ ||

మేరుశృంగసమం సూతో రామవేశ్మ దదర్శ హ |
ఉపస్థితైః సమాకీర్ణం జనైరంజలికారిభిః || ౩౮ ||

ఉపాదాయ సమాక్రాంతైస్తథా జానపదైర్జనైః |
రామాభిషేకసుముఖైరున్ముఖైః సమలంకృతమ్ || ౩౯ ||

మహామేఘసమప్రఖ్యముదగ్రం సువిభూషితమ్ |
నానారత్నసమాకీర్ణం కుబ్జకైరాతకావృతమ్ || ౪౦ ||

స వాజియుక్తేన రథేన సారథి-
-ర్నరాకులం రాజకులం విలోకయన్ |
వరూథినా రామగృహాభిపాతినా
పురస్య సర్వస్య మనాంసి హర్షయన్ || ౪౧ || [రంజయత్]

తతః సమాసాద్య మహాధనం మహ-
-త్ప్రహృష్టరోమా స బభూవ సారథిః |
మృగైర్మయూరైశ్చ సమాకులోల్బణం
గృహం వరార్హస్య శచీపతేరివ || ౪౨ ||

స తత్ర కైలాసనిభాః స్వలంకృతాః
ప్రవిశ్య కక్ష్యాస్త్రిదశాలయోపమాః |
ప్రియాన్నరాన్రామమతే స్థితాన్బహూ-
-నపోహ్య శుద్ధాంతముపస్థితో రథీ || ౪౩ ||

స తత్ర శుశ్రావ చ హర్షయుక్తాః
రామాభిషేకార్థయుతా జనానామ్ |
నరేంద్రసూనోరభిమంగళార్థాః
సర్వస్య లోకస్య గిరః ప్రహృష్టః || ౪౪ ||

మహేంద్రసద్మప్రతిమం తు వేశ్మ
రామస్య రమ్యం మృగపక్షిజుష్టమ్ |
దదర్శ మేరోరివ శృంగముచ్చం
విభ్రాజమానం ప్రభయా సుమంత్రః || ౪౫ ||

ఉపస్థితైరంజలికారకైశ్చ
సోపాయనైర్జానపదైశ్చ మర్త్యః |
కోట్యా పరార్ధైశ్చ విముక్తయానైః
సమాకులం ద్వారపథం దదర్శ || ౪౬ ||

తతో మహామేఘమహీధరాభం
ప్రభిన్నమత్యంకుశమప్రసహ్యమ్ |
రామౌపవాహ్యం రుచిరం దదర్శ
శత్రుంజయం నాగముదగ్రకాయమ్ || ౪౭ ||

స్వలంకృతాన్సాశ్వరథాన్సకుంజరా-
-నమాత్యముఖ్యాన్ శతశశ్చ వల్లభాన్ |
వ్యపోహ్య సూతః సహితాన్సమంతతః
సమృద్ధమంతఃపురమావివేశ || ౪౮ ||

తదద్రికూటాచలమేఘసన్నిభం
మహావిమానోత్తమవేశ్మసంఘవత్ |
అవార్యమాణః ప్రవివేశ సారథిః
ప్రభూతరత్నం మకరో యథాఽర్ణవమ్ || ౪౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశః సర్గః || ౧౫ ||

Ayodhya Kanda Sarga 15 Meaning In Telugu

వేదపారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపమునకు చేరుకున్నారు. అయోధ్యా నగర మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మంటపము వద్దకు వచ్చారు. అందరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరు తున్నారు.

