Ayodhya Kanda Sarga 46 In Telugu – అయోధ్యాకాండ షట్చత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 46 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ షట్చత్వారింశః సర్గ, “పౌరమోహనమ్”, రామాయణంలోని ఒక సన్నివేశభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసానికి బయలుదేరిన తరువాత, అయోధ్య ప్రజలు తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. రాముడిని విడిచిపెట్టాలనే ఆలోచన వారికి అసహ్యంగా ఉంటుంది మరియు వారు తీవ్ర వేదనతో బాధపడుతారు. రాముడి వినయం, ధర్మపాలన, మరియు ప్రజల పట్ల అతని అపారమైన ప్రేమ వల్ల ప్రజలు మోహములో పడతారు. ఈ సర్గలో, ప్రజల ఆకలితో, నిరాశతో, మరియు రాముడి పట్ల ఉన్న ప్రేమతో కూడిన భావోద్వేగాలు హృదయానికి హత్తుకునేలా ప్రతిబింబిస్తాయి.

పౌరమోహనమ్

తతస్తు తమసాతీరం రమ్యమాశ్రిత్య రాఘవః |
సీతాముద్వీక్ష్య సౌమిత్రిమిదం వచనమబ్రవీత్ ||

1

ఇయమద్య నిశా పూర్వా సౌమిత్రే ప్రహితా వనమ్ |
వనవాసస్య భద్రం తే స నోత్కంఠితుమర్హసి ||

2

పశ్య శూన్యాన్యరణ్యాని రుదంతీవ సమంతతః |
యథానిలయమాయద్భిర్నిలీనాని మృగద్విజైః ||

3

అద్యాయోధ్యా తు నగరీ రాజధానీ పితుర్మమ |
సస్త్రీపుంసాగతానస్మాన్శోచిష్యతి న సంశయః ||

4

అనురక్తా హి మనుజాః రాజానం బహుభిర్గుణైః |
త్వాం చ మాం చ నరవ్యాఘ్ర శత్రఘ్నభరతౌ తథా ||

5

పితరం చానుశోచామి మాతరం చ యశస్వినీమ్ |
అపి వాఽన్ధౌ భవేతాం తు రుదంతౌ తావభీక్ష్ణశః ||

6

భరతః ఖలు ధర్మాత్మా పితరం మాతరం చ మే |
ధర్మార్థకామసహితైః వాక్యైరాశ్వాసయిష్యతి ||

7

భరతస్యానృశంసత్వం విచింత్యాహం పునః పునః |
నానుశోచామి పితరం మాతరం చాపి లక్ష్మణ ||

8

త్వయా కార్యం నరవ్యాఘ్ర మామనువ్రజతా కృతమ్ |
అన్వేష్టవ్యా హి వైదేహ్యా రక్షణార్థే సహాయతా ||

9

అద్భిరేవ తు సౌమిత్రే వత్స్యామ్యద్య నిశామిమామ్ |
ఏతద్ధి రోచతే మహ్యం వన్యేఽపి వివిధే సతి ||

10

ఏవముక్త్వా తు సౌమిత్రం సుమంత్రమపి రాఘవః |
అప్రమత్తస్త్వమశ్వేషు భవ సౌమ్యేత్యువాచ హ ||

11

సోఽశ్వాన్సుమంత్రః సంయమ్య సూర్యేఽస్తం సముపాగతే |
ప్రభూతయవసాన్కృత్వా బభూవ ప్రత్యనంతరః ||

12

ఉపాస్య తు శివాం సంధ్యాం దృష్ట్వా రాత్రిముపస్థితామ్ |
రామస్య శయనం చక్రే సూతః సౌమిత్రిణా సహ ||

13

తాం శయ్యాం తమసాతీరే వీక్ష్య వృక్షదలైః కృతామ్ |
రామః సౌమిత్రిణా సార్ధం సభార్యః సంవివేశ హ ||

14

సభార్యం సంప్రసుప్తం తం భ్రాతరం వీక్ష్య లక్ష్మణః |
కథయామాస సూతాయ రామస్య వివిధాన్గుణాన్ ||

15

జాగ్రతః హ్యేవ తాం రాత్రిం సౌమిత్రేరుదితః రవిః |
సూతస్య తమసాతీరే రామస్య బ్రువతః గుణాన్ ||

16

గోకులాకులతీరాయాస్తమసాయా విదూరతః |
అవసత్తత్ర తాం రాత్రిం రామః ప్రకృతిభిః సహ ||

17

ఉత్థాయ తు మహాతేజాః ప్రకృతీస్తా నిశామ్య చ |
అబ్రవీద్భ్రాతరం రామః లక్ష్మణం పుణ్యలక్షణమ్ ||

18

అస్మద్వ్యపేక్షాన్సౌమిత్రే నిరపేక్షాన్గృహేష్వపి |
వృక్షమూలేషు సంసుప్తాన్పశ్య లక్ష్మణ సాంప్రతమ్ ||

19

యథైతే నియమం పౌరాః కుర్వంత్యస్మన్నివర్తనే |
అపి ప్రాణాన్న్యసిష్యంతి న తు త్యక్ష్యంతి నిశ్చయమ్ ||

20

యావదేవ తు సంసుప్తాస్తావదేవ వయం లఘు |
రథమారుహ్య గచ్ఛామ పంథానమకుతోభయమ్ ||

21

అతః భూయోఽపి నేదానీమిక్ష్వాకుపురవాసినః |
స్వపేయురనురక్తా మాం వృక్షమూలాని సంశ్రితాః ||

22

పౌరా హ్యాత్మకృతాద్దుఃఖాద్విప్రమోక్ష్యా నృపాత్మజైః |
న తే ఖల్వాత్మనా యోజ్యా దుఃఖేన పురవాసినః || [న తు]

23

అబ్రవీల్లక్ష్మణో రామం సాక్షాద్ధర్మమివస్థితమ్ |
రోచతే మే తథా ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామితి ||

24

అథ రామోఽబ్రవీచ్ఛ్రీమాన్సుమంత్రం యుజ్యతాం రథః |
గమిష్యామి తతోఽరణ్యం గచ్ఛ శ్రీఘ్రమితః ప్రభో ||

25

సూతస్తతః సంత్వరితః స్యందనం తైర్హయోత్తమైః |
యోజయిత్వాఽథ రామాయ ప్రాంజలిః ప్రత్యవేదయత్ ||

26

అయం యుక్తో మహాబాహో రథస్తే రథినాంవర |
తమారోహ సుభద్రం తే ససీతః సహలక్ష్మణః ||

27

తం స్యందనమధిష్ఠాయ రాఘవః సపరిచ్ఛదః |
శీఘ్రగామాకులావర్తాం తమసామతరన్నదీమ్ ||

28

స సంతీర్య మహాబాహుః శ్రీమాన్శివమకంటకమ్ |
ప్రాపద్యత మహామార్గమభయం భయదర్శినామ్ ||

29

మోహనార్థం తు పౌరాణాం సూతం రామోఽబ్రవీద్వచః |
ఉదఙ్ముఖః ప్రయాహి త్వం రథమాస్థాయ సారథే ||

30

ముహూర్తం త్వరితం గత్వా నివర్తయ రథం పునః |
యథా న విద్యుః పౌరా మాం తథా కురు సమాహితః ||

31

రామస్య వచనం శ్రుత్వా తథా చక్రే స సారథిః |
ప్రత్యాగమ్య చ రామస్య స్యందనం ప్రత్యవేదయత్ ||

32

తౌ సంప్రయుక్తం తు రథం సమాసిత్థౌ
తదా ససీతౌ రఘవంశవర్ధనౌ |
ప్రచోదయామాస తతస్తురంగమాన్
స సారథిర్యేన పథా తపోవనమ్ ||

33

తతః సమాస్థాయ రథం మహారథః
ససారథిర్ధాశరథిర్వనం యయౌ |
ఉదఙ్ముఖం తం తు రథం చకార స
ప్రయాణమాంగళ్య నిమిత్తదర్శనాత్ ||

34

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 46 Meaning In Telugu

తమసానదీ తీరమునకు చేరుకున్న రాముడు, సీతతో, లక్ష్మణునితో ఇలా అన్నాడు.

“ఓ సీతా! లక్ష్మణా! ఇప్పుడు మనము వనవాసములోకి ప్రవేశించాము. మన వనవాసములో ఇది తొలి రాత్రి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరి నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అయోధ్యలోని మనవారందరూ మన కోసము దు:ఖిస్తూ ఉంటారు. ముఖ్యంగా నా తల్లి కౌసల్య, నా తండ్రి దశరథుడు నా కోసం ఏడ్చి ఏడ్చి అంధులుగా మారిపోతారా అని భయంగా ఉంది. నా తల్లి తండ్రులను ఇంక భరతుడే ఓదార్చాలి. అయినా ధర్మాత్ముడు అయిన భరతుడు ఉండగా నా తల్లితండ్రులకు భయమేముంటుంది.

లక్ష్మణా! నీవు నా వెంబడి రావడం నా మంచికే జరిగింది. లేకపోతే నేను ఒక్కడినే సీతా సంరక్షణ భారం వహించవలసి వచ్చేది. ఓ లక్ష్మణా! ఈ రాత్రికి నేను ఆహారం ఏమీ తీసుకోను. కేవలము నీళ్లు తాగి ఉంటాను. నాకు భోజనము చెయ్యాలని కోరిక లేదు. నీవు మాత్రము మన రథాశ్వములను జాగ్రత్తగా చూచుకో. వాటికి కావలసిన ఆహారపానీయాలు అందాయోలేదో చూడు.” అని అన్నాడు. రాముడు.

