అయోధ్యాకాండలోని 115వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివాసం ఏర్పరుస్తారు. ఈ సర్గలో శూర్పణఖా అనే రాక్షసి రాముని చూసి ఆకర్షితురాలవుతుంది. ఆమె రాముని ప్రేమ కోసం ప్రాధేయపడుతుంది, కానీ రాముడు సీతపై తన ప్రేమను చూపిస్తూ ఆమెను తిరస్కరించుతాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడి వద్దకు వెళుతుంది, కానీ అతను కూడా ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా సీతను హాని చేయడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. ఈ సంఘటన రామాయణంలో కీలకంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాముడు మరియు రావణుని మధ్య శత్రుత్వానికి పునాది వేస్తుంది.
భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయ ములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.
తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామ మునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు.
వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.
భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. “గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు.”అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు సీతను వెతికేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో, రాముడు తన సంకేత రింగ్ను హనుమంతుడికి ఇస్తాడు, ఇది సీతకు రాముడి గుర్తుగా ఉంటుంది. హనుమంతుడు ఆ రింగ్ను తీసుకుని లంకకు ప్రయాణిస్తాడు.
రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు. తను చెప్పిన పని చెయ్యకపోతే రావణుడు చంపుతాడు. ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు. అందుకని మరలా ఒకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అనుకున్నాడు మారీచుడు. అయితే ఈ సారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు.
“ఓ రావణా! నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు? వాళ్లు చెప్పినా నీవు ఎలా విన్నావు?నాకు తెలుసు. నీవు సుఖంగా ఉండటం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్లు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు. ఇంతకూ వారు ఎవరో నాకు తెలియాలి. నీ చావు చూడాలని కోరుకొనే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి.
రాముని శత్రువులు ఎవరో కానీ వాళ్లు రాముని చంపలేక, మహా పరాక్రమ వంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు. వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు. నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. వాళ్లు ఎవరో నాకు చెప్పు. వాళ్లు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపెయ్యి.
నీవు దారి తప్పి నడిచినా, నిన్ను సక్రమ మార్గంలో పెట్టే వాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరే వారు నీకు మంత్రులు, హితులు ఎలా అవుతారు? రాజు చెడ్డ మార్గంలో పోతుంటే, మంత్రులు రాజుకు హితం చెప్పి, మంచి మార్గంలో నడిచేట్టు చెయ్యాలి. అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను!
(మారీచుడు చెప్పిన ఈ మాటలు నేటికి కూడా వర్తిస్తాయి. ముఖ్యమంత్రి చెడు నిర్ణయాలు తీసుకుంటుంటే కాబినెట్ మంత్రులు అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే సెక్రటరీలు (ఐ.ఏ.యస్ ఆఫీసర్లు) వారికి మార్గనిర్దేశం చెయ్యాలి. వారి తప్పుడు నిర్ణయాలను అడ్డుకోవాలి. ప్రజాక్షేమాన్ని కాపాడాలి. కానీ ఈ నాడు జరుగుతున్నదేమిటి. ముఖ్యమంత్రికి కాబినెట్ మంత్రులు తాన అంటే తందానా అంటున్నారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. లేకపోతే వారి మంత్రి పదవులు పోతాయని భయం.
అలాగే సెక్రటరీలు మంత్రులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తప్పని తేలితే మాదేం లేదు అంతా మంత్రులు చెప్పినట్టే చేసాము అని సమర్ధించు కుంటున్నారు. మంత్రులు చెప్పింది చెయ్యడానికి ఐ.ఏ.యస్ లు ఎందుకు. గుమాస్తాలు చాలు కదా. పాలకులను సక్రమమార్గంలో నడిపించడమే కార్యదర్శుల పని. ఈ విషయాన్నే నాడు మారీచుడు రావణునికి స్పష్టంగా చెప్పాడు.)
రాజు మంచి వాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది. రాజు చెడ్డ వాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. రాజ్యానికి మూలం రాజు. అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి, రాజును రక్షించుకోవడం మంత్రులవిధి. ప్రజావ్యతిరేకుడైన రాజు, ప్రజలను పీడించేరాజు ప్రజాభిమానము చూరగొనలేడు. అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు.
రాజు మంచి వాడైనా, మంత్రులు చెడ్డ వారైతే, మంత్రుల చెడు సలహాల ఫలితంగా, రాజు కూడా వారితో పాటు నశించి పోతాడు. ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలవుతారు. ఇప్పుడు నీవు తీసుకునే ఈ నిర్ణయంతో నీతోపాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు.
ఓ రావణా! నాకు ఎటూ చావు తప్పదు. అది నాకు తెలుసు. నా బాధ అంతా నీ గురించే. పోతే నేను ఒక్కడినే పోతాను. కానీ నీవు, నీ ప్రజలు, సైన్యంతో సహా నశించిపోతావు. నీవు చెప్పిన పని నేను చేస్తాను. రాముడి చేతిలో చస్తాను. కాని నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు.
నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు. రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు. కాని సీతను అపహరించిన తరువాత, లంకను పాలించ డానికి నీవు ఉండవు అని తెలుసుకో!
కాబట్టి ఓ రావణా! ఇదే మన ఆఖరు సమావేశము. నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకొని వెళ్లగానే నేను చస్తాను. సీతను అపహరించగానే నీవు చస్తావు. అప్పుడు ఈ లంకా ఉండదు. ఈ రాక్షసులూ ఉండరు.
నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు. కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఇంక పోదాం పద.” అని అన్నాడు మారీచుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చత్వారింశః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు శబరి ఆశ్రమం నుండి మరింత దూరం ప్రయాణిస్తారు. వారు పంపా సరస్సు వద్ద చేరి హనుమంతుడు, సుగ్రీవుడు వంటి వానరులతో పరిచయం కలుగుతుంది. సుగ్రీవుడు రాముడికి సీత ఆచూకీ తెలిపి, తన సోదరుడు వాలి నుండి సహాయం కోరుతాడు.
మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు. చావబోయేవాడికి అమృత తుల్యమైన ఔషధము రుచించనట్టు మారీచుని మాటలు రావణునికి తలకెక్కలేదు. పైగా తన ముందు తన శత్రువు అయిన రాముని మారీచుడు పొగడటం చూచి రావణునికి కోపం వచ్చింది.
“మారీచా! నీవు ఏవేవో వ్యర్ధములైన మాటలు మాట్లాడు తున్నావు. వాటి వల్ల ఏమీ ప్రయోజనము లేదు. నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవమాత్రుడు. పైగా మూర్ఖుడు. నీ మాటలు విని ఒక మానవునికి భయపడే పిరికిపంద కాడు ఈ రావణుడు. ఒక స్త్రీకోరిన కోరికలు తీర్చడానికి, తల్లితండ్రులను బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన పిరికి పంద ఆ రాముడు.
ఆ రాముడు నా ప్రియాతి ప్రియమైన సోదరుడు ఖరుని చంపాడు. దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అతని భార్యను అపహరిస్తాను. దానికి నీ సాయం కావాలి తప్పదు. నేను ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, దేవేంద్రుడు దిగివచ్చినా నా నిర్ణయం మార్చుకోను. నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను అంతే కానీ, నా నిర్ణయం తప్పా ఒప్పా అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నీవు అలా మాట్లాడటం తగదు. అయినా, నీ మాటలు నేను పట్టించుకోనవసరం లేదు.
మంత్రులు రాజు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానము వినయంగా చేతులు కట్టుకొని మరీ చెప్పాలి. అదీకూడా రాజుకు ఇష్టమైనవి, అంగీకారయోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు.
ఓ మారీచా! నీవు చెప్పేది ఎంత హితమైనా, చెప్పేవిధానంలో తిరస్కారధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించరు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. అటువంటి నాతో ఇంత పరుషంగా మాట్లాడతావా! నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను. నేను చెయ్యబోయే పని మంచిదా చెడ్డదా! నేను చెయ్యగలనా లేదా! నేను సమర్థుడినా కాదా! అని నేను నిన్ను అడగలేదు.
కాబట్టి నేను చెప్పింది విను. ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు. ఇది నా ఆజ్ఞ. నీవు ఏమి చెయ్యాలో చెబుతాను శ్రద్ధగా విను. నీవు మాయారూపములు ధరించుటలో ప్రజ్ఞాశాలివి. అందుకని నీవు ఒక బంగారు వర్ణము కల లేడి రూపము ధరించు. రాముని ఆశ్రమమునకు వెళ్లు. సీత చూచేట్టు ఆ పరిసరములలో సంచరించు. ఆమె నిన్ను చూచి నీ మీద ఆసక్తి పెంచుకుంటుంది. తరువాత నీ ఇష్టం. ఎటైనా పరుగెత్తు.
