Ayodhya Kanda Sarga 103 In Telugu – అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 103

అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః

ఈ సర్గలో, రాముడు సుమంతుని ద్వారా తన తండ్రి మరణవార్త తెలుసుకుంటాడు. ఆయన విషాదంలో మునిగి తండ్రి, జననీ కౌసల్యా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. భరతుడు ఆయన్ని తిరిగి రావాలని ప్రార్థించినా, రాముడు తన వాగ్దానాన్ని పాటించాల్సిన కర్తవ్యం ఉందని అంటాడు. రాముడు తన తల్లి కౌసల్యా, సుమిత్రా, కైకేయి లకు దాస్యభక్తితో వీడా వడులు చెప్పి, తన ధర్మాన్ని పరిరక్షించాలని నిర్ణయిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులు తమ వనవాసాన్ని కొనసాగించడానికి దండకారణ్యంలోకి వెళ్లి, పుణ్యాశ్రమాలలో నివసిస్తారు. ఈ సర్గ రాముడి ధర్మబద్ధతను, కుటుంబానుభవాలను, దైవిక కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

మాతృదర్శనమ్

వసిష్ఠః పురతః కృత్వా దారాన్ దశరథస్య చ |
అభిచక్రామ తం దేశం రామదర్శనతర్షితః || ౧ ||

రాజపత్న్యశ్చ గచ్ఛంత్యో మందం మందాకినీం ప్రతి |
దదృశుస్తత్ర తత్తీర్థం రామలక్ష్మణసేవితమ్ || ౨ ||

కౌసల్యా బాష్పపూర్ణేన ముఖేన పరిశుష్యతా |
సుమిత్రామబ్రవీద్దీనా యాశ్చాన్యా రాజయోషితః || ౩ ||

ఇదం తేషామనాథానాం క్లిష్టమక్లిష్టకర్మణామ్ |
వనే ప్రాక్కేవలం తీర్థం యే తే నిర్విషయీకృతాః || ౪ ||

ఇతః సుమిత్రే పుత్రస్తే సదా జలమతంద్రితః |
స్వయం హరతి సౌమిత్రిర్మమ పుత్రస్య కారణాత్ || ౫ ||

జఘన్యమపి తే పుత్రః కృతవాన్న తు గర్హితః |
భ్రాతుర్యదర్థసహితం సర్వం తద్విహితం గుణైః || ౬ ||

అద్యాయమపి తే పుత్రః క్లేశానామతథోచితః |
నీచానర్థసమాచారం సజ్జం కర్మ ప్రముంచతు || ౭ ||

దక్షిణాగ్రేషు దర్భేషు సా దదర్శ మహీతలే |
పితురింగుదిపిణ్యాకం న్యస్తమాయతలోచనా || ౮ ||

తం భూమౌ పితురార్తేన న్యస్తం రామేణ వీక్ష్య సా |
ఉవాచ దేవీ కౌసల్యా సర్వా దశరథస్త్రియః || ౯ ||

ఇదమిక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః |
రాఘవేణ పితుర్దత్తం పశ్యతైతద్యథావిధి || ౧౦ ||

తస్య దేవసమానస్య పార్థివస్య మహాత్మనః |
నైతదౌపయికం మన్యే భుక్తభోగస్య భోజనమ్ || ౧౧ ||

చతురంతాం మహీం భుక్త్వా మహేంద్రసదృశో విభుః |
కథమింగుదిపిణ్యాకం స భుంక్తే వసుధాఽధిపః || ౧౨ ||

అతో దుఃఖతరం లోకే న కించిత్ ప్రతిభాతి మా |
యత్ర రామః పితుర్దద్యాదింగుదీక్షోదమృద్ధిమాన్ || ౧౩ ||

రామేణేంగుదిపిణ్యాకం పితుర్దత్తం సమీక్ష్య మే |
కథం దుఃఖేన హృదయం న స్ఫోటతి సహస్రధా || ౧౪ ||

శ్రుతిస్తు ఖల్వియం సత్యా లౌకికీ ప్రతిభాతి మా |
యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః || ౧౫ ||

ఏవమార్తాం సపత్న్యస్తాః జగ్మురాశ్వాస్య తాం తదా |
దదృశుశ్చాశ్రమే రామం స్వర్గచ్యుతమివామరమ్ || ౧౬ ||

సర్వభోగైః పరిత్యక్తం రామం సంప్రేక్ష్య మాతరః |
ఆర్తా ముముచురశ్రూణి సస్వరం శోకకర్శితాః || ౧౭ ||

తాసాం రామః సముత్థాయ జగ్రాహ చరణాన్ శుభాన్ |
మాతౄఽణాం మనుజవ్యాఘ్రః సర్వాసాం సత్యసంగరః || ౧౮ ||

తాః పాణిభిః సుఖస్పర్శైర్మృద్వంగుళితలైః శుభైః |
ప్రమమార్జూ రజః పృష్ఠాద్రామస్యాయతలోచనాః || ౧౯ ||

సౌమిత్రిరపి తాః సర్వాః మాతౄఽస్సంప్రేక్ష్య దుఃఖితః |
అభ్యవాదయతాసక్తం శనై రామాదనంతరమ్ || ౨౦ ||

యథా రామే తథా తస్మిన్ సర్వా వవృతిరే స్త్రియః |
వృత్తిం దశరథాజ్జాతే లక్ష్మణే శుభలక్షణే || ౨౧ ||

సీతాఽపి చరణాంస్తాసాముపసంగృహ్య దుఃఖితా |
శ్వశ్రూణామశ్రుపూర్ణాక్షీ సా బభూవాగ్రతః స్థితా || ౨౨ ||

తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా దుహితరం యథా |
వనవాసకృశాం దీనాం కౌసల్యా వాక్యమబ్రవీత్ || ౨౩ ||

విదేహరాజస్య సుతా స్నుషా దశరథస్య చ |
రామపత్నీ కథం దుఃఖం సంప్రాప్తా నిర్జనే వనే || ౨౪ ||

పద్మమాతపసంతప్తం పరిక్లిష్టమివోత్పలమ్ |
కాంచనం రజసా ధ్వస్తం క్లిష్టం చంద్రమివాంబుదైః || ౨౫ ||

ముఖం తే ప్రేక్ష్య మాం శోకో దహత్యగ్నిరివాశ్రయం
భృశం మనసి వైదేహి వ్యసనారణిసంభవః || ౨౬ ||

బ్రువంత్యామేవమార్తాయాం జనన్యాం భరతాగ్రజః |
పాదావాసాద్య జగ్రాహ వసిష్ఠస్య చ రాఘవః || ౨౭ ||

పురోహితస్యాగ్నిసమస్య వై తదా
బృహస్పతేరింద్ర ఇవామరాధిపః |
ప్రగృహ్య పాదౌ సుసమృద్ధతేజసః
సహైవ తేనోపవివేశ రాఘవః || ౨౮ ||

తతో జఘన్యం సహితైః సమంత్రిభిః
పురప్రధానైశ్చ సహైవ సైనికైః |
జనేన ధర్మజ్ఞతమేన ధర్మవాన్
ఉపోపవిష్టో భరతస్తదాగ్రజమ్ || ౨౯ ||

ఉపోపవిష్టస్తు తథా స వీర్యవాన్
తపస్వివేషేణ సమీక్ష్య రాఘవమ్ |
శ్రియా జ్వలంతం భరతః కృతాంజలిః
యథా మహేంద్రః ప్రయతః ప్రజాపతిమ్ || ౩౦ ||

కిమేష వాక్యం భరతోఽద్య రాఘవం
ప్రణమ్య సత్కృత్య చ సాధు వక్ష్యతి |
ఇతీవ తస్యార్యజనస్య తత్త్వతో
బభూవ కౌతూహలముత్తమం తదా || ౩౧ ||

స రాఘవః సత్యధృతిశ్చ లక్ష్మణో
మహానుభావో భరతశ్చ ధార్మికః |
వృతాః సుహృద్భిశ్చ విరేజురధ్వరే
యథా సదస్యైః సహితాస్త్రయోఽగ్నయః || ౩౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యుత్తరశతతమః సర్గః || ౧౦౩ ||

Ayodhya Kanda Sarga 103 Meaning In Telugu

భరతుడు చెప్పిన తండ్రి మరణ వార్తను వినగానే రాముడు కిందపడి మూర్ఛపోయాడు.
(ఇక్కడ మీకు ఒక సందేహము రావచ్చు. 101వ సర్గలో భరతుడు రామునికి దశరథుని మరణ వార్త చెప్పాడు. “గతః స్వర్గం మహాబాహు: పుత్రశోకాభిపీడిత:” పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యూడు అని చెప్పాడు. 101వ సర్గ ఆఖరులో రాముడు “ఏవంకృత్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాదిశ్య చ మాహాతేజ దివం దశరథో గత:” ఈ విధంగా రాజ్యవిభాగము చేసి దశరథుడు దివంగతుడయ్యాడు అని రాముడు కూడా అన్నాడు. కాని 103 వ సర్గ మొదటి భాగంలో తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు అని ఉంది. ఈ మూర్ఛపోవడం మొదట భరతుడు తండ్రి మరణ వార్త చెప్పినపుడే జరిగి ఉండాల్సింది. ముందు ముందు ఇలాంటి పరస్పర వ్యతిరేక సన్నివేశాలు వస్తుంటాయి. గమనించండి.) మొదలు నరికిన చెట్టులా కిందపడిపోయిన రాముని చూచి సీత ఏడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. రాముని మీద నీళ్లు చల్లి అతనికి సేదతీర్చింది. రాముడు మూర్ఛనుండి తేరుకున్నాడు. దీనంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. రాముడు తన తండ్రి మరణ వార్త విని భరతునితో ఇలా అన్నాడు.

“భరతా! నా తండ్రే లేనపుడు నాకు అయోధ్యతో ఏమి పని! దశరథుడులేని అయోధ్యను నేను మాత్రము ఎలా పరిపాలింపగలను. నా మీద దు:ఖముతో మరణించిన నా తండ్రికి నేను అంతిమ సంస్కారములు చేయడానికి కూడా నోచుకోలేదు కదా! నేను ఆయనకు చెడ పుట్టాను. నేను పెద్దకొడుకుగా ఉండి ఆయనకు ఏమి చేయగలిగాను. పెద్దకొడుకుగా కనీసం నా విధులను కూడా నేను నిర్వర్తించలేకపోయాను.

ఓ భరతా! శత్రుఘ్నా! మీరు ఇద్దరూ పుణ్యాత్ములు. తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేయగలిగారు. భరతా! ఇప్పుడే చెబుతున్నాను. ఇప్పుడే కాదు, ఈ పధ్నాలుగు సంవత్సరముల వనవాసము తరువాత కూడా, దశరథుడు లేని అయోధ్యలో నేను అడుగుపెట్టను. దశరథుడులేని అయోధ్యను ఊహించలేను. ఎందుకంటే, వనవాసానంతరము నేను రాజ్యాధికారము చేపడితే నాకు దిశానిర్దేశము ఎవరు చేస్తారు. నాకు మంచీ చెడూ ఎవరు చెబుతారు. నేను అయోధ్యలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనులను మెచ్చుకుంటూ తండ్రిగారు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు. ఇప్పుడు నాకు అలా ఎవరు చెబుతారు.” అని శోకిస్తున్నాడు రాముడు.

సీతను చూచి రాముడు ఇలా అన్నాడు. “సీతా! నీకు పితృసమానులు, నీ మామగారు మరణించారు. లక్ష్మణుడు పితృహీనుడయ్యాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు?’ అని విలపిస్తున్నాడు రాముడు. రాముడు ఇలా ఏడుస్తుంటే మిగిలిన తమ్ముళ్లు కూడా ఏడుస్తున్నారు.
కొంచెం సేపటికి లక్ష్మణుడు తేరుకొని అన్నరాముని చూచి “అన్నయ్యా! మనప్రస్తుత కర్తవ్యము తండ్రి గారికి జలతర్పణములు ఇవ్వాలి.” అని గుర్తుచేసాడు.

పితృసమానుడైన మామగారు పరమపదించారు అన్నవార్త విన్న సీత దు:ఖంతో కుమిలిపోయింది. కళ్లనిండా నీళ్లుకమ్ముకున్నాయి. ఏడుస్తున్న సీతను చూచాడు రాముడు. ఆమెను ఓదార్చాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా!మనము తండ్రిగారికి పిండప్రదానముచేయవలెను. నీవుపోయి పిండి, బదరీఫలములు సిద్ధ చేయి.” అని అన్నాడు. ముందు సీత నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే రాముడు వారి వెనక మందాకినీ నదీ తీరానికి వెళ్లాడు. వారి వెంట సుమంత్రుడు వెళ్లాడు. అందరూ మందాకినీ నదీ తీరానికి చేరుకున్నారు. సుమంత్రుడు తాను ముందుగా నదిలోకిదిగి, తరువాత రామలక్ష్మణులను, సీతను వారి చేతులుపట్టుకొని నదిలోకి దింపాడు. అందరూ స్నానములు చేసారు. రాముడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణము వైపుతిరిగి “ఓ తండ్రీ! నీకు జలమును విడుస్తున్నాము. పితృలోకములో ఉన్న నీకు ఈజలము అక్షయంగా ఉపతిష్ఠమగును గాక!”అని ఆ జలమును నదిలో విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులు మందాకినీ నది ఒడ్డున దశరథునకు పిండితో పిండప్రదానము చేసారు. నేల మీద దరలు పరిచారు. ఆ దర్భల మీద బదరీఫలములతో కూడిన పిండిని పిండములుగాచేసి పెట్టారు. “ఓ తండ్రీ! మేమే ప్రతిదినమూ తినే ఆహారమునే నీకు పిండములుగా సమర్పించుకుంటున్నాము. స్వీకరించు. ఈ లోకంలో పురుషులు దేనిని తింటారో దానినే పితృలోకంలో ఉన్నపితృదేవతలు కూడా తింటారుకదా!” అని పలికాడు రాముడు.

పిండప్రదాన కార్యక్రమము ముగిసినతరువాత అందరూ పర్ణశాలకు చేరుకున్నారు. తరువాత కూడా అన్నదమ్ములు తండ్రిమరణానికి బాధపడుతూనే ఉన్నారు. అన్నదమ్ములు చేస్తున్న రోదన ధ్వనులు దూరంగా ఉన్న సైనికులకు వినబడ్డాయి. ‘భరతుడు రాముని చేరుకున్నాడు, అందరూ దశరథుని మరణానికి దు:ఖిస్తున్నారు’ అని వారు తెలుసుకున్నారు. వారంతా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతురతగా ఉన్నారు. అందరూ రాముని పర్ణశాల వైపుకు ప్రయాణం అయ్యారు.

అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల ముందు నేలమీదకూర్చొని ఉన్న రాముని చూచారు. రామునికి ఆ గతి పట్టించిన కైకను, మంధరను నోటికొచ్చినట్టు తిడుతూ ఏడుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న రాముని చూచి వారికి కన్నీళ్లు ఆగలేదు. రాముడు అందరినీ చూచాడు. పురుషులను, స్త్రీలను తన కన్న తల్లి తండ్రులవలె కౌగలించుకొని వారి ఓదార్పువచనములను విన్నాడు. కొంతమంది రామునికి నమస్కరించారు. కొంత మంది రాముని పరామర్శించారు. రాముడు అందరినీ వారి వారి అర్హతలను బట్టి గౌరవించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ చతురుత్తరశతతమః సర్గః (104) >>

Ayodhya Kanda Sarga 102 In Telugu – అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 102

అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః

ఈ సర్గలో భరతుడు, రాముడి వనవాసాన్ని ముగించి ఆయోధ్యకు తిరిగి రమ్మని వేడుకుంటాడు. రాముడు తన వాగ్దానాన్ని గుర్తుచేసి, వనవాసం పూర్తయ్యే వరకు తిరిగి రాలేనని చెబుతాడు. భరతుడు నిరాశచెందినప్పటికీ, రాముడి పాదుకలను తీసుకుని తిరిగి ఆయోధ్యకు వెళ్ళి, అవి రాజాసనంపై ఉంచి రాముడి తరపున రాజ్యాన్ని పరిపాలిస్తాడు. భరతుడు రాముడి పాదుకలను ప్రతినిధిగా భావించి, ధర్మబద్ధంగా పాలన చేస్తాడు. ఈ సర్గ భరతుడి వినయం, రాముడి నిబద్ధత, సోదరుల మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది.

