Ayodhya Kanda Sarga 110 In Telugu – అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 110

అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ఒక ప్రముఖమైన భాగం. ఈ సర్గలో, భరతుడు, తన తండ్రి దశరథ మహారాజు మరణవార్త విని తీవ్రంగా దుఃఖిస్తాడు. అయోధ్యకు చేరుకున్న భరతుడు, తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమవుతాడు. ప్రజలమధ్య భరతుడు, తన తల్లిదండ్రుల పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, రాముని వనవాసానికి కారణమైన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. భరతుడు, కైకేయిని మందలించకుండానే ఆమెను క్షమిస్తాడు. ఈ సర్గ భక్తి, క్షమ, మరియు ధర్మానికి ఉన్న ప్రాధాన్యతను తెలుపుతుంది. భరతుడు తన అన్న రాముడి పట్ల ఉన్న ప్రేమను, తన తండ్రి పట్ల ఉన్న కృతజ్ఞతను అందరికీ చూపిస్తాడు.

ఇక్ష్వాకువంశకీర్తనమ్

క్రుద్ధమాజ్ఞాయ రామం తం వసిష్ఠః ప్రత్యువాచ హ |
జాబాలిరపి జానీతే లోకస్యాస్య గతాగతిమ్ || ౧ ||

నివర్తయితుకామస్తు త్వామేతద్వాక్యముక్తవాన్ |
ఇమాం లోకసముత్పత్తిం లోకనాథ నిబోధ మే || ౨ ||

సర్వం సలిలమేవాసీత్ పృథివీ యత్ర నిర్మితా |
తతః సమభవద్బ్రహ్మా స్వయంభూర్దైవతైః సహ |
స వరాహస్తతో భూత్వా ప్రోజ్జహార వసుంధరామ్ || ౩ ||

అసృజచ్చ జగత్ సర్వం సహ పుత్రైః కృతాత్మభిః |
ఆకాశప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్యావ్యయః || ౪ ||

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః || ౫ ||

వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతస్సుతః |
స తు ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోః సుతః || ౬ ||

యస్యేయం ప్రథమం దత్తా సమృద్ధా మనునా మహీ |
తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ || ౭ ||

ఇక్ష్వాకోఽస్తు సుతః శ్రీమాన్ కుక్షిరేవేతి విశ్రుతః |
కుక్షేరథాత్మజో వీరో వికుక్షిరుదపద్యత || ౮ ||

వికుక్షేస్తు మహాతేజాః బాణః పుత్రః ప్రతాపవాన్ |
బాణస్య తు మహాబాహురనరణ్యో మహాయశాః || ౯ ||

నానావృష్టిర్బభూవాస్మిన్న దుర్భిక్షం సతాం వరే |
అనరణ్యే మహారాజే తస్కరో నాపి కశ్చన || ౧౦ ||

అనరణ్యాన్మహాబాహుః పృథూరాజా బభూవ హ |
తస్మాత్ పృథోర్మహారాజస్త్రిశంకురుదపద్యత || ౧౧ ||

స సత్యవచనాద్వీరః సశరీరో దివంగతః |
త్రిశంకోరభవత్సూనుర్ధుంధుమారో మహాయశాః || ౧౨ ||

ధుంధుమారో మహాతేజాః యువనాశ్వో వ్యజాయత |
యువనాశ్వసుతః శ్రీమాన్ మాంధాతా సమపద్యత || ౧౩ ||

మాంధాతుస్తు మహాతేజాః సుసంధిరుదపద్యత |
సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ || ౧౪ ||

యశస్వీ ధ్రువసంధేస్తు భరతో రిపుసూదనః |
భరతాత్తు మహాబాహోరసితో నామ జాయత || ౧౫ ||

యస్యైతే ప్రతిరాజానో ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః || ౧౬ ||

తాంస్తు సర్వాన్ ప్రతివ్యూహ్య యుద్ధే రాజా ప్రవాసితః |
స చ శైలవరే రమ్యే బభూవాభిరతో మునిః || ౧౭ ||

ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతిః |
ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ || ౧౮ ||

భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః |
తమృషిం సముపాగమ్య కాలిందీ త్వభ్యవాదయత్ || ౧౯ ||

స తామభ్యవదద్విప్రో వరేప్సుం పుత్రజన్మని |
పుత్రస్తే భవితా దేవి మహాత్మా లోకవిశ్రుతః || ౨౦ ||

ధార్మికశ్చ సుశీలశ్చ వంశకర్తాఽరిసూదనః |
కృత్వా ప్రదక్షిణం హృష్టా మునిం తమనుమాన్య చ || ౨౧ ||

పద్మపత్రసమానాక్షం పద్మగర్భసమప్రభమ్ |
తతః సా గృహమాగమ్య దేవీ పుత్రం వ్యజాయత || ౨౨ ||

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
గరేణ సహ తేనైవ జాతః స సగరోఽభవత్ || ౨౩ ||

స రాజా సగరో నామ యః సముద్రమఖానయత్ |
ఇష్ట్వా పర్వణి వేగేన త్రాసయంతమిమాః ప్రజాః || ౨౪ ||

అసమంజస్తు పుత్రోభూత్ సగరస్యేతి నః శ్రుతమ్ |
జీవన్నేవ స పిత్రా తు నిరస్తః పాపకర్మకృత్ || ౨౫ ||

అంశుమానపి పుత్రోఽభూదసమంజస్య వీర్యవాన్ |
దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః || ౨౬ ||

భగీరథాత్ కకుత్స్థస్తు కాకుత్స్థా యేన విశ్రుతాః |
కకుత్స్థస్య చ పుత్రోఽభూద్రఘుర్యేన తు రాఘవాః || ౨౭ ||

రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః |
కల్మాషపాదః సౌదాసః ఇత్యేవం ప్రథితో భువి || ౨౮ ||

కల్మాషపాదపుత్రోఽభూచ్ఛంఖణస్త్వితి విశ్రుతః |
యస్తు తద్వీర్యమాసాద్య సహసైన్యో వ్యనీనశత్ || ౨౯ ||

శంఖణస్య చ పుత్రోఽభూచ్ఛూరః శ్రీమాన్ సుదర్శనః |
సుదర్శనస్యాగ్నివర్ణాగ్నివర్ణస్య శీఘ్రగః || ౩౦ ||

శీఘ్రగస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రశుశ్రుకః |
ప్రశుశ్రుకస్య పుత్రోఽభూదంబరీషో మహాద్యుతిః || ౩౧ ||

అంబరీషస్య పుత్రోఽభూన్నహుషః సత్యవిక్రమః |
నహుషస్య చ నాభాగః పుత్రః పరమధార్మికః || ౩౨ ||

అజశ్చ సువ్రతశ్చైవ నాభాగస్య సుతావుభౌ |
అజస్య చైవ ధర్మాత్మా రాజా దశరథః సుతః || ౩౩ ||

తస్య జ్యేష్ఠోఽసి దాయాదో రామ ఇత్యభివిశ్రుతః |
తద్గృహాణ స్వకం రాజ్యమవేక్షస్వ జనం నృప || ౩౪ ||

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజః |
పూర్వజే నావరః పుత్రో జ్యేష్ఠో రాజ్యేఽభిషిచ్యతే || ౩౫ ||

స రాఘవాణాం కులధర్మమాత్మనః
సనాతనం నాద్య విహంతుమర్హసి |
ప్రభూతరత్నామనుశాధి మేదినీమ్
ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః || ౩౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే దశోత్తరశతతమః సర్గః || ౧౧౦ ||

Ayodhya Kanda Sarga 110 Meaning In Telugu

సభలో జరుగుతున్న వాదోపవాదాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు కులగురువు వసిష్ఠుడు. ఎవరు చెప్పినా రాముడు ఒప్పుకోడంలేదు. జాబాలిమాటలతో రాముడు కోపగించుకున్నాడు అని అర్ధం అయింది వసిష్ఠునకు. జాబాలి సామాన్యుడు కాదు. అందుకని జాబాలి మాటలను సర్దిచెప్పడానికి ప్రయత్నం చేసాడు వసిష్ఠుడు.

“ఓ రామా! ఈ లోకంలో జనులు పుడుతూ చస్తూ ఉంటారనీ, పుణ్యలోకాలకు, పాప లోకాలకూ పోయి మరలా జన్మ ఎత్తుతుంటారనీ జాబాలికి కూడా తెలుసు. కానీ నిన్ను ఎలాగైనా అయోధ్యకు రప్పించాలనే తాపత్రయంతో అలా మాట్లాడాడు కానీ వేరు కాదు. ఇంతకూ ఈ సృష్టి ఎలా మొదలయిందో నాకు తెలిసినంత వరకూ చెబుతాను విను. ఈ సృష్టి ప్రారంభం కాక ముందు ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. ఆ జలంలో నుండి భూమి ఆవిర్భవించింది. తరువాత దేవతలు, బ్రహ్మదేవుడు పుట్టారు. తరువాత బ్రహ్మ వరాహ రూపంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు. ( విష్ణుదేవుడు వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు అని నానుడి కాని బ్రహ్మ దేవుడు వరాహావతారము ధరించాడని కొన్ని పురాణాలలో ఉంది అని పండితులఅభిప్రాయము.) శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మ నుండి మరీచి, కశ్యపుడు పుట్టారు. కశ్యపునికి సూర్యుడు కుమారుడు. సూర్యుని కుమారుడు మనువు. మనువుకుమారుడు ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు మొట్ట మొదటగా ఈ అయోధ్యను పాలించాడు. అందుకే మీ వంశమును ఇక్ష్వాకు వంశము అని పిలుస్తారు.

ఇక్ష్వాకు కుమారుడు కుక్ష్మి, కుక్షికి వికుక్షి అనే కుమారుడు పుట్టాడు. వికుక్షికి బాణుడు జన్మించాడు. బాణుడి కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడు ఈ దేశమును సుభిక్షంగా పరిపాలించాడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకుడు. ఆ త్రిశంకువే విశ్వామిత్రుని సాయంతో సశరీరంగా స్వర్గమునకు వెళ్లాడు. ఆ త్రిశంకుని కుమారుడు దుగ్ధుమారుడు, దుగ్ధుమారుని కుమారుడు యవనాశ్వుడు. ఆ యవనాశ్వుని కుమారుడు మాంధాత. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధి కుమారుడు ధృవసంధి. ధృవసంధికుమారుడు భరతుడు. (ఆ భరతుని పేరు మీదనే భారత దేశము, భరత ఖండము అని పిలువబడుతూ ఉంది.)

భరతుని కుమారుడు అసితుడు. ఈ అసితునికి ఒక కధ ఉండి. అసితునికి హైహయులు, తాలజంఘులు, శశిబిందువులు అనే రాజవంశీయులు శత్రువులు. వారు అసితుని రాజ్యము నుండి తరిమివేసారు. అసితుడు భార్యలతో సహా అడవులకు పారిపోయాడు. అప్పుడు అసితుని భార్యలు గర్భవతులు. అసితుని భార్యలకు ఒకరంటే ఒకరికి పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భం స్రావం అయేట్టు విషం పెట్టింది.

భృగు వంశమునకు చెందిన చ్యవనుడు హిమవత్పర్వతము మీద ఉంటున్నాడు. అసితుని భార్య కాళింది. కాళిందికే ఆమె సవతి విషం పెట్టింది. కాళింది చ్యవనుడి దగ్గరకు పోయి ఆయనకు నమస్కరించింది. “నీకు లోకముచే పూజింపబడేవాడు, ధార్మికుడు, మంచి శీలము కలవాడు, మీ వంశము నిలబెట్టేవాడు అయిన పుత్రుడు జన్మిస్తాడు” అని ఆశీర్వదించాడు.

చ్యవనుని ఆశీర్వాదము ఫలించి కాళిందికి సర్వలక్షణ సమన్వితుడైన కుమారుడు జన్మించాడు. విషమును విరిచి పుట్టాడు. కాబట్టి అతనికి సగరుడు అనే పేరు సార్థకమయింది. సగర చక్రవర్తి ఒక యజ్ఞము చేసాడు. యజ్ఞాశ్వమును వదిలిపెట్టాడు. ఆయజ్ఞాశ్వము మాయం అయింది. దానిని వెదికించే ప్రయత్నంలో సముద్రమును తవ్వించాడు. సముద్రమును తవ్వడానికి సగరుడు కారకుడు అయ్యాడు కాబట్టి ఆయనపేరు మీద సముద్రమునకు సాగరము అనే పేరు సార్థకమయింది.

సగరునకు అసమంజుడు అనే కుమారుడు పుట్టాడు. వాడుచిన్నప్పటినుండి పాపకృత్యాలకు అలవాటుపడ్డాడు. కాబట్టి సగరుడు అసమంజుని వదిలివేసాడు. (ఈ అసమంజుడి గురించే కైక వాదించింది. దానిని మంత్రులు తిప్పికొట్టారు). అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. (ఈ భగీరథుడే గంగను భూమి మీదికి తీసుకొని వచ్చాడు. అందుకే గంగానదికి భాగీరధి అనే పేరు వచ్చింది).

భగీరథుని కుమారుడు కకుత్సుడు. ఆ కకుమ్హుని పేరు మీద మీ వంశమునకు కాకుత్స్య వంశము అనేపేరు వచ్చింది. కకుతున రఘువుకుమారుడు. అతని పేరుమీదుగానే మీ వంశమునకు రఘువంశము అనే పేరు, మీ అందరికీ రాఘువులు అనే పేరు వచ్చింది. రఘువు కుమారుడు కల్మాషపాదుడు. కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రగుడు. అతని కుమారుడు మరువు. మరువుకుమారుడు ప్రశుశ్రువుడు.

అతని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడు మీ తండ్రి దశరథమహారాజు. నీవు ఆ దశరథుని పెద్దకుమారుడవు. మీ వంశములో అందరూ తమ పెద్దకుమారులకు రాజ్యాధికారము సంక్రమింపజేసారు. వంశపారంపర్యంగా పెద్దవాడివైన నీకు రాజ్యాధికారము లభించింది. అందుకని నీవు కాదనకుండా అయోధ్యను పాలించు. ఇక్ష్వాకు వంశములో ఇప్పటి వరకూ జ్యేష్టుడే రాజు అయ్యాడు. జ్యేష్టుడు ఉండగా చిన్నవాడు రాజుకావడం ధర్మవిరుద్ధము. కాబట్టి ఓ రామా! ఇప్పుడు నీవు నీ వంశ గౌరవమును వారు కాపాడుకుంటూ వస్తున్న రాజధర్మమును నాశనం చెయ్యవద్దు. నీ తండ్రి పరిపాలించినట్టు నీవు కూడాఅయోధ్యను పాలించు.” అని అన్నాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకాదశోత్తరశతతమః సర్గః (111) >>

Aranya Kanda Sarga 36 In Telugu – అరణ్యకాండ షట్త్రింశః సర్గః

Aranya Kanda Sarga 36 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్త్రింశః సర్గంలో, రాముడు సీతను మళ్లీ సాంత్విస్తాడు. రాముడు, లక్ష్మణుడితో కలిసి పంచవటిలో నివసిస్తుంటాడు. ఆ సమయంలో, శూర్పణఖా తన సోదరుడు ఖరుడికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతన్ని ప్రేరేపిస్తుంది. ఖరుడు తన రాక్షస సైన్యంతో రామునిపై దాడి చేయడానికి సిద్ధమవుతాడు.

