Ayodhya Kanda Sarga 94 In Telugu – అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 94

అయోధ్యాకాండం చతుర్నవతితమ (94వ) సర్గలో, భరతుడు వశిష్ఠ మహర్షితో కలిసి రాముని ఆశ్రమం వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అతని వెంట కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణాన్ని రాముని చెబుతాడు. రాముడు తండ్రి మరణ వార్త విని శోకసంద్రుడవుతాడు. భరతుడు రాముడిని అరణ్యవాసం నుండి తిరిగి రావలసిందిగా ప్రార్థిస్తాడు. రాముడు తన కర్తవ్యాన్ని సమర్థిస్తూ, తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం పూర్తి చేస్తానని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలు తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచుతానని, రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యం పాలిస్తానని అంగీకరిస్తాడు.

చిత్రకూటవర్ణనా

దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివనప్రియః |
వైదేహ్యాః ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్ || ౧ ||

అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ |
భార్యామమరసంకాశః శచీమివ పురందరః || ౨ ||

న రాజ్యాద్భ్రంశనం భద్రే న సుహృద్భిర్వినాభవః |
మనో మే బాధతే దృష్ట్వా రమణీయమిమం గిరిమ్ || ౩ ||

పశ్యేమమచలం భద్రే నానాద్విజగణాయుతమ్ |
శిఖరైః ఖమివోద్విద్ధైర్ధాతుమద్భిర్విభూషితమ్ || ౪ ||

కేచిద్రజతసంకాశాః కేచిత్ క్షతజసన్నిభాః |
పీతమాంజిష్ఠవర్ణాశ్చ కేచిన్మణివరప్రభాః || ౫ ||

పుష్పార్కకేతకాభాశ్చ కేచిజ్జ్యోతీరసప్రభాః |
విరాజంతేఽచలేంద్రస్య దేశా ధాతువిభూషితాః || ౬ ||

నానామృగగణద్వీపితరక్ష్వృక్షగణైర్వృతః |
అదుష్టైర్భాత్యయం శైలో బహుపక్షిసమాయుతః || ౭ ||

ఆమ్రజంబ్వసనైర్లోధ్రైః ప్రియాలైః పనసైర్ధవైః |
అంకోలైర్భవ్యతినిశైర్బిల్వతిందుకవేణుభిః || ౮ ||

కాశ్మర్యరిష్టవరుణైర్మధూకైస్తిలకైస్తథా |
బదర్యామలకైర్నీపైర్వేత్రధన్వనబీజకైః || ౯ ||

పుష్పవద్భిః ఫలోపేతైశ్ఛాయావద్భిర్మనోరమైః |
ఏవమాదిభిరాకీర్ణః శ్రియం పుష్యత్యయం గిరిః || ౧౦ ||

శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ |
కిన్నరాన్ ద్వంద్వశో భద్రే రమమాణాన్మనస్వినః || ౧౧ ||

శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ |
పశ్య విద్యాధరస్త్రీణాం క్రీడోద్ధేశాన్ మనోరమాన్ || ౧౨ ||

జలప్రపాతైరుద్భేదైర్నిష్యందైశ్చ క్వచిత్ క్వచిత్ |
స్రవద్భిర్భాత్యయం శైలః స్రవన్మద ఇవ ద్విపః || ౧౩ ||

గుహాసమీరణో గంధాన్ నానాపుష్పభవాన్వహన్ |
ఘ్రాణతర్పణమభ్యేత్య కం నరం న ప్రహర్షయేత్ || ౧౪ ||

యదీహ శరదోఽనేకాస్త్వయా సార్ధమనిందితే |
లక్ష్మణేన చ వత్స్యామి న మాం శోకః ప్రధక్ష్యతి || ౧౫ ||

బహుపుష్పఫలే రమ్యే నానాద్విజగణాయుతే |
విచిత్రశిఖరే హ్యస్మిన్ రతవానస్మి భామిని || ౧౬ ||

అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయమ్ |
పితుశ్చానృణతా ధర్మే భరతస్య ప్రియం తథా || ౧౭ ||

వైదేహి రమసే కచ్చిచ్చిత్రకూటే మయా సహ |
పశ్యంతీ వివిధాన్భావాన్ మనోవాక్కాయసమ్మతాన్ || ౧౮ ||

ఇదమేవామృతం ప్రాహుః రాజ్ఞి రాజర్షయః పరే |
వనవాసం భవార్థాయ ప్రేత్య మే ప్రపితామహాః || ౧౯ ||

శిలాః శైలస్య శోభంతే విశాలాః శతశోఽభితః |
బహులా బహుళైర్వర్ణైర్నీలపీతసితారుణైః || ౨౦ ||

నిశి భాంత్యచలేంద్రస్య హుతాశనశిఖా ఇవ |
ఓషధ్యః స్వప్రభాలక్ష్యా భ్రాజమానాః సహస్రశః || ౨౧ ||

కేచిత్ క్షయనిభా దేశాః కేచిదుద్యానసన్నిభాః |
కేచిదేకశిలా భాంతి పర్వతస్యాస్య భామిని || ౨౨ ||

భిత్త్వేవ వసుధాం భాతి చిత్రకూటః సముత్థితః |
చిత్రకూటస్య కూటోఽసౌ దృశ్యతే సర్వతః శుభః || ౨౩ ||

కుష్ఠపున్నాగస్థగరభూర్జపత్రోత్తరచ్ఛదాన్ |
కామినాం స్వాస్తరాన్ పశ్య కుశేశయదలాయుతాన్ || ౨౪ ||

మృదితాశ్చాపవిద్ధాశ్చ దృశ్యంతే కమలస్రజః |
కామిభిర్వనితే పశ్య ఫలాని వివిధాని చ || ౨౫ ||

వస్వౌకసారాం నళినీమత్యేతీవోత్తరాన్ కురూన్ |
పర్వతశ్చిత్రకూటోఽసౌ బహుమూలఫలోదకః || ౨౬ ||

ఇమం తు కాలం వనితే విజహ్రివాన్
త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ |
రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధనీం
సతాం పథి స్వైర్నియమైః పరైః స్థితః || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్నవతితమః సర్గః || ౯౪ ||

Ayodhya Kanda Sarga 94 Meaning In Telugu

భరతుడు రాముని గురించి వెతుకుతుంటే, రాముడు సీతతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. సీతకు చిత్ర విచిత్రములైన మొక్కలను వృక్షములను చూపించి వాటి గురించి వివరిస్తున్నాడు. “సీతా!ఇక్కడ ఉన్న సౌందర్యశోభలను, ఈ వనముల అందములను చూచిన తరువాత ఇక్కడి నుండి అయోధ్యకు పోవాలని అనిపించడంలేదు. ఈ పర్వతములు అనేకములైన ఓషధులకు, వన్యమృగములకు, పక్షులకు నిలయము. ఈ ప్రశాంత వాతావరణములో ఈ పర్వత శిఖరములను, వృక్షములను చూస్తూ ఎన్నాళ్లు ఉన్నా విసుగు అనిపించదు. ఈ అరణ్యములో వేప, మామిడి, నేరేడు, వేగిస, లోధ్ర, ప్రియాళ, పనస, చండ్ర, అంకోల, బిల్వ, తుమ్మ, వెదురు,కశ్మ, ఇప్ప, తిలక, బదరి, ఆమలక, పేము పొదలు, మద్ది మొదలగు వృక్షజాతులో నిండి ఉన్నది.

(వాల్మీకి తన రామాయణకావ్యంలో ఆనాడు ఉన్న వృక్షజాతులను తరువాతి తరాల వారికి పరిచయం చేస్తున్నాడు.)

ఓ సీతా! అటు చూడు, కిన్నరులు, గంధర్వులు, విద్యాధరులు ఆ పర్వత శిఖరముల మీద జంట జంటలుగా విహరిస్తున్నారు. నేను ఈ వనవాసము చేయడం వలన నా తండ్రి మాటను నిలబెట్టడం, భరతుని రాజ్యాభిషేకమునకు ఆటంకం తొలగి పోవడం లాంటి గొప్ప పనులు సాధించాను. దీని వలన నా పితృఋణము తీర్చుకున్నట్టు అయింది. నాతో పాటు నువ్వు కూడా నన్నుఅనుసరించి వచ్చి ఈ వనసౌందర్య మును ఆస్వాదించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. రాజులకు మరణానంతరము ఉత్తమ లోకములు లభించుటకు వనవాసమే ఉ త్తమైనది అయి పూర్వపు రాజర్షులు చెప్పి ఉన్నారు కదా!

సీతా! ఈ చిత్రకూటపర్వతము మీద ఎన్నోఓషధులు ఉ న్నాయి. ఆ ఓషధుల మీది నుండి వీచే గాలి అన్ని రోగములను పోగొడుతుంది అని పెద్దలు చెబుతారు. సీతా! అటు చూడు! ఇక్కడ కొన్ని ప్రదేశములు సహజముగా ఏర్పడిన ఉద్యానవనముల మాదిరి, మరి కొన్ని పూపొదరిళ్లు గృహముల మాదిరి, కనపడుతున్నాయి కదా! ఈ చిత్రకూట పర్వతము భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్టు ఎలా గర్వంగా నిలబడిఉన్నదో చూడు! ఇక్కడ కామాతురు లైన స్త్రీపురుషులు, ఈ నిర్జన ప్రదేశములలో కుష్ఠ, పున్నాగ, భూర్జర చెట్ల ఆకులతో శయ్యలు ఏర్పరచుకొని ఉన్నారు చూడు. ఆ కాముకులు నలిపి పారవేసిన పూలమాలలు, తినగా మిగిలిన ఫలములు అక్కడక్కడా పడి ఉన్నాయి చూడు.” అని చిత్రకూటపర్వత విశేషములను సీతకు రాముడు చూపిస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచనవతితమః సర్గః (95) >>

Ayodhya Kanda Sarga 93 In Telugu – అయోధ్యాకాండ త్రినవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 93

అయోధ్యాకాండం త్రినవతితమ (93వ) సర్గలో, భరతుడు దశరథ మహారాజు మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందాడు. అతను తన తల్లి కైకేయి పై మహా కోపంతో తిట్టిపోస్తాడు. కైకేయి తన చర్యలను సమర్థించడానికి ప్రయత్నిస్తే, భరతుడు ఆమెను తీవ్రంగా గద్దించింది. అతను రాముడు తప్ప మరెవ్వరూ రాజ్యం పరిపాలించరని, రాముని తిరిగి తీసుకురావాలని నిర్ణయించాడు. ఆ తరువాత, భరతుడు తన సోదరుడు శత్రుఘ్నుడితో కలిసి గురు వశిష్ఠుని వద్దకు వెళ్లి సలహా కోరుతాడు. వశిష్ఠుడు రాముని తిరిగి పిలవడానికి సమ్మతిస్తాడు. భరతుడు, అల్లరి పరంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్లి, రాముని తిరిగి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, రాముని పట్ల అతని అపార ప్రేమను ప్రతిబింబిస్తుంది.