నివాపదానమ్ 

తాం శ్రుత్వా కరుణాం వాచం పితుర్మరణసంహితామ్ |
రాఘవో భరతేనోక్తాం బభూవ గతచేతనః || ౧ ||

తం తు వజ్రమివోత్సృష్టమాహవే దానవారిణా |
వాగ్వజ్రం భరతేనోక్తమమనోజ్ఞం పరంతపః || ౨ ||

ప్రగృహ్య బాహూ రామో వై పుష్పితాగ్రో యథా ద్రుమః |
వనే పరశునా కృత్తస్తథా భువి పపాత హ || ౩ ||

తథా నిపతితం రామం జగత్యాం జగతీపతిమ్ |
కూలఘాతపరిశ్రాంతం ప్రసుప్తమివ కుంజరమ్ || ౪ ||

భ్రాతరస్తే మహేష్వాసం సర్వతః శోకకర్శితమ్ |
రుదంతః సహ వైదేహ్యా సిషిచుః సలిలేన వై || ౫ ||

స తు సంజ్ఞాం పునర్లబ్ధ్వా నేత్రాభ్యామాస్రముత్సృజన్ |
ఉపాక్రామత కాకుత్స్థః కృపణం బహుభాషితుమ్ || ౬ ||

స రామః స్వర్గతం శ్రుత్వా పితరం పృథివీపతిమ్ |
ఉవాచ భరతం వాక్యం ధర్మాత్మా ధర్మసంహితమ్ || ౭ ||

కిం కరిష్యామ్యయోధ్యాయాం తాతే దిష్టాం గతిం గతే |
కస్తాం రాజవరాద్ధీనామయోధ్యాం పాలయిష్యతి || ౮ ||

కిం ను తస్య మయా కార్యం దుర్జాతేన మహాత్మనః |
యో మృతో మమ శోకేన మయా చాపి న సంస్కృతః || ౯ ||

అహో భరత సిద్ధార్థో యేన రాజా త్వయాఽనఘ |
శత్రుఘ్నేన చ సర్వేషు ప్రేతకృత్యేషు సత్కృతః || ౧౦ ||

నిష్ప్రధానామనేకాగ్రాం నరేంద్రేణ వినా కృతామ్ |
నివృత్తవనవాసోఽపి నాయోధ్యాం గంతుముత్సహే || ౧౧ ||

సమాప్తవనవాసం మామయోధ్యాయాం పరంతప |
కో ను శాసిష్యతి పునస్తాతే లోకాంతరం గతే || ౧౨ ||

పురా ప్రేక్ష్య సువృత్తం మాం పితా యాన్యాహ సాంత్వయన్ |
వాక్యాని తాని శ్రోష్యామి కుతః కర్ణసుఖాన్యహమ్ || ౧౩ ||

ఏవముక్త్వా స భరతం భార్యామభ్యేత్య రాఘవః |
ఉవాచ శోకసంతప్తః పూర్ణచంద్రనిభాననామ్ || ౧౪ ||

సీతే మృతస్తే శ్వశురః పిత్రా హీనోఽసి లక్ష్మణ |
భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిమ్ || ౧౫ ||

తతో బహుగుణం తేషాం బాష్పం నేత్రేష్వజాయత |
తథా బ్రువతి కాకుత్స్థే కుమారాణాం యశస్వినామ్ || ౧౬ ||

తతస్తే భ్రాతరః సర్వే భృశమాశ్వాస్య రాఘవమ్ |
అబ్రువన్ జగతీభర్తుః క్రియతాముదకం పితుః || ౧౭ ||

సా సీతా శ్వశురం శ్రుత్వా స్వర్గలోకగతం నృపమ్ |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యామశకన్నేక్షితుం పతిమ్ || ౧౮ ||

సాంత్వయిత్వా తు తాం రామో రుదంతీం జనకాత్మజామ్ |
ఉవాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచః || ౧౯ ||

ఆనయేంగుదిపిణ్యాకం చీరమాహర చోత్తరమ్ |
జలక్రియార్థం తాతస్య గమిష్యామి మహాత్మనః || ౨౦ ||

సీతా పురస్తాద్వ్రజతుత్వమేనామభితో వ్రజ |
అహం పశ్చాద్గమిష్యామి గతిర్హ్యేషా సుదారుణా || ౨౧ ||

తతో నిత్యానుగస్తేషాం విదితాత్మా మహామతిః |
మృదుర్దాంతశ్చ శాంతశ్చ రామే చ దృఢభక్తిమాన్ || ౨౨ ||

సుమంత్రస్తైర్నృపసుతైః సార్ధమాశ్వాస్య రాఘవమ్ |
అవాతారయదాలంబ్య నదీం మందాకినీం శివామ్ || ౨౩ ||

తే సుతీర్థాం తతః కృచ్ఛ్రాదుపాగమ్య యశస్వినః |
నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పితకాననామ్ || ౨౪ ||

శీఘ్రస్రోతసమాసాద్య తీర్థం శివమకర్దమమ్ |
సిషిచుస్తూదకం రాజ్ఞే తత్రైతత్తే భవత్వితి || ౨౫ ||

ప్రగృహ్య చ మహీపాలో జలపూరితమంజలిమ్ |
దిశం యామ్యామభిముఖో రుదన్ వచనమబ్రవీత్ || ౨౬ ||

ఏతత్తే రాజశార్దూల విమలం తోయమక్షయమ్ |
పితృలోకగతస్యాద్య మద్దత్తముపతిష్ఠతు || ౨౭ ||

తతో మందాకినీతీరాత్ ప్రత్యుత్తీర్య స రాఘవః |
పితుశ్చకార తేజస్వీ నివాపం భ్రాతృభిః సహ || ౨౮ ||

ఐంగుదం బదరీమిశ్రం పిణ్యాకం దర్భసంస్తరే |
న్యస్య రామః సుదుఃఖార్తో రుదన్ వచనమబ్రవీత్ || ౨౯ ||

ఇదం భుంక్ష్వ మహారాజ ప్రీతో యదశనా వయమ్ |
యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః || ౩౦ ||

తతస్తేనైవ మార్గేణ ప్రత్యుత్తీర్య నదీతటాత్ |
ఆరురోహ నరవ్యాఘ్రో రమ్యసానుం మహీధరమ్ || ౩౧ ||

తతః పర్ణకుటీద్వారమాసాద్య జగతీపతిః |
పరిజగ్రాహ బాహుభ్యాముభౌ భరతలక్ష్మణౌ || ౩౨ ||

తేషాం తు రుదతాం శబ్దాత్ ప్రతిశ్రుత్కోఽభవద్గిరౌ |
భ్రాతౄఽణాం సహ వైదేహ్యాః సింహానామివ నర్దతామ్ || ౩౩ ||

మహాబలానాం రుదతాం కుర్వతాముదకం పితుః |
విజ్ఞాయ తుములం శబ్దం త్రస్తా భరతసైనికాః || ౩౪ ||

అబ్రువంశ్చాపి రామేణ భరతః సంగతో ధ్రువమ్ |
తేషామేవ మహాంఛబ్దః శోచతాం పితరం మృతమ్ || ౩౫ ||

అథ వాసాన్ పరిత్యజ్య తం సర్వేఽభిముఖాః స్వనమ్ |
అప్యేకమనసో జగ్ముర్యథాస్థానం ప్రధావితాః || ౩౬ ||

హయైరన్యే గజైరన్యే రథైరన్యే స్వలంకృతైః |
సుకుమారాస్తథైవాన్యే పద్భిరేవ నరా యయుః || ౩౭ ||

అచిరప్రోషితం రామం చిరవిప్రోషితం యథా |
ద్రష్టుకామో జనః సర్వో జగామ సహసాఽఽశ్రమమ్ || ౩౮ ||

భ్రాతౄఽణాం త్వరితాస్తత్ర ద్రష్టుకామాః సమాగమమ్ |
యయుర్బహువిధైర్యానైః ఖురనేమిస్వనాకులైః || ౩౯ ||

సా భూమిర్బహుభిర్యానైః ఖురనేమిసమాహతా |
ముమోచ తుములం శబ్దం ద్యౌరివాభ్రసమాగమే || ౪౦ ||

తేన విత్రాసితా నాగాః కరేణుపరివారితాః |
ఆవాసయంతో గంధేన జగ్మురన్యద్వనం తతః || ౪౧ ||

వరాహవృకసంఘాశ్చ మహిషాః సర్ప్పవానరాః |
వ్యాఘ్రగోకర్ణగవయాః విత్రేసుః పృషతైః సహ || ౪౨ ||

రథాంగసాహ్వా నత్యూహాః హంసాః కారండవాః ప్లవాః |
తథా పుంస్కోకిలాః క్రౌంచా విసంజ్ఞా భేజిరే దిశః || ౪౩ ||

తేన శబ్దేన విత్రస్తైరాకాశం పక్షిభిర్వృతమ్ |
మనుష్యైరావృతా భూమిరుభయం ప్రబభౌ తదా || ౪౪ ||

తతస్తం పురుషవ్యాఘ్రం యశస్వినమరిందమమ్ |
ఆసీనం స్థండిలే రామం దదర్శ సహసా జనః || ౪౫ ||

విగర్హమాణః కైకేయీం సహితో మంథరామపి |
అభిగమ్య జనో రామం బాష్పపూర్ణముఖోఽభవత్ || ౪౬ ||

తాన్నరాన్ బాష్పపూర్ణాక్షాన్ సమీక్ష్యాథ సుదుఃఖితాన్ |
పర్యష్వజత ధర్మజ్ఞః పితృవన్మాతృవచ్చ సః || ౪౭ ||

స తత్ర కాంశ్చిత్ పరిషస్వజే నరాన్
నరాశ్చ కేచిత్తు తమభ్యవాదయన్ |
చకార సర్వాన్ సవయస్యబాంధవాన్
యథాఽర్హమాసాద్య తదా నృపాత్మజః || ౪౮ ||

స తత్ర తేషాం రుదతాం మహాత్మనామ్
భువం చ ఖం చానునినాదయన్ స్వనః |
గుహా గిరీణాం చ దిశశ్చ సంతతం
మృదంగఘోషప్రతిమః ప్రశుశ్రువే || ౪౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే శ్రీమదయోధ్యాకాండే ద్వ్యధికశతతమః సర్గః || ౧౦౨ ||

Ayodhya Kanda Sarga 102 Meaning In Telugu

రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు భరతుడు. తిరిగి రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను ధర్మహీనుడను. నాకు రాజధర్మము గురించి ఏమితెలుసు. నాకు తెలిసిందల్లా ఒకటే. అది మన కులధర్మము. మనవంశాచారము. ఇక్ష్వాకు వంశములో ఇంతవరకూ పెద్దవాడే రాజ్యభారము వహించాడు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాలేదు. కాకూడదు. ఇప్పుడు నీవు మన వంశములో పెద్దవాడవు. నేను నీ కన్నా చిన్నవాడను. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడవు కమ్ము. అదే నాకోరిక.

రామా! మామూలు ప్రజల దృష్టిలో రాజుకూడా ఒక సాధారణమానవుడే. కానీ, రాజు అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. రాజుకాదగ్గ లక్షణాలే నీకే ఉన్నాయి. నాలో ఎంత మాత్రమూ లేవు. కాబట్టి అయోధ్యకు రాజుకాదగ్గ వాడవు నీవే. ఇంక అసలు విషయానికి వద్దాము. నేను కేకయ దేశములో ఉండగా. నీవు అరణ్యములకు వెళ్లగా, మన తండ్రిగారు దశరథమహారాజుగారు స్వర్గస్థులయ్యారు. నేను శత్రుఘ్నుడు కలిసి తండ్రి గారికి అంత్యక్రియలు చేసాము. ఇప్పుడు నీవు తండ్రిగారికి జలతర్పణములు విడువ వలెను. తండ్రిగారికి జ్యేష్టుడవు, ప్రియపుత్రుడవు నీవు. కాబట్టి నీవు విడిచే జలతర్పణములు మన తండ్రిగారికి అత్యంత ప్రియమైనవి.

ఎందుకంటే నేను విన్నదాని ప్రకారము దశరథుడు తన అవసాన కాలములో నిన్నే తలచుకుంటూ, నీమీద దిగులు చేత మరణించాడు. కాబట్టి నీవు జలతర్పణములు విడిస్తేగాని తండ్రిగారి ఆత్మశాంతించదు.” అనిఅన్నాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ త్ర్యుత్తరశతతమః సర్గః (103) >>

Aranya Kanda Sarga 30 In Telugu – అరణ్యకాండ త్రింశః సర్గః

Aranya Kanda Sarga 30 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రింశః సర్గః (30వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రాముడు సువర్ణమృగాన్ని వెంబడించి, దాన్ని వేటాడిన తర్వాత, మృగం రూపంలో ఉన్న మారీచుడు తన అసలు రూపంలోకి మారి “హా సీత! హా లక్ష్మణ!” అని కేకలు వేస్తాడు. ఆ కేకలు విని సీత భయంతో లక్ష్మణుని రక్షణ కోసం రమ్మని వేడుకుంటుంది.

ఖరసంహారః

భిత్త్వా తు తాం గదాం బాణై రాఘవో ధర్మవత్సలః |
స్మయమానః ఖరం వాక్యం సంరబ్ధమిదమబ్రవీత్ ||

1

ఏతత్తే బలసర్వస్వం దర్శితం రాక్షసాధమ |
శక్తిహీనతరో మత్తో వృథా త్వమవగర్జసి ||

2

ఏషా బాణవినిర్భిన్నా గదా భూమితలం గతా |
అభిధానప్రగల్భస్య తవ ప్రత్యరిఘాతినీ ||

3

యత్త్వయోక్తం వినష్టానామహమశ్రుప్రమార్జనమ్ |
రాక్షసానాం కరోమీతి మిథ్యా తదపి తే వచః ||

4

నీచస్య క్షుద్రశీలస్య మిథ్యావృత్తస్య రక్షసః |
ప్రాణానపహరిష్యామి గరుత్మానమృతం యథా ||

5

అద్య తే ఛిన్నకంఠస్య ఫేనబుద్బుదభూషితమ్ |
విదారితస్య మద్బాణైర్మహీ పాస్యతి శోణితమ్ ||

6

పాంసురూషితసర్వాంగః స్రస్తన్యస్తభుజద్వయః |
స్వప్స్యసే గాం సమాలింగ్య దుర్లభాం ప్రమదామివ ||

7

ప్రవృద్ధనిద్రే శయితే త్వయి రాక్షసపాంసనే |
భవిష్యంత్యశరణ్యానాం శరణ్యా దండకా ఇమే ||

8

జనస్థానే హతస్థానే తవ రాక్షస మచ్ఛరైః |
నిర్భయా విచరిష్యంతి సర్వతో మునయో వనే ||

9

అద్య విప్రసరిష్యంతి రాక్షస్యో హతబాంధవాః |
బాష్పార్ద్రవదనా దీనా భయాదన్యభయావహాః ||

10

అద్య శోకరసజ్ఞాస్తాః భవిష్యంతి నిరర్థకాః |
అనురూపకులాః పత్న్యో యాసాం త్వం పతిరీదృశః ||

11

నృశంస నీచ క్షుద్రాత్మన్ నిత్యం బ్రాహ్మణకంటక |
యత్కృతే శంకితైరగ్నౌ మునిభిః పాత్యతే హవిః ||

12

తమేవమభిసంరబ్ధం బ్రువాణం రాఘవం రణే |
ఖరో నిర్భర్త్సయామాస రోషాత్ఖరతరస్వనః ||

13

దృఢం ఖల్వవలిప్తోసి భయేష్వపి చ నిర్భయః |
వాచ్యావాచ్యం తతో హి త్వం మృత్యువశ్యో న బుధ్యసే ||

14

కాలపాశపరిక్షిప్తా భవంతి పురుషా హి యే |
కార్యాకార్యం న జానంతి తే నిరస్తషడింద్రియాః ||

15

ఏవముక్త్వా తతో రామం సంరుధ్య భృకుటిం తతః |
స దదర్శ మహాసాలమవిదూరే నిశాచరః ||

16

రణే ప్రహరణస్యార్థే సర్వతో హ్యవలోకయన్ |
స తముత్పాటయామాస సందశ్య దశనచ్ఛదమ్ ||

17

తం సముత్క్షిప్య బాహుభ్యాం వినద్య చ మహాబలః |
రామముద్దిశ్య చిక్షేప హతస్త్వమితి చాబ్రవీత్ ||

18

తమాపతంతం బాణౌఘైశ్ఛిత్త్వా రామః ప్రతాపవాన్ |
రోషమాహారయత్తీవ్రం నిహంతుం సమరే ఖరమ్ ||

19

జాతస్వేదస్తతో రామో రోషాద్రక్తాంతలోచనః |
నిర్బిభేద సహస్రేణ బాణానాం సమరే ఖరమ్ ||

20

తస్య బాణాంతరాద్రక్తం బహు సుస్రావ ఫేనిలమ్ |
గిరేః ప్రస్రవణస్యేవ తోయధారాపరిస్రవః ||

21

విహలః స కృతో బాణైః ఖరో రామేణ సంయుగే |
మత్తో రుధిరగంధేన తమేవాభ్యద్రవద్ద్రుతమ్ ||

22

తమాపతంతం సంరబ్ధం కృతాస్త్రో రుధిరాప్లుతమ్ |
అపాసర్పత్ప్రతిపదం కించిత్త్వరితవిక్రమః ||

23

తతః పావకసంకాశం వధాయ సమరే శరమ్ |
ఖరస్య రామో జగ్రాహ బ్రహ్మదండమివాపరమ్ ||

24

స తం దత్తం మఘవతా సురరాజేన ధీమతా |
సందధే చాపి ధర్మాత్మా ముమోచ చ ఖరం ప్రతి ||

25

స విముక్తో మహాబాణో నిర్ఘాతసమనిస్వనః |
రామేణ ధనురాయమ్య ఖరస్యోరసి చాపతత్ ||

26

స పపాత ఖరో భూమౌ దహ్యమానః శరాగ్నినా |
రుద్రేణేవ వినిర్దగ్ధః శ్వేతారణ్యే యథాంతకః ||

27

స వృత్ర ఇవ వజ్రేణ ఫేనేన నముచిర్యథా |
బలో వేంద్రాశనిహతో నిపపాత హతః ఖరః ||

28

తతో రాజర్షయః సర్వే సంగతాః పరమర్షయః |
సభాజ్య ముదితా రామమిదం వచనమబ్రువన్ ||

29

ఏతదర్థం మహాభాగ మహేంద్రః పాకశాసనః | [మహాతేజా]
శరభంగాశ్రమం పుణ్యమాజగామ పురందరః ||

30

ఆనీతస్త్వమిమం దేశముపాయేన మహర్షిభిః |
ఏషాం వధార్థం క్రూరాణాం రక్షసాం పాపకర్మణామ్ ||

31

తదిదం నః కృతం కార్యం త్వయా దశరథాత్మజ |
సుఖం ధర్మం చరిష్యంతి దండకేషు మహర్షయః ||

32

ఏతస్మిన్నంతరే దేవాశ్చారణైః సహ సంగతాః |
దుందుభీంశ్చాభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః ||

33

రామస్యోపరి సంహృష్టా వవృషుర్విస్మితాస్తదా |
అర్ధాధికముహూర్తేన రామేణ నిశితైః శరైః ||

34

చతుర్దశసహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
ఖరదూషణముఖ్యానాం నిహతాని మహాహవే ||

35

అహో బత మహత్కర్మ రామస్య విదితాత్మనః |
అహో వీర్యమహో దాక్ష్యం విష్ణోరివ హి దృశ్యతే ||

36

ఇత్యేవముక్త్వా తే సర్వే యయుర్దేవా యథాగతమ్ |
ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణః సహ సీతయా ||

37

గిరిదుర్గాద్వినిష్క్రమ్య సంవివేశాశ్రమం సుఖీ |
తతో రామస్తు విజయీ పూజ్యమానో మహర్షిభిః ||

38

ప్రవివేశాశ్రమం వీరో లక్ష్మణేనాభిపూజితః |
తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహమ్ ||

39

బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే |
ముదా పరమయా యుక్తా దృష్ట్వా రక్షోగణాన్హతాన్ |
రామం చైవావ్యథం దృష్ట్వా తుతోష జనకాత్మజా ||

40

తతస్తు తం రాక్షససంఘమర్దనం
సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః ||
పునః పరిష్వజ్య శశిప్రభాననా
బభూవ హృష్టా జనకాత్మజా తదా ||

41

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 30 Meaning In Telugu

రాముడు ఖరుని గదను తుత్తునియలు చేయగానే ఖరుడు నివ్వెరపోయాడు. రాముడు ఖరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు.