సహాయైషణా

మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః |
ఆర్తోఽస్మి మమ చార్తస్య భవాన్ హి పరమా గతిః ||

1

జానీషే త్వం జనస్థానే యథా భ్రాతా ఖరో మమ |
దూషణశ్చ మహాబాహుః స్వసా శూర్పణఖా చ మే ||

2

త్రిశిరాశ్చ మహాతేజా రాక్షసః పిశితాశనః |
అన్యే చ బహవః శూరా లబ్ధలక్షా నిశాచరాః ||

3

వసంతి మన్నియోగేన నిత్యవాసం చ రాక్షసాః |
బాధమానా మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః ||

4

చతుర్దశసహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినామ్ ||

5

తే త్విదానీం జనస్థానే వసమానా మహాబలాః |
సంగతాః పరమాయత్తా రామేణ సహ సంయుగే ||

6

నానాప్రహరణోపేతాః ఖరప్రముఖరాక్షసాః |
తేన సంజాతరోషేణ రామేణ రణమూర్ధని ||

7

అనుక్త్వా పరుషం కించిచ్ఛరైర్వ్యాపారితం ధనుః |
చతుర్దశసహస్రాణి రక్షసాముగ్రతేజసామ్ ||

8

నిహతాని శరైస్తీక్ష్ణైర్మానుషేణ పదాతినా |
ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణశ్చ నిపాతితః ||

9

హతశ్చ త్రిశిరాశ్చాపి నిర్భయా దండకాః కృతాః |
పిత్రా నిరస్తః క్రుద్ధేన సభార్యః క్షీణజీవితః ||

10

స హంతా తస్య సైన్యస్య రామః క్షత్రియపాంసనః |
దుఃశీలః కర్కశస్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధోఽజితేంద్రియః ||

11

త్యక్త్వా ధర్మమధర్మాత్మా భూతానామహితే రతః |
యేన వైరం వినాఽరణ్యే సత్త్వమాశ్రిత్య కేవలమ్ ||

12

కర్ణనాసాపహరణాద్భగినీ మే విరూపితా |
తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమామ్ ||

13

ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్ర మే భవ |
త్వయా హ్యహం సహాయేన పార్శ్వస్థేన మహాబల ||

14

భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయే |
తత్సహాయో భవ త్వం మే సమర్థో హ్యసి రాక్షస ||

15

వీర్యే యుద్ధే చ దర్పే చ న హ్యస్తి సదృశస్తవ |
ఉపాయజ్ఞో మహాన్ శూరః సర్వమాయావిశారదః ||

16

ఏతదర్థమహం ప్రాప్తస్త్వత్సమీపం నిశాచర |
శృణు తత్ కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్మమ ||

17

సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజతబిందుభిః |
ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర ||

18

త్వాం తు నిఃసంశయం సీతా దృష్ట్వా తు మృగరూపిణమ్ |
గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిధాస్యతి ||

19

తతస్తయోరపాయే తు శూన్యే సీతాం యథాసుఖమ్ |
నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్రప్రభామివ ||

20

తతః పశ్చాత్సుఖం రామే భార్యాహరణకర్శితే |
విస్రబ్ధః ప్రహరిష్యామి కృతార్థేనాంతరాత్మనా ||

21

తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః |
శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవ సః ||

22

ఓష్ఠౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైరనిమిషైరివ |
మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత ||

23

స రావణం త్రస్తవిషణ్ణచేతా
మహావనే రామపరాక్రమజ్ఞః |
కృతాంజలిస్తత్త్వమువాచ వాక్యం
హితం చ తస్మై హితమాత్మనశ్చ ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్త్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 36 Meaning In Telugu PDF

మారీచుడు రావణుని కన్నా పెద్దవాడు. అందుకని రావణుడు మారీచుని గౌరవంగా సంబోధిస్తున్నాడు.

“ఓ తాతా! మారీచా! నేను చెప్పేమాటలను శ్రద్ధగా విను. ప్రస్తుతము నేను చాలా కష్టాలలో ఉన్నాను. నువ్వే నాకు మార్గం చూపించాలి. నా సోదరుడు ఖరుడు, దూషణుడు, వారి సేనాధిపతులు, 14,000 రాక్షస సేనలు, నరమాంస భక్షకుడైన త్రిశిరుడు, నా ఆజ్ఞమేరకు దండకారణ్యంలో స్థావరం ఏర్పరచుకొని జనస్థానంలో ఉంటున్నారు అని నీకు తెలుసు కదా!

ఈ మధ్య ఎవరో రాముడు అట. దండకారణ్యమునకు వచ్చాడు. మన వాళ్లు అతనిని ప్రతిఘటించారు. ఇద్దరి మధ్య పోరు సాగింది. మన వాళ్లు సాయుధులు, రథములు మొదలగు వాహనములు కలవారు. కాని ఆ రాముడు కేవలం ధనుస్సు మాత్రమే ఆయుధంగా కలవాడు. అతనికి ఏ వాహనమూ లేదు. కాని యుద్ధంలో రాముడు మన సేనలు 14,000 మందిని తుదముట్టించాడు. వారినే కాకుండా మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన ఖరుని, దూషణుని, త్రిశిరుని కూడా చంపాడు.

ఇంతకూ ఆ రాముడు ఎవరంటే, అయోధ్యా రాజు దశరథుని కుమారుడు. రాముడు చిన్నప్పటినుండి దుష్టుడు. దుర్మార్గుడు. ఇంద్రియలోలుడు. ఎప్పుడూ ఇతరులను హింసిస్తూ ఉండేవాడు. అధర్మపరుడు అటువంటి రాముని ఆగడములు సహించలేక అతని తండ్రి దశరథుడు రాముని, భార్యాసహితంగా దేశంనుంచి వెళ్లగొట్టాడు. ఆ రాముడు ఇప్పుడు దండకారణ్యమునకు వచ్చాడు. మనవాళ్లను అన్యాయంగా అక్రమంగా చంపాడు.

మారీచా! అంతేకాదు. రాముడు ఇంకో ఘోరం కూడా చేసాడు. తనకే కదా బలం, దర్భం ఉన్నాయని విర్రవీగుతూ, ఏ పాపమూ ఎరుగని నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసి తన భార్యముందు నా చెల్లెలును అవమానించాడు. దీనికి ప్రతీకారము చెయ్యాలని నిశ్చయించుకున్నాను. రాముడు నా చెల్లెలును అవమానించాడు. కాబట్టి నేను కూడా అతని భార్యను అవమానించాలి. రాముని భార్యను అపహరించి లంకకు తీసుకొని రావాలి.

ఈ కార్యంలో నాకు నీ సహాయం కావాలి. ఎందుకంటే, నీవు నా పక్కన ఉంటే నాకు కొండంత బలం. నీ సహాయంతో నేను దేవతలను కూడా జయించగలను. నాకు సాయం చెయ్యడానికి నీవే సమర్థుడవు. నీ కన్నా బలవంతుడు, పరాక్రమ వంతుడు ముల్లోకాలలో ఎవరున్నారు. నీకు బలము, పరాక్రమమేకాదు, చతురోపాయములలో కూడా ప్రావీణ్యం ఉంది. ఉపాయంతో ఏ కార్యమునైనా సాధించగల నేర్పు ఉంది.

పైగా నీకు ఎన్నో మాయలు తెలుసు. అందుకనే నీ దగ్గరకు వచ్చాను. నీ సాయం అర్ధిస్తున్నాను. ఇంతకూ నీవు చేయాల్సిన పని ఏమిటంటే….. రాముడు, అతని భార్య సీత, అతని తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాలలో నివసిస్తున్నారు. నీవు ఒక బంగారు వర్ణం కల లేడి రూపం ధరించి, సీతకు కనపడేటట్టు అటు ఇటు సంచరించు. నీ అందమైన రూపం చూచి. సీత తనకు ఆ బంగారు లేడి కావాలి అని రాముని అడుగుతుంది. నిన్ను పట్టుకోడానికి, ముందు రాముడు, తరువాత లక్ష్మణుడు నీ వెంట వస్తారు. నీవు వారికి అందకుండా దూరంగా పరుగెత్తు. రామలక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు.

అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నేను సీతను అపహరిస్తాను.

తన భార్య సీత లేకపోవడంతో రాముడు మానసికంగా, శారీరకంగా బలం కోల్పోతాడు. అప్పుడు సమయం చూచి నేను రాముని సంహరిస్తాను. యుద్ధములో ప్రాణాలు కోల్పోయిన 14,000 మంది రాక్షసులకు, నా సోదరులు ఖర, దూషణాదులకు ఆత్మశాంతి కలిగిస్తాను. నా చెల్లెలు రాముని మీద పెంచుకున్న పగ, ప్రతీకారము చల్లారుస్తాను. నాకీ సాయం చేసి పెట్టు.” అని బతిమాలాడు.

రావణుడు చెబుతున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు కానీ రాముని పేరు వినగానే మారీచునికి గొంతులో తడి ఆరిపోయింది. శరీరం వణికిపోయింది. పెదాలు ఎండిపోయాయి. అలాగే గుడ్లప్పగించి రావణుని వంక చూస్తున్నాడు. రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూచాడు. మారీచుడు ధైర్యము కూడగట్టుకొని గొంతు సవరించుకొని రావణునితో ఇలా అన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తత్రింశః సర్గః (37) >>

Aranya Kanda Sarga 35 In Telugu – అరణ్యకాండ పంచత్రింశః సర్గః

Aranya Kanda Sarga 35 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచత్రింశః సర్గంలో, రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యంలో నివసిస్తూ రాక్షసులను సంహరిస్తున్నాడు. శూర్పణఖా అనే రాక్షసి రాముని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ రాముడు తన భార్య సీతతో ఉండటం వల్ల ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖా లక్ష్మణుడిపై దాడి చేస్తుంది.

మారీచాశ్రమపునర్గమనమ్

తతః శూర్పణఖావాక్యం తచ్ఛ్రుత్వా రోమహర్షణమ్ |
సచివానభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామ సః ||

1

తత్కార్యమనుగమ్యాథ యథావదుపలభ్య చ |
దోషాణాం చ గుణానాం చ సంప్రధార్య బలాబలమ్ ||

2

ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః |
స్థిరబుద్ధిస్తతో రమ్యాం యానశాలాముపాగమత్ ||

3

యానశాలాం తతో గత్వా ప్రచ్ఛన్నో రాక్షసాధిపః |
సూతం సంచోదయామాస రథః సంయోజ్యతామితి ||

4

ఏవముక్తః క్షణేనైవ సారథిర్లఘువిక్రమః |
రథం సంయోజయామాస తస్యాభిమతముత్తమమ్ ||

5

కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితమ్ |
పిశాచవదనైర్యుక్తం ఖరైః కనకభూషణైః ||

6

మేఘప్రతిమనాదేన స తేన ధనదానుజః |
రాక్షసాధిపతిః శ్రీమాన్ యయౌ నదనదీపతిమ్ ||

7

స శ్వేతవాలవ్యజనః శ్వేతచ్ఛత్రో దశాననః |
స్నిగ్ధవైడూర్యసంకాశస్తప్తకాంచనకుండలః ||

8

వింశద్భుజో దశగ్రీవో దర్శనీయపరిచ్ఛదః |
త్రిదశారిర్మునీంద్రఘ్నో దశశీర్ష ఇవాద్రిరాట్ ||

9

కామగం రథమాస్థాయ శుశుభే రాక్షసేశ్వరః |
విద్యున్మండలవాన్ మేఘః సబలాక ఇవాంబరే ||

10

సశైలం సాగరానూపం వీర్యవానవలోకయన్ |
నానాపుష్పఫలైర్వృక్షైరనుకీర్ణం సహస్రశః ||

11

శీతమంగళతోయాభిః పద్మినీభిః సమంతతః |
విశాలైరాశ్రమపదైర్వేదిమద్భి సమావృతమ్ ||

12

కదల్యాఽఽఢకిసంబాధం నాలికేరోపశోభితమ్ |
సాలైస్తాలైస్తమాలైశ్చ పుష్పితైస్తరుభిర్వృతమ్ ||

13

నాగైః సుపర్ణైర్గంధర్వైః కిన్నరైశ్చ సహస్రశః |
ఆజైర్వైఖానసైర్మాషైః వాలఖిల్యైర్మరీచిపైః ||

14

అత్యంతనియతాహారైః శోభితం పరమర్షిభిః |
జితకామైశ్చ సిద్ధైశ్చ చారణైరుపశోభితమ్ ||

15

దివ్యాభరణమాల్యాభిర్దివ్యరూపాభిరావృతమ్ |
క్రీడారతివిధిజ్ఞాభిరప్సరోభిః సహస్రశః ||

16

సేవితం దేవపత్నీభిః శ్రీమతీభిః శ్రియావృతమ్ |
దేవదానవసంఘైశ్చ చరితం త్వమృతాశిభిః ||

17

హంసక్రౌంచప్లవాకీర్ణం సారసైః సంప్రణాదితమ్ |
వైడూర్యప్రస్తరం రమ్యం స్నిగ్ధం సాగరతేజసా ||

18

పాండురాణి విశాలాని దివ్యమాల్యయుతాని చ |
తూర్యగీతాభిజుష్టాని విమానాని సమంతతః ||

19

తపసా జితలోకానాం కామగాన్యభిసంపతన్ |
గంధర్వాప్సరసశ్చైవ దదర్శ ధనదానుజః ||

20

నిర్యాసరసమూలానాం చందనానాం సహస్రశః |
వనాని పశ్యన్ సౌమ్యాని ఘ్రాణతృప్తికరాణి చ ||

21

అగురూణాం చ ముఖ్యానాం వనాన్యుపవనాని చ |
తక్కోలానాం చ జాత్యానాం ఫలానాం చ సుగంధినామ్ ||

22

పుష్పాణి చ తమాలస్య గుల్మాని మరిచస్య చ |
ముక్తానాం చ సమూహాని శుష్యమాణాని తీరతః ||

23

శంఖానాం ప్రస్తరం చైవ ప్రవాలనిచయం తథా |
కాంచనాని చ శైలాని రాజతాని చ సర్వశః ||

24

ప్రస్రవాణి మనోజ్ఞాని ప్రసన్నాని హ్రదాని చ |
ధనధాన్యోపపన్నాని స్త్రీరత్నైః శోభితాని చ ||

25

హస్త్యశ్వరథగాఢాని నగరాణ్యవలోకయన్ |
తం సమం సర్వతః స్నిగ్ధం మృదుసంస్పర్శమారుతమ్ ||

26

అనూపం సింధురాజస్య దదర్శ త్రిదివోపమమ్ |
తత్రాపశ్యత్స మేఘాభం న్యగ్రోధమృషిభిర్వృతమ్ ||

27

సమంతాద్యస్య తాః శాఖాః శతయోజనమాయతాః |
యస్య హస్తినమాదాయ మహాకాయం చ కచ్ఛపమ్ ||

28

భక్షార్థం గరుడః శాఖామాజగామ మహాబలః |
తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః ||

29

సుపర్ణః పర్ణబహులాం బభంజ చ మహాబలః |
తత్ర వైఖానసా మాషా వాలఖిల్యా మరీచిపాః ||

30

అజా బభూవుర్ధూమ్రాశ్చ సంగతాః పరమర్షయః |
తేషాం దయార్థం గరుడస్తాం శాఖాం శతయోజనామ్ ||

31

జగామాదాయ వేగేన తౌ చోభౌ గజకచ్ఛపౌ |
ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తదామిషమ్ ||

32

నిషాదవిషయం హత్వా శాఖయా పతగోత్తమః |
ప్రహర్షమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్ ||

33

స తేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృతవిక్రమః |
అమృతానయనార్థం వై చకార మతిమాన్ మతిమ్ ||

34

అయోజాలాని నిర్మథ్య భిత్త్వా రత్నమయం గృహమ్ |
మహేంద్రభవనాద్గుప్తమాజహారామృతం తతః ||

35

తం మహర్షిగణైర్జుష్టం సుపర్ణ కృతలక్షణమ్ |
నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః ||

36

తం తు గత్వా పరం పారం సముద్రస్య నదీపతేః |
దదర్శాశ్రమమేకాంతే రమ్యే పుణ్యే వనాంతరే ||

37

తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణమ్ |
దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసమ్ ||

38

స రావణః సమాగమ్య విధివత్తేన రక్షసా |
మారీచేనార్చితో రాజా సర్వకామైరమానుషైః ||

39

తం స్వయం పూజయిత్వా తు భోజనేనోదకేన చ |
అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్ ||

40

కచ్చిత్ సుకుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర |
కేనార్థేన పునస్త్వం వై తూర్ణమేవమిహాగతః ||

41

ఏవముక్తో మహాతేజా మారీచేన స రావణః |
తం తు పశ్చాదిదం వాక్యమబ్రవీద్వాక్యకోవిదః ||

42

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 35 Meaning In Telugu

శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు. రావణుడు. సభచాలించాడు. మంత్రులకు దండనాధులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు.

శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారధిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేసాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు.

రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కింనరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన అరణ్యములను ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు.

రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును జలప్రాయ ప్రదేశము అని అంటారు. ఆ ప్రదేశములో ఒక పెద్ద వటవృక్షము ఉంది. దాని కొమ్మలు, ఊడలు నూరు యోజనముల మేర విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు మీద కొంత మంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వాలఖిల్యులు అనే ఋషులు కేవలము చంద్రకిరణములను మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఆ కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ తపస్సుచేసుకుంటున్నారు.

ఒక సారి గరుడుడు తన తల్లి దాస్య విముక్తి కొరకు స్వర్గలోకము నుండి అమృతము తీసుకొని రావడానికి వెళుతున్నాడు. ఆహారంగా ఒక ఏనుగును, ఒక తాబేలును రెండు కాళ్లతో పట్టుకొని ఎగురుతున్నాడు. అంతలో విశాలమైన ఈ వటవృక్షము కనిపించింది. గరుడుడు నూరుయోజనముల పొడవు గల ఒక బలిష్టమైన కొమ్మమీద ఆ గజ,కచ్ఛపములతో వాలాడు. గరుడుని బరువుకు ఆ కొమ్మ పెళపెళమని విరిగింది. ఆ కొమ్మ విరిగితే దాని మీద తపస్సు చేసుకుంటున్న ఋషులకు, వేలాడుతున్న వాలఖిల్యులకు తపోభంగము అవుతుందని, గజకచ్ఛపములను చెరి ఒక కాలితో పట్టుకొని, ఆ కొమ్మను నోట కరచుకొని మరలా పైకి ఎగిరాడు. వారిని ఒక సమతల ప్రదేశముమీద దింపి, ఆ కొమ్మను నిషాదులు ఉన్న చోట విసిరేసాడు. తరువాత గరుడుడు గజ కచ్ఛపములను ఆరగించి, తరువాత అమృతం తేవడానికి స్వర్గమునకు వెళ్లాడు. (ఈ కధ మహాభారతంలో ఉన్నది).

రావణుడు ఆ వటవృక్షమును దాటుకుంటూ వెళ్లాడు. అలా ప్రయాణిస్తూ రావణుడు సముద్రమును దాటాడు. సముద్రమునకు ఆవల ఉన్న ఒక ఆశ్రమమునకు వెళ్లాడు.

అది మారీచుడు అనే రాక్షసుని ఆశ్రమము. మారీచుడు జన్మత: రాక్షసుడే అయినా ముని వృత్తి స్వీకరించి, జటావల్కలములు ధరించి ఆ ఆశ్రమంలో తపస్సుచేసుకుంటున్నాడు. రావణుడు తన ఆశ్రమమునకు రావడం చూచాడు మారీచుడు. రావణునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత రీతిని సత్కరించాడు. రావణునికి భోజన, పానీయాలుసమకూర్చాడు. కాస్త సేద దీరిన తరువాత మారీచుడు రావణుని ఇలా అడిగాడు.

“రావణా! రాక రాక ఇన్నాళ్లకు ఈ మారీచుని ఆశ్రమానికి వచ్చావు. ఏమి కారణము? లంకలో అంతా క్షేమంగా ఉన్నారు కదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు. అప్పుడు రావణుడు మారీచునితో ఈ విధంగా ఉన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షట్త్రింశః సర్గః (36) >>

Ayodhya Kanda Sarga 109 In Telugu – అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 109

అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ఒక శోకకరమైన ఘట్టం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం వల్ల కలిగిన వేదనను తట్టుకోలేక మరణిస్తాడు. ఆయన మరణ వార్తను విని, కైకేయి తన చర్యల పట్ల పశ్చాత్తాపపడుతుంది. భారతుడు, శత్రుఘ్నుడు, తక్షిణ ప్రాంతం నుండి తిరిగి వస్తారు. అయోధ్యలో జరిగిన మార్పులు, రాజకుమారుల హృదయాన్ని బాధిస్తాయి. దశరథుని మరణంతో, భరతుడు ఆవేదనతో రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గ, కుటుంబ బంధాలు, బాధ్యత, మరియు పితృఋణాన్ని నొక్కి చెబుతుంది. ఇది భరతుడు తన అన్న రాముడి పట్ల చూపించే ప్రేమ, భక్తిని స్పష్టంగా చూపిస్తుంది.

సత్యప్రశంసా

జాబాలేస్తు వచః శ్రుత్వా రామః సత్యాత్మనాం వరః |
ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చావిపన్నయా || ౧ ||

భవాన్ మే ప్రియకామార్థం వచనం యదిహోక్తవాన్ |
అకార్యం కార్యసంకాశమపథ్యం పథ్యసమ్మితమ్ || ౨ ||

నిర్మర్యాదస్తు పురుషః పాపాచారసమన్వితః |
మానం న లభతే సత్సు భిన్నచారిత్రదర్శనః || ౩ ||

కులీనమకులీనం వా వీరం పురుషమానినమ్ |
చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వాఽశుచిమ్ || ౪ ||

అనార్యస్త్వార్యసంకాశః శౌచాద్ధీనస్తథా శుచిః |
లక్షణ్యవదలక్షణ్యో దుఃశీల శీలవానివ || ౫ ||

అధర్మం ధర్మవేషేణ యదీమం లోకసంకరమ్ |
అభిపత్స్యే శుభం హిత్వా క్రియావిధివివర్జితమ్ || ౬ ||

కశ్చేతయానః పురుషః కార్యాకార్యవిచక్షణః |
బహుమంస్యతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణమ్ || ౭ ||

కస్య ధాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయామ్ |
అనయా వర్తమానో హి వృత్త్యా హీనప్రతిజ్ఞయా || ౮ ||

కామవృత్తస్త్వయం లోకః కృత్స్నః సముపవర్తతే |
యద్వృత్తాః సంతి రాజానస్తద్వృత్తాః సంతి హి ప్రజాః || ౯ ||

సత్యమేవానృశంసం చ రాజవృత్తం సనాతనమ్ |
తస్మాత్సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః || ౧౦ ||

ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మేనిరే |
సత్యవాదీ హి లోకేఽస్మిన్ పరమం గచ్ఛతి క్షయమ్ || ౧౧ ||

ఉద్విజంతే యథా సర్పాన్నరాదనృతవాదినః |
ధర్మః సత్యం పరో లోకే మూలం స్వర్గస్య చోచ్యతే || ౧౨ ||

సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మా శ్రితా సదా |
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్ || ౧౩ ||

దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసి చ |
వేదాః సత్యప్రతిష్ఠానాస్తస్మాత్ సత్యపరో భవేత్ || ౧౪ ||

ఏకః పాలయతే లోకమేకః పాలయతే కులమ్ |
మజ్జత్యేకో హి నిరయైకః స్వర్గే మహీయతే || ౧౫ ||

సోఽహం పితుర్నియోగంతు కిమర్థం నానుపాలయే |
సత్యప్రతిశ్రవః సత్యం సత్యేన సమయీకృతః || ౧౬ ||

నైవ లోభాన్న మోహాద్వా న హ్యజ్ఞానాత్తమోఽన్వితః |
సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిశ్రవః || ౧౭ ||

అసత్యసంధస్య సతశ్చలస్యాస్థిరచేతసః |
నైవ దేవా న పితరః ప్రతీచ్ఛంతీతి నః శ్రుతమ్ || ౧౮ ||

ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయమ్ |
భారః సత్పురుషాచీర్ణస్తదర్థమభిమన్యతే || ౧౯ ||

క్షాత్త్రం ధర్మమహం త్యక్ష్యే హ్యధర్మం ధర్మసంహితమ్ |
క్షుద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభిః || ౨౦ ||

కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్య చ |
అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మ పాతకమ్ || ౨౧ ||

భూమిః కీర్తిర్యశో లక్ష్మీః పురుషం ప్రార్థయంతి హి |
స్వర్గస్థం చానుపశ్యంతి సత్యమేవ భజేత తత్ || ౨౨ ||

శ్రేష్ఠం హ్యనార్యమేవ స్యాద్యద్భవానవధార్య మామ్ |
ఆహ యుక్తికరైర్వాక్యైరిదం భద్రం కురుష్వ హ || ౨౩ ||

కథం హ్యహం ప్రతిజ్ఞాయ వనవాసమిమం గురౌ |
భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వచః || ౨౪ ||

స్థిరా మయా ప్రతిజ్ఞాతా ప్రతిజ్ఞా గురుసన్నిధౌ |
ప్రహృష్యమాణా సా దేవీ కైకేయీ చాభవత్తదా || ౨౫ ||

వనవాసం వసన్నేవం శుచిర్నియతభోజనః |
మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః పితన్ దేవాంశ్చ తర్పయన్ || ౨౬ ||

సంతుష్టపంచవర్గోఽహం లోకయాత్రాం ప్రవర్తయే |
అకుహః శ్రద్దధానస్సన్ కార్యాకార్యవిచక్షణః || ౨౭ ||

కర్మభూమిమిమాం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్ఛుభమ్ |
అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః || ౨౮ ||

శతం క్రతూనామాహృత్య దేవరాట్ త్రిదివంగతః |
తపాంస్యుగ్రాణి చాస్థాయ దివం యాతా మహర్షయః || ౨౯ ||

అమృష్యమాణః పునరుగ్రతేజాః
నిశమ్య తన్నాస్తికవాక్యహేతుమ్ |
అథాబ్రవీత్తం నృపతేస్తనూజో
విగర్హమాణో వచనాని తస్య || ౩౦ ||

సత్యం చ ధర్మం చ పరాక్రమం చ
భూతానుకంపాం ప్రియవాదితాశ్చ |
ద్విజాతిదేవాతిథిపూజనం చ
పంథానమాహుస్త్రిదివస్య సంతః || ౩౧ ||

తేనైవమాజ్ఞాయ యథావదర్థమ్
ఏకోదయం సంప్రతిపద్య విప్రాః |
ధర్మం చరంతః సకలం యథావత్
కాంక్షంతి లోకాగమమప్రమత్తాః || ౩౨ ||

నిందామ్యహం కర్మ పితుః కృతం తత్
యస్త్వామగృహ్ణాద్విషమస్థబుద్ధిమ్ |
బుద్ధ్యానయైవంవిధయా చరంతమ్
సునాస్తికం ధర్మపథాదపేతమ్ || ౩౩ ||

యథా హి చోరః స తథా హి బుద్ధః
తథాగతం నాస్తికమత్ర విద్ధి |
తస్మాద్ధి యః శంక్యతమః ప్రజానామ్
న నాస్తికేనాభిముఖో బుధః స్యాత్ || ౩౪ ||

త్వత్తో జనాః పూర్వతరే వరాశ్చ
శుభాని కర్మాణి బహూని చక్రుః |
జిత్వా సదేమం చ పరంచ లోకమ్
తస్మాద్ద్విజాః స్వస్తి హుతం కృతం చ || ౩౫ ||

ధర్మే రతాః సత్పురుషైః సమేతాః
తేజస్వినో దానగుణప్రధానాః |
అహింసకా వీతమలాశ్చ లోకే
భవంతి పూజ్యా మునయః ప్రధానాః || ౩౬ ||

ఇతి బ్రువంతం వచనం సరోషం
రామం మహాత్మానమదీనసత్త్వమ్ |
ఉవాచ తథ్యం పునరాస్తికం చ
సత్యం వచః సానునయం చ విప్రః || ౩౭ ||

న నాస్తికానాం వచనం బ్రవీమ్యహమ్
న చాస్తికోఽహం న చ నాస్తి కించన |
సమీక్ష్య కాలం పునరాస్తికోఽభవమ్
భవేయ కాలే పునరేవ నాస్తికః || ౩౮ ||

స చాపి కాలోఽయముపాగతశ్శనైః
యథా మయా నాస్తికవాగుదీరితా |
నివర్తనార్థం తవ రామ కారణాత్
ప్రసాదనార్థం తు మయైతదీరితమ్ || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవోత్తరశతతమః సర్గః || ౧౦౯ ||

Ayodhya Kanda Sarga 109 Meaning In Telugu

జాబాలి చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాడు రాముడు. జాబాలితో ఈ విధంగా పలికాడు. “ఓ మహాత్మా! మీరు నా హితము కోరి చెప్పినమాటలు నాకు బాగున్నా లోకసమ్మతము కావు. అవి లోకానికి హితమును చేకూర్చలేవు. మీ మాటలు ఆచరిస్తే ప్రజలలో కట్టుబాటు తప్పుతుంది. స్వేచ్ఛా విహారము పెచ్చరిల్లుతుంది. ఎవడి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తారు. అరాచకము నెలకొంటుంది. అటువంటి వారిని ఎవరూ గౌరవించరు.

ఒక మనిషియొక్క గుణగణములు అతని ప్రవర్తనను బట్టి తెలుస్తాయి. అదీ కాకుండా పైకి ఒకటి లోన ఒకటి పెట్టుకొని ప్రవర్తించేవారు అంటే పైకి గౌరవనీయుల మాదిరి కనపడుతూ లోపల ఎన్నో చెయ్యకూడని పనులు చేసేవారు, పైకి ఉత్తమ లక్షణములు కనబరుస్తూ లోపల పరమ నీచంగా ప్రవర్తించేవారు, పైకి నీతి మంతుడి మాదిరి కనపడుతూ లోపల నీతి బాహ్యమైన పనులు చేసేవారు, అటువంటి వారు ఎల్లప్పుడూ ధర్మము విడిచి అధర్మమునే ఆచరిస్తారు. కాని పైకి మాత్రం ధర్మాత్ములు మాదిరి కనపడతారు.

మీరు చెప్పిన మాదిరి చేస్తే నేను కూడా అలాగే అవుతాను. పైకి నీతులు చెబుతూ లోపల సింహాసనము కోసరం వెండ్లాడేవాడి నవుతాను. ఈనాడు నన్ను వెంటనే అయోధ్యకు రమ్మని ఆహ్వానించే వారు కూడా రేపు నన్ను దురాత్ముడని నిందిస్తారు. నన్ను ఎవరూ గౌరవించరు. గౌరవం లేని రాముడు జీవించి కూడా వృధా!

నేను నా తండ్రి మాటను పక్కన బెట్టి రాజ్యము స్వీకరిస్తే, లోకంలో అందరూ నా మాదిరే ఆడిన మాట తప్పడంలో పోటీ పడతారు తప్ప నన్ను ఎవరూ గౌరవించరు. నీమాటలు నమ్మిన వారికి నీవు నమ్మిన ఈలోకంలో సుఖం దక్కదు. పైగా, వారికి, నేను నమ్మిన పరలోకంలో నరకం ప్రాప్తిస్తుంది.

రాజు అనే వాడు ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. రాజు ఆచరించే ఆదర్శాలను ప్రజలుకూడా ఆచరిస్తారు. అలా కాకుండా నేనే మాటతప్పి రాజ్యం స్వీకరిస్తే, ప్రజలుకూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. స్వేచ్ఛాజీవులు అవుతారు. అది దీర్ఘకాలంలో చెడుఫలితాలను ఇస్తుంది.

రాజధర్మము సనాతనమైనది. సత్యము, ధర్మము ఈ రెంటి మీదనే రాజ్యము నడవాలి. అప్పుడు ప్రజలకు రాజుమీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి సత్యమును మించిన ధర్మము మరొకటి లేదు. మేమే చేసే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఆ సత్యము మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి మానవునకు సత్యవ్రతమును అవలంబించడం ఆవశ్యకము. నేను కూడా ఆ సత్యవాక్పరిపాలననే నమ్ముకున్నాను. ఆడిన మాట తప్పను. నా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటను.
ఈ లోకంలో జనులు పలురకాలు. ఒకడు రాజ్యపాలన చేస్తాడు. మరొకడు పాపపు పనులు చేస్తాడు. మరొకడు వంశ గౌరవాన్ని కాపాడుతాడు. మరొకడు నరకద్వారాలు వెతుక్కుంటూ నరకానికివెళతాడు. ఎవరు చేసిన కర్మలకు తగ్గ ఫలములను వారు అనుభవిస్తారు. నేను సత్యమును పాటించడమే ధర్మంగా పెట్టుకున్నాను. అదే ఆచరిస్తాను. తగిన ఫలితాన్ని పొందుతాను.

నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాటను, మోహము చేతగానీ, ఆశాపాశముల చేతగానీ, చిత్తభ్రమలో గానీ, అజ్ఞానమువలన గానీ, ఇంకా ఎటువంటి పరిస్థితులలో గానీ తప్పను. ఇదే నా నిశ్చయం. నేనే గనక ఆడిన మాట తప్పితే దేవతలు గానీ, నా పితృదేవతలు గానీ నేను చేసిన పనిని సమర్థించరు.

నేను ఆడిన మాట కోసరము నా క్షత్రియ ధర్మమును కూడా త్యజించుటకు వెనుకాడను. ఎందుకంటే క్షత్రియ ధర్మంలో ఎక్కువగా క్రూరత్వానికి, దురాశకు తావు ఉంటుంది కానీ సత్యధర్మానికి తావు లేదు. మానవుడు తాను చెప్పదలచుకొన్నది ముందుగా మనసులో తలచుకుంటాడు. దానిని వాక్కు రూపంలో బయటకు చెబుతాడు. కాబట్టి నీవు చెప్పినవి అన్నీ నీచెడ్డ ప్రవర్తనను సూచిస్తున్నాయి. నేను నా తండ్రి ఎదుట వనవాసమునకు పోతాను అని అంగీకరించాను. అప్పుడు నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక, ఎంతో సంతోషించారు. ఇప్పుడు భరతుని మాట, నీ మాట విని ఎలా అయోధ్యకు పోగలను. కాబట్టి వనవాసమే నాకు శ్రేయోదాయకము. ఇక్కడ స్వచ్ఛమైన గాలీ పీలుస్తూ, కందమూలములు తింటూ, నిర్మలమైన జలములు త్రాగుతూ, హాయిగా కాలం గడుపుతాను.

ఇది కర్మభూమి. మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. నీ మాట విని నేను అధర్మంగా ప్రవర్తిస్తే నాకు చెడుఫలితాలే వస్తాయి. దేవేంద్రుడు నూరు అశ్వమేధ యాగములు చేసి ఇంద్రపదవి అధిష్ఠించాడు. ఎంతో మంది మహాఋషులు ఘోరమైన తపస్సులు చేసి ఉత్తమలోకములు పొందారు. వారే కాకుండా, సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, సరళమైన మాట, దేవతలను, బ్రాహ్మణులను పూజించడం, వీటిని మార్గములుగా చేసుకొని మానవులు ఉత్తమ లోకములు పొందారు. ఆ మానవులలో కూడా, బ్రాహ్మణులు, పైన చెప్పబడిన మార్గంలో పయనించి ఉత్తమలోకములు పొందారు.

నీవు బ్రాహ్మణుడవు. కాని అపమార్గంలో పయనిస్తున్నావు. నీ వంటి అధర్మపరుడిని, అవినీతి పరుడిని దగ్గర చేర్చి నా తండ్రి తప్పుచేసాడు. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ మాటలు అన్నావో ఆ బుద్ధుడు, తథాగతుడు, పరమ నాస్తికుడు, ఒట్టి దొంగ. అందుకే ప్రజలు అతనినినమ్మలేదు. జ్ఞానులు ఎప్పుడూ నాస్తికులతో సంబంధం పెట్టుకో.

ఓ జాబాలీ! నీకు పూర్వులు చాలామంది ఉన్నారు. వారు ఎన్నో యజ్ఞయాగములు, శుభమైన కర్మలు చేసారు. వారు ఈ లోకము లోనూ పరలోకములోనూ సుఖాలు అనుభవించారు. బ్రాహ్మణులు మానవుల చేత యజ్ఞములు, యాగములు మొదలగు మంగళ కరమైన కార్యములు చేయిస్తారు కానీ నీ మాదిరి నాస్తిక వాదమును వ్యాప్తి చేయరు. ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించువారు. మంచివారి స్నేహము చేయువారు, తేజస్సు కలవారు, దానవ్రతులు, అహింసాపరులు, పాపము చేయని వారూ, ఉత్తములు అయిన వారు లోకములో పూజింపబడతారు. నీ లాంటి వారిని ప్రజలు గౌరవించరు.” అని కోపంతో అన్నాడు రాముడు.

రాముని మాటలు విన్న జాబాలి రాముని అనునయిస్తూ ఈ విధంగా అన్నాడు. “రామా! నీవు పొరపడుతున్నావు. నేను నాస్తికుడను కాను. నాస్తికత్వమును వ్యాప్తిచేయడం లేదు. కేవలము నిజాలు చెప్పడమే నా సంకల్పము అది నాస్తికత్వము మాదిరి అనిపిస్తుంది. నేను కూడా ఆస్తికుని వలె మాట్లాడగలను. కేవలము నిన్ను మరలా అయోధ్యకు పట్టాభిషిక్తుని చేసి, అయోధ్యా ప్రజలు, భరతుని కోరిక నెరవేరవలెననే కోరికతో అలా మాట్లాడాను కానీ వేరు కాదు.” అని రాముని అనునయించాడు జాబాలి. అంతటితో ఆ వివాదము ముగిసిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

(ఈ సర్గలో మీకు ఒక శ్లోకము కనిపిస్తుంది. అందులో బుద్ధుడు, తథాగతుని ప్రస్తావన వచ్చింది. రాముడు బుద్ధుని చోరుడు అని కూడా అంటాడు. “యథాహి చోర: స తథా హి బుద్ధ స్తథాగతం నాస్తిక మత్ర విద్ధి,”. ఇది ఎలా సంభవము. రాముడు త్రేతాయుగము కాలము నాటి వాడు. బుద్ధుడు క్రీ.పూ.563 వ సంవత్సరములో జన్మించాడు. 80 సంవత్సరాలు జీవించాడు. కీ.పూ.483 సంవత్సరములో మరణించాడు. ఆయన బౌద్ధమతమును వ్యాప్తిచేసాడు. బౌద్ధము భారతదేశంలో వ్యాప్తి చెందకపోయినా దేశాలలో అవలంబింపబడుతూ ఉంది.

రామాయణ ప్రాశస్త్యమునకు ముగ్ధులై బౌద్ధులు రామాయణమును తమకు అనుకూలంగా మార్చి రాసుకున్నారు అని అంటారు. కాబట్టి బుద్ధుని కాలం నాటికే రామాయణము ఉంది అని తెలుస్తూ ఉంది. ఆ కారణం చేత రాముడు బుద్దుని గూర్చి చెప్పడం, దూషించడం అసంగతం అని అర్థం అవుతూ ఉంది. అందువలన ఈ శ్లోకములు ప్రక్షిప్తములు అనగా తరువాత “తరువాత చేర్చబడినవి” అని నిర్ధారణ అయింది. ఈ విషయమును శ్రీమద్రామాయణమునకు వ్యాఖ్య రాసిన బ్రహ్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు కూడా ధృవీకరించారు. వారి అభిప్రాయము ప్రకారము ఈ శ్లోకములు ఛందస్సు మార్చి రాయబడ్డాయి. అప్పటిదాకా అనుష్టుప్ ఛందస్సులో నడిచిన రామాయణ కధ ఈ సర్గలో ఆఖరి పదిశ్లోకములు ఉపజాతి వృత్తంలో రాయబడ్డాయి. కాబట్టి ఈ పదిశ్లోకములను ప్రక్షిప్తములు అనడంలో సందేహము లేదు. అని అభిప్రాయపడ్డారు. రాముడు బుద్ధుని గురించి చెప్పడంలోనే ఈ విషయం తేటతెల్లము అవుతోంది. బుద్ధుని మీద, బౌద్ధము మీద ద్వేషము ఉన్న అజ్ఞాత రచయిత, ఎవరో ‘ ఔచిత్యమును మరిచి, ఈ శ్లోకములను రామాయణములో చేర్చి ఉండవచ్చు అని అనుకొనవలసి వస్తోంది.)

అయోధ్యాకాండ దశోత్తరశతతమః సర్గః (110) >>

Ayodhya Kanda Sarga 108 In Telugu – అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 108

అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో కీలకమైన ఘట్టం. ఈ సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం గురించి తీవ్రంగా బాధపడుతూ, కౌసల్యా దేవితో తన మనోవేదనను వ్యక్తం చేస్తాడు. దశరథుడు, తన గత పాపాన్ని గుర్తుచేసుకుంటాడు, యాదృచ్ఛికంగా శ్రవణకుమారుని వధ కారణంగా అతని తల్లిదండ్రులకు చేసిన అన్యాయాన్ని స్మరించుకుంటాడు. ఈ ఘటన అతని మనస్సులో మరింత బాధను కలిగిస్తుంది. ఈ స్మృతులు, తన ప్రస్తుత దుఃఖానికి కారణమని భావిస్తూ, దశరథుడు ప్రాణాలు విడుస్తాడు. ఈ సర్గ, కర్మ ఫలితాన్ని మరియు వ్యక్తి చేసిన పాపాలు ఎలా వెంబడిస్తాయో చూపిస్తుంది. రామాయణంలో ఈ భాగం, పితృవ్యతసతో ధర్మాన్నీ, బాధ్యతలను నొక్కి చెబుతుంది.

జాబాలివాక్యమ్

ఆశ్వాసయంతం భరతం జాబాలిర్బ్రాహ్మణోత్తమః |
ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతమిదం వచః || ౧ ||

సాధు రాఘవ మాభూత్తే బుద్ధిరేవం నిరర్థికా |
ప్రాకృతస్య నరస్యేవ హ్యార్యబుద్ధేర్మనస్వినః || ౨ ||

కః కస్య పురుషో బంధుః కిమాప్యం కస్య కేనచిత్ |
యదేకో జాయతే జంతురేకైవ వినశ్యతి || ౩ ||

తస్మాన్మాతా పితా చేతి రామ సజ్జేతయో నరః |
ఉన్మత్త ఇవ స జ్ఞేయో నాస్తి కశ్చిద్ధి కస్యచిత్ || ౪ ||

యథా గ్రామాంతరం గచ్ఛన్ నరః కశ్చిత్ క్వచిద్వసేత్ |
ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేతాపరేఽహని || ౫ ||

ఏవమేవ మనుష్యాణాం పితా మాతా గృహం వసు |
ఆవాసమాత్రం కాకుత్స్థ సజ్జంతే నాత్ర సజ్జనాః || ౬ ||

పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య స నార్హసి నరోత్తమ |
ఆస్థాతుం కాపథం దుఃఖం విషమం బహుకణ్టకమ్ || ౭ ||

సమృద్ధాయామయోధ్యాయామాత్మానమభిషేచయ |
ఏకవేణీధరా హి త్వాం నగరీ సంప్రతీక్షతే || ౮ ||

రాజభోగాననుభవన్ మహార్హాన్ పార్థివాత్మజ |
విహర త్వమయోధ్యాయాం యథా శక్రస్త్రివిష్టపే || ౯ ||

న తే కశ్చిద్దశరథస్త్వం చ తస్య న కశ్చన |
అన్యో రాజా త్వమన్యః స తస్మాత్ కురు యదుచ్యతే || ౧౦ ||

బీజమాత్రం పితా జంతోః శుక్లం రుధిరమేవ చ |
సంయుక్తమృతుమన్మాత్రా పురుషస్యేహ జన్మ తత్ || ౧౧ ||

గతః స నృపతిస్తత్ర గంతవ్యం యత్ర తేన వై |
ప్రవృత్తిరేషా మర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే || ౧౨ ||

అర్థధర్మపరా యే యే తాంస్తాన్ శోచామి నేతరాన్ |
తే హి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే || ౧౩ ||

అష్టకా పితృదైవత్యమిత్యయం ప్రసృతో జనః |
అన్నస్యోపద్రవం పశ్య మృతో హి కిమశిష్యతి || ౧౪ ||

యది భుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్ఛతి |
దద్యాత్ ప్రవసతః శ్రాద్ధం న తత్ పథ్యశనం భవేత్ || ౧౫ ||

దానసంవననా హ్యేతే గ్రంథా మేధావిభిః కృతాః |
యజస్వ దేహి దీక్షస్వ తపస్తప్యస్వ సంత్యజ || ౧౬ ||

స నాస్తి పరమిత్యేవ కురు బుద్ధిం మహామతే |
ప్రత్యక్షం యత్తదాతిష్ఠ పరోక్షం పృష్ఠతః కురు || ౧౭ ||

స తాం బుద్ధిం పురస్కృత్య సర్వలోకనిదర్శినీమ్ |
రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ భరతేన ప్రసాదితః || ౧౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమః సర్గః || ౧౦౮ ||

Ayodhya Kanda Sarga 108 Meaning In Telugu

త్రేతాయుగంలో జాబాలి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నాస్తిక వాది. ఈ ప్రాకృతిక ప్రపంచము తప్ప వేరే ఏమీ లేదు.ఉన్నంత కాలం సుఖాలు అనుభవించడం మాత్రమే మనము చెయ్యాల్సిన పని అని నమ్మే వాడు. అలాంటి భావాలు ఉన్న జాబాలి ఆసభలో ఉన్నాడు. రాముడు, భరతుడు చేసిన సంవాదమును విన్న జాబాలి ఇలామాట్లాడసాగాడు.

“రామా! నీవు ఎంతో బుద్ధిమంతుడికి, జ్ఞానము కలవాడవు అనుకున్నాను. కాని ఇంతమూర్ఖంగా ఆలోచిస్తావు అని అనుకోలేదు. నీ ఆలోచన ఎందుకూ పనికిరాదు.

రామా! మానవుడు పుట్టేటప్పుడు ఒంటరి వాడు. చచ్చేటప్పుడు ఒంటరి వాడే. ఈ బంధుత్వాలు, మమతలు మమకారాలు అన్నీ నడుమ వచ్చినవే. చచ్చిన తరువాత ఎవరూ ఎవరికీ ఏమీ కారు. అందుకే ఈ బంధుత్వాలు అన్నీ వ్యర్థము. తల్లి, తండ్రి, మనకు దైవసమానులు, వాళ్ల మాటలను పాటించాలి, అని అనుకోవడం అవివేకము. మీ తండ్రి మరణించాడు. ఇంక ఆయన మాటకు విలువేముంది. దూర ప్రయాణాలు చేసే వాళ్లు రాత్రిళ్లు సత్రములలో బస చేస్తారు. ఆ రాత్రికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది.

మరునాడు ఉదయం ఎవరి దోవన వారు వెళతారు. ఈ జీవితాలూ అంతే. తల్లి, తండ్రి, ధనము, భార్య, సంతానము అన్నీ సత్రములలో పరిచయాల్లాంటివే. కాలం తీరగానే ఎవరి దోవ వారిది. ఆ కాస్త పరిచయంతో మాటకు కట్టుబడి ఉండాలి అని అనుకోవడం అవివేకము. విజ్ఞులైన వారు ఈ బంధుత్వాలకు విలువ ఇవ్వరు.

నీకు రాజ్యము సంక్రమించింది. భరతుడు కూడా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చెయ్యమంటున్నాడు. హాయిగా రాజభోగాలు అనుభవించక తండ్రిమాటకు కట్టుబడి వనవాసము చెయ్యడం ఏమిటి? ఈ చెడు ఆలోచన నీకు ఎలా కలిగింది. రామా! నా మాటవిను. అయోధ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. వెంటనే అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడిపై స్వర్గలోకముతో సమానమైన రాజభోగాలు అనుభవించు.

అసలు దశరథుడు ఎవరు? నీకు జన్మను ఇచ్చాడు. వెళ్లిపోయాడు. అంతే. అతనికి నీకు ఏమి సంబంధం? ఆయన మాటకు నీవు ఎందుకు కట్టుబడి ఉండాలి? మరొక మాట. తండ్రి బీజము. తల్లి క్షేత్రము. తల్లి తండ్రి సంగమించినప్పుడు, తండ్రి బీజము(శుక్లము) తల్లి శోణితములో కలిసి అండము అవుతుంది. అది శిశువుగా మారుతుంది. వీడు నీ తండ్రి అని తల్లి చెబితేనే అతను నీ తండ్రి అని తెలుస్తుంది. (తల్లి సత్యం. తండ్రి నమ్మకం అనే సామెత ఉంది.) నీ తండ్రి తన జీవిత కాలము నీ తండ్రిగా నిన్ను పెంచి పెద్దచేసాడు. కాలం తీరగానే తన దారిన తాను వెళ్లిపోయాడు.

చనిపోయిన తండ్రి గురించి నీవు బాధలు పడటం ఎందుకు? నీ మాదిరి ధర్మము, ధర్మము ప్రకారమే అర్థకామములు అనుభవించాలి అనే వాళ్లు అవివేకులు. వారు ఏ సుఖాలు అనుభవించకుండానే చచ్చిపోతారు. అలాంటి వారిని చూచి నాకు జాలికలుగుతుంది.

అసలు దశరథుడు ఎవరు? నీకు జన్మను ఇచ్చాడు. వెళ్లిపోయాడు. అంతే. అతనికి నీకు ఏమి సంబంధం? ఆయన మాటకు నీవు ఎందుకు కట్టుబడి ఉండాలి? మరొక మాట. తండ్రి బీజము. తల్లి క్షేత్రము. తల్లి తండ్రి సంగమించినప్పుడు, తండ్రి బీజము(శుక్లము) తల్లి శోణితములో కలిసి అండము అవుతుంది. అది శిశువుగా మారుతుంది. వీడు నీ తండ్రి అని తల్లి చెబితేనే అతను నీ తండ్రి అని తెలుస్తుంది. (తల్లి సత్యం. తండ్రి నమ్మకం అనే సామెత ఉంది.) నీ తండ్రి తన జీవిత కాలము నీ తండ్రిగా నిన్ను పెంచి పెద్దచేసాడు. కాలం తీరగానే తన దారిన తాను వెళ్లిపోయాడు. చనిపోయిన తండ్రి గురించి నీవు బాధలు పడటం ఎందుకు? నీ మాదిరి ధర్మము, ధర్మము ప్రకారమే అర్థకామములు అనుభవించాలి అనే వాళ్లు అవివేకులు. వారు ఏ సుఖాలు అనుభవించకుండానే చచ్చిపోతారు. అలాంటి వారిని చూచి నాకు జాలికలుగుతుంది. మాటవిని అయోధ్యకు పోయి హాయిగా రాజ్యపాలన చెయ్యి సుఖించు.” అని చెప్పాడు జాబాలి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ నవోత్తరశతతమః సర్గః (109) >>

Ayodhya Kanda Sarga 107 In Telugu – అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 107

అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో మరొక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు రాముడి అనారోగ్యం గురించి తెలుసుకుని, ఎంతో చింతతో బాధపడతాడు. అతను రాముని వద్దకు వెళ్లి, అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. కానీ రాముడు తన వనవాసాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. రాముడు ధర్మం, పితృవాక్య పరిపాలనకు ప్రాముఖ్యతను ఇస్తూ, భరతుని శాంతన చేస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్లి, అవే పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముని తరపున రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ సర్గ భక్తి, ధర్మనిష్ట, మరియు పితృవాక్య పరిపాలనను మునుపటి కంటే మరింతగా స్పష్టం చేస్తుంది.

రామప్రతివచనమ్

పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజః |
ప్రత్యువాచ తతః శ్రీమాన్ జ్ఞాతిమధ్యేఽభిసత్కృతః || ౧ ||

ఉపపన్నమిదం వాక్యం యత్త్వమేవమభాషథాః |
జాతః పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ || ౨ ||

పురా భ్రాతః పితా నః స మాతరం తే సముద్వహన్ |
మాతామహే సమాశ్రౌషీద్రాజ్యశుల్కమనుత్తమమ్ || ౩ ||

దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః |
సంప్రహృష్టో దదౌ రాజా వరమారాధితః ప్రభుః || ౪ ||

తతః సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్వినీ |
అయాచత నరశ్రేష్ఠం ద్వౌ వరౌ వరవర్ణినీ || ౫ ||

తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథా |
తౌ చ రాజా తదా తస్యై నియుక్తః ప్రదదౌ వరౌ || ౬ ||

తేన పిత్రాఽహమప్యత్ర నియుక్తః పురుషర్షభ |
చతుర్దశ వనే వాసం వర్షాణి వరదానికమ్ || ౭ ||

సోఽహం వనమిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్వితః |
సీతయా చాప్రతిద్వంద్వః సత్యవాదే స్థితః పితుః || ౮ ||

భవానపి తథేత్యేవ పితరం సత్యవాదినమ్ |
కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్ || ౯ ||

ఋణాన్మోచయ రాజానం మత్కృతే భరతప్రభుమ్ |
పితరం చాపి ధర్మజ్ఞం మాతరం చాభినందయ || ౧౦ ||

శ్రూయతే హి పురా తాత శ్రుతిర్గీతా యశస్వినా |
గయేన యజమానేన గయేష్వేవ పితన్ ప్రతి || ౧౧ ||

పున్నామ్నో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః |
తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితౄన్ యత్పాతి వా సుతః || ౧౨ ||

ఏష్టవ్యా బహవః పుత్రా గుణవంతో బహుశ్రుతాః |
తేషాం వై సమవేతానామపి కశ్చిద్గయాం వ్రజేత్ || ౧౩ ||

ఏవం రాజర్షయః సర్వే ప్రతీతా రాజనందన |
తస్మాత్ త్రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభో || ౧౪ ||

అయోధ్యాం గచ్ఛ భరత ప్రకృతీరనురంజయ |
శత్రుఘ్నసహితో వీర సహ సర్వైర్ద్విజాతిభిః || ౧౫ ||

ప్రవేక్ష్యే దండకారణ్యమహమప్యవిలంబయన్ |
ఆభ్యాం తు సహితో రాజన్ వైదేహ్యా లక్ష్మణేన చ || ౧౬ ||

త్వం రాజా భరత భవ స్వయం నరాణామ్
వన్యానామహమపి రాజరాణ్మృగాణామ్ |
గచ్ఛత్వం పురవరమద్య సంప్రహృష్టః
సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే || ౧౭ ||

ఛాయాం తే దినకరభాః ప్రబాధమానమ్
వర్షత్రం భరత కరోతు మూర్ధ్ని శీతామ్ |
ఏతేషామహమపి కాననద్రుమాణాం
ఛాయాం తామతిశయినీం సుఖీ శ్రయిష్యే || ౧౮ ||

శత్రుఘ్నః కుశలమతిస్తు తే సహాయః
సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్ |
చత్వారస్తనయవరా వయం నరేంద్రమ్
సత్యస్థం భరత చరామ మా విషాదమ్ || ౧౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః || ౧౦౭ ||

Ayodhya Kanda Sarga 107 Meaning In Telugu

తన మనోనిశ్చయాన్ని రాముడు భరతునికి ఈ విధంగా తెలిపాడు.
“భరతా! ఇప్పటి దాకా నీ వు చెప్పినది అంతా మిగుల యుక్తి యుక్తముగా ఉంది. అందులో ఏ దోషమూ లేదు. చాలా చక్కగా చెప్పావు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీకు తెలియని విషయములు కొన్ని నీకు చెప్పక తప్పదు.

మన తండ్రి దశరథుడు తాను నీ తల్లి కైకను వివాహమాడు సందర్భంలో తన రాజ్యమునకు ఉత్తర అధికారిగా నిన్ను చేస్తాను అని మీ మాతామహులకు (కైక తండ్రికి) వాగ్దానం చేసాడట. అదీకాకుండా దేవాసుర సంగ్రామంలో నీ తల్లి మన తండ్రి ప్రాణములు రెండు సార్లు కాపాడినందుకు గాను, రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసాడట. నీ తల్లి ఆ వరములను తనకు తరువాత ప్రసాదించమని అడిగినదట. ఆ వరములను నా పట్టాభిషేక సందర్భములో కోరినది.

అందులో మొదటి వరము నాకు 14 ఏళ్ల వనవాసము. రెండవ వరము నీకు అయోధ్య రాజ్య పట్టాభిషేకము. ఆ వరములను మన తండ్రి నీ తల్లికి ఇచ్చాడు. నన్ను 14 ఏళ్లు అరణ్యములకువెళ్లమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞమేరకు నేను అరణ్యములకు వచ్చాను.

నన్ను విడిచి ఉండలేక నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు నా వెంట అడవులకు వచ్చారు. దీనితో మొదటి వరము నెరవేరినది.
మన తండ్రి నీ తల్లికి ఇచ్చిన రెండవ వరమును అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివి కావాలి. అప్పుడే నీవు నీ తల్లి తండ్రుల మాటను పాటించినట్టవుతుంది. నీవు నీ తండ్రిని ఋణవిముక్తుని చేసినట్టవుతుంది. దీనికి ఒక ఇతిహాసమును కూడా చెబుతాను విను.

పూర్వము గయుడు గయా క్షేత్రంలో పితృదేవతల గురించి ఒక యాగము చేసాడట. ఆ సందర్భంలో గయుడు ఈవిధంగా చెప్పాడు అని పెద్దలుచెబుతారు. పుత్రుడు అనే వాడు పితరులను పున్నామ నరకము నుండి రక్షిస్తాడట. అందుకని అతడికి పుత్రుడు అనే పేరు వచ్చిందట. అందుకే తల్లితండ్రులు తమకు చాలా మంది పుత్రసంతానము కావాలని కోరుకుంటారట. ఎందుకంటే, అందులో కనీసం ఒకడైనా గయకు వెళ్లి అక్కడ పితృకార్యము చేస్తాడని వారి ఆశ.

ఓభరతా! నీవు కూడా నీ తండ్రి మాటను పాటించి ఆయనను పున్నామ నరకమునుండి రక్షించు. నీ తండ్రి నీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారము వెంటనే అయోధ్యకు వెళ్లి, పట్టాభిషిక్తుడివై, శత్రుఘ్నుని సాయంతో అయోధ్యను పాలించు. నేను కూడా ఇక్కడ ఉండను. సీత, లక్ష్మణులతో కలిసి దండకారణ్యమునకు వెళతాను. నీవు అయోధ్యను పాలిస్తుంటే, నేను అడవిలో ఉన్న మృగములను పాలిస్తాను. నీవు సంతోషంగా అయోధ్యకు వెళ్లు, నేను అంతే సంతోషంగా దండకారణ్యమునకు వెళతాను.

నీకు నీ సింహాసనము మీద ఉన్న తెల్లటి గొడుగు (శ్వేతఛత్రము) ఎలా నీడనిస్తుందో, నాకు కూడా ఈ అడవిలో ఉన్న ఫలవృక్షములు నీడనిస్తాయి. నీవు శ్వేతఛత్రఛాయలో, నేను వటవృక్షఛాయలో సుఖిద్దాము. నీకు తోడుగా శత్రుఘ్నుడు ఉంటాడు. నాకు తోడుగా లక్ష్మణుడు ఉంటాడు. దశరథునికి కుమారులుగా పుట్టినందుకు, మనము నలుగురము ఆయన మాటను సత్యవ్రతమును నిలబెడదాము.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టోత్తరశతతమః సర్గః (108) >>

Ayodhya Kanda Sarga 106 In Telugu – అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 106

అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః వాల్మీకి రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్తాడు, ఎందుకంటే రాముడు తన వనవాసాన్ని ముగించక ముందే రావడానికి నిరాకరిస్తాడు. రాముడు తన తండ్రి దశరథుని ఆజ్ఞలను గౌరవిస్తూ, తన వనవాస ధర్మాన్ని కొనసాగిస్తాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముని పరిపాలనలో దేశాన్ని పాలిస్తాడు. ఈ సర్గ భక్తి, ధర్మం, మరియు పితృభక్తికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తుంది.

భరతవచనమ్

ఏవముక్త్వా తు విరతే రామే వచనమర్థవత్ |
తతో మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలమ్ |
ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః || ౧ ||

కో హి స్యాదీదృశో లోకే యాదృశస్త్వమరిందమ |
న త్వాం ప్రవ్యథయేద్దుఃఖం ప్రీతిర్వా న ప్రహర్షయేత్ || ౨ ||

సమ్మతశ్చాసి వృద్ధానాం తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ |
యథా మృతస్తథా జీవన్ యథాఽసతి తథా సతి || ౩ ||

యస్యైష బుద్ధిలాభః స్యాత్పరితప్యేత కేన సః |
పరావరజ్ఞో యశ్చ స్యాత్తథా త్వం మనుజాధిప || ౪ ||

సైవం వ్యసనం ప్రాప్య న విషీదితుమర్హతి |
అమరోపమ సత్త్వస్త్వం మహాత్మా సత్యసంగరః || ౫ ||

సర్వజ్ఞః సర్వదర్శీ చ బుద్ధిమాంశ్చాసి రాఘవ |
న త్వామేవంగుణైర్యుక్తం ప్రభవాభవకోవిదమ్ || ౬ ||

అవిషహ్యతమం దుఃఖమాసాదయితుమర్హతి |
ప్రోషితే మయి యత్పాపం మాత్రా మత్కారణాత్కృతమ్ || ౭ ||

క్షుద్రయా తదనిష్టం మే ప్రసీదతు భవాన్మమ |
ధర్మబంధేన బద్ధోఽస్మి తేనేమాం నేహ మాతరమ్ || ౮ ||

హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీమ్ |
కథం దశరథాజ్జాతః శుద్ధాభిజనకర్మణః || ౯ ||

జానన్ ధర్మమధర్మిష్ఠం కుర్యాం కర్మ జుగుప్సితమ్ |
గురుః క్రియావాన్ వృద్ధశ్చ రాజా ప్రేతః పితేతి చ || ౧౦ ||

తాతం న పరిగర్హేయం దైవతం చేతి సంసది |
కో హి ధర్మార్థయోర్హీనమీదృశం కర్మ కిల్బిషమ్ || ౧౧ ||

స్త్రియాః ప్రియం చికీర్షుః సన్ కుర్యాద్ధర్మజ్ఞ ధర్మవిత్ |
అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురాశ్రుతిః || ౧౨ ||

రాజ్ఞైవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శ్రుతిః కృతా |
సాధ్వర్థమభిసంధాయ క్రోధాన్మోహాచ్చ సాహసాత్ || ౧౩ ||

తాతస్య యదతిక్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ |
పితుర్హి యదతిక్రాంతం పుత్రో యస్సాధు మన్యతే || ౧౪ ||

తదపత్యం మతం లోకే విపరీతమతోఽన్యథా |
అభిపత్తా కృతం కర్మ లోకే ధీరవిగర్హితమ్ || ౧౫ ||

కైకేయీం మాం చ తాతం చ సుహృదో బాంధవాంశ్చ నః |
పౌరజానపదాన్ సర్వాంస్త్రాతు సర్వమిదం భవాన్ || ౧౬ ||

క్వ చారణ్యం క్వ చ క్షాత్త్రం క్వ జటాః క్వ చ పాలనమ్ |
ఈదృశం వ్యాహతం కర్మ న భవాన్ కర్తుమర్హతి || ౧౭ ||

ఏష హి ప్రథమో ధర్మః క్షత్రియస్యాభిషేచనమ్ |
యేన శక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనమ్ || ౧౮ ||

కశ్చ ప్రత్యక్షముత్సృజ్య సంశయస్థమలక్షణమ్ |
ఆయతిస్థం చరేద్ధర్మం క్షత్త్రబంధురనిశ్చితమ్ || ౧౯ ||

అథ క్లేశజమేవ త్వం ధర్మం చరితుమిచ్ఛసి |
ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాప్నుహి || ౨౦ ||

చతుర్ణామాశ్రమాణాం హి గార్హస్థ్యం శ్రేష్ఠమాశ్రమమ్ |
ప్రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞాస్తం కథం త్యక్తుమర్హసి || ౨౧ ||

శ్రుతేన బాలః స్థానేన జన్మనా భవతో హ్యహమ్ |
స కథం పాలయిష్యామి భూమిం భవతి తిష్ఠతి || ౨౨ ||

హీనబుద్ధిగుణో బాలో హీనః స్థానేన చాప్యహమ్ |
భవతా చ వినాభూతో న వర్తయితుముత్సహే || ౨౩ ||

ఇదం నిఖిలమవ్యగ్రం రాజ్యం పిత్ర్యమకణ్టకమ్ |
అనుశాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవైః || ౨౪ ||

ఇహైవ త్వాఽభిషించంతు సర్వాః ప్రకృతయః సహ |
ఋత్విజః సవసిష్ఠాశ్చ మంత్రవన్మంత్రకోవిదాః || ౨౫ ||

అభిషిక్తస్త్వమస్మాభిరయోధ్యాం పాలనే వ్రజ |
విజిత్య తరసా లోకాన్ మరుద్భిరివ వాసవః || ౨౬ ||

ఋణాని త్రీణ్యపాకుర్వన్ దుర్హృదః సాధు నిర్దహన్ |
సుహృదస్తర్పయన్ కామైస్త్వమేవాత్రానుశాధి మామ్ || ౨౭ ||

అద్యార్య ముదితాః సంతు సుహృదస్తేఽభిషేచనే |
అద్య భీతాః పలాయంతాం దుర్హృదస్తే దిశో దశ || ౨౮ ||

ఆక్రోశం మమ మాతుశ్చ ప్రమృజ్య పురుషర్షభ |
అద్య తత్రభవంతం చ పితరం రక్ష కిల్బిషాత్ || ౨౯ ||

శిరసా త్వాఽభియాచేఽహం కురుష్వ కరుణాం మయి |
బాంధవేషు చ సర్వేషు భూతేష్వివ మహేశ్వరః || ౩౦ ||

అథైతత్ పృష్ఠతః కృత్వా వనమేవ భవానితః |
గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమప్యహమ్ || ౩౧ ||

తథా హి రామో భరతేన తామ్యతా
ప్రసాద్యమానః శిరసా మహీపతిః |
న చైవ చక్రే గమనాయ సత్త్వవాన్
మతిం పితుస్తద్వచనే వ్యవస్థితః || ౩౨ ||

తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే
సమం జనో హర్షమవాప దుఃఖితః |
న యాత్యయోధ్యామితి దుఃఖితోఽభవత్
స్థిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షితః || ౩౩ ||

తమృత్విజో నైగమయూథవల్లభాః
తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతరః |
తథా బ్రువాణం భరతం ప్రతుష్టువుః
ప్రణమ్య రామం చ యయాచిరే సహ || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడుత్తరశతతమః సర్గః || ౧౦౬ ||

Ayodhya Kanda Sarga 106 Meaning In Telugu

రాముడు చేసిన వాదనను శ్రద్ధగా విన్నాడు భరతుడు. మరలా తనదైన శైలిలో తన వాదనను వినిపించసాగాడు.
“ఓ రామా! నీవు జితేంద్రియుడవు. నీకు సుఖమువస్తే సంతోషము, దు:ఖమువస్తే బాధా రెండూ లేవు. నీలాంటి వారు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. మేమంతా సామాన్యులము. సుఖదు:ఖములను అనుభవిస్తూ ఉంటాము.

