అయోధ్యాకాండ పంచాశీతితమః సర్గములో, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు పంథానుగా దండకారణ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు అక్కడ నివసించే అరణ్యవాసులు వారి రాకకు సంతోషించి స్వాగతిస్తారు. అరణ్యవాసులపైన శ్రీరాముడు తన ధర్మం ప్రకారం రక్షణ కల్పిస్తానని హామీ ఇస్తాడు. వీరు అక్కడ స్వచ్ఛందంగా నివసిస్తూ దండకారణ్య సుందర దృశ్యాలను ఆస్వాదిస్తారు. వారి సాంఘిక విధులు నిర్వర్తిస్తారు. ఈ సర్గలో వారి అరణ్యవాసం, అక్కడి ప్రకృతి సౌందర్యం, మరియు శ్రీరాముడు తన ధర్మాన్ని ఎలా పాటిస్తాడో విపులంగా వర్ణించబడింది.
గుహుని మాటలను విన్న భరతుడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు మా అన్నగారు రామునికి మిత్రుడు అని తెలిసినది. మేము అశేష సేనావాహినితో వచ్చాము. మా అందరికీ ఆతిథ్యము ఇవ్వవలెనని నీ కోరిక బహు ప్రశంసనీయము. ఈ ప్రాంతమంతయు చాలా దుర్గమంగా ఉంది. మేము భరద్వాజుని ఆశ్రమమునకు పోవలెను. దానికి మంచి మార్గము చూపగలవా!” అని అడిగాడు.
ఆమాటలు విన్న గుహుడు “మహారాజా! మీము నీకు దాసులము. నేను, మా వాళ్లు ధనుస్సులతో నీకు ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తారు. కాని ఒక్క సందేహము. తమరు రాముని వద్దకు వెళ్లుచున్నట్టు కనపడుతూ ఉంది. మీరు రామునికి అపకారము చేయడానికి వెళుతున్నారా అని సందేహముగా ఉన్నది. నా సందేహ మును తమరు తీరుస్తారు అని ఆశిస్తున్నాను.” అని వినయంగా అసలు విషయం బయట పెట్టాడు గుహుడు.
“నీవు రామునికి మిత్రుడవు కాబట్టి నాకూ మిత్రుడవే. ఓ మిత్రమా! రాముడు నాకు అన్న. నా తండ్రితో సమానుడు. ఆయనకు అపకారము తలపెట్టే దుర్బుద్ధి నాకు కలలో కూడా కలగకుండు గాక! నేను నిజం చెబుతున్నాను. నేను రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుని చేయవలెనని అనుకుంటున్నాను. అంతే కానీ రామునికి అపకారము చేయుటకు కాదు” అని అన్నాడు గుహుడు.
ఆ మాటలకు గుహుడు పరమానంద భరితుడయ్యాడు. “ఓ మహారాజా! నీకు శ్రమ లేకుండా రాజ్యము లభించింది. కాని దానిని నీవు రాముని కొరకు త్యాగం చేస్తున్నావు. నీ వంటి త్యాగధనుడు లోకంలో పుట్టబోడు. అడవులలో కష్టములు పడుతున్న రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని వెళ్లవలెనని కోరుకుంటున్న నీ కీర్తి ముల్లోకము లలో వ్యాపిస్తుంది. నీకు జయమగు గాక!” అని గుహుడు భరతుని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇంతలో చీకటి పడింది. భరతుడు, శత్రుఘ్నుడు తమ తమ శయ్యలమీద పడుకున్నారు. భరతునికి నిద్రపట్టలేదు. రాముడు ఎక్కడ ఉన్నాడో ఎన్ని కష్టములు పడుతున్నాడో అని శోకిస్తున్నాడు.
భరతుని శోకము ఒక పర్వతము మాదిరి వ్యాపించింది. భరతుని ఆలోచనలు ఆ పర్వతశిలల మాదిరి ఉన్నాయి. భరతుని నిట్టూర్హులే ఆ పర్వతములో నిక్షిప్తమైన ధాతువులు మాదిరి ఉన్నాయి. భరతుని దైన్యమే ఆ పర్వతము మీది వృక్షములు మాదిరి కనపడుతున్నాయి. భరతుని శోకములో ముంచిన మోహము, ఆ పర్వతము మీది జంతువులు, భరతునికి కలిగిన మనస్తాపము ఆ పర్వత శిఖరములు. భరతునికి కలిగిన సంతాపము ఆ పర్వతము మీది ఓషధులు. ఆ ప్రకారంగా భరతుడు కొండంత దు:ఖమును మనసులో దాచుకొని బాధపడుతున్నాడు. ఆ రాత్రంతా మనశ్శాంతి లేకుండా నిద్రలేని రాత్రి గడిపాడు భరతుడు. ఇదంతా చూస్తున్నాడు గుహుడు. భరతుని తన మృదుమధురమైన మాటలతో ఓదార్చాడు గుహుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకపంచాశః సర్గం రామాయణంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సర్గలో రాముడు శబరిని కలుస్తాడు, ఆమె భక్తి పట్ల ఆకర్షితుడవుతాడు. శబరి రాముడి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. రాముడు ఆమెకు ఆశీర్వాదాలు ఇవ్వడం, హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరిన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది.
జటాయువు పలికిన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు. రావణుని దృష్టిలో జటాయువు ఒక సామాన్య పక్షి. అందువల్ల జటాయువు మాటలను లెక్కచేయలేదు. జటాయువు మాటలకు బదులు కూడా పలకలేదు. కానీ ఒక పక్షి తనను అంతలేసి మాటలు అంటుదా. తనకే నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది. ఒక్క ఉదుటున జటాయువు మీదికి ఎగిరాడు.
రావణునికి జటాయువుకు ఘోరయుద్ధం జరిగింది. రెండు పర్వతములు ఢీకొన్నట్టు ఉంది. రావణుడు జటాయువు మీద నారాచముల వర్షం కురిపించాడు. జటాయువు ఆ బాణములను తనరెక్కలతో చెల్లాచెదరు చేసింది. వాడి అయిన తన గోళ్లతో ముక్కుతో రావణుని మొహం, శరీరం అంతా రక్కింది. రావణుడు పదిబాణములను జటాయువు మీద ప్రయోగించాడు.
జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్న సీత కనపడింది. ఆమె బాధ చూచి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణములను లెక్కచేయలేదు. రాముని ధనుస్సును అతని చేతిలోనుండి ఎగురగొట్టాడు. బాణములను విరిచాడు. రావణుడికి కోపం ముంచుకొచ్చింది. మరొక ధనుస్సు తీసుకున్నాడు. వేలకొలది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు. రావణుడు వదిలిన బాణములు జటాయువును కప్పివేసాయి.
జటాయువు ఆకాశంలో ఎగురుతూ ఆబాణములను తనరెక్కలతో చెదరగొట్టింది. మరలా రావణుని ధనుస్సును తన కాళ్లతో విరిచింది. రావణుని కవచమును తన ముక్కుతో చీల్చింది. తన రెక్కలతో ఆ కవచమును ఊడగొట్టింది. తరువాత జటాయువు రావణుని రథమునకు కట్టిన గాడిదలను చంపింది. రావణుని రథమును విరుగగొట్టింది. రావణుని రథానికి కట్టిన పతాకమును విరిచింది. రావణుని తలమీద తన కాళ్లతో తన్నుతూ ఉంది. ముక్కుతో పొడుస్తూ ఉంది.
