Ayodhya Kanda Sarga 91 In Telugu – అయోధ్యాకాండ ఏకనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 91

అయోధ్యాకాండం రామాయణంలోని కీలకమైన భాగం. దీని 79వ సర్గలో రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళారు. 90వ సర్గలో ఋషులు రాముని సత్కరించారు. 100వ సర్గలో, దశరథ మహారాజు రాముని విడిచి, ఆయన కోసం విరహంతో మరణిస్తారు. ఈ సర్గలో కౌసల్య, సుమిత్ర, కైకేయిలు దుఃఖంలో కూరుకుపోతారు. దశరథుడి అంత్యక్రియలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంలో, భరతుడు, శత్రుఘ్నుడు రావడంతో అశ్వమేధ యాగం జరుగుతుంది. భరతుడు రాముని తిరిగి పిలవడానికి చిత్తం చేస్తాడు. ఈ సర్గ రామాయణ కథనంలో భావోద్వేగభరితమైన ఘట్టంగా నిలుస్తుంది, రాముని, సీత, లక్ష్మణుల పరితాపం, అయోధ్య ప్రజల దుఃఖాన్ని వివరిస్తుంది.

భరద్వాజాతిథ్యమ్

కృతబుద్ధిం నివాసాయ తత్రైవ స మునిస్తదా |
భరతం కైకయీపుత్రమాతిథ్యేన న్యమంత్రయత్ || ౧ ||

అబ్రవీద్భరతస్త్వేనం నన్విదం భవతా కృతమ్ |
పాద్యమర్ఘ్యం తథాఽఽతిథ్యం వనే యదుపపద్యతే || ౨ ||

అథోవాచ భరద్వాజో భరతం ప్రహసన్నివ |
జానే త్వాం ప్రీతిసంయుక్తం తుష్యేస్త్వం యేన కేనచిత్ || ౩ ||

సేనాయాస్తు తవైతస్యాః కర్తుమిచ్ఛామి భోజనమ్ |
మమ ప్రీతిర్యథారూపా త్వమర్హో మనుజాధిప || ౪ ||

కిమర్థం చాపి నిక్షిప్య దూరే బలమిహాగతః |
కస్మాన్నేహోపయాతోఽసి సబలః పురుషర్షభ || ౫ ||

భరతః ప్రత్యువాచేదం ప్రాంజలిస్తం తపోధనమ్ |
ససైన్యో నోపయాతోఽస్మి భగవన్ భగవద్భయాత్ || ౬ ||

రాజ్ఞా చ భగవన్నిత్యం రాజపుత్రేణ వా సదా |
యత్నతః పరిహర్తవ్యా విషయేషు తపస్వినః || ౭ ||

వాజిముఖ్యా మనుష్యాశ్చ మత్తాశ్చ వరవారణాః |
ప్రచ్ఛాద్య భగవన్భూమిం మహతీమనుయాంతి మామ్ || ౮ ||

తే వృక్షానుదకం భూమిమాశ్రమేషూటజాంస్తథా |
న హింస్యురితి తేనాహమేకైవ సమాగతః || ౯ ||

ఆనీయతామితః సేనేత్యాజ్ఞప్తః పరమర్షిణా |
తతస్తు చక్రే భరతః సేనాయాః సముపాగమమ్ || ౧౦ ||

అగ్నిశాలాం ప్రవిశ్యాథ పీత్వాఽపః పరిమృజ్య చ |
ఆతిథ్యస్య క్రియాహేతోర్విశ్వకర్మాణమాహ్వయత్ || ౧౧ ||

ఆహ్వయే విశ్వకర్మాణమహం త్వష్టారమేవ చ |
ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతామ్ || ౧౨ ||

ఆహ్వయే లోకపాలాంస్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా |
ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతామ్ || ౧౩ ||

ప్రాక్స్రోతసశ్చ యా నద్యః ప్రత్యక్స్రోతసైవ చ |
పృథివ్యామంతరిక్షే చ సమాయాంత్వద్య సర్వశః || ౧౪ ||

అన్యాః స్రవంతు మైరేయం సురామన్యాః సునిష్ఠితామ్ |
అపరాశ్చోదకం శీతమిక్షుకాండరసోపమమ్ || ౧౫ ||

ఆహ్వయే దేవగంధర్వాన్ విశ్వావసుహహాహుహూన్ |
తథైవాప్సరసో దేవీర్గంధర్వ్వీశ్చాపి సర్వశః || ౧౬ ||

ఘృతాచీమథ విశ్వాచీం మిశ్రకేశీమలంబుసామ్ |
నాగదంతాం చ హేమాం చ హిమామద్రికృతస్థలామ్ || ౧౭ ||

శక్రం యాశ్చోపతిష్ఠంతి బ్రహ్మాణం యాశ్చ యోషితః |
సర్వాస్తుంబురుణా సార్థమాహ్వయే సపరిచ్ఛదాః || ౧౮ ||

వనం కురుషు యద్దివ్యం వాసోభూషణపత్త్రవత్ |
దివ్యనారీఫలం శశ్వత్తత్కౌబేరమిహైతు చ || ౧౯ ||

ఇహ మే భగవాన్ సోమో విధత్తామన్నముత్తమమ్ |
భక్ష్యం భోజ్యం చ చోష్యం చ లేహ్యం చ వివిధం బహు || ౨౦ ||

విచిత్రాణి చ మాల్యాని పాదపప్రచ్యుతాని చ |
సురాదీని చ పేయాని మాంసాని వివిధాని చ || ౨౧ ||

ఏవం సమాధినా యుక్తస్తేజసాఽప్రతిమేన చ |
శీక్షాస్వరసమాయుక్తం తపసా చాబ్రవీన్మునిః || ౨౨ ||

మనసా ధ్యాయతస్తస్య ప్రాఙ్ముఖస్య కృతాంజలేః |
ఆజగ్ముస్తాని సర్వాణి దైవతాని పృథక్పృథక్ || ౨౩ ||

మలయం దర్దురం చైవ తతః స్వేదనుదోఽనిలః |
ఉపస్పృశ్య వవౌ యుక్త్యా సుప్రియాత్మా సుఖః శివః || ౨౪ ||

తతోభ్యవర్తంత ఘనాః దివ్యాః కుసుమవృష్టయః | [వర్షంత]
దివ్యదుందుభిఘోషశ్చ దిక్షు సర్వాసు శుశ్రువే || ౨౫ ||

ప్రవవుశ్చోత్తమా వాతాః ననృతుశ్చాప్సరోగణాః |
ప్రజగుర్దేవగంధర్వాః వీణాః ప్రముముచుస్స్వరాన్ || ౨౬ ||

స శబ్దో ద్యాం చ భూమిం చ ప్రాణినాం శ్రవణాని చ |
వివేశోచ్చారితః శ్లక్ష్ణః సమో లయగుణాన్వితః || ౨౭ ||

తస్మిన్నుపరతే శబ్దే దివ్యే శ్రోతృసుఖే నృణామ్ |
దదర్శ భారతం సైన్యం విధానం విశ్వకర్మణః || ౨౮ ||

బభూవ హి సమా భూమిః సమంతాత్పంచయోజనా |
శాద్వలైర్బహుభిశ్ఛన్నా నీలవైడూర్యసన్నిభైః || ౨౯ ||

తస్మిన్బిల్వాః కపిత్థాశ్చ పనసా బీజపూరకాః |
ఆమలక్యో బభూవుశ్చ చూతాశ్చ ఫలభూషణాః || ౩౦ ||

ఉత్తరేభ్యః కురుభ్యశ్చ వనం దివ్యోపభోగవత్ |
ఆజగామ నదీ దివ్యా తీరజైర్బహుభిర్వృతా || ౩౧ ||

చతుఃశాలాని శుభ్రాణి శాలాశ్చ గజవాజినామ్ |
హర్మ్యప్రాసాదసంబాధాస్తోరణాని శుభాని చ || ౩౨ ||

సితమేఘనిభం చాపి రాజవేశ్మసు తోరణమ్ |
దివ్యమాల్యకృతాకారం దివ్యగంధసముక్షితమ్ || ౩౩ ||

చతురశ్రమసంబాధం శయనాసనయానవత్ |
దివ్యైః సర్వరసైర్యుక్తం దివ్యభోజనవస్త్రవత్ || ౩౪ ||

ఉపకల్పితసర్వాన్నం ధౌతనిర్మలభాజనమ్ |
క్లృప్తసర్వాసనం శ్రీమత్ స్వాస్తీర్ణశయనోత్తమమ్ || ౩౫ ||

ప్రవివేశ మహాబాహురనుజ్ఞాతో మహర్షిణా |
వేశ్మ తద్రత్నసంపూర్ణం భరతః కేకయీసుతః || ౩౬ ||

అనుజగ్ముశ్చ తం సర్వే మంత్రిణః సపురోహితాః |
బభూవుశ్చ ముదా యుక్తాః దృష్ట్వా తం వేశ్మసంవిధిమ్ || ౩౭ ||

తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ |
భరతో మంత్రిభిః సార్ధమభ్యవర్తత రాజవత్ || ౩౮ ||

ఆసనం పూజయామాస రామాయాభిప్రణమ్య చ |
వాలవ్యజనమాదాయ న్యషీదత్సచివాసనే || ౩౯ ||

ఆనుపూర్వ్యానిషేదుశ్చ సర్వే మంత్రిపురోహితాః |
తతః సేనాపతిః పశ్చాత్ ప్రశాస్తాచ నిషేదతుః || ౪౦ ||

తతస్తత్ర ముహూర్తేన నద్యః పాయసకర్దమాః |
ఉపాతిష్ఠంత భరతం భరద్వాజస్య శాసనాత్ || ౪౧ ||

తాసాముభయతః కూలం పాండుమృత్తికలేపనాః |
రమ్యాశ్చావసథా దివ్యాః బ్రహ్మణస్తు ప్రసాదజాః || ౪౨ ||

తేనైవ చ ముహూర్తేన దివ్యాభరణభూషితాః |
ఆగుర్వింశతిసాహస్రాః బ్రహ్మణా ప్రహితాః స్త్రియః || ౪౩ ||

సువర్ణమణిముక్తేన ప్రవాలేన చ శోభితాః |
ఆగుర్వింశతిసాహస్రాః కుబేరప్రహితాః స్త్రియః || ౪౪ ||

యాభిర్గృహీతపురుషః సోన్మాద ఇవ లక్ష్యతే |
ఆగుర్వింశతిసాహస్రా నందనాదప్సరోగణాః || ౪౫ ||

నారదస్తుంబురుర్గోపః ప్రవరాః సూర్యవర్చసః |
ఏతే గంధర్వరాజానో భరతస్యాగ్రతో జగుః || ౪౬ ||

అలంబుసా మిశ్రకేశీ పుండరీకాఽథ వామనా |
ఉపానృత్యంస్తు భరతం భరద్వాజస్య శాసనాత్ || ౪౭ ||

యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథే వనే |
ప్రయాగే తాన్యదృశ్యంత భరద్వాజస్య తేజసా || ౪౮ ||