రాముని జన్మ లగ్నము కర్కాటకము. అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషిక్తుని చేయవలెనని వేద పండితులు నిశ్చయం చేసారు. పట్టాభిషేక మంటపం చుట్టు పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణ రథం ఏర్పాటు చేసారు. రాముడు కూర్చోడానికి పులి చర్మము పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశములలో, గంగానదీ, యమునా నదీ, సరస్వతీ నదీ కలిసే చోట (త్రివేణీ సంగమము….ప్రస్తుతము అలహాబాద్) నుండి సేకరించిన జలము, ఇతర పుణ్యనదుల నుండీ, సరస్సులనుండీ, నదీనదముల నుండి, నాలుగు సముద్రముల నుండీ తెచ్చిన జలములను నింపి పట్టాభిషేకమునకు కావలసిన లాజలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పూలు, దర్భలు అన్నీ మండపము దగ్గర బంగారు పాత్రలలో అమర్చి ఉన్నాయి. సర్వాభరణ భూషితలైన వేశ్యలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనులలో పాలుపంచుకుంటున్నారు. రాముడు పట్టాభిషిక్తుడు కాగానే, సింహాసనము మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామరలు వేయుటకు రత్నఖచితమైన వింజామరలు సిద్ధంగా ఉంచారు. అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనురగలాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు.

యువరాజు రాముని సేవించుటకు తెల్లని ఎద్దు, తెల్లటి గుర్రము, మదము కారే ఏనుగు రాజద్వారము బయట కట్టివేయబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి ఎనిమందిమంది కన్యముత్తయిదువలు సకలమైన అలంకారములు చేసుకొని పట్టాభిషేక మంటపము దగ్గర నిలబడి ఉన్నారు. పట్టాభిషేక సమయములో మ్రోగించుటకు రకరకాల వాద్యములు, వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు. రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముని, రాముని వంశములో మూల పురుషులను కీర్తించుటకు వందులు, మాగధులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు.

పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలు అన్నీ, అన్నివిధాలా అమర్చి ఉన్నాయి కానీ పట్టాభిషేకము నిర్వహించే దశరథ మహారాజు, పట్టాభిషేకము జరిపించుకొనే రాముడు అక్కడలేరు. వారి రాక కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు.

“సుముహూర్తము సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమయి ఉంటుంది. అసలు పట్టాభిషేకము జరుగుతుందా! లేదా!” అని వారిలో వారే అనుకుంటున్నారు.

ఇంకా కొంతమంది “మనమంతా పట్టాభిషేకము కొరకు అన్ని సంభారములు సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాము. దశరథమహారాజు ఇంకా రాలేదు. మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథమహారాజుకు ఎవరిద్వారా తెలియపరచాలి.” అని తమలో తాము అనుకుంటున్నారు. ఇంతలో సుమంత్రుడు అక్కడకు చేరుకున్నాడు. అక్కడ వేచి ఉన్న సామంతులను, పురప్రముఖులు సుమంత్రుని చూచి ఇలా అన్నారు.
“సుమంత్రా! ఏమి ఆలస్యము. రామ పట్టాభిషేకమునకు సుముహూ ర్తము మించిపోడుతున్నది. ఇంకా మహారాజు గారు రాలేదు. కారణం తెలియడం లేదు. నీ కేమైనా తెలుసునా!” అని అడిగారు. దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు.

“దశరథమహారాజుగారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను. మీరు అన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది. మీరందరూ సర్వ సంభారములతో ఎదురుచూస్తున్నారు. దశరథీ “మహారాజుగారు ఇంకా ఇక్కడకు రాలేదు. రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం, రాజుగారు ఇంకా ఇక్కడకు రాకపోవ డానికి కారణము నాకూ తెలియదు. ఇప్పుడే నేను మహారాజు గారి వద్దకు వెళ్లి మీ మాటగా నేను మహారాజుగారిని అడుగు తాను. మీరందరూ దయతో ఓపికతో వేచిఉండండి.” అని పలికాడు.

వెంటనే సుమంత్రుడు రాజాంత: పురమునకు వెళ్లాడు. దశరథుని శయన మందిరములోకి ప్రవేశించాడు. బయట నిలబడి దశరథుని, ఆయన వంశమును స్తుతించాడు. ‘ఓ దశరథమహారాజా! తమకు జయమగుగాక! ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురు గాక! రాజేంద్రా! పట్టాభిషేక ముహూర్తము సమీపించుచున్నది. బ్రాహ్మణులు, సామంతులు, పురప్రముఖులు పట్టాభిషేకమంటపము వద్ద తమరి రాక కోసరము వేచి ఉన్నారు. తమరు వెంటనే అక్కడకు రావలసినది..” అని పలికాడు.

అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంత్రుని చూచి “రాముని ఇక్కడకు తీసుకొని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా! నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకొని రాలేదు. నా ఆజ్ఞ ఎందుకు పాటించ లేదు. నేను చెబితే ఒకటి కైక చెబితే ఒకటీనా. నేను నిద్రించుటలేదు. మేలుకొనే ఉన్నాను. నన్ను ఎవరూ మేలుకొలుప నవసరము లేదు. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకొని రా. వెళ్లు.” అని ఆజ్ఞాపించాడు దశరథుడు. ఇంక చేసేది లేక సుమంత్రుడు రాజాజ్ఞ పాలించుటకు రాజాంతఃపురము నుండి బయటకు వచ్చాడు. రాముని రాజభవనము వద్దకు వచ్చాడు.

రాముని మందిరమును కూడా శోభాయమానంగా అలంక రించారు. రాముని భవనము ఎదుట కూడా ప్రజలు గుమి గూడి రాముని చూడటానికి వేచి ఉన్నారు. సుమంత్రుని రథము వారిని దాటుకుంటూ రామ మందిరము వద్దకు సమీపించింది. అయోధ్యా పౌరులు, జానపదులు, రాముని మిత్రులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. రాముని పట్టాభిషేక మంటపమునకు తీసుకొని పోవుటకు ఏర్పాటు చేయబడిన సుందరంగా అలంకరించిన మద గజము (మదించిన ఏనుగు) ద్వారము వద్ద వేచి ఉన్నది. వీరందరినీ దాటుకుంటా సుమంత్రుడు రాముని అంతఃపురములోకి ప్రవేశించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షోడశః సర్గః (16) >>

Balakanda Sarga 16 In Telugu – బాలకాండ షోడశః సర్గః

Balakanda Sarga 16 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఇది రామాయణం బాలకాండలోని 16వ సర్గ. ఈ సర్గలో, విష్వామిత్రుడు రామ-లక్ష్మణులను తనతో తీసుకువెళ్లి తాటకావనానికి చేరుకుంటాడు. తాటకావనం ఒక దివ్యమైన ప్రదేశం, కానీ తాటక అనే రాక్షసి వలన అది శూన్యంగా మారింది. విష్వామిత్రుడు రాముడిని తాటకను సంహరించమని ఆజ్ఞాపిస్తాడు.

పాయసోత్పత్తిః

తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః |
జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

1

ఉపాయః కో వధే తస్య రాక్షసాధిపతేః సురాః |
యమహం తం సమాస్థాయ నిహన్యామృషికంటకమ్ ||

2

ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్ |
మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే ||

3

స హి తేపే తపస్తీవ్రం దీర్ఘకాలమరిందమ |
యేన తుష్టోఽభవద్బ్రహ్మా లోకకృల్లోకపూర్వజః ||

4

సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః |
నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ ||

5

అవజ్ఞాతాః పురా తేన వరదానేన మానవాః |
ఏవం పితామహాత్తస్మాద్వరం ప్రాప్య స దర్పితః ||

6 [గర్వితః]

ఉత్సాదయతి లోకాంస్త్రీంస్త్రయశ్చాప్యపకర్షతి |
తస్మాత్తస్య వధో దృష్టో మానుషేభ్యః పరంతప ||

7

ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ |
పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ ||

8

స చాప్యపుత్రో నృపతిస్తస్మిన్కాలే మహాద్యుతిః |
అయజత్పుత్రియామిష్టిం పుత్రేప్సురరిసూదనః ||

9

స కృత్వా నిశ్చయం విష్ణురామంత్ర్య చ పితామహమ్ |
అంతర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః ||