“ఓ రాక్షసాధమా! నీ బలం ఎంతో తేలిపోయింది కదా! వృధాగా అరుస్తావు ఎందుకు. ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేలమీద పడిపోయింది. మరి ఇప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు. నీ మాటలు వమ్ము అయినట్లే కదా!

దుష్టుడు, దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గవాడవు. అందుకే నిన్ను చంపుతున్నాను. నీ కంఠమును తెగనరుకుతాను. నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమును శత్రుపీడ, రాక్షస పీడ లేకుండా చేస్తాను.

ఇప్పటి దాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను, మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకొనేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు, మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటి దాకా ఋషులను, మునులను భయపెడుతూ, వారి యజ్ఞయాగములను నాశనం చేస్తూ, వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇంక ఈ దండకారణ్యము విడిచిపోకతప్పదు. నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చేరోజు వచ్చింది.” అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముని చూచి ఖరుడు రాముడి బెదిరించడానికి పూనుకున్నాడు.

“ఓ రామా! నీవు అవివేకివే అనుకున్నాను. గర్విష్టివి కూడా. నీకు మహా గర్వము ఉంది. అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్వమే ఉంటుంది. చచ్చేముందు సంధిప్రేలాపన లాగా నీవు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు.” అంటూ ఖరుడు తగిన ఆయుధము కొరకు చుట్టూ చూచాడు. దగ్గరలోనే ఉన్న ఒక సాలవృక్షమును కూకటి వేళ్లతో పెకలించాడు. దానిని ఆయుధంగా ధరించి, “రామా! ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా!” అంటూ ఆ చెట్టును బలంగా రాముని మీదికి విసిరాడు.

రాముడు తన మీదికి అత్యంత వేగంతో దూసుకువస్తున్న సాలవృక్షమును తన వాడి అయిన బాణములతో రెండుగా ఖండించాడు. వెంటనే రాముడు వేయి బాణములను ఒకదాని వెంట ఒకటిగా సంధించి ఖరుని శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. ఖరుని శరీరం నుండి రక్తం జలపాతంలాగా బయటకు ఉరికింది. తన శరీరం అంతా నెత్తురు కారుతుండగా ఖరుడు రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రమును సంధించాడు. ఖరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ అస్త్రము ఖరుని గుండెలను చీల్చింది. ఖరుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడ్డాడు. ఖరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దండకారణ్యమునకు శాశ్వతంగా రాక్షస పీడ విరగడ అయింది.

ఆ దృశ్యమును చూచిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రాముని ఎంతో ప్రశంసించారు. అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు. “దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు ఇందుకే వెళ్లాడట. ఈ ఖరుని దూషణుని సంహరించడానికే ఆ మునులు రాముని ఈ ప్రాంతమునకు తీసుకొని వచ్చారట. ఇంక దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు.” అని అనుకొన్నారు. అంతట దేవతలు దేవ దుందుభులు మ్రోగించారు. రాముని మీద పుష్పవర్షము కురిపించారు.

రాముడికి, ఖరునికి, దూషణునికి, 14,000 మంది రాక్షసులకు జరిగిన యుద్ధము దాదాపు ఒకటిన్నర ముహూర్తకాలము జరిగింది. (ముహూర్తము అనగా 48 నిమిషములు. అనగా ఒక గంటా పన్నెండు నిమిషముల పాటు జరిగింది.) రాముని వీర్యమును పరాక్రమమును యుద్ధకౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్లారు.

రామునికి రాక్షసులకు మధ్యయుద్ధము ముగిసింది అని తెలుసుకొన్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలికి వచ్చాడు. రాముని తో వచ్చిన మునులు ఋషులు రాముని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు.

పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముని అభినందన పూర్వకంగా కౌగలించుకుంది. తరువాత సీతారాములు బయటకు వచ్చారు. యుద్ధములో చనిపోయిన రాక్షసులను చూచింది సీత. రామునికి ఏ అపాయము కలగనందుకు ఎంతో ఆనందపడింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ ఏకత్రింశః సర్గః (31) >>

Aranya Kanda Sarga 29 In Telugu – అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః

Aranya Kanda Sarga 29 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, రావణుడు మారీచుడిని సీతను అపహరించడానికి సహాయం చేయమని కోరుతాడు. మొదట మారీచుడు, రాముడి శక్తి గురించి తెలుసు కావున, ఈ పని చేయవద్దని రావణుడిని హెచ్చరిస్తాడు. కానీ, రావణుడు అతన్ని బలవంతం చేసి, రాముడు మరియు లక్ష్మణులను వలలో పడేసే పథకాన్ని తయారు చేస్తాడు.

ఖరగదాభేదనమ్

ఖరం తు విరథం రామో గదాపాణిమవస్థితమ్ |
మృదుపూర్వం మహాతేజాః పరుషం వాక్యమబ్రవీత్ ||

1

గజాశ్వరథసంబాధే బలే మహతి తిష్ఠతా |
కృతం సుదారుణం కర్మ సర్వలోకజుగుప్సితమ్ ||

2

ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత్ |
త్రయాణామపి లోకానామీశ్వరోపి న తిష్ఠతి ||

3

కర్మ లోకవిరుద్ధం తు కుర్వాణం క్షణదాచర |
తీక్ష్ణం సర్వజనో హంతి సర్పం దుష్టమివాగతమ్ ||

4

లోభాత్పాపాని కుర్వాణః కామాద్వా యో న బుధ్యతే |
భ్రష్టాః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివ ||

5

వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః |
కింను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస ||

6

న చిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుప్సితాః |
ఐశ్వర్యం ప్రాప్య తిష్ఠంతి శీర్ణమూలా ఇవ ద్రుమాః ||

7

అవశ్యం లభతే జంతుః ఫలం పాపస్య కర్మణః |
ఘోరం పర్యాగతే కాలే ద్రుమాః పుష్పమివార్తవమ్ ||

8

న చిరాత్ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలమ్ |
సవిషాణామివాన్నానాం భుక్తానాం క్షణదాచర ||

9

పాపమాచరతాం ఘోరం లోకస్యాప్రియమిచ్ఛతామ్ |
అహమాసాదితో రాజ్ఞా ప్రాణాన్ హంతుం నిశాచర ||

10

అద్య హి త్వాం మయా ముక్తాః శరాః కాంచనభూషణాః |
విదార్య నిపతిష్యంతి వల్మీకమివ పన్నగాః ||

11

యే త్వయా దండకారణ్యే భక్షితా ధర్మచారిణః |
తానద్య నిహతః సంఖ్యే ససైన్యోఽనుగమిష్యసి ||

12

అద్య త్వాం విహతం బాణైః పశ్యంతు పరమర్షయః |
నిరయస్థం విమానస్థా యే త్వయా హింసితాః పురా ||

13

ప్రహర త్వం యథాకామం కురు యత్నం కులాధమ |
అద్య తే పాతయిష్యామి శిరస్తాలఫలం యథా ||

14

ఏవముక్తస్తు రామేణ క్రుద్ధః సంరక్తలోచనః |
ప్రత్యువాచ ఖరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః ||

15

ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ |
ఆత్మనా కథమాత్మానమప్రశస్యం ప్రశంససి ||

16

విక్రాంతా బలవంతో వా యే భవంతి నరర్షభాః |
కథయంతి న తే కించిత్తేజసా స్వేన గర్వితాః ||

17

ప్రాకృతాస్త్వకృతాత్మానో లోకే క్షత్రియపాంసనాః |
నిరర్థకం వికత్థంతే యథా రామ వికత్థసే ||

18

కులం వ్యపదిశన్వీరః సమరే కోఽభిధాస్యతి |
మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయమప్రస్తవే స్తవమ్ ||

19

సర్వథైవ లఘుత్వం తే కత్థనేన విదర్శితమ్ |
సువర్ణప్రతిరూపేణ తప్తేనేవ కుశాగ్నినా ||

20

న తు మామిహ తిష్ఠంతం పశ్యసి త్వం గదాధరమ్ |
ధరాధరమివాకంప్యం పర్వతం ధాతుభిశ్చితమ్ ||

21

పర్యాప్తోఽహం గదాపాణిర్హంతుం ప్రాణాన్రణే తవ |
త్రయాణామపి లోకానాం పాశహస్త ఇవాంతకః ||

22

కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి న త్వహమ్ |
అస్తం గచ్ఛేద్ధి సవితా యుద్ధవిఘ్నస్తతో భవేత్ ||

23

చతుర్దశ సహస్రాణి రాక్షసానాం హతాని తే |
త్వద్వినాశాత్కరోమ్యేష తేషామస్రప్రమార్జనమ్ ||

24

ఇత్యుక్త్వా పరమక్రుద్ధస్తాం గదాం పరమాంగదః |
ఖరశ్చిక్షేప రామాయ ప్రదీప్తామశనిం యథా ||

25

ఖరబాహుప్రముక్తా సా ప్రదీప్తా మహతీ గదా |
భస్మ వృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాఽగాత్తత్సమీపతః ||

26

తామాపతంతీం జ్వలితాం మృత్యుపాశోపమాం గదామ్ |
అంతరిక్షగతాం రామశ్చిచ్ఛేద బహుధా శరైః ||

27

సా వికీర్ణా శరైర్భగ్నా పపాత ధరణీతలే |
గదా మంత్రౌషధబలైర్వ్యాలీవ వినిపాతితా ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనత్రింశః సర్గః ||

Aranya Kanda Sarga 29 Meaning In Telugu

ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నీవు సామాన్యుడివి కావు. చతురంగ బలములు కలిగిన 14,000 మంది సేనలకు అధిపతివి. కాని సాధు జనులు అసహ్యించుకొనే ఎన్నో అకృత్యాలు చేసావు. నీవలన సాధు జనులకు ప్రాణ భయం కలిగింది. ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు. అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి. అసలు నిన్ను ఆ జనులే చంపాల్సింది. కానీ వారి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను. కాని నీవు చేస్తున్నది తప్పు, పాపము అని నీకు తెలియదు. అందుకే ఇన్ని పాపపు పనులు చేసావు. చేసిన పాపములకు ఫలితము అనుభవిస్తున్నావు.

ఈ దండకారణ్యములో ఎంతో మంది ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. వారు నీకు ఏమి అపకారము చేసారని వారిని అనేక బాధలు పెట్టావు. అడ్డం వచ్చిన వారిని చంపావు. నీకు ధనబలము, అంగ బలమ, సైనిక బలము ఉంది కదా అని విర్రవీగావు. కాని సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలువలేదు. అందుకే పతనమయ్యావు.

నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవింపక తప్పదు. విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో, పాపపు పనులుచేస్తే, ఆ పాపఫలము కూడా వెంటనే కట్టికుడుపుతుంది. దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యములో ఉన్న ఋషులు, మునులు నన్ను ఆశ్రయించారు. అందుకే నేను దుష్టుడవైన నిన్ను చంపుతున్నాను. ఓ ఖరుడా! ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యములో ఉన్న మునులను, ఋషులను ఎలా యమపురికి పంపారో, అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు. నీవు చంపిన మునులందరూ స్వర్గ ద్వారముల వద్ద నిలబడి, నువ్వు నరకానికి పోవడం కళ్లారా చూస్తారు. ఓ దురాత్ముడా! కాచుకో! ఒకే ఒక్క బాణంతో నీ తల తాటి పండు మాదిరి నేల మీద దొర్లుతుంది.” అని తన ధనుస్సు ఎక్కుపెట్టాడు రాముడు.

రాముని సూటి పోటీ మాటలు విన్న ఖరుడు అవమాన భారంతో కోపంతో రగిలిపోయాడు. “ఓ రామా! ఇదేంటి! నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. నా సైన్యము నశించినా నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే నన్ను గెల్చానని గర్వపడుతున్నావు. నిన్ను నీవే అభినందించుకుంటున్నావు.

నీకు తెలుసో లేదో పరాక్రమ వంతులు, వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు. ఇతరులు చెబితే ఆనందిస్తారు. వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు. అదే పని నీవు చేస్తున్నావు. నిన్ను నీవే పొగుడుకుంటున్నావు.

రామా! నీకు మృత్యువు ఆసన్నమయింది. ముందు అది తెలుసుకో. నిన్ను అభినందించుకోడం మానుకో! లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు. నీ ఎదుట పాశమును చేత ధరించిన కాల యముడి వలె గదాయుధమును ధరించి కదులుతున్న పర్వతము మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు కదా! జీవులు యముని కాలపాశమునకు బలి అయినట్టు నువ్వు నా గదాయుధమునకు బలి అవుతావు.

ఓ రామా! ఇంకా నీ గురించి ఎంతో చెప్పాలి. కానీ సూర్యాస్తమయము కాబోతోంది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా! అందుకని చెప్పడం లేదు. నీవు నా సేనలను 14,000 మందిని మట్టుబెట్టావు. ఈ రోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధు మిత్రుల కన్నీళ్లు తుడుస్తాను.”

ఇలా మాట్లాడిన ఖరుడు తన గదను రాముని మీదికి విసిరాడు. రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేసాడు. ఆ ముక్కలు ఉల్కాపాతముల వలె నేలమీద పడ్డాయి.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రింశః సర్గః (30) >>

Aranya Kanda Sarga 28 In Telugu – అరణ్యకాండ అష్టావింశః సర్గః

Aranya Kanda Sarga 28 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టావింశః సర్గ (28వ సర్గ) రామాయణంలో ఒక కీలక ఘట్టం. ఈ సర్గలో, శూర్పణఖా రాముడు మరియు లక్ష్మణుని చేత అవమానింపబడిన తర్వాత తన అన్న రావణుడిని కలుస్తుంది. ఆమె రాముడు, సీత మరియు లక్ష్మణుల గురించి వివరించి, తనపై జరిగిన దాడిని చెప్పుతుంది. సీత యొక్క అపూర్వ సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆమెను కిడ్నాప్ చేయమని పెల్లుబికుతుంది.