చిత్రకూటవనప్రేక్షణమ్

తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః |
అర్దితా యూథపా మత్తాః సయూథాః సంప్రదుద్రువుః || ౧ ||

ఋక్షాః పృషతసంఘాశ్చ రురవశ్చ సమతంతః |
దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ || ౨ ||

స సంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజః |
వృతో మహత్యా నాదిన్యా సేనయా చతురంగయా || ౩ ||

సాగరౌఘనిభా సేనా భరతస్య మహాత్మనః |
మహీం సంఛాదయామాస ప్రావృషిద్యామివాంబుదః || ౪ ||

తురంగాఘైరవతతా వారణైశ్చ మహాజవైః |
అనాలక్ష్యా చిరం కాలం తస్మిన్కాలే బభూవ భూః || ౫ ||

స యాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంతవాహనః |
ఉవాచ భరతః శ్రీమాన్ వసిష్ఠం మంత్రిణాం వరమ్ || ౬ ||

యాదృశం లక్ష్యతే రూపం యథా చైవ శ్రుతం మయా |
వ్యక్తం ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజో యమబ్రవీత్ || ౭ ||

అయం గిరిశ్చిత్రకూట ఇయం మందాకినీ నదీ |
ఏతత్ప్రకాశతే దూరాన్నీలమేఘనిభం వనమ్ || ౮ ||

గిరేః సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి |
వారణైరవమృద్యంతే మామకైః పర్వతోపమైః || ౯ ||

ముంచంతి కుసుమాన్యేతే నగాః పర్వతసానుషు |
నీలా ఇవాతపాపాయే తోయం తోయధరా ఘనాః || ౧౦ ||

కిన్నరాచరితం దేశం పశ్య శత్రుఘ్న పర్వతమ్ |
మృగైః సమంతాదాకీర్ణం మకరైరివ సాగరమ్ || ౧౧ ||

ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగాః ప్రచోదితాః |
వాయుప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే || ౧౨ ||

కుర్వంతి కుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ |
మేఘప్రకాశైః ఫలకైర్దాక్షిణాత్యా యథా నరాః || ౧౩ ||

నిష్కూజమివ భూత్వేదం వనం ఘోరప్రదర్శనమ్ |
అయోధ్యేవ జనాకీర్ణా సంప్రతి ప్రతిభాతి మా || ౧౪ ||

ఖురైరుదీరితో రేణుర్దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి |
తం వహత్యనిలః శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియమ్ || ౧౫ ||

స్యందనాంస్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ |
ఏతాన్సంపతతః శీఘ్రం పశ్య శత్రుఘ్న కాననే || ౧౬ ||

ఏతాన్విత్రాసితాన్పశ్య బర్హిణః ప్రియదర్శనాన్ |
ఏతమావిశతః శీఘ్రమధివాసం పతత్త్రిణః || ౧౭ ||

అతిమాత్రమయం దేశో మనోజ్ఞః ప్రతిభాతి మా |
తాపసానాం నివాసోఽయం వ్యక్తం స్వర్గపథో యథా || ౧౮ ||

మృగా మృగీభిః సహితా బహవః పృషతా వనే |
మనోజ్ఞరూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః || ౧౯ ||

సాధుసైన్యాః ప్రతిష్ఠంతాం విచిన్వంతు చ కాననే |
యథా తౌ పురుషవ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ || ౨౦ ||

భరతస్య వచః శ్రుత్వా పురుషాః శస్త్రపాణయః |
వివిశుస్తద్వనం శూరాః ధూమం చ దదృశుస్తతః || ౨౧ ||

తే సమాలోక్య ధూమాగ్రమూచుర్భరతమాగతాః |
నామనుష్యే భవత్యాగ్నిర్వ్యక్తమత్రైవ రాఘవౌ || ౨౨ ||

అథ నాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ |
మన్యే రామోపమాః సంతి వ్యక్తమత్ర తపస్వినః || ౨౩ || [అన్యే]

తచ్ఛ్రుత్వా భరతస్తేషాం వచనం సాధుసమ్మతమ్ |
సైన్యానువాచ సర్వాంస్తానమిత్రబలమర్దనః || ౨౪ ||

యత్తా భవంతస్తిష్ఠంతు నేతో గంతవ్యమగ్రతః |
అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవ చ || ౨౫ ||

ఏవముక్తాస్తతః సర్వే తత్ర తస్థుః సమంతతః |
భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్ || ౨౬ ||

వ్యవస్థితా యా భరతేన సా చమూ-
-ర్నిరీక్షమాణాఽపి చ ధూమమగ్రతః |
బభూవ హృష్టా నచిరేణ జానతీ
ప్రియస్య రామస్య సమాగమం తదా || ౨౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రినవతితమః సర్గః || ౯౩ ||

Ayodhya Kanda Sarga 93 Meaning In Telugu

మహాసముద్రము వలె ఉన్న భరతుని సైన్యము పరివారము ఆ అడవులలో ప్రయాణం చేస్తూ ఉంటే అడవిలో ఉన్న మృగములు భయపడి పారిపోతున్నాయి. ఆ సైన్యము నడిచేటప్పుడు రేగిన ధూళితో ఆకాశం ఎర్రగా కవురు వేసినట్టు అయింది. వారందరూ చిత్రకూట పర్వతమును సమీపించారు. భరతుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “మహాత్మా! పరిసరములను బట్టి చూడగా మనకు చిత్రకూటపర్వతమును సమీపించినట్టు కనపడు చున్నది. అదుగో అదే మందాకినీ నది. ఇక్కడ కిన్నరులుసంచరిస్తూ ఉంటారని ప్రతీతి.

(ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకం రాసాడు. అదేమిటంటే—-
కుర్వన్తికుసుమాపీడాన్ శిరస్సు సురభీనమీ।
మేఘప్రకాశై: ఫలకైర్దాక్షిణాత్యా యథానరా॥

ఈ పర్వత శిఖరములు, మేఘములతో సమానంగా, దాక్షిణాత్య నరుల వలె ప్రకాశిస్తున్నాయి. అని స్థూలంగా చెప్పుకోవచ్చు. దూరానికి మేఘములు, పర్వత శిఖరములు నల్లగా ఉంటాయి. అంటే దక్షిణదేశ నరులు నల్లగా ఉంటారని మనం అనుకోవచ్చునా. అలా కాకపోతే, ఇక్కడ దాక్షిణాత్యుల ప్రసక్తి తీసుకురావడం ఎందుకు? ఉత్తరదేశస్థులు తెల్లగా ఆజానుబాహులుగా ఉంటారని మనకు తెలిసిందే. కాబట్టి మన చరిత్రలో చెప్పినట్టు ఆర్యులు దస్యులు అనే రెండు తెగలు ఉన్నాయని స్పష్టం అవుతున్నట్టుగా ఉంది. ఇది కేవలము ఊహ మాత్రమే రూఢి కాదు.)

తరువాత భరతుడు శత్రుఘ్నుని చూచి “సోదరా! ఈ ప్రశాంత మైన అరణ్యమును చూస్తుంటే ఇక్కడ ఋషులు నివసిస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు మనము రాముని పర్ణశాల కొరకు వెతకవలెను. మన సైన్యమును నలుదిక్కులకు పంపి రాముని జాడ కనుగొనమని చెప్పు.” అని అన్నాడు.

భరతుని ఆదేశము మేరకు సైన్యము నలుదిక్కులకు వెళ్లారు. వారికి కొంచెం దూరంలో పొగ లేస్తున్నట్టు కనపడింది. వెంటనే వారు భరతుని వద్దకు వచ్చి “మహారాజా! ఈ అరణ్యములో ఆ ప్రదేశములో పొగవస్తోంది అంటే అక్కడ జనసంచారము ఉన్నట్టే. అక్కడే రామలక్ష్మణులు ఉండవచ్చు అని అనుమానంగా ఉంది. అలా కాకపోతే అక్కడ ముని ఆశ్రమములు ఉండవచ్చు. వారిని అడిగితే రాముని జాడలు చెప్పగలరు.” అని అన్నారు.

భరతుడు వారితో ఇలా అన్నాడు. “మీరందరూ ఇక్కడే ఉండండి. నేను, వసిష్ఠుడు సుమంత్రుడు పోయి చూచి వస్తాము. అంతదాకా మీరు ఇక్కడే వేచి ఉండండి.”అని అన్నాడు. తరువాత భరతుడు ఆపొగవస్తున్న దిక్కుగా చూచాడు. చాలారోజుల తరువాత తాను రాముని చూడబోవుచున్నానని ఎంతో సంతోషించాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుర్నవతితమః సర్గః (94) >>

Aranya Kanda Sarga 19 In Telugu – అరణ్యకాండ ఏకోనవింశః సర్గః

Aranya Kanda Sarga 19 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకోనవింశః సర్గలో, శూర్పణఖ తన బాధాకరమైన కథను తన సోదరుడు ఖరకు ముఖ్యంగా సీతను నేరం చేస్తూ వివరిస్తుంది. సీత రక్తాన్ని తాగడానికి ఖరా యుద్ధం చేయాలని ఆమె కోరుకుంటుంది. ఖర తన సోదరిని శాంతింపజేయడానికి పద్నాలుగు రాక్షసులను రాముని అంతమొందించడానికి పంపుతాడు.

ఖరక్రోధః

తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితామ్ |
భగినీం క్రోధసంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః ||

1

ఉత్తిష్ఠ తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమమ్ |
వ్యక్తమాఖ్యాహి కేన త్వమేవంరూపా విరూపితా ||

2

కః కృష్ణసర్పమాసీనమాశీవిషమనాగసమ్ |
తుదత్యభిసమాపన్నమంగుళ్యగ్రేణ లీలయా ||

3

కః కాలపాశమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే |
యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమమ్ ||

4

బలవిక్రమసంపన్నా కామగా కామరూపిణీ |
ఇమామవస్థాం నీతా త్వం కేనాంతకసమా గతా ||

5

దేవగంధర్వభూతానామృషీణాం చ మహాత్మనామ్ |
కోఽయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకార హ ||

6

న హి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్మమ విప్రియమ్ |
అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనమ్ ||

7

అద్యాహం మార్గణైః ప్రాణానాదాస్యే జీవితాంతకైః |
సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః ||

8

నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః |
సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి ||

9

కస్య పత్రరథాః కాయాన్మాంసముత్కృత్య సంగతాః |
ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయా రణే ||

10

తం న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః |
మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే ||

11

ఉపలభ్య శనైః సంజ్ఞాం తం మే శంసితుమర్హసి |
యేన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జితా ||

12

ఇతి భ్రాతుర్వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః |
తతః శూర్పణఖా వాక్యం సబాష్పమిదమబ్రవీత్ ||

13

తరుణౌ రూపసంపన్నౌ సుకూమారౌ మహాబలౌ |
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ||

14

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

15

గంధర్వరాజప్రతిమౌ పార్థివవ్యంజనాన్వితౌ |
దేవౌ వా మానుషౌ వా తౌ న తర్కయితుముత్సహే ||

16

తరుణీ రూపసంపన్నా సర్వాభరణభూషితా |
దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా ||

17

తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్య తామ్ |
ఇమామవస్థాం నీతాహం యథానాథాసతీ తథా ||

18

తస్యాశ్చానృజువృత్తాయాస్తయోశ్చ హతయోరహమ్ |
సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని ||

19

ఏష మే ప్రథమః కామః కృతస్తాత త్వయా భవేత్ |
తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే ||

20

ఇతి తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ |
వ్యాదిదేశ ఖరః క్రుద్ధో రాక్షసానంతకోపమాన్ ||

21

మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ |
ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ ||

22

తౌ హత్వా తాం చ దుర్వృత్తామపావర్తితుమర్హథ |
ఇయం చ రుధిరం తేషాం భగినీ మమ పాస్యతి ||

23

మనోరథోఽయమిష్టోఽస్యా భగిన్యా మమ రాక్షసాః |
శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్య స్వేన తేజసా ||

24

యుష్మాభిర్నిర్హతౌ దృష్ట్వా తావుభౌ భ్రాతరౌ రణే |
ఇయం ప్రహృష్టా ముదితా రుధిరం యుధి పాస్యతి ||

25

ఇతి ప్రతిసమాదిష్టా రాక్షసాస్తే చతుర్దశ |
తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనా వాతేరితా యథా ||

26

తతస్తు తే తం సముదగ్రతేజసం
తథాపి తీక్ష్ణప్రదరా నిశాచరాః |
న శేకురేనం సహసా ప్రమర్దితుం
వనద్విపా దీప్తమివాగ్నిముత్థితమ్ ||

27

Aranya Kanda Sarga 19 In Telugu Pdf Download

ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు. ఖరుడు. ఆమెను రెండుచేతులతో లేవనెత్తాడు.