సీత మృగరూపంలో ఉన్న నిన్ను చూచి “ఆ బంగారు లేడి నాకు కావాలి” అని రాముని అడుగుతుంది. భార్య మాటలు విని రాముడు ధనుర్బాణములు ధరించి నిన్ను పట్టుకోడానికి నీ వెంట వస్తాడు. నీవు పరుగెత్తు. చాలా దూరం పోయిన తరువాత “హా సీతా’ హా లక్షణా” అనిపెద్దగా రాముని గొంతుకతో, రాముడు అరిచినట్టు అరువు. ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడు ఆ అరుపులు వింటాడు. కంగారు పడుతూ రాముని వెదుక్కుంటూ వస్తాడు. రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో నేను ఆశ్రమంలో ప్రవేసించి సీతను బలవంతంగా తీసుకొని వస్తాను. నీవు రామ బాణమునకు అందకుండా పరుగెత్తు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్లిపో. నీవు నాకు ఈ పని చేసి పెడితే, నీకు నా రాజ్యంలో అర్థ రాజ్యం ఇస్తాను.
ఓ మారీచా! వెంటనే బయలుదేరు. నేను నీ వెంటనే నా రథం మీద వస్తాను. నీవు రాముని తీసుకొని అడవులలోకి పరుగెత్తు. నేను సీతను అపహరించి లంకకు తీసుకొని వస్తాను. మనం లంకలో కలుసుకుందాము. నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపుతాను. లేకపోతే బలవంతంగా నైనా నీతో ఈ పని చేయిస్తాను. రాజును ఎదిరించి ఎవరూ సుఖంగా బతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో!
మారీచా! ఇంకొక విషయం. నీవు రాముని చేతిలో చావ వచ్చు, చావ కుండా తప్పించుకోనూవచ్చు. కాని నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతిలో నీ చావు తప్పదు. కాబట్టి బాగా ఆలోచించుకొని ఏది మంచిదో అది చెయ్యి.” అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు రావణుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనచత్వారింశః సర్గ రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, రాముడు, లక్ష్మణుడు సీతను వెతికేందుకు దండకారణ్యంలోకి వెళ్తారు. ఈ ప్రయాణంలో, వారు శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి రాముడిని ఆత్మీయంగా ఆహ్వానించి, సీతను కనుగొనడానికి మార్గదర్శకత్వం చేస్తుంది. భక్తితో రాముడిని పూజించి, తన నిష్కల్మష భక్తిని వెల్లడిస్తుంది.
తాను చేసిన హితోపదేశములు రావణునికి తలకెక్కలేదని గ్రహించాడు మారీచుడు. ఇంకా తన అనుభవాలు చెప్పడం మొదలెట్టాడు.
“ఓ రాక్షసరాజా! రాముని చేతిలో దెబ్బతిన్న నాకు ఇంకా బుద్ధిరాలేదు. నేను మాయారూపములు ధరించడంలో సిద్ధహస్తుణ్ణి. నేను ఒక మృగరూపము ధరించి, ఇంకా ఇద్దరు రాక్షసులను నా వెంట తీసుకొని దండకారణ్యమునకుపోయాను. అప్పుడు నా రూపము మహా భయంకరంగా ఉండేది. పెద్ద దేహము, ఎర్రటి నాలుక, వాడిఅయిన కోరలు, మహాభయంకరాకారముతో దండకారణ్యములో సంచరిస్తూ మునులను, ఋషులను బెదిరిస్తూ వారిని హింసిస్తూ, వారిని చంపి తింటూ ఉండేవాడిని.
ఒకసారి నాకు రాముడు తారసపడ్డాడు. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బ నాకు గుర్తుకు వచ్చింది. రాముడు ఇప్పుడు మునివేషములో ఉన్నాడు. నన్నేమి చెయ్యగలడు అని అనుకొన్నాను. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాను. వెంటనే మహోగ్రరూపంతో రాముని మీదికి దూకాను.
తన మీదికి దూకుతున్న నన్ను చూచి రాముడు, తన ధనుస్సు నుండి మూడు బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు వాయు వేగంతో వచ్చి నాకు తాకాయి. రామ బాణములను చూచి నాకు భయం వేసి పక్కకు తప్పుకున్నాను. కాని నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయ్యారు.
మొదటి సారి రాముని చేతిలో దెబ్బ తిన్నాను. రెండవసారి రామ బాణము నుండి తప్పించుకున్నాను. ఇంక మరలా రాముని జోలికి పోదలుచుకోలేదు. అందుకని అప్పటి నుండి ముని వృత్తి అవలంబించి ఇక్క ఆశ్రమము నిర్మిచుకొని సన్యాసిగా జీవించు చున్నాను.
జటాజూటములతో నార చీరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకువస్తున్నాడు. రాముడు కలలో కనిపించినా భయంతో వణికిపోతున్నాను. అసలు నాకు “ర” అనే అక్షరంలో ప్రారంభం అయ్యే ఏ వస్సువును చూచినా రాముని చూచినట్టే భయం కలుగుతూ ఉంది. నాకు రామ బాణము శక్తి తెలుసు కాబట్టి ఇంతదాకా చెప్పవలసి వచ్చినది. తరువాత నీ ఇష్టం.
నీకు ఇష్టం అయితే రామునితో యుద్ధం చెయ్యి. లేకపోతే మానెయ్యి. కాని నన్ను మాత్రము ఇందులోకి లాగకు. నేను నాలుగు కాలాల పాటు జీవించాలని నీకు ఉంటే, నా ముందు రాముని మాట ఎత్తకు. నీవు చేసే పాపపు పనులకు నన్ను బాధ్యుడిని చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను మాత్రము నీ వెంటరాను. నీకు సాయం చెయ్యను. ఆ రాముడు రాక్షసుల పాలిట మృత్యువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
ఓ రావణా! ఇందులో రాముని తప్పు ఏముంది చెప్పు. ఆ శూర్పణఖ మాటలు విని ఖరుడు దూషణుడు రాముని తో యుద్ధానికి పోకపోతే వ్యవహారము ఇంతవరకూ రాదు కదా! 14,000 మంది బలి అయ్యేవారుకాదు కదా! రాముడు తనంత తాను నీ స్థావరమునకు వచ్చి నీతో యుద్ధము చేయలేదుకదా! నీ సోదరులను, సైన్యాది పతులను అపార సేనలను పోగొట్టుకున్నా ఇంకా నీకు బుద్ధిరాలేదా! మిగిలిన బంధువులను, మిత్రులను రామ బాణములకు బలి చేయ దలచుకున్నావా! నా హితోక్తులు విని నీవు రామునితో వైరము మానకపోతే నీకు సర్వనాశనం తప్పదు.” అని అన్నాడు మారీచుడు.
అయోధ్యాకాండలోని 114వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యమధ్యంలో నివాసం ఏర్పరుస్తారు. ఈ సర్గలో వారికి సహాయంగా, మహర్షి అగస్త్యుడు దర్శనమిస్తాడు. అగస్త్యుడు రామునికి దివ్యాస్త్రాలను ప్రసాదిస్తాడు, వీటిని రాక్షసులను జయించేందుకు ఉపయోగించవచ్చు. మహర్షి మంత్రిద్వారా రాముడు ఆత్మశక్తిని పెంపొందించుకుంటాడు. సీత మరియు లక్ష్మణుడు అగస్త్యుని ఆశీస్సులు పొందుతారు. ఈ సర్గ రాముని ధైర్యం, శక్తి, మరియు దివ్యాశ్రయంతో ప్రతిబింబిస్తుంది. అగస్త్యుడి ఆశీస్సులతో, రాముడు తన కర్తవ్యాన్ని మరింత నిబద్ధతతో స్వీకరిస్తాడు. ఈ సంఘటనలు రామాయణ కథలో మరింత చైతన్యాన్ని కలిగిస్తాయి.
భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి. కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయ ములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు.
ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోని ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి.
తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామ మునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి రాజ్యప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. రాముడు వచ్చేవరకూ అక్కడే వేచి ఉంటాను.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు అందరూ తమ ఆమోదమును తెలిపారు.
వెంటనే రథము సిద్ధ చేయమన్నాడు భరతుడు. తల్లులందరికీ నమస్కరించి భరతుడు రథం ఎక్కాడు. శత్రుఘ్నుడు భరతుని అనుసరించాడు. వసిష్ఠుడు, గురువులు, బ్రాహ్మణులు వారిని అనుసరించారు. అందరూ నందిగ్రామము చేరుకున్నారు. పురప్రముఖులు కూడా వారి వెంట నంది గ్రామమునకు వెళ్లారు.