ఖరరామసంప్రహారః

నిహతం దూషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహ |
ఖరస్యాప్యభవత్రాసో దృష్ట్వా రామస్య విక్రమమ్ ||

1

స దృష్ట్వా రాక్షసం సైన్యమవిషహ్యం మహాబలః |
హతమేకేన రామేణ త్రిశిరోదూషణావపి ||

2

తద్బలం హతభూయిష్ఠం విమనాః ప్రేక్ష్య రాక్షసః |
ఆససాద ఖరో రామం నముచిర్వాసవం యథా ||

3

వికృష్య బలవచ్చాపం నారాచాన్రక్తభోజనాన్ |
ఖరశ్చిక్షేప రామాయ క్రుద్ధానాశీవిషానివ ||

4

జ్యాం విధున్వన్ సుబహుశః శిక్షయాఽస్త్రాణి దర్శయన్ |
చకార సమరే మార్గాన్ శరై రథగతః ఖరః ||

5

స సర్వాశ్చ దిశో బాణైః ప్రదిశశ్చ మహారథః |
పూరయామాస తం దృష్ట్వా రామోఽపి సుమహద్ధనుః ||

6

స సాయకైర్దుర్విషహైః సస్ఫులింగైరివాగ్నిభిః |
నభశ్చకారావివరం పర్జన్య ఇవ వృష్టిభిః ||

7

తద్బభూవ శితైర్బాణైః ఖరరామవిసర్జితైః |
పర్యాకాశమనాకాశం సర్వతః శరసంకులమ్ ||

8

శరజాలావృతః సూర్యో న తదా స్మ ప్రకాశతే |
అన్యోన్యవధసంరంభాదుభయోః సంప్రయుధ్యతోః ||

9

తతో నాలీకనారాచైస్తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః |
ఆజఘాన ఖరో రామం తోత్రైరివ మహాద్విపమ్ ||

10

తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితమ్ |
దదృశుః సర్వభూతాని పాశహస్తమివాంతకమ్ ||

11

హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితమ్ |
పరిశ్రాంతం మహాసత్త్వం మేనే రామం ఖరస్తదా ||

12

తం సింహమివ విక్రాంతం సింహవిక్రాంతగామినమ్ |
దృష్ట్వా నోద్విజతే రామః సింహః క్షుద్రమృగం యథా ||

13

తతః సూర్యనికాశేన రథేన మహతా ఖరః |
ఆససాద రణే రామం పతంగ ఇవ పావకమ్ ||

14

తతోఽస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః |
ఖరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవమ్ ||

15

స పునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి |
నిజఘాన ఖరః క్రుద్ధః శక్రాశనిసమప్రభాన్ ||

16

తతస్తత్ప్రహతం బాణైః ఖరముక్తైః సుపర్వభిః |
పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః ||

17

తతః శరసహస్రేణ రామమప్రతిమౌజసమ్ |
అర్దయిత్వా మహానాదం ననాద సమేరే ఖరః ||

18

స శరైరర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః |
రరాజ సమరే రామో విధూమోఽగ్నిరివ జ్వలన్ ||

19

తతో గంభీరనిర్హ్రాదం రామః శత్రునిబర్హణః |
చకారాంతాయ స రిపోః సజ్యమన్యన్మహద్ధనుః ||

20

సుమహద్వైష్ణవం యత్తదతిసృష్టం మహర్షిణా |
వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత ||

21

తతః కనకపుంఖైస్తు శరైః సన్నతపర్వభిః |
బిభేద రామః సంక్రుద్ధః ఖరస్య సమరే ధ్వజమ్ ||

22

స దర్శనీయో బహుధా వికీర్ణః కాంచనధ్వజః |
జగామ ధరణీం సూర్యో దేవతానామివాజ్ఞయా ||

23

తం చతుర్భిః ఖరః క్రుద్ధో రామం గాత్రేషు మార్గణైః |
వివ్యాధ యుధి మర్మజ్ఞో మాతంగమివ తోమరైః ||

24

స రామో బహుభిర్బాణైః ఖరకార్ముకనిఃసృతైః |
విద్ధో రుధిరసిక్తాంగో బభూవ రుషితో భృశమ్ ||

25

స ధనుర్ధన్వినాం శ్రేష్ఠః ప్రగృహ్య పరమాహవే |
ముమోచ పరమేష్వాసః షట్ శరానభిలక్షితాన్ ||

26

శిరస్యేకేన బాణేన ద్వాభ్యాం బాహ్వోరథార్దయత్ |
త్రిభిశ్చంద్రార్ధవక్త్రైశ్చ వక్షస్యభిజఘాన హ ||

27

తతః పశ్చాన్మహాతేజా నారాచాన్ భాస్కరోపమాన్ |
జిఘాంసూ రాక్షసం క్రుద్ధస్త్రయోదశ సమాదదే ||

28

తతోఽస్య యుగమేకేన చతుర్భిశ్చతురో హయాన్ |
షష్ఠేన తు శిరః సంఖ్యే ఖరస్య రథసారథేః ||

29

త్రిభిస్త్రివేణుం బలవాన్ ద్వాభ్యామక్షం మహాబలః |
ద్వాదశేన తు బాణేన ఖరస్య సశరం ధనుః ||

30

ఛిత్త్వా వజ్రనికాశేన రాఘవః ప్రహసన్నివ |
త్రయోదశేనేంద్రసమో బిభేద సమరే ఖరమ్ ||

31

ప్రభగ్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః |
గదాపాణిరవప్లుత్య తస్థౌ భూమౌ ఖరస్తదా ||

32

తత్కర్మ రామస్య మహారథస్య
సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ |
అపూజయన్ ప్రాంజలయః ప్రహృష్టా-
-స్తదా విమానాగ్రగతాః సమేతాః ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే అరణ్యకాండే అష్టావింశః సర్గః ||

Aranya Kanda Sarga 28 Meaning In Telugu PDF

రాముని మీదికి పోతున్నాడే కానీ ఖరునికి లోలోపల భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే రాముడు మహా వీరులు, అసమాన బలవంతులు అయిన దూషణుని, త్రిశిరుని సంహరించాడు. ఇంక తన వంతు వచ్చింది అనుకున్నాడు. పైగా సైన్యము అంతా నశించి పోయింది. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ కొద్దిమందితో రాముని ఎదుర్కోగలనా అని సందేహిస్తున్నాడు. కానీ ధైర్యంగా ముందుకు దూకాడు.

ఖరుడు రాముని మీద నారాచములను (ఇనుప ములికలు అమర్చిన బాణములను) ప్రయోగించాడు. ఖరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంతా కలయ తిరుగుతూ, బాణప్రయోగం చేస్తున్నాడు. రాముని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేసాడు.

రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఖరుడు సంధించిన బాణములను ఛిన్నాభిన్నం చేసాడు రాముడు. తన బాణములతో ఆకాశం అంతా నింపాడు రాముడు. సూర్యుడు కూడా కనపడటం లేదు. రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. ఖరుడు రాముని మీద నారాచములు, నాళీకములు, వికర్ణికలు మొదలగు బాణపరంపరలు ప్రయోగించాడు. ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు.

అప్పటికే యుద్ధము చేసి పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకొన్నాడు. ఖరుడు. కాని రామునిముఖంలో అలసట ఏమాత్రం కనిపించడం లేదు. పైగా రాముడు ఖరుని చంపడానికి అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఖరునికి తెలియదు.

ఖరుడు రాముని ధనుస్సును సగ భాగంలో విరగగొట్టాడు. మరొక బాణంతో రాముని కవచమును విరిచాడు. రాముని కవచము విరిగి నేలమీద పడింది. అదే అవకాశముగా, ఖరుడు రాముని శరీరం అంతా బాణములతో కొట్టాడు. విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. రాముడు వెంటనే తనకు అగస్త్యమహాముని ఇచ్చిన వైష్ణవ ధనుస్సుకు నారి బిగించి సంధించాడు. ముందు ఖరుని ధ్వజమును కూల్చాడు. అది చూచిన ఖరుడు కోపించి రాముని మర్మస్థానముల మీద నాలుగు తీవ్రమైన బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు రాముని శరీరమునకు తగిలి రాముని శరీరం అంతా రక్తంతో తడిసి ముద్ద అయింది.

రాముని కోపము కట్టలు తెంచుకుంది. ఒక బాణముతో ఖరుని శిరస్సును, రెండు బాణములతో ఖరుని రెండు చేతులను, మూడు అర్థచంద్రాకారపు బాణములతో ఖరుని వక్షస్థలమును కొట్టాడు. ఎలాగైనా ఖరుని చంపాలని నిశ్చయించుకొన్న రాముడు ఖరుని మీద తీవ్రమైన 13 నారాచములను ప్రయోగించాడు. అందులో ఒక బాణముతో ఖరుని రథము యొక్క నొగలను, నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను, ఒక బాణముతో రథ సారథిని, మూడు బాణములతో రధం ముందు భాగమును, రెండు బాణములతో ఖరుని రథము ఇరుసులను, ఒక బాణముతో ఖరుని కంఠమును కొట్టాడు. ఇలా 13 బాణములతో ఖరుని ఆపాదమస్తకము కొట్టాడు రాముడు.

ఖరునికి రథము విరిగిపోయింది. సారథి చచ్చాడు. రథానికి కట్టిన గుర్రాలు నేలకూలాయి. విల్లు విరిగిపోయింది. చేసేది లేక ఖరుడు తన గదను తీసుకొని నేలమీదికి దూకాడు. ఖరుని ఆ విధంగా కొట్టినందుకు ఆకాశంలలో నిలబడి చూస్తున్న దేవతాసమూహములు రాముని అభినందించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>

Ayodhya Kanda Sarga 101 In Telugu – అయోధ్యాకాండ ఏకాధికశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 101 In Telugu

అయోధ్యకాండ సర్గ 101″ రామాయణం లో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు కైకేయి మాట మేరకు తన తండ్రి దశరథుని ఆజ్ఞను పాటించి అరణ్యవాసం కోసం సిద్ధమవుతాడు. లక్ష్మణుడు మరియు సీతా ఆయనతో పాటు రావడానికి నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో, అయోధ్య నగరం దుఃఖంలో మునిగిపోతుంది. ప్రజలు రాముడు వెళ్లిపోతుండడాన్ని చూడలేక బాధపడతారు. రాముడు తన తల్లి కౌసల్య, సుమిత్రా, మరియు ఇతర పెద్దలను వీడిపోతాడు. ఆ తరువాత, రథం పై అరణ్యవాసం వైపు పయనమవుతాడు. ఈ సర్గలో రాముడి ధర్మనిష్ట, పితృవాక్యపారిపాలనం, మరియు కుటుంబ పట్ల అతని ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి.

పితృదిష్టాంతశ్రవణమ్

రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచ హ |
కిం మే ధర్మాద్విహీనస్య రాజధర్మః కరిష్యతి || ౧ ||

శాశ్వతోఽయం సదా ధర్మః స్థితోఽస్మాసు నరర్షభ |
జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్న కనీయాన్ నృపో భవేత్ || ౨ ||

స సమృద్ధాం మయా సార్ధమయోధ్యాం గచ్ఛ రాఘవ |
అభిషేచయ చాత్మానం కులస్యాస్య భవాయ నః || ౩ ||

రాజానం మానుషం ప్రాహుర్దేవత్వే స మతో మమ |
యస్య ధర్మార్థసహితం వృత్తమాహురమానుషమ్ || ౪ ||

కేకయస్థే చ మయి తు త్వయి చారణ్యమాశ్రితే |
దివమార్యో గతో రాజా యాయజూకః సతాం మతః || ౫ ||

నిష్క్రాంతమాత్రే భవతి సహసీతే సలక్ష్మణే |
దుఃఖశోకాభిభూతస్తు రాజా త్రిదివమభ్యగాత్ || ౬ ||

ఉత్తిష్ఠ పురుషవ్యాఘ్ర క్రియతాముదకం పితుః |
అహం చాయం చ శత్రుఘ్నః పూర్వమేవ కృతోదకౌ || ౭ ||

ప్రియేణ ఖలు దత్తం హి పితృలోకేషు రాఘవ |
అక్షయ్యం భవతీత్యాహుర్భవాంశ్చైవ పితుః ప్రియః || ౮ ||

త్వామేవ శోచంస్తవ దర్శనేప్సుః
త్వయ్యేవ సక్తామనివర్త్య బుద్ధిమ్ |
త్వయా విహీనస్తవ శోకరుగ్ణః
త్వాం సంస్మరన్నస్తమితః పితా తే || ౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాధికశతతమః సర్గః || ౧౦౧ ||

Ayodhya Kanda Sarga 101 Meaning In Telugu

భరతుని రాజ్యమునకు సంబంధించిన విషయములు అన్నీ తెలుసుకున్న తరువాత, రాముడు మరలా అసలు విషయానికి వచ్చాడు. “భరతా! ఇంతకూ నీవు ఈ ముని వేషము ఎందుకు ధరించావు. ఈ అడవులకు ఎందుకు వచ్చావు. దశరథుల వారు నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసారు కదా. హాయిగా రాజ్యపాలన చేయక, ఈ వనవాసము ఎందుకయ్యా నీకు?” అని అడిగాడు.

దానికి భరతుడు రామునికి ఇలా సమాధానము చెప్పాడు. “రామా! నీకు ఒక అప్రియమైన విషయము చెప్పాలి. నీవు నాకు రాజ్యమును వదిలి అడవులకు రాగానే ఆ దుఃఖము తట్టుకోలేక మన తండ్రి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు నేను కూడా దగ్గర లేను. నా తల్లి ప్రేరణతో ఈ మహాపాపము చేసాడు మన తండ్రి దశరథుడు. కాని నా తల్లికి ఫలితము దక్కలేదు. ఇటు రాజ్యమూ లేదు. సరికదా.. అటు వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. నీవు ఉండగా నేను రాజ్యాభిషిక్తుడను అవడం సాధ్యం కాదు. నీవు మాట ఇచ్చిన తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటకు ఇపుడు విలువ లేదు. కాబట్టి నీవు వనవాసము విడిచి అయోధ్యకు వచ్చి, రాజ్యపాలన చేయుము. అదే నేను కోరేది. మన తల్లులు మువ్వురూ ఇదే మాట మీద ఉన్నారు. నిన్ను మరలా అయోధ్య తీసుకుపోవడానికి వారందరూ వచ్చారు.

రామా! మనవంశాచారము నీకు తెలుసు. మన వంశములో పెద్దవాడికే రాజ్యాభిషేకము జరుగుతుంది. ఇది అనువంశికంగా వస్తున్న ఆచారము. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడివి కావడం ధర్మమే కాని అధర్మము కాదు. నీ రాక కొరకు అయోధ్య ఎదురుచూస్తూ ఉంది. నేను, శత్రుఘ్నుడు, మన మంత్రులు అందరూ శిరస్సువంచి నీకు నమస్కారము చేస్తున్నాము. మామాట మన్నించు. వంశాచారమును మన్నించు. పెద్దల ఆచారములను గౌరవించు.” అనిచెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు భరతుడు.

రాముడు భరతుని కౌగలించుకొని అనునయించాడు. “ఓ భరతా! కులీనుడు, సత్త్వసంపన్నుడు, తేజస్వి, ధృడనిశ్చయము కలవాడు ఎవరైనా తుచ్ఛమైన రాజ్యము కోసరం మాట తప్పుతాడా! నేనూ అంతే. భరతా! నీవు చిన్నవాడవు. నీవు అనవసరంగా నీ తల్లిని దూషిస్తున్నావు. తప్పు. నీ మీద ఉన్న ప్రేమతో అలా చేసింది కానీ వేరుకాదు.

పెద్దలకు భార్యను, పుత్రులను, శాసించే అధికారము ఉంది. ఆ అధికారం తోనే దశరథుడు నాకు నార చీరలు కట్టబెట్టి అరణ్యానికి పంపాడు. నేను ఆయన ఆదేశము పాటించాలి. నేను నా తండ్రి యందు ఎలాంటి గౌరవము చూపిస్తున్నానో, నీవు నీ తల్లి పట్ల అంత గౌరవము చూపించు. నీ తల్లి తనస్వార్థము కోసరం ఇదంతా చేయలేదు. కేవలం నీకోసరమే చేసింది. నీ తల్లి కూడా నా తల్లితో సమానము. నా తల్లి కైక, నా తండ్రి దశరథుడు నన్ను అడవులకు వెళ్లమన్నారు. నేను అడవులకు వచ్చాను. ఇంతకన్నా వేరు విధంగా నేను ఎలా చేయగలను? తల్లి తండ్రుల మాట నాకు శిరోధార్యము కదా!

నా తరువాత రాజ్యమునకు అర్హుడవు నీవు. అందుకని నీవు రాజ్యము చేయవలెను. నేను అరణ్యములలో ఉండవలెను. నా తండ్రి దశరథుడు పదిమంది ఎదుట ఈవిధంగా భాగపంపకములు చేసాడు. నీకు రాజ్యము ఇచ్చాడు. నాకు 14 ఏళ్లు వనవాసము ఇచ్చాడు. దీనిని మనము పాటించాలి. ఇప్పుడు మన తండ్రి స్వర్గస్థుడయ్యాడు. ఆయన లేడు కదా అని మనకు ఆయన మాటను వమ్ముచేయలేము కదా!కాబట్టి నేను రాజ్యాభిషిక్తుని కాలేను.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్వ్యధికశతతమః సర్గః (102) >>

Ayodhya Kanda Sarga 100 In Telugu – అయోధ్యాకాండ శతతమః సర్గః

Ayodhya Kanda Sarga 100

అయోధ్యాకాండం శతతమ (100వ) సర్గలో, భరతుడు నందిగ్రామానికి చేరుకుని, అక్కడ నివసిస్తూ పాలనను పర్యవేక్షించడానికి సిద్ధమవుతాడు. అతను రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, తాను రాముడి ప్రతినిధిగా పాలన చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. భరతుడు వలమాలిన వాస్రాలు ధరించి, నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయిస్తాడు. ప్రజలు భరతుని ధర్మ నిష్ఠను, నిస్వార్థతను మెచ్చుకుంటారు. ఈ సర్గలో భరతుడు రాముడి పట్ల తన అపారమైన ప్రేమను, విధి పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. రాముడు తిరిగి వస్తాడని ఆశతో, భరతుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ప్రజల పట్ల ధర్మబద్ధంగా, న్యాయంగా వ్యవహరిస్తాడు. భరతుడి ధర్మ నిష్ఠ, కరుణ, నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.