రావణుడు సీతను పొదివి పట్టుకొని నేలమీదికి దూకాడు. అప్పటికి జటాయువు అలసినట్టు కనపడ్డాడు. రావణుడు సీతను పట్టుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. లంక వైపుగా పోసాగాడు. జటాయువు కూడా రావణుని తో పాటు పైకి ఎగిరాడు. రావణునికి అడ్డంగా నిలిచాడు. రావణుని తో ఇలా అన్నాడు.
“రావణా! ఇంకా నీకు బుద్ధిరాలేదా! నీవు సీతను అపహ రించడం నీ వినాశనానికి దారి తీస్తుంది. నువ్వే కాదు రాక్షస వంశము మొత్తం నాశనం అవుతుంది. సీతను అపహరించడం అంటే విషం కలిపిన నీరు తాగడం వంటిది అని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తూ నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కంఠం చుట్టు యమపాశము బిగుసుకుంటూ ఉంది. నీవు దానిని తప్పించుకోలేవు. రామలక్ష్మణులు నిన్ను ఎన్నటికీ క్షమించరు. అయినా రావణా! చేతనైతే రామలక్ష్మణులతో వీరోచితంగా పోరాడు. వారిని ఓడించి సీతను తీసుకుపో. అంతే గానీ వారు ఆశ్రమంలో లేని సమయంలో, దొంగమాదిరి సీతను అపహరించడం వీరత్వం అనిపించుకోదు. నీవంటి వీరుడు చేయదగ్గ పనికాదు. చావు దగ్గర పడ్డవాడే ఇటువంటి పనిచేస్తాడు. చెడ్డ ఫలితములను ఇచ్చు కర్మలను నీవు వరాలిచ్చిన బ్రహ్మ కూడా చేయడే. నీవు ఎందుకు చేస్తున్నావు?” అని రావణునికి హితోక్తులు చెప్పాడు.
కాని రావణునిలో ఏమాత్రం మార్పు రాలేదు. అందుకని జటాయువు మరలా రావణుని వీపు మీద వాలి రావణుని గోళ్లతో చీల్చాడు. అతడి జుట్టు పీకాడు. ముక్కుతో రక్కాడు. రావణుడు తప్పించుకోలేకపోతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. ఒక చేత్తో సీతను చంకలో ఇరికించుకున్నాడు. రెండో చేత్తో జటాయువు వీపు మీద బాదాడు. జటాయువు పైకి ఎగిరి రావణుని పది బుజములను చీల్చింది. రావణుని బుజాలు విరిగి కిందపడ్డాయి. విచిత్రంగా రావణునికి కొత్తగా బుజాలు మొలిచాయి.
అప్పుడు రావణుడు సీతను కింద దింపాడు. జటాయువును రెండు చేతులతో కొట్టాడు. జటాయువుకు, రావణునికి కొంచెంసేపు ముష్టియుద్ధం జరిగింది. రావణుడు కిందపడి ఉన్న ఖడ్గమును తీసుకొన్నాడు. తన మీదికి వస్తున్న జటాయువు రెక్కలను నరికాడు. పక్షికి రెక్కలే ఆయుధములు. ఆ రెక్కలు విరగగానే జటాయువు నేలకూలాడు.
నేల మీద పడిన జటాయువును చూచి సీత బిగ్గరగా రోదించింది. ఆఖరి ఆశకూడా అలా నేలకూలినందుకు సీతకు దుఃఖము ఆగలేదు. గబా గబా జటాయువు వద్దకు పరుగెత్తింది. జటాయువు మీద పడి ఏడిచింది సీత,
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో 50వ సర్గలో, రాముడు పంపా సరస్సు వద్ద చేరుకుని దాని అందాన్ని ఆస్వాదిస్తాడు. సరస్సు చుట్టూ ప్రకృతి అందాన్ని చూసి సీతను మిస్ అవుతూ, ఆమె లేని బాధను అనుభవిస్తాడు. సీత కోసం తపిస్తున్న రాముడు, సరస్సు నావులా భావించి తన బాధను లక్ష్మణునికి పంచుకుంటాడు.
రావణుడు సీతను అపహరించుకొని వెళ్లే సమయంలో జటాయువు ఒక వట వృక్షము మీద నిద్రపోతున్నాడు. సీత అరుపులు, రావణుని హుంకారములు విని జటాయువు నిద్రలేచాడు. జటాయువుకు ఏం జరుగుతుందో అర్థం అయింది. వెంటనే ఎగురుతూ పోయి రావణుని రథం మీద వాలాడు. రాముడు తన రథం ఆపాడు. అప్పుడు జటాయువు రావణునితో ఇలా అన్నాడు.
“రావణా! నేను నిత్యసత్యవ్రతుడను. నా పేరుజటాయువు. నేను గరుడ వంశజుడను. మహా బలిశాలిని. రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడు. ముల్లోకములచేత పూజింపబడేవాడు. ఈమె రాముని భార్య పేరు సీత.
నీవు ధర్మమార్గంలో పయనించే మహారాజువు. అటువంట “నీవు ఇతరుల భార్యలను అపహరించ వచ్చునా! ముఖ్యముగా సాటి రాజుల భార్యలను గౌరవించాలి. ఆపదలలో ఉంటే రక్షించాలి కానీ, నీ లాగా అపహరించకూడదు. అదే లోక ధర్మము. కాబట్టి ఇతరుల భార్యల మీద ఉన్న నీ కోరికను మానుకో. ఇది నీ వంటి ధర్మాత్ములు చేయదగ్గపనికాదు. నీ భార్యను ఇతరులు అపహరిస్తుంటే నువ్వు ఎలా రక్షించుకుంటావో, అలాగే ఇతరుల భార్యలను ఎవరైనా అపహరిస్తుంటే నువ్వు రక్షించాలి. కానీ, నువ్వే ఇతరుల భార్యలను అపహరించడం తప్పు కదా! అలాంటి తప్పు చేయకు. ఇతరులు నిన్ను నిందించే పని చేయడం తప్పు కదా!
రావణా! సామాన్యులు ధర్మము, అర్థము, కామము వీటి ఆచరణలో సందేహము కలిగినపుడు, రాజు ఏం చేస్తాడో దానినే అనుసరిస్తారు. కాబట్టి రాజు తన ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అటువంటి రాజువైన నీవే ఇటువంటి నిందార్హమైన పని చేస్తే, నీ ప్రజలు ఎవరిని అనుసరించాలి. ఆలోచించు.
ఓ రాక్షస రాజా! నీవు నిరంతర పరకాంతాబిలాషివే. చపలచిత్తుడివే. నీకు రాజ్యాధికారము, లంకాధిపత్యము ఎలా లభించింది అని సందేహముగా ఉంది. దీనిని బట్టి చూడ నీది దుష్టస్వభావము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. నీకు పుణ్యకార్యములు చేయడం తెలిసినట్టు లేదు. అందుకే పాపపు పనులలో నిమగ్నుడవై ఉన్నావు.