రథమును తోలుకొని వచ్చిన సుమంత్రుడు గుర్రములకు కావలసిన ఆహారము పెట్టాడు. వాటిదగ్గరే ఉన్నాడు. తరువాత సుమంత్రుడు రామునకు, సీతకు, లక్ష్మణునకు చెట్ల ఆకులతో కూడిన శయ్యలు(పడకలు) ఏర్పాటు చేసాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ శయ్యలమీద పడుకున్నారు. రాముడు సీత నిద్రపోయారు గానీ, సుమంత్రునికి లక్ష్మణునికి నిద్రపట్టలేదు. వారు ఇద్దరూ రాముని సద్గుణముల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంతలో రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. సూర్యోదయము కావచ్చింది. రాముని వెంట వచ్చిన బ్రాహ్మణులు కూడా తమసానదీ తీరంలో నిద్రించారు.

పెందరాడే నిద్రలేచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “ఓ లక్ష్మణా! వీరిని చూడు. నాకోసరము, నామీద ప్రేమతో అభిమానంతో తమ తమ గృహములను విడిచి నా వెంట అడవులకు వచ్చారు. చెట్ల కింద, కటిక నేలమీద నిద్రిస్తున్నారు. వీరు నా కోసం తమ ప్రాణములనైనా ఇస్తారు కానీ తమ తమ నివాసములకు వెళ్లేటట్టులేదు. కాబట్టి అధర్మమైనా నాకు ఒక మార్గము తోచుచున్నది. వీరందరూ నిద్రలేచే లోపు మనము రథం ఎక్కి దూరంగా వెళ్లి పోదాము. అప్పుడు వీరు చేసేది లేక తిరిగి అయోధ్యకు వెళ్లిపోతారు. మనతో పాటు వీరికీ వనవాసము తప్పుతుంది. ఇంక వీళ్లకు ఈ చెట్లకింద నిద్రించే అవసరము ఉండదు. పౌరులకు ఏదైనా దు:ఖము కలిగితే రాజులు తొలిగించాలి కానీ, రాజులే పౌరులకు దుఃఖము కలిగించకూడదు.” అని అన్నాడు రాముడు.

“రామా! నీ మాటలు చాలా బాగున్నాయి. అలాగే చేద్దాము. సుమంత్రా రథమును సిద్ధం చెయ్యి. మనం వెంటనే బయలుదేరాలి.” అని అన్నాడు లక్ష్మణుడు.

సుమంత్రుడు త్వరత్వరగా రథమును సిద్ధం చేసాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రథం ఎక్కారు. వారు రథము మీద తమసా నదీ తీరాన్ని దాటారు. రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “ఓ సుమంత్రా! నీవు ఉత్తరదిక్కుగా కొంతదూరం ప్రయాణించి తరువాత రథమును వెనుకకు తిప్పుకొని రమ్ము. మా వెంట వచ్చిన బ్రాహ్మణులకు కనపడకుండా మరలా మావద్దకు రథమును తీసుకొని రా. ఎట్టి పరిస్థితులతోనూ మా విషయం వారికి తెలియనియ్యకు.” అని అన్నాడు. సుమంత్రుడు.

రాముడు చెప్పినట్టే చేసి రథమును మరలా రాముని వద్దకు తీసుకొని వచ్చి నిలిపాడు. తరువాత సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. సుమంత్రుడు రథమును అరణ్యమార్గములో పోనిచ్చాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తచత్వారింశః సర్గః (47) >>

Balakanda Sarga 63 In Telugu – బాలకాండ త్రిషష్టితమః సర్గః

Bala kanda Sarga 63 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిషష్టితమః సర్గలో, విశ్వామిత్రుని యొక్క తీవ్రమైన ఆశ్రయంపై బ్రహ్మ అతనికి ‘మహా-ఋషి’ యొక్క ఋషిత్వాన్ని అంగీకరిస్తాడు, అయితే విశ్వామిత్రుని ఆశయం ‘బ్రహ్మ-ఋషి’ సంపూర్ణ-జ్ఞాన జ్ఞానాన్ని పొందడం. ఇంతలో, స్వర్గీయ వేంచ్ మేనక ఆ ప్రదేశానికి చేరుకుంటుంది మరియు విశ్వామిత్రుడు ఆమె అందానికి మోహింపబడి ఆమెతో కొన్నాళ్ళు గడిపాడు. తరువాత, అతను కామంపై విజయం సాధించాలని గ్రహించిన తరువాత, అతను మరింత తీవ్రమైన అస్తిత్వాన్ని చేపట్టాడు, దాని ద్వారా దేవతలు కలవరపడతారు.

మేనకానిర్వాసః

పూర్ణే వర్షసహస్రే తు వ్రతస్నాతం మహామునిమ్ |
అభ్యాగచ్ఛన్సురాః సర్వే తపఃఫలచికీర్షవః ||

1

అబ్రవీత్సుమహాతేజా బ్రహ్మా సురుచిరం వచః |
ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః ||

2

తమేవముక్త్వా దేవేశస్త్రిదివం పునరభ్యగాత్ |
విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహత్తపః ||

3

తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే ||

4

తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః |
రూపేణాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా ||

5

దృష్ట్వా కందర్పవశగో మునిస్తామిదమబ్రవీత్ |
అప్సరః స్వాగతం తేఽస్తు వస చేహ మమాశ్రమే ||

6

అనుగృహ్ణీష్వ భద్రం తే మదనేన సుమోహితమ్ |
ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్ ||

7

తపసో హి మహావిఘ్నో విశ్వామిత్రముపాగతః |
తస్యాం వసంత్యాం వర్షాణి పంచ పంచ చ రాఘవ ||

8

విశ్వామిత్రాశ్రమే తస్మిన్సుఖేన వ్యతిచక్రముః |
అథ కాలే గతే తస్మిన్విశ్వామిత్రో మహామునిః ||

9

సవ్రీడ ఇవ సంవృత్తశ్చింతాశోకపరాయణః |
బుద్ధిర్మునేః సముత్పన్నా సామర్షా రఘునందన ||

10

సర్వం సురాణాం కర్మైతత్తపోఽపహరణం మహత్ |
అహోరాత్రాపదేశేన గతాః సంవత్సరా దశ ||

11

కామమోహాభిభూతస్య విఘ్నోఽయం ప్రత్యుపస్థితః |
వినిఃశ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః ||

12

భీతామప్సరసం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితామ్ |
మేనకాం మధురైర్వాక్యైర్విసృజ్య కుశికాత్మజః ||

13

ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ |
స కృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతుకామో మహాయశాః ||

14

కౌశికీతీరమాసాద్య తపస్తేపే సుదారుణమ్ |
తస్య వర్షసహస్రాణి ఘోరం తప ఉపాసతః ||

15

ఉత్తరే పర్వతే రామ దేవతానామభూద్భయమ్ |
ఆమంత్రయన్సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః ||

16

మహర్షిశబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజః |
దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః ||

17

అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ |
మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః ||

18

మహత్త్వమృషిముఖ్యత్వం దదామి తవ సువ్రత |
బ్రహ్మణః స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ ||

19

[* న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః | *]
ప్రాంజలిః ప్రణతో భూత్వా ప్రత్యువాచ పితామహమ్ |
బ్రహ్మర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః ||

20

యది మే భగవానాహ తతోఽహం విజితేంద్రియః |
తమువాచ తతో బ్రహ్మా న తావత్త్వం జితేంద్రియః ||

21

యతస్వ మునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః |
విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః ||

22

ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్ |
ధర్మే పంచతపా భూత్వా వర్షాస్వాకాశసంశ్రయః ||

23

శిశిరే సలిలస్థాయీ రాత్ర్యహాని తపోధనః |
ఏవం వర్షసహస్రం హి తపో ఘోరముపాగమత్ ||

24

తస్మిన్సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ |
సంభ్రమః సుమహానాసీత్సురాణాం వాసవస్య చ ||

25

రంభామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః |
ఉవాచాత్మహితం వాక్యమహితం కౌశికస్య చ ||

26

Balakanda Sarga 63 In Telugu Pdf With Meaning

విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. అతడి తపస్సుకు మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు.

విశ్వామిత్రుని చూచి బ్రహ్మ “ఓ విశ్వామిత్రా! నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు.” అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు.

కాని విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వసిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి.

ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్లాడు.

“ ఓ అప్సరసా! నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నిన్ను చూచి నేను పరవశుడను అయ్యాను. మన్మధబాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు.”అని వేడుకున్నాడు.

విశ్వామిత్రుని కోరికను మన్నిచింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. పది సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు.

అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడా గడా వణికి పోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి
మేనకను పంపించి వేసాడు.

తరువాత హిమాలయ పర్వతములకు వెళ్లాడు. ఇంద్రియము లను నిగ్రహించుకున్నాడు. కౌశికీ నదీ తీరములో తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ ప్రకారంగా వేయి సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడా ” పోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంటబెట్టుకొని విశ్వామితుని వద్దకు వెళ్లారు.

బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ” ఓ విశ్వామిత్రా! నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహా ఋషికి అయ్యావు. ఓ విశ్వామిత్రా! నీవు మహర్షివి.” అని అన్నాడు.