“చెల్లెలా శూర్పణఖా! ఏమిటీ ఘోరము. ఎవరు చేసారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేసాడా! వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాశం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేసాడు. ఎవడు వాడు! ఎక్కడ ఉంటాడు! ఉన్నది ఉన్నట్టు చెప్పు.

అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా! పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా! అలాంటి నీకు ఈ గతి పట్టించిన వాడు ఎవడు? వాడు దేవతా! గంధర్వుడా! భూతమా! లేక ఎవరన్నా పరాక్రమ వంతుడైన ఋషిపుంగవుడా! ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసికూడా నీకు అవమానం చేసాడంటే వాడికి ఆయువు మూడింది.

ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానము నకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గానీ, గంధర్వులు కానీ, రాక్షసులు గానీ, పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా! చెప్పు. నీ భయందోళనలనుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు.” అని అడిగాడు ఖరుడు.

శూర్పణఖ కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి. కళ్లు తుడుచుకుంటూ ఖరునితో ఇలా చెప్పింది. “ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథమహారాజు కుమారులట. పేరు రాముడు, లక్ష్మణుడు. వారు సుకుమారులు. సుందరాకారులు. కాని మంచి బలంగా ఉన్నారు. మునివేషములో ఉన్నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వారి ముఖంలో రాజసం తొణికిసలాడుతూ ఉంది. వారు దేవతలో మనుష్యులో చెప్పలేను. వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీమూలంగానే నాకు ఈ అవమానము జరిగింది. నువ్వు వెళ్లి ఆ స్త్రీని, ఆ ఇద్దరు యువకులనుచంపి వారి రక్తముతో నా దాహము తీర్చు. అప్పటి దాకా నా పగ చల్లారదు.” అని రోషంతో పలికింది శూర్పణఖ.

ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు. వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన 14 మంది రాక్షస వీరులను పిలిపించాడు. (ఇక్కడ గమనించండి. రామాయణంలో ఈ 14 అంకె విశిష్టమైనది. రాముని వనవాసము 14 సంవత్సరములు. ఖరుడు పంపిన వారు 14 మంది. ఇంకా ఈ 14 సంఖ్య వస్తూనే ఉంటుంది. భారతంలో 18 అంకె ఉన్నట్టు రామాయణంలో 14 అంకెకు ప్రాధాన్యత ఉన్నట్టు ఉంది.).

“ఓ రాక్షసవీరులారా! ముని వేషములో ఉన్న ఇద్దరు క్షత్రియ కుమారులు, ఒక స్త్రీ దండకారణ్యములో ప్రవేశించారట. మీరు వెళ్లి ఆ ముని కుమారులను, ఆ స్త్రీని చంపండి. వారి రక్తము నా సోదరి శూర్పణఖ తాగవలెనని కోరుతూ ఉంది. వెళ్లండి. వాళ్లను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి.” అని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఆ 14 మంది రాక్షసవీరులూ శూర్పణఖను తీసుకొని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ వింశః సర్గః (20) >>

Aranya Kanda Sarga 21 In Telugu – అరణ్యకాండ ఏకవింశః సర్గః

Aranya Kanda Sarga 21 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకవింశః సర్గలో, రాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు పంచవటి ప్రాంతంలో నివాసం ప్రారంభిస్తారు. పంచవటిలో వాతావరణం అందంగా ఉంటుంది. అక్కడ వారు చిన్న ఆశ్రమాన్ని నిర్మించి నివసిస్తారు. ఈ సుందర వాతావరణంలో సీతమ్మ పూలతో అలంకరణలు చేస్తూ సంతోషంగా గడుపుతుంది.

ఖరసంధుక్షణమ్

స పునః పతితాం దృష్ట్వా క్రోధాచ్ఛూర్పణఖాం ఖరః |
ఉవాచ వ్యక్తయా వాచా తామనర్థార్థమాగతామ్ ||

1

మయా త్విదానీం శూరాస్తే రాక్షసా రుధిరాశనః |
త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుద్యతే పునః ||

2

భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యశః |
ఘ్నంతోఽపి న నిహంతవ్యా న న కుర్యుర్వచో మమ ||

3

కిమేతచ్ఛ్రోతుమిచ్ఛామి కారణం యత్కృతే పునః |
హా నాథేతి వినర్దంతీ సర్పవల్లుఠసి క్షితౌ ||

4

అనాథవద్విలపసి నాథే తు మయి సంస్థితే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ మా భైషీర్వైక్లబ్యం త్యజ్యతామిహ ||

5

ఇత్యేవముక్తా దుర్ధర్షా ఖరేణ పరిసాంత్వితా |
విమృజ్య నయనే సాస్రే ఖరం భ్రాతరమబ్రవీత్ ||

6

అస్మీదానీమహం ప్రాప్తా హృతశ్రవణనాసికా |
శోణితౌఘపరిక్లిన్నా త్వయా చ పరిసాంత్వితా ||

7

ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే చతుర్దశ |
నిహంతుం రాఘవం క్రోధాన్మత్ప్రియార్థం సలక్ష్మణమ్ ||

8

తే తు రామేణ సామర్షాః శూలపట్టిశపాణయః |
సమరే నిహతాః సర్వే సాయకైర్మర్మభేదిభిః ||

9

తాన్ దృష్ట్వా పతితాన్భూమౌ క్షణేనైవ మహాబలాన్ |
రామస్య చ మహత్కర్మ మహాంస్త్రాసోఽభవన్మమ ||

10

అహమస్మి సముద్విగ్నా విషణ్ణా చ నిశాచర |
శరణం త్వాం పునః ప్రాప్తా సర్వతోభయదర్శినీ ||

11

విషాదనక్రాధ్యుషితే పరిత్రాసోర్మిమాలిని |
కిం మాం న త్రాయసే మగ్నాం విపులే శోకసాగరే ||

12

ఏతే చ నిహతా భూమౌ రామేణ నిశితైః శరైః |
యేఽపి మే పదవీం ప్రాప్తా రాక్షసాః పిశితాశనాః ||

13

మయి తే యద్యనుక్రోశో యది రక్షస్సు తేషు చ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||

14

దండకారణ్యనిలయం జహి రాక్షసకంటకమ్ |
యది రామం మమామిత్రం న త్వమద్య వధిష్యసి ||

15

తవ చైవాగ్రతః ప్రాణాంస్త్యక్ష్యామి నిరపత్రపా |
బుద్ధ్యాఽహమనుపశ్యామి న త్వం రామస్య సంయుగే ||

16

స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః |
శూరమానీ న శూరస్త్వం మిథ్యారోపితవిక్రమః ||

17

మానుషౌ యౌ న శక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ |
రామేణ యది తే శక్తిస్తేజో వాఽస్తి నిశాచర ||

18

దండకారణ్యనిలయం జహి తం కులపాంసన |
నిఃసత్త్వస్యాల్పవీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ ||

19

అపయాహి జనస్థానాత్త్వరితః సహబాంధవః |
రామతేజోఽభిభూతో హి త్వం క్షిప్రం వినశిష్యసి ||

20

స హి తేజః సమాయుక్తో రామో దశరథాత్మజః |
భ్రాతా చాస్య మహావీర్యో యేన చాస్మి విరూపితా ||

21

ఏవం విలప్య బహుశో రాక్షసీ వితతోదరీ |
భ్రాతుః సమీపే దుఃఖార్తా నష్టసంజ్ఞా బభూవ హ |
కరాభ్యాముదరం హత్వా రురోద భృశదుఃఖితా ||

22

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకవింశః సర్గః ||

Aranya Kanda Sarga 21 Meaning In Telugu

పదునాలుగు మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని వెళ్లిన శూర్పణఖ వెంటనే ఒంటరిగా రావడం చూచి ఆశ్చర్యపోయాడు ఖరుడు.

“ఏంటి శూర్పణఖా! ఏమయింది. నీవు కోరితేనేకదా నీ వెంట 14 మంది రాక్షస వీరులను పంపాను. మరలా ఏడుస్తూ వచ్చావెందుకు. ఊరికే అలా భయపడితే ఎలాగా! నేను ఉన్నాగా నీకెందుకు భయం. ఏం జరిగిందో చెప్పు” అన్నాడు ఖరుడు.

ఖరుని చూచి వ్యంగ్యంగా ఇలా అంది శూర్పణఖ. “ముక్కు, చెవులూ కోయించుకొని రక్తంకారుకుంటూ ఏడ్చుకుంటూ నీదగ్గరకు వచ్చానా! నీవు నన్ను ఓదార్చావు కదా! రామలక్ష్మణులను చంపడానికి 14 మంది రాక్షస వీరులను పంపావు కదా! మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ 14మంది నా వెంట వచ్చారు కదా! క్షణకాలంలో రాముడిచేతిలో గుండెలు పగిలి చచ్చారు. ఇదీ మనవాళ్ల ప్రతాపం. ఇంక భయపడక చస్తానా! వాళ్లందరూ అలా క్షణకాలంలో నేలమీద పడగానే నాకు వణుకు పుట్టింది. పరుగెత్తుకుంటూ వచ్చాను.

ఓ ఖరా! నాకు భయంగా ఉంది. రామలక్ష్మణులు ఏవైపు నుంచి అన్నా రావచ్చు. నిన్ను, నన్ను చంపవచ్చు నీకు నా మీద జాలి దయ ఉంటే, ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి, బలము ఉంటే, దండకారణ్యములో నివాసమేర్పరచుకొన్న ఆ రామలక్ష్మణులను వెంటనే చంపు. వాళ్లు సామాన్యులు కాదు. రాక్షసులను చంపడానికి వచ్చిన దేవతలు. నీవు కనక రాముడిని చంపకపోతే నేను నీ ఎదుటనే ఆత్మహత్య చేసుకొని చస్తాను.

అయినా నీకు ఇంత సైన్యము, ఇంత బలము, పరాక్రమములు ఉండి ఏం ప్రయోజనం. ఇద్దరిని చంపలేకపోయావు. అసలు నువ్వు అయినా రాముని ఎదుట నిలిచి యుద్ధం చెయ్యగలవా అని నా అనుమానము.

ఖరా! వాళ్లు సామాన్య మానవులు. నీ సైన్యము ఆ మానవులను చంపలేకపోయాయి. నీవేదో పెద్ద పరాక్రమవంతుడవని డంబాలు పలుకుతున్నావు. నీ పరాక్రమము శూరత్వము ఎందుకు తగలపెట్టనా! నా మాటవిని ఈ జనస్థానము వదిలి ఎక్కడికన్నా వెళ్లి బతుకు పో! నువ్వు రాక్షసకులంలో చెడ బుట్టావు. అందుకే మానవులకు భయపడుతున్నావు.