పోనీ, నీకు ఎవరైనా అపకారము చేస్తే వారికి అపకారం చేయడం లోక ధర్మము. ఎక్కడో అరణ్యములో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్న రాముడు, లంకలో ఉన్న నీకు ఎలాంటి అపకారమూ చేయలేదే? అటువంటప్పుడు నీవు రాముని భార్యను ఎందుకు అపహరిస్తున్నావు? అతని పట్ల ఎందుకు అపరాధము చేస్తున్నావు?
నీ సోదరులు ఖరుని దూషణుని చంపాడు అని కదా నీ వాదన. కాని వారిని ఎందుకు చంపాడు. శూర్పణఖ పోయి, వారిని రాముని మీదికి యుద్ధానికి పురికొల్పింది. రాముడు ఒక్కడు. వారు 14,000 మంది. రాముడు ఏం చేస్తాడు. యుద్ధం చేసాడు. యుద్ధంలో వారు చచ్చారు. అందులో రాముని తప్పు ఏముంది? రాముడు మీ మీదికి యుద్ధానికి కాలు దువ్వలేదు కదా! మరి ఎందుకు రాముని భార్యను అపహరిస్తున్నావు. కాబట్టి వెంటనే సీతను వదిలిపెట్టు. లేకపోతే రాముని బాణములకు ఆహుతి అవుతావు. ఈ సీతాపహరణంతో నీవు త్రాచుపామును కొంగున కట్టుకొని తిరుగు తున్నావు. నీ మెడకు చుట్టుకొని ఉన్న కాలపాశమును నీవు గుర్తించడం లేదు.
ఓ రావణా! సాధారణంగా మనకు అలవి అయిన పనులే మనం చేయాలి. మనకు జీర్ణం అయ్యే పదార్థాలే మనం తినాలి. అలాగే ధర్మవిరుద్ధమైనవి, అపకీర్తిని తెచ్చిపెట్టేవి అయిన పనులు మనం చేయకూడదు కదా! రావణా! నా సంగతి నీకు తెలుసుగా! నేను పుట్టి 60,000 సంవత్సరములు అయింది. నేను వృద్ధుడను. కాని నీవు యువకుడవు. నేను నిరాయుధుడను. నీవు సాయుధుడవు. అయినా నేను నిన్ను సీతను తీసుకొని పోనీయను. అడ్డుకుంటాను. నా ఉండగా నీవు సీతను తీసుకొని పోవడానికి వీలు లేదు. నీవు శూరుడవు అయితే నాతో యుద్ధం చెయ్యి. నిన్ను ఖరుడు పోయిన చోటికే పంపుతాను.
నీవు ఎంతో మందిని చంపి ఉంటావు. కానీ ఇప్పుడు రాముడు నిన్ను చంపగలడు. రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉంటే నీ మరణం ఈ క్షణము సంభవించి ఉండేది. వాళ్లు ఇక్కడ లేకపోబట్టి బతికిపోయావు. చేతనైతే వారు వచ్చేదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి అంతేగానీ, వారు లేనప్పుడు సీతను అపహరించడం వీరత్వము అనిపించుకోదు.
నేను జీవించి ఉండగా నీవు సీతను తీసుకొని ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేవు. నా ప్రాణాలు ఒడ్డి అయిన సరే నేను సీతను కాపాడతాను. రా! నాతో యుద్ధానికి రా! నిన్ను ఈ క్షణమే నీ రథం నుండి కిందకు పడదోస్తాను.” అని వీరోచితంగా పలికాడు జటాయువు.
అయోధ్యాకాండ ఏకోనషష్ఠితమః సర్గలో, భరతుడు రాముని వనవాసం ముగించి తిరిగి రప్పించడానికి పతినిశ్చయంతో చిత్త పెట్టి, అయోధ్య నుండి చిత్తర్కూటం బయలుదేరి వెళతాడు. తనతో పాటు మంత్రి, సైనికులు, శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. ఈ ప్రయాణంలో భరతుడు రాముని నిరాకరణ భయంతో, అనేక ఆలోచనలతో కృంగిపోతాడు. మార్గమధ్యంలో గంగానదిని చేరుకుని, తన ప్రయాణం సాఫల్యం కోసం ప్రార్థిస్తాడు. ఈ సర్గలో భరతుడి రాముని పట్ల ప్రేమ, ఆత్మీయత, ఆతని పట్టుదలతో రాముని తిరిగి తీసుకురావాలని ప్రదర్శించబడతాయి. భరతుడి కర్తవ్యనిష్ఠ, తమ్ముడిపై ఉన్న భావోద్వేగాలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి.
సుమంత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు దశరథుడు. “సుమంత్రా! ఇంతేనా! వారు ఇంక ఏమీ అనలేదా! పోనీలే. తరువాత ఏమి జరిగిందీ వివరంగాచెప్పు.” అని అడిగాడు. సుమంత్రుడు తరువాత జరిగిన విషయాలు ఇలా చెప్పసాగాడు.
“మహారాజా! రామలక్ష్మణులు తమ వెంట్రుకలకు మర్రిపాలు పూసుకొని జడలు కట్టుకున్నారు. వారు గంగానదిని దాటి ప్రయాగ క్షేత్రము వైపు వెళ్లారు. లక్ష్మణుడు ముందు నడుస్తుంటే, సీతమధ్య నడుస్తుంటే, రాముడు వెనక నడుస్తూ వారు వెళ్లిపోయారు. నేను వారు వెళ్లిన వంక చూస్తూ వారు కనుమరుగు కాగానే వెనుకకు తిరిగి వచ్చాను.
రాముడు తన మనసు మార్చుకొని వెనకుకు వస్తాడేమో అని మూడురోజులు గుహుడు ఉన్నచోట ఉండి పోయాను. కాని రాముడు తిరిగిరాలేదు. ఇంక చేసేది లేక వెనకకు తిరిగివచ్చాను. దారిలో ఉన్న ఉద్యానవనములు కూడా రాముని వియోగమునకు శోకిస్తున్నాయా అన్నట్టు వాడిపోయి ఉన్నాయి.
నేను అయోధ్యలో ప్రవేశించగానే రామునికోసరం అయోధ్యా ప్రజలు విడిచే నిట్టూర్పులు వినబడ్డాయి. రాజవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేడమీద నిలబడి ఉన్న స్త్రీలు, నేను రాముని లేని రథమును తీసుకొని రావడం చూచి రోదించడం స్వయంగా చూచాను. రామునికి శత్రువులు కూడా రాముని వంటి శత్రువు మనకు దొరకడని దు:ఖించడం చూచాను.” అని అన్నాడు సుమంత్రుడు.