10

తతో వై యజమానస్య పావకాదతులప్రభమ్ |
ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్ ||

11

కృష్ణం రక్తాంబరధరం రక్తాక్షం దుందుభిస్వనమ్ |
స్నిగ్ధహర్యక్షతనుజశ్మశ్రుప్రవరమూర్ధజమ్ ||

12

శుభలక్షణసంపన్నం దివ్యాభరణభూషితమ్ |
శైలశృంగసముత్సేధం దృప్తశార్దూలవిక్రమమ్ ||

13

దివాకరసమాకారం దీప్తానలశిఖోపమమ్ |
తప్తజాంబూనదమయీం రాజతాంతపరిచ్ఛదామ్ ||

14

దివ్యపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియామ్ |
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ ||

15

సమవేక్ష్యాబ్రవీద్వాక్యమిదం దశరథం నృపమ్ |
ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప ||

16

తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలిః |
భగవన్ స్వాగతం తేఽస్తు కిమహం కరవాణి తే ||

17

అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోఽబ్రవీత్ |
రాజన్నర్చయతా దేవానద్య ప్రాప్తమిదం త్వయా ||

18

ఇదం తు నరశార్దూల పాయసం దేవనిర్మితమ్ |
ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారోగ్యవర్ధనమ్ ||

19

భార్యాణామనురూపాణామశ్నీతేతి ప్రయచ్ఛ వై |
తాసు త్వం లప్స్యసే పుత్రాన్యదర్థం యజసే నృప ||

20

తథేతి నృపతిః ప్రీతః శిరసా ప్రతిగృహ్య తామ్ |
పాత్రీం దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్ ||

21

అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనమ్ |
ముదా పరమయా యుక్తశ్చకారాభిప్రదక్షిణమ్ ||

22

తతో దశరథః ప్రాప్య పాయసం దేవనిర్మితమ్ |
బభూవ పరమప్రీతః ప్రాప్య విత్తమివాధనః ||

23

తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్ |
సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత ||

24

హర్షరశ్మిభిరుద్ద్యోతం తస్యాంతఃపురమాబభౌ |
శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంశుభిః ||

25

సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ |
పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రీయం త్విదమాత్మనః ||

26

కౌసల్యాయై నరపతిః పాయసార్ధం దదౌ తదా |
అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః ||

27

కైకేయ్యై చావశిష్టార్ధం దదౌ పుత్రార్థకారణాత్ |
ప్రదదౌ చావశిష్టార్ధం పాయసస్యామృతోపమమ్ ||

28

అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః |
ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్ ||

29

తాస్త్వేతత్పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమాః స్త్రియః |
సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః ||

30

తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో
మహీపతేరుత్తమపాయసం పృథక్ |
హుతాశనాదిత్య సమానతేజస-
-శ్చిరేణ గర్భాన్ప్రతిపేదిరే తదా ||

31

తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః
ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః |
బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః
సురేంద్రసిద్ధర్షిగణాభిపూజితః ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షోడశః సర్గః ||

Balakanda Sarga 16 Meaning In Telugu

విష్ణు మూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు.

“ ఓ దేవతలారా! నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి. దానికి ఉ పాయము ఏమి?” అని అడిగాడు. దానికి దేవతలు ఇలాఅన్నారు.
” ఓ మహావిష్ణూ! నీవు మనుష్య శరీరమును ధరించి, రావణుని తో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే…… రావణాసురుడు చాలాకాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. ‘మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండు గాక!’ అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి.” అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని, విష్ణుమూర్తి అంతర్థానము అయ్యాడు.