కాని విశ్వామిత్రునికి సంతోషము కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు.

“ఓ బ్రహ్మదేవా! నాకు మహర్షి పదవి లభించినది అనే మీరు అన్నారు. అయితే నేను జితేంద్రియుడను (అనగా ఇంద్రియములను జయించినవాడు) అయ్యానా!” అని అడిగాడు.

ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి “నీవు ఇంకా జితేంద్రియుడికి కాలేదు. నీవు ఇంకా తపస్సు చేయాలి.” అని అన్నాడు.

తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు.

ఈ సారి చేతులుపైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సుచేయడం మొదలెట్టాడు. విశ్వామిత్రుడు ఎండా కాలంలో ఐదు అగ్నుల మధ్య, వర్షాకాలములో ఆరుబయల వానలో, చలికాలంలో నీటిలో నిలబడి, వేయి సంవత్సరములు తపస్సుచేసాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సుచూచి దేవేంద్రునకు దేవతలకు భయం పట్టుకుంది.

దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃషష్టితమః సర్గః (64) >>

Balakanda Sarga 74 In Telugu – బాలకాండ చతుఃసప్తతితమః సర్గః

Balakanda Sarga 74 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుఃసప్తతితమః సర్గలో విశ్వామిత్రుడు రాముడిని గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకువెళతాడు. అక్కడ అహల్యా శాపవిమోచనమును వివరిస్తాడు. ఇంద్రుడి కృత్యంతో శపించబడిన అహల్యా, రాముడి పాదధూళి తగిలి ముక్తి పొందుతుంది. ఆ తరువాత, రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి చేరుకుంటారు. అక్కడ యజ్ఞం జరుగుతుంది, అందులో రాముడు పాల్గొంటాడు.

|| జామదగ్న్యాభియోగః ||

అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః |
ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తరపర్వతమ్ ||

1

ఆశీర్భిః పూరయిత్వా చ కుమారాంశ్చ సరాఘవాన్ |
విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపమ్ ||

2

ఆపృష్ట్వాథ జగామాశు రాజా దశరథః పురీమ్ |
గచ్ఛంతం తం తు రాజానమన్వగచ్ఛన్నరాధిపః ||

3

అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు |
గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః ||

4

కంబలానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యంబరాణి చ |
హస్త్యశ్వరథపాదాతం దివ్యరూపం స్వలంకృతమ్ ||

5

దదౌ కన్యాపితా తాసాం దాసీదాసమనుత్తమమ్ |
హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ ||

6

దదౌ పరమసంహృష్టః కన్యాధనమనుత్తమమ్ |
దత్త్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివమ్ ||

7

ప్రవివేశ స్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః |
రాజాప్యయోధ్యాధిపతిః సహ పుత్రైర్మహాత్మభిః ||

8

ఋషీన్సర్వాన్పురస్కృత్య జగామ సబలానుగః |
గచ్ఛంతం తం నరవ్యాఘ్రం సర్షిసంఘం సరాఘవమ్ ||

9

ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరంతి తతస్తతః |
భౌమాశ్చైవ మృగాః సర్వే గచ్ఛంతి స్మ ప్రదక్షిణమ్ ||

10

తాన్దృష్ట్వా రాజశార్దూలో వసిష్ఠం పర్యపృచ్ఛత |
అసౌమ్యాః పక్షిణో ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణాః ||

11

కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి |
రాజ్ఞో దశరథస్యైతచ్ఛ్రుత్వా వాక్యం మహానృషిః ||

12

ఉవాచ మధురాం వాణీం శ్రూయతామస్య యత్ఫలమ్ |
ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్చ్యుతమ్ ||

13

మృగాః ప్రశమయంత్యేతే సంతాపస్త్యజ్యతామయమ్ |
తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవ హ ||

14

కంపయన్మేదినీం సర్వాం పాతయంశ్చ మహాద్రుమాన్ |
తమసా సంవృతః సూర్యః సర్వా న ప్రబభుర్దిశః ||

15

భస్మనా చావృతం సర్వం సమ్మూఢమివ తద్బలమ్ |
వసిష్ఠశ్చర్షయశ్చాన్యే రాజా చ ససుతస్తదా ||

16

ససంజ్ఞా ఇవ తత్రాసన్సర్వమన్యద్విచేతనమ్ |
తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్ఛన్నేవ సా చమూః ||

17

దదర్శ భీమసంకాశం జటామండలధారిణమ్ |
భార్గవం జామదగ్న్యం తం రాజారాజవిమర్దినమ్ ||

18

కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుఃసహమ్ |
జ్వలంతమివ తేజోభిర్దుర్నిరీక్ష్యం పృథగ్జనైః ||

19

స్కంధే చాసాద్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్ |
ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్ ||

20

తం దృష్ట్వా భీమసంకాశం జ్వలంతమివ పావకమ్ |
వసిష్ఠప్రముఖాః సర్వే జపహోమపరాయణాః ||

21

సంగతా మునయః సర్వే సంజజల్పురథో మిథః |
కచ్చిత్పితృవధామర్షీ క్షత్రం నోత్సాదయిష్యతి ||

22

పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వరః |
క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితమ్ ||

23

ఏవముక్త్వార్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనమ్ |
ఋషయో రామరామేతి వచో మధురమబ్రువన్ ||

24

ప్రతిగృహ్య తు తాం పూజామృషిదత్తాం ప్రతాపవాన్ |
రామం దాశరథిం రామో జామదగ్న్యోఽభ్యభాషత ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃసప్తతితమః సర్గః ||

Balakanda Sarga 74 Meaning In Telugu PDF

సీతారాముల కల్యాణం జరిగింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు, నూతన వధూవరు లందరినీ ఆశీర్వదించి, జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్లిపోయిన తరువాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు.

అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణములు కానుకగా ఇచ్చాడు. లక్ష ఆవులను, అనేక వస్త్రాభరణము లను, ఏనుగులు, హయములు, రథములను అరణంగా ఇచ్చాడు. దాసులను దాసీజనమును దన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణ గా చతురంగ బలములను పంపాడు. వారితో పాటు మిథిలా నగరము బయట దాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. తరువాత వెను తిరిగి మిథిలకు వచ్చాడు.

దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే దశరథుడు వసిష్ఠుని పిలిచి ఆ దుశ్శకునముల కు అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు వసిష్ఠుడు ఇలా అన్నాడు.

“ఓ దశరథమహారాజా! మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుంది అని ఈ దుశ్శకునములు సూచిస్తూ ఉన్నాయి. కాని ఆ ఆపద సులభంగా తొలగి పోతుంది అని కొన్ని శుభశకునములు కూడా కనపడుతున్నాయియి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు.” అని వివరించాడు వసిష్ఠుడు.

ఇంతలో తీవ్రంగా పెను గాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుని కాంతి వెల వెల బోయింది. చీకట్లు కమ్మాయి. ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు.

అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు. వెంటనే దశరథుడు, వసిష్ఠుడు, బ్రాహ్మణులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించారు. ఉచితాసనము ఇచ్చి సత్కరిం చారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ పంచసప్తతితమః సర్గః (75) >>

Ayodhya Kanda Sarga 66 In Telugu – అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 66

అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గ రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు సీతా దేవితో కలిసి వనవాసానికి బయలుదేరుతాడు. రథంలో ప్రయాణిస్తూ రాముడు గంగా నదిని చేరుకుంటాడు. అప్పుడు గుహుడు అనే నిశాద రాజు రాముడు, సీత, లక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వడమే కాక, వారికి సహాయం చేస్తాడు. వారు గంగా నదిని దాటడానికి పడవను అందిస్తాడు. రాముడు తన పట్టాభిషేకం రద్దయినప్పటికీ, ధైర్యంగా వనవాసం అంగీకరించి ధర్మాన్ని పాటిస్తాడు. ఈ సర్గ రాముని నిశ్చలత, ధర్మానుస్థానం, మరియు ఆపదలో ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది.