ఆమాటలు విన్న దశరథుడు సుమంత్రునితో ఇలాఅన్నాడు. “సుమంత్రా! నిజమేనయ్యా. కైక వరములు కోరినదే తడవుగా నేను ఎవరినీ సంప్రదించకుండా ఆ వరాలు ఇవ్వడం వలన ఎంతటి తీవ్రపరిణామాలు వస్తాయో ఊహించకుండా, ఆ వరాలు ఇచ్చేసాను. ఇది నేను చేసినఘోరమైన తప్పు. నేను వృద్ధులైన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. నా తొందరపాటుకు ఫలితం అనుభవిస్తున్నాను. నేను కాదు అయోధ్య అంతా అనుభవిస్తూ ఉంది. దీని కంతటికీ కారణము నా కాముకత్వము. అదే నా వంశనాశనానికి కారణమయింది.
సుమంత్రా! నాకు ఒక సాయం చెయ్యి. నన్ను రాముని వద్దకు తీసుకొని వెళ్లు. లేకపోతే నీవు అన్నా వెళ్లి రాముని వెనకకు తీసుకొని రా. నా ఆజ్ఞను రాముడు పాలించనవసరం లేదని చెప్పి తీసుకొని రా. నీ మాట వినడు అనుకుంటే నాకు దారి చూపించు. నేనే వెళతాను. నేను వెంటనే నా రాముని చూడాలి. లేకపోతే నా దేహంలో ప్రాణములు నిలవడం కష్టం. ఇలాగే ఇక్కడే ఉంటే నేను మరణించడం తథ్యం. నేను అనాధగా మరణించాను అన్న విషయం నా రామునికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు. ఏమో ఏమవుతుందో!” అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఆసనం మీద పడిపోయాడు దశరథుడు.
అయోధ్యాకాండ షష్ఠితమః సర్గలో, భరతుడు, తన మంత్రులతో మరియు సైనికులతో కలిసి చిత్తర్కూటానికి చేరుకుంటాడు. అక్కడ అతను రాముని ఆశ్రమానికి చేరుకొని, రాముడు, సీత, లక్ష్మణులను కలుస్తాడు. భరతుడు రాముని పాదాలపై పడి, అయోధ్యకు తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన తండ్రి వాగ్దానం పాటించాల్సిన కర్తవ్యం చెప్పి, తిరస్కరిస్తాడు. భరతుడు ఎంతో దుఃఖంతో, వనవాసం కొనసాగించాల్సిన అవసరం పట్ల బాధతో ఉంటుంది. ఈ సర్గలో, భరతుడి రాముడి పట్ల ప్రేమ, భక్తి, విధేయత, మరియు రాముని ధర్మపాలన ప్రధానాంశాలు. భరతుడి విన్నపాన్ని రాముడు తిరస్కరించడం, భరతుడి ఆవేదనను మరింతగా వ్యాక్యానిస్తుంది.
ఇంతలో కౌసల్య సుమంత్రుని చూచి ఏడుస్తూ ఇలా అంది. “సుమంత్రా! నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను కూడా రాముని వద్దకు తీసుకొనిపో. నీవు నన్ను రాముని వద్దకు తీసుకొని పోతావా లేక నన్ను యమలోకానికి పొమ్మంటావా నువ్వే చెప్పు. రథమును వెనక్కు మరల్చు.” అని ఆవేశంతో పలికింది కౌసల్య.
అప్పుడు సుమంత్రుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! మీరు శోకమును వదిలిపెట్టండి. రాముడికి అడవులలో ఏ కష్టమూ రాదు. లక్ష్మణుడు రాముని పక్కన ఉండగా రామునికి ఏలోటూ రాదు. ఇంక సీత కూడా ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంది. ఏ మాత్రం భయం బాధ పడటం లేదు. భర్తతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్యానవనములలో ఎలా విహరిస్తూ ఉందో అడవులలో కూడా అలాగే విహరిస్తూ ఉంది. సీత తనకు ఇచ్చిన ఆభరణములు ధరించి ఎంతో ఉల్లాసంగా ఉద్యానవనములో తిరుగుతున్నట్టు అడవులలో విహరిస్తూ ఉంది. ఆమెలో ఆత్మ విశ్వాసము కనపడుతూ ఉంది. ఏ మాత్రం దు:ఖము కనపడటం లేదు.
సీత హృదయము ఎల్లప్పుడూ రాముని యందే లగ్నం అయి ఉంది. రాముడు ఎక్కడ ఉంటే అదే ఆమెకు అయోధ్య. రాముడు లేని అయోధ్య సీతకు అడవులతో సమానమే. కాబట్టి మనము రామ లక్ష్మణుల గురించి గానీ సీత గురించి గానీ శోకించనవసరము లేదు. ఇంక సీత కైకను గురించి ఏమేమో అన్నది కానీ నాకు గుర్తు లేదు. కానీ సీతారామలక్ష్మణులు మాత్రం ఎంతో ఉల్లాసంగా ఉన్నారు అని మాత్రం చెప్పగలను.” అని సుమంత్రుడు పరి పరి విధాలుగా ఓదారుస్తున్నా కౌసల్య తన దు:ఖము మానలేదు. రామా రామా అని పలవరిస్తూ ఉంది.
అయోధ్యాకాండ అష్టపంచాశః సర్గంలో, భరతుడు, వసిష్ఠ మహర్షి సహాయం తీసుకొని, తన తండ్రి దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. భరతుడు ఎంతో దుఃఖంలో ఉంటాడు, కానీ తండ్రి కర్తవ్యం అనుసరించేందుకు కృతనిశ్చయంతో ఉంటాడు. వసిష్ఠ మహర్షి నేతృత్వంలో దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహించబడతాయి. రాముని తలచుకొని, భరతుడు మరింత దుఃఖంలో మునిగిపోతాడు. తండ్రికి తగినంత గౌరవం ఇవ్వాలని భరతుడు పట్టుదలతో ఉంటుంది. ఈ సర్గలో, భరతుడు తండ్రి మరణాన్ని ఎలా స్వీకరించాడో, తన బాధను ఎలా పక్కన పెట్టి, కర్తవ్యాన్ని నెరవేర్చాడో చూపిస్తుంది.
కొంచెం సేపటికి దశరథుడు తెప్పరిల్లాడు. సుమంత్రుని పిలిపించాడు. సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్లాడు. దశరథుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. తల ఎత్తి సుమంత్రుని చూచి దశరథుడు ఇలాఅన్నాడు.
“సుమంత్రా! రాముడు ఎలా ఉన్నాడు? ఎక్కడ పడుకుంటు న్నాడు? ఏమి తింటున్నాడు? సుమంత్రా! రాముడు ఎన్నడూ అడవులలో ఉండలేదు. ఇటువంటి కష్టములు అతనికి తెలియవు. రాజ భోజన ములు ఆరగించి హంసతూలికా తల్పముల మీద శయనించు రాముడు అడవులలో కందమూలములు తింటూ, కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాముడు ఎప్పుడు బయటకు వెళ్లినా అతని వెంట రథములు, కాల్బలములు, ఏనుగులు వెంట ఉండేవి. అవన్నీ లేకుండా అడవులలో ఎలా ఉంటున్నాడో కదా! సీతా రామ లక్ష్మణులు క్రూరజంతువులు, పాములు ఉన్న వనములలో ఎలా ఉంటున్నారో కదా!