భరతుడు కుల గురువు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు. “గురువర్యా! మా అన్న రాముడు ఈ రాజ్యభారమును నాయందు ఉంచాడు. ఆయనకు బదులు ఆయన పాదుకలు నాకు ఇచ్చాడు. రాజలాంఛనములు, ఛత్రచామరములు అన్నీ ఈ పాదుకలకు జరుగుతాయి. రాజ్యపాలన ఈ పాదుకలే నిర్వహిస్తాయి. రాముడు తిరిగి వచ్చువరకూ ఈ పాదుకల సాక్షిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను. రాముడు తిరిగి వచ్చిన తరువాత నేనే స్వయంగా ఈ పాదుకలు రాముని పాదములకు తొడిగి ఆయన పాదములకు నమస్కరిస్తాను. తరువాత ఆయన రాజ్యము ఆయనకు అప్పగించి రామునికి పట్టాభిషేకము చేస్తాను. అయోధ్య ప్రజలందరూ రాముని పరిపాలనలో సుఖంగా ఉంటారు.”అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పట్టాభిషేకము జరిపించాడు. రాముని బదులు అయోధ్యను పాలిస్తున్నాడు. రాముడికి లేని సుఖాలు నాకు ఎందుకు అని జటలు, నారచీరలు ధరించాడు భరతుడు. ప్రతిరోజూ తాను నిర్వహించిన రాజ్యపాలనా విశేషములను ఆ పాదుకలకు నివేదించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆ పాదుకలకు నివేదించేవాడు భరతుడు. రామునికి సేవకుడి వలె రాజ్యపాలన సాగించాడు భరతుడు. ఎవరు ఏమి తెచ్చి ఇచ్చినా, ఏ కానుకలు వచ్చినా అవన్నీ పాదుకలకు సమర్పించేవాడు భరతుడు. ఆ ప్రకారంగా భరతుని రాజ్యపాలన సాగిపోయింది.
అయోధ్యాకాండలోని 113వ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు తమ వనవాసం కొనసాగిస్తూ అరణ్యమార్గంలో ప్రయాణిస్తారు. ఈ సర్గలో వారు అరణ్యంలోని భయానక ప్రాణుల నుంచి, దుర్గమ మార్గాల నుంచి రక్షణ కోసం కష్టపడతారు. సీత తన భర్త రాముని ధైర్యాన్ని ప్రోత్సహిస్తూ, లక్ష్మణుడి సేవను ప్రశంసిస్తుంది. రాముడు తన సీతను రక్షించేందుకు ప్రతిన బద్ధుడై ఉంటాడు, లక్ష్మణుడు తన అన్నకు మద్దతు అందిస్తూ భక్తి పూర్వకంగా ఉంటాడు. ఈ సర్గలోని సంఘటనలు వారి బలాన్ని, ధైర్యాన్ని, మరియు పరస్పర ప్రేమను ప్రతిబింబిస్తాయి. అరణ్యవాసం వారిని శారీరకంగా, మానసికంగా పరీక్షిస్తుంది, కానీ వారు ధైర్యంగా ముందుకు సాగుతారు.
భరతుడు, శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు, వసిష్ఠుని తో సహా అందరూ అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారు. భరతుడు రాముని పాదుకలను గౌరవ పురస్సరంగా తన శిరస్సుమీద ధరించాడు. వారందరూ చిత్రకూటపర్వతమును దాటి మందాకినీ నది వైపుకు ప్రయాణం చేసారు. భరద్వాజ ఆశ్రమమునకు చేరుకున్నారు.
భరతుడు, వసిష్ఠుడు వెంటరాగా భరద్వాజుని దర్శనార్థము వెళ్లాడు. భరతుని చూచి భరద్వాజుడు కుశల ప్రశ్నలు వేసాడు. వెళ్లిన కార్యము సఫలము అయిందా అని అడిగాడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు.
“మహాత్మా! నేను రాముని అయోధ్యకురమ్మని పలువిధముల ప్రార్థించాను. రాముడు అంగీకరించలేదు. “నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉండెదను” అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు.
అప్పుడు కులగురువు వసిష్ఠుడు రాముని తో ఇలా అన్నాడు. “రామా! ఇవిగో బంగారముతో చేసిన పాదుకలు. వీటిని నీవు తొడుగుకొని వాటిని మాకు ఇమ్ము. ఇవి నీ ప్రతినిధిగా మనసులో తలంచి, భరతుడు అయోధ్యను పాలిస్తాడు.” అని అన్నాడు. రాముడు సంతోషంతో అంగీకరించాడు. రాముడు తూర్పు వైపుకు తిరిగి ఆ బంగారు పాదుకలను తొడుగుకొన్నాడు. వాటిని నాకు ఇచ్చాడు. నేను ఆ పాదుకలను రామునికి బదులుగా స్వీకరించాను. రాముని అనుజ్ఞ తీసుకొని నేను ఈ రామ పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళు తున్నాను.” అని అన్నాడు భరతుడు.
“భరతా! నీవు సుగుణ శీలుడవు. పుణ్యాత్ముడవు. నీ వంటివాడు దశరథునికి కుమారుడిగా జన్మించడం ఆయన అదృష్టం. నీవలన నీ తండ్రి కీర్తిని పొందాడు.” అని అన్నాడు భరద్వాజుడు. తరువాత భరతుడు భరద్వాజునకు నమస్కరించి తన పరివారముతో సహా అయోధ్యకు ప్రయాణము అయ్యాడు. వారందరూ గంగానదిని దాటి శృంగిబేరపురము ప్రవేశించారు. అక్కడ గుహుని కలుసుకొని, అయోధ్యకు ప్రయాణం అయ్యారు. భరతుడు అయోధ్యకు చేరుకున్నాడు. రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉండటం చూచాడు భరతుడు.
అయోధ్యాకాండలోని 112వ సర్గలో, రాముడు సీతను, లక్ష్మణుడిని తీసుకుని చిత్తుర్థానంవైపుగా ప్రయాణిస్తాడు. ఈ సర్గలో వారు ప్రస్తుతిస్తున్న ప్రకృతి దృశ్యాలు సుందరంగా వర్ణించబడ్డాయి. దారిలో సీత తన భర్త రామునికి ప్రణయాన్ని, భక్తిని ప్రదర్శిస్తుంది. రాముడు సీతకు భద్రతను, ప్రేమను అందిస్తాడు. లక్ష్మణుడు తన అన్నకు సేవ చేయడం వల్ల సంతోషిస్తున్నాడు. ఈ సర్గలో వారు అనేక అవాంతరాలను ఎదుర్కొంటారు, కానీ రాముని ధైర్యం, సీతకున్న విశ్వాసం, లక్ష్మణుడి భక్తి వారిని ముందుకు నడిపిస్తాయి. ఈ ప్రయాణం రామాయణ కథలో కీలకమైన ఘట్టం.
ఆ ప్రకారంగా రాముడు, భరతుని మధ్య జరిగిన వాదోప వాదములు చూచి, విని అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. వారంతా రాముని ధర్మనిరతిని ప్రశంసించారు. అక్కడ ఉన్న ఋషులు భరతునితో ఇలా అన్నారు.
“భరతా! నీవు గొప్పవంశములో జన్మించావు. సకల శాస్త్రములు అభ్యసించావు. బుద్ధిమంతుడవు. నీ అన్న రాముడు ఎలా చెబితే అలా చెయ్యి. రాముని బలవంత పెట్టకు. నీ తండ్రి దశరథుడు తన భార్య ఋణము తీర్చుకొని స్వర్గానికి వెళ్లాడు. రాముడు తండ్రి ఋణము తీర్చుకుంటున్నాడు. కాబట్టి రాముని వనవాసము చెయ్యనివ్వు.” అని చెప్పారు. తరువాత వారు ఎవరి ఆశ్రమములను వారు వెళ్లిపోయారు. కాని భరతునికి మాత్రము వారి మాటలు రుచించలేదు. ఆఖరి ప్రయత్నంగా, మాటలు తొట్రుపడుతుంటే గద్గద స్వరంతో, వణుకుతూ, చేతులు జోడించి, భయం భయంగా రామునితో ఇలా అన్నాడు.
“అన్నయ్యా! రాజధర్మము, కులధర్మము ప్రకారము పెద్దవాడే రాజుగా ఉండాలి కానీ చిన్నవాడు కాదు. ఇప్పుడు నీవు రాజధర్మము నకు కులధర్మమునకు విఘాతము కలిగించకు. నా మాట నా తల్లి మాట మన్నించు. అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టు. ఎందుకంటే నేను నీ కన్నా చిన్నవాడిని. ఈ రాజ్యభారము మోయలేను. నేను అసమర్థుడను. మన బంధువులు మిత్రులు అందరూ నీవే రాజు కావాలని ఎదురు చూస్తున్నారు. వారందరి దృష్టిలో నీవే రాజు కావడానికి సమర్థుడివి. కాబట్టి వెంటనే అయోధ్యకు బయలుదేరు.” అని అన్నాడు భరతుడు. అనడమే కాదు. రాముని పాదముల మీద పడి ప్రార్థించాడు. రాముడు భరతుని రెండు చేతులతో లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని తల ప్రేమతో నిమిరాడు.