కచ్చిత్సర్గః

జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి |
దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా || ౧ ||

కథంచిదభివిజ్ఞాయ వివర్ణవదనం కృశమ్ |
భ్రాతరం భరతం రామః పరిజగ్రాహ బాహునా || ౨ ||

ఆఘ్రాయ రామస్తం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవః |
అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్సమాహితః || ౩ ||

క్వ ను తేఽభూత్పితా తాత యదరణ్యం త్వమాగతః |
న హి త్వం జీవతస్తస్య వనమాగంతుమర్హసి || ౪ ||

చిరస్య బత పశ్యామి దూరాద్భరతమాగతమ్ |
దుష్ప్రతీకమరణ్యేఽస్మిన్కిం తాత వనమాగతః || ౫ ||

కచ్చిద్ధారయతే తాత రాజా యత్త్వమిహాఽగతః |
కచ్చిన్నదీనః సహసా రాజా లోకాంతరం గతః || ౬ ||

కచ్చిత్సౌమ్య న తే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతమ్ |
కచ్చిచ్ఛుశ్రూషసే తాత పితరం సత్యవిక్రమమ్ || ౭ ||

కచ్చిద్ధశరథో రాజా కుశలీ సత్యసంగరః |
రాజసూయాశ్వమేధానామాహర్తా ధర్మనిశ్చయః || ౮ ||

స కచ్చిద్బ్రాహ్మణో విద్వాన్ధర్మనిత్యో మహాద్యుతిః |
ఇక్ష్వాకూణాముపాధ్యాయో యథావత్తాత పూజ్యతే || ౯ ||

సా తాత కచ్చిత్కౌసల్యా సుమిత్రా చ ప్రజావతీ |
సుఖినీ కచ్చిదార్యా చ దేవీ నందతి కైకయీ || ౧౦ ||

కచ్చిద్వినయసంపన్నః కులపుత్రో బహుశ్రుతః |
అనసూయురనుద్రష్టా సత్కృతస్తే పురోహితః || ౧౧ ||

కచ్చిదగ్నిషు తే యుక్తో విధిజ్ఞో మతిమానృజుః |
హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా || ౧౨ ||

కచ్చిద్దేవాన్పితౄన్మాతౄః గురూన్పితృసమానపి |
వృద్ధాంశ్చ తత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభిమన్యసే || ౧౩ ||

ఇష్వస్త్రవరసంపన్నమర్థశాస్త్రవిశారదమ్ |
సుధన్వానముపాధ్యాయం కచ్చిత్త్వం తాత మన్యసే || ౧౪ ||

కచ్చిదాత్మసమాః శూరాః శ్రుతవంతో జితేంద్రియాః |
కులీనాశ్చేంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణః || ౧౫ ||

మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ |
సుసంవృతో మంత్రధరైరమాత్యైః శాస్త్రకోవిదైః || ౧౬ ||

కచ్చిన్నిద్రావశం నైషీః కచ్చిత్కాలే ప్రబుధ్యసే |
కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థనైపుణమ్ || ౧౭ ||

కచ్చిన్మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిః సహ |
కచ్చిత్తే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి || ౧౮ ||

కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయమ్ |
క్షిప్రమారభసే కర్తుం న దీర్ఘయసి రాఘవ || ౧౯ ||

కచ్చిత్తే సుకృతాన్యేవ కృతరూపాణి వా పునః |
విదుస్తే సర్వకార్యాణి న కర్తవ్యాని పార్థివాః || ౨౦ ||

కచ్చిన్న తర్కైర్యుక్త్యా వా యే చాప్యపరికీర్తితాః |
త్వయా వా తవ వాఽమాత్యైర్బుధ్యతే తాత మంత్రితమ్ || ౨౧ ||

కచ్చిత్సహస్రాన్మూర్ఖాణామేకమిచ్ఛసి పండితమ్ |
పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్నిశ్శ్రేయసం మహత్ || ౨౨ ||

సహస్రాణ్యపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతిః |
అథవాఽప్యయుతాన్యేవ నాస్తి తేషు సహాయతా || ౨౩ ||

ఏకోఽప్యమాత్యో మేధావీ శూరో దక్షో విచక్షణః |
రాజానం రాజమాత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియమ్ || ౨౪ ||

కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః |
జఘన్యాస్తు జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః || ౨౫ ||

అమాత్యానుపధాఽతీతాన్పితృపైతామహాంఛుచీన్ |
శ్రేష్ఠాన్శ్రేష్ఠేషు కచ్చిత్త్వం నియోజయసి కర్మసు || ౨౬ ||

కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజితప్రజమ్ |
రాష్ట్రం తవానుజానంతి మంత్రిణః కైకయీసుత || ౨౭ ||

కచ్చిత్త్వాం నావజానంతి యాజకాః పతితం యథా |
ఉగ్రప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియః || ౨౮ ||

ఉపాయకుశలం వైద్యం భృత్యసందూషణే రతమ్ |
శూరమైశ్వర్యకామం చ యో న హంతి స వధ్యతే || ౨౯ ||

కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ధృతిమాన్ శుచిః |
కులీనశ్చానురక్తశ్చ దక్షః సేనాపతిః కృతః || ౩౦ ||

బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యా యుద్ధవిశారదాః |
దృష్టాపదానా విక్రాంతాస్త్వయా సత్కృత్యమానితాః || ౩౧ ||

కచ్చిద్బలస్య భక్తం చ వేతనం చ యథోచితమ్ |
సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి న విలంబసే || ౩౨ ||

కాలాతిక్రమణాచ్చైవ భక్తవేతనయోర్భృతాః |
భర్తుః కుప్యంతి దుష్యంతి సోఽనర్థః సుమహాన్ స్మృతః || ౩౩ ||

కచ్చిత్సర్వేఽనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః |
కచ్చిత్ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సమాహితాః || ౩౪ ||

కచ్చిజ్జానపదో విద్వాన్దక్షిణః ప్రతిభానవాన్ |
యథోక్తవాదీ దూతస్తే కృతో భరత పండితః || ౩౫ ||

కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచ చ |
త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైర్వేత్సి తీర్థాని చారకైః || ౩౬ ||

కచ్చిద్వ్యపాస్తానహితాన్ప్రతియాతాంశ్చ సర్వదా |
దుర్బలాననవజ్ఞాయ వర్తసే రిపుసూదన || ౩౭ ||

కచ్చిన్న లోకాయతికాన్బ్రాహ్మణాంస్తాత సేవసే |
అనర్థకుశలా హ్యేతే బాలాః పండితమానినః || ౩౮ ||

ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః |
బుద్ధిమాన్వీక్షికీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే || ౩౯ ||

వీరైరధ్యుషితాం పూర్వమస్మాకం తాత పూర్వకైః |
సత్యనామాం దృఢద్వారాం హస్త్యశ్వరథసంకులామ్ || ౪౦ ||

బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః స్వకర్మనిరతైః సదా |
జితేంద్రియైర్మహోత్సాహైర్వృతామార్యైః సహస్రశః || ౪౧ ||

ప్రాసాదైర్వివిధాకారైర్వృతాం వైద్యజనాకులామ్ |
కచ్చిత్సుముదితాం స్ఫీతామయోధ్యాం పరిరక్షసి || ౪౨ ||

కచ్చిచ్చిత్యశతైర్జుష్టః సునివిష్టజనాకులః |
దేవస్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితః || ౪౩ ||

ప్రహృష్టనరనారీకః సమాజోత్సవశోభితః |
సుకృష్టసీమా పశుమాన్హింసాభిః పరివర్జితః || ౪౪ ||

అదేవమాతృకో రమ్యః శ్వాపదైః పరివర్జితః |
పరిత్యక్తో భయైః సర్వైః ఖనిభిశ్చోపశోభితః || ౪౫ ||

వివర్జితో నరైః పాపైర్మమ పూర్వైః సురక్షితః |
కచ్చిజ్జనపదః స్ఫీతః సుఖం వసతి రాఘవ || ౪౬ ||

కచ్చిత్తే దయితాః సర్వే కృషిగోరక్షజీవినః |
వార్తాయాం సంశ్రితస్తాత లోకో హి సుఖమేధతే || ౪౭ ||

తేషాం గుప్తిపరీహారైః కచ్చిత్తే భరణం కృతమ్ |
రక్ష్యా హి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః || ౪౮ ||

కచ్చిస్త్రియః సాంత్వయసి కచ్చిత్తాశ్చ సురక్షితాః |
కచ్చిన్న శ్రద్దధాస్యాసాం కచ్చిద్గుహ్యం న భాషసే || ౪౯ ||

కచ్చిన్నాగవనం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకాః |
కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాం చ తృప్యసి || ౫౦ ||

కచ్చిద్దర్శయసే నిత్యం మనుష్యాణాం విభూషితమ్ |
ఉత్థాయోత్థాయ పూర్వాహ్ణే రాజపుత్ర మహాపథే || ౫౧ ||

కచ్చిన్న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాస్తేఽవిశంకయా |
సర్వే వా పునరుత్సృష్టా మధ్యమేవాత్ర కారణమ్ || ౫౨ ||

కచ్చిత్సర్వాణి దుర్గాణి ధనధాన్యాయుధోదకైః |
యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పిధనుర్ధరైః || ౫౩ ||

ఆయస్తే విపులః కచ్చిత్కచ్చిదల్పతరో వ్యయః |
అపాత్రేషు న తే కచ్చిత్కోశో గచ్ఛతి రాఘవ || ౫౪ ||

దేవతార్థే చ పిత్రర్థే బ్రాహ్మణాభ్యాగతేషు చ |
యోధేషు మిత్రవర్గేషు కచ్చిద్గచ్ఛతి తే వ్యయః || ౫౫ ||

కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చోరకర్మణా |
అపృష్టః శాస్త్రకుశలైర్న లోభాద్వధ్యతే శుచిః || ౫౬ ||

గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టః సకారణః |
కచ్చిన్న ముచ్యతే చోరో ధనలోభాన్నరర్షభ || ౫౭ ||

వ్యసనే కచ్చిదాఢ్యస్య దుర్గతస్య చ రాఘవ |
అర్థం విరాగాః పశ్యంతి తవామాత్యా బహుశ్రుతాః || ౫౮ ||

యాని మిథ్యాఽభిశస్తానాం పతంత్యస్రాణి రాఘవ |
తాని పుత్రన్పశూన్ ఘ్నంతి ప్రీత్యర్థమనుశాసతః || ౫౯ ||

కచ్చిద్వృద్ధాంశ్చ బాలాంశ్చ వైద్యముఖ్యాంశ్చ రాఘవ |
దానేన మనసా వాచా త్రిభిరేతైర్బుభూషసే || ౬౦ ||

కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ తాపసాన్దేవతాతిథీన్ |
చైత్యాంశ్చ సర్వాన్సిద్ధార్థాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి || ౬౧ ||

కచ్చిదర్థేన వా ధర్మమర్థం ధర్మేణ వా పునః |
ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే || ౬౨ ||

కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాంవర |
విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్వరద సేవసే || ౬౩ ||

కచ్చిత్తే బ్రాహ్మణాః శర్మ సర్వశాస్త్రార్థకోవిదాః |
ఆశంసంతే మహాప్రాజ్ఞ పౌరజానపదైః సహ || ౬౪ ||

నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతామ్ |
అదర్శనం జ్ఞానవతామాలస్యం పంచవృత్తితామ్ || ౬౫ ||

ఏకచింతనమర్థానామనర్థజ్ఞైశ్చ మంత్రణమ్ |
నిశ్చితానామనారంభం మంత్రస్యాపరిరక్షణమ్ || ౬౬ ||

మంగళస్యాప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః |
కచ్చిత్త్వం వర్జయస్యేతాన్రాజదోషాంశ్చతుర్దశ || ౬౭ ||

దశపంచ చతుర్వర్గాన్సప్తవర్గం చ తత్త్వతః |
అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తిస్రశ్చ రాఘవ || ౬౮ ||

ఇంద్రియాణాం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషమ్ |
కృత్యం వింశతివర్గం చ తథా ప్రకృతిమండలమ్ || ౬౯ ||

యాత్రాదండవిధానం చ ద్వియోనీ సంధివిగ్రహౌ |
కచ్చిదేతాన్మహాప్రాజ్ఞ యథావదనుమన్యసే || ౭౦ ||

మంత్రిభిస్త్వం యథోద్దిష్టైశ్చతుర్భిస్త్రిభిరేవ వా |
కచ్చిత్సమస్తైర్వ్యస్తైశ్చ మంత్రం మంత్రయసే మిథః || ౭౧ ||

కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలాః క్రియాః |
కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలం శ్రుతమ్ || ౭౨ ||

కచ్చిదేషైవ తే బుద్ధిర్యథోక్తా మమ రాఘవ |
ఆయుష్యా చ యశస్యా చ ధర్మకామార్థసంహితా || ౭౩ ||

యాం వృత్తిం వర్తతే తాతో యాం చ నః ప్రపితామహాః |
తాం వృత్తిం వర్తసే కచ్చిద్యా చ సత్పథగా శుభా || ౭౪ ||

కచ్చిత్స్వాదుకృతం భోజ్యమేకో నాశ్నాసి రాఘవ |
కచ్చిదాశంసమానేభ్యో మిత్రేభ్యః సంప్రయచ్ఛసి || ౭౫ ||

రాజా తు ధర్మేణ హి పాలయిత్వా
మహామతిర్దండధరః ప్రజానామ్ |
అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్
ఇతశ్చ్యుతః స్వర్గముపైతి విద్వాన్ || ౭౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః || ౧౦౦ ||

Ayodhya Kanda Sarga 100 Meaning In Telugu

భరతుడు మరలా రాముని పాదాల మీదకు జారిపోయాడు. రాముని పాదాలు తన కన్నీటితో కడుగుతున్నాడు. రాముడు వాత్సల్యముతో భరతుని రెండు చేతులతో పైకి లేవనెత్తాడు. తన తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. భరతుని కళ్లు తుడిచాడు. శిరస్సు ముద్దుపెట్టుకున్నాడు.
“భరతా! నీవు ఒంటరిగా ఈ అరణ్యములకు ఎందుకు వచ్చావు? తండ్రిగారు దశరథమహారాజుగారు రాలేదా!ఆయన ఎక్కడికి వెళ్లారు? నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఎందుకంటే తండ్రిగారు జీవించి ఉండగా నా కొరకు అరణ్యములకు రావలసిన అవసరము నీకు లేదు కదా! మన వివాహముల తరువాత నీవు నీ మాతామహుల ఇంటికి వెళ్లావు. మరలా ఇన్నాళ్లకు నిన్ను చూడగలిగాను. నాకు చాలాసంతోషంగా ఉంది.
కాని నీవు అరణ్యములకు రావలసిన అవసరమేమి ఉన్నదో నాకు తెలియడం లేదు? తండ్రి గారు క్షేమముగా ఉన్నారా! నేను అడవుల పాలు అయ్యాను అన్న దుఃఖంతో స్వర్గస్థులు కాలేదు కదా! లేకపోతే నీవు చిన్నవాడవు, రాజ్యము చేయుటకు అర్హుడవు కావు అని నీ తండ్రిగారు నీకు రాజ్యము ఇచ్చుటకు నిరాకరించలేదు కదా!

ఏకారణము చేత నీవు ఇక్కడకు వచ్చావో తెలియజెయ్యి. భరతా! నేను అనవసరంగా ఏదేదో ఊహించు కుంటున్నాను. తండ్రిగారు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నీవు ఆయనకు ప్రతిరోజూ సేవలు చేస్తున్నావు కదా! నాకే ఆ భాగ్యము లేదు.

మన పురోహితుల వారు వసిష్ఠుల వారు క్షేమంగా ఉన్నారా. నీవు ప్రతిరోజూ ఆయనను పూజిస్తున్నావు కదా! నా తల్లులు కౌసల్య, సుమిత్ర కైకేయి క్షేమంగా ఉన్నారు కదా! మన పురోహితులు, వారి కుమారుడు నీకు సర్వవేళలా అండగా ఉంటూ నీచేత అగ్ని కార్యములు, హెూమములు చేయిస్తున్నారు కదా! నీకు ధర్మాధర్మములను బోధిస్తున్నారు కదా!

నీవు దేవతలను, పితరులను, తల్లి తండ్రులను, గురువులను ప్రతిరోజూ పూజిస్తున్నావు కదా! బ్రాహ్మణులను, వృద్ధులను ఆదరిస్తున్నావు కదా! మనకు అస్త్రవిద్య చెప్పిన గురువు సుధన్వుని తగురీతిలో సత్కరిస్తున్నావు కదా!

నీవు రాజ్యాభిషిక్తుడవు అయిన తరువాత నీతిమంతులు, బుద్ధిమంతులు, విద్యావంతులు, రాజనీతి విశారదులనే మంత్రులుగా నియమించావు కదా! ఎందుకంటే, మంత్రులు రాజనీతికోవిదులు, రాజుయొక్క రహస్యములను కాపాడకలిగిన వారు అయిఉండడం ఎంతో ముఖ్యం. (ఈ నాడు కూడా మంత్రుల చేత ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణం చేయించడం ఆచారం).

భరతా! నీ పాలన ఎలా ఉంది! జాగరూకతతో ఉంటున్నావా లేక సమయం కాని సమయాలలో నిద్రపోతున్నావా! రాజుకు చేటు నిద్ర తెస్తుంది. సదా జాగరూకుడవై ఉండాలి. నీవు ఎల్లప్పుడూ తెల్లవారు జామున లేచి మంత్రాంగములు మంత్రులతో చర్చించాలి. అప్పుడు ఏకాంతము లభిస్తుంది. మరొక మాట! నీవు ఒక్కడివే ఆలోచించి నిర్ణయం తీసుకోడమూ తప్పు. అలాగని ఎక్కువమందితో ఆలోచించడము కూడా తప్పే. ఎందుకంటే నీ ఆలోచనలు అందరికీ తెలిసే ప్రమాదం ఉంది.