ఓ ఖరా! ఆఖరుసారిగా చెబుతున్నాను విను. నీకు రాముని ఎదిరించే వీరత్వము ఉంటే, నీ సైన్యంతో వెళ్లి రామలక్ష్మణులను చంపు. లేకపోతే, నీ బంధుమిత్రులతో ఈ జనస్థానము వదిలి పారిపో! అదే ఉత్తమము. రాముని తేజస్సు ముందు నీవు నిలువలేవు. అందుకే నా ముక్కు చెవులు కోసినా ఇంకా రామలక్ష్మణులు బతికే ఉన్నారు.” అని సూటిపోటీ మాటలతో ఖరుని రెచ్చగొట్టింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓతత్సత్.

అరణ్యకాండ ద్వావింశః సర్గః (22) >>

Aranya Kanda Sarga 10 In Telugu – అరణ్యకాండ దశమః సర్గః

Aranya Kanda Sarga 10 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ దశమ సర్గలో, శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు తమ కష్టాలకు పరిష్కారం కోసం రుషి శరభంగుడి ఆశ్రమానికి వెళతారు. రాముడు శరభంగుడి ఆశీస్సులతో సుఖంగా గడుపుతాడు. శరభంగుడు తన చివరి క్షణాల్లో రామునికి పుణ్యాలను వివరించి, దివ్య లోకాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు.

రక్షోవధసమర్థనమ్

వాక్యమేతత్తు వైదేహ్యా వ్యాహృతం భర్తృభక్తయా |
శ్రుత్వా ధర్మే స్థితో రామః ప్రత్యువాచాథ మైథిలీమ్ ||

1

హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచః |
కులం వ్యపదిశంత్యా చ ధర్మజ్ఞే జనకాత్మజే ||

2

కిం తు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః |
క్షత్రియైర్ధార్యతే చాపో నార్త శబ్దో భవేదితి ||

3

మాం సీతే స్వయమాగమ్య శరణ్యాః శరణం గతాః |
తే చార్తా దండకారణ్యే మునయః సంశితవ్రతాః ||

4

వసంతో ధర్మనిరతా వనే మూలఫలాశనాః |
న లభంతే సుఖం భీతా రాక్షసైః క్రూరకర్మభిః ||

5

కాలే కాలే చ నిరతా నియమైర్వివిధైర్వనే |
భక్ష్యంతే రాక్షసైర్భీమైర్నరమాంసోపజీవిభిః ||

6

తే భక్ష్యమాణా మునయో దండకారణ్యవాసినః |
అస్మానభ్యవపద్యేతి మామూచుర్ద్విజసత్తమాః ||

7

మయా తు వచనం శ్రుత్వా తేషామేవం ముఖాచ్చ్యుతమ్ |
కృత్వా చరణశుశ్రూషాం వాక్యమేతదుదాహృతమ్ ||

8

ప్రసీదంతు భవంతో మే హ్రీరేషా తు మమాతులా |
యదీదృశైరహం విప్రైరుపస్థేయైరుపస్థితః ||

9

కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజసన్నిధౌ |
సర్వైరేతైః సమాగమ్య వాగియం సముదాహృతా ||

10

రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః |
అర్దితాః స్మ దృఢం రామ భవాన్నస్తత్ర రక్షతు ||

11

హోమకాలేషు సంప్రాప్తాః పర్వకాలేషు చానఘ |
ధర్షయంతి సుదుర్ధర్షా రాక్షసాః పిశితాశనాః ||

12

రాక్షసైర్ధర్షితానాం చ తాపసానాం తపస్వినామ్ |
గతిం మృగయమాణానాం భవాన్నః పరమా గతిః ||

13

కామం తపః ప్రభావేన శక్తా హంతుం నిశాచరాన్ |
చిరార్జితం తు నేచ్ఛామస్తపః ఖండయితుం వయమ్ ||

14

బహువిఘ్నం తపో నిత్యం దుశ్చరం చైవ రాఘవ |
తేన శాపం న ముంచామో భక్ష్యమాణాశ్చ రాక్షసైః ||

15

తదర్ద్యమానాన్రక్షోభిర్దండకారణ్యవాసిభిః |
రక్ష నస్త్వం సహ భ్రాత్రా త్వన్నాథా హి వయం వనే ||

16

మయా చైతద్వచః శ్రుత్వా కార్త్స్న్యేన పరిపాలనమ్ |
ఋషీణాం దండకారణ్యే సంశ్రుతం జనకాత్మజే ||

17

సంశ్రుత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవమ్ |
మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా ||

18

అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణామ్ |
న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః ||

19

తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్ |
అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ తు కిం పునః ||

20

మమ స్నేహాచ్చ సౌహార్దాదిదముక్తం త్వయాఽనఘే |
పరితుష్టోఽస్మ్యహం సీతే న హ్యనిష్టోఽనుశిష్యతే ||

21

సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః |
సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోఽపి గరీయసీ ||

22

ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
సీతాం ప్రియాం మైథిలరాజపుత్రీమ్ |
రామో ధనుష్మాన్సహ లక్ష్మణేన
జగామ రమ్యాణి తపోవనాని ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే దశమః సర్గః ||

Aranya Kanda Sarga 10 Meaning In Telugu

తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సీతతో ఇలా అన్నాడు.“ఓ జనకరాజపుత్రీ! సీతా! నీకు అన్ని ధర్మాలూ తెలుసు. నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగానూ, ధర్మబద్ధంగానూ, యుక్తియుక్తంగానూ ఉన్నాయి.

దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా! ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులు ఉన్నారు. వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు. వారందరూ పూజనీయులు. గౌరవింపతగ్గవారు. అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు. చంపుతున్నారు. ఆ పరిస్థితులలో ఆ మునులు తమ బాధలనుండి రక్షించమని నన్ను శరణుకోరారు.

ఆ మునులు ఎవరికీ అపకారముచెయ్యరు. దొరికిన కందమూలములు, ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి, సుఖము లేకుండా పోయాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో వణికిపోతున్నారు. వారందరూ రాక్షసుల బారినుండి తమను కాపాడమని నన్ను అర్ధించారు.

ఒక క్షత్రియుడుగా, ఒక రాజుగా నేనే వారి వద్దకుపోయి, “మీకు నేను ఏమి సేవ చేయాలి” అని అడగడం పోయి, వారే నా
దగ్గరకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్థించారు. అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి. నేను వారిని “నేను మీకు ఏమిసేవ చేయగలను” అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను.

“రామా! ఈ దండకారణ్యములో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరచుకొని ఉన్నారు. వారు నరమాంసభక్షకులు. మేము హోమాలు, యాగాలు చేస్తుంటే వాటిని పాడుచేస్తున్నారు. అదేమని అడిగితే చంపుతున్నారు. మా తపోబలముచేత వారిని మేము ఎదుర్కోగలము, చంపగలము. కాని ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపోమహిమలను ఈ నీచుల కోసరం వెచ్చించడం మాకు ఇష్టం లేదు. అందుచేత, ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా, మా యజ్ఞులు పాడుచేస్తున్నా, మమ్ములను చంపుతున్నా, భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి, నిన్ను అర్ధిస్తున్నాము. ఈ ప్రాంతము నీరాజ్యములో ఉన్నది కాబట్టి నీవే మాకు రక్షకుడవు.”

సీతా! ఈ ప్రకారంగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను. వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను. అవసరం అయితే మీ అందరినీ, నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇదే నా నిశ్చయము. ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా, వారు అడగకపోయినా, నేను వారి కష్టాలు తీర్చాలి. వారికి రక్షణ కల్పించాలి. వారే అడిగినప్పుడు ఇంక వేరుచెప్పాలా!

ఓ సీతా! నీకు తగినట్టు నీవు చెప్పావు. అందులో తప్పులేదు. నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మునులకు ఇచ్చిన మాటనుకూడా నెరవేరుస్తాను.” అని అన్నాడు రాముడు.

తరువాత అందరూ దండకారణ్యములోనికి ప్రవేశించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ ఏకాదశః సర్గః (11) >>

Aranya Kanda Sarga 18 In Telugu – అరణ్యకాండ అష్టాదశః సర్గః

Aranya Kanda Sarga 18 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” అష్టాదశః సర్గలో, రాముడు శూర్పణఖ తన వైపుకు వెళ్లడాన్ని అడ్డుకుంటాడు మరియు బదులుగా లక్ష్మణుడిని వెతకమని కోరతాడు. లక్ష్మణుడు ఆమెను తన మాటల్లోనే తిప్పికొట్టడంలో పదజాలాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఆమె లక్ష్మణుడి మాటల అర్థాన్ని గ్రహించి సీతను తినడానికి పరుగెత్తుతుంది. లక్ష్మణుడు ఆమెను అపవిత్రం చేస్తాడు మరియు ఆమె అక్కడ నుండి శబ్దంతో పారిపోతుంది, హింసాత్మక రాక్షసుడైన తన సోదరుడు ఖరాకు నివేదించడానికి మాత్రమే. ఇది రాముడు మరియు రామాయణానికి మరో రౌండ్ ఇబ్బందులను ప్రేరేపించే పరిస్థితి.

శూర్పణఖావిరూపణమ్

తాతః శూర్పణఖాం రామః కామపాశావపాశితామ్ |
స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వమథాబ్రవీత్ ||

1

కృతదారోఽస్మి భవతి భార్యేయం దయితా మమ |
త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా ససపత్నతా ||

2

అనుజస్త్వేష మే భ్రాతా శీలవాన్ ప్రియదర్శనః |
శ్రీమానకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ ||

3

అపూర్వీ భార్యయా చార్థీ తరుణః ప్రియదర్శనః |
అనురూపశ్చ తే భర్తా రూపస్యాస్య భవిష్యతి ||

4

ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ |
అసపత్నా వరారోహే మేరుమర్కప్రభా యథా ||

5

ఇతి రామేణ సా ప్రోక్తా రాక్షసీ కామమోహితా |
విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్ ||

6

అస్య రూపస్య తే యుక్తా భార్యాఽహం వరవర్ణినీ |
మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి ||

7

ఏవముక్తస్తు సౌమిత్రీ రాక్షస్యా వాక్యకోవిదః |
తతః శూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్ ||

8

కథం దాసస్య మే దాసీ భార్యా భవితుమిచ్ఛసి |
సోఽహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణినీ ||

9

సమృద్ధార్థస్య సిద్ధార్థా ముదితామలవర్ణినీ |
ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసీ ||

10

ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీమ్ |
భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి ||

11

కో హి రూపమిదం శ్రేష్ఠం సంత్యజ్య వరవర్ణిని |
మానుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షణః ||

12

ఇతి సా లక్ష్మణేనోక్తా కరాళా నిర్ణతోదరీ |
మన్యతే తద్వచస్తథ్యం పరిహాసావిచక్షణా ||

13

సా రామం పర్ణశాలాయాముపవిష్టం పరంతపమ్ |
సీతయా సహ దుర్ధర్షమబ్రవీత్ కామమోహితా ||

14

ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీమ్ |
వృద్ధాం భార్యామవష్టభ్య మాం న త్వం బహుమన్యసే ||

15

అద్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీమ్ |
త్వయా సహ చరిష్యామి నిఃసపత్నా యథాసుఖమ్ ||

16

ఇత్యుక్త్వా మృగశాబాక్షీమలాతసదృశేక్షణా |
అభ్యధావత్ సుసంక్రుద్ధా మహోల్కా రోహిణీమివ ||