బిల్వా మార్దంగికా ఆసన్ శమ్యాగ్రాహా విభీతకాః |
అశ్వత్థానర్తకాశ్చాసన్ భరద్వాజస్య శాసనాత్ || ౪౯ ||

తతః సరలతాలాశ్చ తిలకా నక్తమాలకాః |
ప్రహృష్టాస్తత్ర సంపేతుః కుబ్జా భూత్వాఽథ వామనాః || ౫౦ ||

శింశుపామలకీజంబ్వో యాశ్చాన్యాః కాననేషు తాః |
మాలతీ మల్లికా జాతిర్యాశ్చాన్యాః కాననే లతాః || ౫౧ ||

ప్రమదావిగ్రహం కృత్వా భరద్వాజాశ్రమేఽవదన్ |
సురాః సురాపాః పిబత పాయసం చ బుభుక్షితాః || ౫౨ ||

మాంసాని చ సుమేధ్యాని భక్ష్యంతాం యావదిచ్ఛథ |
ఉచ్ఛాద్య స్నాపయంతి స్మ నదీతీరేషు వల్గుషు || ౫౩ ||

అప్యేకమేకం పురుషం ప్రమదాః సప్తచాష్ట చ |
సంవాహంత్యః సమాపేతుర్నార్యో రుచిరలోచనాః || ౫౪ ||

పరిమృజ్య తథాఽన్యోన్యం పాయయంతి వరాంగనాః |
హయాన్ గజాన్ ఖరానుష్ట్రాంస్తథైవ సురభేః సుతాన్ || ౫౫ ||

అభోజయన్వాహనపాస్తేషాం భోజ్యం యథావిధి |
ఇక్షూంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహనాన్ || ౫౬ ||

ఇక్ష్వాకువరయోధానాం చోదయంతో మహాబలాః |
నాశ్వబంధోఽశ్వమాజానాన్న గజం కుంజరగ్రహః || ౫౭ ||

మత్తప్రమత్తముదితా చమూః సా తత్ర సంబభౌ |
తర్పితాః సర్వకామైస్తే రక్తచందనరూషితాః || ౫౮ ||

అప్సరోగణసంయుక్తాః సైన్యా వాచముదైరయన్ |
నైవాయోధ్యాం గమిష్యామో నగమిష్యామ దండకాన్ || ౫౯ ||

కుశలం భరతస్యాస్తు రామస్యాస్తు తథా సుఖమ్ |
ఇతి పాదాతయోధాశ్చ హస్త్యశ్వారోహబంధకాః || ౬౦ ||

అనాథాస్తం విధిం లబ్ధ్వా వాచమేతాముదైరయన్ |
సంప్రహృష్టా వినేదుస్తే నరాస్తత్ర సహస్రశః || ౬౧ ||

భరతస్యానుయాతారః స్వర్గోఽయమితి చాబ్రువన్ |
నృత్యంతి స్మ హసంతి స్మ గాయంతి స్మ చ సైనికాః || ౬౨ ||

సమంతాత్పరిధావంతి మాల్యోపేతాః సహస్రశః |
తతో భుక్తవతాం తేషాం తదన్నమమృతోపమమ్ || ౬౩ ||

దివ్యానుద్వీక్ష్య భక్ష్యాంస్తానభవద్భక్షణే మతిః |
ప్రేష్యాశ్చేట్యశ్చ వధ్వశ్చ బలస్థాశ్చ సహస్రశః || ౬౪ ||

బభూవుస్తే భృశం దృప్తాః సర్వే చాహతవాససః |
కుంజరాశ్చ ఖరోష్ట్రాశ్చ గోశ్వాశ్చ మృగపక్షిణః || ౬౫ ||

బభూవుః సుభృతాస్తత్ర నాన్యో హ్యన్యమకల్పయత్ |
నాశుక్లవాసాస్తత్రాసీత్ క్షుధితో మలినోఽపి వా || ౬౬ ||

రజసా ధ్వస్తకేశో వా నరః కశ్చిదదృశ్యత |
ఆజైశ్చాపి చ వారాహైర్నిష్ఠానవరసంచయైః || ౬౭ ||

ఫలనిర్యూహసంసిద్ధైః సూపైర్గంధరసాన్వితైః |
పుష్పధ్వజవతీః పూర్ణాః శుక్లస్యాన్నస్య చాభితః || ౬౮ ||

దదృశుర్విస్మితాస్తత్ర నరా లౌహీః సహస్రశః |
బభూవుర్వనపార్శ్వేషు కూపాః పాయసకర్దమాః || ౬౯ ||

తాశ్చకామదుఘా గావో ద్రుమాశ్చాసన్మధుస్రుతః | [మధుశ్చ్యుతః]
వాప్యో మైరేయపూర్ణాశ్చ మృష్టమాంసచయైర్వృతాః || ౭౦ ||

ప్రతప్తపిఠరైశ్చాపి మార్గమాయూరకౌక్కుటైః |
పాత్రీణాం చ సహస్రాణి స్థాలీనాం నియుతాని చ || ౭౧ ||

న్యర్బుదాని చ పాత్రాణి శాతకుంభమయాని చ |
స్థాల్యః కుంభ్యః కరంభ్యశ్చ దధిపూర్ణాః సుసంస్కృతాః || ౭౨ ||

యౌవనస్థస్య గౌరస్య కపిత్థస్య సుగంధినః |
హ్రదాః పూర్ణా రసాలస్య దధ్నః శ్వేతస్య చాపరే || ౭౩ ||

బభూవుః పాయసస్యాన్యే శర్కరాయాశ్చ సంచయాః |
కల్కాంశ్చూర్ణకషాయాంశ్చ స్నానాని వివిధాని చ || ౭౪ ||

దదృశుర్భాజనస్థాని తీర్థేషు సరితాం నరాః |
శుక్లానంశుమతశ్చాపి దంతధావనసంచయాన్ || ౭౫ ||

శుక్లాంశ్చందనకల్కాంశ్చ సముద్గేష్వవతిష్ఠతః |
దర్పణాన్ పరిమృష్టాంశ్చ వాససాం చాపి సంచయాన్ || ౭౬ ||

పాదుకోపానహాశ్చైవ యుగ్మాని చ సహస్రశః |
ఆంజనీః కంకతాన్కూర్చాన్ శస్త్రాణి చ ధనూంషి చ || ౭౭ ||

మర్మత్రాణాని చిత్రాణి శయనాన్యాసనాని చ |
ప్రతిపానహ్రదాన్ పూర్ణాన్ ఖరోష్ట్రగజవాజినామ్ || ౭౮ ||

అవగాహ్య సుతీర్థాంశ్చ హ్రదాన్ సోత్పలపుష్కరాన్ |
ఆకాశవర్ణప్రతిమాన్ స్వచ్ఛతోయాన్సుఖప్లవాన్ || ౭౯ ||

నీలవైడూర్య్యవర్ణాంశ్చ మృదూన్యవససంచయాన్ |
నిర్వాపార్థాన్ పశూనాం తే దదృశుస్తత్ర సర్వశః || ౮౦ ||

వ్యస్మయంత మనుష్యాస్తే స్వప్నకల్పం తదద్భుతమ్ |
దృష్ట్వాఽఽతిథ్యం కృతం తాదృక్ భరతస్య మహర్షిణా || ౮౧ ||

ఇత్యేవం రమమాణానాం దేవానామివ నందనే |
భరద్వాజాశ్రమే రమ్యే సా రాత్రిర్వ్యత్యవర్తత || ౮౨ ||

ప్రతిజగ్ముశ్చ తా నద్యో గంధర్వాశ్చ యథాగతమ్ |
భరద్వాజమనుజ్ఞాప్య తాశ్చ సర్వా వరాంగనాః || ౮౩ ||

తథైవ మత్తా మదిరోత్కటాః
నరాస్తథైవ దివ్యాగురుచందనోక్షితాః |
తథైవ దివ్యా వివిధాః స్రగుత్తమాః
పృథక్ప్రకీర్ణా మనుజైః ప్రమర్దితాః || ౮౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకనవతితమః సర్గః || ౯౧ ||

Ayodhya Kanda Sarga 91 Meaning In Telugu

ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారమునకు సేనలకు భోజన సదుపాయములను చెయ్యాలని అనుకున్నాడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీరు వసిష్ఠుల వారికి, నాకూ అర్ఘ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు కదా! అది చాలు నాకు.” అని అన్నాడు.

“భరతా! నీవు ఏదీ కోరవు అని నాకు తెలుసు. కాని కాదనకుండా నా ఆతిధ్యము స్వీకరించు. నీవు నీ పరివారమును, సైన్యమును ఎందుకు దూరంగా ఉంచావు. మా ఆశ్రమమునకు తీసుకొని రావలసినది.” అని అన్నాడు భరద్వాజుడు.

దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలిగించడం ఇష్టం లేక, తమరి మీద ఉన్న భయ భక్తులతో నేను నాపరివారమును సైన్యమును దూరంగా ఉంచి వచ్చాను. అదీ కాకుండా రాజులు తమ మందీ మార్బలములను, మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మము కదా! నా వెంట చతురంగ బలములు వస్తూ ఉన్నాయి. అవి ఇక్కడకు వస్తే ఇక్కడి వృక్ష సంపద, జలసంపద కలుషితము అవుతాయి. అందుకని తీసుకొని రాలేదు.” అని అన్నాడు భరతుడు.

దానికి భరద్వాజుడు నవ్వి “మాకు ఏమీ అసౌకర్యము లేదు. నీ సేనలను ఇక్కడకు రమ్మని చెప్పు” అని ఆదేశించాడు. ఆ ప్రకారము భరతుని సేనలు భరద్వాజుని ఆశ్రమము వద్దకు వచ్చాయి.

భరద్వాజుడు అగ్ని గృహములోనికి ప్రవేశించి భరతుని పరివారమునకు ఆతిథ్యము ఇచ్చుటకు విశ్వకర్మను ఆహ్వానించాడు. దేవేంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడుమొదలగు లోక పాలకులను ఆహ్యానించాడు. భూమి మీద ఉన్న నదులను ఆహ్వానించాడు. దేవతలను, గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించాడు. స్వర్గము నుండి, బ్రహ్మలోకమునుండి దేవతా స్త్రీలను ఆహ్వానించాడు. కుబేరునికి, దివ్యమైన వస్త్రములను తీసుకు రమ్మని ఆదేశించాడు.

పిలిచి భరతుని పరివారమునకు సైన్యమునకు కావలసిన ఆహార పదార్థములను, భక్ష్యములను, పానీయములను, మాంసాహారములను, ఫలములను సమకూర్చమని ఆదేశించాడు.