భరతా! ఎల్లప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేపనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అటువంటి పనులను ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి. కాని ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. నీవు ఒక పనినిపూర్తి చేసిన తరువాతనే దానిని బహిరంగ పరచాలి. అంతేగానీ, చేయబోయే పనులను ఎవరికీ తెలియనీయ కూడదు. ఎందుకంటే నీ శత్రువులు, నీవు తలపెట్టిన పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
నీవు, నీ మంత్రులు నీతిమంతులుగా, రహస్యములను బట్టబయలు చేయకున్నా, మీ చుట్ట పక్కల వారు నేర్పుగా మీ రహస్యములను రాబట్ట వచ్చు. అటువంటి వారిని దూరంగా ఉంచుతున్నావు కదా!

భరతా! అవసరమైతే వేయి మంది మూర్ఖులనైనా వదులు కోగాని, ఒక పండితుని మాత్రము నీ దగ్గరకు చేర్చుకో. పండితులు నీకు ఆపదలలో సాయం చేయగలరు. మూర్ఖులు ఎంతమంది ఉన్నా, తిండి చేటు తప్ప ఎలాంటి సాయమూ చెయ్యరు. మూర్కులైన మంత్రులు పది మంది కన్నా మేధావి, పరాక్రమంతుడు, నిజాయితీ పరుడు, పండితుడు అయిన ఒక్క మంత్రి చాలు. ఆ రాజు క్షేమంగా ఉండగలడు.

నీ సేవకులను వారి వారికి తగిన స్థానములలో నియమించావు కదా! ఎక్కువ సామర్థ్యం ఉన్నవారిని గొప్ప స్థానములలోనూ, కాస్త మధ్యస్థంగా తెలివితేటలు ఉన్నవారిని, మధ్యమ స్థానములలోనూ, పూర్తిగా తెలివితేటలే లేనివారిని అధమ స్థానములలోనూ నియమించావా!
(అంటే మెరిట్ ను బట్టి ఉద్యోగస్థులను నియమించాలి అని రామరాజ్యంలో ఉన్న నిబంధన. ఈ రోజుల్లో ప్రతిభకు పట్టకట్టడం మానేసారు. 60 ఏళ్లుదాటినా రిజర్వేషన్ల పేరిట ప్రతిభను కాల రాస్తున్నారు. మీకు చదువు అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు. పది మార్కులు వచ్చినా చాలు, మీకు రిజర్వేషన్లు ఉన్నాయి అని భరోసా ఇస్తున్నారు. ఇదీ నేటి రాజకీయ రామాయణం.)

నీవు ఉద్యోగులను నియమించే ముందు వారిని కఠిన మైన పరీక్షలకు గురిచేసి అందులోనే నెగ్గిన వారినే ఉద్యోగులుగా నియమిస్తున్నావు కదా! (నేడు మనము అనుసరిస్తున్న యు.పి.యస్.సి లేక ఏ.పి.పి.యస్.సి అలాంటివే కదా.)

నీదేశములో ప్రజలు శాంతి భద్రతలు లోపించి, భయభ్రాంతు లవుతుంటే నీ మంత్రులు చూస్తూ ఊరుకోడం లేదు కదా!
(విజయవాడలో స్కూలుకు పోతున్న చిన్నారిని కిడ్నాప్ చేసి, చంపి, బాయిలర్ లో వేసి కాల్చిన కేసు, రెండు సంవత్సరాలు దాటినా ఒకకొలిక్కిరాలేదు. మన గవర్నమెంటు వారికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇదీ నేటి మంత్రుల నిర్వాహకము. పైగా మాది రామరాజ్యము అని గొప్పలుచెప్పుకోడం.).

భరతా! నిన్ను నీ మంత్రులు గౌరవిస్తున్నారా లేక నిన్ను ఎదిరించి అవమానించడం లేదు కదా! (మంత్రులు ముఖ్యమంత్రికి ఎదురు తిరగడం, బహిరంగంగా దూషించడం, అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం నేడు పరిపాటి అయిపోయింది.)

ఎందుకంటే భరతా! నీ ఆంతరంగికులు, మంత్రులు ఎవరైనా నీకు ఎదురు తిరిగితే అటువంటి వారిని ఉపేక్షించరాదు. అలా ఉపేక్షిస్తే ఆ రాజు ప్రాణాలకే ముప్పు. (ముఖ్యమంత్రి పక్కనే ఉండి, అసమ్మతిని రెచ్చగొట్టి, ముఖ్యమంత్రి పదవికి, ప్రాణానికి ఎసరు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది.)

భరతా! ఇంక నీసేనాపతులు ఎలా ఉన్నారు. సమర్థుడు, విద్యావంతుడు, పరాక్రమ వంతుడు, నిజాయితీ పరుడు, నీకు విశ్వాసపాత్రుడు అయిన వారిని నీ సేనాపతులుగా నియమించావు కదా! బలవంతులు, యుద్ధములో నేర్పుప్రదర్శించినవారిని గౌరవిస్తున్నావు కదా!

నీ సైనికులకు సకాలంలో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, జీత భత్యములు అందజేస్తున్నావు కదా! ఎందుకంటే సకాలంలో జీతభత్యములు అందక పోతే సైనికులలో అసంతృప్తి చెలరేగుతుంది. తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది.

నీ రాజ్యములో ఉండే ప్రజలందరూ నీ పట్ల విధేయులుగా ఉన్నారు కదా. నీకోసం తమ ప్రాణములను సైతం అర్పించుటకు సిద్దంగా ఉన్నారు కదా!

నీ దూతలుగా ఎవరిని నియమించుకున్నావు? వారు నీ దేశములో పుట్టిన వారు అయి ఉండాలి. అన్ని విషయములను తెలిసిన సమర్థుడు అయి ఉండాలి. నీవు చెప్పిన విషయములను నేర్పుగా ఉన్నదిఉన్నట్టు ఎదుటివారికి చెప్పే సామర్థ్యం కలిగి ఉండాలి. పైగా అతడు పండితుడు అయి ఉండాలి. ఇటువంటి అర్హతలు కలిగిన పురుషుని నీ దూతగా నియమించు కున్నావు కదా!

నీ స్వదేశములో గానీ, నీ శత్రుదేశములలో గానీ జరిగే విషయములను ఎప్పటి కప్పుడు గూఢచారుల వలన తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నావు కదా!

ఓ భరతా! ఒకసారి నీతో యుద్ధము చేసి ఓడి పోయిన నీ శత్రువు వాడేం చేస్తాడులే అని విడిచిపెట్ట కూడదు. వాడి పట్ల జాగరూకతగా ఉండాలి. వాడు మరలా తన బలాన్ని పెంచుకొని నిన్ను దొంగదెబ్బ తీయగలడు.

భరతా! కేవలము లౌకికసుఖములగురించి ఆలోచించే భరతా! కేవలము లౌకిక సుఖములగురించి ఆలోచించే నాస్తికవాదుల పట్ల జాగ్రత్తగా ఉండు. వారిని దగ్గర చేరనీయకు. అలాగే, చాలా మంది అజ్ఞానులు, తాము పండితులమనీ, తమకు అంతా తెలుసు అనీ విర్రవీగుతుంటారు. అలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇలాంటి వారు ధర్మశాస్త్రములను నమ్మరు. అనవసరమైన తర్కములు చేస్తూ, ప్రజలకు ధర్మశాస్త్రముల పట్ల అపనమ్మకము కలిగిస్తుంటారు. వీరి మాటలు నమ్మకు.

భరతా! అతి పురాతనమైనదీ, ఎందరో చక్రవర్తులు పరిపాలించినదీ అయిన అయోధ్యను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కదా! ఎందుకంటే అయోధ్య పురాతనమైనా అన్నీ సౌకర్యములు కల నగరము. అయోధ్యలో ఉన్న వ్యవసాయభూములకు, నివాస స్థలములకు నిర్దిష్టమైన హద్దులు, వాటిని తెలిపే గుర్తులు కలిగి ఉన్నాయి. అందు వలన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదు. (నేడు మన న్యాయస్థానములలో ఉన్న వ్యాజ్యాలలో 90 శాతము భూమి సరిహద్దు తగాదాలే.) అయోధ్యలో దేవాలయములు, సత్రములు, చెరువులూ సమృద్ధిగా ఉన్నాయి. అయోధ్యలో ఏటా ఉత్సవములు జరుగుతుంటాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో అలరారుతుంటారు. అయోధ్యలో పంటభూములు సమృద్ధిగా ఉన్నాయి. పశుసంపద అపారంగా ఉంది. ఖనిజ సంపదకు ఆలవాలమైన గనులు అనేకం ఉన్నాయి. హింస అనే పదానికి అయోధ్యలో తావు లేదు. అయోధ్యలో పాపాత్ములు లేరు. అయోధ్య కోట సురక్షితమైనది. అటువంటి అయోధ్యను నీవు చక్కగా రక్షిస్తున్నావు కదా!

నీ రాజ్యములో వర్తక వాణిజ్యములు ఎలాంటి ఆటంకములు లేకుండా సాగుతున్నాయి కదా! వర్తకులు నీకు అనుకూలంగా ఉన్నారు కదా! నీ రాజ్యములో గోరక్షణ సాగుతున్నదికదా! నీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు కదా! ఎందుకంటే ప్రజారక్షణ రాజు బాధ్యత.
నీ అంత:పుర స్త్రీలకు నీ రహస్యములను వెల్లడి చేయకుండా, వారిని సరససంభాషణలతో సంతోషపెడుతున్నావు కదా! కాని వారి మాటలకు మోసపోయి తప్పుదారి తొక్కవద్దు.

నీవు గజసంపదను చక్కగా పోషిస్తున్నావు కదా! గజ సంపదను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండు. రాజ్య రక్షణకు గజసంపద చాలా కీలకము.
ఓభరతా! నీవు ప్రతిరోజూ నీ ప్రజలను కలుసుకుంటూ వారి కష్టసుఖములు తెలుసుకుంటున్నావు కదా!

ఓ భరతా! నీ దగ్గర పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి వారు నిన్ను చూడగానే భయపడేట్టు చేయవద్దు. అలాగని వారికి అధిక చనువు ఇవ్వవద్దు. మధ్యేమార్గంగా వారితో మెలుగుతూ ఉండు.

నీ రాజ్యములో ధనము, ధాన్యము, నీరు, నిలవలు సమృద్ధిగా ఉన్నాయికదా. నీకు చాలినంత సైన్యము, యంత్రసామగ్రి సమకూర్చు కున్నావు కదా!
ఓ భరతా! నీ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది. నీ ఆదాయము ఎక్కువ, వ్యయము తక్కువగా ఉందికదా!
(నేటి కాలంలో లోటుబడ్జెట్ సర్వసాధారణం అయిపోయింది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. దాని కోసరం అప్పులు. వాటికి వడ్డీలు. ఆదాయంలోసగం వడ్డీలకే పోతుంది. ఇదీ నేటి ఆర్ధికవ్యవస్థ).

ఓ భరతా! ప్రజాధనము అపాత్రుల చేతులలోనికి వెళ్లడం లేదు కదా! నీవు నీ ధనమును దేవ కార్యములకు, పితృకార్యములకు, అతిధి సత్కారములకు, బ్రాహ్మణులకు, సైనికులకు, మిత్రవర్గములకు వ్యయం చేస్తున్నావు కదా!

భరతా! ఇంక న్యాయ విషయాలకు వస్తాము. నిరపరాధుల మీద నేరం మోపితే, వారిని విచారించకుండా, వారికి తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వకుండా, దురాశతో అతనికి మరణదండన విధించడం లేదు కదా!

(న్యాయసూత్రాలలో ప్రధానమైనది సహజన్యాయసూత్రము. అంటే ఎవరికైనా అతనికి విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చేముందు, అతనికి తన వాదన చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం ఇవ్వకుండా అతనికి విరుద్ధంగా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వకూడదు. దీనినే ఏ ప్రపంచ వ్యాప్తంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అని పిలువబడుతుంటాయి. దీనిని త్రేతాయుగంలోనే రాముడు ఆవిష్కరించాడు.)

భరతా! ఎవరైనా దొంగతనముచేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచి పట్టుకొంటే, అతడు దొంగతనం చేస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబితే, అటువంటి దొంగలను నీ అధికారులు ధనలోభము చేత విడిచిపెట్టడం లేదు కదా!

(దీనికి వివరణ అనవసరం. అన్నీకాదు కానీ, కొన్ని పోలీసు స్టేషన్లలో జరిగే తంతు ఇదే. అసలు నేరస్తులను విడిచిపెట్టడం, అమాయకుల మీద కేసులు బనాయించడం కొంతమంది పోలీసుల దైనందిన చర్య.)

న్యాయ నిర్ణయము చేసేటప్పుడు నీ న్యాయాధికారులు వీడు ధనికుడు, వీడు పేదవాడు అనే బేధబుద్ధి లేకుండా నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేస్తున్నారు కదా!

భరతా! ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏ రాజైనా తన ఇష్టం వచ్చినట్టు శాసనములను చేసి, అమాయకులను కష్టముల పాలు చేస్తాడో, అయాయకుల మీద అక్రమంగా నేరములు మోపి శిక్షిస్తాడో, ఆ రాజు ఎక్కువ కాలము రాజుగా ఉండలేడు. అతని రాజ్యంలో ప్రజలు కార్చిన కన్నీళ్లే ఆ రాజును శిక్షిస్తాయి. సర్వనాశనం చేస్తాయి.

ఓ భరతా! నీ రాజ్యములో శిశువులను, వృద్ధులను, పండితులను ఆదరిస్తున్నావు కదా!
(శిశుసంరక్షణాలయాలు, వృద్ధాశ్రమాలు, వృద్ధాప్య పెన్షన్లు, పండితులకు, కళాకారులకు పెన్షన్లు ఈకోవకే చెందుతాయి. రాముని కాలంలోనే ఇవి అమలులో ఉన్నాయి.).

ఓ భరతా! నీవు ధన సంపాదనకోసం ధర్మాన్ని విడిచిపెట్టడం, సుఖములు మరిగి భోగలాలసుడవై ధర్మమును విడిచి, ధనమును దుర్వినియోగం చెయ్యడం లాంటివి చేయడం లేదుకదా! నీవు ధర్మపరంగా ధనసంపాదన చేస్తూ, ధర్మమార్గంలో సంపాదించిన ధనమునకు తగ్గ కోరికలతో తృప్తిపడుతూ, రాజ్యము చేస్తున్నావుకదా!

ఓభరతా! నీవు ఎల్లప్పుడూ నీ రాజ్యములో ఉన్న ప్రజల క్షేమము కోరుతున్నావు కదా! ఓ భరతా! రాజు చెయ్యకూడనివి,ఆచరించరానివి చెబుతాను విను. రాజునాస్తికుడు కారాదు. అసత్యము పలుకరాదు.

రాజుకు కోపము పనికిరాదు. రాజుకు నిర్లక్ష్యం పనికిరాదు. రాజు విషయములను గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ సాగదీయడం, నాన్చడం పనికిరాదు.
(నేటి రాజకీయ నాయకులకు ఇదే తారక మంత్రము. పార్కలాం. వ్యవహారములను నాన్చడం, సాగదీయడం, కమీటీలపేరుతో కాలయాపన చేయడం, వాటికవే పరిష్కారం అవుతాయి అనుకోవడం నేటి రాజకీయనాయకుల తీరు. ఇది తప్పు, చేయకూడదు అని రాముడు స్పష్టంగా చెప్పాడు.)

జ్ఞానులను నిర్లక్ష్యం చేయకూడదు. రాజులకు సోమరి తనంపనికిరాదు. ఇంద్రియ సుఖములకు లోనుకాకూడదు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలే గానీ, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకొన్ననిర్ణయాలను అమలు చేయకుండా ఉండకూడదు. (రాజకీయనాయకులు ఆర్భాటంగా పునాదిరాళ్లు వేయడం, పనులుమాత్రం మొదలు పెట్టకపోవడం మనం చూస్తూనే ఉన్నాము..)

రాజు తన ఆలోచనలను రహస్యంగా ఉంచాలి. బహిర్గతం చేయకూడదు. ప్రజాక్షేమం పాటించాలి. ప్రజావ్యతిరేక పనులు చేయకూడదు. శత్రువులను నేర్పుగా ఎదుర్కోవాలి కానీ, మూర్ఖంగా ఒక్కుమ్మడిగా ఎదుర్కోకూడదు. రాజైన వాడు పైచెప్పిన వాటిని విడిచిపెట్టాలి. భరతా! మరలా చెప్పుచున్నాను. ఎప్పుడూ నీ సొంత నిర్ణయాలు తీసుకోకు. మంత్రులతో కూలంకళంగా చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకో. మంత్రులతో నీ చర్చలను చాలా రహస్యంగాఉంచు. నీవు ప్రతిరోజూ నీ భార్యతో కలిసి వేదాధ్యయనము చెయ్యి. అది మంచి ఫలితాలనిస్తుంది.నీ బుద్ధిని ఎల్లప్పుడూ ధర్మము నందే ఉంచు. ధర్మము వలననే అర్థ,కామములను పొందు. మన తండ్రిగారు, మన తాత ముత్తాతలు ఈ మార్గమునే అనుసరించారు. నీవుకూడా అదే ధర్మమార్గము అనుసరించి రాజ్యపాలన చెయ్యి.