సుమంత్రా! సీతారాములు నీ రథము దిగి అడవులలో ఎలా ప్రవేశించారు? ఏది ఏమైనా నా కన్నా నువ్వే అదృష్టవంతుడవు. రాముడు అడవులలో ప్రవేశించు వరకూ అతని వెన్నంటి ఉన్నావు. రాముడు, సీత, లక్ష్మణుడునాతో చెప్పమని ఏమన్నా చెప్పారా! వివరంగా చెప్పు.” అని అన్నాడు దశరథుడు.
సుమంత్రుడు ఇలా బదులుచెప్పాడు. “మహారాజా! రాముడు తమకు నమస్కరించి తమరితో ఇలా చెప్పమన్నాడు. “సుమంత్రా! నా తండ్రికి నేను తలవంచి నమస్కారము చేసానని చెప్పు. అంత:పురములోని అందరినీ వారు వీరు అనే బేధము లేకుండా పేరుపేరునా అడిగినట్టు చెప్పు. నా తల్లి కౌసల్యకు నేను తలవంచి అభివాదము చేసినట్టు చెప్పు. నా మాటలుగా నా తల్లికి ఈ విధంగా చెప్పు.
“అమ్మా! నీవు ధర్మము తప్పకుండా అగ్ని కార్యములు నిర్వర్తించుచూ నా తండ్రిదశరధునికి ఏ కష్టము రాకుండా సేవలు చేస్తూ ఉండు. అమ్మా! నీవు పట్టపు రాణివి అని అహంకరించకుండా దశరథుని ఇతర భార్యలనుకూడా ఆదరించు. నా తల్లి కైకను నా తండ్రి దశరథుని పట్ల అనుకూలంగా ఉండేట్టు చెయ్యి. అమ్మా! భరతుడు నీ కుమారుడే అయినప్పటికీ, అతనిని రాజుగానే గౌరవించు. అదే కదా రాజధర్మము. తల్లులందరి పట్లా ఆదర భావంతో ఉండమని నా మాటగా భరతునికి చెప్పు. భరతునితో నా మాటగా ఇలా చెప్పు:
“భరతా! నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నీవు అయోధ్యను పరిపాలించు. దశరథుడు వృద్ధుడైనాడు. అందుకని ఆయన మాటలను కూడా గౌరవిస్తూ, రాజ్యపాలన సాగించు. భరతా! నా తల్లి కౌసల్యను కూడా నీ తల్లి వలెనే ఆదరించు.” అని కౌసల్యకు చెప్పమని రాముడు నాతో చెప్పాడు.
మహారాజా! లక్ష్మణుడు మాత్రము చాలా కోపంతో తమతో ఇలా చెప్పమన్నాడు. “రాముడు ఏ నేరం చేసాడని రాజ్యము నుండి వెడలగొట్టారు. మహారాజు తన అధికారమును మరిచి కైక మాటలకు లోబడి మమ్ములను అడవులకు పంపాడు. దానివలన మేము ఎన్నో బాధలు పడుతున్నాము. రాజ్యముమీద దురాశతో గానీ, లేక వరములు అడుగు మిషమీద గానీ, అన్న మాటను నిలబెట్టుకోడం కోసం గానీ, కారణం ఏదైనా రాముని అడవులకు పంపడం దుషృత్యము.
తాను మహారాజు అనే అహంకారంతో రాముని అడవులకు పంపాడే కానీ, వేరు కాదు. కనీసము ఇది మంచా లేక చెడ్డా అనే ఆలోచించకుండా రాముని అడవులకు పంపడం చాలా శోచనీయము. అందుకనే నేను దశరథుని నా తండ్రిగా అంగీకరించడం లేదు. నాకు తల్లీ, తండ్రీ అన్నా అన్నీ రాముడే. ఎందుకంటే సకల జనులకు ఆరాధ్యుడైన రాముని విడిచి పెట్టిన వాడిని ఎవరు గౌరవిస్తారు. అయోధ్య ప్రజల అభీష్టమునకు విరుద్ధంగా రాముని అడవులకు పంపి వారి ఆగ్రహమునకు గురి అయిన దశరథుడు మహారాజుగా ఉండటానికి ఎంత మాత్రమూ అర్హుడు కాదు.” అని లక్ష్మణుడు అన్నాడు. శోక రాసిగా నిలిచిన సీత మాత్రమూ నాతో ఏమీ చెప్పలేదు. రాముని చూస్తూ కన్నీటి సముద్రంలో మునిగిపోయింది కానీ ఆ ఇల్లాలు ఎవరినీ ఒక్కమాట కూడా అనలేదు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో, 49వ సర్గలో, రాముడు సీతను వెతుకుతూ జటాయువుతో మాట్లాడిన తరువాత సబరి ఆశ్రమానికి చేరుకుంటాడు. సబరి రాముడికి ఆతిథ్యాన్ని అందించి, విధేయతతో స్వాగతం పలుకుతుంది. సబరి తన గురువుల ఆదేశాలను అనుసరించి రాముని సేవ చేసే భాగ్యం పొందినందుకు సంతోషిస్తుంది.
సీత మాట్లాడే మాటలు వింటుంటే రావణుకి కోపం నసాళానికి అంటింది. అసహనంతో, కోపంతో గంతులేసాడు. రెండు చేతులు గట్టిగా చరిచాడు. పెద్దగా గాండ్రించాడు.
“ఓ సీతా! నీకేమైనా పిచ్చా! నా మాటలు అర్థం కావడం లేదా! నా గురించి, నా ఐశ్వర్యము గురించి, నా పరాక్రమము గురించి, నా వైభవము గురించి ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. నా గురించి నీకు బాగా తెలియదు. నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని బంతిలా పైకి ఎత్తి ఆడుకుంటాను. సముద్రాలన్నీ కలిపి తాగేస్తాను. నా ఎదుట నిలిస్తే మృత్యువును కూడా చంపేస్తాను. సూర్యగమనాన్ని అడ్డుకుంటాను. భూమిని బద్దలు కొడతాను. నా ఇష్టం వచ్చి రూపం ధరించగలను. ఇప్పుడు నేను ఉన్నది సన్యాసి రూపంలో. నా అసలు రూపం చూడు.” అంటూ రావణుడు తన సన్యాసి రూపం వదిలి పెట్టి తన అసలు రూపం సీత ముందు ప్రదర్శించాడు.
పదితలలతో, ఎర్రటి కళ్లతో, ఒంటినిండా బంగారు ఆభరణములతో, నల్లని మేని ఛాయతో, ధనుర్బాణములను ధరించిన రావణుడు సీత ముందు నిలిచాడు.
“ఓ సీతా! చూచావా నా నిజస్వరూపము. ముల్లోకములను శాసించే భర్త కావాలనుకుంటే నన్ను వరించు. నీ లాంటి అతిలోక సౌందర్యవతికి నేను తగిన భర్తను. నేను నీ మాట ఎన్నడూ జవదాటను. నీకు దాసుడిగా ఉంటాను. ఆ వనచరుడైనా రాముని మీదినుండి నీ మనసు మరల్చుకో. నా మీద మనసు లగ్నం చెయ్యి. నీకు శుభం జరుగుతుంది.