“భరతా! నీవు సామాన్యుడివి కావు. బుద్ధిమంతుడివి. గురువుల దగ్గర అన్ని విద్యలూ నేర్చుకున్నావు. నీవు రాజ్యమును పాలించడానికి సమర్థుడివి. అధైర్యపడకు. ధైర్యంగా అయోధ్యకు వెళ్లు. రాజ్యాధికారము చేపట్టు. నీకు తోడుగా కులగురువు వసిష్ఠులవారు, అమాత్యులు, సైన్యాధిపతులు ఉన్నారు. వారి సాయంతో రాజ్యము పాలించు. అంతేగాని నన్ను అయోధ్యకు రమ్మని కోరకు.
చంద్రుడు తన వెన్నెలను కోల్పోయినా, హిమవత్పర్వతము తన చల్లదనాన్ని కోల్పోయినా, సముద్రము చెలియలి కట్టదాటినా, నేను మాత్రము తండ్రి ఆజ్ఞను అతిక్రమించను, అయోధ్యకు రాను. మరొకమాట. నీ తల్లి మితి మీరిన ఆశవలననో, నీ మీద ఉన్న అధిక ప్రేమ వలననో ఇదంతా చేసింది. ఫలితం మనం ఇద్దరం అనుభవిస్తున్నాము. నాతో పాటు సీత, లక్ష్మణుడు అనుభవిస్తున్నారు
గతం గత: అంతా మరిచిపో. నీ తల్లి కేవలం నిమిత్త మాత్రురాలు. ఇప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆమెను ఏమీ అనవద్దు. దూషించవద్దు. ఒక కొడుకు తల్లిని గౌరవించినట్టు గౌరవించు. ఆమె మనసు బాధపెట్టకు.” అని హితబోధ చేసాడు రాముడు.
అప్పుడు భరతుడు బంగారముతో చేసిన పాదుకలు తెప్పించాడు. రాముని పాదముల వద్ద పెట్టాడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఇవి బంగారముతో చేసిన పాదుకలు. వీటిమీద నీ పాదములు ఉంచు. ఇవే నాకు శిరోధార్యములు. ఇంక నుంచి ఈ రామ పాదుకలే అయోధ్యను నీకు బదులుగా పాలిస్తాయి. నేను కేవలం నీ ప్రతినిధిని మాత్రమే. నీ ప్రతినిధిగా అయోధ్యను పాలిస్తాను.” అని అన్నాడు.
రాముడు భరతుని మాటలను మన్నించాడు. ఆ పాదుకల మీద తన పాదములను పెట్టి ఆ పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించాడు.
“రామా! నేటి నుంచి ఈ పాదుకలు నాకు దిశానిర్దేశము చేస్తాయి. నేను కూడా నీ మాదిరి నారచీరలు, జటలు ధరిస్తాను. అయోధ్య బయట ఆశ్రమము వేసుకొని ఉంటాను. అక్కడ ఈ పాదుకలను ప్రతిష్ఠిస్తాను. నీకు ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాను. నీరాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను.
రామా! ఈ పదునాలుగు సంత్సరములు గడువు పూర్తి అచిప మరునాడు నువ్వు అయోధ్యకు రావలెను. అలా రాకపోతే ఆరోజే నేను అగ్నిప్రవేశము చేస్తాను.” అని పలికాడు భరతుడు. రాముడు భరతుని మాటలకు అంగీకరించాడు. శత్రుఘ్నుని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు. తరువాత భరతుని చూచి ఇలా అన్నాడు.
“భరతా! నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమెపై కోపించవద్దు. నీవు ఆమెను చిన్న మాట అన్నా నామీద, సీత మీద ఒట్టు.” అని అన్నాడు. కళ్లనిండా నీళ్లు నిండగా రాముడు భరతునికి వీడ్కోలు పలికాడు. భరతుడు రాముని పాదుకలకు పూజచేసాడు. వాటిని భద్రగజము మీద రాజు కూర్చునే స్థానములో పెట్టాడు. అయోధ్యకు ప్రయాణం అయ్యాడు. రాముడు అయోధ్యనుండి వచ్చిన వారికి సాదరంగా వీడ్కోలు పలికాడు. రాముడు తన తల్లులందరికీ పాద నమస్కారము చేసాడు. దు:ఖము ఆపుకోలేక పర్ణశాలలోకి వెళ్లిపోయాడు.
ఇంతటితో అయోధ్య గురించిన వారసత్వపు వివాదము ముగిసింది. అది త్రేతాయుగము. ధర్మం మూడు పాదాలతో నడిచింది అని పెద్దలు చెబుతారు. రాముడు, భరతుడు రాజ్యం నీది అంటే నీది అను వాదులాడుకున్నారు. అప్పనంగా అయాచితంగా వచ్చిన రాజ్యాన్ని తీసుకోడానికి రాముడు ఇష్టపడలేదు. తనది కాని దానిని అనుభవించడానికి భరతుడు ఇష్టపడలేదు. ఇదే ఆనాటి ధర్మము.
ద్వాపరం లో అలా కాదు. అంతా నాదే. నీకు ఏమీ లేదు. అనేది దుర్యోధనుడి మనస్తత్వం. కనీసం నా భాగం అన్నా నాకు ఇవ్వు. లేకపోతే చావగొట్టి తీసుకుంటాను అనేది ధర్మరాజు మనస్తత్వం. యుద్ధం ఎందుకు దండగ– పాచికలు ఉండగా. ఒక్క రక్తం బొట్టు చిందకుండా పేకాటలో సర్వస్వం గెల్చుకుందాము, ఎదుటి వాడి తల గొరిగిద్దాము అన్నది శకుని మనస్తత్వము. అందరికీ అన్నిమాటలు చెబుతూ, తాను మాత్రం అంటీముట్టనట్టు జితేంద్రియుడిలాగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇదీ ద్వాపర యుగ ధర్మము.
ఇంక కలియుగ ధర్మము మనం చూస్తూనే ఉన్నాము. అందినంత వరకూ దోచుకోవడం. ఆఖరుకు జైలుపాలవడం. బంగారు పళ్లాలలో తిన్న వారు, సత్తుకంచాలలో, చిప్పకూడు తినడం వారి జీవితాలలో పరాకాష్ట. నాకు, నా కొడుకులకు, నా మనుమలకు, మునిమనుమలకు కూడా ఆస్తి సంపాదించాలి అన్న అత్యాశతో అన్ని అక్రమాలు చెయ్యడం. అడ్డం వచ్చిన వాళ్లను అడ్డంగా నరికెయ్యడం. ఇదీ నేటి కలియుగ ధర్మము.
యుగ యుగానికీ ధర్మం మారుతూ ఉంటుంది. మనుషుల మనస్తత్వాలూ మారుతుంటాయి. కాని, నాడూ జాబాలి లాంటి నాస్తిక వాదులు ఉన్నారు. నేడూ రాముడు, కృష్ణుడు లాంటి జితేంద్రియులూ ఉ న్నారు. (రమణ మహర్షి, కంచి పరమాచార్య, మొదలగు వారు). మంచి చెడూ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే చెడు వైపుకు ఆకర్షితులైనంత త్వరగా మంచి వైపు ఆకర్షితులం కాము. అదే మానవ బలహీనత. ఈ బలహీనతలను జయించిన వాడు రాముడు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు.
నేడు రామాలయం లేని ఊరు లేదు. “శ్రీరామ” రాయని పత్రమూ లేదు. రామనామం చెయ్యని భక్తుడూ లేడు. రామరాజ్యం రావాలని కోరని వాడూ లేడు. ఇంతకూ రామరాజ్యం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? అందరూ తలొకవిధంగా చెబుతారు. కాని దీనికి రాముడి జీవితమే జవాబు. రాముడు తన జీవితం ద్వారా రెండు విషయాలు ప్రపంచానికి చెప్పాడు. ఒకటి తనది కాని దానికి ఆశించక పోవడం. రెండవది పెద్దల మాట పాటించడం. తండ్రి ఆజ్ఞను శిరసావహించడం. ఈరెండు గుణాలు నేడు ఎవరిలోనూ లేవు.
అంతర్లీనంగా రాముడు తన నడవడి ద్వారా మరొక విషయం కూడా చూచాయగా చెప్పాడు. అదేమిటంటే…..