తైలద్రోణ్యధిశయనమ్

తమగ్నిమివ సంశాంతమంబు హీనమివార్ణవమ్ |
హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివమ్ || ౧ ||

కౌసల్యా బాష్పపూర్ణాక్షీ వివిధం శోకకర్శితా |
ఉపగృహ్య శిరః రాజ్ఞః కైకేయీం ప్రత్యభాషత || ౨ ||

సకామా భవ కైకేయి భుంక్ష్వ రాజ్యమకణ్టకమ్ |
త్యక్త్వా రాజానమేకాగ్రా నృశంసే దుష్టచారిణి || ౩ ||

విహాయ మాం గతః రామః భర్తా చ స్వర్గతః మమ |
విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే || ౪ ||

భర్తారం తం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః |
ఇచ్చేజ్జీవితుమన్యత్ర కైకేయ్యాస్త్యక్తధర్మణః || ౫ ||

న లుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ |
కుబ్జానిమిత్తం కైకేయ్యా రాఘవాణాం కులం హతమ్ || ౬ ||

అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితమ్ |
సభార్యం జనకః శ్రుత్వా పరితప్స్యత్యహం యథా || ౭ ||

స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః |
రామః కమలపత్రాక్షో జీవనాశమితః గతః || ౮ ||

విదేహరాజస్య సుతా తథా సీతా తపస్వినీ |
దుఃఖస్యానుచితా దుఃఖం వనే పర్యుద్విజిష్యతి || ౯ ||

నదతాం భీమఘోషాణాం నిశాసు మృగపక్షిణామ్ |
నిశమ్య నూనం సంత్రస్తా రాఘవం సంశ్రయిష్యతి || ౧౦ ||

వృద్ధశ్చైవాల్ప పుత్రశ్చ వైదేహీమనిచింతయన్ |
సోఽపి శోకసమావిష్టర్నను త్యక్ష్యతి జీవితమ్ || ౧౧ ||

సాఽహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రతా |
ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనమ్ || ౧౨ ||

తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్వినీమ్ |
వ్యపనిన్యుః సుదుహ్ఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః || ౧౩ || [వ్యపనీయ]

తైలద్రోణ్యామథామాత్యాః సంవేశ్య జగతీపతిమ్ |
రాజ్ఞః సర్వాణ్యథాదిష్టాశ్చక్రుః కర్మాణ్యనంతరమ్ || ౧౪ ||

న తు సఙ్కలనం రాజ్ఞో వినా పుత్రేణ మంత్రిణః |
సర్వజ్ఞాః కర్తుమీషుస్తే తతః రక్షంతి భూమిపమ్ || ౧౫ ||

తైలద్రోణ్యాం తు సచివైః శాయితం తం నరాధిపమ్ |
హా మృతోఽయమితి జ్ఞాత్వా స్త్రియస్తాః పర్యదేవయన్ || ౧౬ ||

బాహూనుద్యమ్య కృపణా నేత్రప్రస్రవణైః ముఖైః |
రుదంత్యః శోకసంతప్తాః కృపణం పర్యదేవయన్ || ౧౭ ||

హా మహారాజ రామేణ సతతం ప్రియవాదినా |
విహీనాః సత్యసంధేన కిమర్థం విజహాసి నః || ౧౮ ||

కైకేయ్యా దుష్టభావాయాః రాఘవేణ వియోజితాః |
కథం పతిఘ్న్యా వత్స్యామః సమీపే విధవా వయమ్ || ౧౯ ||

స హి నాథః సదాఽస్మాకం తవ చ ప్రభురాత్మవాన్ |
వనం రామో గతః శ్రీమాన్ విహాయ నృపతిశ్రియమ్ || ౨౦ ||

త్వయా తేన చ వీరేణ వినా వ్యసనమోహితాః |
కథం వయం నివత్స్యామః కైకేయ్యా చ విదూషితాః || ౨౧ ||

యయా తు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబలః |
సీతయా సహ సంత్యక్తాః సా కమన్యం న హాస్యతి || ౨౨ ||

తా బాష్పేణ చ సంవీతాః శోకేన విపులేన చ |
వ్యవేష్టంత నిరానందా రాఘవస్య వరస్త్రియః || ౨౩ ||

నిశా చంద్రవిహీనేవ స్త్రీవ భర్తృవివర్జితా |
పురీ నారాజతాయోధ్యా హీనా రాజ్ఞా మహాత్మనా || ౨౪ ||

బాష్ప పర్యాకులజనా హాహాభూతకులాంగనా |
శూన్యచత్వరవేశ్మాంతా న బభ్రాజ యథాపురమ్ || ౨౫ ||

గతే తు శోకాత్ త్రిదివం నరాధిపే
మహీతలస్థాసు నృపాంగనాసు చ |
నివృత్తచారః సహసా గతో రవిః
ప్రవృత్తచారా రాజనీ హ్యుపస్థితా || ౨౬ ||

ఋతే తు పుత్రాద్దహనం మహీపతేః
నరోచయంతే సుహృదః సమాగతాః |
ఇతీవ తస్మిన్ శయనే న్యవేశయన్
విచింత్య రాజానమచింత్య దర్శనమ్ || ౨౭ ||

గతప్రభా ద్యౌరివ భాస్కరం వినా
వ్యపేతనక్షత్రగణేవ శర్వరీ |
పురీ బభాసే రహితా మహాత్మనా
న చాస్ర కంఠాకుల మార్గచత్వరా || ౨౮ ||

నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘః
విగర్హమాణా భరతస్య మాతరమ్ |
తదా నగర్యాం నరదేవసంక్షయే
బభూవురార్తా న చ శర్మ లేభిరే || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్షష్ఠితమః సర్గః || ౬౬ ||

Ayodhya Kanda Sarga 66 Meaning In Telugu

కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దు:ఖిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది. “ఏమ్మా! కైకా! నీ కోరిక తీరిందా! నీ మనస్సు శాంతించిందా! ఇంక నువ్వు, నీ కొడుకు, ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్లిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు. ఎవరి కోసం బతకాలి. నీ లాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా.

ఓ కైకా! నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేసావా! లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేసావు. ఓ కైకా! నీవు మాకే కాదు. జనక మహారాజును కూడా దు:ఖములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంతదు:ఖిస్తున్నాడో కదా! ఇంతకూ రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది. తన తల్లి అనాధ అయింది అని ఎవరు చెబుతారు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు! నా భర్త రాముని గూర్చి, సీతను గూర్చి, తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళతాను. నా భర్తతో పాటు చితి మీదకూర్చుని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్పనాకు వేరుమార్గము లేదు.” అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకొని భోరు భోరున ఏడుస్తూ ఉంది.

ఇంతలో కులగురువు వసిష్టులు, అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వసిష్ఠుని ఆదేశము మేరకు అంత:పురపరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవులలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహనక్రియలు నిర్వర్తించడానికి వీలులేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు.

(తైలద్రోణి అంటే పలు విధములైన నూనెలు(preservatives) కలిగిన తొట్టె అని అర్థము. ఈ రోజుల్లో కూడా శవాలను చెడిపోకుండా భద్రపరచడానికి యాసిడ్లు పూసి భద్రపరుస్తారు. మమ్మీలు అన్నీ అలా భద్రపరచబడినవే. ఇదే ప్రక్రియ త్రేతాయుగములో కూడా ఉంది అని తెలుస్తూ ఉంది.)
అప్పటి దాకా దూర దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోదిస్తున్నారు.

“ఓ మహారాజా! మాకు రాముడిని దూరం చేసావు. ఇప్పుడు నువ్వుకూడా దూరంగా వెళ్లిపోయావా! చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము. రాముడూ లేకుండా, నీవూ లేకుండా, ఈ కైక పెట్టే బాధలనుసహిస్తూ మేము ఎలా జీవించగలము. ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసరం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచి పెడుతుందా?” అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలచుకుంటూ నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు.

వీరి పరిస్థితి ఇలా ఉంటే, అటు రాముని, ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురు కున్నాయి. అందరూ శోమసముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజులేని అయోధ్య శోభావిహీన అయింది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణమును చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకున్నాయి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గః (67) >>

Ayodhya Kanda Sarga 67 In Telugu – అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 67

అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీత, లక్ష్మణులతో కలిసి గంగానదిని దాటి దక్షిణ దిశగా పయనిస్తాడు. వారు చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు, అక్కడ సురమ్యమైన ప్రకృతిని చూస్తారు. చిత్రకూటంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, వారు నివసించేందుకు సిద్ధపడతారు. అయోధ్యలో, రాముని వనవాసం కారణంగా దశరథుడు మరణిస్తాడు. భరతుడు తన తండ్రి మరణవార్త విని కైకేయి మీద కోపంతో ఉన్నా, రాముని తీసుకురావాలనే సంకల్పంతో చిత్రకూటానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఈ సర్గ రాముని త్యాగం, భరతుని భక్తి, మరియు దశరథుని దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది.

అరాజకదురవస్థావర్ణనమ్

ఆక్రందితనిరానందా సాస్రకంఠజనాకులా |
ఆయోధ్యాయామవతతా సా వ్యతీయాయ శర్వరీ || ౧ ||

వ్యతీతాయాం తు శర్వర్యామాదిత్యస్యోదయే తతః |
సమేత్య రాజకర్తారః సభామీయుర్ద్విజాతయః || ౨ ||

మార్కండేయోఽథ మౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః |
కాత్యయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః || ౩ ||

ఏతే ద్విజాః సహామాత్యైః పృథగ్వాచముదీరయన్ |
వసిష్ఠమేవాభిముఖాః శ్రేష్ఠం రాజపురోహితమ్ || ౪ ||

అతీతా శర్వరీ దుఃఖం యా నో వర్షశతోపమా |
అస్మిన్ పంచత్వమాపన్నే పుత్ర శోకేన పార్థివే || ౫ ||

స్వర్గతశ్చ మహారాజో రామశ్చారణ్యమాశ్రితః |
లక్ష్మణశ్చాపి తేజస్వీ రామేణైవ గతః సహ || ౬ ||

ఉభౌ భరత శత్రుఘ్నౌ కేకయేషు పరంతపౌ |
పురే రాజగృహే రమ్యే మాతామహనివేశనే || ౭ ||

ఇక్ష్వాకూణామిహాద్యైవ కశ్చిద్రాజా విధీయతామ్ |
అరాజకం హి నో రాష్ట్రం న వినాశమవాప్నుయాత్ || ౮ ||

నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః |
అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణా || ౯ ||

నారాజకే జనపదే బీజముష్టిః ప్రకీర్యతే |
నారాజకే పితుః పుత్రః భార్యా వా వర్తతే వశే || ౧౦ ||