17

తాం మృత్యుపాశప్రతిమామాపతంతీం మహాబలః |
నిగృహ్య రామః కుపితస్తతో లక్ష్మణమబ్రవీత్ ||

18

క్రూరైరనార్యైః సౌమిత్రే పరిహాసః కథంచన |
న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీమ్ ||

19

ఇమాం విరూపామసతీమతిమత్తాం మహోదరీమ్ |
రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి ||

20

ఇత్యుక్తో లక్ష్మణస్తస్యాః క్రుద్ధో రామస్య పార్శ్వతః |
ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాసం మహాబలః ||

21

నికృత్తకర్ణనాసా తు విస్వరం సా వినద్య చ |
యథాగతం ప్రదుద్రావ ఘోరా శూర్పణఖా వనమ్ ||

22

సా విరూపా మహాఘోరా రాక్షసీ శోణితోక్షితా |
ననాద వివిధాన్నాదాన్ యథా ప్రావృషి తోయదః ||

23

సా విక్షరంతీ రుధిరం బహుధా ఘోరదర్శనా |
ప్రగృహ్య బాహూ గర్జంతీ ప్రవివేశ మహావనమ్ ||

24

తతస్తు సా రాక్షససంఘసంవృతం
ఖరం జనస్థానగతం విరూపితా |
ఉపేత్య తం భ్రాతరముగ్రదర్శనం
పపాత భూమౌ గగనాద్యథాఽశనిః ||

25

తతః సభార్యం భయమోహమూర్ఛితా
సలక్ష్మణం రాఘవమాగతం వనమ్ |
విరూపణం చాత్మని శోణితోక్షితా
శశంస సర్వం భగినీ ఖరస్య సా ||

26

Aranya Kanda Sarga 18 In Telugu Pdf Download

కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు. రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీవు నన్ను పెళ్లిచేసు కుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమే నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లిచేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా! నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు.

అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు.

(ఇక్కడ వాల్మీకి ‘అకృతదారశ్చ’ అని వాడాడు. దీనికి అర్థం పెళ్లికానివాడు, అనీ, భార్య దగ్గరలేని వాడు అనీ అర్థం చెప్పుకోవచ్చు. పెళ్లికాని వాడు అంటే రాముడు అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా! అందుకని ఒంటరి వాడు. భార్య దగ్గర లేని వాడు అని అర్థం చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది అని నా భావన)

పాపం అతనికి భార్యాసౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లిచేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో!” అని అన్నాడు రాముడు.

ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకా చకా లక్ష్మణుని వద్దకు వెళ్లింది.

“ఓ సుందరాకారా! నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దాము. రా! నాతోరా!” అని తొందరపెట్టింది శూర్పణఖ.

లక్ష్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు. “ఓ లలనా! నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే, నువ్వు కూడా నన్ను పెళ్లిచేసుకొని వారికి సేవలుచేస్తావా! ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కానీ సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు. కాబట్టి నేను నీకు తగినవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్లు. ఆయనకు చిన్నభార్యగా ఉన్నా, ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనేనీకు సేవలు చేస్తాను.

రాముని భార్యను చూడు. ఎంత అందవికారంగా ఉందో! పైగా ముసలిది. పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు! ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు! కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్లు. నీ మంచికోరి చెబుతున్నాను. విను.” అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు.

లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బుర్రకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకొని, శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది.

“రామా! నన్ను చూడు. నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని. నీ భార్య కురూపి. పైగా ముసలిది. దానితో ఏం సుఖపడతావు. నాతో రా. నన్ను పెళ్లిచేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను.

(సీతను చూపిస్తూ) ఈ అందవికారిని చూచా నన్ను వద్దంటున్నావు. ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు. ఇప్పుడే దీనిని కరా కరా నమిలి తింటాను. అప్పుడు నాకు సవతి పోరు ఉండదుగా! రా రామా! మనం హాయిగా పెళ్లిచేసుకొని సుఖిద్దాము.” అని రాముని బలవంతం చేసింది. శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదికి వెళ్లింది. వెంటనే రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు. పక్కకు నెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు. ఇప్పుడు చూడు ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతను చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా వణికిపోతూ ఉందో! లక్ష్మణా! దీనికి దీని అందం చూచుకొని గర్వం. ఆ గర్వం పోగొట్టు. దీనిని అంగవిహీనురాలిగా, అందవిహీనురాలిని చెయ్యి. లేకపోతే ఇది సీతను చంపుతుంది.” అని అన్నాడు రాముడు.

అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అంగవిహీనురాలిని, అందవిహీనురాలిని చేసాడు లక్ష్మణుడు. హటాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగి పడిన ముక్కు, చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముని వదిలి అడవిలోకి పారిపోయింది.

(ఇటీవల కొంత మంది విమర్శకులు, స్త్రీవాదులు ఈ సంఘటనను విమర్శిస్తుంటారు. శూర్పణఖ ఒక స్త్రీ. ఇష్టంలేకపోతే ఇష్టంలేదని చెప్పవచ్చుకాని, ముక్కు చెవులు కోయడం అమానుషం, దారుణం అని వాదిస్తుంటారు. కాని ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శూర్పణఖ ఆటవికురాలు. రాక్షసి. నరమాంసభక్షకి. సీతను చంపడానికి ఆమె మీదికి ఉరికింది. అప్పుడు ఏం చెయ్యాలి. ” అయ్యో! శూర్పణఖ స్త్రీ. ఆమెను ఏమీ చేయకూడదు”అని ఊరుకోవాలా! అలా ఊరుకుంటే శూర్పణఖ సీతను మిరపకాయ బజ్జీ తిన్నట్టు కరా కరా నమిలి తిని ఉండేది. తన భార్య అయిన సీతను రక్షించుకోవడం రాముని ధర్మం కాదా!

“తనకు కానీ, తన వారికి కానీ, తన ఆస్తికి కానీ ఆపద కలిగినప్పుడు, ఆ ఆపద కలిగించేవారిని చంపినా, గాయపరిచినా అది నేరం కాదు.” అని నేటి న్యాయశాస్త్రం కూడా చెబుతుంది. దానిని రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. రాముడు కూడా అదే పని చేసాడు. అయినా రాముడు శూర్పణఖను చంపలేదు. కేవలం ముక్కు చెవులుకోయించాడు. సీత ప్రాణాలు రక్షించాడు. కాబట్టి నేటి విమర్శకులు అనుకుంటున్నట్టు రాముడుకానీ, లక్ష్మణుడుకానీ శూర్పణఖ ముక్కు చెవులు కోయడంలో అనుచితంగా ప్రవర్తించలేదు. పైగా న్యాయసూత్రాలు పాటించారని చెప్పుకోవచ్చు.)

ఆ ప్రకారంగా ముక్కునుండి చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరుగెత్తిపోయింది. జన స్థానములో తన చుట్టు రాక్షస సేనలు ఉండగా, శూర్పణఖ అన్న ఖరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ నేలమీద పడిపోయింది.

తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేక పోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి, ముక్కునుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Ayodhya Kanda Sarga 84 In Telugu – అయోధ్యాకాండ చతురశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 84 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ చతురశీతితమః సర్గ, “గుహాగమనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో భరతుడు మరియు గుహా మధ్య జరిగిన సంభాషణలు, భరతుడి రాముడి పట్ల ఉన్న ప్రేమను మరియు గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. గుహా, భరతుడికి రాముడి స్మృతులను వివరించి, అతడికి సహాయం చేయడానికి సన్నద్ధత వ్యక్తం చేస్తాడు. ఈ సర్గ, భక్తి, స్నేహం, మరియు విధేయతను హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.

గుహాగమనమ్

తతర్నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీమ్ |
నిషాదరాజో దృష్ట్వైవ జ్ఞాతీన్ సంత్వరితోఽబ్రవీత్ ||

1

మహతీయమితః సేనా సాగరాభా ప్రదృశ్యతే |
నాస్యాంతమధిగచ్ఛామి మనసాపి విచింతయన్ ||

2

యథా తు ఖలు దుర్బుద్ధిర్భరతః స్వయమాగతః |
స ఏష హి మహాకాయః కోవిదారధ్వజో రథే ||

3

బంధయిష్యతి వా దాశాన్ అథవాఽస్మాన్ వధిష్యతి |
అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితమ్ ||

4

సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞః సుదుర్లభామ్ |
భరతః కైకేయీపుత్రః హంతుం సమధిగచ్ఛతి ||

5

భర్తా చైవ సఖా చైవ రామర్దాశరథిర్మమ |
తస్యార్థకామాః సన్నద్ధా గంగాఽనూపే ప్రతిష్ఠత ||

6

తిష్ఠంతు సర్వ దాశాశ్చ గంగామన్వాశ్రితా నదీమ్ |
బలయుక్తా నదీరక్షా మాంసమూలఫలాశనాః ||

7

నావాం శతానాం పంచానాం కైవర్తానాం శతం శతమ్ |
సన్నద్ధానాం తథా యూనాం తిష్ఠన్త్విత్యభ్యచోదయత్ ||

8

యదా తుష్టస్తు భరతః రామస్యేహ భవిష్యతి |
సేయం స్వస్తిమతీ సేనా గంగామద్య తరిష్యతి ||

9

ఇత్యుక్త్వోపాయనం గృహ్య మత్స్యమాంసమధూని చ |
అభిచక్రామ భరతం నిషాదాధిపతిర్గుహః ||

10

తమాయాంతం తు సంప్రేక్ష్య సూతపుత్రః ప్రతాపవాన్ |
భరతాయాఽచచక్షేఽథ వినయజ్ఞో వినీతవత్ ||

11

ఏష జ్ఞాతిసహస్రేణ స్థపతిః పరివారితః |
కుశలో దండకారణ్యే వృద్ధో భ్రాతుశ్చ తే సఖా ||

12

తస్మాత్పశ్యతు కాకుత్స్థ త్వాం నిషాదాధిపో గుహః |
అసంశయం విజానీతే యత్ర తౌ రామలక్ష్మణౌ ||

13

ఏతత్తు వచనం శ్రుత్వా సుమంత్రాద్భరతః శుభమ్ |
ఉవాచ వచనం శీఘ్రం గుహః పశ్యతు మామితి ||

14

లబ్ధ్వాఽభ్యనుజ్ఞాం సంహృష్టః జ్ఞాతిభిః పరివారితః |
ఆగమ్య భరతం ప్రహ్వో గుహో వచనమబ్రవీత్ ||

15

నిష్కుటశ్చైవ దేశోఽయం వంచితాశ్చాపి తే వయమ్ |
నివేదయామస్తే సర్వే స్వకే దాసకులే వస ||

16

అస్తి మూలం ఫలం చైవ నిషాదైః సముపాహృతమ్ |
ఆర్ద్రం చ మాంసం శుష్కం చ వన్యం చోచ్చావచం మహత్ ||

17

ఆశంసే స్వాశితా సేనా వత్స్యతీమాం విభావరీమ్ |
అర్చితః వివిధైః కామైః శ్వస్ససైన్యో గమిష్యసి ||

18

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతురశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 84 Meaning In Telugu

గంగానదీతీరమున ఉన్న శృంగిబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు.

“మీరంతా చూచి ఉంటారు. గంగానదీ తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్యనుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా! లేక మనలనందరినీ చంపుతాడా! రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా! రాముడు మనకు రాజే కాదు. మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము.