దశరథుడు మహారాజు. మహారాజు ఆదేశాలను పాటించడం పౌరుల ధర్మము. ఒక సామాన్య మానవుడిగా రాముడు మహారాజు ఆదేశాలను పాటించాలి. అదే చేసాడు రాముడు. అంతేగానీ మహారాజు ఇచ్చిన ఆదేశాల వెనక ఉన్న కారణాలు వెదక లేదు. రాజు చెప్పాడు. నేను పాటించాలి. రాజు ఎప్పుడూ తప్పు చెయ్యడు. ఒకవేళ రాజు తప్పు చేసినా ప్రజలు దానిని ప్రశ్నించకూడదు. అదీ రాముడు ప్రతిపాదించిన ధర్మం. అందుకే రాముడు దేవుడు అయ్యాడు.
ఈనాడు మనము దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. ప్రభుత్వము ఆదేశాలను పాటించకపోవడం మనకు దైనందిన కృత్యము అయిపోయింది. ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం, ప్రభుత్వ ధనాన్ని అపహరించడం అలవాటయిపోయింది. పెద్ద వాళ్లను గౌరవించడం, తల్లితండ్రుల మాటలను మన్నించడం ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. గురువులను గౌరవించడం మహా పాపం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు విద్యార్ధులు. తండ్రిగా భావించవలసిన గురువులతో ప్రేమాయణాలు సాగిస్తున్నారు నేటి విద్యార్ధినులు.
గురువులు కూడా తక్కువ తిన లేదు. క్లాసురూములలో పాఠాలు చెప్పడం మానేసి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ, రాజకీయాలలో మునిగితేలుతూ, రాజకీయ నాయకుల మాదిరి ప్రవర్తిస్తూ విద్యార్థులను స్కూళ్లకు పోవద్దనీ, కాలేజీలకు పోవద్దని బోధిస్తూ, రైళ్లు, బస్సులు ఆపమనీ, హింస చేయమనీ ప్రేరేపిస్తున్నారు. అలాంటప్పుడు మనది రామరాజ్యం ఎలా అవుతుంది. రామరాజ్యం అని ఎలా అనగలము. ఆలోచించండి.
ఇంక భరతుడు. కులధర్మం, రాజ ధర్మం గొప్పది అన్నాడు. క్షత్రియ కులంలో పెద్ద వాడు రాజు కావడం సాంప్రదాయం. దానిని పాటించమన్నాడు. వసిష్ఠుడు కూడా ఇక్ష్వాకు వంశచరిత్రను ఏకరువుపెట్టాడు. కాని రాముడు చలించలేదు. తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు.
వీరి మధ్యలో లక్ష్మణుడు ఒక వాదాన్ని లేవదీసాడు. అందులో ఒకటి రెండు న్యాయ సూత్రాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. లక్ష్మణుడు ప్రతిపాదించిన మొదటి సూత్రము. కైక వరాలు అడిగింది. దశరథుడు ఇస్తాను అన్నాడు. అడగడం, ఇవ్వడం, పుచ్చుకోడం వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం. అంతే కాని మూడవ వ్యక్తి అయిన రామునికి ఆ ఒప్పందంతో ఎలాంటి సంబంధము లేదు. దశరథుడు కైకకు వరాలు ఇవ్వడం వలన మూడవ వ్యక్తి నష్టపోకూడదు. కాని దశరథుడు కైకకు ఇచ్చిన వరాల వల్ల రాముడు అంటే మూడవ వ్యక్తి నష్టపోయాడు. ఇది అధర్మము. ఇతరులకు నష్టం, కష్టం కలిగించని రీతిలో దశరథుడు ఎన్ని వరాలు అయినా ఇవ్వవచ్చు. కైక పుచ్చుకోవచ్చు. కాని ఆ వరాలు ఇవ్వడం వల్ల మూడవ వ్యక్తి నష్టపోతే ఆ వరాలను, దాని మూలంగా రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించనవసరం లేదు. రాముడిని కాదని భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యవచ్చు. కానీ రాముడు అడవులకు పోవడం దేనికి. ఇదీ లక్ష్మణుని వాదన.
ఈ రోజుల్యో సర్వీసు రూల్సులో ఇది పాటిస్తున్నారు. పైవాడికి అనుగ్రహం కలిగితే ప్రమోషన్లు, అన్ని నిబంధనలను తుంగల్లో తొక్కి యధేచ్ఛగా ఇస్తున్నారు. కాని ఆ ప్రమోషను ఇవ్వడం ద్వారా మూడవ వ్యక్తికి నష్టం కలిగించకూడదు. అది చట్టవిరుద్ధం. అలా మూడవ వ్యక్తికి నష్టం జరిగితే కోర్టు జోక్యం చేసుకొని ఆ నష్టాన్ని నివారిస్తుంది.
మీరు అధిక ప్రసంగం అని అనుకోకపోతే ఇక్కడ నా స్వానుభవం వివరిస్తాను. అప్పుడు నేను కోర్టుమాస్టరు గా హైకోర్టులో పనిచేస్తున్నాను. హైకోర్టులో అన్ని ఉద్యోగనియామకాలు ఛీఫ్ జస్టిస్ చేస్తాడు. అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టుకు, లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఒక అసిస్టెంటు రిజిస్ట్రారు పోస్టుఖాళీ అయింది. నా పైన నలుగురు సీనియర్సు ఉన్నారు. కాని వారు మెట్రిక్యులేట్సు. నేను లా గ్రాడ్యుయేట్. న్యాయప్రకారం, ధర్మ ప్రకారము ఆ పోస్టులో నన్ను నియమించాలి. కాని అప్పటి ఛీఫ్ జస్టిస్, కేవలం మెట్రిక్యులేట్ అయిన సీనియర్ను, ఆయన సెంట్రల్ లా మినిస్టరుకు తెలియడం వల్ల, అన్ని నిబంధనలను తోసి పుచ్చి అసిస్టెంటురిజిస్ట్రారు గా నియమించారు. “అయ్యా! మీరు మీ ఇష్టంవచ్చినవారిని ఇష్టం వచ్చినట్టు నియమించు కోవచ్చు. కానీ దానివలన ఇతరులకు అన్యాయం జరగకూడదు. అది రూలు.” అని మేము వాదించాము. కాని మా వాదన అరణ్య రోదన అయింది లెండి. న్యాయం చెయ్యవలసిన న్యాయమూర్తులే ఆశ్రిత పక్షపాతంతో అన్యాయాలకు పాల్పడుతుంటే, మనది రామరాజ్యం ఎలా అవుతుంది.
ఇంక రెండవ సూత్రం. దశరథుడు మహారాజు. ఇంటికి పెద్ద వాడు. రాజ్యము పిత్రార్జితము. దశరథుడు తన ఇష్టం వచ్చిన వాళ్లకు ఇవ్వడానికి వీలు లేదు. కులధర్మాన్ని పాటించి పెద్దవాడికే ఇవ్వాలి. కానీ దశరథుడు స్త్రీవ్యామోహంలో పడి చిన్నవాడైన భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అడ్డం వస్తాడని రాముని అడవులకు పొమ్మన్నాడు. ఇదంతా స్త్రీవ్యామోహంతో చేసాడు కాబట్టి రాముడికి తండ్రి ఆదేశాలను పాటించనవసరం లేదు. తండ్రి చేసిన పనులు చట్టరీత్యా చెల్లవు. ఈ నాడు కూడా ఈ సూత్రం అమలులో ఉంది. దీనినే పయస్ ఆబ్లిగేషన్ అంటారు. ఉమ్మడి కుటుంబంలో తండ్రి ఆస్తిని అజమాయిషీ చేస్తుంటాడు. కుటుంబక్షేమం కోసం అప్పులు చేస్తాడు. ఆస్తులు అమ్ముతాడు, కొంటాడు. తండ్రి చనిపోతే, తండ్రి చేసిన అప్పులకు కొడుకులు బాధ్యులు అవుతారు. కాని, కొడుకులు మైనర్లుగాఉ న్నప్పుడు, తండ్రి స్త్రీవ్యామోహంతోనో, జూదం ఆడటానికో అప్పులు చేస్తే కుటుంబ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే, కొడుకులు తండ్రి చేసిన పనులకు బాధ్యులు కారు. కొడుకులు ఆ అప్పులు తీర్చనవసరం లేదు. పైగా ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. తండ్రి చేసిన లావాదేవీలకు కట్టుబడనవసరం లేదు. ఇదీ నేటి సూత్రము. దీనినే నాడు లక్ష్మణుడు సూత్రప్రాయంగా ప్రతిపాదించాడు.