భరద్వాజుడు ఆహ్వానించిన దేవతలందరూ భరద్వాజుని వద్దకు వచ్చారు. ఆయన ఆదేశములు స్వీకరించారు. భరతునికి, ఆయన పరివారమునకు, సైన్యమునకు కావలసిన ఏర్పాట్లు చేసారు. వాయుడు మంద్రంగా వీచ సాగాడు. అప్సరసలు తమ నృత్యగానవినోదములతో వారిని ఆనందపరచసాగారు. విశ్వకర్మ ఆ రాత్రి వారందరూ ఉండటానికి ఒక విశాలమైన మందిరమును సృష్టించాడ భరతుడు తన పురోహితుడు వసిష్ఠుడు, తమ్ముడు శత్రుఘ్నుడు, తన తల్లులతో ఆ భవనములోనికి ప్రవేశించాడు. ఆ భవనములో ఒక పెద్ద రాజ సభ అందులో ఒక సింహాసనము ఉంది. భరతుడు ఆ సింహాసనమునకు నమస్కరించి, తాను పక్కన ఉన్న ఆసనము మీద కూర్చున్నాడు. బ్రహ్మలోకము నుండి వచ్చిన స్త్రీలు, కుబేరుడు పంపగా వచ్చిన స్త్రీలు వారికి సేవలు చేయసాగారు. అప్సరసలు భరతుని తమ నృత్యగానవినోదములతో సంతోషపరచారు.

భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు. భరతుని వెంట వచ్చిన వారు. పరివారము, సైనికులు తిన్నంత తిని, తాగి మైమరచిపోయారు. ఆహా ఇంతటి విందు వినోదము తాము ఎప్పటికీ చూడలేము అని అనుకొన్నారు. తాము రాముని వద్దకు కానీ, అయోధ్యకు కానీ రాము. ఇక్కడే ఉంటాము అనితాగిన మత్తులో శపధాలు చేసారు.

తెల్లవారగానే అవేమీ ఉండవు. అంతా మిధ్య అని వారికి తెలియదు. సైనికులకే కాదు, వారి వాహనములు అయిన గుర్రములు ఏనుగులకు, ఒంటెలకు కూడా రుచికరమైన ఆహారము సమకూర్చబడింది. అడిగే వారు లేకపోవడంతో సైనికులు ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ స్వైరవిహారం చేసారు. అప్సరసలతో పాలు నృత్యం చేసారు. కేకలుపెడుతున్నారు.

(ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రాసాడు. భరద్వాజుడు ఇచ్చిన ఆతిథ్యము ఆ మనుషులకు అనగా భరతుని పరివారమునకు, సైనికులకు స్వప్నంలో జరిగినట్టు ఉంది. ఆ రాత్రి గడవగానే అప్పరసలు అందరూ వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్లిపోయారు. తాగిన మత్తులో జోగుతున్న సైనికులు మాత్రం అక్కడ పడి ఉన్నారు. రాత్రి కనపడ్డ భవనాలు లేవు, ఆహార పదార్థాలు లేవు. పానీయాలు లేవు. అడవి అందులో చెట్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనము అనుభవించే సుఖాలు సంతోషాలు అన్నీ మిధ్య. ఏవీ శాశ్వతాలు కావు. తెల్లవారగానే కరిగిపోతాయి. అని ఈ సన్నివేశాన్ని వివరించడం ద్వారా లోకానికి తెలియజెప్పాడు వాల్మీకి.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వినవతితమః సర్గః (92) >>

Ayodhya Kanda Sarga 80 In Telugu – అయోధ్యాకాండ అశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 80

అయోధ్యాకాండం అశీతితమ (80వ) సర్గలో, వసిష్ఠుడు దశరథ మహారాజుకు దేనుబుడు అనే విశిష్టమైన ఘీతోపాహారాన్ని సమర్పిస్తాడు. ఈ సమయంలో, దశరథ మహారాజు రాముని వలసకు వెళ్లడం మరియు తన కొడుకుతో విడిపోవడం వల్ల బాధతో ఉంటుంది. వసిష్ఠుడు ధైర్యం చెబుతూ, రాజ్యం పరిపాలన గురించి ఆలోచనలతో నిమగ్నమవుతాడు. దశరథుడు రాముని ఆకస్మిక ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ, కైకేయి చేసిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. వసిష్ఠుడు దశరథుని ధైర్యం చెప్పి, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయిలను సాంత్వన పరుస్తాడు. ఈ సర్గ దశరథ మహారాజు యొక్క భావోద్వేగాలు, రాముని పట్ల అతని అపార ప్రేమను, రాముని విడిపోవడం వలన అతని ఆవేదనను ప్రతిబింబిస్తుంది.

మార్గసంస్కారః

అథ భూమి ప్రదేశజ్ఞాః సూత్రకర్మవిశారదాః |
స్వకర్మాభిరతాః శూరాః ఖనకా యంత్రకాస్తథా || ౧ ||

కర్మాంతికాః స్థపతయః పురుషా యంత్రకోవిదాః |
తథా వర్ధకయశ్చైవ మార్గిణో వృక్షతక్షకాః || ౨ ||

కూపకారాః సుధాకారాః వంశకర్మకృతస్తథా |
సమర్థా యే చ ద్రష్టారః పురతస్తే ప్రతస్థిరే || ౩ ||

స తు హర్షాత్తముద్దేశం జనౌఘో విపులః ప్రయాన్ |
అశోభత మహావేగః సముద్ర ఇవ పర్వణి || ౪ ||

తే స్వవారం సమాస్థాయ వర్త్మకర్మణి కోవిదాః |
కరణైః వివిధోపేతైః పురస్తాత్సంప్రతస్థిరే || ౫ ||

లతావల్లీశ్చ గుల్మాంశ్చ స్థాణూనశ్మన ఏవ చ |
జనాస్తే చక్రిరే మార్గం చిందంతః వివిధాన్ ద్రుమాన్ || ౬ ||

అవృక్షేషు చ దేశేషు కేచిద్వృక్షానరోపయన్ |
కేచిత్కుఠారైష్టంకైశ్చ దాత్రైశ్ఛిందన్ క్వచిత్ క్వచిత్ || ౭ ||

అపరే వీరణస్తంబాన్ బలినో బలవత్తరాః |
విధమంతి స్మ దుర్గాణి స్థలాని చ తతస్తతః || ౮ ||

అపరేఽపూరయన్కూపాన్ పాంసుభిః శ్వభ్రమాయతమ్ |
నిమ్నభాగాంస్తతః కేచిత్ సమాంశ్చక్రుః సమంతతః || ౯ ||

బబంధుర్బంధనీయాంశ్చ క్షోద్యాన్ సంచుక్షుదుస్తదా |
బిభిదుర్భేదనీయాంశ్చ తాంస్తాన్దేశాన్నరాస్తదా || ౧౦ ||

అచిరేణైవ కాలేన పరివాహాన్బహూదకాన్ |
చక్రుర్బహు విధాకారాన్ సాగరప్రతిమాన్బహూన్ || ౧౧ ||

నిర్జలేషు చ దేశేషు ఖానయామాసురుత్తమాన్ |
ఉదపానాన్బహువిధాన్ వేదికాపరిమండితాన్ || ౧౨ ||

ససుధాకుట్టిమతలః ప్రపుష్పితమహీరుహః |
మత్తోద్ఘుష్ట ద్విజగణః పతాకాభిరలంకృతః || ౧౩ ||

చందనోదకసంసిక్తర్నానా కుసుమభూషితః |
బహ్వశోభత సేనాయాః పంథాః సురపథోపమః || ౧౪ ||

ఆజ్ఞాప్యాథ యథాఽజ్ఞప్తి యుక్తాస్తేఽధికృతా నరాః |
రమణీయేషు దేశేషు బహుస్వాదుఫలేషు చ || ౧౫ ||

యో నివేశస్త్వభిప్రేతః భరతస్య మహాత్మనః |
భూయస్తం శోభయామాసుః భూషాభిర్భూషణోపమమ్ || ౧౬ ||

నక్షత్రేషు ప్రశస్తేషు ముహూర్తేషు చ తద్విదః |
నివేశాన్ స్థాపయామాసుర్భరతస్య మహాత్మనః || ౧౭ ||

బహుపాంసుచయాశ్చాపి పరిఖాపరివారితాః |
తంత్రేంద్ర కీలప్రతిమాః ప్రతోలీవరశోభితాః || ౧౮ ||

ప్రాసాద మాలావితతాః సౌధప్రాకార సంవృతాః |
పతాకా శోభితాః సర్వే సునిర్మిత మహాపథాః || ౧౯ ||

విసర్పద్భిరివాకాశే విటంకాగ్రవిమానకైః |
సముచ్చ్రితైర్నివేశాస్తే బభుః శక్రపురోపమాః || ౨౦ ||

జాహ్నవీం తు సమాసాద్య వివిధద్రుమకాననామ్ |
శీతలామలపానీయాం మహామీనసమాకులామ్ || ౨౧ ||

సచంద్రతారాగణమండితం యథా
నభః క్షపాయామమలం విరాజతే |
నరేంద్రమార్గస్స తథా వ్యరాజత
క్రమేణ రమ్యః శుభశిల్పినిర్మితః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అశీతితమః సర్గః || ౮౦ ||

Ayodhya Kanda Sarga 80 Meaning In Telugu

అమాత్యులు భరతుని ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసారు.. ఆయాప్రదేశముల స్వభావములను తెలిసిన వారు, నేలను త్రవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్ర కోవిదులు, శిల్పులు, తగిన యంత్రములను నడుపువారు, చెక్కపని వారు, బావులు తవ్వువారు, మార్గములు వేయువారు, వారిని పర్యవేక్షించేవారు ఎవరెవరు ఏ యే పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్ధవంతంగా చేస్తున్నారు.

ముందుగా, భరతుడు, ఆయన సైన్యము, రధములు, శకటములు అడవులలో పోవుటకు, మార్గములు, రహదారులు వేస్తున్నారు. అడ్డంగా ఉన్న చెట్లను, పొదలను, తీగలను నరికి మార్గము చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లము ప్రదేశములలో మట్టిపోసి, ఎత్తైన ప్రదేశములను చదును చేసి, గుంతలను కప్పివేసి, మార్గములు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యములకు, భరతుని అనుసరించు వారికీ, కావలసిన నీరు కాలవల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు కాలువలు లేని ప్రదేశములలో బావులుత్రవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడచు మార్గమును సున్నముతో గట్టిచేసారు. దారిలో పూలచెట్లు నాటించారు. పతాకములతో అలంకరించారు.

ఈ పనులన్నీ చేయుటకు జ్యోతిష్కులు మంచి ముహూర్తములు నిర్ణయించారు. దారిలో భరతుడు, అంత:పురస్త్రీలు, రాజోద్యోగులు విడిది చేయుటకు వివిధములైన గృహములు నిర్మించారు. భరతుడు విడిది చేయు గృహమును ఇతర గృహముల కంటే బాగా అలంకరించారు. ఆ విధముగా కట్టబడిన విడిది గృహములు సరయూనది నుండి గంగానది వరకూ వ్యాపించి ఉ న్నాయి. ఆ ప్రకారంగా భరతుని ప్రయాణమునకు ఏర్పాట్లు చేయబడ్డాయి. (ఆ రోజుల్లో కూడా దేశాధినేత ప్రయాణమునకు నేడు చేసిన మాదిరే ఏర్పాట్లు చేయడం, అప్పటికప్పుడు అన్నీ అమర్చడం నేడు కూడా. చూస్తూనే ఉంటాం.)