అందుకని మీరందరూ ఆయుధములను చేత బట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మనసేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు ఐదువందల పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో నూరుగురు సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం కోరే వాడయితే అతనిని వెళ్లనిద్దాము. లేని ఎడల అతనిని అడ్డుకుందాము. దీనికి మీరు సంసిద్ధంగా ఉండండి.” అని పలికాడు.

తరువాత సాంప్రదాయ ప్రకారము తన శక్తికొద్దీ కానుకలు తీసుకొని గుహుడు భరతుని వద్దకు వెళ్లాడు. గుహుని రాకను సుమంత్రుడు చూచాడు. ఆ విషయము భరతునికి చెప్పాడు.

“మహారాజా! గుహుడు తన బంధుమిత్రులతో తమ దర్శనానికి వచ్చాడు. గుహుడు రామునికి మంచి మిత్రుడు. రాముడు అడవులకు వెళ్లేటప్పుడు రామునికి ఆతిధ్యము ఇచ్చాడు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో గుహునికి తెలిసి ఉంటుంది. కాబట్టి గుహుని ఆదరించు.” అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలకు భరతుడు చాలా సంతోషించాడు. “సుమంత్రా! వెంటనే గుహుని నా వద్దకు తీసుకొని రా!” అని ఆదేశించాడు. సుమంత్రుడు గుహుని భరతుని వద్దకు తీసుకొని వెళ్లాడు. గుహుడు భరతునికి వినయంగా నమస్కరించాడు. “ఈ శృంగిబేర పురమునకు నేను రాజును. నాపేరు గుహుడు. మీకు దాసుడను. ఈ పురము మీ పురమే అనుకొనుడు. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండండి. మేము నీ కోసరము ఫలములు, దుంపలు, మాంసము తీసుకొని వచ్చాము. మా సపర్యలను స్వీకరించి మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి.” అని అన్నాడు గుహుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచాశీతితమః సర్గః (85) >>

Aranya Kanda Sarga 9 In Telugu – అరణ్యకాండ నవమః సర్గః

Aranya Kanda Sarga 9 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ నవమ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో మరింత లోతుగా ప్రవేశిస్తారు. అక్కడ, రాక్షసులకు భయంకరంగా కనిపించే విరాఢుడిని ఎదుర్కొంటారు. విరాఢుడు సీతను అపహరించాలని ప్రయత్నిస్తాడు, కానీ రాముడు, లక్ష్మణుడు అతనితో తీవ్రంగా యుద్ధం చేసి, అతనిని సంహరిస్తారు.

సీతాధర్మావేదనమ్

సుతీక్ష్ణేనాభ్యనుజ్ఞాతం ప్రస్థితం రఘునందనమ్ |
హృద్యయా స్నిగ్ధయా వాచా భర్తారమిదమబ్రవీత్ ||

1

అయం ధర్మః సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ |
నివృత్తేన తు శక్యోఽయం వ్యసనాత్కామజాదిహ ||

2

త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత |
మిథ్యా వాక్యం పరమకం తస్మాద్గురుతరావుభౌ ||

3

పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రతా |
మిథ్యా వాక్యం న తే భూతం న భవిష్యతి రాఘవ ||

4

కుతోఽభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనమ్ |
తవ నాస్తి మనుష్యేంద్ర న చాభూత్తే కదాచన ||

5

మనస్యపి తథా రామ న చైతద్విద్యతే క్వచిత్ |
స్వదారనిరతస్త్వం చ నిత్యమేవ నృపాత్మజ ||

6

ధర్మిష్ఠః సత్యసంధశ్చ పితుర్నిర్దేశకారకః |
సత్యసంధ మహాభాగ శ్రీమల్లక్ష్మణపూర్వజ ||

7

త్వయి సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ |
తచ్చ సర్వం మహాబాహో శక్యం ధర్తుం జితేంద్రియైః ||

8

తవ వశ్యేంద్రియత్వం చ జానామి శుభదర్శన |
తృతీయం యదిదం రౌద్రం పరప్రాణాభిహింసనమ్ ||

9

నిర్వైరం క్రియతే మోహాత్తచ్చ తే సముపస్థితమ్ |
ప్రతిజ్ఞాతస్త్వయా వీర దండకారణ్యవాసినామ్ ||

10

ఋషీణాం రక్షణార్థాయ వధః సంయతి రక్షసామ్ |
ఏతన్నిమిత్తం చ వనం దండకా ఇతి విశ్రుతమ్ ||

11

ప్రస్థితస్త్వం సహ భ్రాత్రా ధృతబాణశరాసనః |
తతస్త్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మనః ||

12

త్వద్వృత్తం చింతయంత్యా వై భవేన్నిఃశ్రేయసం హితమ్ |
న హి మే రోచతే వీర గమనం దండకాన్ప్రతి ||

13

కారణం తత్ర వక్ష్యామి వదంత్యాః శ్రూయతాం మమ |
త్వం హి బాణధనుష్పాణిర్భ్రాత్రా సహ వనం గతః ||

14

దృష్ట్వా వనచరాన్సర్వాన్కచ్చిత్కుర్యాః శరవ్యయమ్ |
క్షత్రియాణాం చ హి ధనుర్హుతాశస్యేంధనాని చ ||

15

సమీపతః స్థితం తేజో బలముచ్ఛ్రయతే భృశమ్ |
పురా కిల మహాబాహో తపస్వీ సత్యవాక్ శుచిః ||

16

కస్మింశ్చిదభవత్పుణ్యే వనే రతమృగద్విజే |
తస్యైవ తపసో విఘ్నం కర్తుమింద్రః శచీపతిః ||

17

ఖడ్గపాణిరథాగచ్ఛదాశ్రమం భటరూపధృత్ |
తస్మింస్తదాశ్రమపదే నిశితః ఖడ్గ ఉత్తమః ||

18

స న్యాసవిధినా దత్తః పుణ్యే తపసి తిష్ఠతః |
స తచ్ఛస్త్రమనుప్రాప్య న్యాసరక్షణతత్పరః ||

19

వనే తం విచరత్యేవ రక్షన్ ప్రత్యయమాత్మనః |
యత్ర గచ్ఛత్యుపాదాతుం మూలాని చ ఫలాని చ ||

20

న వినా యాతి తం ఖడ్గం న్యాసరక్షణతత్పరః |
నిత్యం శస్త్రం పరివహన్ క్రమేణ స తపోధనః ||

21

చకార రౌద్రీం స్వాం బుద్ధిం త్యక్త్వా తపసి నిశ్చయమ్ |
తతః స రౌద్రేఽభిరతః ప్రమత్తోఽధర్మకర్శితః ||

22

తస్య శస్త్రస్య సంవాసాజ్జగామ నరకం మునిః |
ఏవమేతత్పురా వృత్తం శస్త్రసంయోగకారణమ్ ||

23

అగ్నిసంయోగవద్ధేతుః శస్త్రసంయోగ ఉచ్యతే |
స్నేహాచ్చ బహుమానాచ్చ స్మారయే త్వాం న శిక్షయే ||

24

న కథంచన సా కార్యా గృహీతధనుషా త్వయా |
బుద్ధిర్వైరం వినా హంతుం రాక్షసాన్దండకాశ్రితాన్ ||

25

అపరాధం వినా హంతుం లోకాన్వీర న కామయే |
క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనామ్ ||

26

ధనుషా కార్యమేతావదార్తానామభిరక్షణమ్ |
క్వ చ శస్త్రం క్వ చ వనం క్వ చ క్షాత్రం తపః క్వ చ ||

27

వ్యావిద్ధమిదమస్మాభిర్దేశధర్మస్తు పూజ్యతామ్ |
తదార్య కలుషా బుద్ధిర్జాయతే శస్త్రసేవనాత్ ||

28

పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్రధర్మం చరిష్యసి |
అక్షయా తు భవేత్ప్రీతిః శ్వశ్రూశ్వశురయోర్మమ ||

29

యది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో మునిః |
ధర్మాదర్థః ప్రభవతి ధర్మాత్ప్రభవతే సుఖమ్ ||

30

ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ |
ఆత్మానం నియమైస్తైస్తైః కర్శయిత్వా ప్రయత్నతః ||

31

ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖమ్ |
నిత్యం శుచిమతిః సౌమ్య చర ధర్మం తపోవనే |
సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్త్వతః ||

32

స్త్రీచాపలాదేతదుదాహృతం మే
ధర్మం చ వక్తుం తవ కః సమర్థః |
విచార్య బుద్ధ్యా తు సహానుజేన
యద్రోచతే తత్కురు మా చిరేణ ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే నవమః సర్గః ||

Aranya Kanda Sarga 9 Meaning In Telugu PDF

రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యమార్గములో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముని చూచి ఇలా పలికింది.

“నాధా! ధర్మము, ధర్మ సంపాదన చాలా నిశితమైనవి. కోరికలకు, వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు. వ్యసనములకు మూలము కామము. కామము వలన ముఖ్యంగా మూడు వ్యసనములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం. రెండవది పరుల భార్యలను కోరడం. మూడవది ఎదుటి వారి మీద ఎలాంటి విరోధము లేకుండానే వారిని హింసించడం.

ఇంక నీ సంగతి తీసుకుంటే నీవు సత్యవాక్పరిపాలకుడవు. అసత్యము పలకడం అంటే ఎలాంటిదో నీకు తెలియదు. ఇంక నీకు పరస్త్రీలమీద వాంఛ మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మలో గానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రిమాటకు విలువ ఇచ్చి రాజ్యమును త్యజించి, అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రియుడవు. ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి.

ఇంక మూడవది ఎదుటి వారిమీద ఎలాంటి వైరభావము లేకపోయినా, వారిని వధించడం. ఈ వ్యసనము నీకు ఎందుకో వచ్చింది. కారణం తెలియదు. ఈ దండకారణ్యములో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమము మీద నీవు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరావు. ఇది చూచి నా మనసు చాలా వికలమయింది. దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను. నా మనసుకు సరిఅయిన సమాధానము దొరకలేదు.

నీవు ఈ విధంగా ధనుర్బాణములను, కత్తులను ధరించి దండకారణ్యములోనికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినపుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా! చేతిలో ధనుస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయవలెనని బుద్ధిపుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కథ చెబుతాను.

ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరకు వచ్చాడు. “ఓ మహాత్మా! నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను. నేను వచ్చువరకు ఈ ఖడ్గమును తమరి దగ్గర ఉంచండి. నా పని అయిపోయిన తరువాత వచ్చి తీసుకుంటాను.” అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ ఖడ్గమును తన ఆశ్రమములో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు.

తాను ఆశ్రమములో లేని సమయములో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని, ఆఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతోపాటు తీసుకొని వెళుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండటంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటు అయింది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీదినుండి వేటమీదికి మళ్లింది. తుదకు ఆ ఋషికి నరకం సంప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది.

నాథా! సత్త్వగుణ సంపన్నుడు అయిన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండటం వల్ల, అతని మనసు క్రూరంగా మారిపోయింది. ఆయుధములకు ఆ శక్తి ఉంది. ఆయుధము, అగ్ని రెండూ ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వలన మీకు చెబుతున్నాను. అంతేగానీ ఈ విషయములు అన్నీ మీకు తెలియవు అని కాదు.

నాధా! ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకూ ఎలాంటి వైరము లేదు. వారు మనకు ఎలాంటి అపకారమూ చేయలేదు. కేవలము మీ వద్ద ఆయుధములు ఉన్న కారణంగా వాళ్లను చంపాలి అని అనుకుంటున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు అని నా అభిప్రాయము. వారు ఏ అపరాధమూ చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతం కాదు. ప్రజలు దానిని హర్షించరు.