నేను ఇంకా నువ్వు చాలా తెలివిగలదానవు మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకున్నాను. కాని నీవు ఇంత తెలివి తక్కువదానికి అని అనుకోలేదు. ఒక ఆడుదాని మాటలు విని అడవులకు వచ్చిన బుద్ధిహీనుడిని, రాజ్యభ్రష్టుడిని, అల్పాయుష్కుడిని, మానవమాత్రుడిని నువ్వు ఏం చూసి వరించావో నాకు అర్థం కావడం లేదు. రా! నాతో రా!” అంటూ రావణుడు ముందుకు దూకాడు.
సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేతితో సీత జుట్టు పట్టుకున్నాడు. మెడ కింద చెయ్యి వేసాడు. మరొక చెయ్యి నడుము కింద వేసాడు. సీతను ఎత్తుకొని పోయాడు. రావణుని రథము అతని ముందు సాక్షాత్కరించింది. సీతను రథంలో కూర్చోపెట్టాడు. పెద్ద పెద్ద గా అరుస్తూ సీతను భయపెడుతున్నాడు. తాను కూడా రథం ఎక్కి సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు.
సీతకు ఏం జరుగుతుందో తెలీడం లేదు. “రామా రామా” అంటూ అరుస్తూ ఉంది. పాములా మెలికలు తిరిగిపోతూ ఉంది. రావణుడి కబంధ హస్తాలనుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కాని రావణుడు తన పట్టు వీడలేదు. తన రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. సీత “రామా రామా” అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు ఆమెను గట్టి పట్టుకున్నాడు. రథం ఆకాశమార్గాన వేగంగా పోతూ ఉంది.
“రామా! నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకొని పోతున్నట్టు నీకు ఎలా తెలుస్తుంది. ఇంక నీవు నన్ను చూడలేవు కదా! నేను ఎక్కడ ఉన్నదీ నీకు ఎలా తెలుస్తుంది! రామా! నీవు దుష్టులను శిక్షిస్తావు కదా! దుర్మార్గుడైనా ఈ రాక్షసుని శిక్షించి నన్ను రక్షించవా! ఈ రాక్షసుని చెరనుండి నన్ను విడిపించవా! ఒరేయి రావణా! తప్పు చేస్తున్నావు. పాపం చేస్తున్నావు, ఈ పాపానికి ఫలితం అనుభవిస్తావు. రాముడి చేతిలో చస్తావు! అయ్యో! రామా! నా బాధ ఎవరికి చెప్పుకోను. ఆహా! ఆ కైక కోరిక ఈ నాటికి తీరినట్టుంది. నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి.
ఓ వనదేవతలారా! ఓ వృక్షములారా! ఓ పర్వత పంక్తులారా! ఈ దుర్మార్గుడు రావణుడు నన్ను అపహరించుకొని పోతున్న సంగతి నా రామునికి చెప్పండి. గలా గలా పారే ఓ గోదావరీ నదీ మాతా! నన్ను ఈ రాక్షసుడు అపహరించుకుపోతున్న సంగతి నా రామునికి తెలియజేయి! ఓ వన్య మృగములారా! ఓ పక్షులారా! నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఈ దుర్మార్గుడు తీసుకుపోతున్న సంగతి నా రామునికి చెప్పండి.
నాకు తెలుసు. నేను యమలోకంలో ఉన్నా నా రాముడు నన్ను తన బలపరాక్రమాలతో మరలా వెనక్కు తీసుకురాగలడు. మీరు నా రామునికి నా గురించి తెలియజెయ్యండి చాలు.” అని పరి పరి విధాలా ప్రకృతితో మొరబెట్టుకుంటూ ఉంది సీత,
ఇంతలో సీతకు ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న జటాయువు కనిపించాడు. “ఓ జటాయువూ! ఇటు చూడు. నేను! సీతను! ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని తీసుకొని పోతున్నాడు. ఈ విషయం రామునికి చెప్పు. వీడు రాక్షసుడు. క్రూరుడు. చేతిలో ఆయుధం ఉంది. వీడిని నువ్వు ఏమీ చేయలేవు. నన్ను కాపాడలేవు. కనీసం నా గురించి రామునికి తెలియజెయ్యి. నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకు పోతున్న సంగతి రామునికి లక్ష్మణునికి తెలియజెయ్యి.” అని బిగ్గరగా అరుస్తూ ఉంది సీత.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టచత్వారింశః సర్గః (48వ సర్గ): వాల్మీకి రామాయణం యొక్క అరణ్యకాండలో, 48వ సర్గలో, సీతను రాక్షస రాజు రావణుడు అపహరిస్తాడు. రాముడు సీతను వెతుకుతూ ఉండగా, గృధ్రరాజు జటాయువు రాముని ఎదుర్కొంటాడు. జటాయువు రావణుడి దుర్నీతిని వివరించి, సీతను రక్షించేందుకు తన ప్రయత్నాన్ని వివరించును. అలాగే, రావణునితో యుద్ధించిన విషయాన్ని చెబుతాడు.
“ఓ సీతా! నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను దశకంఠుడను. నేను కుబేరునికి తమ్ముడిని. నా పేరు రావణుడు. మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలాగా నన్ను చూచి దేవతలు, గంధర్వులు, దానవులు భయంతో పారిపోతారు. నేను నా సోదరుడు కుబేరునితో యుద్ధమే చేసి జయించాను. నాకు భయపడి కుబేరుడు సకల భోగములతో తులతూగుతున్న తన నగరమును విడిచి కైలాసంలో తలదాచు కొన్నాడు. నేను కుబేరుని జయించి అతని పుష్పక విమానమును అపహరించాను. దాని మీద నేను ఆకాశంలో విహరిస్తుంటాను.
నాకు కోపం వచ్చింది అని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు. నేను ఉన్నచోట వాయువు నెమ్మదిగా వీస్తాడు. సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకుంటాడు. నేను ఉన్నచోట చెట్టుకూడా తమ ఆకులను కదల్చలేవు. నదులు ప్రవహించ లేవు. నేను ఈ ప్రకృతినంతా శాసిస్తాను.
సముద్రము మధ్యలో ఉన్న నా లంకానగరము సకల భోగములలో దేవేంద్రుని అమరావతిని తలదన్నుతుంది. లంకా నగరం బంగారు ప్రాకారాలు, బంగారు మేడలు మణితోరణాలతో నిండి ఉంటుంది. నా లంకా నగరము ప్రశస్తమైన ఏనుగులు, గుర్రములతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ మంగళ వాద్యములు మ్రోగుతూ ఉంటాయి. నువ్వు నాతో కలిసి లంకా నగరంలో అడుగుపెడితే నీ రాముని, నీ వాళ్లను అందరినీ మరిచి పోతావు. భోగాలలో మునిగితేలుతావు. ఆ రాచ భోగాలలో మునిగిన నీకు సామాన్యమానవుడైన రాముడు ఎన్నటికీ గుర్తుకురాడు.