ఇది ఇలా ఉంటే, అయోధ్యా కాండ చదివిన తరువాత ఒక సందేహము వస్తుంది. కైక రాముని అల్లారుముద్దుగా పెంచింది. రాముడు అంటే ఎంతో ప్రేమ. అలాంటి కైక కేవలం ఒక దాసి చెప్పిన మాటలు విని రామునికి ఇంతటి అపకారము తలపెడుతుందా. ఒక వేళ పుత్రవ్యామోహంతో భరతునికి పట్టాభిషేకము చెయ్యాలని కోరినా, రాముని అడవులకు పంపుతుందా. అంత క్రూరంగా ప్రవర్తిస్తుందా! కాని కైక అలాఎందుకు చేసింది. ఎందుకు నిందలపాలయింది. దీని వెనక బలమైనకారణం ఏమైనా ఉందా! ఊహిస్తే ఉంది అని అనిపించక మానదు. ఇలా జరగడానికి అవకాశం ఉందేమో ఆలోచించండి..
దశరథుడికి హటాత్తుగా రాముడికి పట్టాభిషేకము చెయ్యాలని ఆలోచన వచ్చింది. అదీ మరునాడే. ఆలోచించుకోడానికి కూడా వ్యవధి లేదు. రాముని పిలిచి తన నిర్ణయం చెప్పాడు. కైకకు కూడా చెప్పలేదు. కాని కైకకు మంథర ద్వారా తెలిసింది. మొదట్లో ఆనందించింది. కాని ఆలోచించింది.
కైక సామాన్యురాలు కాదు. గొప్పరాజనీతిజ్ఞురాలు. భర్తకు రాజకీయాలలో చేదోడు వాదోడుగా ఉండేది. యుద్ధాలలో కూడా పాల్గొంది. దేవ దానవ యుద్ధంలో, దశరథుడి తోపాటు స్వయంగా తాను కూడా పాల్గొని యుద్ధం చేసింది. దశరథుని రెండు సార్లు ప్రాణాపాయస్థితినుండి కాపాడింది. కైక అంతటి వీరనారి. పూర్వాపరాలు ఆలోచించగల దిట్ట.
రాముడికి పట్టాభిషేకము అనగానే మొదట్లో సంతోషము కలిగినా, తరువాత కొంచెం భయం వేసింది. రాముడు చిన్నవాడు. యౌవనంలో ఉన్నాడు. రాజకీయాలు కొత్త. అస్సలు అనుభవం లేదు. ఇంతటి భారాన్ని మొయ్యలేడు. ఇప్పుడు రాముడు రాజు అయితే చిన్న వయసులో భోగలాలసుడు అయ్యే ప్రమాదం ఉంది. రాజ్యము అరాచకము అవుతుంది. రాముడికి తన రాజ్యము ఎంతవరకూ విస్తరించింది. ఏమేమి సామంత రాజ్యాలు ఉన్నాయి. మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఏమీ తెలియదు. పైగా దక్షిణ దిశలో దండకారణ్యంలో రాక్షస మూకలు తమ స్థావరాలను ఏర్పరచుకొని ఉన్నాయి. వారు ఇంకా ముందుకు చొచ్చుకొని వచ్చే ప్రమాదం ఉంది. రాక్షసులు మునులకు, జానపదులకు అపకారం చేస్తున్నారని, వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దానిని నివారించాలి.
ఈ పరిస్థితులలో రాముడు రాజు అయి అంత:పురంలో కూర్చుంటే అతనికి దేశం గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి రాముడు దేశాటన చెయ్యాలి. అడవులలో తిరగాలి. అక్కడి స్థితి గతులు తెలుసుకోవాలి. దానికి మార్గం వెతకాలి.” ఇదీ కైక ఆలోచన. కైక మరొక కోణంలోనుండి కూడా ఆలోచించింది. రాముడు కేవలం స్వలాభం కోసం పాటుపటేవాడా. లేక ప్రజా క్షేమం కోసం రాజ్యాన్ని కూడా త్యజించే జితేంద్రియుడా. రాముడు స్వార్థపరుడా లేక ప్రజల మేలుకోరేవాడా. అందుకే ఈ వరాలు కోరే నాటకం ఆడింది. అందుకే రాముని 14 సంవత్సరాలు అరణ్య వాసం చెయ్యాలి అని కోరింది. రెండవది భరతునికి పట్టాభిషేకము. ఇందులో రెండు సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
మొదటిది… నాటి న్యాయసూత్రాల ప్రకారం, రాముడు రాజ్యాన్ని తనకు తెలిసీ 14 ఏళ్లు అన్యాక్రాంతం చేస్తే, తిరిగి దానిని కోరే హక్కు లేదు. (అది ఈ రోజుల్లో అడ్వర్సుపోసేషన్ సూత్రం ప్రకారం 12 ఏళ్లుగా ఉంది. ) తన రాజ్యం పోతుందని తెలిసీ రాముడు అడవులకు పోతాడా. లేక తండ్రి మీద తిరగబడతాడా అని పరీక్షించవచ్చు.
రెండవది… రాముడు తిరిగి వస్తే భరతుడు తిరిగి రాజ్యం రామునికి ఇస్తాడా. లేక నీకు హక్కులేదు పొమ్మంటాడా! దీనితో భరతుని నిజాయితీ కూడా తేలిపోతుంది.
కాబట్టి కైక రాముని ఒక పరిపూర్ణ మహారాజుగా తీర్చిదిద్దాలని అనుకుంది. రాజ్యపాలన గురించి అవగాహన కలిగించాలి అనుకొంది. ప్రజల కష్టసుఖాలు రాముడు తెలుసుకోవాలి అనుకొంది. రాజ్యంలో శత్రువులను నాశనం చెయ్యడం, రాజ్య విస్తరణ ముఖ్యం అనుకొంది. ఇవన్నీ జరగాలంటే రాముడు దేశాటన చెయ్యాలి. అందుకే తన గుండెల నిండా బాధనునింపుకొని, కన్నీళ్లు ఆపుకుంటూ, మనసులోనే కుమిలిపోతూ, అత్యంత కఠినంగా ప్రవర్తించింది. అందరితోనూ ఛీ అనిపించుకుంది. నాడే రాముడు పట్టాభిషిక్తుడు అయి ఉంటే మనకు రామాయణం లేదు. రాముని గురించి అనుకొనే వాడే లేడు. మనకు రామాయణాన్ని అందించిన ఘనత కైకకు దక్కుతుంది. రాముని కీర్తి ఆసేతుహిమాచలము వ్యాపింపచేసింది. రాముడి రాజ్యాన్ని లంక దాకా విస్తరింపచేసింది. రాముని చేత రాక్షస సంహారం చేయించింది. అయోధ్యకు శత్రుశేషం లేకుండా చేసింది. కాని పుట్టెడు అపకీర్తిని మూట గట్టుకొంది. తుదకు భర్తను కూడా కోల్పోయింది. అంతటి త్యాగమూర్తి కైక. కాని అందరి మనసుల్లో ఒక స్వార్ధపరురాలిగా, చరిత్రహీనురాలిగా మిగిలిపోయింది కైక.
ఈ నాడు రాముని ఊరూరా, ఇంటింటా పూజించు కుంటున్నా మంటే దానికి మూలకారణం కైక అని మనం తెలుసుకుంటే, ఆమె జీవితం ధన్యం అయినట్టే. )
అయోధ్యాకాండములోని 111వ సర్గ సుందరమైన కవితా రూపంలో ఉంది. ఈ సర్గలో రాముడు, సీతను కోల్పోయిన తరువాత తన తల్లిని, మిత్రులను వదిలి అనేక కష్టాలను అనుభవిస్తున్నాడు. అతని భక్తులు మరియు ప్రజలు అతన్ని పరమ భక్తితో ఆరాధిస్తున్నారు. సీత కోసం వనములో రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. సీత రక్షణ కోసం హనుమంతుడు లంకకు ప్రయాణించి రావణుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ సర్గ రాముని ధైర్యం, భక్తి, మరియు సీతపై అతని ప్రేమను వివరంగా చర్చిస్తుంది.
వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశరాజుల నందరి గురించి చెప్పి, వారందరూ రాజధర్మమును పాటించారనీ, ఆ వంశముల రాజులందరూ జ్యేష్ణునికే పట్టం కట్టారనీ వివరించాడు. కానీ రాముడు ఏమీ మాట్లాడలేదు. వసిష్ఠుడు మరలా చెప్పనారంభించాడు.