మరొక మాట. నీవు భుజించునపుడు నీ మిత్రులతో సహాభుజించు. ఒంటరిగా భుజించవద్దు. పైచెప్పిన ప్రకారము రాజ్యపాలన చేసిన రాజు మరణానంతరము నరకమునకుకాకుండా స్వర్గమునకు వెళతాడు. “అని రాముడు భరతునికి రాజనీతి ఉపదేశించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకాధికశతతమః సర్గః (101) >>

Ayodhya Kanda Sarga 99 In Telugu – అయోధ్యాకాండ ఏకోనశతతమః సర్గః

Ayodhya Kanda Sarga 99

అయోధ్యాకాండం ఏకోనశతతమ (99వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, సింహాసనంపై ఉంచి అయోధ్యను పాలించే క్రమంలో ఉన్నాడు. భరతుడు, ప్రజలకు రాముడు తిరిగి వచ్చే వరకు తాను రాముని ప్రతినిధిగా ఉంటానని ప్రకటిస్తాడు. అతను ధర్మబద్ధంగా, న్యాయంగా పాలన కొనసాగిస్తాడు. ప్రజలు భరతుని నిస్వార్థతను మెచ్చుకుంటారు. ఈ సర్గలో, భరతుడు నందిగ్రామానికి వెళ్ళి, అక్కడ నివసిస్తూ పాలనను పర్యవేక్షించడానికి సిద్ధమవుతాడు. అతను వలమాలిన వాస్రాలు ధరించి, నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. భరతుడు, రాముడు తిరిగి వస్తాడని ఆశతో, తన విధిని నిర్వర్తిస్తాడు.

రామసమాగమః

నివిష్టాయాం తు సేనాయాముత్సుకో భరతస్తదా |
జగామ భ్రాతరం ద్రష్టుం శత్రుఘ్నమనుదర్శయన్ || ౧ ||

ఋషిం వసిష్ఠం సందిశ్య మాతౄర్మే శీఘ్రమానయ |
ఇతి త్వరితమగ్రే సః జగామ గురువత్సలః || ౨ ||

సుమంత్రస్త్వపి శత్రుఘ్నమదూరాదన్వపద్యత |
రామదర్శనజస్తర్షో భరతస్యేవ తస్య చ || ౩ ||

గచ్ఛన్నేవాథ భరతస్తాపసాలయసంస్థితామ్ |
భ్రాతుః పర్ణకుటీం శ్రీమానుటజం చ దదర్శ హ || ౪ ||

శాలాయాస్త్వగ్రతస్తస్యాః దదర్శ భరతస్తదా |
కాష్ఠాని చావభగ్నాని పుష్పాణ్యుపచితాని చ || ౫ ||

స లక్ష్మణస్య రామస్య దదర్శాశ్రమమీయుషః |
కృతం వృక్షేష్వభిజ్ఞానం కుశచీరైః క్వచిత్ క్వచిత్ || ౬ ||

దదర్శ చ వనే తస్మిన్మహతః సంచయాన్ కృతాన్ |
మృగాణాం మహిషాణాం చ కరీషైః శీతకారణాత్ || ౭ ||

గచ్ఛన్నేవ మహాబాహుర్ద్యుతిమాన్ భరతస్తదా |
శత్రుఘ్నం చాబ్రవీద్ధృష్టస్తానమాత్యాంశ్చ సర్వశః || ౮ ||

మన్యే ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజో యమబ్రవీత్ |
నాతిదూరే హి మన్యేఽహం నదీం మందాకినీమితః || ౯ ||

ఉచ్చైర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయమ్ |
అభిజ్ఞానకృతః పంథా వికాలే గంతుమిచ్ఛతా || ౧౦ ||

ఇదం చోదాత్తదంతానాం కుంజరాణాం తరస్వినామ్ |
శైలపార్శ్వే పరిక్రాంతమన్యోన్యమభిగర్జతామ్ || ౧౧ ||

యమేవాధాతుమిచ్ఛంతి తాపసాః సతతం వనే |
తస్యాసౌ దృశ్యతే ధూమః సంకులః కృష్ణవర్త్మనః || ౧౨ ||

అత్రాహం పురుషవ్యాఘ్రం గురుసంస్కారకారిణమ్ |[సత్కారకారిణమ్]
ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షిమివ రాఘవమ్ || ౧౩ ||

అథ గత్వా ముహూర్తం తు చిత్రకూటం స రాఘవః |
మందాకినీమనుప్రాప్తస్తం జనం చేదమబ్రవీత్ || ౧౪ ||

జగత్యాం పురుషవ్యాఘ్రాస్తే వీరాసనే రతః |
జనేంద్రో నిర్జనం ప్రాప్య ధిజ్ఞ్మే జన్మ సజీవితమ్ || ౧౫ ||

మత్కృతే వ్యసనం ప్రాప్తో లోకనాథో మహాద్యుతిః |
సర్వాన్కామాన్పరిత్యజ్య వనే వసతి రాఘవః || ౧౬ ||

ఇతి లోకసమాక్రుష్టః పాదేష్వద్య ప్రసాదయన్ |
రామస్య నిపతిష్యామి సీతాయా లక్ష్మణస్య చ || ౧౭ ||

ఏవం స విలపంస్తస్మిన్ వనే దశరథాత్మజః |
దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాలాం మనోరమామ్ || ౧౮ ||

సాలతాలాశ్వకర్ణానాం పర్ణైర్బహుభిరావృతామ్ |
విశాలాం మృదుభిస్తీర్ణాం కుశైర్వేదిమివాధ్వరే || ౧౯ ||

శక్రాయుధనికాశైశ్చ కార్ముకైర్భారసాధనైః |
రుక్మపృష్ఠైర్మహాసారైః శోభితాం శత్రుబాధకైః || ౨౦ ||

అర్కరశ్మిప్రతీకాశైర్ఘోరైస్తూణీగతైః శరైః |
శోభితాం దీప్తవదనైః సర్పైర్భోగవతీమివ || ౨౧ ||

మహారజతవాసోభ్యామసిభ్యాం చ విరాజితామ్ |
రుక్మబిందువిచిత్రాభ్యాం చర్మభ్యాం చాపి శోభితామ్ || ౨౨ ||

గోధాంగుళిత్రైరాసక్తైశ్చిత్రైః కాంచనభూషితైః |
అరిసంఘైరనాధృష్యాం మృగైః సింహగుహామివ || ౨౩ ||

ప్రాగుదక్ప్రవణాం వేదిం విశాలాం దీప్తపావకామ్ |
దదర్శ భరతస్తత్ర పుణ్యాం రామనివేశనే || ౨౪ ||

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ |
ఉటజే రామమాసీనం జటామండలధారిణమ్ || ౨౫ ||

తం తు కృష్ణాజినధరం చీరవల్కలవాససమ్ |
దదర్శ రామమాసీనమభితః పావకోపమమ్ || ౨౬ ||

సింహస్కంధం మహాబాహుం పుండరీకనిభేక్షణమ్ |
పృథివ్యాః సాగరాంతాయా భర్తారం ధర్మచారిణమ్ || ౨౭ ||

ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతమ్ |
స్థండిలే దర్భసంస్తీర్ణే సీతయా లక్ష్మణేన చ || ౨౮ ||

తం దృష్ట్వా భరతః శ్రీమాన్ దుఃఖశోకపరిప్లుతః |
అభ్యధావత ధర్మాత్మా భరతః కైకయీసుతః || ౨౯ ||

దృష్ట్వైవ విలలాపార్తో బాష్పసందిగ్ధయా గిరా |
అశక్నువన్ ధారయితుం ధైర్యాద్వచనమబ్రవీత్ || ౩౦ ||

యః సంసది ప్రకృతిభిర్భవేద్యుక్తోపాసితుమ్ |
వన్యైర్మృగైరుపాసీనః సోఽయమాస్తే మమాగ్రజః || ౩౧ ||

వాసోభిర్బహుసాహస్రైర్యో మహాత్మా పురోచితః |
మృగాజినే సోఽయమిహ ప్రవస్తే ధర్మమాచరన్ || ౩౨ ||

అధారయద్యో వివిధాశ్చిత్రాః సుమనసస్తదా |
సోఽయం జటాభారమిమం వహతే రాఘవః కథమ్ || ౩౩ ||

యస్య యజ్ఞైర్యథోద్దిష్టైర్యుక్తో ధర్మస్య సంచయః |
శరీరక్లేశసంభూతం స ధర్మం పరిమార్గతే || ౩౪ ||

చందనేన మహార్హేణ యస్యాంగముపసేవితమ్ |
మలేన తస్యాంగమిదం కథమార్యస్య సేవ్యతే || ౩౫ ||

మన్నిమిత్తమిదం దుఃఖం ప్రాప్తో రామః సుఖోచితః |
ధిగ్జీవితం నృశంసస్య మమ లోకవిగర్హితమ్ || ౩౬ ||

ఇత్యేవం విలపన్దీనః ప్రస్విన్నముఖపంకజః |
పాదావప్రాప్య రామస్య పపాత భరతో రుదన్ || ౩౭ ||

దుఃఖాభితప్తో భరతో రాజపుత్రో మహాబలః |
ఉక్త్వార్యేతి సకృద్దీనం పునర్నోవాచ కించన || ౩౮ ||

బాష్పాపిహితకంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినమ్ |
ఆర్యేత్యేవాథ సంక్రుశ్య వ్యాహర్తుం నాశకత్తదా || ౩౯ ||

శత్రుఘ్నశ్చాపి రామస్య వవందే చరణౌ రుదన్ |
తావుభౌ స సమాలింగ్య రామశ్చాశ్రూణ్యవర్తయత్ || ౪౦ ||

తతః సుమంత్రేణ గుహేన చైవ
సమీయతూ రాజసుతావరణ్యే |
దివాకరశ్చైవ నిశాకరశ్చ
యథాంబరే శుక్రబృహస్పతిభ్యామ్ || ౪౧ ||

తాన్పార్థివాన్వారణయూథపాభాన్
సమాగతాంస్తత్ర మహత్యరణ్యే |
వనౌకసస్తేఽపి సమీక్ష్య సర్వే-
-ప్యశ్రూణ్యముంచన్ ప్రవిహాయ హర్షమ్ || ౪౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనశతతమః సర్గః || ౯౯ ||

Ayodhya Kanda Sarga 99 Meaning In Telugu

శత్రుఘ్నుడు తన వెంటరాగా భరతుడు వడి వడి గా రాముని వద్దకు వెళుతున్నాడు. భరతుని వెనక వసిష్ఠుడు, దశరథుని ముగ్గురు భార్యలను తీసుకొని వెళుతున్నాడు. సుమంత్రుడు కూడా భరతుని వెనుకనే వెళుతున్నాడు.

భరతునికి దూరంగా ఒక పర్ణశాల కనపడింది. ఆ పర్ణశాల ముందు కొన్ని కట్టెలు,పుష్పములు కనపడ్డాయి. అక్కడ ఉన్న చెట్లకు కొన్ని నారచీరలు వేలాడుతున్నాయి. రాముడు అక్కడే ఉన్నాడు అని రూఢి అయింది భరతునికి. ఉద్వేగంతో వెళుతున్నాడు భరతుడు.

“శత్రుఘ్నా! చూచావా! ఇదే భరద్వాజుడు చెప్పిన ప్రదేశము. ఇక్కడే మందాకినీ నదిప్రవహించుచున్నది. ఇక్కడి చెట్లకు నారచీరలు వేలాడుతూ ఉన్నాయి. అదుగో ఆపర్ణశాల దగ్గర ఉన్న అగ్నినుండిపుట్టిన పొగ పైకి లేస్తూ ఉంది. రాముడు ఇక్కడే ఉన్నాడు అని నా అనుమానము. మనము ఇక్కడే రాముని చూస్తాము.

సుమంతా! అయోధ్యా సింహాసనముమీద కూర్చోవలసిన రాముడు ఇక్కడ కటిక నేల మీద పద్మాసనము వేసుకొని కూర్చొని ఉన్నాడు. దీని కంతటికీ నేనేకారణము. నా మూలముననే రామునికి ఇన్ని కష్టములు వచ్చినవి. నేను, రాముడు సీత పాదముల మీద పడి క్షమాపణ కోరిన కాని నా మనసు శాంతించదు.” అని అంటూ భరతుడు దూరంగా ఉన్న ఆ పర్ణశాల వైపు నడుస్తున్నాడు.

భరతుడు ఆ పర్ణశాలను సమీపించాడు. భరతుని మనస్సంతా ఉద్వేగపూరితంగా ఉంది. ఆ పర్ణశాల లోపలికి తొంగి చూచాడు. జటలు కట్టిన వెంట్రుకలతో, నేల మీద జింక చర్మము పరచుకొని దాని మీద కూర్చుని ఉన్న రాముని చూచాడు భరతుడు. రామునికి అటు ఇటు సీత లక్ష్మణులు కూర్చొని ఉన్నారు.

భరతునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. రాముడి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాడు. భరతుని కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కళ్లు సరిగా కనిపించడం లేదు. దు:ఖముతో గొంతు బొంగురుపోయింది. ఆ బొంగురుగొంతుతో భరతుడు ఇలా అన్నాడు.

“రామా! నీవా ఈ నేలమీద కూర్చొని ఉన్నది. అమాత్యులు సేవిస్తూ ఉంటే, రాజ సింహాసనము మీద కూర్చోవలసిన నీవు జింక చర్మమీద కూర్చొని ఉన్నావా! పట్టు పీతాంబరములు ధరించవలసిన నీవు నారచీరలు కట్టుకొని ఉన్నావా! చిత్ర విచిత్రములైన పుష్పములు ధరించవలసిన నీ శిరసు మీద ఆ జటలు ఎలా ధరించావు? ఒక రాజుగా యజ్ఞయాగములు చేయవలసిన నీవు, ఇక్కడ అడవులలో కష్టములు పడుతున్నావా? అగరు, చందనముతో అలరార వలసిన నీ శరీరము మట్టికొట్టుకొని పోయినదా! సుఖపడవలసిన నీవు ఇలా కష్టములు పడుతుంటే ఆ కష్టములకు కారణమైన నాకు ఈ సుఖములు ఎందుకు?” అని ఏడుస్తూ రాముని పాదముల మీద పడ్డాడు భరతుడు. రాముని పాదములను తన కన్నీటితో తడుపుతున్నాడు.

ఒక సారి తల ఎత్తి రామా! అని పిలిచి మరలా రాముని పాదముల మీదపడిపోయాడు భరతుడు. తరువాత భరతునికి మాటలు రాలేదు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. శత్రుఘ్నుడు కూడాదు:ఖము ఆపుకోలేక రాముని పాదముల మీద పడ్డాడు.

రాముడు తమ్ములను చూచిన సంభ్రమంతో భరత శత్రుఘ్నులను తన రెండు చేతులతో పొదివి పట్టుకొని లేవనెత్తాడు. రాముడు భరత శత్రుఘ్నులను గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు, రామునికి కూడా దుఃఖము ఆగలేదు. భోరున విలపిస్తున్నాడు. ఇంతలో వెనుకగా వస్తున్న సుమంత్రుడు, వసిష్ఠుడు కూడా పర్ణశాల లోపలికి వచ్చారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ శతతమః సర్గః (100) >>

Aranya Kanda Sarga 27 In Telugu – అరణ్యకాండ సప్తవింశః సర్గః

Aranya Kanda Sarga 27 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తవింశః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఇందులో రాముడు, సీత, లక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి చేరుకొని కబంధుడిని ఎదుర్కొంటారు. కబంధుడు రాక్షసుడు, శాపం కారణంగా అతని శరీరం విచిత్రంగా ఉంటుంది. రామ, లక్ష్మణులు అతన్ని సంహరిస్తారు.