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గః (81) >>

Aranya Kanda Sarga 16 In Telugu – అరణ్యకాండ షోడశః సర్గః

Aranya Kanda Sarga 16 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” షోడశః సర్గలో, ఒక రోజు సూర్యోదయానికి ముందు రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి రోజూ స్నానం చేయడానికి గోదావరి నదికి వెళ్తాడు. దారిలో లక్ష్మణుడు చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ శీతాకాలాన్ని స్తుతిస్తాడు. అలా చేయడం ద్వారా అతను రాణి కైకేయిపై అసహనం వ్యక్తం చేస్తాడు మరియు రాముడు దానిని ఖండించాడు.

హేమంతవర్ణనమ్

వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః |
శరద్వ్యపాయే హేమంత ఋతురిష్టః ప్రవర్తతే ||

1

స కదాచిత్ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః |
ప్రయయావభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీమ్ ||

2

ప్రహ్వః కలశహస్తస్తం సీతయా సహ వీర్యవాన్ |
పృష్ఠతోఽనువ్రజన్ భ్రాతా సౌమిత్రిరిదమబ్రవీత్ ||

3

అయం స కాలః సంప్రాప్తః ప్రియో యస్తే ప్రియంవద |
అలంకృత ఇవాభాతి యేన సంవత్సరః శుభః ||

4

నీహారపరుషో లోకః పృథివీ సస్యశాలినీ |
జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహనః ||

5

నవాగ్రయణపూజాభిరభ్యర్చ్య పితృదేవతాః |
కృతాగ్రయణకాః కాలే సంతో విగతకల్మషాః ||

6

ప్రాజ్యకామా జనపదాః సంపన్నతరగోరసాః |
విచరంతి మహీపాలా యాత్రాస్థా విజిగీషవః ||

7

సేవమానే దృఢం సూర్యే దిశమంతకసేవితామ్ |
విహీనతిలకేవ స్త్రీ నోత్తరా దిక్ప్రకాశతే ||

8

ప్రకృత్యా హిమకోశాఢ్యో దూరసూర్యశ్చ సామ్ప్రతమ్ |
యథార్థనామా సువ్యక్తం హిమవాన్ హిమవాన్ గిరిః ||

9

అత్యంతసుఖసంచారా మధ్యాహ్నే స్పర్శతః సుఖాః |
దివసాః సుభగాదిత్యాశ్ఛాయాసలిలదుర్భగాః ||

10

మృదుసూర్యాః సనీహారాః పటుశీతాః సమారుతాః |
శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సామ్ప్రతమ్ ||

11

నివృత్తాకాశశయనాః పుష్యనీతా హిమారుణాః |
శీతా వృద్ధతరా యామాస్త్రియామా యాంతి సామ్ప్రతమ్ ||

12

రవిసంక్రాంతసౌభాగ్యస్తుషారారుణమండలః |
నిఃశ్వాసాంధ ఇవాదర్శశ్చంద్రమా న ప్రకాశతే ||

13

జ్యోత్స్నీ తుషారమలినా పౌర్ణమాస్యాం న రాజతే |
సీతేవ చాతపశ్యామా లక్ష్యతే న తు శోభతే ||

14

ప్రకృత్యా శీతలస్పర్శో హిమవిద్ధశ్చ సామ్ప్రతమ్ |
ప్రవాతి పశ్చిమో వాయుః కాలే ద్విగుణశీతలః ||

15

బాష్పచ్ఛన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ |
శోభంతేఽభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచసారసైః ||

16

ఖర్జూరపుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః |
శోభంతే కించిదానమ్రాః శాలయః కనకప్రభాః ||

17

మయూఖైరుపసర్పద్భిర్హిమనీహారసంవృతైః |
దూరమభ్యుదితః సూర్యః శశాంక ఇవ లక్ష్యతే ||

18

అగ్రాహ్యవీర్యః పూర్వాహ్ణే మధ్యహ్నే స్పర్శతః సుఖః |
సంరక్తః కించిదాపాండురాతపః శోభతే క్షితౌ ||

19

అవశ్యాయనిపాతేన కించిత్ప్రక్లిన్నశాద్వలా |
వనానాం శోభతే భూమిర్నివిష్టతరుణాతపా ||

20

స్పృశంస్తు విపులం శీతముదకం ద్విరదః సుఖమ్ |
అత్యంతతృషితో వన్యః ప్రతిసంహరతే కరమ్ ||

21

ఏతే హి సముపాసీనా విహగా జలచారిణః |
న విగాహంతి సలిలమప్రగల్భా ఇవాహవమ్ ||

22

అవశ్యాయతమోనద్ధా నీహారతమసా వృతాః |
ప్రసుప్తా ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయః ||

23

బాష్పసంఛన్నసలిలా రుతవిజ్ఞేయసారసాః |
హిమార్ద్రవాలుకైస్తీరైః సరితో భాంతి సామ్ప్రతమ్ ||

24

తుషారపతనాచ్చైవ మృదుత్వాద్భాస్కరస్య చ |
శైత్యాదగాగ్రస్థమపి ప్రాయేణ రసవజ్జలమ్ ||

25

జరాజర్ఝరితైః పద్మైః శీర్ణకేసరకర్ణికైః |
నాలశేషైర్హిమధ్వస్తైర్న భాంతి కమలాకరాః ||

26

అస్మింస్తు పురుషవ్యాఘ్రః కాలే దుఃఖసమన్వితః |
తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే ||

27

త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ్చ వివిధాన్ బహూన్ |
తపస్వీ నియతాహారః శేతే శీతే మహీతలే ||

28

సోఽపి వేలామిమాం నూనమభిషేకార్థముద్యతః |
వృతః ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీమ్ ||

29

అత్యంతసుఖసంవృద్ధః సుకుమారః సుఖోచితః |
కథం న్వపరరాత్రేషు సరయూమవగాహతే ||

30

పద్మపత్రేక్షణో వీరః శ్యామో నిరుదరో మహాన్ |
ధర్మజ్ఞః సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియః ||

31

ప్రియాభిభాషీ మధురో దీర్ఘబాహురరిందమః |
సంత్యజ్య వివిధాన్ భోగానార్యం సర్వాత్మనా శ్రితః ||

32

జితః స్వర్గస్తవ భ్రాత్రా భరతేన మహాత్మనా |
వనస్థమపి తాపస్యే యస్త్వామనువిధీయతే ||

33

న పిత్ర్యమనువర్తంతే మాతృకం ద్విపదా ఇతి |
ఖ్యాతో లోకప్రవాదోఽయం భరతేనాన్యథా కృతః ||

34

భర్తా దశరథో యస్యాః సాధుశ్చ భరతః సుతః |
కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలినీ ||

35

ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్బ్రువతి ధార్మికే |
పరివాదం జనన్యాస్తమసహన్ రాఘవోఽబ్రవీత్ ||

36

న తేఽంబా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన |
తామేవేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు ||

37

నిశ్చితాపి హి మే బుద్ధిర్వనవాసే దృఢవ్రతా |
భరతస్నేహసంతప్తా బాలిశీక్రియతే పునః ||

38

సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ |
హృద్యాన్యమృతకల్పాని మనః ప్రహ్లాదనాని చ ||

39

కదా న్వహం సమేష్యామి భరతేన మహాత్మనా |
శత్రుఘ్నేన చ వీరేణ త్వాయా చ రఘునందన ||

40

ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీమ్ |
చక్రేఽభిషేకం కాకుత్స్థః సానుజః సహ సీతయా ||

41

తర్పయిత్వాథ సలిలైస్తే పితౄన్ దైవతాని చ |
స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః ||

42

కృతాభిషేకః స రరాజ రామః
సీతాద్వితీయః సహ లక్ష్మణేన |
కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా
రుద్రః సనందీ భగవానివేశః ||

43

Aranya Kanda Sarga 16 In Telugu Pdf Download

రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపు తున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి, హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది.

ఒక రోజు రాముడు పొద్దునే గోదావరినదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.

“రామా! నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి.

ఉత్తరాయనము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది..

మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు. గుహలకే పరిమిత మైనాయి. మంచు కురవడంతో రాత్రిళ్లు ఎవరూ ఆరుబయట పడుకోడం లేదు.

చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు. కాని అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి. సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి, తీక్షత తగ్గి, పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పడమటి దిశనుండి చలిగాలులు వీస్తున్నాయి.

రాత్రి అంతా చలిగా ఉండి, పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలా కిలా రావాలతో రెక్కలు విప్పుకొని ఎగిరిపోతున్నాయి. సూర్యకిరణములను పొగ మంచు కప్పడం వలన, సూర్యుడు బాగా పైకి వచ్చినా తీవ్రత తగ్గి నిండు చంద్రుని వలె కనపడుతున్నాడు. ఎండ కొద్ది కొద్దిగా నేల మీద పాకుతూ ఉంది. కాని వేడిగా లేదు.

మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది. ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు, పొద్దుటి ఎండలో ముత్యాలమాదిరి ప్రకాశిస్తున్నాయి.

రామా! అటు చూడు! పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి, నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది. అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి. రామా! ఈ నదిలో నీరుకూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలులేకుండా ఉంది కదా!

రామా! అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా! మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉన్నాడో! నీ యందు భక్తితో అయోధ్యలో ఉన్నా అరణ్యములో ఉన్నట్టు ఉన్నాడేమో! రాజభోగములను విడిచిపెట్టి, నేల మీద పడుకుంటూ, మన మాదిరి ఫలములను ఆహారముగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో! రామా! మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరయూనదికి స్నానానికి వెళుతూ ఉంటాడనుకుంటాను.

దక్షిణాపథములో ఉన్న మనకే ఇంత చలిగాఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా! ఈ తెల్లవారుజామున సరయూనదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా! ఎందుకంటే, భరతుడు అయోధ్యలో ఉన్నా, అరణ్యములో ఉన్నా నిన్ను అనుసరిస్తున్నాడు. నీ రాకకై తపిస్తున్నాడు. అటువంటి వాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు.

రామా! సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు, కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు. కానీ, భరతుడికి తల్లి కైకకు ఉన్న ఏమాత్రమూ రాలేదు. అయినా రామా! దశరథ మహారాజు భార్యగా ఉండి, భరతునికి కన్నతల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిలబుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా.!…” అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు.

“లక్షణా! దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు. నేను వనవాసము చెయ్యాలని చేస్తున్నాను. ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నా బాధ అంతా ఒకటే. భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని. అంతే కానీ ఈ వనవాసము నాకు ఎంతో ఆనందమూ కలిగిస్తూ ఉంది. నువ్వు, భరత శత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతురతగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నాడు రాముడు.

ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరీ తీరము చేరుకున్నారు. అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేసారు. సీతా రామ లక్ష్మణులు గోదావరిలో పితృతర్పణము, దేవ తరణము, నిర్వర్తించారు. సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు. తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్లారు.