జీవించి ఉన్నా, మరణించినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆ వ్యక్తి పట్ల సమభావనతో ఉండే వ్యక్తికి దుఃఖము కానీ సుఖము కానీ కలగవు. రెండూ సమభావనలో ఉంటాయి. ఆ గుణాలు నీలో ఉన్నాయి. కానీ నీవు బాధపడుతున్నావు. తండ్రికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుతానో అని బాధపడుతున్నావు. నీ లాంటివాడికి అలా బాధపడటం యుక్తంకాదు.

నీవు రాజ్యం చేసినా, అరణ్యంలో ఉన్న ఒకటే కదా. అందుకని అయోధ్యకు వచ్చి రాజ్యం చేయి. తప్పేముంది. నీవు అన్నిటికీ అతీతుడవు కదా! నీవు రాజ్యం తీసుకుంటే నేను బాధ పడను. ఎందుకంటే నేను దేశాంతరములో ఉన్నప్పుడు నా తల్లి చేసిన అనాలోచిత కార్యము వలన ఇదంతా సంభవించింది. నా తల్లి చేసిన పని నాకు అసలు ఇష్టం లేదు. దానికి నా అంగీకారమూ లేదు. నా తల్లి చేసినది రాజద్రోహము. దానికి మరణదండనే సరి అయిన శిక్ష కాని ఇక్కడ నిందితురాలు నా తల్లి కాబట్టి నేను ఆ దండన అమలు చేయలేక పోతున్నాను.

నేను పవిత్రమైన ఇక్ష్వాకు వంశములో పుట్టాను. ధర్మానికి ప్రతిరూపమైన దశరథమహారాజుకు పుత్రుడుగా జన్మించాను. అటువంటి నేను అధర్మమునకు పాల్పడతాను అని నీవు ఎలా అనుకుంటావు.? ఈ అధర్మములో నా తండ్రికి కూడా భాగం ఉంది. ఆయన నా తల్లి మాటను వినకపోతే ఇంత అనర్థము వాటిల్లదు.

ఆయన నా తండ్రి, పైగా వృద్ధుడు, ఈ లోకం విడిచి వెళ్లాడు కాబట్టి సభలో ఆయనను నిందించడం భావ్యం కాదు. ఎందుకంటే ధర్మము తెలిసిన వాడు ఎవరైనా ఒక స్త్రీకి ప్రియం చేకూర్చడానికి మరొకరికి అప్రియం చేస్తాడా! కాని నా తండ్రి ధర్మం తప్పి తన భార్యకు వరములు ఇచ్చే మిషమీద నీకు అపకారము చేసాడు.

రామా! వినాశకాలే విపరీత బుద్ధీ అని వినాశకాలము దాపురించబట్టి దశరథునికి ఇటువంటి విపరీత బుద్ధి పుట్టింది. తండ్రి మంచి కార్యము చేస్తే దానిని పుత్రుడు శ్లాఘించాలి, అభినందించాలి. కాని తండ్రి అధర్మానికి పాల్పడితే, దానిని పుత్రుడు ఖండించాలి. ఆ అధర్మము వలన కలిగిన తప్పును సరిదిద్దాలి. నా తండ్రి దశరథుడు చేసిన అధర్మము వలన అయోధ్య అరాచక మయింది. ఆ తప్పును నీవు సరిదిద్ది, నీ రాజ్యము నీవు పరిపాలించు. అందరికీ ఆనందము నీ చేకూర్చు. తండ్రి చేసిన అధర్మమును చక్కదిద్దిన సుపుత్రుడిగా ప్రఖ్యాతి చెందు.

ఎందుకంటే నా తండ్రి చేసిన అధర్మమును, పాపపు పనిని లోకమంతా ఖండిస్తూ ఉంది. ఆ అధర్మమును సరిదిద్దడం నీ చేతిలో ఉంది. నా తల్లి కైక కూడా దీనికి తన అంగీకారము తెలిపింది. ఆమెను కూడా ఈ అధర్మకార్యము నుండి రక్షించు.

పైగా క్షత్రియునకు స్వధర్మపాలనను మించిన ధర్మము మరొకటి లేదు. క్షత్రియ ధర్మము రాజ్యమును పాలించుట. నీవు నీ ధర్మమును వదిలి జటలు కట్టుకొని అరణ్యములలో ఉండటం భావ్యమా! ఎక్కడా? అరణ్యము ఎక్కడ? రాజు కిరీటము ఎక్కడ? జటాజూటములు ఎక్కడ? రెండింటికీ దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది కదా! నీకు తెలియనిది ఏమున్నది.

పైగా రాజ్యపాలన క్షత్రియధర్మము. అది తక్షణ ఫలములను ఇస్తుంది. వనవాస వృత్తి కాలాంతరమున మోక్షరూపంలో ఫలిస్తుంది. క్షత్రియుడైన వాడు రజోగుణప్రధానుడు కానీ తమోగుణ ప్రధానుడు కాదు కదా! కాబట్టి రామా! ఈ తాపస ధర్మము నీకు తగినది కాదు. నీకు క్షత్రియ ధర్మమే ఉచితము.

రామా! బ్రహ్మచర్య, గృహస్థ,వానప్రస్థ, సన్యాస ఆశ్రమములు ఒకదాని తరువాత ఒకటి ఆచరించాలి. అందులోనూ గృహస్థాశ్రమము శ్రేష్టమైనది అని పెద్దలు చెబుతారుకదా! మరి నీవు ఆ పెద్దల మాటలను పెడచెవిని పెట్టి గృహస్థాశ్రమమును విడిచిపెట్టడం ధర్మమా!

దీని వలన పితృఋణము తీర్చినట్టు అవుతుంది. తండ్రిగారు చేసిన తప్పును సరిదిద్దినట్టు అవుతుంది. ఈ పాపపు కార్యము వలన నా తల్లికి తండ్రికి అంటిన పాపమును తొలగించు. వారిని పాపవిముక్తులను చెయ్యి. నీకు శిరస్సువంచి పాదములు అంటి అర్థిస్తున్నాను. నా మీద, అయోధ్య మీద దయచూపించు. నేను ఇంతచెప్పినా కాదని నీవు అరణ్యములలో ఉండటానికి నిశ్చయించుకుంటే. నేనుకూడా నీతో అరణ్యవాసము చేస్తాను. నా తల్లి చేసిన పాపమునకు నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. అయోధ్యకు వెళ్లినే వెళ్లను. ఇదే నా కృతనిశ్చయము.” అని పలికి భరతుడు చేతులు జోడించి రాముని ముందు నిలబడ్డాడు.

అక్కడ ఉన్న వారు కూడా శాయశక్తులా రాముని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించారు. కాని రామునిలో చలనం లేదు. తన పట్టు వీడలేదు. అయోధ్యకు రావడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వారికి రాముని మనోనిశ్చయానికి అభినందించాలో లేక రాముడు అయోధ్యకు రాక పోవడానికి విచారించాలో తెలియక కొట్టుమిట్టాడు తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తోత్తరశతతమః సర్గః (107) >>

Ayodhya Kanda Sarga 105 In Telugu – అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 105

అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః, వాల్మీకి రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, శ్రీరాముడు, సీతాదేవిని దుఃఖంతో విడిచిపెట్టి, లక్ష్మణునితో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళతాడు. సీతాదేవి, అగ్ని పరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించుకుంటుంది. ఈ ఘటనలో రాముడు ధర్మాన్ని పాటిస్తూ, ప్రజల సమక్షంలో సీతా దేవిని అంగీకరిస్తాడు. ఈ సర్గ, ధర్మానికి, నిష్కపటతకు, మరియు రాజనీతికి సంబంధించిన అంశాలను స్పృశిస్తుంది. వాల్మీకి రామాయణంలో ఈ సర్గ ప్రత్యేకంగా రాముని జీవన పద్ధతిని, అతని ధైర్యం, ధర్మనిష్టలను ఉద్దీపింపచేస్తుంది.

రామవాక్యమ్

తతః పురుషసింహానాం వృతానాం తైః సుహృద్గణైః |
శోచతామేవ రజనీ దుఃఖేన వ్యత్యవర్తత || ౧ ||

రజన్యాం సుప్రభాతాయాం భ్రాతరస్తే సుహృద్వృతాః |
మందాకిన్యాం హుతం జప్యం కృత్వా రామముపాగమన్ || ౨ ||

తూష్ణీం తే సముపాసీనాః న కశ్చిత్కించిదబ్రవీత్ |
భరతస్తు సుహృన్మధ్యే రామం వచనమబ్రవీత్ || ౩ ||

సాంత్వితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ |
తద్దదామి తవైవాహం భుంక్ష్వ రాజ్యమకణ్టకమ్ || ౪ ||

మహతేవాంబువేగేన భిన్నః సేతుర్జలాగమే |
దురావారం త్వదన్యేన రాజ్యఖండమిదం మహత్ || ౫ ||

గతిం ఖర ఇవాశ్వస్య తార్క్ష్యస్యేవ పతత్రిణః |
అనుగంతుం న శక్తిర్మే గతిం తవ మహీపతే || ౬ ||

సుజీవం నిత్యశస్తస్య యః పరైరుపజీవ్యతే |
రామ తేన తు దుర్జీవం యః పరానుపజీవతి || ౭ ||

యథా తు రోపితో వృక్షః పురుషేణ వివర్ధితః |
హ్రస్వకేన దురారోహో రూఢస్కంధో మహాద్రుమః || ౮ ||

స యథా పుష్పితో భూత్వా ఫలాని న విదర్శయేత్ |
స తాం నానుభవేత్ప్రీతిం యస్య హేతోః ప్రరోపితః || ౯ ||

ఏషోపమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసి |
యది త్వమస్మాన్ వృషభో భర్తా భృత్యాన్న శాధి హి || ౧౦ ||

శ్రేణయస్త్వాం మహారాజ పశ్యంత్వగ్ర్యాశ్చ సర్వశః |
ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమమ్ || ౧౧ ||

తవానుయానే కాకుత్స్థ మత్తా నర్దంతు కుంజరాః |
అంతఃపురగతా నార్యో నందంతు సుసమాహితాః || ౧౨ ||

తస్య సాధ్విత్యమన్యంత నాగరా వివిధా జనాః |
భరతస్య వచః శ్రుత్వా రామం ప్రత్యనుయాచతః || ౧౩ ||

తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినమ్ |
రామః కృతాత్మా భరతం సమాశ్వాసయ దాత్మవాన్ || ౧౪ ||

నాత్మనః కామకారోఽస్తి పురుషోఽయమనీశ్వరః |
ఇతశ్చేతరతశ్చైనం కృతాంతః పరికర్షతి || ౧౫ ||

సర్వే క్షయాంతా నిచయాః పతనాంతాః సముచ్ఛ్రయాః |
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితమ్ || ౧౬ ||

యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయమ్ |
ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయమ్ || ౧౭ ||

యథాఽగారం దృఢస్థూణం జీర్ణం భూత్వాఽవసీదతి |
తథైవ సీదంతి నరాః జరామృత్యువశంగతాః || ౧౮ ||

అత్యేతి రజనీ యా తు సా న ప్రతినివర్తతే |
యాత్యేవ యమునా పూర్ణా సముద్రముదకాకులమ్ || ౧౯ ||

అహోరాత్రాణి గచ్ఛంతి సర్వేషాం ప్రాణినామిహ |
ఆయూంషి క్షపయంత్యాశు గ్రీష్మే జలమివాంశవః || ౨౦ ||

ఆత్మానమనుశోచ త్వం కిమన్యమనుశోచసి |
ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ || ౨౧ ||

సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషీదతి |
గత్వా సుదీర్ఘమధ్వానం సహమృత్యుర్నివర్తతే || ౨౨ ||

గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః |
జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్ || ౨౩ ||

నందంత్యుదితాదిత్యే నందంత్యస్తమితే రవౌ |
ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవితక్షయమ్ || ౨౪ ||

హృష్యంత్యృతుమఖం దృష్ట్వా నవం నవమిహాగతమ్ |
ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణసంక్షయః || ౨౫ ||

యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహార్ణవే |
సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన || ౨౬ ||

ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ ధనాని చ |
సమేత్య వ్యవధావంతి ధ్రువో హ్యేషాం వినాభవః || ౨౭ ||

నాత్ర కశ్చిద్యథాభావం ప్రాణీ సమభివర్తతే |
తేన తస్మిన్న సామర్థ్యం ప్రేతస్యాస్త్యనుశోచతః || ౨౮ ||

యథా హి సార్థం గచ్ఛంతం బ్రూయాత్ కశ్చిత్ పథి స్థితః |
అహమప్యాగమిష్యామి పృష్ఠతో భవతామితి || ౨౯ ||

ఏవం పూర్వైర్గతో మార్గః పితృపైతామహో ధ్రువః |
తమాపన్నః కథం శోచేద్యస్య నాస్తి వ్యతిక్రమః || ౩౦ ||

వయసః పతమానస్య స్రోతసో వాఽనివర్తినః |
ఆత్మా సుఖే నియోక్తవ్యః సుఖభాజః ప్రజాః స్మృతాః || ౩౧ ||

ధర్మాత్మా స శుభైః కృత్స్నైః క్రతుభిశ్చాప్తదక్షిణైః |
ధూతపాపో గతః స్వర్గం పితా నః పృథివీపతిః || ౩౨ ||

భృత్యానాం భరణాత్ సమ్యక్ ప్రజానాం పరిపాలనాత్ |
అర్థాదానాచ్చ ధర్మేణ పితా నస్త్రిదివం గతః || ౩౩ ||

కర్మభిస్తు శుభైరిష్టైః క్రతుభిశ్చాప్తదక్షిణైః |
స్వర్గం దశరథః ప్రాప్తః పితా నః పృథివీపతిః || ౩౪ ||

ఇష్ట్వా బహువిధైర్యజ్ఞైర్భోగాంశ్చావాప్య పుష్కలాన్ |
ఉత్తమం చాయురాసాద్య స్వర్గతః పృథివీపతిః || ౩౫ ||