నీకు తెలుసో లేదో. అసలు దశరథుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా అడవులకు ఎందుకు పంపాడంటావు. రాముడంటే అతని తండ్రి దశరథునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియపుత్రుడు భరతునికి రాజ్యం ఇచ్చాడు. నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు. తెలివితక్కువవాడు. పైగా తాపస వృత్తిలో ఉన్నాడు. అటువంటి మొగుడి పక్కన ఉన్నంత కాలమూ నీవు ఈ జన్మలో అయోధ్యకు రాణివి కాలేవు. నువ్వు ఊ అంటే లంకా రాజ్యానికి రాణివి అవుతావు.
ఇంక నేనంటావా ఈ లోకంలో ఉన్న రాక్షసులందరికీ రాజును. పైగా నువ్వు అంటే కామంతో పడిచస్తున్నాను. నేనే నిన్నుకోరి లంకనుండి నీ వద్దకు వచ్చాను. కాబట్టి నన్ను కాదనకు. నన్ను కాదంటే ఇంతటి అదృష్టాన్ని కాలదన్నుకున్నానే అని జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. యుద్ధంలో రాముడు నా కాలి గోరు కూడా కదపలేడు. నీ అదృష్టం కొద్దీ నీవు నా కంటపడ్డావు. నాతోరా! నిన్ను సుఖాలలో ముంచెత్తుతాను. “అని సీతను ప్రలోభపెట్టాడు రావణుడు.
రావణుని మాటలు విన్న సీత కోపంతో ఊగిపోతున్న నాగ కన్య మాదిరి బుసలు కొట్టింది.
“ఓరి రాక్షసా! దుర్బుద్ధివి. ఇంద్రియ లోలుడివి. రావణా! నీవు నీ వాళ్లతో సహా సర్వనాశనం అయిపోతావు. నీ లంకా రాజ్యము సముద్రంలో కలిసిపోతుంది. ఇంద్రుని వద్దనుండి శచీదేవిని బలాత్కారంగా తీసుకొని పోయి జీవిస్తావేమోగానీ, రాముని వద్దనుండి నన్ను అపహరించి క్షణకాలము కూడా నీవు జీవించలేవు. నువ్వు అమృతము తాగినా నీకు రాముని చేతిలో చావు తప్పదు.” అని పరుషంగా పలికింది సీత.
సన్యాసివేషములో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే, సీత మనసులో ఇలా అనుకుంది.
“ఇతడు సన్యాసి. బ్రాహ్మణుడు. పైగా అతిథి. ఈయన అడిగిన వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో. ఉన్నవి ఉన్నట్టు చెబితే తప్పేమిటి” అని మనసులో అనుకొంది. అప్పుడురావణుని చూచి ఇలా అంది.
” ఓ బ్రాహ్మణోత్తమా! నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను. అయోధ్యా నగరాధి పతి దశరథుని కోడలను. రాముని భార్యను. నా పేరు సీత. నేను చిన్నతనమునుండి రాజభోగములు అనుభవించాను. నా వివాహము అయిన తరువాత కూడా 12 సంవత్సరములు నా అత్తవారి ఇంట రాజభోగములు అనుభవించాను.
నా భర్త రామునికి పట్టాభిషేక సమయములో మా మామగారి మూడవ భార్య కైక ఆయనను రెండు వరములు కోరింది. ఒకటి రాముని అరణ్యవాసము. రెండవది తన కుమారుడు భరతుని పట్టాభిషేకము. అప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు. నా భర్త పట్టాభిషేకము ఆగిపోయింది. తండ్రి మాట ప్రకారము నా భర్త 14 ఏళ్లు అరణ్యవాసము చేస్తున్నాడు. ఆయన సహధర్మచారిణిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసము చేస్తున్నాను. ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యములకు వచ్చాడు. ఆ ప్రకారంగా మేము ముగ్గురము ఈ అరణ్యములో నివసిస్తున్నాము. నా భర్త రాముడు, నా మరిది లక్ష్మణుడు అడవిలో ఒక జింకను వేటాడటానికి వెళ్లారు. వారు తొందరలోనే వస్తారు. శ్రేష్టమైన జింక మాంసము తెస్తారు.
ఇంతకూ తమరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? తమరి గోత్రనామములు ఏమిటి? ఈ దండకారణ్యములో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు?” అని ఎదురు ప్రశ్నలు వేసింది సీత.
సీత వేసిన ప్రశ్నలకు రావణుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా పేరు రావణుడు. నేను రాక్షస రాజును. నన్ను చూస్తే దేవతలు, అసురులు, పన్నగులు, అందరూ భయపడతారు. నిన్ను చూచిన వెంటనే నాకు నీ మీద మోహము కలిగింది. నిన్ను చూచిన తరువాత, నేను నీ దగ్గర తప్ప నా ఇతర భార్యల దగ్గర కామభోగములు అనుభవింపలేను అని అనుకుంటున్నాను.
నేను ఎంతో మంది స్త్రీలను పట్టి తెచ్చి నా భార్యలుగా చేసుకున్నాను. నీవు నాతో వస్తే నిన్ను వారందరికీ పట్టమహిషిని చేస్తాను. నేనుపాలించే నగరము పేరు లంకానగరము. సముద్రమధ్యలో ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది. నా నగరములో అనేక సుందర ఉద్యానవనములు ఉన్నాయి. నీకు ఈ అరణ్యవాసము ఎందుకు, నాతో వస్తే ఆ ఉద్యానవనములలో హాయిగా విహరించవచ్చును. సీతా! నీవు నాకు భార్యవు అయితే నీకు అయిదు వేలమంది దాసీలు సేవలు చేస్తారు. నన్ను వరించు. నాతో రా!” అని అన్నాడు రావణుడు.
ఆ మాటలు విన్న సీతకు కోపము ముంచుకొచ్చింది.
“రావణా! నేను నా భర్త రాముని తప్ప మరొకరిని కలలో కూడా తలంచను. నా రాముడు మహాపర్వతము వంటి వాడు. అజేయుడు. సర్వలక్షణ సంపన్నుడు., వటవృక్షము వంటి వాడు. సత్యవాక్పరిపాలకుడు. అట్టి రాముడు నాకు భర్త. నేను నా భర్తను తప్ప మరొకరిని కన్నెత్తికూడా చూడను. ఇంకా నా రాముడు మహా బాహుడు. ఉన్నతవక్షస్థలము కలవాడు. నరులలో ఉత్తముడు. సింహము వంటి వాడు. నా రాముడు జితేంద్రియుడు. కీర్తిమంతుడు.