అయోధ్యలో దశరధుడు పుత్రులకొరకు యాగము చేస్తున్నాడు. ఆ హెూమ గుండము నుండి తేజోవంతుడైన, మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించిన వాడు, రక్త వర్ణముకల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించిన వాడు, పర్వతశిఖరము మాదిరి ధృఢమైన వాడు, పెద్దపులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సుకలవాడు, భగభగమండే అగ్ని శిఖల మాదిరి వెలుగు చున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో, ఒక భూతా కారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరధుడు చేతులు జోడించి నమస్కరించాడు.

“ఓమహానుభావా! తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను.” అని ప్రార్థించాడు.

ఆ భూతము దశరధుని చూచి ఇలా పలికింది.

“ఓ దశరధమహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారుచేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్షును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరధుడికి ఇచ్చాడు.

దశరధుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయింది.

దశరధుడు సంతోషముతో ఆ పాయన అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగ భాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం (అనగా నాల్గవ భాగము) సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం (అనగా ఎనిమిదవ భాగము) కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం (అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగము) ఏంచెయ్యాలా అని ఆలోచించి, దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు.

ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. కాని దశరధుని భార్యలు తమకు పాయన పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏ మాత్రం చింతింపక, పాయసము దొరికి తమకు పుత్రసంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు.

కాల క్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదహారవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ సప్తదశః సర్గః (17) >>

Balakanda Sarga 17 In Telugu – బాలకాండ సప్తదశః సర్గః

Balakanda Sarga 17 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తదశః సర్గలో, రావణుని సంహరించడంలో రాముడికి సహాయం చేయమని బ్రహ్మ ఆదేశం మేరకు దేవతలు పూర్వీకులు వానర వీరులుగా మారారు. కోతి లాంటి వానర జాతి అనేక మంది ఖగోళ జీవులచే సంతానోత్పత్తి చేయబడింది, దీనికి విచిత్రమైన శక్తివంతమైన శరీరాకృతి మరియు రాముడికి సహాయం చేయడానికి ప్రత్యేక శక్తి ఉంది.

ఋక్షవానరోత్పత్తిః

పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః |
ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూర్భగవానిదమ్ ||

1

సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః |
విష్ణోః సహాయాన్బలినః సృజధ్వం కామరూపిణః ||

2

మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాఞ్జవే |
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్ ||

3

అసంహార్యానుపాయజ్ఞాన్ సింహసంహననాన్వితాన్ |
సర్వాస్త్రగుణసంపన్నానమృతప్రాశనానివ ||

4

అప్సరఃసు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ |
కింనరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ ||

5

యక్షపన్నగకన్యాసు ఋక్షివిద్యాధరీషు చ |
సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్ ||

6

పూర్వమేవ మయా సృష్టో జాంబవానృక్షపుంగవః |
జృంభమాణస్య సహసా మమ వక్రాదజాయత ||

7

తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనమ్ |
జనయామాసురేవం తే పుత్రాన్వానరరూపిణః ||

8

ఋషయశ్చ మహాత్మానః సిద్ధవిద్యాధరోరగాః |
చారణాశ్చ సుతాన్వీరాన్ససృజుర్వనచారిణః ||

9

వానరేంద్రం మహేంద్రాభమింద్రో వాలినమూర్జితమ్ |
సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః ||

10

బృహస్పతిస్త్వజనయత్తారం నామ మహాహరిమ్ |
సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతమనుత్తమమ్ ||

11

ధనదస్య సుతః శ్రీమాన్వానరో గంధమాదనః |
విశ్వకర్మా త్వజనయన్నలం నామ మహాహరిమ్ ||

12

పావకస్య సుతః శ్రీమాన్నీలోఽగ్నిసదృశప్రభః |
తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్ ||

13

రూపద్రవిణసంపన్నావశ్వినౌ రూపసంమతౌ |
మైందం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్ ||

14

వరుణో జనయామాస సుషేణం నామ వానరమ్ |
శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్ ||

15

మారుతస్యాత్మజః శ్రీమాన్హనుమాన్నామ వానరః |
వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే ||

16

సర్వవానరముఖ్యేషు బుద్ధిమాన్బలవానపి |
తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః ||