“ఓరామా! జన్మఎత్తిన ప్రతివాడికీ ముగ్గురు గురువులు ఉంటారు. వారు తల్లి, తండ్రి, విద్యనేర్పిన గురువు. తండ్రి పురుషుని జన్మకు కారకుడవుతాడు. తల్లి జన్మనిస్తుంది. గురువు జ్ఞానమును ఉపదేశిస్తాడు. నేను నీ తండ్రిగారికీ. ఇప్పుడు నీకూ గురువును. గురువుచెప్పిన మాటలు వినడం లోకధర్మం. గురువు చెప్పిన మాటలు వినకపోతే నీవు పెద్దల మాటలను ఎదిరించినవాడివి అవుతావు.
నీకు సహజ గురువు నీ తల్లి కౌసల్య. ఆమె భర్తను పోగొట్టుకొని వృద్ధాప్యములో ఉంది. ఒకకుమారునిగా నీ తల్లికి సేవచేయడం నీ ధర్మం. నీ తల్లి సేవను మరిచి, నీవు అడవులలో ఉంటే నీవు నీ ధర్మమును అతిక్రమించిన వాడవు అవుతావు. భరతుడు నీ తమ్ముడు. చిన్న వాడి మాటలు మన్నించడం పెద్దల ధర్మము. కాబట్టి నీ తమ్ముని మాటలు మన్నించు. ఒక గురువుగా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.” అని పలికాడు వసిష్టుడు.
కులగురువు వసిష్ఠుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు రాముడు. గురువు గారికి నేరుగా ప్రత్యుత్తరం ఇచ్చి వారిని అగౌరవ పరచినట్టు కాకుండా, పక్కన ఉన్న వారితో అన్నట్టు ఇలా అన్నాడు.
“నా తల్లి, తండ్రి నన్ను పుట్టినప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచారు. నేను కోరకుండానే అన్నీ సమకూర్చారు. వారి ఋణం తీర్చుకోడం నా కర్తవ్యము. నా తండ్రి దశరథుని ఎదుట నేను ప్రతిజ్ఞ చేసాను. దానిని పాటించడం నా ధర్మము. నా తండ్రి ఇప్పుడు లేడని ఏవేవో కుంటి సాకులు చెప్పి ఆయనకు ఇచ్చిన మాటను అబద్ధం చేయలేను. కాబట్టి నేను అయోధ్యకు రాలేను. ఇది నా నిశ్చయము.” అని ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాడు.
రాముని మాటలు విన్న భరతుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! నీవు దర్భలు తీసుకొని వచ్చి ఇక్కడ పరుచు. రాముడు అయోధ్యకు వచ్చువరకు రాముని కదలనీయను. నేను ఇక్కడే పడుకుంటాను. ఆహారము, నీరు ముట్టను. రాముడు అయోధ్యకు రావడానికి అంగీకరించే వరకూ ఇక్కడే పడుకుంటాను.” అని అన్నాడు. (ప్రస్తుతము మన నాయకులు చేస్తున్న ఘోరావ్, హర్తాళ్, నిరాహారదీక్షలకు ఆద్యుడు భరతుడు అని చెప్పవచ్చు. కాని నిరాహారదీక్షలు చేసి చచ్చిన రాజకీయనాయకుడు ఒక్కడూ లేడు, ఒక్క పొట్టిశ్రీరాములు తప్ప.) భరతుని ఆదేశము మేరకు సుమంత్రుడు దర్భలు తెచ్చి అక్కడ పరిచాడు. ఇదంతా చూస్తున్న రాముడు భరతునితో ఇలా అన్నాడు.
“భరతా! ఏమిటీ పని. నేనేం పాడు పని చేసానని నీవు ఇలా దీక్ష చేస్తున్నావు. ఎవరైనా బ్రాహ్మణుని వద్ద అప్పుతీసుకొని ఎగవేస్తే, వారి ఇంటి ముందు, ఆ బ్రాహ్మణుడు ఇలా నిరాహార దీక్ష చెయ్యవచ్చు కానీ క్షత్రియులకు ఇది తగదు. కాబట్టి ఈ నిరశన వ్రతమును విడిచిపెట్టి అయోధ్యకు వెళ్లు.” అని అన్నాడు.
దీనితో భరతునికి తిక్కరేగింది. అక్కడ ఉన్న పురప్రముఖులను చూచి ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడకువచ్చి ఏం చేస్తున్నారు. ఎంత సేపటికీ నేను మాట్లాడటం తప్ప మీరు ఏమీ మాట్లాడరా. రాముని అయోధ్యకు తీసుకురావడినికి మీవంతు ప్రయత్నం చేయరా! మీరంతా అన్నగారికి చెప్పండి.” అని అన్నాడు భరతుడు.
అప్పుడు వారంతా భరతునితో ఇలాఅన్నారు.“భరతా! రాముడు అన్యాయంగా అధర్మంగా మాట్లాడుతుంటే ఆయనను వారించ వచ్చుగానీ, రాముడు ధర్మంగా, న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఆయనను మేము ఏమని వారించగలము. రాముడు చెప్పే ప్రతి మాటా యుక్తియుక్తముగా ఉంది. రాముడు తండ్రి మాటను మీరడం లేదు. అది ప్రతి పౌరుడి ధర్మము. ఆ ధర్మాన్నే రాముడు నెరవేరుస్తు న్నాడు. రాముడే తండ్రి మాటను కాదని రాజు అయితే ఇంక రాజ్యంలో రాముని మాట ఎవరు వింటారు. అది అరాచకానికి దారి తీస్తుంది. కాబట్టి రామునికి ఎదురు చెప్పలేము.” అని ముక్తకంఠంతో పలికారు పౌరులు.
రాముడు చిరునవ్వు నవ్వాడు. “భరతా! చూచావాపౌరులు ఏమంటున్నారో! వారిది ధర్మదృష్టి. అందుకే ధర్మం చెప్పారు. నీవు కూడా ధర్మం ఆలోచించు. నీ ప్రయత్నం మానుకో. అయోధ్యకు వెళ్లు.”అని అన్నాడు రాముడు. భరతుడు పైకి లేచాడు. ఆచమనం చేసాడు. అక్కడ సమావేశమయిన మంత్రులు, విద్వాంసులు, సేనానాయకులు, పురప్రముఖులను ఉద్దేశించి ఇలా అన్నాడు.
నా మాటలను శ్రద్ధగా వినండి. నేను ఎన్నడూ రాజ్యము నాకు ఇమ్మని నా తండ్రిని అడగలేదు. బలవంతం చేయలేదు. నేను రాజు కావాలని ఎన్నడూ నా తల్లి కైకతో అనలేదు. ఆమెను ఆ దిశగా ప్రేరేపించలేదు. నా తల్లి చేసిన పనికి నా అనుమతి లేదు. కాని దురదృష్టవశాత్తు ఈ పరిణామాలకు నేను కారణం అయ్యాను కాబట్టి నా తండ్రిగారి మాట ప్రకారము రామునికి బదులు నేను పదునాలుగు సంత్సరములు అరణ్య వాసము చేస్తాను. నన్ను వద్దు అనడానికి ఎవరికీ అధికారము లేదు.” అని అన్నాడు భరతుడు.
రాముడు ఆశ్చర్యంగా భరతుని వంక చూచాడు. ఒక్క నవ్వు నవ్వి ఇలా అన్నాడు. “పౌరులారా! నా తండ్రి గారి పాలనలో జరిగిన అమ్మకాలూ, కొనుగోళ్లు, కుదువలు, ఆయన చనిపోయినాడని రద్దు చేస్తామా. లేక మరొకరి పేరుతో మార్చుకుంటామా! లేదు కదా. ఇదీ అంతే. నా తండ్రి నన్ను అరణ్యములకు వెళ్లమన్నాడు. నేను అరణ్యము లకు వచ్చాను. ఇప్పుడు మా తండ్రిగారు లేరని నా ప్రతిజ్ఞను మార్చుకోలేము కదా! నాకు మారుగా భరతుడు అరణ్యవాసము చేయలేడు కదా! నాక ప్రతినిధిగా భరతుడు రాజ్యం చేయవచ్చుకానీ, అరణ్యవాసం చెయ్యడం హాస్యాస్పదము, జుగుప్సాకరము. నా తల్లి వరాలు కోరడం, నా తండ్రి ఆ వరాలు ఇవ్వడం, నేను అరణ్యములకు రావడం అన్నీ ధర్మబద్ధములే. భరతుడు రాజ్యం చేస్తాడు. అతనికి అన్నీ శుభాలే జరుగుతాయి. నేను తొందరలోనే వనవాసము నుండి తిరిగి వచ్చి లక్షణ, భరత, శత్రుఘ్నుల సాయంతో రాజ్యపాలన చేస్తాను.
భరతా! మహారాజు దశరథుడు నీకు రాజ్యము, నాకు వనములు ఇచ్చాడు. వాటిని మనం సమర్థవంతంగా పాలిద్దాము. మహారాజునకు అసత్యదోషం రాకుండా చేద్దాము. నేను చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించు” అని అన్నాడు రాముడు.