ఆయురుత్తమమాసాద్య భోగానపి చ రాఘవః |
స న శోచ్యః పితా తాతః స్వర్గతః సత్కృతః సతామ్ || ౩౬ ||

స జీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితా హి నః |
దైవీమృద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోకవిహారిణీమ్ || ౩౭ ||

తం తు నైవంవిధః కశ్చిత్ ప్రాజ్ఞః శోచితుమర్హతి |
తద్విధో యద్విధశ్చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తరః || ౩౮ ||

ఏతే బహువిధాః శోకా విలాపరుదితే తథా |
వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమతా || ౩౯ ||

స స్వస్థో భవ మాశోచీర్యాత్వా చావస తాం పురీమ్ |
తథా పిత్రా నియుక్తోఽసి వశినా వదతాం వర || ౪౦ ||

యత్రాహమపి తేనైవ నియుక్తః పుణ్యకర్మణా |
తత్రైవాహం కరిష్యామి పితురార్య్యస్య శాసనమ్ || ౪౧ ||

న మయా శాసనం తస్య త్యక్తుం న్యాయ్యమరిందమ |
తత్ త్వయాఽపి సదా మాన్యం స వై బంధుస్స నః పితా || ౪౨ ||

తద్వచః పితురేవాహం సమ్మతం ధర్మచారిణః |
కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ || ౪౩ ||

ధార్మికేణానృశంసేన నరేణ గురువర్తినా |
భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషతా || ౪౪ ||

ఆత్మానమనుతిష్ఠ త్వం స్వభావేన నరర్షభ |
నిశామ్య తు శుభం వృత్తం పితుర్దశరథస్య నః || ౪౫ ||

ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
పితుర్నిదేశప్రతిపాలనార్థమ్ |
యవీయసం భ్రాతరమర్థవచ్చ
ప్రభుర్ముహూర్తాద్విరరామ రామః || ౪౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచోత్తరశతతమః సర్గః || ౧౦౫ ||

Ayodhya Kanda Sarga 105 Meaning In Telugu

అంతా మౌనంగా కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ భరతుడు లేచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు.
“రామా! నా తల్లి కైక మాటను మన్నించి నాకు రాజ్యమును వదిలి, నీవు అరణ్యములకు వచ్చావు. ఇప్పుడు అయోధ్యా రాజ్యము నాది. నా రాజ్యమును నా ఇష్టమువచ్చిన వారికి ఇచ్చే అధికారము నాకు ఉంది. నాది అయిన ఈ రాజ్యమును తిరిగి నీకు ఇస్తున్నాను. దీనిని స్వీకరించి అయోధ్యను పాలించు. ఎందుకంటే దశరథుని తరువాత ఈ రాజ్యమును పాలించే శక్తి, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి. నాకు ఆ అర్హత ఎంత మాత్రము లేదు. ఎందుకంటే గాడిద గుర్రము ఒకటి కావు కదా!

ఎవని మీద అందరూ ఆధారపడి బతుకుతారో, అతని జీవనము చాలా గొప్పది. కాని ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో అతని జీవితము దుర్భరము. ఈ అయోధ్య ప్రజలు, మేము అంతా నీ మీద ఆధారపడి ఉన్నాము. నీ పాలనకొరకు ఎదురు చూస్తున్నాము. అలాంటిది నీవు ఈ అరణ్యములో ఒకరి మీద ఆధారపడి బతకడం దుర్భరంకాదా! ఒకడు ఒక వృక్షమును నాటి, పెంచి పోషించాడు. అది పెద్ద మాను అయింది కానీ ఫలములు ఇవ్వడం లేదు. ఆ చెట్టుఎందుకూ ఉపయోగపడదు కదా! అలాగే తండ్రి దశరథుడు నిన్ను ఈ అయోధ్యకు మహారాజుగా తీర్చిదిద్దాడు. సకల విద్యలు నేర్పించాడు. వేదాలు, ధర్మశాస్త్రములు చదివించాడు. కాని ఈనాడు నువ్వు రాజ్యమును పాలించను అంటున్నావు. నీవు నేర్చుకున్న విద్యలు అన్నీ ఫలితం లేకుండా పోవలసిందేనా! దశరథుని శ్రమ అంతా వృధా కావలసిందేనా!

నీవు అయోధ్యను పాలిస్తుంటే ఆనందించని వారు ఉండరు. రాజ్యములో ప్రజలు కానీ అంతఃపురములోని జనులు కానీ అంతా సుఖసంతోషాలలో ఓలలాడుతారు. అందరికీ ఆమోద యోగ్యుడవైన నీవు రాజ్యమును పాలించకుండా అడవులలో తిరగడం ధర్మమా! కాబట్టి నీవు వెంటనే అయోధ్యకుతిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవు కావాలని సకలజనులకోరిక.” అని ముగించాడు భరతుడు.

రాముడు లేచి భరతుని వీపు తట్టి ఇలా పలికాడు. “ భరతా! ఈ చరాచర జగత్తులో తాను అనుకున్న పని అనుకున్నట్టు చేసే స్వాతంత్య్రము ఎవరికీ లేదు. అంతా విధిచేతిలో కీలుబొమ్మలమే. విధి ఎలా ఆడిస్తే అలా ఆడవలసినదే! ప్రతివానికీ ఉత్థానపతనాలు తప్పవు.
ఎంత ధనము సంపాదించినా ఆధనము తుదకు అతనిని వదిలి పోతుంది. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరినా, చివరకు పతనం తప్పదు. (సత్యం రామలింగరాజు, సన్ టివి అధినేతలు, గాలి జనార్దనరెడ్డి లాగా).

పుట్టినవాడు గిట్టడం ఎలాగో, పుట్టుకతో వచ్చిన మానవ సంబంధాలు చావుతో సమసిపోతాయి. ఏవీ శాశ్వతము కాదు. పండిన పండు రాలడం ఎంత నిజమో, పుట్టిన మనిషి చావడం అంతే నిజం. కాని అంతా శాశ్వతం అనుకోవడం అవివేకము. మనం గృహములు ఎంత ధృడంగా కట్టుకున్నా, కాలక్రమేణా అవి కూలిపోవడం తథ్యం. అలాగే ఈ శరీరాన్ని ఎంత ప్రేమగా పెంచి పోషించినా, తుదకు అది భూగర్భంలో కలిసిపోవలసిందే!

నిన్నటి దినం మరలా రాదు. సముద్రంలో కలిసిన నదీజలములు తిరిగి వెనక్కురావు కదా! ఒక్కొక్క రోజు గడుస్తుంటే, మానవుల జీవితంలో ఒక్కొక్క రోజు తరిగిపోతుంటుంది. చావుకు దగ్గర అవుతుంటాడు.

మానవుడు భూమి మీద ఉన్న అంతరిక్షంలో ఉన్నా, మృత్యువు అతని వెన్నంటి ఉంటుంది. కాలం తీరగానే కబళిస్తుంది. కాబట్టి మానవుడు సదా మృత్యువును వెంటబెట్టుకొని తిరుగుతుంటాడు. కాబట్టి భరతా! నీగురించి ఆలోచించుకో. నాగురించి ఎందుకు ఆలోచిస్తావు. ఎందుకంటే మన మానవ సంబంధాలు క్షణికములు. ఒక నదిలో రెండు దుంగలు కొట్టుకొని వస్తుంటాయి., అవి కలిసి కొంతదూరం ప్రయాణం చేస్తాయి. మరలా అవి విడిపోయి దేని దారిన అవి వెళతాయి. అలాగే భార్యలు, పుత్రులు, బంధువులు, ధనము, అన్నీ కొంతకాలము కలిసి ఉంటాయి. తరువాత విడిపోతుంటాయి. దాని కోసరం ఇప్పుడు బాధపడటం ఎందుకు?

లోకములో ఏ ప్రాణికూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. జనన మరణములు వారి చేతిలో లేవు. వాటి గురించి చింతించడం నిష్ప్రయోజనము.

నేను ఇంతకు ముందు చెప్పినట్టు, మన జీవితము మన చేతిలో లేదు. ఏది ప్రాప్తమో అది అనుభవించవలసిందే. ఇప్పుడు నీకు రాజ్యాధికారము సంక్రమించింది. దానిని అనుభవించడమే నీ బాధ్యత. మన పూర్వులు అదే చేసారు. నువ్వుకూడా అదే చెయ్యి. మన పితృపితామహులు పోయిన మార్గముననే మనమూ నడుద్దాము. నిన్నటి రోజు మరలా రాదు. ప్రవహించిన నీరు తిరిగి రాదు. వయస్సు కూడా అంతే.

కాబట్టి నీ జీవితమును ధర్మమార్గములో నడిపించు. ప్రజలను పాలించి వారికి సుఖమైన పాలనను అందించు. దానికి మన తండ్రి దశరథుడే నిదర్శనము. ఆయన ఎన్నో యజ్ఞములు, యాగములు చేసి, ప్రజలను చక్కగా పాలించి, దానధర్మములు చేసి, చివరకు స్వర్గము చేరుకున్నాడు.
మనము మన తండ్రి గారి గురించి చింతించవలసిన అవసరము లేదు. ఆయన పరిపూర్ణజీవితము అనుభవించి స్వర్గము చేరుకున్నాడు. ఆయనను గురించి దుఃఖించడం మాను. కర్తవ్యమును విస్మరించకు.

అయోధ్యను పాలించమని దశరథుడు నిన్ను ఆదేశించాడు. ఆయన ఆదేశములను పాటించు. అయోధ్యను పాలించు. ఎందుకుంటే, తండ్రిగారు నన్ను వనములకు వెళ్లమని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారము నేను అడవులకు వచ్చానుకదా! అలాగే నీవు కూడా తండ్రి గారి ఆదేశమును పాటించి రాజ్యమును పాలించు. అదే నీ కర్తవ్యము.

ఇప్పుడు నేను నీ మాట విని అయోధ్యకు వస్తే తండ్రిగారి ఆదేశమును ధిక్కరించిన వాడిని అవుతాను. అది అధర్మము. అలాగే నీవు రాజ్యపాలన చెయ్యపోతే నీవుకూడా తండ్రిగారి ఆజ్ఞను ధిక్కరించినట్టే. అది కూడా అధర్మమే.

కాబట్టి నీవు అధర్మము చెయ్యకు. నన్ను అధర్మము వైపుకు లాగకు. తండ్రి గారి ఆదేశము ప్రకారము నీవు అయోధ్యనుపాలించు. నేను అరణ్యమునుపాలించెదను. అదే మన ధర్మము. అప్పుడే మనకు ఇహములో కానీ పరములో కానీసుఖము లభిస్తుంది. కాబట్టి మనము ఇద్దరమూ మన తండ్రి గారి ఆజ్ఞను పాటించి ఆయన పేరు నిలబెడదాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరుద్దాము.” అని పలికాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ షడుత్తరశతతమః సర్గః (106) >>

Aranya Kanda Sarga 34 In Telugu – అరణ్యకాండ చతుస్త్రింశః సర్గః

Aranya Kanda Sarga 34 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుస్త్రింశః సర్గలో, రావణుడు రాముడి పరాక్రమం మరియు ఆయుధాల గురించి ఆరా తీస్తాడు, దీని కోసం శూర్పణఖ రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి మరియు జనస్థానంలో ఏమి జరిగిందో వివరిస్తుంది. సీతను తన భార్యగా సాధించమని రావణుడిని ఆమె ప్రేరేపిస్తుంది, ఎందుకంటే ఆమె అందంలో సీతను మించిన వారు ఎవరూ లేరు.

సీతాహరణోపదేశః

తతః శూర్పణఖాం కృద్ధాం బ్రువంతీం పరుషం వచః |
అమాత్యమధ్యే సంక్రుద్ధః పరిపప్రచ్ఛ రావణః ||

1

కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః |
కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః స దురాసదమ్ ||

2

ఆయుధం కిం చ రామస్య నిహతా యేన రాక్షసాః |
ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా ||

3

ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛితా |
తతో రామం యథాతత్త్వమాఖ్యాతుముపచక్రమే ||

4

దీర్ఘబాహుర్విశాలాక్షశ్చీరకృష్ణాజినాంబరః |
కందర్పసమరూపశ్చ రామో దశరథాత్మజః ||

5

శక్రచాపనిభం చాపం వికృష్య కనకాంగదమ్ |
దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్ ||

6

నాదదానం శరాన్ ఘోరాన్ న ముంచంతం శిలీముఖాన్ |
న కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే ||

7

హన్యమానం తు తత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః |
ఇంద్రేణేవోత్తమం సస్యమాహతం త్వశ్మవృష్టిభిః ||

8

రక్షసాం భీమరూపాణాం సహస్రాణి చతుర్దశ |
నిహతాని శరైస్తీక్ష్ణైస్తేనైకేన పదాతినా ||

9

అర్ధాధికముహూర్తేన ఖరశ్చ సహదూషణః |
ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః ||

10

ఏకా కథంచిన్ముక్తాఽహం పరిభూయ మహాత్మనా |
స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మనా ||

11

భ్రాతా చాస్య మహాతేజాః గుణతస్తుల్యవిక్రమః |
అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ ||

12

అమర్షీ దుర్జయో జేతా విక్రాంతో బుద్ధిమాన్ బలీ |
రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చరః ||

13

రామస్య తు విశాలాక్షీ పూర్ణేందుసదృశాననా |
ధర్మపత్నీ ప్రియా భర్తుర్నిత్యం ప్రియహితే రతా ||

14

సా సుకేశీ సునాసోరుః సురూపా చ యశస్వినీ |
దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా ||

15

తప్తకాంచనవర్ణాభా రక్తతుంగనఖీ శుభా |
సీతా నామ వరారోహా వైదేహీ తనుమధ్యమా ||

16

నైవ దేవీ న గంధర్వీ న యక్షీ న చ కిన్నరీ |
నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే ||

17

యస్య సీతా భవేద్భార్యా యం చ హృష్టా పరిష్వజేత్ |
అతిజీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్ ||

18

సా సుశీలా వపుః శ్లాఘ్యా రూపేణాప్రతిమా భువి |
తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథా పతిః ||

19

తాం తు విస్తీర్ణజఘనాం పీనశ్రోణీపయోధరామ్ |
భార్యార్థే తు తవానేతుముద్యతాహం వరాననామ్ ||

20

విరూపితాఽస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ |
తాం తు దృష్ట్వాఽద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననామ్ ||

21

మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి |
యది తస్యామభిప్రాయో భార్యార్థే తవ జాయతే ||

22

శీఘ్రముద్ధ్రియతాం పాదో జయార్థమిహ దక్షిణః |
కురు ప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర ||

23

వధాత్తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః |
తం శరైర్నిశితైర్హత్వా లక్ష్మణం చ మహారథమ్ ||

24

హతనాథాం సుఖం సీతాం యథావదుపభోక్ష్యసి |
రోచతే యది తే వాక్యం మమైతద్రాక్షసేశ్వర ||

25

క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ |

విజ్ఞాయేహాత్మశక్తిం చ హ్రియతామబలా బలాత్ |
సీతా సర్వానవద్యాంగీ భార్యర్థే రాక్షసేశ్వర ||

26

నిశమ్య రామేణ శరైరజిహ్మగై-
-ర్హతాన్ జనస్థానగతాన్నిశాచరాన్ |
ఖరం చ బుధ్వా నిహతం చ దూషణం
త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి ||

27

Aranya Kanda Sarga 34 In Telugu Pdf Download

నిండు సభలో, మంత్రి సామంత దండనాధుల ముందు తనను తన చెల్లెలు శూర్పణఖ ఆ ప్రకారంగా కించపరిచి మాట్లాడటం సహించలేకపోయాడు రావణుడు. ఆమె మాటలలో నిజం ఉన్నా, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి అతని అహం అంగీకరించలేదు. అందుకని పెద్ద స్వరంతో ఇలా అన్నాడు.

“శూర్పణఖా! ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రాముడు రాముడు అంటున్నావు. ఎవరా రాముడు! అతని బలపరాక్రమములు ఏపాటివి? అతను ఎలా ఉంటాడు? అతడు దండకారణ్యములోకి ఎందుకు ప్రవేశించాడు? నా సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అంటున్నావు. అతని వద్ద ఏయే ఆయుధములు ఉన్నాయి. అనవసరమైన మాటలు మాని అసలు విషయం చెప్పు!” అని అన్నాడు రావణుడు.