సింహము వంటి భర్తకు భార్యనైన నన్ను ఒక నక్క మాదిరి కోరుతున్నావు. నీకు కనీసము నన్ను తాకే అర్హత కూడా లేదు. నన్నుకోరుతున్నావు అంటే నీకు మరణము ఆసన్నమయినది అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే సింహము వంటి రాముని జూలు పట్టుకొని లాగుతున్నావు. మంధర పర్వతమును పైకిఎత్తాలని, కాలకూట విషాన్ని తాగాలని ఉత్సాహపడుతున్నావు. సూదితో కంటిలో నలుసును తీసుకుంటూ నీ కళ్లు నీవే పొడుచుకుంటున్నావు. అలాగే వాడియైన కత్తిని నాలుకతో నాకుతున్నావు. పెద్ద రాయి కట్టుకొని సముద్రమును ఈదాలని అనుకుంటున్నావు. సూర్యచంద్రులను మింగాలని చూస్తున్నావు. అగ్నిని కొంగున ముడి వెయ్యాలని ప్రయత్నిస్తున్నావు. రాముడి భార్యను పొందాలి అని అనుకోడం వాడి అయిన శూలాల మీద నడవడమే. నాశనమైపోతావు. జాగ్రత్త!
ఓ రావణా! నీవు రాముని కాలి గోటికి కూడా చాలవు. అది తెలుసుకో! రాముడు సింహం అయితే నువ్వు నక్క, రాముడు సముద్రము అయితే నువ్వు మురికినీరు ప్రవహించే పిల్లకాలువ. రాముడు ఏనుగు అయితే నువ్వు దోమ. రాముడు గరుడుడు అయితే నువ్వు కాకి. రాముడు నెమలి అయితే నువ్వు నీటి కొంగ. రాముడు హంస అయితే నువ్వు గ్రద్ద. నీకూ రామునికి అంత తేడా ఉంది. నీచేయి నామీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు. జాగ్రత్త!” అని అన్నది సీత.
కానీ సీతకు లోలోపల భయంగానే ఉంది. ఆ భయం తట్టుకోలేక నేలమీద పడిపోయింది. రావణుడు సీతను మరింత భయపెట్టడానికి తన గురించి ఇంకా చెప్పనారంభించాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్చత్వారింశః సర్గం రామాయణంలో కీలక భాగం. ఈ సర్గంలో, రాముడు మరియు లక్ష్మణులు సీతను వెతికే ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. మార్గంలో, వారు కబంధుడనే రాక్షసుడితో ఎదుర్కొంటారు. రాక్షసుడు వారికి దాడి చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ రాముడు మరియు లక్ష్మణులు అతనిని ఓడిస్తారు.
రావణభిక్షుసత్కారః
తథా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః |
స వికాంక్షన్భృశం రామం ప్రతస్థే న చిరాదివ ||
సీత మాట్లాడిన పరుషమైన వాక్యములకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్లిన వెంటనే ఈ అవకాశము కొరకు వేచి ఉన్న రావణుడు తను దాగి ఉన్న పొదలమాటు నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు. కాషాయ బట్టలు ధరించాడు. చేతిలో దండము, కమండలము పట్టుకున్నాడు. జటాజూటములు కట్టుకున్నాడు. ఒక గొడుగు పట్టుకున్నాడు. కాళ్లకు పాదుకలు ధరించాడు. కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు.
రావణుని రాకతో అక్కడి ప్రకృతి కూడా వణికిపోయింది. గాలి ఆడటం మానేసింది. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది కూడా మెల్లగా శబ్దం చెయ్యకుండా ప్రవహించసాగింది. రావణుడు సీత దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చుని ఉంది. సీతను చూడగానే రావణుడికి మన్మధుని బాధ ఎక్కువ అయింది. సీతను చూచి రావణుడు ఇలా అన్నాడు..
“ఓ తరుణీ! నీవు ఎవరవు? అన్నిశుభలక్షణములు కల నీవు ఎవరు? నీవు ఆ శివుని అర్థాంగి పార్వతివా? లేక కీర్తికి అధిష్టాన దేవతవా! లేక కాంతి దేవతవా! లేక లక్ష్మివా! దేవ కాంతవా! అప్సరసవా! లేక మన్మధుని మనోహారిణి రతీదేవివా!
(ఇక్కడ రావణుడు సీతను అంగాంగము వర్ణించాడు. సీత చనుదోయిని, తొడలను, నడుమును, పిరుదులను వర్ణించాడు. వాల్మీకి అలా వర్ణిస్తాడా! ఎంత సన్యాసి అయినా పరాయిస్త్రీని అలా వర్ణిస్తుంటే ఆ స్త్రీ ఊరుకుంటుందా! కాబట్టి ఇవి వాల్మీకి రాసినవి కావేమో అనిపిస్తుంది. చదవండి.)
ఓ తరుణీ! నీ జఘనము విశాలంగా ఉంది. నీ తొడలు ఏనుగు తొండముల మాదిరి ఉన్నాయి. నీ స్తనములు గుండ్రంగా తాటి పండ్లమాదిరి అందంగా ఉన్నాయి (తాలఫలోపమౌ) ఓ తరుణీ! నీవు నా మనసును హరించావు. నీ నడుము నా పిడికిలి అంత ఉంది. నీ వెంట్రుకలు అందంగా ఉన్నాయి. నీ స్తనములు దగ్గరగా ఉన్నాయి…. ( ఈ వర్ణన బట్టి మీరే నిర్ణయించండి)
ఓ లలనా! నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకూ భూమండలములోనే కాదు ముల్లోకములలో చూడలేదు. నీవు ఈ అరణ్యములలో ఉండతగవు. నిన్ను ఆ అరణ్యములో ఈ పర్ణశాలలో చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ అరణ్యము రాక్షసులు నివాసము. ఎక్కడో రాజభవనములలో, అంతఃపురములలో రాచభోగములు అనుభవించవలసినదానికి ఇక్కడ ఎందుకున్నావు.
నీకు వివాహ మైనదా! నీ భర్త ఎవరు? నీవు మానవ కాంతవు మాత్రము కావు! నీవు దేవతాస్త్రీవి అయి ఉండవలెను. రాక్షసులు సంచరించు ఈ అరణ్య ప్రాంతమునకు దేవతలు, గంధర్వులు, కింనరులు కూడారారు. అటువంటిది నీవు ఎందుకు వచ్చావు? ఈ అరణ్యములో ఉన్న పులులు, సిహములు మొదలగు క్రూరమృగములను చూచి నీకు భయం వెయ్యడం లేదా!
మరలా అడుగుతున్నాను. నీవు ఎవరు? నీ భర్త ఎవరు? నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఈ రాక్షసరాజ్యంలో ఒంటరిగా ఎందుకు ఉ న్నావు?” అని అడిగాడు రావణుడు.
బ్రాహ్మణుడు, సన్యాసి వేషములో ఉన్న రావణునికి సీత అర్ఘ్యము, పాద్యము ఇచ్చి సత్కరించింది. అతిథి పూజలు చేసింది. తినడానికి పండ్లు కూడా ఇచ్చింది. సీత తనకు అతిధి మర్యాదలు చేస్తుంటే, రావణుడు ఆమెను ఎలా బలవంతంగా తీసుకొని పోవాలా అని ఆలోచిస్తున్నాడు. తన చావు తానే కొనితెచ్చుకుంటున్నాడు.
రావణునికి అతిథి సత్కారములు చేసి, గుమ్మము వద్దకు వచ్చి సీత రాముడు, లక్ష్మణుడు వస్తున్నారా అని చూసింది. కాని రామలక్ష్మణులు ఎంతకూ కనపడలేదు.