(వాల్మీకి ఈ సర్గలో కేవలము శరదృతువు ఎలా ఉంటుందో వర్ణించాడు. ఈ రోజుల్లో ఈ జనారణ్యాలలో ఉన్న మనకు, పల్లెసీమలలో హేమంత ఋతువులో, ప్రకృతి సౌందర్యము ఎలా ఉంటుందో చూడ్డం కుదరడం లేదు. అందుకని ఆ ప్రకృతి అందాలను మనముందు ఆవిష్కరించాడు మహర్షి వాల్మీకి.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదహారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ సప్తదశః సర్గః (17) >>

Aranya Kanda Sarga 8 In Telugu – అరణ్యకాండ అష్టమః సర్గః

Aranya Kanda Sarga 8 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్య మహర్షిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అగస్త్యుడు రాముడికి దివ్య ఆయుధాలను అందజేస్తాడు, వాటితో రాక్షసులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రాముడు, లక్ష్మణుడు ఆ ఆయుధాలను స్వీకరించి, ధైర్యంగా దండకారణ్యంలో రాక్షసులను ఎదుర్కొంటారు.

సుతీక్ష్ణాభ్యనుజ్ఞా

రామస్తు సహసౌమిత్రిః సుతీక్ష్ణేనాభిపూజితః |
పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత ||

1

ఉత్థాయ తు యథాకాలం రాఘవః సహ సీతయా |
ఉపాస్పృశత్సుశీతేన జలేనోత్పలగంధినా ||

2

అథ తేఽగ్నిం సురాంశ్చైవ వైదేహీ రామలక్ష్మణౌ |
కాల్యం విధివదభ్యర్చ్య తపస్విశరణే వనే ||

3

ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మషాః |
సుతీక్ష్ణమభిగమ్యేదం శ్లక్ష్ణం వచనమబ్రువన్ ||

4

సుఖోషితాః స్మ భగవంస్త్వయా పూజ్యేన పూజితాః |
ఆపృచ్ఛామః ప్రయాస్యామో మునయస్త్వరయంతి నః ||

5

త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమమండలమ్ |
ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినామ్ ||

6

అభ్యనుజ్ఞాతుమిచ్ఛామః సహైభిర్మునిపుంగవైః |
ధర్మనిత్యైస్తపోదాంతైర్విశిఖైరివ పావకైః ||

7

అవిషహ్యాతపో యావత్సూర్యో నాతివిరాజతే |
అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జితః ||

8

తావదిచ్ఛామహే గంతుమిత్యుక్త్వా చరణౌ మునేః |
వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః ||

9

తౌ సంస్పృశంతౌ చరణావుత్థాప్య మునిపుంగవః |
గాఢమాలింగ్య సస్నేహమిదం వచనమబ్రవీత్ ||

10

అరిష్టం గచ్ఛ పంథానం రామ సౌమిత్రిణా సహ |
సీతయా చానయా సార్ధం ఛాయయేవానువృత్తయా ||

11

పశ్యాశ్రమపదం రమ్యం దండకారణ్యవాసినామ్ |
ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనామ్ ||

12

సుప్రాజ్యఫలమూలాని పుష్పితాని వనాని చ |
ప్రశస్తమృగయూథాని శాంతపక్షిగణాని చ ||

13

ఫుల్లపంకజషండాని ప్రసన్నసలిలాని చ |
కారండవవికీర్ణాని తటాకాని సరాంసి చ ||

14

ద్రక్ష్యసే దృష్టిరమ్యాణి గిరిప్రస్రవణాని చ |
రమణీయాన్యరణ్యాని మయూరాభిరుతాని చ ||

15

గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్ఛతు |
ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ ||

16

ఏవముక్తస్తథేత్యుక్త్వా కాకుత్స్థః సహలక్ష్మణః |
ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే ||

17

తతః శుభతరే తూణీ ధనుషీ చాయతేక్షణా |
దదౌ సీతా తయోర్భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః ||

18

ఆబధ్య చ శుభే తూణీ చాపౌ చాదాయ సస్వనౌ |
నిష్క్రాంతావాశ్రమాద్గంతుముభౌ తౌ రామలక్ష్మణౌ ||

19

శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా |
ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః ||

Aranya Kanda Sarga 8 Meaning In Telugu

సీతా రామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్లాడు.

“మహాత్మా! రాత్రి మీ ఆతిధ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురమూ, మాతో వచ్చిన మునులు కలిసి, ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము.” అని అన్నాడు రాముడు..

“రామా! నీకు శుభమగు గాక! నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కలలా జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేల మీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలాఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి.” అని అన్నాడు.

“మహర్షీ! అలాగే చేస్తాను.” అని ఆ మహర్షికి నమస్కరించి, లక్ష్మణుడు, సీత, మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామ లక్ష్మణులు, సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ నవమః సర్గః (9) >>

Aranya Kanda Sarga 15 In Telugu – అరణ్యకాండ పంచదశః సర్గః

Aranya Kanda Sarga 15 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” పంచదశః సర్గలో, రాముడు గోదావరి నదికి సమీపంలోని పంచవటిలో పర్ణ శాల, గడ్డి కుటీర నిర్మాణ పనిని అప్పగిస్తాడు . లక్ష్మణుడు తన నైపుణ్యంతో హాయిగా ఉండే ఒక కుటీరాన్ని నిర్మించాడు మరియు గృహప్రవేశ కార్యక్రమం తర్వాత వారు దానిలోకి ప్రవేశిస్తారు. రాముడు లక్ష్మణుడిని అతని నిర్మాణ పనిని మెచ్చుకుంటాడు మరియు కృతజ్ఞతాపూర్వకంగా అతను లక్ష్మణుడిని ఆలింగనం చేసుకుంటాడు మరియు రాముడి పట్ల లక్ష్మణునికి ఉన్న శ్రద్ధ గురించి తన హృదయాన్ని వ్యక్తం చేస్తాడు.

పంచవటీపర్ణశాలా

తతః పంచవటీం గత్వా నానావ్యాలమృగాయుతామ్ |
ఉవాచ భ్రాతరం రామః సౌమిత్రిం దీప్తతేజసమ్ ||

1

ఆగతాః స్మ యథోద్దిష్టమముం దేశం మహర్షిణా |
అయం పంచవటీదేశః సౌమ్య పుష్పితపాదపః ||

2

సర్వతశ్చార్యతాం దృష్టిః కాననే నిపుణో హ్యసి |
ఆశ్రమః కతరస్మిన్నో దేశే భవతి సమ్మతః ||

3

రమతే యత్ర వైదేహీ త్వమహం చైవ లక్ష్మణ |
తాదృశో దృశ్యాతాం దేశః సన్నికృష్టజలాశయః ||

4

వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా |
సన్నికృష్టం చ యత్ర స్యాత్ సమిత్పుష్పకుశోదకమ్ ||

5

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సంయతాంజలిః |
సీతాసమక్షం కాకుత్స్థమిదం వచనమబ్రవీత్ ||

6

పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియాతామితి మాం వద ||

7

సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః |
విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితమ్ ||

8

స తం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి |
హస్తౌ గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్ ||

9

అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః |
ఇహాశ్రమపదం సౌమ్య యథావత్కర్తుమర్హసి ||

10

ఇయమాదిత్యసంకాశైః పద్మైః సురభిగంధిభిః |
అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మశోభితా ||

11

యథాఽఽఖ్యాతమగస్త్యేన మునినా భావితాత్మనా |
ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృతా ||

12

హంసకారండవాకీర్ణా చక్రవాకోపశోభితా |
నాతిదూరేణ చాసన్నే మృగయూథనిపీడితాః ||

13

మయూరనాదితా రమ్యాః ప్రాంశవో బహుకందరాః |
దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లైస్తరుభిరావృతాః ||

14

సౌవర్ణై రాజతైస్తామ్రైర్దేశే దేశే చ ధాతుభిః |
గవాక్షితా ఇవాభాంతి గజాః పరమభక్తిభిః ||

15

సాలైస్తాలైస్తమాలైశ్చ ఖర్జూరపనసామ్రకైః |
నివారైస్తిమిశైశ్చైవ పున్నాగైశ్చోపశోభితాః ||

16

చూతైరశోకైస్తిలకైశ్చంపకైః కేతకైరపి |
పుష్పగుల్మలతోపేతైస్తైస్తైస్తరుభిరావృతాః ||

17

చందనైః స్పందనైర్నీపైః పనసైర్లికుచైరపి |
ధవాశ్వకర్ణఖదిరైః శమీకింశుకపాటలైః ||

18

ఇదం పుణ్యమిదం మేధ్యమిదం బహుమృగద్విజమ్ |
ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా ||

19

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరహా |
అచిరేణాశ్రమం భ్రాతుశ్చకార సుమహాబలః ||

20

పర్ణశాలాం సువిపులాం తత్ర సంఘాతమృత్తికామ్ |
సుస్తంభాం మస్కరైర్దీర్ఘైః కృతవంశాం సుశోభనామ్ ||

21

శమీశాఖాభిరాస్తీర్య దృఢపాశావపాశితామ్ |
కుశకాశశరైః పర్ణైః సుపరిచ్ఛాదితాం తథా ||

22

సమీకృతతలాం రమ్యాం చకార లఘువిక్రమః |
నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమమ్ ||

23

స గత్వా లక్ష్మణః శ్రీమాన్నదీం గోదావరీం తదా |
స్నాత్వా పద్మాని చాదాయ సఫలః పునరాగతః ||

24

తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ స యథావిధి |
దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతమ్ ||

25

స తం దృష్ట్వా కృతం సౌమ్యమాశ్రమం సహ సీతయా |
రాఘవః పర్ణశాలాయాం హర్షమాహారయద్భృశమ్ ||

26

సుసంహృష్టః పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా |
అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్ ||

27

ప్రీతోఽస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో |
ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||

28

భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ |
త్వాయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ ||

29

ఏవం లక్ష్మణముక్త్వా తు రాఘవో లక్ష్మివర్ధనః |
తస్మిన్దేశే బహుఫలే న్యవసత్సుసుఖం వశీ ||

30

కంచిత్కాలం స ధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ |
అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యథామరః ||

31

రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు.

రాముడు లక్ష్మణుని చూచి “లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుప్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. ” అని పలికాడు.

“రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను.” అని అన్నాడు.

రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు.

“లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమీ, కింశుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులునివసిస్తున్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు.” అని అన్నాడు రాముడు.

రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్షణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దాని మీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదునుచేసాడు. చుట్టు కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు.

తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని “లక్ష్మణా! నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢపరిష్వంగము తప్ప” అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షోడశః సర్గః (16) >>

Aranya Kanda Sarga 7 In Telugu – అరణ్యకాండ సప్తమః సర్గః

Aranya Kanda Sarga 7 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారి సాహసాలు, రాక్షసులతో జరిగిన ఘర్షణలు, వనవాసంలో ఎదురైన కష్టాలు వివరించబడతాయి. మహర్షి అగస్త్యుని ఆశీర్వాదం అందుకుంటారు.