త్రిశిరోవధః

ఖరం తు రామాభిముఖం ప్రయాంతం వాహినీపతిః |
రాక్షసస్త్రిశిరా నామ సన్నిపత్యేదమబ్రవీత్ ||

1

మాం నియోజయ విక్రాంత సన్నివర్తస్వ సాహసాత్ |
పశ్య రామం మహాబాహుం సంయుగే వినిపాతితమ్ ||

2

ప్రతిజానామి తే సత్యమాయుధం చాహమాలభే |
యథా రామం వధిష్యామి వధార్హం సర్వరక్షసామ్ ||

3

అహం వాఽస్య రణే మృత్యురేష వా సమరే మమ |
వినివృత్య రణోత్సాహాన్ ముహూర్తం ప్రాశ్నికో భవ ||

4

ప్రహృష్టే వా హతే రామే జనస్థానం ప్రయాస్యసి |
మయి వా నిహతే రామం సంయుగాయోపయాస్యసి ||

5

ఖరస్త్రిశిరసా తేన మృత్యులోభాత్ప్రసాదితః |
గచ్ఛ యుధ్యేత్యనుజ్ఞాతో రాఘవాభిముఖో యయౌ ||

6

త్రిశిరాశ్చ రథేనైవ వాజియుక్తేన భాస్వతా |
అభ్యద్రవద్రణే రామం త్రిశృంగ ఇవ పర్వతః ||

7

శరధారాసమూహాన్ స మహామేఘ ఇవోత్సృజమ్ |
వ్యసృజత్సదృశం నాదం జలార్ద్రస్య తు దుందుభేః ||

8

ఆగచ్ఛంత త్రిశిరసం రాక్షసం ప్రేక్ష్య రాఘవః |
ధనుషా ప్రతిజగ్రాహ విధూన్వన్ సాయకాన్ శితాన్ ||

9

స సంప్రహారస్తుములో రామత్రిశిరసోర్మహాన్ |
బభూవాతీవ బలినోః సింహకుంజరయోరివ ||

10

తతస్త్రిశిరసా బాణైర్లలాటే తాడితాస్త్రిభిః |
అమర్షీ కుపితో రామః సంరబ్ధమిదమబ్రవీత్ ||

11

అహో విక్రమశూరస్య రాక్షసస్యేదృశం బలమ్ |
పుష్పైరివ శరైర్యస్య లలాటేఽస్మి పరిక్షతః ||

12

మమాపి ప్రతిగృహ్ణీష్వ శరాంశ్చాపగుణచ్యుతాన్ |
ఏవముక్త్వా తు సంరబ్ధః శరానాశీవిషోపమాన్ ||

13

త్రిశిరోవక్షసి క్రుద్ధో నిజఘాన చతుర్దశ |
చతుర్భిస్తురగానస్య శరైః సన్నతపర్వభిః ||

14

న్యపాతయత తేజస్వీ చతురస్తస్య వాజినః |
అష్టభిః సాయకైః సూతం రథోపస్థాన్ న్యపాతయత్ ||

15

రామశ్చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్ఛ్రితమ్ |
తతో హతరథాత్తస్మాదుత్పతంతం నిశాచరమ్ ||

16

విభేద రామస్తం బాణైర్హృదయే సోభవజ్జడః |
సాయకైశ్చాప్రమేయాత్మా సామర్షస్తస్య రక్షసః ||

17

శిరాంస్యపాతయద్రామో వేగవద్భిస్త్రిభిః శితైః |
స భూమౌ రుధిరోద్గారీ రామబాణాభిపీడితః ||

18

న్యపతత్పతితైః పూర్వం స్వశిరోభిర్నిశాచరః |
హతశేషాస్తతో భగ్నా రాక్షసాః ఖరసంశ్రయాః ||

19

ద్రవంతి స్మ న తిష్ఠంతి వ్యాఘ్రత్రస్తా మృగా ఇవ |
తాన్ ఖరో ద్రవతో దృష్ట్వా నివర్త్య రుషితః స్వయమ్ |
రామమేవాభిదుద్రావ రాహుశ్చంద్రమసం యథా ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తవింశః సర్గః ||

Aranya Kanda Sarga 27 Meaning In Telugu

త్రిశిరస్సుడు అనే సైన్యాధిపతి ఖరుడు రాముని వైపు దూసుకువెళ్లడం చూచాడు. వెంటనే త్రిశిరస్సుడు ఖరుడి వద్దకు వచ్చాడు.

“ఓ వీరుడా! ఒక సాధారణ మానవుని సంహరించడానికి నీవు వెళ్లవలెనా! మేము లేమా! నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్లి రాముని సంహరిస్తాను. ఈ రాముడి చావు నా చేతిలో ఉంది. నేను చంపుతాను. లేకపోతే రాముని చేతిలో నేను చస్తాను. నువ్వు మాత్రం చూస్తూ ఉండు. ఒక వేళ నేను రాముణ్ణి చంపితే మనం అందరం ఆనందంతో జనస్థానమునకు వెళ్ళాము. లేక రాముడు నన్ను చంపితే, అప్పుడు నువ్వే వెళ్లి రాముని చంపవచ్చును.” అని అన్నాడు త్రిశిరుడు.

ఆమాటలు విన్న ఖరుడు ఆనందంతో త్రిశిరునికి రామునితో యుద్ధము చేయమని అనుమతి ఇచ్చాడు. త్రిశిరుడు తన రథము ఎక్కి రాముని మీదికి యుద్ధమునకు వెళ్లాడు. రాముని మీద బాణములను వర్షము వలె కురిపించాడు. ఆ బాణములనన్నింటికీ రాముడు మధ్యలోనే తుంచాడు.

రాముడు త్రిశిరస్సుల మధ్య పోరు భయంకరంగా జరిగింది. త్రిశిరుడు రాముని నుదుటిపై తగిలేటట్టు మూడు బాణములను వదిలాడు. రాముడు కోపించి సర్పములవలె దూసుకు వెళ్లే నాలుగు బాణములను త్రిశిరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. మరొక నాలుగు బాణములతో త్రిశిరుడు ఎక్కిన రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. త్రిశిరుడు తేరుకొనే లోపల రాముడు అతని రథము నడుపుతున్న సారథిని చంపాడు. మరొక బాణంతో త్రిశిరుని పతాకమును విరిచాడు.

త్రిశిరుడు రథమునుండి పైకి ఎగరబోయాడు. ఎగిరే ఆ త్రిశిరుని గుండెలకు గురిపెట్టి రాముడు నాలుగు బాణములను ప్రయోగించాడు. మరొక మూడు బాణములను సంధించి త్రిశిరుని మూడు తలలను ఖండించాడు. త్రిశిరుని తలలు తాటికాయల మాదిరి నేలమీద పడ్డాయి. ఆ వెంటనే త్రిశిరుని శరీరము నేలమీద పడింది.

ఎప్పుడైతే త్రిశిరుడు చచ్చాడో, అతని సేనలు చెల్లాచెదురుగా పారిపోయాయి. రాక్షస సేనలు వెనుతిరిగి పారిపోవడం చూచాడు ఖరుడు. త్రిశిరుడు చచ్చాడు అని తెలుసుకున్నాడు ఖరుడు. పారిపోతున్న సేనలను కూడగట్టుకొని రాముని మీదికి యుద్ధానికి వెళ్లాడు ఖరుడు.

శ్రీమద్రామాయణము,
అరణ్యకాండము ఇరువదిఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టావింశః సర్గః (28) >>

Aranya Kanda Sarga 26 In Telugu – అరణ్యకాండ షడ్వింశః సర్గః

Aranya Kanda Sarga 26 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండలోని షడ్వింశః సర్గః రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తున్నారు. అప్పుడు శూర్పణఖా అనే రాక్షసి వారి వద్దకు వచ్చి, రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. రాముడు సీతను తన భార్యగా పరిచయం చేసి, శూర్పణఖాను తిరస్కరిస్తాడు.

దూషణాదివధః

దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సః |
సందిదేశ మహాబాహుర్భీమవేగాన్ దురాసదాన్ ||

1

రాక్షసాన్ పంచ సాహస్రాన్ సమరేష్వనివర్తినః |
తే శూలైః పట్టిశైః ఖడ్గైః శిలావర్షైర్ద్రుమైరపి ||

2

శరవర్షైరవిచ్ఛిన్నం వవృషుస్తం సమంతతః |
స ద్రుమాణాం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ ||

3

ప్రతిజగ్రాహ ధర్మాత్మా రాఘవస్తీక్ష్ణసాయకైః |
ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవర్షభః ||

4

రామః క్రోధం పరం భేజే వధార్థం సర్వరక్షసామ్ |
తతః క్రోధసమావిష్టః ప్రదీప్త ఇవ తేజసా ||

5

శరైరవాకిరత్సైన్యం సర్వతః సహదూషణమ్ |
తతః సేనాపతిః క్రుద్ధో దూషణః శత్రుదూషణః ||

6

శరైరశనికల్పైస్తం రాఘవం సమవాకిరత్ |
తతో రామః సుసంక్రుద్ధః క్షురేణాస్య మహద్ధనుః ||

7

చిచ్ఛేద సమరే వీరశ్చతుర్భిశ్చతురో హయాన్ |
హత్వా చాశ్వాన్ శరైస్తీక్ష్ణైరర్ధచంద్రేణ సారథేః ||

8

శిరో జహార తద్రక్షస్త్రిభిర్వివ్యాధ వక్షసి |
స చ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః ||

9

జగ్రాహ గిరిశృంగాభం పరిఘం రోమహర్షణమ్ |
వేష్టితం కాంచనైః పట్టైర్దేవసైన్యప్రమర్దనమ్ ||

10

ఆయసైః శంకుభిస్తీక్ష్ణైః కీర్ణం పరవసోక్షితమ్ |
వజ్రాశనిసమస్పర్శం పరగోపురదారణమ్ ||

11

తం మహోరగసంకాశం ప్రగృహ్య పరిఘం రణే |
దూషణోఽభ్యద్రవద్రామం క్రూరకర్మా నిశాచరః ||

12

తస్యాభిపతమానస్య దూషణస్య స రాఘవః |
ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ ||

13

భ్రష్టస్తస్య మహాకాయః పపాత రణమూర్ధని |
పరిఘశ్ఛిన్నహస్తస్య శక్రధ్వజ ఇవాగ్రతః ||

14

స కరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణః |
విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజః ||

15

తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే |
సాధు సాధ్వితి కాకుత్స్థం సర్వభూతాన్యపూజయన్ ||

16

ఏతస్మిన్నంతరే క్రుద్ధాస్త్రయః సేనాగ్రయాయినః |
సంహత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావపాశితాః ||

17

మహాకపాలః స్థూలాక్షః ప్రమాథీ చ మహాబలః |
మహాకపాలో విపులం శూలముద్యమ్య రాక్షసః ||

18

స్థూలాక్షః పట్టిశం గృహ్య ప్రమాథీ చ పరశ్వధమ్ |
దృష్ట్వైవాపతతస్తూర్ణం రాఘవః సాయకైః శితైః ||

19

తీక్ష్ణాగ్రైః ప్రతిజగ్రాహ సంప్రాప్తానతిథీనివ |
మహాకపాలస్య శిరశ్చిచ్ఛేద పరమేషుభిః ||

20

అసంఖ్యేయైస్తు బాణౌఘైః ప్రమమాథ ప్రమాథినమ్ |
స పపాత హతో భూమౌ విటపీవ మహాద్రుమః ||

21

స్థూలాక్షస్యాక్షిణీ తీక్ష్ణైః పూరయామాస సాయకైః |
దూషణస్యానుగాన్ పంచసహస్రాన్ కుపితః క్షణాత్ ||

22

బాణౌఘైః పంచసహస్రైరనయద్యమసాదనమ్ |
దూషణం నిహతం దృష్ట్వా తస్య చైవ పదానుగాన్ ||

23

వ్యాదిదేశ ఖరః క్రుద్ధః సేనాధ్యక్షాన్మహాబలాన్ |
అయం వినిహతః సంఖ్యే దూషణః సపదానుగః ||

24

మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషమ్ |
శస్త్రైర్నానావిధాకారైర్హనధ్వం సర్వరాక్షసాః ||

25

ఏవముక్త్వా ఖరః క్రుద్ధో రామమేవాభిదుద్రువే |
శ్యేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః ||

26

దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః |
మేఘమాలీ మహామాలీ సర్పాస్యో రుధిరాశనః ||

27

ద్వాదశైతే మహావీర్యా బలాధ్యక్షాః ససైనికాః |
రామమేవాభ్యవర్తంత విసృజంతః శరోత్తమాన్ ||

28

తతః పావకసంకాశైర్హేమవజ్రవిభూషితైః |
జఘాన శేషం తేజస్వీ తస్య సైన్యస్య సాయకైః ||

29

తే రుక్మపుంఖా విశిఖాః సధూమా ఇవ పావకాః |
నిజఘ్నుస్తాని రక్షాంసి వజ్రా ఇవ మహాద్రుమాన్ ||

30

రక్షసాం తు శతం రామః శతేనైకేన కర్ణినా |
సహస్రం చ సహస్రేణ జఘాన రణమూర్ధని ||

31

తైభిన్నవర్మాభరణాశ్ఛిన్నభిన్నశరాసనాః |
నిపేతుః శోణితాదిగ్ధా ధరణ్యాం రజనీచరాః ||

32

తైర్ముక్తకేశైః సమరే పతితైః శోణితోక్షితైః |
ఆస్తీర్ణా వసుధా కృత్స్నా మహావేదిః కుశైరివ ||

33

క్షణేన తు మహాఘోరం వనం నిహతరాక్షసమ్ |
బభూవ నిరయప్రఖ్యం మాంసశోణితకర్దమమ్ ||

34

చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
హతాన్యేకేన రామేణ మానుషేణ పదాతినా ||

35

తస్య సైన్యస్య సర్వస్య ఖరః శేషో మహారథః |
రాక్షసస్త్రిశిరాశ్చైవ రామశ్చ రిపుసూదనః ||

36

శేషా హతా మహాసత్త్వా రాక్షసా రణమూర్ధని |
ఘోరా దుర్విషహాః సర్వే లక్ష్మణస్యాగ్రజేన తే ||

37

తతస్తు తద్భీమబలం మహాహవే
సమీక్ష్య రామేణ హతం బలీయసా |
రథేన రామం మహతా ఖరస్తదా
సమాససాదేంద్ర ఇవోద్యతాశనిః ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశః సర్గః ||

Aranya Kanda Sarga 26 Meaning In Telugu PDF

తన సైన్యము అంతా రాముని బాణములకు ఆహుతి కావడం చూచాడు దూషణుడు. దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనలను ఐదువేల మందిని తీసుకొని రాముని మీదికి వెళ్లాడు. (అంటే అప్పటి దాకా ఖరుని వెంట వచ్చిన 14,000 మంది రాక్షసులు చచ్చారు.) ఆ ఐదువేల మంది రాక్షస సైన్యము రాముని చుట్టు ముట్టారు. రాముని మీద శూలములు, పట్టిసములు, కత్తులు, రాళ్లు, చెట్లు, బాణములు వర్షంలా కురిపిస్తున్నారు. రాముడు కూడా తన బాణములతో వారు తన మీదికి విసురుతున్న శూలములను, పట్టిసములను, కత్తులను, చెట్లను, సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు.

రాక్షసులు తన మీద ఆయుధములు ప్రయోగించే కొద్దీ రాముని కోపం పెరుగుతూ ఉంది. రాముడు వేలకొలది బాణములతో దూషణుని సైన్యమును కప్పివేసాడు. ఇది చూచిన దూషణుడు రాముని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. రాముడు అర్ధచంద్రాకారములో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచాడు. నాలుగుబాణములతో దూషణుని రథమునకు కట్టిన హయములను చంపాడు. మరొక అర్థచంద్రబాణముతో సారధి తల నరికాడు. మూడుబాణములతో దూషణుని కొట్టాడు.

దూషణుని ధనుస్సు విరిగింది. రథం కూలింది. సారథి చచ్చాడు. దూషణుడు నేలమీదికి దూకాడు. ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు. రాముని మీదికి పరుగెత్తాడు. అది చూచి రాముడు రెండు బాణములతో దూషణుని రెండు చేతులను బుజాల వద్ద నరికాడు. వాడి చేతులు పరిఘతో సహా నేలకూలాయి. చేతులు విరిగిన దూషణుడు నిలువునా కింద పడ్డాడు.

ఇది చూచి దూషణుని సేనాధి పతులు అయిన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధీ అను ముగ్గురు తమ తమ ఆయుధములను తీసుకొని రాముని మీదికి వెళ్లారు. మహాకపాలుడు శూలమును, స్థూలాక్షుడు పట్టిసమును, ప్రమాథి గండ్రగొడ్డలిని ధరించారు. వారిని చూచి రాముడు వారి మీద బాణవర్షము కురిపించాడు. మహాకపాలుని తల నరికాడు. స్థూలాక్షుని కళ్లలో రాముడు వదిలిన బాణములు గుచ్చుకున్నాయి. ప్రమాథి గుండెలను చీల్చాడు రాముడు. ఆ ప్రకారంగా రాముడు దూషణుని, అతని సేనాధి పతులు ముగ్గురను, ఐదువేలమంది సైనికులను మట్టుబెట్టాడు.

తన సోదరుడు దూషణుడు అతని సైన్యము సమూలంగా నాశనం అవడం చూచాడు ఖరుడు. తన సేనాధి పతులను పిలిచాడ.

“సేనానాయకులారా! నా సోదరుడు దూషణుడు అతని సైన్యము రాముని చేతిలో హతం అయ్యారు. మీరు మీ మీ సేనలతో రాముని హతమార్చండి. వెళ్లండి” అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా తన సేనానాయకులను ఆజ్ఞాపించిన ఖరుడు తాను కూడా ఆయుధములు ధరించి రాముని మీదికి పరుగెత్తాడు. ఖరుని సేనానాయకులైన శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాశనుడు అనే పన్నెండు మంది సేనానాయకులు ఖరుని వెంట రాముని మీదికి ఉరికారు.

రాముడు తన వజ్రసమానములైన బాణములతో ఖరుని సేనలను తుత్తునియలు చేసాడు. రాముడు కర్ణి అనే పేరుగల నూరు బాణములతోనూ, మరో వెయ్యిమందిని వాడి అయిన బాణములతోనూ సంహరించాడు. రాముని చేత చంపబడ్డ రాక్షసుల శరీరములతో ఆ ప్రాంతమంతా కప్పబడిపోయింది.

ఏ వాహనమూ లేకుండా, ఇతర సైన్యసాయము లేకుండా రాముడు ఒంటరిగా ధనుర్ధారియై 14,000 మంది రాక్షసులను మట్టుబెట్టాడు. వారిలో ఖరుడు, త్రిశిరుడు మిగిలారు. తన సైన్యము అంతా సర్వనాశనం కావడం చూచి ఖరుడు కోపంతో రగిలిపోయాడు. తన రథం ఎక్కి, ఆయుధములను ధరించి, రాముని మీదికి వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ సప్తవింశః సర్గః (27) >>