ప్రజారక్షణ కోసరం ఆయుధములను ధరించడం క్షత్రియధర్మము. దానిని నేను కాదనను. కాని మీరు ప్రస్తుతము ముని వృత్తిలో ఉన్నారు. మీరు క్షత్రియధర్మము పాటించడం అనుచితము అని నా అభిప్రాయము. అయినా అడవులు ఎక్కడ! ఆయుధములు ఎక్కడ! క్షత్రియధర్మమెక్కడ! తపోవృత్తి ఎక్కడ! ఇవి పరస్పరమూ విరుద్ధముగా ఉన్నాయి కదా! కాబట్టి మీరు దేశధర్మమును పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతము వనములో ముని వృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది. అంతేకానీ హింసకు పాల్పడకూడదు.

మీరు అయోధ్యకు వెళ్లిన తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములు ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును. నీ తల్లి తండ్రులు నిన్ను నార చీరలు ధరించి. జటలు కట్టుకొని వనవాసము చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞప్రకారము ముని వృత్తిలో ఉంటే వారూ సంతోషిస్తారు. అదే ధర్మము. ధర్మాచరణమే మీ కర్తవ్యము. కాబట్టి నాధా! మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణమును, తపోధర్మమును పాటించండి. క్షాత్రమును వదిలిపెట్టండి. అనవసరంగా నీకు ఏ మాత్రం హాని చేయని వారిని హింసించకండి.

ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి.” అని సీత మెత్త మెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది.

శ్రీమద్రామాయణము
అరణ్య కాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ దశమః సర్గః (10) >>

Aranya Kanda Sarga 17 In Telugu – అరణ్యకాండ సప్తదశః సర్గః

Aranya Kanda Sarga 17 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” సప్తదశః సర్గలో, శూర్పణఖ, రామాయణంలోని సమస్య రాక్షసత్వం ఇక్కడ ప్రవేశిస్తుంది. ఆమె రాముడి కుటీరానికి చేరుకుని రాముడికి తన భార్యను అందజేస్తుంది. ఆమె రావణుడి సోదరి మరియు ఆమె భర్త విద్యుత్ జిహ్వాను రావణుడు ఒంటరిగా చంపాడు, అతని స్వంత సోదరిని వితంతువుగా మార్చాడు. పాత రాక్షసి అయిన ఆమె సీతను విడిచిపెట్టి రాముడు తనను వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది.

శూర్పణఖాభావావిష్కరణమ్

కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవ చ |
తస్మాద్గోదావరీతీరాత్తతో జగ్ముః స్వమాశ్రమమ్ ||

1

ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహలక్ష్మణః |
కృత్వా పౌర్వాహ్ణికం కర్మ పర్ణశాలాముపాగమత్ ||

2

ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః |
లక్ష్మణేన సహ భ్రాత్రా చకార వివిధాః కథాః ||

3

స రామః పర్ణశాలాయామాసీనః సహ సీతయా |
విరరాజ మహాబాహుశ్చిత్రయా చంద్రమా ఇవ ||

4

తథాసీనస్య రామస్య కథాసంసక్తచేతసః |
తం దేశం రాక్షసీ కాచిదాజగామ యదృచ్ఛయా ||

5

సా తు శూర్పణఖా నామ దశగ్రీవస్య రక్షసః |
భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమమ్ ||

6

సింహోరస్కం మహాబాహుం పద్మపత్రనిభేక్షణమ్ |
ఆజానుబాహుం దీప్తాస్యమతీవ ప్రియదర్శనమ్ ||

7

గజవిక్రాంతగమనం జటామండలధారిణమ్ |
సుకుమారం మహాసత్త్వం పార్థివవ్యంజనాన్వితమ్ ||

8

రామమిందీవరశ్యామం కందర్పసదృశప్రభమ్ |
బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహితా ||

9

సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ |
విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్రమూర్ధజా ||

10

ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వరా |
తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిణీ ||

11

న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమప్రియదర్శనా |
శరీరజసమావిష్టా రాక్షసీ వాక్యమబ్రవీత్ ||

12

జటీ తాపసరూపేణ సభార్యః శరచాపధృత్ |
ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షససేవితమ్ ||

13

కిమాగమనకృత్యం తే తత్త్వమాఖ్యాతుమర్హసి |
ఏవముక్తస్తు రాక్షస్యా శూర్పణఖ్యా పరంతపః ||

14

ఋజుబుద్ధితయా సర్వమాఖ్యాతుముపచక్రమే |
అనృతం న హి రామస్య కదాచిదపి సమ్మతమ్ ||

15

విశేషేణాశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ |
ఆసీద్దశరథో నామ రాజా త్రిదశవిక్రమః ||

16

తస్యాహమగ్రజః పుత్రో రామో నామ జనైః శ్రుతః |
భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రతః ||

17

ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుతా |
నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః ||

18

ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః |
త్వాం తు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాఽసి కస్య వా ||

19

న హి తావన్మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసి మే |
ఇహ వా కిం నిమిత్తం త్వమాగతా బ్రూహి తత్త్వతః ||

20

సాఽబ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దితా |
శ్రూయతాం రామ వక్ష్యామి తత్త్వార్థం వచనం మమ ||

21

అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామీదమేకా సర్వభయంకరా ||

22

రావణో నామ మే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రమాగతః ||

23

ప్రవృద్ధనిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబలః |
విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షసచేష్టితః ||

24

ప్రఖ్యాతవీర్యౌ చ రణే భ్రాతరౌ ఖరదూషణౌ |
తానహం సమతిక్రాంతా రామ త్వాపూర్వదర్శనాత్ ||

25

సముపేతాఽస్మి భావేన భర్తారం పురుషోత్తమమ్ |
అహం ప్రభావసంపన్నా స్వచ్ఛందబలగామినీ ||

26

చిరాయ భవ మే భర్తా సీతయా కిం కరిష్యసి |
వికృతా చ విరూపా చ న చేయం సదృశీ తవ ||

27

అహమేవానురూపా తే భార్యారూపేణ పశ్య మామ్ |
ఇమాం విరూపామసతీం కరాలాం నిర్ణతోదరీమ్ ||

28

అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీమ్ |
తతః పర్వతశృంగాణి వనాని వివిధాని చ ||

29

పశ్యన్సహ మయా కాంత దండకాన్విచరిష్యసి |
ఇత్యేవముక్తః కాకుత్స్థః ప్రహస్య మదిరేక్షణామ్ ||

30

ఇదం వచనమారేభే వక్తుం వాక్యవిశారదః ||

31

Aranya Kanda Sarga 17 In Telugu Pdf Download

రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో, లక్ష్మణునితోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు.

“రామా! నేను ఇక్కడకు వచ్చి చాలాకాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి.” అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు.

కొంత సేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో, ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది. మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు.

రాముని మొహం చాలా అందంగా ఉంటే, శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే, ఆమెది బానపొట్ట. రాముని కళ్లు విశాలంగా ఉంటే, ఆమె కళ్లు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది. రామునిది మోహనాకారమైతే ఆమెది వికారరూపము.

రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది. రాముడు నవయౌవనుడు. ఆమె వయసుమళ్లిన స్త్రీ. రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రామ్యంగా కఠోరంగా ఉంది. రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన.

రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్యభావము కలుగుతూఉంది. ఇలా హస్తిమశకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణఖ రాముని చూచి మోహించింది.

తన సహజరూపంతో పోతే రాముడు తనను వరించడని, వెంటనే తన రూపంమార్చింది. నవయౌవన వతిగా తయారయింది. రాముని సమీపించింది.

“ఓ సుందరాకారా! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈమె నీ భార్య అనుకుంటాను. భార్యాసమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్తులా లేవే. జటాజూటములు ధరించి ముని కుమారుని వలె ఉన్నావు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది. ఇంతకూ నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నిజం చెప్పు.” అని నిలదీసింది శూర్పణఖ.

అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తరుణీ! నా పేరు రాముడు. నేను అయోధ్యాధీశుడు దశరథుని కుమారుడను. ఈమె నాభార్య సీత. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. మీము మా తండ్రిగారి ఆజ్ఞమేరకు వనవాసము చేస్తున్నాము. ఇంతకూ నీవు ఎవరు? నీ నివాసము ఎక్కడ? నీ భర్తపేరు ఏమిటి?” అని అడిగాడు రాముడు. దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది.

“ఓరామా! నేను ఒక రాక్షస స్త్రీని. నా పేరు శూర్పణఖ. నేను రాక్షస స్త్రీని అయినా నేను కామరూపము ధరించు శక్తి కలదానను. ఈ అరణ్యమే నా నివాసము. విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న. మహా పరాక్రమ వంతుడు. నీవు ఆయన గురించి వినేవుంటావు. ఆయన తమ్ముడు, మహాబలవంతుడైన కుంభకర్ణుడు.

ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు. రాక్షస వంశములో తప్పపుట్టిన వాడు విభీషణుడు. ఆయన కూడా నా సోదరుడే. ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరచుకున్న ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. నేనువారి వద్దనే ఉంటున్నాను.

తొలిసారిగా అతిలోకమన్మధాకారుడవైన నిన్ను చూచాను. నీ మోహంలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకొన్నాను. దానికి తిరుగులేదు. ఈమె నీ భార్య అంటున్నావు. నేను ఉన్నానుగా. ఇంకా ఈమెతో నీకు ఏం పని. నా అందంతో పోలిస్తే ఈసీత వికారంగా ఉంది కదూ! ఈమెను వదిలెయ్యి.

నువ్వు ఊ అంటే నేను ఈమెను నీ తమ్ముని విరుచుకొని తింటాను. తరువాత మనం ఇద్దరం ఈ అరణ్యములో, పర్వతశిఖరములలో ఆనందంగా విహరిద్దాము. నాతో వచ్చెయ్యి” అని పలికింది శూర్పణఖ.

(శూర్పణఖ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్స్టెట్ శూర్పణఖతోనే మొదలయిందా అనిపించడం లేదూ!

ఇంకా చూడండి….ఈ కాలం కుర్రాళ్లు అనేమాట….. “నేను నిన్ను చూడగానే ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ఫిక్స్ అయ్యానుగా….. తప్పదు. లేకుంటే ఆసిడ్ పోస్తా, బ్లేడుతో గొంతుకోస్తా. నాకు దక్కనిది వేరే ఎవరికీ దక్కడానికి వీలులేదు. అడ్డం వచ్చిన వాళ్లని నరుకుతా” ఇవే కదా నేటి డైలాగులు.

ఈ తరహా ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. ఇది శూర్పణఖతోనే మొదలయినట్టుంది. ఈ నాటిదాకా కొనసాగుతూ ఉంది. నాడు శూర్పణఖ కూడా తాను రాముడికి ఇష్టమా లేదా అని ఆలోచించలేదు. ఈ నాడు కూడా కుర్రాళ్లు తనంటే ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అని ఆలోచించరు.