సుతీక్ష్ణాశ్రమః

రామస్తు సహితో భ్రాత్రా సీతయా చ పరంతపః |
సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామ సహ తైర్ద్విజైః ||

1

స గత్వాఽదూరమధ్వానం నదీస్తీర్త్వా బహూదకాః |
దదర్శ విపులం శైలం మహామేఘమివోన్నతమ్ ||

2

తతస్తదిక్ష్వాకువరౌ సంతతం వివిధైర్ద్రుమైః |
కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ ||

3

ప్రవిష్టస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమమ్ |
దదర్శాశ్రమమేకాంతే చీరమాలాపరిష్కృతమ్ ||

4

తత్ర తాపసమాసీనం మలపంకజటాధరమ్ |
రామః సుతీక్ష్ణం విధివత్తపోవృద్ధమభాషత ||

5

రామోఽహమస్మి భగవన్భవంతం ద్రష్టుమాగతః |
త్వం మాఽభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ ||

6

స నిరీక్ష్య తతో వీరం రామం ధర్మభృతాం వరమ్ |
సమాశ్లిష్య చ బాహుభ్యామిదం వచనమబ్రవీత్ ||

7

స్వాగతం ఖలు తే వీర రామ ధర్మభృతాం వర |
ఆశ్రమోఽయం త్వయాక్రాంతః సనాథ ఇవ సాంప్రతమ్ ||

8

ప్రతీక్షమాణస్త్వామేవ నారోహేఽహం మాహాయశః |
దేవలోకమితో వీర దేహం త్యక్త్వా మహీతలే ||

9

చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోఽసి మే శ్రుతః |
ఇహోపయాతః కాకుత్స్థ దేవరాజః శతక్రతుః ||

10

ఉపాగమ్య చ మాం దేవో మహాదేవః సురేశ్వరః |
సర్వాఁల్లోకాంజితానాహ మమ పుణ్యేన కర్మణా ||

11

తేషు దేవర్షిజుష్టేషు జితేషు తపసా మయా |
మత్ప్రసాదాత్సభార్యస్త్వం విహరస్వ సలక్ష్మణః ||

12

తముగ్రతపసా యుక్తం మహర్షిం సత్యవాదినమ్ |
ప్రత్యువాచాత్మవాన్రామో బ్రహ్మాణమివ కాశ్యపః ||

13

అహమేవాహరిష్యామి స్వయం లోకాన్మహామునే |
ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే ||

14

భవాన్సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః |
ఆఖ్యాతః శరభంగేణ గౌతమేన మహాత్మనా ||

15

ఏవముక్తస్తు రామేణ మహర్షిర్లోకవిశ్రుతః |
అబ్రవీన్మధురం వాక్యం హర్షేణ మహతాఽఽప్లుతః ||

16

అయమేవాశ్రమో రామ గుణవాన్రమ్యతామిహ |
ఋషిసంఘానుచరితః సదా మూలఫలాన్వితః ||

17

ఇమమాశ్రమమాగమ్య మృగసంఘా మహాయశాః |
అటిత్వా ప్రతిగచ్ఛంతి లోభయిత్వాకుతోభయాః ||

18

నాన్యో దోషో భవేదత్ర మృగేభ్యోఽన్యత్ర విద్ధి వై |
తచ్ఛ్రుత్వా వచనం తస్య మహర్షేర్లక్ష్మణాగ్రజః ||

19

ఉవాచ వచనం ధీరో వికృష్య సశరం ధనుః |
తానహం సుమహాభాగ మృగసంఘాన్సమాగతాన్ ||

20

హన్యాం నిశితధారేణ శరేణాశనివర్చసా |
భవాంస్తత్రాభిషజ్యేత కిం స్యాత్కృచ్ఛ్రతరం తతః ||

21

ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే |
తమేవముక్త్వా వరదం రామః సంధ్యాముపాగమత్ ||

22

అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయత్ |
సుతీక్ష్ణస్యాశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ ||

23

తతః శుభం తాపసభోజ్యమన్నం
స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యామ్ |
తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా
సంధ్యానివృత్తౌ రజనీమవేక్ష్య ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమః సర్గః ||

Aranya Kanda Sarga 7 Meaning In Telugu

రాముడు, సీతతోనూ, లక్ష్మణుని తోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి.

రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“ఓ మహర్షీ! నా పేరు రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు, నా భార్య, సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్లు తెరిచి నాతో మాట్లాడండి.” అని ప్రార్థించాడు.

సుతీక్ష మహర్షి కళ్లు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు.

“రామా! నీకు స్వాగతము. నీరాకచే మా ఆశ్రమమునకు ఒక నాధుడు దొరికినట్టయింది. రామా! నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు.” అని అన్నాడు.

అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు.” అని అన్నాడు.

“రామా! ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్లిపోతాయి. అది తప్ప ఇక్క ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది.” అని అన్నాడు సుతీక్ష మహర్షి.

అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నాకు మృగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మృగములను చంపగలను. కాని నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది.” అని అన్నాడు రాముడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టమః సర్గః (8) >>

Ayodhya Kanda Sarga 83 In Telugu – అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 83 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ  త్ర్యశీతితమః సర్గ, “భరతవనప్రస్థానమ్”, రామాయణంలో ఒక ప్రాధాన్యభరితమైన భాగం. ఈ సర్గలో భరతుడు తన సైన్యంతో, మంత్రులతో, మరియు ప్రజలతో కలిసి రాముడిని తిరిగి తీసుకురావాలన్న పట్టుదలను చూపిస్తాడు. భరతుడు తన అన్న రాముడిని తిరిగి తెచ్చేందుకు చేసిన ఈ యాత్ర, అతని విధేయతను, ధర్మపరాయణతను, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

భరతవనప్రస్థానమ్

తతః సముత్థితః కాల్యమాస్థాయ స్యందనోత్తమమ్ |
ప్రయయౌ భరతః శీఘ్రం రామదర్శనకాంక్షయా ||

1

అగ్రతః ప్రయయుస్తస్య సర్వే మంత్రిపురోధసః |
అధిరుహ్య హయైః యుక్తాన్ రథాన్సూర్యరథోపమాన్ ||

2

నవనాగసహస్రాణి కల్పితాని యథావిధి |
అన్వయుర్భరతం యాంతమిక్ష్వాకు కులనందనమ్ ||

3

షష్ఠీ రథసహస్రాణి ధన్వినో వివిధాయుధాః |
అన్వయుర్భరతం యాంతం రాజపుత్రం యశస్వినమ్ ||

4

శతం సహస్రాణ్యశ్వానాం సమారూఢాని రాఘవమ్ |
అన్వయుర్భరతం యాంతం సత్యసంధం జితేంద్రియమ్ ||

5

కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్వినీ |
రామానయన సంహృష్టా యయుర్యానేన భాస్వతా ||

6

ప్రయాతాశ్చార్యసంఘాతాః రామం ద్రష్టుం సలక్ష్మణమ్ |
తస్యైవ చ కథాశ్చిత్రాః కుర్వాణా హృష్టమానసాః ||

7

మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్త్వం దృఢవ్రతమ్ |
కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశనమ్ ||

8

దృష్ట ఏవ హి నః శోకమపనేష్యతి రాఘవః |
తమః సర్వస్య లోకస్య సముద్యన్నివ భాస్కరః ||

9

ఇత్యేవం కథయంతస్తే సంప్రహృష్టాః కథాశ్శుభాః |
పరిష్వజానాశ్చాన్యోన్యం యయుర్నాగరికా జనాః ||

10

యే చ తత్రాపరే సర్వే సమ్మతా యే చ నైగమాః |
రామం ప్రతి యయుర్హృష్టాః సర్వాః ప్రకృతయస్తదా ||

11

మణికారాశ్చ యే కేచిత్ కుంభకారాశ్చ శోభనాః |
సూత్రకర్మకృతశ్చైవ యే చ శస్త్రోపజీవినః ||

12

మాయూరకాః క్రాకచికా రోచకాః వేధకాస్తథా |
దంతకారాః సుధాకారాస్తథా గంధోపజీవినః ||

13

సువర్ణకారాః ప్రఖ్యాతాస్తథా కంబలధావకాః |
స్నాపకోచ్ఛాదకా వైద్యా ధూపకాః శౌండికాస్తథా ||

14

రజకాస్తున్నవాయాశ్చ గ్రామఘోషమహత్తరాః |
శైలూషాశ్చ సహ స్త్రీభిర్యయుః కైవర్తకాస్తథా ||

15

సమాహితా వేదవిదో బ్రాహ్మణా వృత్తసమ్మతాః |
గోరథైః భరతం యాంతమనుజగ్ముః సహస్రశః ||

16

సువేషాః శుద్ధ వసనాస్తామ్ర మృష్టానులేపనాః |
సర్వే తే వివిధైః యానైః శనైర్భరతమన్వయుః ||

17

ప్రహృష్టముదితా సేనా సాఽన్వయాత్కైకయీ సుతమ్ |
భ్రాతురానయనే యాంతం భరతం భ్రాతృవత్సలమ్ ||

18

తే గత్వా దూరమధ్వానం రథయానాశ్వకుంజరైః |
సమాసేదుస్తతో గంగాం శృంగిబేరపురం ప్రతి ||

19

యత్ర రామసఖో వీరో గుహో జ్ఞాతిగణైర్వృతః |
నివసత్యప్రమాదేన దేశం తం పరిపాలయన్ ||

20

ఉపేత్య తీరం గంగాయాశ్చక్రవాకైరలంకతమ్ |
వ్యవతిష్ఠత సా సేనా భరతస్యానుయాయినీ ||

21

నిరీక్ష్యానుగతాం సేనాం తాం చ గంగాం శివోదకామ్ |
భరతః సచివాన్ సర్వాన్ అబ్రవీద్వాక్యకోవిదః ||

22

నివేశయత మే సైన్యమభిప్రాయేణ సర్వతః |
విశ్రాంతః ప్రతరిష్యామః శ్వైదానీమిమాం నదీమ్ ||

23

దాతుం చ తావదిచ్ఛామి స్వర్గతస్య మహీపతేః |
ఔర్ధ్వదేహనిమిత్తార్థమ్ అవతీర్యోదకం నదీమ్ ||

24

తస్యైవం బ్రువతోఽమాత్యాస్తథా ఇత్యుక్త్వా సమాహితాః |
న్యవేశయంస్తాం ఛందేన స్వేన స్వేన పృథక్ పృథక్ ||

25

నివేశ్య గంగామను తాం మహానదీమ్
చమూం విధానైః పరిబర్హశోభినీమ్ |
ఉవాస రామస్య తదా మహాత్మనో
విచింతయానో భరతర్నివర్తనమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 83 Meaning In Telugu

మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాతఃకాల సంధ్యావందనాదికార్యకమములు నిర్వర్తించాడు. తన రథముఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు.

భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు.

వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడు అక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు.

“ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది. చేద్దాము. రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతరణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు అందరూ ఆ రాత్రికి గంగానదీ తీరమున విడిదిచేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతురశీతితమః సర్గః (84) >>

Aranya Kanda Sarga 14 In Telugu – అరణ్యకాండ చతుర్దశః సర్గః

Aranya Kanda Sarga 14 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుర్దశః సర్గలో, రాముడు మరియు మిగిలిన ఇద్దరు పంచవటికి వెళుతుండగా జటాయు అనే శక్తివంతమైన డేగతో పరిచయం ఏర్పడింది. రాముడు దాని గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు, జటాయు మానవులతో పాటు జంతు జాతుల సృష్టిని వివరిస్తాడు మరియు తాను దశరథ రాజుకు స్నేహితుడని మరియు అజ్ఞాతవాసంలో ఉన్న రాముడికి సహాయం చేయాలనుకుంటున్నానని రాముడికి తెలియజేస్తాడు.

జటాయుఃసంగమః

అథ పంచవటీం గచ్ఛన్నంతరా రఘునందనః |
ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమమ్ ||

1

తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ |
మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితి ||

2

స తౌ మధురయా వాచా సౌమ్యయా ప్రీణయన్నివ |
ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః ||

3

స తం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః |
స తస్య కులమవ్యగ్రమథ పప్రచ్ఛ నామ చ ||

4

రామస్య వచనం శ్రుత్వా సర్వభూతసముద్భవమ్ |
ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ ||

5

పూర్వకాలే మహాబాహో యే ప్రజాపతయోఽభవన్ |
తాన్మే నిగదతః సర్వానాదితః శృణు రాఘవ ||

6

కర్దమః ప్రథమస్తేషాం విశ్రుతస్తదనంతరః |
శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ ||

7

స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః |
పులస్త్యశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా ||

8

దక్షో వివస్వానపరోఽరిష్టనేమిశ్చ రాఘవ |
కశ్యపశ్చ మహాతేజాస్తేషామాసీచ్చ పశ్చిమః ||

9

ప్రజాపతేస్తు దక్షస్య బభూవురితి విశ్రుతమ్ |
షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః ||

10

కశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః |
అదితిం చ దితిం చైవ దనుమప్యథ కాలికామ్ ||

11

తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి |
తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యపః పునరబ్రవీత్ ||

12

పుత్రాంస్రైలోక్యభర్తౄన్వై జనయిష్యథ మత్సమాన్ |
అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ ||

13

కాలికా చ మహాబాహో శేషాస్త్వమనసోఽభవన్ |
అదిత్యాం జజ్ఞిరే దేవాస్త్రయస్త్రింశదరిందమ ||

14

ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప |
దితిస్త్వజనయత్పుత్రాన్దైత్యాంస్తాత యశస్వినః ||

15

తేషామియం వసుమతీ పురాసీత్సవనార్ణవా |
దనుస్త్వజనయత్పుత్రమశ్వగ్రీవమరిందమ ||

16

నరకం కాలకం చైవ కాలికాపి వ్యజాయత |
క్రౌంచీం భాసీం తథా శ్యేనీం ధృతరాష్ట్రీం తథా శుకీమ్ ||

17

తామ్రాపి సుషువే కన్యాః పంచైతా లోకవిశ్రుతాః |
ఉలూకాన్ జనయత్క్రౌంచీ భాసీ భాసాన్వ్యజాయత ||

18

శ్యేనీ శ్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః |
ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః ||

19

చక్రవాకాంశ్చ భద్రం తే విజజ్ఞే సాపి భామినీ |
శుకీ నతాం విజజ్ఞే తు నతాయా వినతా సుతా ||

20

దశ క్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసంభవాః |
మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి ||

21

మాతంగీమపి శార్దూలీం శ్వేతాం చ సురభిం తథా |
సర్వలక్షణసంపన్నాం సురసాం కద్రుకామపి ||

22

అపత్యం తు మృగాః సర్వే మృగ్యా నరవరోత్తమ |
ఋక్షాశ్చ మృగమందాయాః సృమరాశ్చమరాస్తథా ||

23

హర్యాశ్చ హరయోఽపత్యం వానరాశ్చ తరస్వినః |
తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదా సుతామ్ ||

24

తస్యాస్త్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః |
మాతంగాస్త్వథ మాతంగ్యా అపత్యం మనుజర్షభ ||

25

గోలాంగూలాంశ్చ శార్దూలీ వ్యాఘ్రాంశ్చాజనయత్సుతాన్ |
దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్సుతాన్ ||

26

తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత |
రోహిణీం నామ భద్రం తే గంధర్వీం చ యశస్వినీమ్ ||

27

రోహిణ్యజనయద్గా వై గంధర్వీ వాజినః సుతాన్ |
సురసాజనయన్నాగాన్రామ కద్రూస్తు పన్నగాన్ ||

28

మనుర్మనుష్యాంజనయద్రామ పుత్రాన్యశస్వినః |
బ్రాహ్మణాన్క్షత్త్రియాన్వైశ్యాన్ శూద్రాంశ్చ మనజర్షభ ||

29

సర్వాన్పుణ్యఫలాన్వృక్షాననలాపి వ్యాజాయత |
వినతా చ శుకీ పౌత్రీ కద్రూశ్చ సురసా స్వసా ||

30

కద్రూర్నాగం సహస్రస్యం విజజ్ఞే ధరణీధరమ్ |
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోఽరుణ ఏవ చ ||

31

తస్మాజ్జాతోఽహమరుణాత్సంపాతిస్తు మమాగ్రజః |
జటాయురితి మాం విద్ధి శ్యేనీపుత్రమరిందమ ||

32

సోఽహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి |
ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షససేవితమ్ |
సీతాం చ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే ||

33

జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో
ముదా పరిష్వజ్య చ సన్నతోఽభవత్ |
పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్
జటాయుషా సంకథితం పునః పునః ||

34

స తత్ర సీతాం పరిదాయ మైథిలీం
సహైవ తేనాతిబలేన పక్షిణా |
జగామ తాం పంచవటీం సలక్ష్మణో
రిపూన్దిధక్షన్ శలభానివానలః ||

35

Aranya Kanda Sarga 14 In Telugu Pdf Download

రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు.

“నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు రాముడు.

“రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు.” అని అన్నాడు.

తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది.

“రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను.

ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు.

ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ,మను, అనల అనే ఎనిమింది కన్యలను కశ్యపప్రజాపతి పెళ్లిచేసుకున్నాడు.

కశ్యపుడు తన భార్యలతో “మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి.” అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనే వారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాటమీద మనసు పెట్టలేదు.

కశ్యపుని కోరిక ప్రకారము అదితికి పన్నెండు మంది ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు), ఎనిమిది మంది వసువులను (అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కధకు మూలపురుషుడు అయ్యాడు), పదకొండు మంది రుద్రులు, ఇద్దరు అశ్వినులు, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలుపుట్టారు.

కశ్యపునకు దితి యందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది.

కశ్యపునకు దనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి, శ్యేని,ధృతరాష్ట్రి, శుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. (ఇవి అన్నీ పక్షిజాతుల పేర్లు).ఆ తరువాత క్రౌంచికి ఉలూకములు (గుడ్లగూబలు), భాసి అనేకూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. శ్యేని అనే కూతురుకు శ్యేనములు (డేగలు) పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంస జాతులు, చక్రవాక పక్షులు, జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధిచెందింది.

శుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే పదిమింది పుత్రికలు జన్మించారు. (ఇవన్నీ మృగజాతుల పేర్లు). మృగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు. ఎలుగుబంట్లు, చామరీ మృగములు ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. (అందుకే సింహమునకు కోతులకు, హరి అనే పేరు వచ్చింది.

భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్దపులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి.

సురభి రోహిణి, గంధర్వి అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి.

మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టీ చేసే వృత్తులబత్తీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు. అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది.

రామా! నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత శుకికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు.

(గరుడుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడుకి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు).

ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు. నేను, సంపాతి. నా పేరు జటాయువు. నేను శ్యేని జాతికి చెందిన వాడిని. ఇదీ నా జన్మ వృత్తాంతము.

(అవకాశము వస్తే చాలు, పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయాపాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈభూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు.)

రామా! ఈ వనమంతా నాకు బాగాతెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనపుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను.” అని అన్నాడు.

జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచదశః సర్గః (15) >>

Aranya Kanda Sarga 6 In Telugu – అరణ్యకాండ షష్ఠః సర్గః

Aranya Kanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్ఠః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివసిస్తారు. అక్కడ సుర్పణఖ తన సోదరులైన ఖర, దూషణలను రాముని మీద దాడి చేయమని ప్రేరేపిస్తుంది. ఖర, దూషణలు తమ దళాలతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా యుద్ధం చేసి, ఖర, దూషణలను వధిస్తాడు.

|| రక్షోవధప్రతిజ్ఞానమ్ ||

శరభంగే దివం యాతే మునిసంఘాః సమాగతాః |
అభ్యగచ్ఛంత కాకుత్స్థం రామం జ్వలితతేజసమ్ ||

1

వైఖానసా వాలఖిల్యాః సంప్రక్షాలా మరీచిపాః |
అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః ||

2

దంతోలూఖలినశ్చైవ తథైవోన్మజ్జకాః పరే |
గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః ||

3

మునయః సలిలాహారా వాయుభక్షాస్తథాపరే |
ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలశాయినః ||

4

వ్రతోపవాసినో దాంతాస్తథార్ద్రపటవాససః |
సజపాశ్చ తపోనిత్యాస్తథా పంచతపోఽన్వితాః ||

5

సర్వే బ్రాహ్మ్యా శ్రియా జుష్టా దృఢయోగాః సమాహితాః |
శరభంగాశ్రమే రామమభిజగ్ముశ్చ తాపసాః ||

6

అభిగమ్య చ ధర్మజ్ఞా రామం ధర్మభృతాం వరమ్ |
ఊచుః పరమధర్మజ్ఞమృషిసంఘాః సమాహితాః ||

7

త్వమిక్ష్వాకుకులస్యాస్య పృథివ్యాశ్చ మహారథ |
ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ ||

8

విశ్రుతస్త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ |
పితృభక్తిశ్చ సత్యం చ త్వయి ధర్మశ్చ పుష్కలః ||

9

త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలమ్ |
అర్థిత్వాన్నాథ వక్ష్యామస్తచ్చ నః క్షంతుమర్హసి ||

10

అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతేః |
యో హరేద్బలిషడ్భాగం న చ రక్షతి పుత్రవత్ ||

11

యుంజానః స్వానివ ప్రాణాన్ప్రాణైరిష్టాన్సుతానివ |
నిత్యయుక్తః సదా రక్షన్సర్వాన్విషయవాసినః ||

12

ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీమ్ |
బ్రహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే ||

13

యత్కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశనః |
తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజా ధర్మేణ రక్షతః ||

14

సోఽయం బ్రాహ్మణభూయిష్ఠో వానప్రస్థగణో మహాన్ |
త్వన్నాథోఽనాథవద్రామ రాక్షసైర్బాధ్యతే భృశమ్ ||

15

ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనామ్ |
హతానాం రాక్షసైర్ఘోరైర్బహూనాం బహుధా వనే ||