అరాజకే ధనం నాస్తి నాస్తి భార్యాఽప్యరాజకే |
ఇదమత్యాహితం చాన్యత్ కుతః సత్యమరాజకే || ౧౧ ||

నారాజకే జనపదే కారయంతి సభాం నరాః |
ఉద్యానాని చ రమ్యాణి హృష్టాః పుణ్యగృహాణి చ || ౧౨ ||

నారాజకే జనపదే యజ్ఞశీలా ద్విజాతయః |
సత్రాణ్యన్వాసతే దాంతా బ్రాహ్మణాః సంశితవ్రతాః || ౧౩ ||

నారాజకే జనపదే మహాయజ్ఞేషు యజ్వనః |
బ్రాహ్మణా వసుసంపన్నా విసృజంత్యాప్తదక్షిణాః || ౧౪ ||

నారాజకే జనపదే ప్రభూతనటనర్తకాః |
ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనాః || ౧౫ ||

నారజకే జనపదే సిద్ధార్థా వ్యవహారిణః |
కథాభిరనురజ్యంతే కథాశీలాః కథాప్రియైః || ౧౬ ||

నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః |
సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః || ౧౭ ||

నారాజకే జనపదే వాహనైః శీఘ్రగామిభిః |
నరా నిర్యాంత్యరణ్యాని నారీభిః సహ కామినః || ౧౮ ||

నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః |
శేరతే వివృత ద్వారాః కృషిగోరక్షజీవినః || ౧౯ ||

నారాజకే జనపదే బద్దఘంటావిషాణినః |
ఆటంతి రాజమార్గేషు కుంజరా షష్టిహాయనాః || ౨౦ ||

నారాజకే జనపదే శరాన్ సతతమస్యతామ్ |
శ్రూయతే తలనిర్ఘోష ఇష్వస్త్రాణాముపాసనే || ౨౧ ||

నారాజకే జనపదే వణిజో దూరగామినః |
గచ్ఛంతి క్షేమమధ్వానం బహుపణ్యసమాచితాః || ౨౨ ||

నారాజకే జనపదే చరత్యేకచరః వశీ |
భావయన్నాత్మనాఽఽత్మానం యత్ర సాయంగృహో మునిః || ౨౩ ||

నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే |
నచాప్యరాజకే సేనా శత్రూన్ విషహతే యుధి || ౨౪ ||

నారాజకే జనపదే హృష్టైః పరమవాజిభిః |
నరాః సంయాంతి సహసా రథైశ్చ పరిమండితాః || ౨౫ ||

నారాజకే జనపదే నరాః శాస్త్రవిశారదాః |
సంవదంతోఽవతిష్ఠంతే వనేషూపవనేషు చ || ౨౬ ||

నారాజకే జనపదే మాల్యమోదకదక్షిణాః |
దేవతాభ్యర్చనార్థయ కల్ప్యంతే నియతైర్జనైః || ౨౭ ||

నారాజకే జనపదే చందనాగురురూషితాః |
రాజపుత్రా విరాజంతే వసంత ఇవ శాఖినః || ౨౮ ||

యథా హ్యనుదకా నద్యో యథా వాఽప్యతృణం వనమ్ |
అగోపాలా యథా గావస్తథా రాష్ట్రమరాజకమ్ || ౨౯ ||

ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసోః |
తేషాం యో నో ధ్వజో రాజ స దేవత్వమితో గతః || ౩౦ ||

నారాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్ |
మత్స్యా ఇవనరా నిత్యం భక్షయంతి పరస్పరమ్ || ౩౧ ||

యే హి సంభిన్నమర్యాదా నాస్తికాశ్చిన్న సంశయాః |
తేఽపి భావాయ కల్పంతే రాజదండనిపీడితాః || ౩౨ ||

యథా దృష్టిః శరీరస్య నిత్యమేవప్రవర్తతే |
తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవః సత్యధర్మయోః || ౩౩ ||

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౩౪ ||

యమో వైశ్రవణః శక్రో వరుణశ్చ మహాబలః |
విశేష్యంతే నరేంద్రేణ వృత్తేన మహతా తతః || ౩౫ ||

అహో తమైవేదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన |
రాజా చేన్న భవేల్లోకే విభజన్ సాధ్వసాధునీ || ౩౬ ||

జీవత్యపి మహారాజే తవైవ వచనం వయమ్ |
నాతిక్రమామహే సర్వే వేలాం ప్రాప్యేవ సాగరః || ౩౭ ||

స నః సమీక్ష్య ద్విజవర్య వృత్తమ్
నృపం వినా రాజ్యమరణ్యభూతమ్ |
కుమారమిక్ష్వాకు సుతం వదాన్యమ్
త్వమేవ రాజానమిహాభిషించ || ౩౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్ఠితమః సర్గః || ౬౭ ||

Ayodhya Kanda Sarga 67 Meaning In Telugu

మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు బ్రాహ్మణులు పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజ పురోహితుడైన వసిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు.

“నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్దకుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో (తాతగారి ఇంటిలో) ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది.

రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పుచేసిన వారిని శిక్షించే వారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్యీర్యము అవుతంఉది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలునిర్భయంగా తిరగడానికి భయపడతారు.

శత్రు రాజులు మన దేశము మీదికి దండెత్తే అవకాశము ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు, ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు.రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేదిరాజు. అందుకనే రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము అవుతుంది. కాబట్టి ఓ వసిష్ట మహర్షీ! మేము చెప్పిన విషయములను పరిశీలించి, ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం.” అని పలికారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము, అరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గః (68) >>

Ayodhya Kanda Sarga 65 In Telugu – అయోధ్యాకాండ పంచషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 65

అయోధ్యాకాండ పంచషష్ఠితమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో దశరథుడు రాముని వనవాసం పంపడంలో ఉద్భవించిన విచారాన్ని వర్ణిస్తారు. కైకేయి మాట ప్రకారం రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనానికి వెళ్ళడానికి సిద్దపడతాడు. ప్రజలు విచారంతో రాముని వెంటవెళ్లి వనవాసం ఆరంభాన్ని చూస్తారు. దశరథుడు రాముని వనవాసం వెళ్ళిపోవడం వల్ల తీవ్ర విషాదంలో ఉంటాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాటిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, వనవాసం చేయడం ప్రారంభిస్తాడు. ఈ సర్గ రాముని ధర్మపాలనను, కుటుంబ బాంధవ్యాలను, బాధ్యతను ప్రతిబింబిస్తుంది.

అంతఃపురాక్రందః

అథ రాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరేవాపరేఽహని |
వందినః పర్యుపాతిష్ఠన్ తత్పార్థివనివేశనమ్ || ౧ ||

సూతాః పరమసంస్కారాః మంగళాశ్చోత్తమశ్రుతాః |
గాయకాః స్తుతిశీలాశ్చ నిగదంతః పృథక్ పృథక్ || ౨ ||

రాజానం స్తువతాం తేషాముదాత్తాభిహితాశిషామ్ |
ప్రాసాదాభోగవిస్తీర్ణః స్తుతిశబ్దో హ్యవర్తత || ౩ ||

తతస్తు స్తువతాం తేషాం సూతానాం పాణివాదకాః |
అపదానాన్యుదాహృత్య పాణివాదా నవాదయన్ || ౪ ||

తేన శబ్దేన విహగాః ప్రతిబుద్ధా విసస్వనుః |
శాఖాస్థాః పంజరస్థాశ్చ యే రాజకులగోచరాః || ౫ ||

వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ వీణానాం చాపి నిస్స్వనాః |
ఆశీర్గేయం చ గాథానాం పూరయామాస వేశ్మ తత్ || ౬ ||

తతః శుచి సమాచారాః పర్యుపస్థాన కోవిదాః |
స్త్రీవర్షవరభూయిష్ఠాః ఉపతస్థుర్యథాపురమ్ || ౭ ||

హరిచందన సంపృక్తముదకం కాంచనైః ఘటైః |
ఆనిన్యుః స్నాన శిక్షాజ్ఞా యథాకాలం యథావిధి || ౮ ||

మంగళాలంభనీయాని ప్రాశనీయాన్యుపస్కరాన్ |
ఉపనిన్యుస్తథాప్యన్యాః కుమారీబహుళాః స్త్రియః || ౯ ||

సర్వలక్షణసంపన్నం సర్వం విధివదర్చితమ్ |
సర్వం సుగుణలక్ష్మీవత్తద్భభూవాభిహారికమ్ || ౧౦ ||

తత్తు సూర్యోదయం యావత్సర్వం పరిసముత్సుకమ్ |
తస్థావనుపసంప్రాప్తం కిం స్విదిత్యుపశంకితమ్ || ౧౧ ||

అథయాః కోసలేంద్రస్య శయనం ప్రత్యనంతరాః |
తాః స్త్రియస్తు సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్ || ౧౨ ||

తథాఽప్యుచితవృత్తాస్తాః వినయేన నయేన చ |
నహ్యస్య శయనం స్పృష్ట్వా కించిదప్యుపలేభిరే || ౧౩ ||

తాః స్త్రీయః స్వప్నశీలజ్ఞాస్చేష్టాసంచలనాదిషు |
తా వేపథుపరీతాశ్చ రాజ్ఞః ప్రాణేషు శంకితాః || ౧౪ ||

ప్రతిస్రోతస్తృణాగ్రాణాం సదృశం సంచకంపిరే | [సంచకాశిరే]
అథ సంవేపమానానాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివమ్ || ౧౫ ||

యత్తదాశంకితం పాపం తస్య జజ్ఞే వినిశ్చయః |
కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకపరాజితే || ౧౬ ||

ప్రసుప్తే న ప్రబుధ్యేతే యథా కాలసమన్వితే |
నిష్ప్రభా చ వివర్ణా చ సన్నా శోకేన సన్నతా || ౧౭ ||

న వ్యరాజత కౌసల్యా తారేవ తిమిరావృతా |
కౌసల్యాఽనంతరం రాజ్ఞః సుమిత్రా తదంతనరమ్ || ౧౮ ||

న స్మ విభ్రాజతే దేవీ శోకాశ్రులులితాననా |
తే చ దృష్ట్వా తథా సుప్తే ఉభే దేవ్యౌ చ తం నృపమ్ || ౧౯ ||

సుప్తమేవోద్గతప్రాణమంతః పురమదృశ్యత |
తతః ప్రచుక్రుశుర్దీనాః సస్వరం తా వరాంగనాః || ౨౦ ||

కరేణవైవారణ్యే స్థాన ప్రచ్యుత యూథపాః |
తాసామాక్రంద శబ్దేన సహసోద్గత చేతనే || ౨౧ ||

కౌసల్యా చ సుమిత్రాచ త్యక్తనిద్రే బభూవతుః |
కౌసల్యా చ సుమిత్రా చ దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివమ్ || ౨౨ ||

హా నాథేతి పరిక్రుశ్య పేతతుర్ధరణీతలే |
సా కోసలేంద్రదుహితా వేష్టమానా మహీతలే || ౨౩ ||

న బభ్రాజ రజోధ్వస్తా తారేవ గగనాచ్చ్యుతా |
నృపే శాంతగుణే జాతే కౌసల్యాం పతితాం భువి || ౨౪ ||

ఆపశ్యంస్తాః స్త్రియః సర్వాః హతాం నాగవధూమివ |
తతః సర్వా నరేంద్రస్య కైకేయీప్రముఖాః స్త్రియః || ౨౫ ||

రుదంత్యః శోకసంతప్తా నిపేతుర్గతచేతనాః |
తాభిః స బలవాన్నాదః క్రోశంతీభిరనుద్రుతః || ౨౬ ||

యేన స్థిరీకృతం భూయస్తద్గృహం సమనాదయత్ |
తత్సముత్త్రస్తసంభ్రాంతం పర్యుత్సుక జనాకులమ్ || ౨౭ ||

సర్వతస్తుములాక్రందం పరితాపార్తబాంధవమ్ |
సద్యో నిపతితానందం దీనవిక్లబదర్శనమ్ || ౨౮ ||

బభూవ నరదేవస్య సద్మ దిష్టాంతమీయుషః |
అతీతమాజ్ఞాయ తు పార్థివర్షభమ్
యశస్వినం సంపరివార్య పత్నయః |
భృశం రుదంత్యః కరుణం సుదుఃఖితాః
ప్రగృహ్య బాహూ వ్యలపన్ననాథవత్ || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచషష్ఠితమః సర్గః || ౬౫ ||

Ayodhya Kanda Sarga 65 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. రోజూ మాదిరి వంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరములైన వాక్యములు పలుకుతూ స్తోత్రపాఠములు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశ చరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములతో కౌసల్యా మందిరము మారుమోగిపోయింది.

పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరకు వచ్చారు. మరి కొంత మంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకొని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈపాటికి నిద్రలేచేవారు. కాని ఇన్ని స్తోత్రపాఠములు చదువుతున్నా ఆయన అటు ఇటు కూడా కదలడం లేదు. వారికి అనుమానం కలిగింది. కాని అలాగే నిలబడి పోయారు.
ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు, దశరథుని వద్ద చనువు ఉన్న వాళ్లు, అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరకువెళ్లారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణవార్తను బయటకు చెప్పడానికి వారికి ధైర్యము చాలడం లేదు. వారు పరుగుపరుగున కౌసల్య సుమిత్రల వద్దకు వెళ్లారు. అప్పటికి వారు నిద్రలేవలేదు. అప్పటికి వారికి విషయం బోధపడింది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత దశరథుని ప్రాణాలు నిద్రలోనే పోయాయి. ఆవిషయం రాణులకు తెలియదు అని వారికి అవగతమయింది. వారు ఏడుస్తూ

కౌసల్యను నిద్ర లేపారు. వారికి ఏం చెప్పాలో తోచలేదు. దశరధుని వంక చూపించారు. కౌసల్య దశరధుని వద్దకు వెళ్లింది. ఆయన మరణించాడు అనిఅర్థం అయింది. “హా నాధా!” అంట బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. దశరథుని మరణ వార్త అంత:పురము అంతటా వ్యాపించింది. దశరథుని భార్యలందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కైకకు కూడా దు:ఖము కట్టలు తెంచుకొని వస్తోంది. ఆమెకూడా బిగ్గరగా ఏడుస్తోంది. వారి రోదనలతో అంత:పురము నిండిపోయింది. పరిచారికలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అటుఇటు పరుగెత్తుతున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గః (66) >>

Balakanda Sarga 61 In Telugu – బాలకాండ ఏకషష్టితమః సర్గః

Balakanda Sarga 61 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకషష్టితమః సర్గలో, శునాశేప పురాణం ప్రారంభమైంది మరియు విశ్వామిత్ర పురాణంలో భాగంగా శతానంద మహర్షి దీనిని కొనసాగిస్తున్నాడు. రాముడి తాతయ్య అంబరీషుడు ఒక కర్మను చేపట్టినప్పుడు, ఇంద్రుడు ఆ కర్మ యొక్క గుర్రాన్ని బంధించాడు. అప్పుడు అంబరీషుడు ఆ తప్పిపోయిన గుర్రానికి బదులుగా ఒక మానవ-జంతువుని తీసుకురావలసి వచ్చింది. ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఋషికా ఋషి కుమారుడు మరియు విశ్వామిత్రుని మేనల్లుడు అయిన శునాశేప అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు ధన మార్పిడిని అందజేస్తాడు.

శునఃశేపవిక్రయః

విశ్వామిత్రో మహాత్మాథ ప్రస్థితాన్ప్రేక్ష్య తానృషీన్ |
అబ్రవీన్నరశార్దూలః సర్వాంస్తాన్వనవాసినః ||

1

మహావిఘ్నః ప్రవృత్తోఽయం దక్షిణామాస్థితో దిశమ్ |
దిశమన్యాం ప్రపత్స్యామస్తత్ర తప్స్యామహే తపః ||

2

పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః |
సుఖం తపశ్చరిష్యామో పరం తద్ధి తపోవనమ్ ||

3

ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః |
తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ||

4

ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః |
అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే ||

5

తస్య వై యజమానస్య పశుమింద్రో జహార హ |
ప్రణష్టే తు పశౌ విప్రో రాజానమిదమబ్రవీత్ ||

6

పశురద్య హృతో రాజన్ప్రణష్టస్తవ దుర్నయాత్ |
అరక్షితారం రాజానం ఘ్నంతి దోషా నరేశ్వర ||

7

ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతన్నరం వా పురుషర్షభ |
ఆనయస్వ పశుం శీఘ్రం యావత్కర్మ ప్రవర్తతే ||

8

ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభ |
అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహస్రశః ||

9

దేశాంజనపదాంస్తాంస్తాన్నగరాణి వనాని చ |
ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః ||

10

స పుత్రసహితం తాత సభార్యం రఘునందన |
భృగుతుంగే సమాసీనమృచీకం సందదర్శ హ ||

11

తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రసాద్య చ |
బ్రహ్మర్షి తపసా దీప్తం రాజర్షిరమితప్రభః ||

12

పృష్ట్వా సర్వత్ర కుశలమృచీకం తమిదం వచః |
గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది ||

13

పశోరర్థే మహాభాగ కృతకృత్యోఽస్మి భార్గవ |
సర్వే పరిసృతా దేశా యజ్ఞీయం న లభే పశుమ్ ||

14

దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ |
ఏవముక్తో మహాతేజా ఋచీకస్త్వబ్రవీద్వచః ||

15

నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన |
ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్ ||

16

ఉవాచ నరశార్దూలమంబరీషమిదం వచః | [తపస్వినీ]
అవిక్రేయం సుతం జ్యేష్ఠం భగవానాహ భార్గవః ||

17

మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప |
తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ ||

18

ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః |
మాతౄణాం చ కనీయాంసస్తస్మాద్రక్షే కనీయసమ్ ||

19

ఉక్తవాక్యే మునౌ తస్మిన్మునిపత్న్యాం తథైవ చ |
శునఃశేపః స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్ ||

20

పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసమ్ |
విక్రీతం మధ్యమం మన్యే రాజన్పుత్రం నయస్వ మామ్ ||

21

[* అధికశ్లోకం –
అథ రాజా మహాన్రామ వాక్యాంతే బ్రహ్మవాదినః |
హిరణ్యస్య సువర్ణస్య కోటిభీ రత్నరాశిభిః ||
*]

గవాం శతసహస్రేణ శునఃశేపం నరేశ్వరః |
గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన ||

22

అంబరీషస్తు రాజర్షీ రథమారోప్య సత్వరః |
శునఃశేపం మహాతేజా జగామాశు మహాయశాః ||

23

Balakanda Sarga 61 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ ఆ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిను ఋషులతో ఇలా అన్నాడు. “ఇప్పటి వరకూ నేను దక్షిణ దిక్కున తపస్సు చేసాను. ఇక్కడ అన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసు కుంటాను.”అని అన్నాడు.

ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేసాడు.

అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు, యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“రాజా! యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా లేక పోతే పశు వుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది.” అని అన్నాడు పురోహితుడు.

అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేక పోయింది. ఆ సమయంలో ఋచీకుడు అనే మహర్షి తన భార్యా పుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

అంబరీషుడు ఆ ఋచీకమహర్షి వద్దకు వెళ్లాడు. జరిగినది అంతా చెప్పాడు. “ ఓ మహర్షీ! నేను నీకు లక్ష ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా!” అని అడిగాడు.

“లేదు. నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా!” అని అన్నాడు.

ఋచీకుని భార్య ఇలా అంది. “నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను.” అని చెప్పింది.

ఋచీకునకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“ఓ అంబరీషా! పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటంలేదు అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్లండి.” అని అన్నాడు.

అంబరీషుడు సంతోషంగా ఋచీకునకు లక్షగోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకొని వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విషష్టితమః సర్గః (62) >>

Balakanda Sarga 72 In Telugu – బాలకాండ ద్విసప్తతితమః సర్గః

Balakanda Sarga 72 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విసప్తతితమః సర్గలో యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని సిధాశ్రమానికి తీసుకువెళతాడు. యజ్ఞం సమయంలో రాక్షసులు సుబాహు, మారీచు దాడి చేస్తారు. రాముడు సుబాహును వధించి, మారీచును దూరంగా తరిమేస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకువెళతాడు.

|| గోదానమంగళమ్ ||

తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః |
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్ ||

1

అచింత్యాన్యప్రమేయాని కులాని నరపుంగవ |
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోఽస్తి కశ్చన ||

2

సదృశో ధర్మసంబంధః సదృశో రూపసంపదా |
రామలక్ష్మణయో రాజన్సీతా చోర్మిలయా సహ ||

3

వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ |
భ్రాతా యవీయాన్ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః ||

4

అస్య ధర్మాత్మనో రాజన్రూపేణాప్రతిమం భువి |
సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే ||

5

భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః |
వరయేమ సుతే రాజంస్తయోరర్థే మహాత్మనోః ||

6

పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః |
లోకపాలోపమాః సర్వే దేవతుల్యపరాక్రమాః ||

7

ఉభయోరపి రాజేంద్ర సంబంధో హ్యనుబధ్యతామ్ |
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః ||

8

విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా |
జనకః ప్రాంజలిర్వాక్యమువాచ మునిపుంగవౌ ||

9

కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ |
సదృశం కులసంబంధం యదాజ్ఞాపయథః స్వయమ్ ||

10

ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే |
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ ||

11

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే |
పాణీన్గృహ్ణంతు చత్వారో రాజపుత్రా మహాబలాః ||

12

ఉత్తరే దివసే బ్రహ్మన్ఫల్గునీభ్యాం మనీషిణః |
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః ||

13

ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః |
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్ ||

14

పరో ధర్మః కృతో మహ్యం శిష్యోఽస్మి భవతోః సదా |
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ ||

15

యథా దశరథస్యేయం తథాఽయోధ్యా పురీ మమ |
ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హథ ||

16

తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః |
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్ ||

17

యువామసంఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ |
ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః ||

18

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్ |
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్ ||

19

తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా |
మునీంద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహాయశాః ||

20

స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః |
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్ ||

21

గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః |
ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః ||

22

సువర్ణశృంగాః సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః |
గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః ||

23

విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునందనః |
దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః ||

24

స సుతైః కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా |
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతిః ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విసప్తతితమః సర్గః ||

Balakanda Sarga 72 Meaning In Telugu

జనకుని మాటలు విన్న వసిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహాఋషులు జనకునితో ఇలా అన్నారు.

“ఓ జనకమహారాజా! అటు ఇక్ష్వాకు వంశము, ఇటు విదేహ వంశమూ రెండూ విశిష్టమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చెయ్యడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగిఉన్నది.

ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అంద చందములలోనూ, రూప లావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామ లక్ష్మణు లకు ఏ విధంగానూ తీసి పోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు ధృడమైన సంబంధ బాంధవ్యుములు కలిగి ఉంటాయి.” అని పలికారు.

ఆ మాటలు విన్న జనకుడు, వసిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు.’ .” ఓ మునిశ్రేష్ఠులారా! మీ సంబంధములతో నేను నా
తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శ్రుతకీర్తి లను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నాతమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. ఈ నాలుగు వివాహములు ఒకే రోజున ఒకే సమయములో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాను.

ఉత్తర ఫల్గునీ నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభనక్షత్రములో ఈ నాలుగు వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహ రాజ్యములు ఒకటవుతాయి.” అని వినయంతో పలికాడు జనకుడు.

ఆమాటలు విన్న దశరథుడు ఇలాఅన్నాడు. “ఓ జనక మహారాజా! నీవు, నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు. ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనంద దాయకము. నేను ఇంక మా నివాసమునకు వెళ్ళెదను. నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధకర్మలను, దానములను నిర్వర్తింప జేస్తాను.” అని పలికాడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్లాడు. ఆరోజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను నిర్వర్తింపజేసాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారునిచేత లక్ష గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారులచేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులు నాలుగులక్షల ఆవులను ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు.

(ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధ కర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధ కర్మలు అంటే శుభకార్యము జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవచ్చు)

శ్రీమద్రామాయణము
బాలకాండము, డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ త్రిసప్తతితమః సర్గః (73) >>

Balakanda Sarga 70 In Telugu – బాలకాండ సప్తతితమః సర్గః

Balakanda Sarga 70 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ సప్తతితమః సర్గలో రాముడు విశ్వామిత్రునితో కలిసి సిధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ పుత్రకామేష్ఠి యాగం జరుగుతుంది. యాగం సమయంలో రావణుడు, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు యాగాన్ని భగ్నం చేయడానికి వస్తారు. రాముడు, లక్ష్మణుడు వీరిని వధించి యాగాన్ని రక్షిస్తారు. యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, అగ్నిదేవుడు దశరథ మహారాజుకు పాయసం అందిస్తాడు, దానిని సంతానము కోసం పంపిస్తారు.

|| కన్యావరణమ్ ||

తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః |
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితమ్ ||

1

భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మికః |
కుశధ్వజ ఇతి ఖ్యాతః పురీమధ్యవసచ్ఛుభామ్ ||

2

వార్యాఫలకపర్యంతాం పిబన్నిక్షుమతీం నదీమ్ |
సాంకాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్ ||

3

తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా స మే మతః |
ప్రీతిం సోఽపి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ ||

4

ఏవముక్తే తు వచనే శతానందస్య సన్నిధౌ |
ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్సమాదిశత్ ||

5

శాసనాత్తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః |
సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా ||

6

సాంకాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్ |
న్యవేదయన్యథావృత్తం జనకస్య చ చింతితమ్ ||

7

తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః |
ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజః ||

8

స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్ |
సోఽభివాద్య శతానందం రాజానాం చాతిధార్మికమ్ ||

9 [జనకం]

రాజార్హం పరమం దివ్యమాసనం సోఽధ్యరోహత |
ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావమితౌజసౌ ||

10

ప్రేషయామాసతుర్వీరౌ మంత్రిశ్రేష్ఠం సుదామనమ్ |
గచ్ఛ మంత్రిపతే శీఘ్రమైక్ష్వాకమమితప్రభమ్ ||

11

ఆత్మజైః సహ దుర్ధర్షమానయస్వ సమంత్రిణమ్ |
ఔపకార్యాం స గత్వా తు రఘూణాం కులవర్ధనమ్ ||

12

దదర్శ శిరసా చైనమభివాద్యేదమబ్రవీత్ |
అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః ||

13

సత్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయపురోహితమ్ |
మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా ||

14

సబంధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే |
స రాజా మంత్రిసహితః సోపాధ్యాయః సబాంధవః ||

15

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్ |
విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతమ్ ||

16

వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవానృషిః |
విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః ||

17

ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠస్తే యథాక్రమమ్ |
తూష్ణీం‍భూతే దశరథే వసిష్ఠో భగవానృషిః ||

18

ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోహితమ్ | [పురోధసమ్]
అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః ||

19

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః |
వివస్వాన్కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః ||

20

మనుః ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోః సుతః |
తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ ||

21

ఇక్ష్వాకోఽస్తు సుతః శ్రీమాన్కుక్షిరిత్యేవ విశ్రుతః |
కుక్షేరథాత్మజః శ్రీమాన్వికుక్షిరుదపద్యత ||

22

వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్ |
బాణస్య తు మహాతేజా అనరణ్యో మహాయశాః ||

23 [ప్రతాపవాన్]

అనరణ్యాత్పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోః సుతః |
త్రిశంకోరభవత్పుత్రో ధుంధుమారో మహాయశాః ||

24

ధుంధుమారాన్మహాతేజా యువనాశ్వో మహాబలః |
యువనాశ్వసుతస్త్వాసీన్మాంధాతా పృథివీపతిః ||

25

మాంధాతుస్తు సుతః శ్రీమాన్సుసంధిరుదపద్యత |
సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ ||

26

యశస్వీ ధ్రువసంధేస్తు భరతో నామ నామతః |
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్ ||

27

యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశబిందవః ||

28

తాంస్తు స ప్రతియుధ్యన్వై యుద్ధే రాజ్యాత్ప్రవాసితః |
హిమవంతముపాగమ్య భార్యాభ్యాం సహితస్తదా ||

29

అసితోఽల్పబలో రాజా కాలధర్మముపేయివాన్ |
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్ ||

30

ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ |
తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః ||

31

భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః |
తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్ ||

32

వవందే పద్మపత్రాక్షీ కాంక్షంతీ సుతముత్తమమ్ | [ఆత్మనః]
తమృషిం సాఽభ్యుపాగమ్య కాలిందీ చాభ్యవాదయత్ ||

33

స తామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని |
తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాయశాః ||

34 [బలః]

మహావీర్యో మహాతేజా అచిరాత్సంజనిష్యతి |
గరేణ సహితః శ్రీమాన్మా శుచః కమలేక్షణే ||

35

చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా |
పతిశోకాతురా తస్మాత్పుత్రం దేవీ వ్యజాయత ||

36

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
సహ తేన గరేణైవ జాతః స సగరోఽభవత్ ||

37

సగరస్యాసమంజస్తు అసమంజాత్తథాంశుమాన్ |
దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః ||

38

భగీరథాత్ కకుత్స్థోఽభూత్ కకుత్స్థస్య రఘుః సుతః |
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః ||

39

కల్మాషపాదో హ్యభవత్తస్మాజ్జాతశ్చ శంఖణః |
సుదర్శనః శంఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్ ||

40

శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః సుతః |
మరోః ప్రశుశ్రుకస్త్వాసీదంబరీషః ప్రశుశ్రుకాత్ ||

41

అంబరీషస్య పుత్రోఽభూన్నహుషః సత్యవిక్రమః | [పృథివీపతిః]
నహుషస్య యయాతిశ్చ నాభాగస్తు యయాతిజః ||

42

నాభాగస్య బభూవాజో అజాద్దశరథోఽభవత్ |
అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

43

ఆదివంశవిశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణామ్ |
ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినామ్ ||

44

రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప |
సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ||

45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తతితమః సర్గః ||

Balakanda Sarga 70 Meaning In Telugu

మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తిచేసాడు. తనపురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు.

“శతానందులవారూ! మా తమ్ముడు శతధ్వజుని, ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకని సోదరుడు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకాశ్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాశ్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్మానించారు.

వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్టుడు అయిన సుదాముని దశరథమహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకొని వచ్చుటకు పంపారు.

సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు.

దశరథునితో ఇలా అన్నాడు.

“దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడు.

సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు, ఋషులు వెంట రాగా, జనకుని వద్దకు వెళ్లాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు.

“ఓ జనక మహారాజా! మా కులగురువు, వసిష్ఠుడు అని మీకు తెలియును కదా! బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వసిష్ఠుడు తమరికి మా వంశ వృక్షము గురించి, మా వంశములోని పూర్వ రాజుల గురించి వివరంగా చెప్పగలడు.” అని పలికి దశరథుడు వసిష్ఠునని వంక చూచాడు.

దశరథుని మాటలు విన్న వసిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుని, సదానందుని చూచి ఇలా అన్నాడు.

“ఓ జనకమహారాజా! సభాసదులారా! ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోవుచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటి సారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆ వించింది.

ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుని కుమారుడు మాంధాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధికి ఇరువురు కుమారులు వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు అసితుడు.

హైహయ రాజులైన హైహయుడు, తాలజంఘుడు, శశిబిందు అనువారు అసితునితో శతృత్వము వహించారు. వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు.

ఆ సమయములో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భస్రావము అగుటకు విషప్రయోగము చేసింది. ఆ సమయములోనే భృగు వంశములో పుట్టిన చ్యవనుడు అక్కడకు రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశ్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగము జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చ్యవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది.

చ్యవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి “ఓ భాగ్యశాలీ! నీ గర్భములో మహా బలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహా వీరుడు. తేజశ్శాలి. ఆ కుమారుడు నీ శరీరములో ఉన్న విషముతో కూడా జన్మించగలడు.” అని పలికాడు. చ్యవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజశ్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు.

ఆ సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమిమీదికి తీసుకొని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుత్తుడు. కకుత్తుని కుమారుడు రఘువు. ఆయన పేరుమీదనే రఘువంశము మొదలయింది.

రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాప వశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మాషపాదుడు అనే పేరుకూడా ఉంది. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురు. శ్రీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుక్రుడు. ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు.

అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథమహారాజు. ఈ దశరథమహారాజు పుత్రులే రామలక్ష్మణులు.

ఓ జనక మహారాజా! వీరి వంశక్రమము వింటివి కదా! వీరు మొదటి నుండీ విశుద్ధమైన వంశములో పుట్టినవారు. పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు. వీరులు. సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహము చేయడం శుభప్రదము.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్భయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Balakanda Sarga 59 In Telugu – బాలకాండ ఏకోనషష్ఠితమః సర్గః

Balakanda Sarga 59 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనషష్ఠితమః సర్గలో, విశ్వామిత్రుడు త్రిశంకు యొక్క వైదిక కర్మను చేపట్టాడు మరియు వేద పండితులందరినీ ఆహ్వానించడానికి శిష్యులను పంపుతాడు. వశిష్ఠుడు మరియు అతని కుమారులు తప్ప చాలా మంది ఋషులు వచ్చారు. ఇంకా, వశిష్ట కుమారులు విశ్వామిత్ర మరియు త్రిశంకు యొక్క ఈ ఆచారాన్ని అపహాస్యం చేసారు. విశ్వామిత్రుడు విసుగు చెంది వశిష్ట కుమారులపై శాపనార్థాలు పెట్టాడు.

వాసిష్ఠశాపః

ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః |
అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచ్చండాలరూపిణమ్ ||

1

ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్ |
శరణం తే భవిష్యామి మా భైషీర్నృపపుంగవ ||

2

అహమామంత్రయే సర్వాన్మహర్షీన్పుణ్యకర్మణః |
యజ్ఞసాహ్యకరాన్రాజంస్తతో యక్ష్యసి నిర్వృతః ||

3

గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే |
అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి ||

4

హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప |
యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః ||

5

ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్పరమధార్మికాన్ |
వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్యజ్ఞసంభారకారణాత్ ||

6

సర్వాన్ శిష్యాన్సమాహూయ వాక్యమేతదువాచ హ |
సర్వానృషిగణాన్ వత్సా ఆనయధ్వం మమాజ్ఞయా ||

7

సశిష్యసుహృదశ్చైవ సర్త్విజః సుబహుశ్రుతాన్ |
యదన్యో వచనం బ్రూయాన్మద్వాక్యబలచోదితః ||

8

తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా ||

9

ఆజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః |
తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలితతేజసమ్ ||

10

ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినామ్ |
శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః ||

11

సర్వదేశేషు చాగచ్ఛన్వర్జయిత్వా మహోదయమ్ |
వాసిష్ఠం తచ్ఛతం సర్వం క్రోధపర్యాకులాక్షరమ్ ||

12

యదాహ వచనం సర్వం శృణు త్వం మునిపుంగవ |
క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః ||

13

కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః |
బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాలభోజనమ్ ||

14

కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః |
ఏతద్వచననైష్ఠుర్యమూచుః సంరక్తలోచనాః ||

15

వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః |
తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః ||

16

క్రోధసంరక్తనయనః సరోషమిదమబ్రవీత్ |
యే దూషయంత్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితమ్ ||

17

భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః |
అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్ ||

18

సప్త జాతిశతాన్యేవ మృతపాః సంతు సర్వశః |
శ్వమాంసనియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః ||

19

వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్ |
మహోదయశ్చ దుర్బుద్ధిర్మామదూష్యం హ్యదూషయత్ ||

20

దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి |
ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః ||

21

దీర్ఘకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి |
ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః |
విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః ||

22

Balakanda Sarga 59 In Telugu Pdf With Meaning

ఛండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలి పడ్డాడు. అతని తో ఇలా అన్నాడు.

“ఓ త్రిశంకూ! బాధ పడకు. నిన్ను, నీ కోరికను, నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయ పడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహా ఋషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ ఛండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయంలేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు.

విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. “మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి.”అని ఆజ్ఞాపించాడు.

విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు అందరూ నలు దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు.

“గురువు గారూ! తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. కాని మహోదయుడు, వసిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్న వారు ఈ విధంగా అన్నారు.

‘ఒక ఛండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం. దానిని ఒక క్షత్రియు డైన విశ్వామిత్రుడు చేయించడం. బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు. క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని ఛండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసినవారు బ్రాహ్మణులైనా, ఋషులైనా వారు స్వర్గానికి ఎలావెళతారు? ఇది సంభవమా!’

అని చాలా దుర్భాషలాడారు గురువు గారూ!” అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు.

ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. “ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా! వసిష్టకుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ ఏడు వందల జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలాకాలము నిషాదుడుగా జీవిస్తాడు.” అని శపించాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షష్టితమః సర్గః (60) >>