17

అప్రమేయబలా వీరా విక్రాంతాః కామరూపిణః |
తే గజాచలసంకాశా వపుష్మంతో మహాబలాః ||

18

ఋక్షవానరగోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే |
యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః ||

19

అజాయత సమస్తేన తస్య తస్య సుతః పృథక్ |
గోలాంగూలీషు చోత్పన్నాః కేచిత్సంమతవిక్రమాః ||

20

ఋక్షీషు చ తథా జాతా వానరాః కింనరీషు చ |
దేవా మహర్షిగంధర్వాస్తార్క్ష్యా యక్షా యశస్వినః ||

21

నాగాః కింపురుషాశ్చైవ సిద్ధవిద్యాధరోరగాః |
బహవో జనయామాసుర్హృష్టాస్తత్ర సహస్రశః ||

22

[* అధికపాఠః –
చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజుః వన చారిణః |
అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యధరీషు చ |
నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ |
కామరూప బలోపేతా యథా కామవిచారిణః |
*]

వానరాన్సుమహాకాయాన్సర్వాన్వై వనచారిణః |
సింహశార్దూలసదృశా దర్పేణ చ బలేన చ ||

23

శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః |
నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః ||

24

విచాలయేయుః శైలేంద్రాన్భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ |
క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్ ||

25

దారయేయుః క్షితిం పద్భ్యామాప్లవేయుర్మహార్ణవమ్ |
నభస్థలం విశేయుశ్చ గృహ్ణీయురపి తోయదాన్ ||

26

గృహ్ణీయురపి మాతంగాన్మత్తాన్ప్రవ్రజతో వనే |
నర్దమానాశ్చ నాదేన పాతయేయుర్విహంగమాన్ ||

27

ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణామ్ |
శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనామ్ ||

28

తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూథపాః |
బభూవుర్యూథపశ్రేష్ఠా వీరాంశ్చాజనయన్హరీన్ ||

29

అన్యే ఋక్షవతః ప్రస్థానుపతస్థుః సహస్రశః |
అన్యే నానావిధాన్ శైలాన్భేజిరే కాననాని చ ||

30

సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినమ్ |
భ్రాతరావుపతస్థుస్తే సర్వే ఏవ హరీశ్వరాః ||

31

నలం నీలం హనూమంతమన్యాంశ్చ హరియూథపాన్ |
తే తార్క్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధవిశారదాః ||

32

విచరంతోఽర్దయన్దర్పాత్ సింహవ్యాఘ్రమహోరగాన్ |
తాంశ్చ సర్వాన్మహాబాహుర్వాలీ విపులవిక్రమః ||

33

జుగోప భుజవీర్యేణ ఋక్షగోపుచ్ఛవానరాన్ |
తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్ణవా |
కీర్ణా వివిధసంస్థానైర్నానావ్యంజనలక్షణైః ||

34

తైర్మేఘబృందాచలకూటకల్పై-
-ర్మహాబలైర్వానరయూథపాలైః |
బభూవ భూర్భీమశరీరరూపైః
సమావృతా రామసహాయహేతోః ||

35

ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు.

శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులు గానూ, వాయువేగముతో ప్రయాణించగలవారు గానూ అయి ఉండాలి. విష్ణువుతో సరి తూగ గల పరాక్రమ వంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతి మంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గానీ, ఏ ఆయుధము చేత గానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే ఋక్ష శ్రేష్టుడు (ఎలుగుబంటి) నేను ఆవలించి నపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు.” అని పలికాడు.

బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు.

దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు.

సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు.

బ్రహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు.

కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు.

అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిదుడు, వరుణుని అంశతో సుషేణుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వారనులు సృజింపబడ్డారు.

వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్లు, దంతములు. వారందర ఋక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు.

ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహు బలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీ రామునికి సహాయము చేయుటకు సృష్టింప బడ్డారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ అష్టాదశః సర్గః (18) >>