16

పంపానదీనివాసానామనుమందాకినీమపి |
చిత్రకూటాలయానాం చ క్రియతే కదనం మహత్ ||

17

ఏవం వయం న మృష్యామో విప్రకారం తపస్వినామ్ |
క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమకర్మభిః ||

18

తతస్త్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థితాః |
పరిపాలయ నో రామ వధ్యమానాన్నిశాచరైః ||

19

పరా త్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే |
పరిపాలయ నః సర్వాన్రాక్షసేభ్యో నృపాత్మజ ||

20

ఏతచ్ఛ్రుత్వా తు కాకుత్స్థస్తాపసానాం తపస్వినామ్ |
ఇదం ప్రోవాచ ధర్మాత్మా సర్వానేవ తపస్వినః ||

21

నైవమర్హథ మాం వక్తుమాజ్ఞప్తోఽహం తపస్వినామ్ |
కేవలేనాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనమ్ ||

22

విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామిమమ్ |
పితుస్తు నిర్దేశకరః ప్రవిష్టోఽహమిదం వనమ్ ||

23

భవతామర్థసిద్ధ్యర్థమాగతోఽహం యదృచ్ఛయా |
తస్య మేఽయం వనే వాసో భవిష్యతి మహాఫలః ||

24

తపస్వినాం రణే శత్రూన్హంతుమిచ్ఛామి రాక్షసాన్ |
పశ్యంతు వీర్యమృషయః సభ్రాతుర్మే తపోధనాః ||

25

దత్త్వాఽభయం చాపి తపోధనానాం
ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన |
తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః
సుతీక్ష్ణమేవాభిజగామ వీరః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠః సర్గః ||

Aranya Kanda Sarga 6 Meaning In Telugu

ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు, మొదలగు మహాఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గ లోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమ వంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధానధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకో దలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు.

రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని, దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇదీ రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము. తాపసులము. మేము రాజుకు పన్నురూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది.

ప్రస్తుతము మేము నివసించుచున్న ఈముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము | అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా! మాతో రా! ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము.

ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వతప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆ యా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంక ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా! ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు.” అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు.

రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు.

“ఓ మహామునులారా! మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం. బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్ణయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను.” అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు.

తరువాత రాముడు, సీతతో, లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తమః సర్గః (7) >>

Ayodhya Kanda Sarga 57 In Telugu | అయోధ్యాకాండ సప్తపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 57 In Telugu

అయోధ్యా కాండ సర్గ 57 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.

సుమంత్రోపావర్తనమ్

కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ |
రామే దక్షిణకూలస్థే జగామ స్వగృహం గుహః ||

1

భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహాసనమ్ |
ఆగిరేర్గమనం తేషాం తత్రస్థైరభిలక్షితమ్ ||

2

అనుజ్ఞాతః సుమంత్రోఽథ యోజయిత్వా హయోత్తమాన్ |
అయోధ్యామేవ నగరీం ప్రయయౌ గాఢదుర్మనాః ||

3

స వనాని సుగంధీని సరితశ్చ సరాంసి చ |
పశ్యన్నతియయౌ శీఘ్రం గ్రామాణి నగరాణి చ ||

4

తతః సాయాహ్న సమయే తృతీయేఽహని సారథిః |
అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శ హ ||

5

స శూన్యామివ నిశ్శబ్దాం దృష్ట్వా పరమదుర్మనాః |
సుమంత్రశ్చింతయామాస శోకవేగసమాహతః ||

6

కచ్చిన్న సగజా సాశ్వా సజనా సజనాధిపా |
రామసంతాపదుఃఖేన దగ్ధా శోకాగ్నినా పురీ ||

7

ఇతి చింతాపరః సూతః వాజిభిః శ్రీఘ్రపాతిభిః |
నగరద్వారమాసాద్య త్వరితః ప్రవివేశ హ ||

8

సుమంత్రమభియాంతం తం శతశోఽథ సహస్రశః |
క్వ రామైతి పృచ్ఛంతః సూతమభ్యద్రవన్నరాః ||

9

తేషాం శశంస గంగాయామహమాపృచ్ఛ్య రాఘవమ్ |
అనుజ్ఞాతో నివృత్తోఽస్మి ధార్మికేణ మహాత్మనా ||

10

తే తీర్ణా ఇతి విజ్ఞాయ బాష్పపూర్ణముఖా జనాః |
అహో ధిగితి నిశ్వస్య హా రామేతి చ చుక్రుశుః ||

11

శుశ్రావ చ వచస్తేషాం బృందం బృందం చ తిష్ఠతామ్ |
హతాః స్మ ఖలు యే నేహ పశ్యామైతి రాఘవమ్ ||

12

దానయజ్ఞవివాహేషు సమాజేషు మహత్సు చ |
న ద్రక్ష్యామః పునర్జాతు ధార్మికం రామమంతరా ||

13

కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహమ్ |
ఇతి రామేణ నగరం పితృవత్పరిపాలితమ్ ||

14

వాతాయనగతానాం చ స్త్రీణామన్వంతరాపణమ్ |
రామ శోకాభితప్తానాం శుశ్రావ పరిదేవనమ్ ||

15

స రాజమార్గమధ్యేన సుమంత్రః పిహితాననః |
యత్ర రాజా దశరథస్తదేవోపయయౌ గృహమ్ ||

16

సోఽవతీర్య రథాచ్ఛీఘ్రం రాజవేశ్మ ప్రవిశ్య చ |
కక్ష్యాః సప్తాభిచక్రామ మహా జన సమాకులాః ||

17

హర్మ్యైర్విమానైః ప్రాసాదైరవేక్ష్యాథ సమాగతమ్ |
హాహాకారకృతా నార్యో రామదర్శనకర్శితాః ||

18

ఆయతైర్విమలైర్నేత్రైః అశ్రువేగపరిప్లుతైః |
అన్యోన్యమభివీక్షంతేఽవ్యక్తమార్తతరాః స్త్రియః ||

19

తతో దశరథ స్త్రీణాం ప్రాసాదేభ్యస్తతస్తతః |
రామ శోకాభితప్తానాం మందం శుశ్రావ జల్పితమ్ ||

20

సహ రామేణ నిర్యాతః వినా రామమిహాగతః |
సూతః కిం నామ కౌసల్యాం శోచంతీం ప్రతివక్ష్యతి ||

21

యథా చ మన్యే దుర్జీవమేవం న సుకరం ధ్రువమ్ |
ఆచ్ఛిద్య పుత్రే నిర్యాతే కౌసల్యా యత్ర జీవతి ||

22

సత్యరూపం తు తద్వాక్యం రాజ్ఞః స్త్రీణాం నిశామయన్ |
ప్రదీప్తమివ శోకేన వివేశ సహసా గృహమ్ ||

23

స ప్రవిశ్యాష్టమీం కక్ష్యాం రాజానం దీనమాతురమ్ |
పుత్ర శోక పరిద్యూనమపశ్యత్ పాండరే గృహే ||

24

అభిగమ్య తమాసీనం నరేంద్రమభివాద్య చ |
సుమంత్రః రామవచనం యథోక్తం ప్రత్యవేదయత్ ||

26

స తూష్ణీమేవ తచ్ఛ్రుత్వా రాజా విభ్రాంతచేతనః |
మూర్ఛితో న్యపతద్భూమౌ రామ శోకాభిపీడితః ||

27

తతోఽంతః పురమావిద్ధం మూర్ఛితే పృథివీపతౌ |
ఉద్ధృత్య బాహూ చుక్రోశ నృపతౌ పతితే క్షితౌ ||

28

సుమిత్రయా తు సహితా కౌసల్యా పతితం పతిమ్ |
ఉత్థాపయామాస తదా వచనం చేదమబ్రవీత్ ||

29

ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణః |
వనవాసాదనుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే ||

30

అద్యేమమనయం కృత్వా వ్యపత్రపసి రాఘవ |
ఉత్తిష్ఠ సుకృతం తేఽస్తు శోకే న స్యాత్ సహాయతా ||

31

దేవ యస్యా భయాద్రామం నాతుపృచ్ఛసి సారథిమ్ |
నేహ తిష్ఠతి కైకేయీ విస్రబ్ధం ప్రతిభాష్యతామ్ ||

32

సా తథోక్త్వా మహారాజం కౌసల్యా శోకలాలసా |
ధరణ్యాం నిపపాతాశు బాష్ప విప్లుత భాషిణీ ||

33

ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి |
పతిం చావేక్ష్య తాః సర్వాః సుస్వరం రురుదుః స్త్రియః ||

34

తతస్తమంతః పుర నాదముత్థితమ్
సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః |
స్త్రియశ్చ సర్వా రురుదుః సమంతతః
పురం తదాసీత్ పునరేవ సంకులమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 57 Meaning In Telugu

గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.

సుమంత్రుడు తన రథమును అయోధ్యవైపు తీసుకొని వెళుతున్నాడు. మూడవ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవిలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగరప్రవేశము చేసాడు.

రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంట బడ్డారు. “రాముడు ఎక్కడ? రాముని ఎక్కడ వదిలి వచ్చావు?” అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. సుమంత్రుడు రథము ఆపి వారితో ఇలా అన్నాడు. “నేనురాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్దనుండి ఆజ్ఞతీసుకొని వచ్చాను.” అని బాధతో చెప్పాడు సుమంత్రుడు.

“రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా. రాముడు ఇంకమాకు కనపడడా” అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు.సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్లాడు. అంత:పురములోని స్త్రీలు, రాముడు లేకుండా వంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు.

“సుమంత్రుని చూచిన కౌసల్య “నా రాముడు ఏడీ” అనిఅడిగితే కౌపల్యకు ఏమి సమాధానము చెబుతాడు. కొడుకు కోడలు తనను విడిచి పెట్టి పోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా! ఏమో ఆమె బతకడం చాలా కష్టము. ఏం జరుగుతుందో ఏమో!” అని తమలో తాము ఆందోళన చెందుతున్నారు.

ఆ మాటలన్నీవింటూ సుమంత్రుడు దశరథుని మందిరము వైపు వెళుతున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. అంతలో అంతఃపుర స్త్రీలు అందరూవచ్చి ఆయనకు ఉపచారములు చేసారు. ఇంతలో కౌసల్యసుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీసారు.

దశరథునితో కౌసల్య ఇలాఅంది.”మహారాజా! రాముని అడవిలో వదిలిపెట్టి రామసందేశమును తీసుకొని వచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి. మహారాజా! చెయ్యవలసినది అంతా చేసి ఇప్పుడు మాట్లాడ కుండా మౌనంగా ఉ ంటావెందుకు. ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పని వాడివని పేరు ప్రతిష్ఠలు గడించావు. సత్యవాక్పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులెండి. ఇక్కడ కైక లేదులెండి.

మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునిలో మాట్లా డ వచ్చును.” అని కౌసల్య పలికి ఆమెకు దుఃఖము ముంచుకురాగా కిందపడిపోయింది. కిందపడిపోయిన దశరథుని, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దుఃఖానికి అంతులేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టపంచాశః సర్గః (58) >>