అప్పటికి శూర్పణఖకు కూడా ఆవేశం చల్లారింది. రావణునికి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది అని తలచి ఇలా చెప్పసాగింది.

“ఓ రాక్షసేంద్రా! ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహుడు. అరవిందళాయతాక్షుడు. ముని వేషములో ఉన్నాడు కానీ ధనుర్బాణములను ధరించాడు. సౌందర్యములో మన్మధుని మించినవాడు. అతడు నారాచ బాణములను అత్యంత వేగముగా ప్రయోగించగల నేర్పుగలవాడు. అతడు ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు వేస్తాడో ఎవరికి తెలియదు. కాని ఆబాణాలు తగిలి రాక్షసులు చావడం మాత్రం కనపడుతుంది.

అతని ధనుస్సుమాత్రం ఎల్లప్పుడు ఒంగి వర్తులాకారంలో ఉ ంటుంది. అతని యుద్ధము నేను ప్రత్యక్షముగా చూచాను. అతడు ఖరదూషణులను, వారి సేనాధిపతులను, 14,000 సైనికులను ఒకటిన్నర ముహూర్తకాలములో సంహరించాడు. (ముహూర్తము అంటే 48 నిమిషముల కాలము. అంటే మొత్తము యుద్ధము 72 నిమిషము లలో ముగిసిపోయింది అని అర్థము.). ఆ యుద్ధములో నేను తప్ప తక్కిన రాక్షసులు అందరూ మరణించారు. నేను స్త్రీని కాబట్టి నన్ను చంపలేదు అని అనుకుంటున్నాను.

ఆ రామునికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు లక్ష్మణుడు. అతనికి మహాకోపము. అన్నతో సమానమైన బలపరాక్రమములు కలవాడు. అతనిని జయించడం కూడా చాలా కష్టము. రామునికి కుడిభుజము లక్షణుడు. ఇంక ఆ రామునికి ఒక భార్య ఉంది. ఆమె పేరు సీత. మహా సౌందర్యవతి. దేవతాస్త్రీలు, అప్సరసలు, గంధర్వ కాంతలు అందరూ అందంలో ఆమె కాలిగోటికి కూడా చాలరు. ముల్లోకములలో సీత వంటి సౌందర్యవతిని, దేవ, దానవ, గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలలో నేను ఇంతవరకు చూడలేదు.

రాముడు తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అటువంటి సీత ప్రేమను పొందిన రాముడు దేవేంద్రుని కన్నా గొప్పవాడు. (ఇప్పటిదాకా ఉన్నది ఉన్నట్టు చెప్పిన శూర్పణఖ మాట మార్చింది.) రావణా! నా ఉద్దేశంలో సీత లాంటి సౌందర్యవతి నీ వంటి వాడి దగ్గర ఉండాలి కానీ ఆ మానవునికి భార్యగా తగదు. నీవే ఆమెకు తగిన భర్తవు. ఆమె సౌందర్యమును చూచిన తరువాత నీవే ఆమెకు తగినవాడివి అనుకొని, ఆ మాట చెప్పడానికి, సీతను తీసుకురావడానికి వారి వద్దకు వెళ్లాను. ఆ సీతను బలవంతంగా నీ వద్దకు తీసుకు రావడానికి ప్రయత్నించాను. అపుడు ఆ ధూర్తుడైన లక్ష్మణుడు నన్ను పట్టుకొని నా ముక్కు చెవులు కోసి నన్ను అవమానించాడు.

నా సంగతి అటుంచు. ఈ సీతను నీవు ఒకసారి చూస్తే ఆమె లేకుండా తిరిగి లంకానగరానికి రావు. ఆమె చూపులు అనే మన్మధ బాణములకు బలి అయిపోతావు. నా కైతే ఆమె నీకు కైతే ఆమె నీకు భార్యగా తగినది అనిపించింది. నీకు కూడా అదే ఉద్దేశ్యం ఉంటే వెంటనే బయలు దేరు. ఆ రామలక్ష్మణులను చంపి సీతను తీసుకొని రా. నీ భార్యగా చేసుకో. అమరసుఖాలు అనుభవించు. ఆ రామలక్ష్మణులను చంపి, రాముని చేతిలో చచ్చిన రాక్షసుల ఆత్మలకు శాంతి చేకూర్చు.

లక్షణుని చంపితేనే నా అవమానానికి ప్రతీకారం చేసిన వాడివి అవుతావు. రామలక్ష్మణులు చస్తే సీత నీ వశం అవుతుంది. సీతలాంటి సౌందర్యరాసి భార్యగా ఉన్న నిన్ను ముల్లోకాలు శ్లాఘిస్తాయి. నీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సీత మంచి మాటలతో నీకు లొంగకుంటే, బలత్కారంగానైనా తీసుకొనిరా! నీ భార్యగా చేసుకో!

రాక్షసేంద్రా! అన్నింటి కన్నా ముందు, ఆ రాముడు నీ రాక్షససేనలను సర్వనాశనం చేసాడు అని గుర్తుంచుకో! రాముని సంహరించకపోతే దండ కారణ్యములో నీ సార్వభౌమత్వానికి విలువ ఉండదు. తరువాత నీ ఇష్టం.” అని లేని పోని మాటలతో రావణుని రెచ్చగొట్టింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచత్రింశః సర్గః (35) >>

Ayodhya Kanda Sarga 104 In Telugu – అయోధ్యాకాండ చతురుత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 104

అయోధ్యాకాండ చతురుత్తరశతతమః సర్గః

ఈ సర్గలో, రాముడు చైత్రరథానికి వెళ్ళి అక్కడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. చైత్రరథం దివ్యమైన తోటలతో, పుష్పాలతో, వృక్షాలతో, సుందరమైన నీరు ప్రవహించే సరస్సులతో అలరారుతోంది. ఈ ప్రాంతం దివ్యగంధాలతో పరిమళిస్తుంది. రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి చైత్రరథంలో సేదతీరుతాడు. అక్కడ రాముడు సీతకు ఆ ప్రదేశంలోని అందాలను వివరిస్తాడు. తాత్కాలికంగా తన బాధలను మరచిపోయి, సీత, లక్ష్మణులతో ఆనందంగా గడుపుతాడు. ఈ సర్గ రాముడి మనోధైర్యాన్ని, ప్రకృతి ప్రేమను, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది.

రామభరతసంవాదః

తం తు రామః సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలమ్ |
లక్ష్మణేన సహ భ్రాత్రా ప్రష్టుం సముపచక్రమే || ౧ ||

కిమేతదిచ్ఛేయమహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా |
యస్మాత్త్వమాగతో దేశమిమం చీరజటాజినీ || ౨ ||

కిం నిమిత్తమిమం దేశం కృష్ణాజినజటాధరః |
హిత్వా రాజ్యం ప్రవిష్టస్త్వం తత్సర్వం వక్తుమర్హసి || ౩ ||

ఇత్యుక్తః కైకయీపుత్రః కాకుత్స్థేన మహాత్మనా |
ప్రగృహ్య బలవద్భూయః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ || ౪ ||

ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరమ్ |
గతః స్వర్గం మహాబాహుః పుత్రశోకాభిపీడితః || ౫ ||

స్త్రియా నియుక్తః కైకేయ్యా మమ మాత్రా పరంతప |
చకార సుమహత్పాపమిదమాత్మయశోహరమ్ || ౬ ||

సా రాజ్యఫలమప్రాప్య విధవా శోకకర్శితా |
పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ || ౭ ||

తస్య మే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి |
అభిషించస్వ చాద్యైవ రాజ్యేనప మఘవానివ || ౮ ||

ఇమాః ప్రకృతయః సర్వా విధవా మాతరశ్చ యాః |
త్వత్సకాశమనుప్రాప్తాః ప్రసాదం కర్తుమర్హసి || ౯ ||

తదానుపూర్వ్యా యుక్తం చ యుక్తం చాత్మని మానద |
రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు || ౧౦ ||

భవత్వవిధవా భూమిః సమగ్రా పతినా త్వయా |
శశినా విమలేనేవ శారదీ రజనీ యథా || ౧౧ ||

ఏభిశ్చ సచివైః సార్ధం శిరసా యాచితో మయా |
భ్రాతుః శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి || ౧౨ ||

తదిదం శాశ్వతం పిత్ర్యం సర్వం ప్రకృతిమండలమ్ |
పూజితం పురుషవ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి || ౧౩ ||

ఏవముక్త్వా మహాబాహుః సబాష్పః కైకయీసుతః |
రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్పునః || ౧౪ ||

తం మత్తమివ మాతంగం నిఃశ్వసంతం పునఃపునః |
భ్రాతరం భరతం రామః పరిష్వజ్యేదమబ్రవీత్ || ౧౫ ||

కులీనః సత్త్వసంపన్నస్తేజస్వీ చరితవ్రతః |
రాజ్యహేతోః కథం పాపమాచరేత్త్వద్విధో జనః || ౧౬ ||

న దోషం త్వయి పశ్యామి సూక్ష్మమప్యరిసూదన |
న చాపి జననీం బాల్యాత్త్వం విగర్హితుమర్హసి || ౧౭ ||

కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదాఽనఘ |
ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే || ౧౮ ||

వయమస్య యథా లోకే సంఖ్యాతాః సౌమ్య సాధుభిః |
భార్యాః పుత్రాశ్చ శిష్యాశ్చ త్వమను జ్ఞాతుమర్హసి || ౧౯ ||

వనే వా చీరవసనం సౌమ్య కృష్ణాజినాంబరమ్ |
రాజ్యే వాఽపి మహారాజో మాం వాసయితుమీశ్వరః || ౨౦ ||

యావత్పితరి ధర్మజ్ఞే గౌరవం లోకసత్కృతమ్ |
తావద్ధర్మభృతాం శ్రేష్ఠ జనన్యామపి గౌరవమ్ || ౨౧ ||

ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్ఛేతి రాఘవ |
మాతాపితృభ్యాముక్తోఽహం కథమన్యత్ సమాచరే || ౨౨ ||

త్వయా రాజ్యమయోధ్యాయాం ప్రాప్తవ్యం లోకసత్కృతమ్ |
వస్తవ్యం దండకారణ్యే మయా వల్కలవాససా || ౨౩ ||

ఏవం కృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ |
వ్యాదిశ్య చ మహాతేజాః దివం దశరథో గతః || ౨౪ ||

స చ ప్రమాణం ధర్మాత్మా రాజా లోకగురుస్తవ |
పిత్రా దత్తం యథాభాగముపభోక్తుం త్వమర్హసి || ౨౫ ||

చతుర్దశసమాః సౌమ్య దండకారణ్యమాశ్రితః |
ఉపభోక్ష్యే త్వహం దత్తం భాగం పిత్రా మహాత్మనా || ౨౬ ||

యదబ్రవీన్మాం నరలోకసత్కృతః
పితా మహాత్మా విబుధాధిపోపమః |
తదేవ మన్యే పరమాత్మనో హితమ్
న సర్వలోకేశ్వరభావమప్యహమ్ || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురుత్తరశతతమః సర్గః || ౧౦౪ ||

Ayodhya Kanda Sarga 104 Meaning In Telugu

దశరథుని భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయీ కులగురువు వసిష్ఠుని వెంట రాముని ఆశ్రమానికి వస్తున్నారు. వారుమందాకినీ నది ఒడ్డున నడుస్తున్నారు. అక్కడి వారు, రాముడు, సీత స్నానమునకు ఉపయోగించు నదీతీరమును చూపించారు. కౌసల్యకు దు:ఖము ఆగలేదు. తనవెంట ఉన్న సుమిత్రను చూచి ఇలా అంది.

“చూచావా సుమిత్రా! రాజభోగములు అనుభవించవలసిన నీ కుమారుడు లక్ష్మణుడు, నా కుమారుడు రాముడు, నా కోడలు సీత, అయోధ్యనుండి వెడలగొట్టబడి, దిక్కులేని వారి మాదిరి ఒంటరిగా ఈ నదీతీరంలో స్నానం చేస్తున్నారు. సుమిత్రా! నీ కుమారుడు ఇక్కడి నుండి రాముని కొరకు, సీతకొరకు జలములు తీసుకొనిపోవడం నీచకార్యము అని అనుకోకు. తన అన్నకు సేవ చేసే నిమిత్తం చేసే ఏ కార్యమైనా అది దోషము కాదు. అయినా ఇంక ఎన్నాళ్లు? భరతుడు ఇప్పటికే రాముని అయోధ్యకు వచ్చి తన రాజ్యము స్వీకరించమని ప్రార్థిస్తూ ఉంటాడు. రామలక్ష్మణుల కష్టాలు గట్టెక్కుతాయి. లక్ష్మణునికి అన్నగారి దాస్యము తప్పుతుంది.” అని అన్నది కౌలస్య. ఇంతలో వారు రాముడు తన తండ్రికి పిండప్రదానము చేసినచోటికి చేరుకున్నారు. దక్షిణ ముఖంగా పరచిన దర్భలు, వాటి మీద పెట్టబడిన పిండి తో చేసిన పిండములు చూచారు.
“చూడండి. రాముడు ఇక్కడే తన తండ్రికి పిండప్రదానం చేసాడు. ఆ పిండములు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ప్రతిరోజూ పంచభక్ష్య పరమాన్నములతో భోజనము చేసే దశరథుడు ఈ పిండితో చేసిన పిండములను ఎలా ఆరగించగలడో.. ఏమో!

అయోధ్యాపతి అయిన రాముడు తన తండ్రికి పిండితో పిండప్రదానము చెయ్యడం చాలా బాధాకరంగా ఉంది. ఈ లోకంలో పురుషులు ఏమి తింటారో దానిని పితృదేవతలకు సమర్పిస్తారట. అంటే రాముడు ఈ పిండి తిని బతుకుతున్నాడా! రాజాధిరాజైన రామునికి ఎంత దుర్గతిపట్టింది. ఇది చూచి కూడా నా హృదయం ముక్కలు కాలేదంటే నా హృదయం రాయి కంటే కఠినమై ఉండాలి.” అని శోకించింది కౌసల్య.

మిగిలిన భార్యలు ఆమెను ఓదార్చారు. ఈప్రకారంగా రాముని గురించి తలచుకుంటూ దు:ఖపడుతూ అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల వద్ద నేల మీద కూర్చుని ఉన్న రాముని చూడగానే దశరథుని భార్యలకు దుఃఖము ఆగలేదు. భోరున ఏడ్చారు. వారిని చూడగానే రాముడు వారి వద్దకు వెళ్లాడు. తనతల్లులందరికీ పాదనమస్కారము చేసాడు. వారంతరూ రాముని వీపునిమిరి, తలను నిమిరి ఆశీర్వదించారు. రాముని వెంట లక్ష్మణుడుకూడా తల్లులందరి పాదములు తాకి నమస్కరించాడు. వారందరూ లక్ష్మణుని శిరస్సునిమిరి ఆశీర్వదించారు. తరువాత సీత తన అత్తగార్లు అందరికీ పాద నమస్కారము చేసి వారి ఆశీర్వ చనములు స్వీకరించింది.

సీతను చూచిన కౌసల్యకు దు:ఖము ఆగలేదు. సీతను తన కూతురును కౌగలించుకున్నట్టు గట్టిగా కౌగలించుకుంది. “జనకమహారాజు కూతురు, దశరధ మహారాజు కోడలు, రామునిభార్య, నిర్మానుష్యంగా ఉన్న ఈ అరణ్యములలో ఎన్ని కష్టములు పడుతూ ఉందోకదా! అమ్మా సీతా! వాడి పోయిన కమలము వలె ఉన్న నీ ముఖం చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదమ్మా!”అనిసీతను పట్టుకొని ఏడిచింది.

వీరు ఇలా దు:ఖపడుతూ ఉంటే, రాముడు వసిష్ఠునికి పాదాభివందనం చేసాడు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు. తరువాత అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. వసిష్ఠుడు రాముని పక్కన కూర్చున్నాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరొకపక్క కూర్చున్నారు. మంత్రులు, దండనాధులు, పురప్రముఖులు వారి వారి అర్హతకు తగ్గట్టు కూర్చున్నారు. అందరూ భరతుడు రామునితో ఏం మాట్లాడతాడో అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచోత్తరశతతమః సర్గః (105) >>