(అరణ్యంలో నేను శత్రు సంహారం చేసి అయోధ్యను శత్రుశేషం లేకుండా చేస్తాను. అంతవరకూ నీవు అయోధ్యను పాలించు అని రాముని మాటల్లోని భావము అని చెప్పవచ్చు.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టాత్రింశః సర్గం రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో సీతను వెతికే క్రమంలో రాముడు, లక్ష్మణుడు సీతను కనుగొనడానికి దండకారణ్యంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తుంది. సీతాపహరణం తర్వాత రాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రయాణిస్తూ, అక్కడి ఆత్మలతో సంభాషణలు జరుపుతారు.
రామాస్త్రమహిమా
కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమామ్ |
బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమః ||
1
నీలజీమూతసంకాశస్తప్తకాంచనకుండలః |
భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధః ||
“ఓ దానవేంద్రా! ఆ రోజుల్లో నేను మహా పరాక్రమంతో నాకు ఎదురు ఎవరూ లేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని. చేతిలో పరిఘను ఆయుధంగా ధరించి అడ్డం వచ్చిన మునులను, ఋషులను చంపుతూ, వారి మాంసము తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడిని.
ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్లము. మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథుని వద్దకు పోయి
“ఓ దశరథ మహారాజా! మారీచుడు అనే రాక్షసుని వలన మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి. వాడి వలన మాకు చాలా భయంగా ఉంది. నీవు రాముని పంపి మా యజ్ఞాలు మారీచుని బారి నుండి కాపాడు” అని అడిగాడు. దశరథుడు కొంచెం సేపు తటపటాయించి, తరువాత రాముని విశ్వామిత్రుని వెంట పంపాడు. రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు.
ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞమును భగ్నం చేయడానికి నా పరిఘను చేత పట్టుకొని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లాను. ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూచి రాముడు తన వింటికి నారి సంధించాడు. నేను రాముని వంక చూచాను. ఇంకా మీసములు కూడా రాని బాలుడు కదా అని రాముని గురించి నేను పట్టించుకోలేదు. నేను గబా గబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్లాను.
రాముడు ఒక బాణమునుసంధించి నా మీద ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి నూరుయోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను. ఏం జరిగిందో తెలుసుకొనేటప్పటికి నేను నట్టనడిసముద్రంలో ఉన్నాను. రాముడు నన్ను చంపాలనుకోలేదు అందుకని సముద్రంలో పడవేసాడు. లేకపోతే నీతో ఇలా మాట్లాడ టానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు. ఆ ప్రకారంగా సాగరజలాలలో పడ్డ నాకు ఎంతో సేపటికి గానీ స్పృహ రాలేదు. తరువాత నానా పాట్లు పడి లంకానగరం చేరుకున్నాను. తరువాత తెలిసింది నన్ను సాగరంలో పడేట్టు కొట్టిన తరువాత రాముడు నా తోటి రాక్షసుల నందరినీ సంహరించాడని.
ఓ రావణా! అప్పుడు రాముడు బాలుడు. ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకోలేదు. ఇప్పుడు చూచావుగా రాముని ప్రతాపము. 14,000 వేల మందిని ముహూర్తకాలంలో చంపాడు. కాబట్టి రాముడితో విరోధము పెట్టుకోకు. తరువాత నీ ఇష్టం.
లంకా నగరము దూరంగా సముద్రమధ్యలో ఉంది కాబట్టి లంకావాసులందరూ భోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నారు. నీ పుణ్యమా అని వారిని ఆ సుఖాలకు దూరం చెయ్యకు. సీత కారణంగా లంకానగరం నాశనం చెయ్యకు. ఇనుముతో కూడిన అగ్ని సమ్మెట దెబ్బలుతిన్నట్టు, నీవు రాజుగా ఉన్న కారణంగా లంకానగరం అంతా ఆపదలలో చిక్కుకుంటుంది. నీ మూలంగా రాక్షసులు అంతా మరణిస్తే, వారి భార్యలకు దిక్కు ఎవ్వరు. ఒక్క స్త్రీ కారణం ఎంతోమంది రాక్షసస్త్రీలను అనాధలుగా చేస్తావా! నువ్వు సీతను అపహరించినట్టు వాళ్లను కూడా ఎవరైనా అపహరిస్తే వాళ్లకు దిక్కెవ్వరు?
ఓ దానవేంద్రా! నీకు ఎంతో మంది అందమైన అప్సరసలవంటి భార్యలు ఉన్నారు కదా! ఇంకా ఈ పరభార్యల మీద నీకు ఎందుకయ్యా వ్యామోహము. పరదారాపహరణము పాపం అని తెలియదా! నా మాట విను. నీ భార్యలతో సంతృప్తి చెందు. వారితో సుఖించు. సీతను మరిచిపో. నీవు నాలుగు కాలాల పాటు నీభార్యలతో రాజభోగాలు అనుభవించాలంటే రామునితో వైరం పెట్టుకోకు.
నేను ఇన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే, రాముని కోపాగ్నిలో మాడి మసి అయిపోతావు. నీ లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. నీవు బంధు మిత్రులతో సహా యమసదనానికి ప్రయాణం కడతావు.” అని రావణునికి హితోపదేశం చేసాడు మారీచుడు.
మారీచుడు రావణుని వంక చూచాడు. రావణునిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తత్రింశః సర్గంలో, రావణుడు తన సహచరుడు మరీచుని రాముని కోసం మాయా మృగంగా మారమని ఆదేశిస్తాడు. మరీచుడు మొదట తిరస్కరించినా, రావణుడి బలవంతం చేయడంతో అంగీకరిస్తాడు. మరీచుడు అందమైన మృగంగా మారి రాముడి ఆశ్రమం వద్ద ప్రత్యక్షమవుతాడు.
“ఓ రాక్షసరాజా! నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్లు, ప్రియంగా మాట్లాడేవాళ్లు ఉంటారు కానీ నీకు హితము చెప్పేవాళ్లు ఉండరు. ఒకవేళ అలాంటి వాళ్లు ఉన్నా నీలాంటి రాజులు వాళ్లు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి.
నీవు ఎవరి మీద కైనా యుద్ధానికి పోయేముందు వారి గురించి తెలుసుకోడానికి గూఢచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు. వీరుడు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు.
ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానము. లేకపోతే నీకు సీతను అపహరించవలెనని ఆలోచన పుట్టదు. దానికి నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు, లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకా వాసులు అష్టకష్టాలు పడక తప్పదు.
ఓ రావణా! నీ వంటి వాడు రాజుగా ఉంటే, ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది. ఇంక అసలు విషయం చెబుతాను విను. రాముడు తండ్రిచేత వెళ్లకొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యమునుండి వెళ్లగొట్టబడేంత చెడ్డపనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు.
అసలు విషయం నేను చెబుతాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే, తల్లితండ్రుల మాట ప్రకారము అడవులకు వచ్చాడు రాముడు. కేవలము తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేగాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్ల గొట్టబడలేదు.
(ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అది ఇప్పుడు ఒక నానుడి అయిపోయింది.)
రామో విగ్రహవాన్ ధర్మ: సాధు: సత్య పరాక్రమః॥
రాజాసర్వస్య లోకస్య దేవానాం మఘవానిమ॥
రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు. నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రుని వలె సకలలోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడు తుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరుచేయునట్లు రాముని నుండి సీతను వేరుచేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది. రామ బాణము అనే మంటలలోకి నీవు శలభము వలె దూకపోతున్నావు. జాగ్రత్త. నా మాటవిను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్లకు. కోరి కోరి రాముని కోపజ్వాలలో పడి దగ్ధంకాకు.
రాముని రక్షణలో ఉన్నంత కాలము సీతను నీవు హరించలేవు. ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు. అందుకే కదా సమస్తరాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీతంటే ఎవరనుకున్నావు? అయోనిజ. మిథిలాధిపతి జనకమహారాజు కూతురు. ఆమె నీవంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు.
ఇటువంటి వ్యర్ధమైన పనికి ఎందుకు పూనుకుంటావు? సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ, రాజభోగములు అనుభవించవలసిన వాడివి. అర్ధాంతరంగా . జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటాడు. నాలుగు కాలాలపాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు. నా జోలికి రాకు.
నామాట మీద నమ్మకం లేకపోతే, నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడుకదా! అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారుచెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకొనే ముందు, రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగానీ తొందరపాటు నిర్ణయం తీసుకొని కష్టాలపాలుగాకు.
రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను. అప్పుడు నీకు తెలుస్తుంది, రామునితో వైరం మంచిదో కాదో!” అని మారీచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు.