Ayodhya Kanda Sarga 14 In Telugu – అయోధ్యాకాండ చతుర్దశః సర్గః

Ayodhya Kanda Sarga 14

“రామాయణం” లో అయోధ్యాకాండ చతుర్దశః సర్గం (14వ సర్గ) చాలా ముఖ్యమైనది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు వనవాసానికి బయలుదేరడం ప్రారంభమవుతుంది. రాముడు తన తల్లి కౌసల్యతో వీడ్కోలు చెబుతాడు. కౌసల్య తన బాధను వ్యక్తం చేస్తుంది, కానీ రాముడు ఆమెను సాంత్వన చేస్తాడు మరియు ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని వివరిస్తాడు. తదుపరి, రాముడు తన సోదరి శాంతాతో మరియు సుమిత్రతో కూడా వీడ్కోలు చెప్పి ఆశీర్వాదాలను పొందుతాడు. సుమిత్ర తన కుమారుడు లక్ష్మణుని ధైర్యాన్ని ప్రశంసిస్తుంది మరియు రాముని సేవ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సర్గలో, రాముడు, సీత మరియు లక్ష్మణులు రథంలో బయలుదేరి, అయోధ్య నగరాన్ని విడిచిపోతారు. ప్రజలు తీవ్ర విచారంలో వీరి వెంబడి నడుస్తారు, కానీ రాముడు వారిని సాంత్వన చేస్తాడు. రాముడి ధైర్యం, విధేయత మరియు ధర్మపరమైన కట్టుబాట్లు ఈ సర్గలో స్పష్టంగా కనిపిస్తాయి.

కైకేయ్యుపాలంభః

పుత్రశోకార్దితం పాపా విసంజ్ఞం పతితం భువి |
వివేష్టమానముద్వీక్ష్య సైక్ష్వాకమిదమబ్రవీత్ || ౧ ||

పాపం కృత్వైవ కిమిదం మమ సంశ్రుత్య సంశ్రవమ్ |
శేషే క్షితితలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి || ౨ ||

ఆహుః సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనాః |
సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రచోదితః || ౩ ||

సంశ్రుత్య శైబ్యః శ్యేనాయ స్వాం తనుం జగతీపతిః |
ప్రదాయ పక్షిణో రాజన్ జగామ గతిముత్తమామ్ || ౪ ||

తథా హ్యలర్కస్తేజస్వీ బ్రాహ్మణే వేదపారగే |
యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్యావిమనా దదౌ || ౫ ||

సరితాం తు పతిః స్వల్పాం మర్యాదాం సత్యమన్వితః |
సత్యానురోధాత్సమయే వేలాం స్వాం నాతివర్తతే || ౬ ||

సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః |
సత్యమేవాక్షయా వేదాః సత్యేనైవాప్యతే పరమ్ || ౭ ||

సత్యం సమనువర్తస్వ యది ధర్మే ధృతా మతిః |
స వరః సఫలో మేఽస్తు వరదో హ్యసి సత్తమ || ౮ ||

ధర్మస్యేహాభికామార్థం మమ చైవాభిచోదనాత్ |
ప్రవ్రాజయ సుతం రామం త్రిః ఖలు త్వాం బ్రవీమ్యహమ్ || ౯ ||

సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి |
అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి జీవితమ్ || ౧౦ ||

ఏవం ప్రచోదితో రాజా కైకేయ్యా నిర్విశంకయా |
నాశకత్పాశమున్మోక్తుం బలిరింద్రకృతం యథా || ౧౧ ||

ఉద్భ్రాంతహృదయశ్చాపి వివర్ణవదనోఽభవత్ |
స ధుర్యో వై పరిస్పందన్యుగచక్రాంతరం యథా || ౧౨ ||

విహ్వలాభ్యాం చ నేత్రాభ్యామపశ్యన్నివ భూపతిః | [భూమిపః]
కృచ్ఛ్రాద్ధైర్యేణ సంస్తభ్య కైకేయీమిదమబ్రవీత్ || ౧౩ ||

యస్తే మంత్రకృతః పాణిరగ్నౌ పాపే మయా ధృతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహ || ౧౪ ||

ప్రయాతా రజనీ దేవి సూర్యస్యోదయనం ప్రతి |
అభిషేకం గురుజనస్త్వరయిష్యతి మాం ధ్రువమ్ || ౧౫ ||

రామాభిషేకసంభారైస్తదర్థముపకల్పితైః |
రామః కారయితవ్యో మే మృతస్య సలిలక్రియామ్ || ౧౬ ||

త్వయా సపుత్రయా నైవ కర్తవ్యా సలిలక్రియా |
వ్యాహంతాఽస్యశుభాచారే యది రామాభిషేచనమ్ || ౧౭ ||

న చ శక్తోఽస్మ్యహం ద్రష్టుం దృష్ట్వా పూర్వం తథా సుఖమ్ | [శక్నోమ్యహం]
హతహర్షం నిరానందం పునర్జనమవాఙ్ముఖమ్ || ౧౮ ||

తాం తథా బ్రువతస్తస్య భూమిపస్య మహాత్మనః |
ప్రభాతా శర్వరీ పుణ్యా చంద్రనక్షత్రశాలినీ || ౧౯ ||

తతః పాపసమాచారా కైకేయీ పార్థివం పునః |
ఉవాచ పరుషం వాక్యం వాక్యజ్ఞా రోషమూర్ఛితా || ౨౦ ||

కిమిదం భాషసే రాజన్వాక్యం గరరుజోపమమ్ |
ఆనాయయితుమక్లిష్టం పుత్రం రామమిహార్హసి || ౨౧ ||

స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరమ్ |
నిఃసపత్నాం చ మాం కృత్వా కృతకృత్యో భవిష్యసి || ౨౨ ||

స నున్న ఇవ తీక్ష్ణేన ప్రతోదేన హయోత్తమః |
రాజా ప్రచోదితోఽభీక్ష్ణం కైకేయీమిదమబ్రవీత్ || ౨౩ ||

ధర్మబంధేన బద్ధోఽస్మి నష్టా చ మమ చేతనా |
జ్యేష్ఠం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్ఛామి ధార్మికమ్ || ౨౪ ||

తతః ప్రభాతాం రజనీముదితే చ దివాకరే |
పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే || ౨౫ ||

వసిష్ఠో గుణసంపన్నః శిష్యైః పరివృతస్తదా |
ఉపసంగృహ్య సంభారాన్ప్రవివేశ పురోత్తమమ్ || ౨౬ || [ఉపగౄహ్యాశు]

సిక్తసమ్మార్జితపథాం పతాకోత్తమభూషితామ్ |
విచిత్రకుసుమాకీర్ణాం నానాస్రగ్భిర్విరాజితామ్ || ౨౭ ||

సంహృష్టమనుజోపేతాం సమృద్ధవిపణాపణామ్ |
మహోత్సవసమాకీర్ణాం రాఘవార్థే సముత్సుకామ్ || ౨౮ ||

చందనాగరుధూపైశ్చ సర్వతః ప్రతిధూపితామ్ |
తాం పురీం సమతిక్రమ్య పురందరపురోపమామ్ || ౨౯ ||

దదర్శాంతఃపురం శ్రేష్ఠం నానాద్విజగణాయుతమ్ |
పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణైరుపశోభితమ్ || ౩౦ ||

యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః |
తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామ తం జనమ్ || ౩౧ ||

వసిష్ఠః పరమప్రీతః పరమర్షిర్వివేశ చ |
సత్వపశ్యద్వినిష్క్రాంతం సుమంత్రం నామ సారథిమ్ || ౩౨ ||

ద్వారే తు రాజసింహస్య సచివం ప్రియదర్శనమ్ |
తమువాచ మహాతేజాః సూతపుత్రం విశారదమ్ || ౩౩ ||

వసిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిహాగతమ్ |
ఇమే గంగోదకఘటాః సాగరేభ్యశ్చ కాంచనాః || ౩౪ ||

ఔదుంబరం భద్రపీఠమభిషేకార్థమాహృతమ్ | [మాగతమ్]
సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ || ౩౫ ||

క్షౌద్రం దధి ఘృతం లాజాః దర్భాః సుమనసః పయః |
అష్టౌ చ కన్యా రుచిరాః మత్తశ్చ వరవారణః || ౩౬ ||

చతురశ్వో రథః శ్రీమాన్నిస్త్రింశో ధనురుత్తమమ్ |
వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశిసన్నిభమ్ || ౩౭ ||

శ్వేతే చ వాలవ్యజనే భృంగారశ్చ హిరణ్మయః |
హేమదామపినద్ధశ్చ కకుద్మాన్పాండరో వృషః || ౩౮ ||

కేసరీ చ చతుర్దంష్ట్రో హరిశ్రేష్ఠో మహాబలః |
సింహాసనం వ్యాఘ్రతనుః సమిద్ధశ్చ హుతాశనః || ౩౯ ||

సర్వవాదిత్రసంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతాః స్త్రియః |
ఆచార్యా బ్రాహ్మణా గావః పుణ్యాశ్చ మృగపక్షిణః || ౪౦ ||

పౌరజానపదశ్రేష్ఠాః నైగమాశ్చ గణైః సహ |
ఏతే చాన్యే చ బహవః ప్రీయమాణాః ప్రియంవదాః || ౪౧ || [నీయమానాః]

అభిషేకాయ రామస్య సహ తిష్ఠంతి పార్థివైః |
త్వరయస్వ మహారాజం యథా సముదితేఽహని || ౪౨ ||

పుణ్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్ | [పుష్యే]
ఇతి తస్య వచః శ్రుత్వా సూతపుత్రో మహాత్మనః || ౪౩ ||

స్తువన్నృపతిశార్దూలం ప్రవివేశ నివేశనమ్ |
తం తు పూర్వోదితం వృద్ధం ద్వారస్థా రాజసమ్మతమ్ || ౪౪ ||

న శేకురభిసంరోద్ధుం రాజ్ఞః ప్రయచికీర్షవః |
స సమీపస్థితో రాజ్ఞస్తామవస్థామజజ్ఞివాన్ || ౪౫ ||

వాగ్భిః పరమతుష్టాభిరభిష్టోతుం ప్రచక్రమే |
తతః సూతో యథాకాలం పార్థివస్య నివేశనే || ౪౬ ||

సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతిమ్ |
యథా నందతి తేజస్వీ సాగరో భాస్కరోదయే || ౪౭ ||

ప్రీతః ప్రీతేన మనసా తథాఽఽనందఘనః స్వతః |
ఇంద్రమస్యాం తు వేలాయామభితుష్టావ మాతలిః || ౪౮ ||

సోఽజయద్దానవాన్సర్వాంస్తథా త్వాం బోధయామ్యహమ్ |
వేదాః సహాంగవిద్యాశ్చ యథాహ్యాత్మభువం విభుమ్ || ౪౯ ||

బ్రహ్మాణం బోధయంత్యద్య తథా త్వాం బోధయామ్యహమ్ |
ఆదిత్యః సహ చంద్రేణ యథా భూతధరాం శుభామ్ || ౫౦ ||

బోధయత్యద్య పృథివీం తథా త్వాం బోధయామ్యహమ్ |
ఉత్తిష్ఠాశు మహారాజ కృతకౌతుకమంగళః || ౫౧ ||

విరాజమానో వపుషా మేరోరివ దివాకరః |
సోమసూర్యౌ చ కాకుత్స్థ శివవైశ్రవణావపి || ౫౨ ||

వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే |
గతా భగవతీ రాత్రిః కృతం కృత్యమిదం తవ || ౫౩ ||

బుద్ధ్యస్వ నృపశార్దూల కురుకార్యమనంతరమ్ |
ఉపతిష్ఠతి రామస్య సమగ్రమభిషేచనమ్ || ౫౪ || [ఉదతిష్ఠత]

పౌరజానపదైశ్చాపి నైగమైశ్చ కృతాంజలిః |
అయం వసిష్ఠో భగవాన్బ్రాహ్మణైః సహ తిష్ఠతి || ౫౫ || [స్వయం]

క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్రాఘవస్యాభిషేచనమ్ |
యథా హ్యపాలాః పశవో యథా సేనా హ్యానాయకా || ౫౬ ||

యథా చంద్రం వినా రాత్రిర్యథా గావో వినా వృషమ్ |
ఏవం హి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే || ౫౭ ||

ఇతి తస్య వచః శృత్వా సాంత్వపూర్వమివార్థవత్ |
అభ్యకీర్యత శోకేన భూయ ఏవ మహీపతిః || ౫౮ ||

తతః స రాజా తం సూతం సన్నహర్షః సుతం ప్రతి |
శోకరక్తేక్షణః శ్రీమానుద్వీక్ష్యోవాచ ధార్మికః || ౫౯ ||

వాక్యైస్తు ఖలు మర్మాణి మమ భూయో నికృంతసి |
సుమంత్రః కరుణం శ్రుత్వా దృష్ట్వా దీనం చ పార్థివమ్ || ౬౦ ||

ప్రగృహీతాంజలిః కించిత్ తస్మాద్దేశాదపాక్రమత్ |
యదా వక్తుం స్వయం దైన్యాత్ న శశాక మహీపతిః || ౬౧ ||

తదా సుమంత్రం మంత్రజ్ఞా కైకేయీ ప్రత్యువాచ హ |
సుమంత్ర రాజా రజనీం రామహర్షసముత్సుకః || ౬౨ ||

ప్రజాగరపరిశ్రాంతో నిద్రాయా వశమేయివాన్ |
తద్గచ్ఛ త్వరితం సూత రాజపుత్రం యశస్వినమ్ || ౬౩ ||

రామమానయ భద్రం తే నాత్ర కార్యా విచారణా |
స మన్యమానః కళ్యాణం హృదయేన ననంద చ || ౬౪ ||

నిర్జగామ చ సంప్రీత్యా త్వరితో రాజశాసనాత్ |
సుమంత్రశ్చింతయామాస త్వరితం చోదితస్తయా || ౬౫ ||

వ్యక్తం రామోఽభిషేకార్థమిహాయాస్యతి ధర్మవిత్ |
ఇతి సూతో మతిం కృత్వా హర్షేణ మహతాఽఽవృతః || ౬౬ ||

నిర్జగామ మహాబాహూ రాఘవస్య దిదృక్షయా |
సాగరహ్రదసంకాశాత్సుమంత్రోంతఃపురాచ్ఛుభాత్ |
నిష్క్రమ్య జనసంబాధం దదర్శ ద్వారమగ్రతః || ౬౭ ||

తతః పురస్తాత్సహసా వినిర్గతో
మహీభృతో ద్వారగతాన్విలోకయన్ | [పతీన్]
దదర్శ పౌరాన్వివిధాన్మహాధనా-
-నుపస్థితాన్ద్వారముపేత్య విష్ఠితాన్ || ౬౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశః సర్గః || ౧౪ ||

Ayodhya Kanda Sarga 14 Meaning In Telugu

కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది.
“ఓ దశరథమహారాజా! నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న వరాలు రెండింటి ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేల మీదపడి దొర్లి దొర్లి ఏడవవలెనా! ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా! ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటం ఏనాటినుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడినమాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు. మీపూర్వులైన శిబిచక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరూ అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం.

“సత్యము పరబ్రహ్మస్వరూపము. ధర్మమునకు సత్యమే మూలము” అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు. తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మనిరతిని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిటబెట్టుకోమంటున్నాను. ధర్మము పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరడం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈ నాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట వద్దు. “రాముని అడవులకు పంపాలి”, “రాముని అడవులకు పంపాలి” “రాముని అడవులకు పంపాలి” అని మూడు మార్లు నొక్కి చెబుతున్నాను.

ఓ దశరథమహారాజా! మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్టయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదలిన భార్యకు మరణమే శరణ్యము అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగము చేసుకుంటాను. ఇది తథ్యము.” అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటి పోయింది. రామునికి వనవాసము తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయము బరువెక్కింది. ముఖము వివర్ణమయింది. కళ్లు కనిపించడం లేదు.

మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ” ఓసీ పాపీ! కైకా! అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేసాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇంక నీకూ నాకూ సంబంధం లేదు. నీవునా భార్యవు కావు. భరతుడు నా కుమారుడూ కాడు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదల నవసరము లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు.

రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేసారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దు:ఖములో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను.” అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెల తెల వారుతూ ఉంది.పక్షులు కిల కిలారావాలు చేస్తున్నాయి. కాని కైకకు ఇవేమీ పట్టలేదు. తనపట్టు నెగ్గించు కోవాలనే కోరిక తప్ప. అందుకే దీనంగా నేలమీద పడి ఉన్న దశరథుని చూచి ఇలా అంది.

” ఓ దశరథమహారాజజా! ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు. జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముని పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముని వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది. త్వరగా కానివ్వండి.” అని తొందరపెట్టింది.

ఆ మాటలకు దశరథుడు చెళ్లున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధిపనిచేయడం మాని వేసింది.
“నేను ధర్మానికి కట్టుబడ్డాను. ధర్మబద్ధుడను. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి.” అని అన్నాడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. వసిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకొని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు.

అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు. తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాలనుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకము చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారు.

వసిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వసిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్యనుండి దారి చేసుకుంటూ రాజభవనము లోకి ప్రవేశించాడు. సుమంత్రుడు వసిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించాడు. “సుమంత్రా! నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగాజలమూ, పుణ్య నదీజలములు, సముద్రజలము సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలూ, పూలు, పాలు, కన్యముత్తయిదువలు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలశములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రములు, పులి చర్మమూ, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్యాప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయము అయింది.

శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్రా! నీవు రాజు గారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి, తొందరగా సిద్ధంకమ్మను.” అని అన్నాడు వసిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంత్రుడు వసిష్ఠునికి నమస్కరించి దశరధుని వద్దకు వెళ్లాడు. అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంత్రునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలెట్టాడు. “మహారాజు దశరథులవారికి జయీభవ. విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషించు గాక! దేవేంద్రుని సారధి మాతలి ఇంద్రుని స్తుతించి నట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు, వేదవేదాంగ ములను సృష్టించిన వాడూ అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నారు. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడూ వచ్చి భూదేవిని మేల్కొలిపి నట్టు నేను తమరిని మేల్కొలుపుతున్నాను.

ఓ మహారాజా! సూర్యోదయము అయింది. రామ పట్టాభి షేకమునకు కావాల్సిన సంభారములు అన్ని సిద్ధంచేయబడ్డాయి. ఓ దశరథమహారాజా! తమరు వెంటనే మేల్కొని మంగళ స్నానం చేసి, రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వసిష్ఠులవారి ఆదేశము. ఓ మహారాజా! తమరికి సూర్య చంద్రులు, శివకేశవులు, అగ్ని వరుణుడు, ఇంద్రుడు తమరికి సకలైశ్వర్యములు కలిగించుగాక! ఓ దశరథమహారాజా! వసిష్ఠులవారు బ్రాహ్మణసమూహములతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచిఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుచున్నాను.” అనిపలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథునికి దు:ఖము ఇంకా ఎక్కువ అయింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి.

“ఆపు. ఇంక చాలు” అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదికి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడకు వచ్చింది. “సుమంత్రా! రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి చర్చించి రాత్రి అంతా నిద్రలేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడకు తీసుకొని రా.” అని ఆజ్ఞాపించింది కైక.

“అలాగే మహారాణీ! తమ ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడకు వెంటనేరమ్మని మనవిచేస్తాను.” అని పలికి సుమంత్రుడు అక్కడినుండి వెళ్లిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉ న్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంత్రుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ పంచదశః సర్గః (15) >>

Ayodhya Kanda Sarga 21 In Telugu | అయోధ్యాకాండ ఏకవింశః సర్గః

Ayodhya Kanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ రామాయణ కావ్యంలో రెండవ విభాగము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. అయోధ్య కాండ సర్గ 21 లో, రాముని వనవాసానికి సిద్ధమైన సందర్భంగా సీతా దేవి, లక్ష్మణుడు మరియు ఆయనను కలిసి ప్రస్థానం చేస్తారు. ఈ అధ్యాయంలో, వారి వనవాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, సంభాషణలు మరియు పరిణామాలు వివరించబడతాయి. సీతా దేవి తన భర్త రాముని తో పాటు వనవాసం చేయడానికి నిర్ణయించుకుంటుంది మరియు లక్ష్మణుడు తన అన్నను వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇది కుటుంబ బంధాలు, నిబద్ధత మరియు ధర్మం పట్ల వారికి ఉన్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.

కౌసల్యాలక్ష్మణప్రతిబోధనమ్ 

తథా తు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరమ్ |
ఉవాచ లక్ష్మణో దీనస్తత్కాలసదృశం వచః ||

1

న రోచతే మమాప్యేతదార్యే యద్రాఘవో వనమ్ |
త్యక్త్వా రాజ్యశ్రియం గచ్ఛేత్ స్త్రియా వాక్యవశం గతః ||

2

విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రధర్షితః |
నృపః కిమివ న బ్రూయాచ్చోద్యమానః సమన్మథః ||

3

నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధమ్ |
యేన నిర్వాస్యతే రాష్ట్రాద్వనవాసాయ రాఘవః ||

4

న తం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః |
స్వమిత్రోఽపి నిరస్తోఽపి యోఽస్య దోషముదాహరేత్ ||

5

దేవకల్పమృజుం దాంతం రిపూణామపి వత్సలమ్ |
అవేక్షమాణః కో ధర్మం త్యజేత్పుత్రమకారణాత్ ||

6

తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః |
పుత్రః కో హృదయే కుర్యాద్రాజవృత్తమనుస్మరన్ ||

7

యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః |
తావదేవ మయా సార్ధమాత్మస్థం కురు శాసనమ్ ||

8

మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ |
కః సమర్థోఽధికం కర్తుం కృతాంతస్యేవ తిష్ఠతః ||

9

నిర్మనుష్యామిమాం సర్వామయోధ్యాం మనుజర్షభ |
కరిష్యామి శరైస్తీక్ష్ణైర్యది స్థాస్యతి విప్రియే ||

10

భరతస్యాథ పక్ష్యో వా యో వాఽస్య హితమిచ్ఛతి |
సర్వానేతాన్వధిష్యామి మృదుర్హి పరిభూయతే ||

11

ప్రోత్సాహితోఽయం కైకేయ్యా స దుష్టో యది నః పితా |
అమిత్రభూతో నిఃసంగం వధ్యతాం బధ్యతామపి ||

12

గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః |
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్ ||

13

బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ |
దాతుమిచ్ఛతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవ ||

14

త్వయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమమ్ |
కాఽస్య శక్తిః శ్రియం దాతుం భరతాయారిశాసన ||

15

అనురక్తోఽస్మి భావేన భ్రాతరం దేవి తత్త్వతః |
సత్యేన ధనుషా చైవ దత్తేనేష్టేన తే శపే ||

16

దీప్తమగ్నిమరణ్యం వా యది రామః ప్రవేక్ష్యతి |
ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమవధారయ ||

17

హరామి వీర్యాద్దుఃఖం తే తమః సూర్య ఇవోదితః |
దేవీ పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు ||

18

హనిష్యే పితరం వృద్ధం కైకేయ్యాసక్తమానసమ్ |
కృపణం చ స్థితం బాల్యే వృద్ధభావేన గర్హితమ్ ||

19

ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః |
ఉవాచ రామం కౌసల్యా రుదంతీ శోకలాలసా ||

20

భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శ్రుతం త్వయా |
యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే ||

21

న చాధర్మ్యం వచః శ్రుత్వా సపత్న్యా మమ భాషితమ్ |
విహాయ శోకసంతప్తాం గంతుమర్హసి మామితః ||

22

ధర్మజ్ఞ యది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్ఛసి |
శుశ్రూష మామిహస్థస్త్వం చర ధర్మమనుత్తమమ్ ||

23

శుశ్రూషుర్జననీం పుత్రః స్వగృహే నియతో వసన్ |
పరేణ తపసా యుక్తః కాశ్యపస్త్రిదివం గతః ||

24

యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథా హ్యహమ్ |
త్వాం నాహమనుజానామి న గంతవ్యమితో వనమ్ ||

25

త్వద్వియోగాన్న మే కార్యం జీవితేన సుఖేన వా |
త్వయా సహ మమ శ్రేయస్తృణానామపి భక్షణమ్ ||

26

యది త్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసామ్ |
అహం ప్రాయమిహాసిష్యే న హి శక్ష్యామి జీవితుమ్ ||

27

తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోకవిశ్రుతమ్ |
బ్రహ్మహత్యామివాధర్మాత్సముద్రః సరితాం పతిః ||

28

విలపంతీం తదా దీనాం కౌసల్యాం జననీం తతః |
ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మసంహితమ్ ||

29

నాస్తి శక్తిః పితుర్వాక్యం సమతిక్రమితుం మమ |
ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్ఛామ్యహం వనమ్ ||

30

ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా |
గౌర్హతా జానతా ధర్మం కండునాఽపి విపశ్చితా ||

31

అస్మాకం చ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః |
ఖనద్భిః సాగరైర్భూమిమవాప్తః సుమహాన్వధః ||

32

జామదగ్న్యేన రామేణ రేణుకా జననీ స్వయమ్ |
కృత్తా పరశునాఽరణ్యే పితుర్వచనకారిణా ||

33

ఏతైరన్యైశ్చ బహుభిర్దేవి దేవసమైః కృతమ్ |
పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితమ్ ||

34

న ఖల్వేతన్మయైకేన క్రియతే పితృశాసనమ్ |
ఏతైరపి కృతం దేవి యే మయా తవ కీర్తితాః ||

35

నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే |
పూర్వైరయమభిప్రేతో గతో మార్గోఽనుగమ్యతే ||

36

తదేతత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా |
పితుర్హి వచనం కుర్వన్న కశ్చిన్నామ హీయతే ||

37

తామేవముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్ |
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్ ||

38

తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమమ్ |
విక్రమం చైవ సత్త్వం చ తేజశ్చ సుదురాసదమ్ ||

39

మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షణ |
అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||

40

ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితమ్ |
ధర్మసంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమమ్ ||

41

సంశ్రుత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా |
న కర్తవ్యం వృథా వీర ధర్మమాశ్రిత్య తిష్ఠతా ||

42

సోఽహం న శక్ష్యామి పితుర్నియోగమతివర్తితుమ్ |
పితుర్హి వచనాద్వీర కైకేయ్యాఽహం ప్రచోదితః ||

43

తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిమ్ |
ధర్మమాశ్రయ మా తైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతామ్ ||

44

తమేవముక్త్వా సౌహార్దాద్భ్రాతరం లక్ష్మణాగ్రజః |
ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలిః శిరసా నతః ||

45

అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితో వనమ్ |
శాపితాఽసి మమ ప్రాణైః కురు స్వస్త్యయనాని మే ||

46

తీర్ణప్రతిజ్ఞశ్చ వనాత్పునరేష్యామ్యహం పురీమ్ |
యయాతిరివ రాజర్షిః పురా హిత్వా పునర్దివమ్ ||

47

శోకః సంధార్యతాం మాతర్హృదయే సాధు మా శుచః |
వనవాసాదిహైష్యామి పునః కృత్వా పితుర్వచః ||

48

త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |
పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనాతనః ||

49

అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ |
వనవాసకృతా బుద్ధిర్మమ ధర్మ్యాఽనువర్త్యతామ్ ||

50

ఏతద్వచస్తస్య నిశమ్య మాతా
సుధర్మ్యమవ్యగ్రమవిక్లబం చ |
మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవీ
సమీక్ష్య రామం పునరిత్యువాచ ||

51

యథైవ తే పుత్ర పితా తథాఽహం
గురుః స్వధర్మేణ సుహృత్తయా చ |
న త్వానుజానామి న మాం విహాయ
సుదుఃఖితామర్హసి గంతుమేవమ్ ||

52

కిం జీవితేనేహ వినా త్వయా మే
లోకేన వా కిం స్వధయాఽమృతేన |
శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం
మమేహ కృత్స్నాదపి జీవలోకాత్ ||

53

నరైరివోల్కాభిరపోహ్యమానో
మహాగజోఽధ్వానమనుప్రవిష్టః |
భూయః ప్రజజ్వాల విలాపమేనం
నిశమ్య రామః కరుణం జనన్యాః ||

54

స మాతరం చైవ విసంజ్ఞకల్పా-
-మార్తం చ సౌమిత్రిమభిప్రతప్తమ్ |
ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం
యథా స ఏవార్హతి తత్ర వక్తుమ్ ||

55

అహం హి తే లక్ష్మణ నిత్యమేవ
జానామి భక్తిం చ పరాక్రమం చ |
మమ త్వభిప్రాయమసన్నిరీక్ష్య
మాత్రా సహాభ్యర్దసి మాం సుదుఃఖమ్ ||

56

ధర్మార్థకామాః కిల తాత లోకే
సమీక్షితా ధర్మఫలోదయేషు |
తే తత్ర సర్వే స్యురసంశయం మే
భార్యేవ వశ్యాఽభిమతా సుపుత్రా ||

57

యస్మింస్తు సర్వే స్యురసన్నివిష్టాః
ధర్మో యతః స్యాత్తదుపక్రమేత |
ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే
కామాత్మతా ఖల్వపి న ప్రశస్తా ||

58

గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః
క్రోధాత్ప్రహర్షాద్యది వాపి కామాత్ |
యద్వ్యాదిశేత్కార్యమవేక్ష్య ధర్మం
కస్తం న కుర్యాదనృశంసవృత్తిః ||

59

స వై న శక్నోమి పితుః ప్రతిజ్ఞా-
-మిమామకర్తుం సకలాం యథావత్ |
స హ్యావయోస్తాత గురుర్నియోగే
దేవ్యాశ్చ భర్తా స గతిః స ధర్మః ||

60

తస్మిన్పునర్జీవతి ధర్మరాజే
విశేషతః స్వే పథి వర్తమానే |
దేవీ మయా సార్ధమితోఽపగచ్ఛే-
-త్కథం స్విదన్యా విధవేవ నారీ ||

61

సా మాఽనుమన్యస్వ వనం వ్రజంతం
కురుష్వ నః స్వస్త్యయనాని దేవి |
యథా సమాప్తే పునరావ్రజేయం
యథా హి సత్యేన పునర్యయాతిః ||

62

యశో హ్యహం కేవలరాజ్యకారణా-
-న్న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్ |
అదీర్ఘకాలే న తు దేవి జీవితే
వృణేఽవరామద్య మహీమధర్మతః ||

63

ప్రసాదయన్నరవృషభః స్వమాతరం
పరాక్రమాజ్జిగమిషురేవ దండకాన్ |
అథానుజం భృశమనుశాస్య దర్శనం
చకార తాం హృది జననీం ప్రదక్షిణమ్ ||

64

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 21 Meaning In Telugu

రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య భోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు. వారిని చూచి ఇలా అన్నాడు.

“అమ్మా కౌసల్యా! అన్నా రామా! ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసరం రాముడు అడవులకు వెళ్లడం నాకు అసలే ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు కామపీడితుడు, భోగలాలసుడు. విషయ వాంఛలకు లోబడ్డవాడు. అలాంటి రాజు, కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును. కాని అది ఆచరణయోగ్యము కాదు. ఎందుకంటే రాముడు అయోధ్యనుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు. చేయడు కూడా. అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్లాలి.

రామునికి పరమ శత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చేయు వాడు ఎవరూ గుణవంతుడు, ఋజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసిన వాడు ఎవడూ దశరథ మహారాజు మాటలను ధర్మ సమ్మతము గా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించ నవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను.

రామా! నేను నీ పక్క ధనుస్సు పట్టుకొని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు. రామా! ఈ అయోధ్యా నగరము నీది. ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారము చేయడానికి సాహసిస్తే, ఈ అయోధ్యానగరాన్నే నేలమట్టం చేస్తాను.
రామా! ఈ లోకం తీరే అంత. మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు.

భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అనే వాడు ఎవడినైనాసరే భరతుని పక్షానమాట్లాడే ఎవడి నైనా సరే వాడిని వధిస్తాను. కైక పక్షము వహించి, కైక మీది ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు. దుర్మార్గుడు బంధింపతగినవాడు. అందుకని దశరథుని బంధించెదను. అవసరమైతే వధిస్తానుకూడా. గురువు అయినా సరే, దుర్మార్గుడు అయితే అతడు శిక్షార్హుడు.

రామా! మన తండ్రి ఎవరి అండచూచుకొని, పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యమును భరతునికి ఇవ్వదలచుకున్నాడో అర్థం కావడం లేదు. నీతో నాతో విరోధము పెట్టుకొని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరధునికి ఎక్కడిది?

అమ్మా! కౌసల్యాదేవీ! నాకు రాముడు అంటే ప్రాణము. నా ధనుస్సు మీద నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాడు. రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు. కానీ, దేనికైనా సరే,

రాముని కన్నా ముందు నేను ఉంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయము లేదు. నిశ్చింతగా ఉండండి.” అని ఆవేశంతో పలికాడు అక్ష్మణుడు.

ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య రాముని తో దు:ఖిస్తూ ఇలాఅంది. “రామా! నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా! నీకు ఇష్టం అయితే ఆ ప్రకారము చెయ్యి. అధర్మపరురాలు అయిన నా సవతి కైకేయీ మాటలు మనము పాటించ నవసరము లేదు. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు.

రామా! నీకు అన్ని ధర్మములు తెలుసు. మాతృసేవ చెయ్యడం పరమ ధర్మము. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్యాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి. నీ ధర్మమును ఆచరించు. రామా! పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు. రామా! నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో, నేనూ అంతటి పూజనీయురాలనే కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు. అరణ్యములకు వెళ్లుటకు నేను అనుమతి ఇవ్వను. నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో.

నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్క మృష్టాన్నములు ఎలా భుజించగలను. నీతోపాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం. అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములను తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను. క్రుంగి, కృశించి మరణిస్తాను. నీ కోసరం నిన్ను తల్చుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. తర్వాత నీ ఇష్టం.” అని పలికింది.

కౌసల్య తమ్ముడు లక్ష్మణుని మాటలూ, తల్లి కౌసల్య మాటలూ సావధానంగా విన్నాడు రాముడు. వారితో ఇలా అన్నాడు.

“అమ్మా! నాకు నా తండ్రి దైవసమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను అరణ్యములకు వెళ్లనీ. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగర కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమి నంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞమేరకు, పరశు రాముడు, తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. అమ్మా!

మన పూర్వీకులందరూ పితృవాక్పరిపాలనకు తమ ప్రాణాలు కూడా అర్పించారు. నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను. నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేనూ ఆచరిస్తున్నాను.

ఈనాడు నేను నా స్వార్థము కొరకు, పితృవాక్యమును పాటించకుండా, కొత్త ధర్మమును సృష్టించలేను. తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అంటదు. తండ్రిమాటను ధిక్కరించి నేను నా పూర్వీకులముందు దోషిగా నిలబడలేను.” అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“తమ్ముడా లక్ష్మణా! నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి ధర్మసూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియక పోవడం వలన, పామరత్వం చేత దుఃఖము పొందుతూ ఉంది.

లక్ష్మణా! ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము. ధర్మము నందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. తండ్రిగారు తన ధర్మమును తాను పాటించారు. తల్లికి వరాలు ఇస్తాను అన్నారు. ఆమె కోరుకొన్నది ఇవ్వడం రాజు ధర్మము. ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు.

పితృవాక్పరిపాలన నా ధర్మము. కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా! ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి, తల్లికి, గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను నా తల్లి కైకేయీ నాకు చెప్పింది. ఇందులో ఆమె తప్పేముంది. తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మము.

కాని క్షత్రియ ధర్మము వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోడం క్షత్రియ ధర్మము. ప్రస్తుతము మనకు కులధర్మమే ముఖ్యము. క్షత్రియ ధర్మము కాదు. నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కనపెట్టి ధర్మాచరణము చెయ్యి. నీ కోపము వదిలి పెట్టు. నేను చెప్పిన మాటలను ఆచరించు.” అని అన్నాడు రాముడు.

తరువాత తల్లి కౌసల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు. దీనికి మారు పలికితే నా మీద ఒట్టు. నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు. అమ్మా! పదునాలుగు సంవత్స రములు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్లి అలాతిరిగి వస్తాను. నామాట నమ్ము. అమ్మా! నీ మనసులో నా గురించి దుఃఖించకు.

తండ్రిమాట ప్రకారము వెళుతున్నాను. నీ మాట ప్రకారము తిరిగి వస్తాను. అమ్మా! మనకందరకూ పెద్ద తండ్రి గారు. నీవు, నేను, సీత లక్ష్మణుడు, అందరమూ తండ్రిగారి మాటను గౌరవించాలి కదా! అదియే కదా సనాతనధర్మము. అమ్మా! ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి, నా వనవాసమునకు ఏర్పాట్లు చెయ్యి.” అని అన్నాడు రాముడు.

రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు. రాముని చూచి ఇలా అంది. “రామా! నీవు సనాతన ధర్మము గురించి చెప్పావు. సనాతన ధర్మములో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకూ అంతే విలువ ఇవ్వాలి కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్లవద్దు. నన్ను దు:ఖముల పాలు చెయ్యవద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనములకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను. నీవు వెళ్లడానికి వీలు లేదు.

రామా! నీవు లేని ఈ బ్రతుకు నిరర్థకము. నేను చచ్చి స్వర్గానికి వెళ్లినా, అక్కడ లభించే అమృతము కూడా నీకుసాటి రాదు. నీవు ముహూర్తకాలము నా ఎదుట ఉంటేచాలు, ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు. రామా! నన్ను విడిచి వెళ్లకు.” అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించి పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ధర్మమా! తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో. ఆమెను ఊరడించాల్సింది పోయి, ఆమెను, నన్ను, నీ మాటలతో బాధపెట్టావు.

లక్ష్మణా! అర్థకామములు ధర్మ సమ్మతము లైనపుడే అవి మంచి ఫలములను ఇస్తాయి. అందుకని అర్థకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యము. ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము. మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి.

కేవలము అర్థము, కామము తో కూడిన పనులను చేయడం వలన రాగ ద్వేషములు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు. మనకు పూజ్యుడు. ఆయన కామ ప్రకోపంతో గానీ, కోపంతో గానీ మనలను ఒక పనిచెయ్యమని చెప్పినప్పుడు, అది ధర్మంకాదు అని మనం నిరాకరించడం, ధర్మాచరణము అనిపించుకోదు. కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు.

లక్ష్మణా! మన తండ్రిగారు నీకు, నాకు తండ్రి, గురువు, దైవము. అలాగే మన తల్లి గారికి ఆయన భర్త. భర్త మాట భార్యకు శిరోధార్యము. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరోమార్గము లేదు. పైగా, తన భర్త అయిన దశరథమహారాజు గారు జీవించిఉండగా, భర్తను వదిలిపెట్టి, తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు. అది ధర్మము కాదు.”

అని తల్లి వంక తిరిగి“అమ్మా! నాకు అరణ్యములకు వెళ్లుటకు అనుమతి ఇవ్వు. పదునాలుగు సంవత్సరముల తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నాపూర్వీకులు నడిచిన బాటలో నడవడం–వీటితో పోలిస్తే, ఈ తుచ్ఛమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసరం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను.

అమ్మా! ఈ జీవితము నీటి బుడగ వంటిది. నాలుగు రోజులు రాజ్యం పాలించడం కోసరం, ధర్మము తప్పి, అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు.” అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు, తమ్ముడికి స్పష్టం చేసాడు. తల్లికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారముచేసాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వావింశః సర్గః (౨౨) >>

Ayodhya Kanda Sarga 4  In Telugu – అయోధ్యాకాండ చతుర్థః సర్గః

Ayodhya Kanda Sarga 4  In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. చతుర్థ సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది. ఈ విధంగా చతుర్థ సర్గ రాముని ధర్మ నిష్ఠ, కర్తవ్య నిబద్ధత మరియు తన కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.

మాత్రాశీఃపరిగ్రహః

గతేష్వథ నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః |
మంత్రయిత్వా తతశ్చక్రే నిశ్చయజ్ఞః స నిశ్చయమ్ ||

1

శ్వ ఏవ పుష్యో భవితా శ్వోఽభిషేచ్యస్తు మే సుతః |
రామో రాజీవతామ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః ||

2

అథాంతర్గృహమావిశ్య రాజా దశరథస్తదా |
సూతమాజ్ఞాపయామాస రామం పునరిహానయ || [మంత్రయామాస]

3

ప్రతిగృహ్య స తద్వాక్యం సూతః పునరుపాయయౌ |
రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః ||

4

ద్వాఃస్థైరావేదితం తస్య రామాయాగమనం పునః |
శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్తం శంకాన్వితోఽభవత్ ||

5

ప్రవేశ్య చైనం త్వరితం రామో వచనమబ్రవీత్ |
యదాగమనకృత్యం తే భూయస్తద్బ్రూహ్యశేషతః ||

6

తమువాచ తతః సూతో రాజా త్వాం ద్రష్టుమిచ్ఛతి |
శ్రుత్వా ప్రమాణమత్ర త్వం గమనాయేతరాయ వా ||

7

ఇతి సూతవచః శ్రుత్వా రామోఽథ త్వరయాన్వితః |
ప్రయయౌ రాజభవనం పునర్ద్రష్టుం నరేశ్వరమ్ ||

8

తం శ్రుత్వా సమనుప్రాప్తం రామం దశరథో నృపః |
ప్రవేశయామాస గృహం వివక్షుః ప్రియముత్తమమ్ ||

9

ప్రవిశన్నేవ చ శ్రీమాన్రాఘవో భవనం పితుః |
దదర్శ పితరం దూరాత్ప్రణిపత్య కృతాంజలిః ||

10

ప్రణమంతం సముత్థాప్య తం పరిష్వజ్య భూమిపః |
ప్రదిశ్య చాస్మై రుచిరమాసనం పునరబ్రవీత్ ||

11

రామ వృద్ధోఽస్మి దీర్ఘాయుర్భుక్తా భోగా మయేప్సితాః |
అన్నవద్భిః క్రతుశతైస్తథేష్టం భూరిదక్షిణైః ||

12

జాతమిష్టమపత్యం మే త్వమద్యానుపమం భువి |
దత్తమిష్టమధీతం చ మయా పురుషసత్తమ ||

13

అనుభూతాని చేష్టాని మయా వీరసుఖాన్యపి |
దేవర్షిపితృవిప్రాణామనృణోఽస్మి తథాఽఽత్మనః ||

14

న కించిన్మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ |
అతో యత్త్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి ||

15

అద్య ప్రకృతయః సర్వాస్త్వామిచ్ఛంతి నరాధిపమ్ |
అతస్త్వాం యువరాజానమభిషేక్ష్యామి పుత్రక ||

16

అపి చాద్యాశుభాన్రామ స్వప్నే పశ్యామి దారుణాన్ |
సనిర్ఘాతా మహోల్కాశ్చ పతితా హి మహాస్వనాః || [దివోల్కా]

17

అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః |
ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారకరాహుభిః ||

18

ప్రాయేణ హి నిమిత్తానామీదృశానాం సముద్భవే |
రాజా హి మృత్యుమవాప్నోతి ఘోరాం వాఽఽపదమృచ్ఛతి ||

19

తద్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ | [విముహ్యతి]
తావదేవాభిషించస్వ చలా హి ప్రాణినాం మతిః ||

20

అద్య చంద్రోఽభ్యుపగతః పుష్యాత్పూర్వం పునర్వసూ |
శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః ||

21

తతః పుష్యేఽభిషించస్వ మనస్త్వరయతీవ మామ్ |
శ్వస్త్వాఽహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరంతప ||

22

తస్మాత్త్వయాఽద్యప్రభృతి నిశేయం నియతాత్మనా |
సహ వధ్వోపవస్తవ్యా దర్భప్రస్తరశాయినా ||

23

సుహృదశ్చాప్రమత్తాస్త్వాం రక్షంత్వద్య సమంతతః |
భవంతి బహువిఘ్నాని కార్యాణ్యేవంవిధాని హి ||

24

విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః |
తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ ||

25

కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతః స్థితః |
జ్యేష్ఠానువర్తీ ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః ||

26

కిం తు చిత్తం మనుష్యాణామనిత్యమితి మే మతిః |
సతాం చ ధర్మనిత్యానాం కృతశోభి చ రాఘవ ||

27

ఇత్యుక్తః సూఽభ్యనుజ్ఞాతః శ్వోభావిన్యభిషేచనే |
వ్రజేతి రామః పితరమభివాద్యాభ్యయాద్గృహమ్ ||

28

ప్రవిశ్య చాత్మనో వేశ్మ రాజ్ఞోద్దిష్టేఽభిషేచనే |
తత్క్షణేన చ నిష్క్రమ్య మాతురంతఃపురం యయౌ || [వినిర్గమ్యే]

29

తత్ర తాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసినీమ్ |
వాగ్యతాం దేవతాగారే దదర్శాయాచతీం శ్రియమ్ ||

30

ప్రాగేవ చాగతా తత్ర సుమిత్రా లక్ష్మణస్తథా |
సీతా చ నాయితా శ్రుత్వా ప్రియం రామాభిషేచనమ్ ||

31

తస్మిన్కాలే హి కౌసల్యా తస్థావామీలితేక్షణా |
సుమిత్రయాఽన్వాస్యమానా సీతయా లక్ష్మణేన చ ||

32

శ్రుత్వా పుష్యేణ పుత్రస్య యౌవరాజ్యాఽభిషేచనమ్ |
ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్దనమ్ ||

33

తథా సన్నియమామేవ సోఽభిగమ్యాభివాద్య చ |
ఉవాచ వచనం రామో హర్షయంస్తామనిందితాం ||

34

అంబ పిత్రా నియుక్తోఽస్మి ప్రజాపాలనకర్మణి |
భవితా శ్వోఽభిషేకో మే యథా మే శాసనం పితుః ||

35

సీతయాఽప్యుపవస్తవ్యా రజనీయం మయా సహ |
ఏవమృత్విగుపాధ్యాయైః సహ మాముక్తవాన్పితా ||

36

యాని యాన్యత్ర యోగ్యాని శ్వోభావిన్యభిషేచనే |
తాని మే మంగళాన్యద్య వైదేహ్యాశ్చైవ కారయ ||

37

ఏతచ్ఛ్రుత్వా తు కౌసల్యా చిరకాలాభికాంక్షితమ్ |
హర్షబాష్పకలం వాక్యమిదం రామమభాషత ||

38

వత్స రామ చిరం జీవ హతాస్తే పరిపంథినః |
జ్ఞాతీన్మే త్వం శ్రియా యుక్తః సుమిత్రాయాశ్చ నందయ ||

39

కళ్యాణే బత నక్షత్రే మయి జాతోఽసి పుత్రక |
యేన త్వయా దశరథో గుణైరారాధితః పితా ||

40

అమోఘం బత మే క్షాంతం పురుషే పుష్కరేక్షణే |
యేయమిక్ష్వాకురాజ్యశ్రీః పుత్ర త్వాం సంశ్రయిష్యతి ||

41

ఇత్యేవముక్తో మాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ |
ప్రాంజలిం ప్రహ్వమాసీనమభివీక్ష్య స్మయన్నివ ||

42

లక్ష్మణేమాం మాయా సార్ధం ప్రశాధి త్వం వసుంధరామ్ |
ద్వితీయం మేంతరాత్మానం త్వామియం శ్రీరుపస్థితా ||

43

సౌమిత్రే భుంక్ష్వ భోగాంస్త్వమిష్టాన్రాజ్యఫలాని చ |
జీవితం చ హి రాజ్యం చ త్వదర్థమభికామయే ||

44

ఇత్యుక్త్వా లక్ష్మణం రామో మాతరావభివాద్య చ |
అభ్యనుజ్ఞాప్య సీతాం చ జగామ స్వం నివేశనమ్ ||

45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్థః సర్గః ||

Ayodhya Kanda Sarga 4 Meaning In Telugu

తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు. మరునాడే పుష్యమీ నక్షత్రము. అందుకని, ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్రము ఘడియలలో పట్టాభిషిక్తుని చేయవలెనని నిశ్చయించాడు. మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు.

తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్లాడు. సుమంత్రుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంత్రుడు రాముని వద్దకు వెళ్లాడు.

“ఇప్పుడేగా తండ్రి గారి వద్దనుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావు?” అని అడిగాడు.

“దశరథమహారాజుగారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించు కోండి.” అని అన్నాడు సుమంత్రుడు. మారు మాటాడకుండా రాముడు సుమంత్రునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు. తండ్రి గారికి నమస్కరించి, ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు. దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని, పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు.

“రామా! నేను చెప్పబోవు మాటలు శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞములు, యాగములను చేసాను. ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను. దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణము, విప్ర ఋణము, ఆత్మఋణము తీర్చుకున్నాను. ఇంక నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది. నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించాను.

ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునములు పొడసూపుతున్నాయి. నా జాతకములో చెడ్డ గ్రహము లైన సూర్య, అంగారక, రాహు గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణము కానీ, లేక తీవ్రమైన ఆపద కాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచల మైనది. ఏ నిముషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పొడసూపక ముందే నీ యౌవరాజ్యపట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను.

ఈ రోజు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉంటాడు. ఆ శుభ ముహూర్తము లో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి. ఈ సందర్భములో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి.

ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అనికాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమునే కోరుతుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళువు. ఇంద్రియములను జయించిన వాడు. కానీ, మనస్సు చంచలమైనది. ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధిపుడుతుందో ఎవరికి తెలుసు! నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందే మో అని నా అనుమానము. అందుకని ఈ తొందర. ఇంక నీవు వెళ్లవచ్చు.” అని పలికాడు దశరథుడు.

తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు, తండ్రి గారి వద్ద సెలవు తీసుకొని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్లాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో, ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకొంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు.

రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. రేపే యౌవరాజ్య పట్టాభిషేకము. ఈ రోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలెనని ఋత్తిక్కులు, తండ్రిగారు ఆదేశించారు. అమ్మా! నీవు నాకూ, సీతకూ, రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రములు జరిపించు.” అని అన్నాడు.

తన కుమారునికి యౌవరాజ్యపట్టాభిషేకము అని తన కుమారుని నోటి నుండి విని ఆ తల్లి పొంగిపోయింది. ఆమె కండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “వత్సా! రామా! చిరంజీవ, చిరంజీవ చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ములకు, నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగచెయ్యి. నాయనా! నీవు పుట్టిన వేళా విశేషము చాలామంచిది. నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింప జేసావు. నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు. సుఖంగా వర్థిల్లు.” అని మనసారా దీవించింది.

తల్లి దీవనలు అందుకున్న రాముడు, లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “సోదరా! లక్ష్మణా! ఈ పట్టాభిషేకము నాకు కాదు. మన ఇద్దరికీ. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మ. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీ ఇష్టంవచ్ని రాజభోగములు అనుభవించు. పరిపాలన సాగించు. అసలు నీ కోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను.” అని అన్నాడు.

తరువాత సీతా రాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి, తమ మందిరమునకు వెళ్లిపోయారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచమః సర్గః (5) >>

Balakanda Sarga 14 In Telugu – బాలకాండ చతుర్దశః సర్గః

Balakanda Sarga 14 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుర్దశః సర్గంలో, విష్ణుమూర్తి తన అమృతమయ సాయుధాన్ని ఋషులకు అందించి, వారి యజ్ఞాన్ని రక్షించమని సూచించాడు. ఆయన యజ్ఞవాటిక వద్దకు చేరి, ఋషుల నిష్టను చూసి ప్రశంసించాడు. వసిష్ఠుడు ఈ అద్భుతాన్ని చూచి ఆనందించాడు. మహాముని విశ్వామిత్రుడు భద్రత కాపాడినందుకు రామ, లక్ష్మణులను సంతోషంగా ఆశీర్వదించాడు. దుష్ట శక్తులపై విజయం సాధించడంలో రాముడు, లక్ష్మణుడు తమ ధైర్యాన్ని, సత్తాను ప్రదర్శించారు.

అశ్వమేధః

అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ప్రాప్తే తురంగమే |
సరయ్వాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోఽభ్యవర్తత ||

1

ఋశ్యశృంగం పురస్కృత్య కర్మ చక్రుర్ద్విజర్షభాః |
అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోఽస్య సుమహాత్మనః ||

2

కర్మ కుర్వంతి విధివద్యాజకా వేదపారగాః |
యథావిధి యథాన్యాయం పరిక్రామంతి శాస్త్రతః ||

3

ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథైవోపసదం ద్విజాః |
చక్రుశ్చ విధివత్సర్వమధికం కర్మ శాస్త్రతః ||

4

అభిపూజ్య తదా హృష్టాః సర్వే చక్రుర్యథావిధి |
ప్రాతఃసవనపూర్వాణి కర్మాణి మునిపుంగవాః ||

5

ఐంద్రశ్చ విధివద్దత్తో రాజా చాభిష్టుతోఽనఘః |
మాధ్యందినం చ సవనం ప్రావర్తత యథాక్రమమ్ ||

6

తృతీయసవనం చైవ రాజ్ఞోఽస్య సుమహాత్మనః |
చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా తథా బ్రాహ్మణపుంగవాః ||

7

[* అధికపాఠః –
ఆహ్వయాన్ చక్రిరే తత్ర శక్రాదీన్విబుధోత్తమాన్ |
ఋశ్యశృంగాదయో మంత్రైః శిక్షాక్షరసమన్వితైః |
గీతిభిర్మధురైః స్నిగ్ధైర్మంత్రాహ్వానైర్యథార్హతః |
హోతారో దదురావాహ్య హవిర్భాగాన్ దివౌకసామ్ |
*]

న చాహుతమభూత్తత్ర స్ఖలితం వాపి కించన |
దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే ||

8

న తేష్వహఃసు శ్రాంతో వా క్షుధితో వాఽపి దృశ్యతే |
నావిద్వాన్బ్రాహ్మణస్తత్ర నాశతానుచరస్తథా ||

9

బ్రాహ్మణా భుంజతే నిత్యం నాథవంతశ్చ భుంజతే |
తాపసా భుంజతే చాపి శ్రమణా భుంజతే తథా ||

10

వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ |
అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే ||

11

దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ |
ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః ||

12

అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః |
దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా ||

13

నానాదేశాదనుప్రాప్తాః పురుషాః స్త్రీగణాస్తథా |
అన్నపానైః సువిహితాస్తస్మిన్యజ్ఞే మహాత్మనః ||

14

అన్నం హి విధివత్స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః |
అహో తృప్తాః స్మ భద్రం త ఇతి శుశ్రావ రాఘవః ||

15

స్వలంకృతాశ్చ పురుషా బ్రాహ్మణాన్పర్యవేషయన్ |
ఉపాసతే చ తానన్యే సుమృష్టమణికుండలాః ||

16

కర్మాంతరే తదా విప్రా హేతువాదాన్బహూనపి |
ప్రాహుః స్మ వాగ్మినో ధీరాః పరస్పర జిగీషయా ||

17

దివసే దివసే తత్ర సంస్తరే కుశలా ద్విజాః |
సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః ||

18

నాషడంగవిదత్రాసీన్నావ్రతో నాబహుశ్రుతః |
సదస్యస్తస్య వై రాజ్ఞో నావాదకుశలా ద్విజాః ||

19

ప్రాప్తే యూపోచ్ఛ్రయే తస్మిన్షడ్బైల్వాః ఖాదిరాస్తథా |
తావంతో బిల్వసహితాః పర్ణినశ్చ తథాఽపరే ||

20

శ్లేష్మాతకమయస్త్వోకో దేవదారుమయస్తథా |
ద్వావేవ విహితౌ తత్ర బాహువ్యస్తపరిగ్రహౌ ||

21

కారితాః సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైర్యజ్ఞకోవిదైః |
శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతాఽభవన్ ||

22

ఏకవింశతియూపాస్తే ఏకవింశత్యరత్నయః |
వాసోభిరేకవింశద్భిరేకైకం సమలంకృతాః ||

23

విన్యస్తా విధివత్సర్వే శిల్పిభిః సుకృతా దృఢాః |
అష్టాశ్రయః సర్వ ఏవ శ్లక్ష్ణరూపసమన్వితాః ||

24

ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పైర్గంధైశ్చ భూషితాః |
సప్తర్షయో దీప్తిమంతో విరాజంతే యథా దివి ||

25

ఇష్టకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః |
చితోఽగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి ||

26

స చిత్యో రాజసింహస్య సంచితః కుశలైర్ద్విజైః |
గరుడో రుక్మపక్షో వై త్రిగుణోఽష్టాదశాత్మకః ||

27

నియుక్తాస్తత్ర పశవస్తత్తదుద్దిశ్య దైవతమ్ |
ఉరగాః పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః ||

28

శామిత్రే తు హయస్తత్ర తథా జలచరాశ్చ యే |
ఋత్విగ్భిః సర్వమేవైతన్నియుక్తం శాస్త్రతస్తదా ||

29

పశూనాం త్రిశతం తత్ర యూపేషు నియతం తథా |
అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞో దశరథస్య హ ||

30

కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతతః |
కృపాణైర్విశశాసైనం త్రిభిః పరమయా ముదా ||

31

పతత్రిణా తదా సార్ధం సుస్థితేన చ చేతసా |
అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా ||

32

హోతాఽధ్వర్యుస్తథోద్గాతా హస్తేన సమయోజయన్ |
మహిష్యా పరివృత్యా చ వావాతాం చ తథాఽపరమ్ ||

33

పతత్రిణస్తస్య వపాముద్ధృత్య నియతేంద్రియః |
ఋత్విక్పరమసంపన్నః శ్రపయామాస శాస్త్రతః ||

34

ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిపః |
యథాకాలం యథాన్యాయం నిర్ణుదన్పాపమాత్మనః ||

35

హయస్య యాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః |
అగ్నౌ ప్రాస్యంతి విధివత్సమంత్రాః షోడశర్త్విజః ||

36

ప్లక్షశాఖాసు యజ్ఞానామన్యేషాం క్రియతే హవిః |
అశ్వమేధస్య చౌకస్య వైతసో భాగ ఇష్యతే ||

37 [యజ్ఞస్య]

త్ర్యహోఽశ్వమేధః సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః |
చతుష్టోమమహస్తస్య ప్రథమం పరికల్పితమ్ ||

38

ఉక్థ్యం ద్వితీయం సంఖ్యాతమతిరాత్రం తథోత్తరమ్ |
కారితాస్తత్ర బహవో విహితాః శాస్త్రదర్శనాత్ ||

39

జ్యోతిష్టోమాయుషీ చైవమతిరాత్రౌ చ నిర్మితౌ |
అభిజిద్విశ్వజిచ్చైవమప్తోర్యామో మహాక్రతుః ||

40

ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః |
అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశమ్ ||

41

ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణైషా వినిర్మితా |
అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవిహితే పురా ||

42

క్రతుం సమాప్య తు తదా న్యాయతః పురుషర్షభః |
ఋత్విగ్భ్యో హి దదౌ రాజా ధరాం తాం కులవర్ధనః ||

43

ఋత్విజస్త్వబ్రువన్సర్వే రాజానం గతకల్మషమ్ |
భవానేవ మహీం కృత్స్నామేకో రక్షితుమర్హతి ||

44

న భూమ్యా కార్యమస్మాకం న హి శక్తాః స్మ పాలనే |
రతాః స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప ||

45

నిష్క్రయం కించిదేవేహ ప్రయచ్ఛతు భవానితి |
మణిరత్నం సువర్ణం వా గావో యద్వా సముద్యతమ్ ||

46

తత్ప్రయచ్ఛ నరశ్రేష్ఠ ధరణ్యా న ప్రయోజనమ్ |
ఏవముక్తో నరపతిర్బ్రాహ్మణైర్వేదపారగైః ||

47

గవాం శతసహస్రాణి దశ తేభ్యో దదౌ నృపః |
దశకోటీః సువర్ణస్య రజతస్య చతుర్గుణమ్ ||

48

ఋత్విజస్తు తతః సర్వే ప్రదదుః సహితా వసు |
ఋశ్యశృంగాయ మునయే వసిష్ఠాయ చ ధీమతే ||

49

తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః |
సుప్రీతమనసః సర్వే ప్రత్యూచుర్ముదితా భృశమ్ ||

50

తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః |
జాంబూనదం కోటిశతం బ్రాహ్మణేభ్యో దదౌ తదా ||

51 [సంఖ్యం]

దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణముత్తమమ్ |
కస్మైచిద్యాచమానాయ దదౌ రాఘవనందనః ||

52

తతః ప్రీతేషు నృపతిర్ద్విజేషు ద్విజవత్సలః |
ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః ||

53

తస్యాశిషోఽథ వివిధా బ్రాహ్మణైః సముదీరితాః | [సముదాహృతాః]
ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ ||

54

తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమమ్ |
పాపాపహం స్వర్నయనం దుష్కరం పార్థివర్షభైః ||

55

తతోఽబ్రవీదృశ్యశృంగం రాజా దశరథస్తదా |
కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత ||

56

తథేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః |
భవిష్యంతి సుతా రాజంశ్చత్వారస్తే కులోద్వహాః ||

57

[* అధికశ్లోకః –
స తస్య వాక్యం మధురం నిశమ్య
ప్రణమ్య తస్మై ప్రయతో నృపేంద్రః |
జగామ హర్షం పరమం మహాత్మా
తమృశ్యశృంగం పునరప్యువాచ ||
*]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుర్దశః సర్గః ||

Balakanda Sarga 14 Meaning In Telugu

ఒక సంవత్సరకాలం గడిచింది. అశ్వవమేధయాగముకొరకు వదిలి పెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు.

వేదవిదులయిన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమ లతను నలగగొట్టి, రసము తీసారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేసారు.

తరువాత ఋత్తిక్కులు దశరధునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేసారు. ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.

ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణుల కందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన ಅನ್ನ రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేసారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు.

వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరధుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి.

యాగములో ఊపస్తంభములు నిలుప వలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు ఆరు, చండ్రకర్రతో చేసినవి ఆరు, మోదుగ కర్రతో చేసినవి ఆరు, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి, దేవదారు కర్రతో చేసినవి. రెండు యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొక దానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు. ఆ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ ఇరవై యొక్క ఊపస్తంభములను రంగు రంగుల వస్త్రములతో అలంకరించారు.

వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞ కుండము లను ఏర్పాటుచేసారు. దశరథుడు, ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు.

దేవతలకు బలి ఇచ్చేనిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షలను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. మూడు వందల వశు వులను, యజ్ఞాశ్వమును ఆ ఊపస్తంభములకు కట్టారు.

తరువాత దశరధుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఊపస్తంబమునకు మూడుమార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును మూడు కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది.

మరునాడు ఆ యాగమునకు హోత, అధ్వర్యువు, ఉద్గాత అనే ముగ్గురు ఋత్తిక్కులు పట్టపురాణి కౌసల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేసాడు. దశరథుడు ఆ హోమము లో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు.

తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేసారు.

కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్యము, మూడవ రోజు కార్యక్రమమునకు అతి రాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు.

యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పుదిక్కున ఉ న్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణదిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తనరాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పదిలక్షల గోవులు, వందకోట్ల బంగారు నాణెములు, నాలుగు వందల కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు.

ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్టునకు ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికి న్యాయప్రకారంగా పంచి పెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు.

అన్ని అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పెద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేసాడు దశరథుడు.

తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి “ఓ మహాత్మా! అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధిచెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది” అని ప్రార్థించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదునాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ పంచదశః సర్గః (15) >>

Balakanda Sarga 15 In Telugu – బాలకాండ పంచదశః సర్గః

Balakanda Sarga 15 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచదశః సర్గలో, రాజు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో సంతానం పొందాలనే లక్ష్యంతో పుత్రకామెస్టి కర్మను ప్రారంభించాడు. దశరథ రాజు నిర్వహించే అశ్వ పూజలో అర్పించిన నైవేద్యాలను స్వీకరించడానికి ఖగోళ జీవులు గుమిగూడారు. వారు రావణుడి దురాగతాలను చూసి కలవరపడి, రావణుని అంతమొందించే మార్గం కోసం ఆలోచించమని బ్రహ్మను అభ్యర్థిస్తారు. విష్ణువు అక్కడికి చేరుకుని, రావణుని అంతమొందించడానికి తాను మానవునిగా అవతారమెత్తుతానని హామీ ఇవ్వడంతో బ్రహ్మ మరియు ఇతర దేవతలను శాంతింపజేస్తాడు.

రావణవధోపాయః

మేధావీ తు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్ |
లబ్ధసంజ్ఞస్తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్ ||

1

ఇష్టిం తేఽహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ |
అథర్వశిరసి ప్రోక్తైర్మంత్రైః సిద్ధాం విధానతః ||

2

తతః ప్రక్రమ్య తామిష్టిం పుత్రీయాం పుత్రకారణాత్ |
జుహావ చాగ్నౌ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణా ||

3

తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||

4

తాః సమేత్య యథాన్యాయం తస్మిన్సదసి దేవతాః |
అబ్రువఁల్లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్ ||

5

భగవంస్త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః |
సర్వాన్నో బాధతే వీర్యాచ్ఛాసితుం తం న శక్నుమః ||

6

త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్పురా |
మానయంతశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహే ||

7

ఉద్వేజయతి లోకాంస్త్రీనుచ్ఛ్రితాన్ద్వేష్టి దుర్మతిః |
శక్రం త్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి ||

8

ఋషీన్యక్షాన్స గంధర్వానసురాన్బ్రాహ్మణాంస్తథా |
అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః ||

9

నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోఽపి న కంపతే ||

10

సుమహన్నో భయం తస్మాద్రాక్షసాద్ఘోరదర్శనాత్ |
వధార్థం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి ||

11

ఏవముక్తః సురైః సర్వైశ్చింతయిత్వా తతోఽబ్రవీత్ |
హంతాయం విహితస్తస్య వధోపాయో దురాత్మనః ||

12

తేన గంధర్వయక్షాణాం దేవదానవరక్షసామ్ |
అవధ్యోఽస్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా ||

13

నాకీర్తయదవజ్ఞానాత్తద్రక్షో మానుషాంస్తదా |
తస్మాత్స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోఽస్య విద్యతే ||

14

ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతమ్ |
దేవా మహర్షయః సర్వే ప్రహృష్టాస్తేఽభవంస్తదా ||

15

ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతిః |
శంఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః ||

16

[* అధికశ్లోకః –
వైనతేయం సమారూహ్య భాస్కర తోయదం యథా |
తప్త హాటక కేయూరో వంద్యమానః సురోత్తమైః ||
*]

బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః |
తమబ్రువన్సురాః సర్వే సమభిష్టూయ సంనతాః ||

17

త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా |
రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః విభోః ||

18

ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః |
తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీకీర్త్యుపమాసు చ ||

19

విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ |
తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకమ్ ||

20

అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణమ్ |
స హి దేవాన్సగంధర్వాన్సిద్ధాంశ్చ మునిసత్తమాన్ ||

21

రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే |
ఋషయస్తు తతస్తేన గంధర్వాప్సరసస్తథా ||

22

క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః |
వధార్థం వయమాయాతాస్తస్య వై మునిభిః సహ ||

23

సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః |
త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప ||

24

వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు |
ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశపుంగవః ||

25

పితామహపురోగాంస్తాన్ సర్వలోకనమస్కృతః |
అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్ ||

26

భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్ |
సపుత్రపౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతిబాంధవమ్ ||

27

హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహమ్ |
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ ||

28

వత్స్యామి మానుషే లోకే పాలయన్పృథివీమిమామ్ |
ఏవం దత్త్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ ||

29

మానుషే చింతయామాస జన్మభూమిమథాత్మనః |
తతః పద్మపలాశాక్షః కృత్వాఽఽత్మానం చతుర్విధమ్ ||

30

పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ |
తతో దేవర్షిగంధర్వాః సరుద్రాః సాప్సరోగణాః |
స్తుతిభిర్దివ్యరూపాభిస్తుష్టువుర్మధుసూదనమ్ ||

31

తముద్ధతం రావణముగ్రతేజసం
ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషమ్ |
విరావణం సాధు తపస్వి కంటకం
తపస్వినాముద్ధర తం భయావహమ్ ||

32

తమేవ హత్వా సబలం సబాంధవం
విరావణం రావణముగ్రపౌరుషమ్ |
స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం
సురేంద్రగుప్తం గతదోషకల్మషమ్ ||

33

ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. “మహారాజా! తమకు పుత్ర సంతానము కలగడం కోసరం, మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని (యాగమును) మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను.” అని పలికాడు.

దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యా యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు.

” ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచీ చూడకుండా పోతున్నాము.

(మంత్రిగారి అండదండలు ఉంటే పేరు మోసిన రౌడీలను మాత్రం పోలీసులు ఏమి చేయగలరు చెప్పండి.)

తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునికూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోక వాసుల కష్టములకు అంతు లేదు. మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు.

ఇంక సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకము లను రక్షించే ఉపాయం ఆలోచించండి.” అని ప్రార్థించారు.

బ్రహ్మదేవుడు ఆలోచించాడు. “దేవతలారా! వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరులు చేతిలో తక్క ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు.” అని అన్నాడు బ్రహ్మ.

అమ్మయ్య! రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తిఅక్కడకు వచ్చాడు. దేవతలందరు విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.

” ఓ దేవదేవా! ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ను ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురుగా విడిపోయి, ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడు తున్నాడు. మితి మీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి.” అని వేడుకున్నారు.

విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సొంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు. “ఓ దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరుకోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మసంరక్షణ చేస్తాను.” అని పలికాడు విష్ణుమూర్తి.

“ ఓ విష్ణుదేవా! నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము.” అని వేడుకొన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేనవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ షోడశః సర్గః (16) >>

Ayodhya Kanda Sarga 13 In Telugu – అయోధ్యాకాండ త్రయోదశః సర్గః

Ayodhya Kanda Sarga 13

“రామాయణం” లో అయోధ్యాకాండ త్రయోదశః సర్గం (13వ సర్గ) ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ సర్గలో, రాముడు తన తండ్రి ఆజ్ఞను గౌరవించి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సుమంతుడు, రాముడు, సీత, మరియు లక్ష్మణులను వనానికి చేరవేయడానికి రథాన్ని సిద్ధం చేస్తాడు. అయోధ్య ప్రజలు రాముడి వనవాసానికి తీవ్ర విచారంలో కూరుకుపోతారు. వారు రథం వెంబడి దూరం వరకూ నడుస్తూ, తమ ప్రేమను మరియు ఆందోళనను వ్యక్తం చేస్తారు. సీత మరియు లక్ష్మణులు కూడా రాముడితో వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఈ సర్గలో రాముడు తన తల్లి కౌసల్య మరియు సుమిత్రలతో, మరియు తన గురువు వశిష్ఠునితో సన్మానంగా నడుచుకుంటాడు. ఈ సర్గలో రాముడు తన ధైర్యం, విధేయత మరియు ధర్మాన్ని పాటించే గుణాలను ప్రదర్శిస్తాడు, ఇది కథలో కీలకమైన మలుపు తెస్తుంది.

దశరథవిలాపః

అతదర్హం మహారాజం శయానమతథోచితమ్ |
యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్పరిచ్యుతమ్ || ౧ ||

అనర్థరూపా సిద్ధార్థా హ్యభీతా భయదర్శినీ |
పునరాకారయామాస తమేవ వరమంగనా || ౨ ||

త్వం కత్థసే మహారాజ సత్యవాదీ దృఢవ్రతః |
మమ చేమం వరం కస్మాద్విధారయితుమిచ్ఛసి || ౩ ||

ఏవముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా |
ప్రత్యువాచ తతః క్రుద్ధో ముహూర్తం విహ్వలన్నివ || ౪ ||

మృతే మయి గతే రామే వనం మనుజపుంగవే |
హంతానార్యే మమామిత్రే సకామా సుఖినీ భవ || ౫ ||

స్వర్గేఽపి ఖలు రామస్య కుశలం దైవతైరహమ్ |
ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం బత || ౬ ||

కైకేయ్యాః ప్రియకామేన రామః ప్రవ్రాజితో మయా |
యది సత్యం బ్రవీమ్యేతత్తదసత్యం భవిష్యతి || ౭ ||

అపుత్రేణ మయా పుత్రః శ్రమేణ మహతా మహాన్ |
రామో లబ్ధో మహాబాహుః స కథం త్యజ్యతే మయా || ౮ ||

శూరశ్చ కృతవిద్యశ్చ జితక్రోధః క్షమాపరః |
కథం కమలపత్రాక్షో మయా రామో వివాస్యతే || ౯ ||

కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలమ్ |
అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్ || ౧౦ ||

సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ |
దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః || ౧౧ ||

యది దుఃఖమకృత్వాఽద్య మమ సంక్రమణం భవేత్ |
అదుఃఖార్హస్య రామస్య తతః సుఖమవాప్నుయామ్ || ౧౨ ||

నృశంసే పాపసంకల్పే రామం సత్యపరాక్రమమ్ |
కిం విప్రియేణ కైకేయి ప్రియం యోజయసే మమ || ౧౩ ||

అకీర్తిరతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే |
తథా విలపతస్తస్య పరిభ్రమితచేతసః || ౧౪ ||

అస్తమభ్యగమత్సూర్యో రజనీ చాభ్యవర్తత |
సా త్రియామా తథాఽఽర్తస్య చంద్రమండలమండితా || ౧౫ ||

రాజ్ఞో విలపమానస్య న వ్యభాసత శర్వరీ |
తథైవోష్ణం వినిశ్వస్య వృద్ధో దశరథో నృపః || ౧౬ ||

విలలాపార్తవద్దుఃఖం గగనాసక్తలోచనః |
న ప్రభాతం తయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే || ౧౭ ||

క్రియతాం మే దయా భద్రే మయాఽయం రచితోఽంజలిః |
అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణామ్ || ౧౮ ||

నృశంసాం కేకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్ |
ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంయతాంజలిః || ౧౯ ||

ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్ |
సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః || ౨౦ ||

ప్రసాదః క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః |
శూన్యే న ఖలు సుశ్రోణి మయేదం సముదాహృతమ్ || ౨౧ ||

కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయా హ్యసి |
ప్రసీద దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయమ్ || ౨౨ ||

లభతామసితాపాంగే యశః పరమవాప్నుహి |
మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ |
ప్రియమేతద్గురుశ్రోణి కురు చారుముఖేక్షణే || ౨౩ ||

విశుద్ధభావస్య హి దుష్టభావా
తామ్రేక్షణస్యాశ్రుకలస్య రాజ్ఞః |
శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం
భర్తుర్నృశంసా న చకార వాక్యమ్ || ౨౪ ||

తతః స రాజా పునరేవ మూర్ఛితః
ప్రియామదుష్టాం ప్రతికూలభాషిణీమ్ |
సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి
క్షితౌ విసంజ్ఞో నిపపాత దుఃఖితః || ౨౫ ||

ఇతీవ రాజ్ఞో వ్యథితస్య సా నిశా
జగామ ఘోరం శ్వసతో మనస్వినః |
విబోధ్యమానః ప్రతిబోధనం తదా
నివారయామాస స రాజసత్తమః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశః సర్గః || ౧౩ ||

Ayodhya Kanda Sarga 13 Meaning In Telugu

దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కానీ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసరం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు. భంగపడ్డాడు. కానీ కైక మనసు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది.

“ఓ దశరథమహారాజా! నీవేదో సత్యవాక్పరిపాలకుడవు అనీ, ఆడినమాట తప్పవనీ, అడిగినవి అన్నీ ఇస్తావనీ, లోకమంతా గొప్పగా చెప్పుకుంటారుకదా! ఇదేనా తమరి సత్యవాక్పరిపాలన! ఇదేనా తమరిసత్యసంధత! నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతావు. కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు? ఏది ఏమైనా, మిన్ను విరిగి మీద పడ్డా, రాముడు వనవాసానికి వెళ్లాలి. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది తప్పదు.” అని ఖరాఖండిగా చెప్పింది కైక. తాను ఇంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపమూ దు:ఖము ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కిందపడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ—

” ఓసి దుర్మార్గురాలా! నువ్వు నాకు భార్యవా! శత్రువువా! నా చావు కోరుకుంటావా! రాముడు అరణ్యాలకు వెళ్లిన తరువాత నేను బతికి ఉండటం కలలోని మాట! నా చావు కోరే నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకొనే నీవు, నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు ‘ఓ దశరథమహారాజా! భూలోకములో రాముడు క్షేమముగా ఉన్నాడా’ అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి. ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్నకొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా! నా వంటి వాడు అలా చేసాడు అంటే ఎవరన్నా నమ్ముతారా! ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను, ఈ నాడు నాకు పుత్రులు కలిగితే. వారిని అడవుల పాలు ఎలా చెయ్యను.
ఓ కైకా! నన్ను చంపెయ్యి. రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపు నన్ను చంపు” అని ఆవేశంతో అంటూ కూలబడిపోయాడు దశరథుడు.

కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. కైకను బతిమాలి లాభం లేదనుకొని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ” ఓ చంద్రా! ఈ రాత్రి కాళరాత్రి కానీకు. రేపు తెల్లవారనీయకు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైక ముఖం చూడటం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు.” అని మనసులోనే అనుకున్నాడు.

కాని దశరథునికి ఆశ చావలేదు. “ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో! మరొక సారి అడిగి చూద్దాం.” అని అనుకున్నాడు దశరథుడు. మరలా కైకను చూచి ఇలా అన్నాడు.

ఓ నా ముద్దుల భార్య కైకా! నువ్వు చాలా మంచిదానివి కదూ! అది తెలియక ఏదేదో అన్నానులే! పట్టించుకోకు. అయినా నా లాంటి వృద్ధునితో పరాచికాలేమిటి చెప్పు. అయినా అయోధ్యకు రాజును కదా! నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా! నీలాంటి మంచి వాళ్లు ఇలా చెయ్యవచ్చా! నా మీద కాస్త కరుణ చూపు. నీ దయ నామీద ప్రసరింపచెయ్యి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చెయ్యడం ఏమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా! నువ్వు ఆ పని చేసావనుకో నేను, అయోధ్య ప్రజలు, సమస్తలోకాలు, గురువులు అంతరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామ పట్టాభిషేకము చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు. కాబట్టి రామ పట్టాభిషేకము నీ చేతులమీదుగా జరిపించు.” అని దీనంగా ప్రార్థించాడు.

కాని కైక మనసు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశకూడా వమ్ము అయి పోయింది. మనసు ఆ దు:ఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్దశః సర్గః (13) >>

Balakanda Sarga 12 In Telugu – బాలకాండ ద్వాదశః సర్గః

Balakanda Sarga 12 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్వాదశః సర్గః రామాయణంలోని మరో కీలక అధ్యాయం. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి రాముడు, లక్ష్మణులతో కలిసి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ, రాక్షసులు మరో యజ్ఞాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు వారికి ధైర్యంగా ఎదురించి, యజ్ఞాన్ని కాపాడతాడు. అనంతరం, విశ్వామిత్రుడు రాముడికి మహాబలశాలి వాయుదేవుని కుమారుడు హనుమంతుని కథ చెబుతాడు.

అశ్వమేధసంభారః

తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే |
వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోఽభవత్ ||

1

తతః ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్ |
యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ ||

2

తథేతి చ రాజానమువాచ చ సుసత్కృతః |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

3

[* సరవ్యాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ | *]
తతో రాజాఽబ్రవీద్వాక్యం సుమంత్రం మంత్రిసత్తమమ్ |
సుమంత్రావాహయ క్షిప్రమృత్విజో బ్రహ్మవాదినః ||

4

సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్ |
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమాః ||

5

తతః సుమంత్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమః |
సమానయత్స తాన్విప్రాన్సమస్తాన్వేదపారగాన్ ||

6

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా |
ధర్మార్థసహితం యుక్తం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ||

7

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్ |
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ ||

8

తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా |
ఋషిపుత్రప్రభావేణ కామాన్ప్రాప్స్యామి చాప్యహమ్ ||

9

తతః సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వసిష్ఠప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్ ||

10

ఋశ్యశృంగపురోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం తదా |
సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతామ్ ||

11

సర్వథా ప్రాప్స్యసే పుత్రాంశ్చతురోఽమితవిక్రమాన్ |
యస్య తే ధర్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా ||

12

తతః ప్రీతోఽభవద్రాజా శ్రుత్వా తు ద్విజభాషితమ్ |
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్ ||

13

సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాదిహ |
సమర్థాధిష్ఠితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్ ||

14

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్ |
శాంతయశ్చాపి వర్తంతాం యథాకల్పం యథావిధి ||

15

శక్యః కర్తుమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా |
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్ క్రతుసత్తమే ||

16

ఛిద్రం హి మృగయంతేఽత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః |
విహతస్య హి యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి ||

17

తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే |
తథా విధానం క్రియతాం సమర్థాః కరణేష్విహ ||

18

తథేతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |
పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తమకుర్వత ||

19

తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్పార్థివర్షభమ్ |
అనుజ్ఞాతాస్తతః సర్వే పునర్జగ్ముర్యథాగతమ్ ||

20

గతేష్వథ ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్నరాధిపః |
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్వాదశః సర్గః || ౧౨ ||

Balakanda Sarga 12 Meaning In Telugu

వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్టుడైన ఋష్యశృంగుని వద్దకుపోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్ధించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు.

” ఓ దశరథ మహారాజా! అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి, దానిని యజ్ఞాశ్వముగా విడువుము.” అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు.

“సుమంతా! మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వసిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము,” అని ఆదేశించాడు.

సుమంతుడు దశరధుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరధుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు.

“బ్రాహ్మణోత్తములారా! నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి.” అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు.

“రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు”అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి, దశరథుడు అంతఃపురమునకు వెళ్లాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పన్నెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రయోదశః సర్గః (13) >>

Ayodhya Kanda Sarga 12 In Telugu – అయోధ్యాకాండ ద్వాదశః సర్గః

Ayodhya Kanda Sarga 12

“రామాయణం” లో అయోధ్యాకాండము ద్వాదశః సర్గం (12వ సర్గ) చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ సర్గలో దశరథుడు రాముని వనవాసానికి పంపించడానికి సిద్ధమవుతాడు. కైకేయి, తన భర్తకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని దశరథుని పై ఒత్తిడి తెస్తుంది. రాముడు తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి, సీత మరియు లక్ష్మణులతో పాటు వనవాసానికి బయలుదేరుతాడు. ఈ సర్గ రాముడి విధేయత, ధైర్యం, మరియు పితృవాక్య పరిపాలన అనే గొప్ప గుణాలను ప్రతిబింబిస్తుంది. అయోధ్య ప్రజలు రాముని వనవాసానికి చాలా బాధపడతారు. రాముడు, సీత మరియు లక్ష్మణులు వనానికి వెళ్ళడం ద్వారా కథలో కీలక మలుపు వస్తుంది.

కైకేయీనివర్తనప్రయాసః 

తతః శృత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః |
చింతామభిసమాపేదే ముహూర్తం ప్రతతాప చ || ౧ ||

కిం ను మే యది వా స్వప్నశ్చిత్తమోహూఽపి వా మమ |
అనుభూతోపసర్గో వా మనసో వాఽప్యుపద్రవః || ౨ ||

ఇతి సంచింత్య తద్రాజా నాభ్యగచ్ఛత్తదాసుఖమ్ |
ప్రతిలభ్య చిరాత్సంజ్ఞాం కైకేయీవాక్యతాపితః || ౩ || [తాడితః]

వ్యథితో విక్లవశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః |
అసంవృతాయామాసీనో జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ || ౪ ||

మండలే పన్నగో రుద్ధో మంత్రైరివ మహావిషః |
అహో ధిగితి సామర్షో వాచముక్త్వా నరాధిపః || ౫ ||

మోహమాపేదివాన్భూయః శోకోపహతచేతనః |
చిరేణ తు నృపః సంజ్ఞాం ప్రతిలభ్య సుదుఃఖితః || ౬ ||

కైకేయీమబ్రవీత్క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా |
నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని || ౭ ||

కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపిఽవా |
యదా తే జననీతుల్యాం వృత్తిం వహతి రాఘవః || ౮ ||

తస్యైవ త్వమనర్థాయ కిం నిమిత్తమిహోద్యతా |
త్వం మయాఽఽత్మవినాశార్థం భవనం స్వం ప్రవేశితా || ౯ ||

అవిజ్ఞానాన్నృపసుతా వ్యాలీ తీక్ష్ణవిషా యథా |
జీవలోకో యదా సర్వో రామస్యాహ గుణస్తవమ్ || ౧౦ ||

అపరాధం కముద్దిశ్య త్యక్ష్యామీష్టమహం సుతమ్ |
కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమపి వా శ్రియమ్ || ౧౧ ||

జీవితం వాఽఽత్మనో రామం న త్వేవ పితృవత్సలమ్ |
పరా భవతి మే ప్రీతిర్దృష్ట్వా తనయమగ్రజమ్ || ౧౨ ||

అపశ్యతస్తు మే రామం నష్టా భవతి చేతనా |
తిష్ఠేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా || ౧౩ ||

న తు రామం వినా దేహే తిష్ఠేత్తు మమ జీవితమ్ |
తదలం త్యజ్యతామేషః నిశ్చయః పాపనిశ్చయే || ౧౪ ||

అపి తే చరణౌ మూర్ధ్నా స్పృశామ్యేష ప్రసీద మే |
కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణమ్ || ౧౫ ||

అథ జీజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియాప్రియే |
అస్తు యత్తత్త్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి || ౧౬ ||

స మే జ్యేష్ఠః సుతః శ్రీమాన్ధర్మజ్యేష్ఠ ఇతీవ మే |
తత్త్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్ || ౧౭ ||

తచ్ఛ్రుత్వా శోకసంతప్తా సంతాపయసి మాం భృశమ్ |
ఆవిష్టాఽసి గృహం శూన్యం సా త్వం పరవశం గతా || ౧౮ ||

ఇక్ష్వాకూణాం కులే దేవి సంప్రాప్తః సుమహానయమ్ |
అనయో నయసంపన్నే యత్ర తే వికృతా మతిః || ౧౯ ||

న హి కించిదయుక్తం వా విప్రియం వా పురా మమ |
అకరోస్త్వం విశాలాక్షి తేన న శ్రద్దధామ్యహమ్ || ౨౦ ||

నను తే రాఘవస్తుల్యో భరతేన మహాత్మనా |
బహుశో హి సుబాలే త్వం కథాః కథయసే మమ || ౨౧ ||

తస్య ధర్మాత్మనో దేవి వనే వాసం యశస్వినః |
కథం రోచయసే భీరు నవ వర్షాణి పంచ చ || ౨౨ ||

అత్యంతసుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః |
కథం రోచయసే వాసమరణ్యే భృశదారుణే || ౨౩ ||

రోచయస్యభిరామస్య రామస్య శుభలోచనే |
తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాసనమ్ || ౨౪ ||

రామో హి భరతాద్భూయస్తవ శుశ్రూషతే సదా |
విశేషం త్వయి తస్మాత్తు భరతస్య న లక్షయే || ౨౫ ||

శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచనక్రియామ్ |
కస్తే భూయస్తరం కుర్యాదన్యత్ర మనుజర్షభాత్ || ౨౬ ||

బహూనాం స్త్రీసహస్రాణాం బహూనాం చోపజీవినామ్ |
పరివాదోఽపవాదో వా రాఘవే నోపపద్యతే || ౨౭ ||

సాంత్వయన్ సర్వభూతాని రామః శుద్ధేన చేతసా |
గృహ్ణాతి మనుజవ్యాఘ్రః ప్రియైర్విషయవాసినః || ౨౮ ||

సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః |
గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధి శాత్రవాన్ || ౨౯ ||

సత్యం దానం తపస్త్యాగో మిత్రతా శౌచమార్జవమ్ |
విద్యా చ గురుశుశ్రూషా ధ్రువాణ్యేతాని రాఘవే || ౩౦ ||

తస్మిన్నార్జవసంపన్నే దేవి దేవోపమే కథమ్ |
పాపమాశంససే రామే మహర్షిసమతేజసి || ౩౧ ||

న స్మరామ్యప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః |
స కథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియమ్ || ౩౨ ||

క్షమా యస్మిన్దమస్త్యాగః సత్యం ధర్మః కృతజ్ఞతా |
అప్యహింసా చ భూతానాం తమృతే కా గతిర్మమ || ౩౩ ||

మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య తపస్వినః |
దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి || ౩౪ ||

పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే |
తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురావిశేత్ || ౩౫ ||

అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్పృశామి తే |
శరణం భవ రామస్య మాఽధర్మో మామిహ స్పృశేత్ || ౩౬ ||

ఇతి దుఃఖాభిసంతప్తం విలపంతమచేతనమ్ |
ఘూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతమ్ || ౩౭ ||

పారం శోకార్ణవస్యాశు ప్రార్థయంతం పునః పునః |
ప్రత్యువాచాథ కైకేయీ రౌద్రా రౌద్రతరం వచః || ౩౮ ||

యది దత్త్వా వరౌ రాజన్ పునః ప్రత్యనుతప్యసే |
ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి || ౩౯ ||

యదా సమేతా బహవస్త్వయా రాజర్షయః సహ |
కథయిష్యంతి ధర్మజ్ఞాస్తత్ర కిం ప్రతివక్ష్యసి || ౪౦ ||

యస్యాః ప్రయత్నే జీవామి యా చ మామభ్యపాలయత్ | [ప్రసాదే]
తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి || ౪౧ ||

కిల్బిషత్వం నరేంద్రాణాం కరిష్యసి నరాధిప |
యో దత్వా వరమద్యైవ పునరన్యాని భాషసే || ౪౨ ||

శైబ్యః శ్యేనకపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ |
అలర్కశ్చక్షుషీ దత్త్వా జగామ గతిముత్తమామ్ || ౪౩ ||

సాగరః సమయం కృత్వా న వేలామతివర్తతే |
సమయం మాఽనృతం కార్షీః పుర్వవృత్తమనుస్మరన్ || ౪౪ ||

స త్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేఽభిషిచ్య చ |
సహ కౌలస్యయా నిత్యం రంతుమిచ్ఛసి దుర్మతే || ౪౫ ||

భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది వాఽనృతమ్ |
యత్త్వయా సంశ్రుతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః || ౪౬ ||

అహం హి విషమద్యైవ పీత్వా బహు తవాగ్రతః |
పశ్యతస్తే మరిష్యామి రామో యద్యభిషిచ్యతే || ౪౭ ||

ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరమ్ |
అంజలిం ప్రతిగృహ్ణంతీం శ్రేయో నను మృతిర్మమ || ౪౮ ||

భరతేనాత్మనా చాహం శపే తే మనుజాధిప |
యథా నాన్యేన తుష్యేయమృతే రామవివాసనాత్ || ౪౯ ||

ఏతావదుక్త్వా వచనం కైకేయీ విరరామ హ |
విలపంతం చ రాజానం న ప్రతివ్యాజహార సా || ౫౦ ||

శ్రుత్వా తు రాజా కైకేయ్యా వృతం పరమదారుణమ్ | [పరమశోభనమ్]
రామస్య చ వనే వాసమైశ్వర్యం భరతస్య చ || ౫౧ ||

నాభ్యభాషత కైకేయీం ముహూర్తం వ్యాకులేంద్రియః |
ప్రైక్షతానిమిషో దేవీం ప్రియామప్రియవాదినీమ్ || ౫౨ ||

తాం హి వజ్రసమాం వాచమాకర్ణ్య హృదయాప్రియామ్ |
దుఃఖశోకమయీం ఘోరాం రాజా న సుఖితోఽభవత్ || ౫౩ ||

స దేవ్యా వ్యవసాయం చ ఘోరం చ శపథం కృతమ్ |
ధ్యాత్వా రామేతి నిఃశ్వస్య చ్ఛిన్నస్తరురివాపతత్ || ౫౪ ||

నష్టచిత్తో యథోన్మత్తో విపరీతో యథాఽతురః |
హృతతేజా యథా సర్పో బభూవ జగతీపతిః || ౫౫ ||

దీనయా తు గిరా రాజా ఇతి హోవాచ కైకయీమ్ |
అనర్థమిమమర్థాభం కేన త్వముపదర్శితా || ౫౬ ||

భూతోపహతచిత్తేవ బ్రువంతీ మాం న లజ్జసే |
శీలవ్యసనమేతత్తే నాభిజానామ్యహం పురా || ౫౭ ||

బాలాయాస్తత్త్విదానీం తే లక్షయే విపరీతవత్ |
కుతో వా తే భయం జాతం యా త్వమేవంవిధం వరమ్ || ౫౮ ||

రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే |
విరమైతేన భావేన త్వమేతేనానృతేన వా || ౫౯ ||

యది భర్తుః ప్రియం కార్యం లోకస్య భరతస్య చ |
నృశంసే పాపసంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి || ౬౦ ||

కిం ను దుఃఖమలీకం వా మయి రామే చ పశ్యసి |
న కథంచిదృతే రామాద్భరతో రాజ్యమావసేత్ || ౬౧ ||

రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరమ్ |
కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్ఛేతి భాషితే || ౬౨ ||

ముఖవర్ణం వివర్ణం తం యథైవేందుముపప్లుతమ్ |
తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితామ్ || ౬౩ ||

కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివ హతాం చమూమ్ |
కిం మాం వక్ష్యంతి రాజానో నానాదిగ్భ్యః సమాగతాః || ౬౪ ||

బాలో బతాయమైక్ష్వాకశ్చిరం రాజ్యమకారయత్ |
యదా తు బహవో వృద్ధాః గుణవంతో బహుశ్రుతాః || ౬౫ ||

పరిప్రక్ష్యంతి కాకుత్స్థం వక్ష్యామి కిమహం తదా |
కైకేయ్యా క్లిశ్యమానేన రామః ప్రవ్రాజితో మయా || ౬౬ ||

యది సత్యం బ్రవీమ్యేతత్తదసత్యం భవిష్యతి |
కిం మాం వక్ష్యతి కౌసల్యా రాఘవే వనమాస్థితే || ౬౭ ||

కిం చైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశమ్ |
యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ || ౬౮ ||

భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి |
సతతం ప్రియకామా మే ప్రియపుత్రా ప్రియంవదా || ౬౯ ||

న మయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ |
ఇదానీం తత్తపతి మాం యన్మయా సుకృతం త్వయి || ౭౦ ||

అపథ్యవ్యంజనోపేతం భుక్తమన్నమివాతురమ్ |
విప్రకారం చ రామస్య సంప్రయాణం వనస్య చ || ౭౧ ||

సుమిత్రా ప్రేక్ష్య వై భీతా కథం మే విశ్వసిష్యతి |
కృపణం బత వైదేహీ శ్రోష్యతి ద్వయమప్రియమ్ || ౭౨ ||

మాం చ పంచత్వమాపన్నం రామం చ వనమాశ్రితమ్ |
వైదేహీ బత మే ప్రాణాన్ శోచంతీ క్షపయిష్యతి || ౭౩ ||

హీనా హిమవతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ |
న హి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే || ౭౪ ||

చిరం జీవితుమాశంసే రుదంతీం చాపి మైథిలీమ్ |
సా నూనం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి || ౭౫ ||

న హి ప్రవాజితే రామే దేవి జీవితుముత్సహే |
సతీం త్వామహమత్యంతం వ్యవస్యామ్యసతీం సతీమ్ || ౭౬ ||

రూపిణీం విషసంయుక్తాం పీత్వేవ మదిరాం నరః |
అనృతైర్బత మాం సాంత్వైః సాంత్వయంతీ స్మ భాషసే || ౭౭ ||

గీతశబ్దేన సంరుద్ధ్య లుబ్ధో మృగమివావధీః |
అనార్య ఇతి మామార్యాః పుత్రవిక్రాయకం ధ్రువమ్ || ౭౮ ||

ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా |
అహో దుఃఖమహో కృచ్ఛ్రం యత్ర వాచః క్షమే తవ || ౭౯ ||

దుఃఖమేవంవిధం ప్రాప్తం పురాకృతమివాశుభమ్ |
చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షితా || ౮౦ ||

అజ్ఞానాదుపసంపన్నా రజ్జురుద్బంధినీ యథా |
రమమాణస్త్వయా సార్ధం మృత్యుం త్వాం నాభిలక్షయే || ౮౧ ||

బాలో రహసి హస్తేన కృష్ణసర్పమివాస్పృశమ్ |
మయా హ్యపితృకః పుత్రః స మహాత్మా దురాత్మనా || ౮౨ ||

తం తు మాం జీవలోకోఽయం నూనమాక్రోష్టుమర్హతి |
బాలిశో బత కామాత్మా రాజా దశరథో భృశమ్ || ౮౩ ||

యః స్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి |
వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్శితః || ౮౪ ||

భోగకాలే మహత్కృచ్ఛ్రం పునరేవ ప్రపత్స్యతే |
నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుమ్ || ౮౫ ||

స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి |
యది మే రాఘవః కుర్యాద్వనం గచ్ఛేతి చోదితః || ౮౬ ||

ప్రతికూలం ప్రియం మే స్యాత్ న తు వత్సః కరిష్యతి |
శుద్ధభావో హి భావం మే న తు జ్ఞాస్యతి రాఘవః || ౮౭ ||

స వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి |
రాఘవే హి వనం ప్రాప్తే సర్వలోకస్య ధిక్కృతమ్ || ౮౮ ||

మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయమ్ |
మృతే మయి గతే రామే వనం మనుజపుంగవే || ౮౯ ||

ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యసే |
కౌసల్యా మాం చ రామం చ పుత్రౌ చ యది హాస్యతి || ౯౦ ||

దుఃఖాన్యసహతీ దేవీ మామేవానుమరిష్యతి |
కౌసల్యాం చ సుమిత్రాం చ మాం చ పుత్రైస్త్రిభిః సహ || ౯౧ ||

ప్రక్షిప్య నరకే సా త్వం కైకేయి సుఖితా భవ |
మయా రామేణ చ త్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః || ౯౨ ||

ఇక్ష్వాకుకులమక్షోభ్యమాకులం పాలయిష్యసి |
ప్రియం చేద్భరతస్యైతద్రామప్రవ్రాజనం భవేత్ || ౯౩ ||

మా స్మ మే భరతః కార్షీత్ప్రేతకృత్యం గతాయుషః |
హంతానార్యే మమామిత్రే సకామా భవ కైకయి || ౯౪ ||

మృతే మయి గతే రామే వనం పురుషపుంగవే |
సేదానీం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి || ౯౫ ||

త్వం రాజపుత్రీవాదేన న్యవసో మమ వేశ్మని |
అకీర్తిశ్చాతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే || ౯౬ ||

సర్వభూతేషు చావజ్ఞా యథా పాపకృతస్తథా |
కథం రథైర్విభుర్యాత్వా గజాశ్వైశ్చ ముహుర్ముహుః || ౯౭ ||

పద్భ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి |
యస్య త్వాహారసమయే సూదాః కుండలధారిణః || ౯౮ ||

అహంపుర్వాః పచంతి స్మ ప్రశస్తం పానభోజనమ్ |
స కథం ను కషాయాణి తిక్తాని కటుకాని చ || ౯౯ ||

భక్షయన్వన్యమాహారం సుతో మే వర్తయిష్యతి |
మహార్హవస్త్రసంవీతో భూత్వా చిరసుఖోషితః || ౧౦౦ ||

కాషాయపరిధానస్తు కథం భూమౌనివత్స్యతి |
కస్యైతద్దారుణం వాక్యమేవంవిధమచింతితమ్ || ౧౦౧ ||

రామస్యారణ్యగమనం భరతస్యాభిషేచనమ్ |
ధిగస్తు యోషితో నామ శఠాః స్వార్థపరాః సదా |
న బ్రవీమి స్త్రియః సర్వా భరతస్యైవ మాతరమ్ || ౧౦౨ ||

అనర్థభావేఽర్థపరే నృశంసే
మమానుతాపాయ నివిష్టభావే |
కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం
హితానుకారిణ్యథవాఽపి రామే || ౧౦౩ ||

పరిత్యజేయుః పితరో హి పుత్రా-
-న్భార్యాః పతీంశ్చాపి కృతానురాగాః |
కృత్స్నం హి సర్వం కుపితం జగత్స్యా-
-ద్దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నమ్ || ౧౦౪ ||

అహం పునర్దేవకుమారరూప-
-మలంకృతం తం సుతమావ్రజంతమ్ |
నందామి పశ్యన్నపి దర్శనేన
భవామి దృష్ట్వా చ పునర్యువేవ || ౧౦౫ ||

వినాఽపి సూర్యేణ భవేత్ప్రవృత్తి-
-రవర్షతా వజ్రధరేణ వాఽపి |
రామం తు గచ్ఛంతమితః సమీక్ష్య
జీవేన్న కశ్చిత్త్వితి చేతనా మే || ౧౦౬ ||

వినాశకామామహితామమిత్రా-
-మావాసయం మృత్యుమివాత్మనస్త్వామ్ |
చిరం బతాంకేన ధృతాసి సర్పీ
మహావిషా తేన హతోఽస్మి మోహాత్ || ౧౦౭ ||

మయా చ రామేణ చ లక్ష్మణేన
ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ |
పురం చ రాష్ట్రం చ నిహత్య బాంధవాన్
మమాహితానాం చ భవాభిహర్షిణీ || ౧౦౮ ||

నృశంసవృత్తే వ్యసనప్రహారిణి
ప్రసహ్య వాక్యం యదిహాద్య భాషసే |
న నామ తే కేన ముఖాత్పతంత్యధో
విశీర్యమాణా దశనాః సహస్రధా || ౧౦౯ ||

న కించిదాహాహితమప్రియం వచో
న వేత్తి రామః పరుషాణి భాషితుమ్ |
కథం ను రామే హ్యభిరామవాదిని
బ్రవీషి దోషాన్గుణ నిత్యసమ్మతే || ౧౧౦ ||

ప్రతామ్య వా ప్రజ్వల వా ప్రణశ్య వా
సహస్రశో వా స్ఫుటితా మహీం వ్రజ |
న తే కరిష్యమి వచః సుదారుణం
మమాహితం కేకయరాజపాంసని || ౧౧౧ ||

క్షురోపమాం నిత్యమసత్ప్రియంవదాం
ప్రదుష్టభావాం స్వకులోపఘాతినీమ్ |
న జీవితుం త్వాం విషహేఽమనోరమాం
దిధక్షమాణాం హృదయం సబంధనమ్ || ౧౧౨ ||

న జీవితం మేఽస్తి పునః కుతః సుఖం
వినాఽఽత్మజేనాఽత్మవతః కుతో రతిః |
మమాహితం దేవి న కర్తుమర్హసి
స్పృశామి పాదావపి తే ప్రసీద మే || ౧౧౩ ||

స భూమిపాలో విలపన్ననాథవత్
స్త్రియా గృహీతో హృదయేఽతిమాత్రయా |
పపాత దేవ్యాశ్చరణౌ ప్రసారితా-
-వుభావసంస్పృశ్య యథాఽతురస్తథా || ౧౧౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాదశః సర్గః || ౧౨ ||

Ayodhya Kanda Sarga 12 Meaning In Telugu

కైక మాటలు విన్న దశరథుడికి నోటమాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కలా నిజమా అనే భ్రమలో పడ్డాడు. లేక తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనసు, కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమ క్రమంగా స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది.

కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కళ్లుతెరిచాడు. కైకను చూచాడు. “ఛీ ఛీ పాపాత్మురాలా నీవా” అంటూ మరలా సృహ తప్పాడు. చాలా సేపటివరకూ అలాగే ఉన్నాడు. కైక తగు ఉ పచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకూ గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కైక వంక చూచి ఇలా అన్నాడు.

“ఓసి దుర్మార్గురాలా! నీవేనా ఈ మాటలు అన్నది. నా రాముడు కానీ, నేను కానీ, నీకు ఏమి అపకారము చేసాము. మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు. తాను పుట్టినప్పటినుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా! ఇది నీకు న్యాయమా! నీవు రాచ పుట్టుక పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకొని మా కుటుంబంలోకి తీసుకొని వచ్చాను. కాని ఏం ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతావు అని అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది.

అది సరే. రాముని వనములకు పంపమన్నావు కదా! లోకము అంతా రాముని సకల సద్గుణ సంపన్నుడు అని కీర్తిస్తుంటే, అతనిలో ఏ దోషము చూపి నేను రాముని వనములకు పంపాలి. ఓ కైకా! నీకు తెలుసో లేదో! నేను నా భార్యలైన కౌసల్యను, సుమిత్రను, నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముని మాత్రం వదలను తెలుసా! రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనపడక పోతే నాకు పై ప్రాణాలు పైకేపోతాయి. ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కాని, నీరు లేకుండా పంటలు పండుతా యోమే కానీ, రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. ఇది యదార్థము.

కైకా! కోపంలో ఏదేదో అన్నాను. నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకు పట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో ఇస్తాను. ” అని కైక మొహంలోకి చూచాడు. కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. మరలా దశరథుని కోపం తారస్థాయికి చేరింది.
“ఓసి దుర్మార్గురాలా! అసలు ఇంతటి పరమదారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే!” అని అరిచాడు.

అంతలోనే తేరుకొని “అలా కాదులే! ఆ! నాకు తెలిసిందిలే! నాకు భరతుని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదూ! అంతే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరతావు! ఎందుకంటే నీవు ఇదివరకు మాట్లాడేటప్పుడు ‘రాముడే నా పెద్ద కుమారుడు. భరతుడు నా రెండవ కుమారుడు’ అని ఎన్నిసార్లు నువ్వు అనలేదు. ఆ మాటలు మేమందరమూ విని ఎంతో సంతోషించాము కదా! ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు అని నాకు తెలుసు. అలాగే అగుగాక! లేకపోతే నీకు రాముని మీద ద్వేషభావం ఎందుకు ఉంటుంది. ఏమో!

అది సరే! రాముని పట్టాభిషేక వార్త విని రాముడు అంటే పడని వాళ్లు నీకు ఏమన్నా దుర్భోధలు చేసారా! ఆ మాటలు విని నువ్వు కోపగృహంలో పడుకున్నావా! కైకా! నీవు వివేకము కలదానవు. నీతి మంతురాలివి. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా! కైకా! నీవు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడావా! అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద దయయుంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుటపడుతుంది.

ఓ కైకా! నీవు చిన్నప్పటినుండి రాముని, భరతుని నీ ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నో కథలు చెప్పావు కదా! నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్లపొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడు అని అనుకుంటున్నావు. రాముడు మాత్రం తక్కువ వాడా! తన కన్నతల్లి కౌసల్య కన్నా నీకు ఎక్కువ సేవలు చేసాడు కదా! అలాంటి రాముని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఎంతో మంది దాసదాసీ జనము ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేసాడు కదా రాముడు. అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్లు వేరే ఎవరు ఉన్నారో చెప్పు.
పోనీ రాముడు ఏమన్నా అకృత్యాలు చేసాడా అంటే… అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైన వాడు. తాను చేసిన మంచి కార్యములకు అందరి చేతా మన్ననలు పొందిన వాడు. అతని మీద కొంచెం కూడా అపనింద పడే అవకాశము లేదు. మరి ఎందుకు రాముని అరణ్యవాసము చెయ్యమంటున్నావు. ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు.

ఓ కైకా! రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసు. అయినా మరొకసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దాన ధర్మములతో దీనజనమును, తన శుశ్రూషులతో గురువు లను, తన వీరత్వముతో శత్రువులను జయించాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువులకు శుశ్రూష, ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనేమాటకు రామునికి అర్థం తెలియదు. అటువంటి “రామునికి అపకారము చెయ్యవలెనని దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది.

కైకా! రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి రామునితో నీ కోసం పరుషంగా ఎలా మాట్లాడమంటావు. అడవులకు పో అని ఎలా చెప్పమంటావు?

ఓ కైకా! మరలా వేడుకుంటున్నాను. నాకా వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నాకు రాముని దూరం చెయ్యకు. నువ్వు కావాలంటే నా రాజ్యము యావత్తు నీకు ధారపోస్తాను. రాముని మాత్రం నాకు విడిచిపెట్టు. ఓ కైకా! నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముని విడిచిపెట్టు నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించు.” అని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు.

దశరథుని దీన మైన మాటలు కైకలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వార్ధం ఆమె హృదయంలో కరుడు గట్టిపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా ములుకుల వంటి మాటలు మాట్లాడింది.

“ఓ దశరథమహారాజా! నీవు వీరుడవు. యుద్ధరంగంలో నిన్ను రెండు సార్లు కాపాడి నీ ప్రాణాలు రక్షించి నందుకు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నావు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. ఏవోవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా! ఇది ధర్మాత్ములు చేసే పనేనా! ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా! ఈ విషయం నీవు భక్తితో పూజించే ఋషులకు, మునులకు చెప్పు.
‘అయ్యా! నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. కైక అనుగ్రహము వలననే నేను బతుకుతున్నాను. అలాంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను.’ అని చెప్పు. వాళ్లు నిన్ను ధర్మాత్ముడు అంటారా! లేక మాట తప్పిన వాడంటారా!

ఓ దశరథ మహారాజా! ఆడిన మాట తప్పి నువ్వు నీ వంశమునకు, నీ పూర్వీకులకు కళంకము తీసుకొని వస్తున్నావు. ఆడిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరమునే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రములను దానం చేసాడు. వారంతా నీ వంశములోని వారే. సముద్రుడు దేవతలకు ఇచ్చినమాట ప్రకారము చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా! నీకేమయింది. ఇచ్చిన వరాలను వెనక్కు తీసుకుంటున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముని యువరాజుగా చేసి కౌసల్యను పట్టపురాణిగా చేసి నన్ను నా కుమారుని అనాధలుగా చెయ్యాలని చూస్తున్నావు..

ఇంతెందుకు. ఓ దశరధమహారాజా! నేను అడిగింది ధర్మమ అధర్మమో, సత్యమో అసత్యమో, నాకు అనవసరము. మీరు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు నాకు ఇవ్వాలి అంతే. దీనికి తిరుగు లేదు. నా మాటలు లక్ష్యపెట్టకుండా రామునికి పట్టాభిషేకము చేస్తే నేను నీ ఎదుటనే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజు అని విర్రవీగుతున్న నా సవతి కౌసల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు.
ఓ దశరథ మహారాజా! నా మీద నా కొడుకు భరతుని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు అరణ్యములకు వెళ్లాలి.

నాకుమారుడు యువరాజు కావాలి. అంతే. ఇంక దేనికీ నేను ఒప్పుకోను. ఆ రెండు తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కరలేదు. తరువాత తమరి ఇష్టం.” అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది. కైకేయి మనోనిశ్చయము విని దశరథుడు నోటమాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకము కన్నా రామ వనవాసము దశరథుని మనసు బాగా కలచి వేసింది. అటువంటి దుర్గార్గపు వరములు కోరిన కైక వంక చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. దశరథునికి మతిభ్రమించి నట్టు అయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అమాయకంగా కైక వంక చూచాడు.

“ఓ కైకా! నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేసారే అనుకో! నువ్వు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా! నీకే మన్నా దయ్యం పట్టిందా. లేక పిశాచము ఆవహించిందా. ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు. నీకు చిన్నప్పటినుండీ ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్లు నాకు చెప్పనేలేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించలేదు. ఈరోజు నీకేం పుట్టింది. ఇలా మాట్లాడుతున్నావు.

ఇంతకూ నీకు ఎవరి వల్ల భయము. రాముని వల్లనా! లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసము ఎందుకు కోరుతున్నావు. రాముడంటే నీకు ఎందుకు అంత భయం? కైకా! మరలా చెబుతున్నాను. నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోద్యకు క్షేమం కోరేదానివయితే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో. బాగుపడతావు.” అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడుఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిట్టడం మొదలెట్టాడు.

“ఓసి పాపాత్మురాలా! క్రూరురాలా! క్షుద్రురాలా! దుర్మార్గురాలా! నాలో నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయే! మేము నీకు ఏం ద్రోహం చేసామే! నీకు తెలుసో లేదో. భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంతమాత్రమూ అంగీకరించడు. నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు. రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు. ధర్మాచరణములో రాముని కన్నా భరతుడే మిన్న.” దశరథుడు వెంటనే దీనంగా మారిపోయాడు.

“కైకా! కైకా! నేను రాముని వద్దకు పోయి ‘రామా! నీవు అరణ్యములకు పోవాలి’ అని ఎలా చెప్పగలను. అలా చెప్పిన తరువాత రాముని మొహం ఎలా చూడగలను. అది అటుండనీ. నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదము పొందిన తరువాతనే తీసుకున్నాను. సామంత రాజులందరినీ ఆహ్వానించాను. ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్లందరూ ఏమంటారు? ఈ ప్రకారంగా క్షణక్షణమూ నిర్ణయాలు మార్చుకొనేవాడు ఇన్నాళ్లు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా! అది నీకు ఇష్టమా! ఇప్పుడు రాముడు వనవాసమునకు వెళితే, రేపు పురప్రముఖులు అంతా వచ్చి “మా రాముడు ఏడీ!” అని అడిగితే నేను వారికి ఏమని సమాధానము చెప్పగలను.
“అయ్యా! నా భార్య కైక మాట విని రాముని అరణ్యములకు పంపాను” అని చెబితే ఎవరూ నా మాట వినరు. దశరథుడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటారు. అది నీకు సమ్మతమా!

కౌసల్య వచ్చి నా కుమారుడు రాముని అరణ్యములకు ఎందుకు పంపావు? కారణం ఏమిటి? అన్ని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను. నా మూడోభార్య మాటవిని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నాగురించి కౌసల్య ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా!

కైకా! నీకుమారునికి పట్టాభిషేకము అంటే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అనుకోవచ్చు. కాని రాముని అరణ్యములకు పంపే హక్కు నీకూ నాకూ ఎక్కడిది! ఆలోచించు. నా కుమారుని అడవులకు పంపే అధికారము మీకు ఎక్కడిది అని కౌసల్య నన్ను నిలదీస్తే, నేను ఏమని సమాధానము చెప్పను? కైకా! నీకు ప్రీతి కలిగించడం కోసరం నేను కౌసల్యను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా! ఆమె నాకు సేవలు చెయ్యడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను. ఎవరి కోసం? నీ కోసమే కదా! కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా! అవునులే! చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏమి లాభం! రోగంతో బాధపడేవాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు అయింది.

కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే, సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది! ఇంక నన్ను నమ్ముతుందా! తనకుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుంది అని అనుకోదూ! వీళ్లు సరే కన్న తల్లులు. మరి రాముని నమ్ముకొని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్థాంగి సీత. ఆమె గతేం కావాలి. భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా! ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశము చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బ్రద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నీవు, హాయిగా విధవరాలుగా, కొడుకుతో సహా రాజ్యము ఏలుకుంటావు. ఇదేగా నీవు కోరుకొనేది. నీ కోరికల ఫలితం.

కైకా! నీ అందచందాలు చూసి నీవు మంచిదానవు అనుకున్నాను కానీ నీ కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు. కడుపులో ఇంత విషం దాచుకొని నాతో ఇన్నాళ్లు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడావన్నమాట! ఎంత మోసం? అవునులే. నిన్ను అనుకోని ఏం లాభం. నా ఖర్మ ఇలా కాలింది. ‘రాజ్యము ఇస్తాననని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు’ అని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటుంటే, వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు పట్టింది. నీమాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టాలు దాపు రించాయి. ఏ జన్మలో ఏం పాపం చేసానో ఈ జన్మలో అనుభవి స్తున్నాను. లేకపోతే ఎక్కడో కేకయ దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను. నువ్వే నా మృత్యు దేవతవు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను.

కన్నకొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడూ ఒక తండ్రేనా! ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్నకొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు’ అని అయోధ్యావాసులు అందరూ నన్ను దూషిస్తారు. పాపం రాముడు. వాడికి చిన్నప్పటి నుండీ అన్నీ కష్టాలే. చిన్నపుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయింది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో!

పోనీ రాముడైనా “నేను అరణ్యాలకు పోను” అంటే అదొకదారి. కాని నేను రాముడిని పిలిచి “రామా! నీవు పధ్నాలుగేళ్లు అరణ్యములకు వెళ్లాలి అంటే చాలు” మరుక్షణం వెళ్లిపోతాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలనను పక్కన పెట్టి “నేనెందుకు అరణ్యాలు పోవాలి. నేను వెళ్లను” అని రాముడు అంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే రామునికి కపటం తెలియదు. నిర్మలహృదయుడు. నా మాట ధిక్కరించడం, అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టం అని రామునికి ఎలా తెలిసేది! నేనా చెప్ప లేను. రామునికి ఎవరు రాముడు అరణ్యములకు పోయిన తరువాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అని సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చెయ్యకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను కాదు, కొడుకు అరణ్యాలకు పోయి, భర్త మరణిస్తే కౌసల్య ఎలా జీవించి ఉంటుంది. తాను కూడా నాతోపాటు స్వర్గం చేరుకుంటుంది.

ఓ కైకా! మేమందరమూ పోయిన తరువాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకూ రాజ్యం ఏలుకోండి. ఇప్పటిదాకా ఇక్ష్వాకు వంశము మచ్చలేకుండా నడిచింది. ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయని మచ్చ పడింది. ఇదిగో కైకా! ఇప్పుడే చెబుతున్నాను. రాముని వనవాసము, నా మరణము, ఒకేసారి సంభవిస్తాయి. భరతుని నాకు పితృకార్యాలు చెయ్యవద్దని చెప్పు. రాముని కాదని రాజ్యమేలే వాడు నా కొడుకు కాదు.
ఓసి దుర్మార్గురాలా! ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదా! నీది మనసా లేక బండరాయా! నా కొడుకు అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలిగా సుఖాలు అనుభవిద్దాము అనుకుంటున్నావా!

నీ వలన మా వంశం అంతా సర్వ నాశనము అయింది కదే దుర్మార్గురాలా! ఇంతకాలమూ ఒక రాజకుమారుడిగా, రథములమీద, హయముల మీదా తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో, కటిక రాళ్ల మీద ఒట్టి కాళ్లతో తిరగాలా! ఇన్నాళ్లు రాచభవనంలో షడ్రసోపేతమైన విందుభోజనము చేసిన వాడు అడవులలో కంద మూలములు తినాలా! అనుక్షణమూ పీతాంబరములు, పట్టువస్త్ర ములు తప్ప వేరు వస్త్రములు ధరించని రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు. రాముడు అరణ్యములకు వెళ్లాలి అన్న దురాలోచన నీ మస్తిష్కములో ఎవరు జొప్పించారు కైకా!

నీ ప్రవర్తన చూస్తుంటే మీ ఆడవాళ్లందరూ పైకి ప్రేమ నటిస్తూ లోలోపల గొంతులు కోస్తారని తెలుస్తూ ఉంది. కాని అందరు స్త్రీలు నీ మాదిరి ఉండరులే. మహాపతివ్రతలు కూడా ఉంటారు. ఓ కైకా! ఓ స్వార్థపరురాలా! ఓ దుర్మార్గురాలా! ఓ క్రూరురాలా! ఈరోజు కేవలం నన్ను అష్టకష్టాల పాలు చెయ్యాలని కంకణం కట్టుకున్నావా. ఇలా మాట్లాడు తున్నావు. రాముడు అడవులలో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తు అంతా నిన్ను దూషించక మానదు. పురుషులంతా నీ లాంటి భార్యలను వదిలివేస్తారు.

ఓ కైకా! నామాట వినవే. ఒక్కసారి ఆ కల్యాణ రాముని చూడవే! రాముడిని చూస్తుంటే నయనాదం కలగడం లేదా నీకు. కైకా! ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బతక వచ్చు. ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బతక వచ్చు కానీ రాముడు లేనిది ఎవరూ బతకలేరు. అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను. నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం. ఇన్నాళ్లు. పాములాంటి నిన్ను పక్కనపెట్టుకొని ఈ నాడు నీ చేత కాటు వేయించుకున్నాను.

ఓ కైకా! మూర్ఖురాలా! నా రాముని అరణ్యములకు పంపి, నన్ను చంపి, నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలగించ దలచుకున్నారా! ఇలాంటి మాటలు మాట్లాడినందుకూ ఇటువంటి కోరికలు కోరినందుకూ నీ తల ఎందుకు వెయ్యివక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం తెలియని రామునికి అపకారం చెయ్యడం, అడవులకు పంపాలి అని కోరడం లాంటి మహాపాపం చేసిన తరువాత నువ్వు ఇంకా బతికి ఉండటమా!

ఓ కైకా! నా నిర్ణయం విను. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఆఖరుకు చచ్చినా నువ్వు కోరిన కోరికలు తీర్చను. నీ మాట నెరవేర్చను. నాకు అసత్యదోషం అంటినా సరే. లెక్క చేయను. ఎందుకంటే మంచి వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడం ధర్మం కానీ, నీ లాంటి దుర్మార్గులకు, అబద్ధాలు ఆడేవాళ్లకు, దుష్టురాలకు, కులనాశకులకు, నా మనసుకు కష్టము కలిగించిన దానికి, ఆఖరుకు నా హృదయంలో చిచ్చుపెట్టిన పాషండురాలికి ఇస్తానన్న వరాలు ఇవ్వక పోవడమే ధర్మం.

ఓ కైకా! మరలా మరలా చెబుతున్నాను. రాముని విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బతుకలేను. ఇంక నాకు సుఖసంతోషాలు ఎక్కడ ఉంటాయి. కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను, లోకాన్ని రక్షించు.” అని కైక పాదాలమీద పడబోయాడు దశరథుడు.

అప్పటి దాకా మౌనంగా అన్నీ వింటూ ఉంది కైక. సహజంగా ఉ త్తమురాలైన కైక మనసు ద్రవించి పోయింది. దీనంగా రోదిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్లు పట్టుకుంటాడో, తనపాతివ్రత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది. కైక కాళ్లు పట్టుకోకుండానే దశరథుడు కిందపడిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రయోదశః సర్గః (13) >>

Balakanda Sarga 11 In Telugu – బాలకాండ ఏకాదశః సర్గః

Balakanda Sarga 11 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకాదశః సర్గములో, తన మంత్రి సుమంత్రుని సలహా మేరకు, దశరథుడు ఋష్యశృంగ మహర్షి మరియు అతని భార్య శాంతను తన రాజధాని అయోధ్యకు తీసుకురావడానికి అంగ రాజ్యానికి వెళ్తాడు.

ఋశ్యశృంగస్యాయోధ్యాప్రవేశః

భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితమ్ |
యథా స దేవప్రవరః కథయామేవమబ్రవీత్ ||

1

ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |
రాజా దశరథో రాజా శ్రీమాన్సత్యప్రతిశ్రవః ||

2

అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి |
[* కన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి | *]
పుత్రస్తు సోఽఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుతః ||

3

తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః |
అనపత్యోఽస్మి ధర్మాత్మన్ శాంతా భర్తా మమ క్రతుమ్ ||

4

ఆహరేత త్వయాజ్ఞప్తః సంతానార్థం కులస్య చ |
శ్రుత్వా రాజ్ఞోఽథ తద్వాక్యం మనసాపి విమృశ్య చ ||

5 [విచింత్య]

ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భర్తారమాత్మవాన్ |
ప్రతిగృహ్యం చ తం విప్రం స రాజా విగత జ్వరః ||

6

ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాంతరాత్మనా |
తం చ రాజా దశరథో యష్టుకామః కృతాంజలిః ||

7

ఋశ్యశృంగం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ |
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః ||

8

లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాం పతిః |
పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారోఽమితవిక్రమాః ||

9

వంశప్రతిష్ఠానకరాః సర్వలోకేషు విశ్రుతాః |
ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్కథామ్ ||

10

సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః |
స త్వం పురుషశార్దూల తమానయ సుసత్కృతమ్ ||

11

స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః |
[* సుమంత్రస్య వచః శ్రుత్వా హృష్టో దశరథోఽభవత్ | *]
అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశామ్య చ ||

12

వసిష్ఠేనాభ్యనుజ్ఞాతో రాజా సంపూర్ణమానసః |
సాంతఃపురః సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః ||

13

వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః |
అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః ||

14

ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్ |
ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్ ||

15

తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః |
సఖిత్వాత్తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా ||

16

రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే |
సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్ ||

17

ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః |
సప్తాష్ట దివసాన్రాజా రాజానమిదమబ్రవీత్ ||

18

శాంతా తవ సుతా రాజన్సహ భర్త్రా విశాంపతే |
మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతమ్ ||

19

తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః |
ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా ||

20

ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా |
స నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా ||

21

తావాన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా |
ననందతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్ ||

22

తతః సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః |
పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామినః ||

23

క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతమ్ |
ధూపితం సిక్త సమ్మృష్టం పతాకాభిరలంకృతమ్ ||

24

తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్ |
తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా ||

25

తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ |
శంఖదుందుభినిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభమ్ ||

26

తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్ |
ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణా ||

27

[* యథా దివి సురేంద్రేణ సహస్రాక్షేణ కాశ్యపమ్ | *]
అంతఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః |
కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్ ||

28

అంతఃపురాణి సర్వాణి శాంతాం దృష్ట్వా తథాగతామ్ |
సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందముపాగమన్ ||

29

పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః |
ఉవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా ||

30 [సహద్విజా]

“ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి.

‘రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.’ అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను.

కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని సుమంతుడు చెప్పాడు.

ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారములు చేసాడు. అంగరాజు పక్కన అగ్ని వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేసాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు.

దశరథుడు అంగరాజ్యములో ఏడురోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు.

“ఓ అంగరాజా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది.” అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు.

ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగా నే అయోధ్యావాసులకు తెలియజేసాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు.

దశరధుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్యానిం చారు. శాంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదకొండవసర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ద్వాదశః సర్గః (12) >>

Balakanda Sarga 13 In Telugu – బాలకాండ త్రయోదశః సర్గః

Balakanda Sarga 13 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండములో త్రయోదశః సర్గలో రాజు దశరథుడు వైదిక కర్మకు సంబంధించిన పనులను ప్రారంభించమని రాజ పురోహితుడైన వశిష్ట ఋషిని అభ్యర్థించాడు. వశిష్ఠ మహర్షి కార్యాలను అమలు చేయడంలో పాటించాల్సిన క్రమశిక్షణ గురించి సంబంధిత వారందరికీ సూచించాడు. వశిష్ఠ మహర్షి మంత్రివర్యుడైన సుమంత్రుడికి ఇతర దేశాలలోని వివిధ రాజులను ఆహ్వానించమని ఆదేశిస్తాడు, మరియు ఆ రాజులను గొప్ప ఆతిథ్యంతో స్వాగతిస్తారు. దశరథ రాజు తన భార్యలతో కలిసి కర్మ ప్రతిజ్ఞ చేసి కర్మ మందిరంలోకి ప్రవేశిస్తాడు.

యజ్ఞశాలాప్రవేశః

పునః ప్రాప్తే వసంతే తు పూర్ణః సంవత్సరోఽభవత్ |
ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్ ||

1

అభివాద్య వసిష్ఠం చ న్యాయతః ప్రతిపూజ్య చ |
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమమ్ ||

2

యజ్ఞో మే ప్రీయతాం బ్రహ్మన్యథోక్తం మునిపుంగవ | [క్రియతాం]
యథా న విఘ్నః క్రియతే యజ్ఞాంగేషు విధీయతామ్ ||

3

భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ |
వోఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః ||

4

తథేతి చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః |
కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్ ||

5

తతోఽబ్రవీద్ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్ |
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్పరమధార్మికాన్ ||

6

కర్మాంతికాన్ శిల్పకరాన్వర్ధకీన్ఖనకానపి |
గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్ ||

7

తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్సుబహుశ్రుతాన్ |
యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసనాత్ ||

8

ఇష్టకా బహుసాహస్రా శీఘ్రమానీయతామితి |
ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞాం బహుగుణాన్వితాః ||

9

బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః |
భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః ||

10

తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః |
[* అధికపాఠః –
ఆగతానాం సుదూరాచ్చ పార్థివానాం పృథక్ పృథక్ |
వాజివారణశాలాశ్చ తథా శయ్యాగృహాణి చ |
భటానాం మహదావాసా వైదేశికనివాసినామ్ |
*]
ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితాః ||

11

తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్ |
దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా ||

12

సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి ||

13

యజ్ఞకర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా |
తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్ ||

14

తే చ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ |
యథా సర్వం సువిహితం న కించిత్పరిహీయతే ||

15

తథా భవంతః కుర్వంతు ప్రీతిస్నిగ్ధేన చేతసా |
తతః సర్వే సమాగమ్య వసిష్ఠమిదమబ్రువన్ ||

16

యథోక్తం తత్సువిహితం న కించిత్పరిహీయతే |
తతః సుమంత్రమాహూయ వసిష్ఠో వాక్యమబ్రవీత్ ||

17

నిమంత్రయస్వ నృపతీన్పృథివ్యాం యే చ ధార్మికాః |
బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః ||

18

సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్ |
మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్ ||

19

నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్ |
తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్ ||

20

పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే |
తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్ ||

21

సద్వృత్తం దేవసంకాశం స్వయమేవానయస్వ హ |
తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్ ||

22

శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ |
అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతమ్ ||

23

వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్ |
ప్రాచీనాన్సింధుసౌవీరాన్సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ ||

24

దాక్షిణాత్యాన్నరేంద్రాశ్చ సమస్తానానయస్వ హ |
సంతి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే ||

25

తానానయ తతః క్షిప్రం సానుగాన్సహబాంధవాన్ |
[* ఏతాన్ దూతైః మహాభాగైః ఆనయస్వ నృపాజ్ఞ్యా | *]
వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమంత్రస్త్వరితస్తదా ||

26

వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్ |
స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్ ||

27

సుమంత్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః |
తే చ కర్మాంతికాః సర్వే వసిష్ఠాయ చ ధీమతే ||

28

సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితమ్ |
తతః ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్సర్వానిదమబ్రవీత్ ||

29

అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా |
అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః ||

30

తతః కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షితః |
బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య హ ||

31

తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్ |
ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్ ||

32

మయా చ సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః |
యజ్ఞియం చ కృతం రాజన్పురుషైః సుసమాహితైః ||

33

నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమంతికాత్ |
సర్వకామైరుపహృతైరుపేతం వై సమంతతః ||

34

ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితమ్ |
తథా వసిష్ఠవచనాద్దృశ్యశృంగస్య చోభయోః ||

35

శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః |
తతో వసిష్ఠప్రముఖాః సర్వ ఏవ ద్విజోత్తమాః ||

36

ఋశ్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తదా |
యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి |
శ్రీమాంశ్చ సహపత్నీభీ రాజా దీక్షాముపావిశత్ ||

37

Balakanda Sarga 13 In Telugu Pdf With Meaning

యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్టులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. “మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి.” అని వారిని ప్రార్థించాడు.

“మహారాజా! మీరు కోరినట్లే జరుగుతుంది” అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు.

తరువాత పురోహితుడైన వశిష్టుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, శిల్పులను, కొయ్యపనిచేసే వారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, “దశరథమహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఏలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధపెట్టకండి. ఈయజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకరర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు.” అని ఆదేశించాడు వశిష్టుడు.

పిమ్మట వశిష్టుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. “సుమంతా! నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపది జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొని రా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధి పతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పుదేశపు రాజులను, దక్షిణదేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ, సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు.” అని పలికాడు వశిష్టుడు.

వశిష్టుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు. ఆయాకార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయాపనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు. వసిష్టుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేసాడు. ఆవిషయము దశరథునికి చెప్పాడు.

వశిష్టుడు, ఋష్యశృంగుడు దశరథమహారాజు వద్దకు పోయి ” ఓ దశరథమహారాజా! మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞ శాలకు రావాలి.” అనిపలికారు.

ఒక శుభముహూర్తమున దశరథమహారాజు, తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వసిష్టుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదమూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ చతుర్దశః సర్గః (14) >>