ఏదో ఒక లాగ లైన్ లో పెట్టడానికీ, బుట్టలో వేసుకోడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఉందిగా అంటారు. అదీకాకపోతే చంపడం, చావడం. దీనికి ప్రతీక శూర్పణఖ కామం. దీనిని లవ్ అనరు. కామం(లస్ట్) అంటారు. అది తెలుసుకోవాలి.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టాదశః సర్గః (18) >>

Ayodhya Kanda Sarga 92 In Telugu – అయోధ్యాకాండ ద్వినవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 92

రామాయణంలోని అయోధ్యాకాండ ద్వినవతితమ (92వ) సర్గలో, మంత్రుడు భరతుని వద్దకు చేరి, దశరథ మహారాజు మరణాన్ని, రాముని అరణ్యవాసాన్ని తెలిపాడు. భరతుడు, ఈ వార్త విని గుండె పగిలినట్టు బాధపడతాడు. ఆతరువాత భరతుడు, సతీమణి మాండవితో కలసి అయోధ్యకు ప్రయాణిస్తాడు. అక్కడ, రాజభవనం వదలి సుమంత్రుడు, వసిష్ఠుడు మరియు ఇతర మంత్రులు భరతుని స్వాగతం పలుకుతారు. భరతుడు, కైకేయిని చూడగానే, ఆమె కృత్యాన్ని ధిక్కరిస్తాడు. వసిష్ఠుడు, భరతుని రాముని పిలవడానికి, సింహాసనం పైకి తీసుకురావడానికి సూచిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మబద్ధత, రామునిపై ప్రేమను, అయోధ్య ప్రజల దుఃఖాన్ని తెలుపుతుంది.

భరద్వాజామంత్రణమ్

తతస్తాం రజనీం వ్యుష్య భరతః సపరిచ్ఛదః |
కృతాతిథ్యో భరద్వాజం కామాదభిజగామ హ || ౧ ||

తమృషిః పురుషవ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చాగతమ్ |
హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోఽభ్యభాషత || ౨ ||

కచ్చిదత్ర సుఖా రాత్రిస్తవాస్మద్విషయే గతా |
సమగ్రస్తే జనః కచ్చిదాతిథ్యే శంస మేఽనఘ || ౩ ||

తమువాచాంజలిం కృత్వా భరతోఽభిప్రణమ్య చ |
ఆశ్రమాదభినిష్క్రాంతమృషిముత్తమతేజసమ్ || ౪ ||

సుఖోషితోఽస్మి భగవన్ సమగ్రబలవాహనః |
తర్పితః సర్వకామైశ్చ సామాత్యో బలవత్త్వయా || ౫ ||

అపేతక్లమసంతాపాః సుభిక్షాః సుప్రతిశ్రయాః |
అపి ప్రేష్యానుపాదాయ సర్వే స్మ సుసుఖోషితాః || ౬ ||

ఆమంత్రయేఽహం భగవన్ కామం త్వామృషిసత్తమః |
సమీపం ప్రస్థితం భ్రాతుర్మైత్రేణేక్షస్వ చక్షుషా || ౭ ||

ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః |
ఆచక్ష్వ కతమో మార్గః కియానితి చ శంస మే || ౮ ||

ఇతి పృష్టస్తు భరతం భ్రాతృదర్శనలాలసమ్ |
ప్రత్యువాచ మహాతేజాః భరద్వాజో మహాతపాః || ౯ ||

భరతార్ధతృతీయేషు యోజనేష్వజనే వనే |
చిత్రకూటో గిరిస్తత్ర రమ్యనిర్దరకాననః || ౧౦ ||

ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నదీ |
పుషిపతద్రుమసంఛన్నా రమ్యపుష్పితకాననా || ౧౧ ||

అనంతరం తత్సరితశ్చిత్రకూటశ్చ పర్వతః |
తయోః పర్ణకుటీ తాత తత్ర తౌ వసతో ధ్రువమ్ || ౧౨ ||

దక్షిణేనైవ మార్గేణ సవ్యదక్షిణమేవ వా |
గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే || ౧౩ ||

వాహయస్వ మహాభాగ తతో ద్రక్ష్యసి రాఘవమ్ |
ప్రయాణమితి తచ్ఛ్రుత్వా రాజరాజస్య యోషితః || ౧౪ ||

హిత్వా యానాని యానార్హాః బ్రాహ్మణం పర్యవారయన్ |
వేపమానా కృశా దీనా సహ దేవ్యా సుమిత్రయా || ౧౫ ||

కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేః |
అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హితా || ౧౬ ||

కైకేయీ తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రపా |
తం ప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిమ్ || ౧౭ ||

అదూరాద్భరతస్యైవ తస్థౌ దీనమనాస్తదా |
తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః || ౧౮ ||

విశేషం జ్ఞాతుమిచ్ఛామి మాతౄణాం తవ రాఘవ |
ఏవముక్తస్తు భరతో భరద్వాజేన ధార్మికః || ౧౯ ||

ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచనకోవిదః |
యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్శితామ్ || ౨౦ ||

పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి |
ఏషా తం పురుషవ్యాఘ్రం సింహవిక్రాంతగామినమ్ || ౨౧ ||

కౌసల్యా సుషువే రామం ధాతారమదితిర్యథా |
అస్యావామభుజం శ్లిష్టా యైషా తిష్ఠతి దుర్మనాః || ౨౨ ||

కర్ణికారస్య శాఖేవ శీర్ణపుష్పా వనాంతరే |
ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ || ౨౩ ||

ఉభౌ లక్ష్మణశత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ |
యస్యాః కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గతౌ || ౨౪ ||

రాజపుత్రవిహీనశ్చ స్వర్గం దశరథో గతః |
క్రోధనామకృతప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీమ్ || ౨౫ ||

ఐశ్వర్యకామాం కైకేయీమనార్యామార్యరూపిణీమ్ |
మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయామ్ || ౨౬ ||

యతోమూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః |
ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గదయా గిరా || ౨౭ ||

స నిశశ్వాస తామ్రాక్షో నాగః క్రుద్ధ ఇవ శ్వసన్ |
భరద్వాజో మహర్షిస్తం బ్రువంతం భరతం తథా || ౨౮ ||

ప్రత్యువాచ మహాబుద్ధిరిదం వచనమర్థవత్ |
న దోషేణావగంతవ్యా కైకేయీ భరత త్వయా || ౨౯ ||

రామప్రవ్రాజనం హ్యేతత్ సుఖోదర్కం భవిష్యతి |
దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనామ్ || ౩౦ ||

హితమేవ భవిష్యద్ధి రామప్రవ్రాజనాదిహ |
అభివాద్య తు సంసిద్ధః కృత్వా చైనం ప్రదక్షిణమ్ || ౩౧ ||

ఆమంత్ర్య భరతః సైన్యం యుజ్యతామిత్యచోదయత్ |
తతో వాజిరథాన్యుక్త్వా దివ్యాన్హేమపరిష్కృతాన్ || ౩౨ ||

అధ్యారోహత్ప్రయాణార్థీ బహూన్బహువిధో జనః |
గజకన్యా గజాశ్చైవ హేమకక్ష్యాః పతాకినః || ౩౩ ||

జీమూతా ఇవ ఘర్మాంతే సఘోషాః సంప్రతస్థిరే |
వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ || ౩౪ ||

ప్రయయుః సుమహార్హాణి పాదైరేవ పదాతయః |
అథ యానప్రవేకైస్తు కౌసల్యాప్రముఖాః స్త్రియః || ౩౫ ||

రామదర్శనకాంక్షిణ్యః ప్రయయుర్ముదితాస్తదా |
చంద్రార్కతరుణాభాసాం నియుక్తాం శిబికాం శుభామ్ || ౩౬ ||

ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః |
సా ప్రయాతా మహాసేనా గజవాజిరథాకులా || ౩౭ ||

దక్షిణాం దిశమావృత్య మహామేఘ ఇవోత్థితః |
వనాని తు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః |
గంగాయాః పరవేలాయాం గిరిష్వపి నదీషు చ || ౩౮ ||

సా సంప్రహృష్టద్విజవాజియోధా
విత్రాసయంతీ మృగపక్షిసంఘాన్ |
మహద్వనం తత్ప్రతిగాహమానా
రరాజ సేనా భరతస్య తత్ర || ౩౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వినవతితమః సర్గః || ౯౨ ||

Ayodhya Kanda Sarga 92 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. భరతుడు భరద్వాజుని వద్దకు పోయి రాముని వద్దకు పోవుటకు ఆయన అనుమతి కోరాడు. అప్పుడే అగ్నికార్యము ముగించుకొని కూర్చుని ఉన్న భరద్వాజుని ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు భరతుడు.

“ఓ భరతా! నీవు నీ పరివారమూ రాత్రి సుఖంగా గడిపారా! మీకు మా ఆతిథ్యము సంతోషాన్ని కలిగించిందా! మీరు మా ఆతిథ్యముతో తృప్తి చెందారా!” అని అడిగాడు భరద్వాజుడు.

“మహర్షీ! తమరు మాకు ఇచ్చిన ఆతిథ్యము మాకు మా పరివారమునకు ఎంతో సంతోషము కలిగించింది. మా వారందరూ
హాయిగా భుజించి నిద్రించారు. నేను నా రాముని వద్దకు పోవడానికి తమరి అనుమతి కోరుతున్నాను. రాముడు ఎక్కడ ఆశ్రమము నిర్మించుకున్నాడో, అది ఇక్కడికి ఎంత దూరం ఉన్నదో, అక్కడకు పోవడానికి మార్గము ఏమిటో తెలియజేయవలసినదిగా కోరుతున్నాను.” అని అడిగాడు భరతుడు.

“ఓ భరతా! ఇక్కడికి మూడున్నర క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. అక్కడే మందాకినీ నది ప్రహిస్తూ ఉంది. అక్కడ ఒక నిర్జన ప్రదేశములో రాముడు పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తున్నాడు. నీవు ఇక్కడినుండి నీ సేనలతో, పరివారముతో, దక్షిణముగా గానీ, నైఋతి దిశగా గానీ ప్రయాణం చేస్తే రాముని పర్ణశాలకు చేరుకుంటావు.” అని చెప్పాడు భరద్వాజుడు.

ఇంతలో దశరథుని భార్యలు అక్కడకు చేరుకున్నారు. అందరూ భరద్వాజుని కాళ్లకు నమస్కరించారు. “భరతా!నీ తల్లులను నాకు పరిచయం చెయ్యి” అని అడిగాడు భరద్వాజుడు.

“ఓ మహర్షీ! దీనంగా ఉండి ఉపవాసములతో శరీరం శుష్కింప చేసుకున్న ఈమె దశరథమహారాజు పట్టమహిషి కౌసల్యాదేవి. రాముని కన్న పుణ్యమూర్తి. ఆమెకు ఎడమ పక్కగా నిలబడి ఉన్న ఆమె లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. వారి పక్కనే తలవంచుకొని ఉన్న ఆమె నా తల్లి కైకేయి. కోపస్వభావురాలు. ఏ మాత్రమూ వివేచన లేనిది. గర్విష్ఠి. అందము, ఐశ్యర్యము, అధికారమునకే ప్రాధాన్యం ఇస్తూ వాటి కోసరం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. ఈమె కారణంగానే నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు. నా తండ్రి అకాలమృత్యువు వాత పడ్డాడు. నేను ఈనాడు పడుతున్న ఇన్ని బాధలకు ఈమెయే మూలకారణము.” అని అన్నాడు భరతుడు.

భరతుని మాటలు సావధానముగా విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ భరతా! అలా మాట్లాడకూడదు. ఇందులో నీ తల్లి దోషము ఏమాత్రమూ లేదు. రాముని అరణ్యవాసము భవిష్యత్తులో ఎన్నో శుభములకు సూచన మాత్రమే. నీ కైక కేవలము నిమిత్త మాత్రురాలు. రాముడు అరణ్యములకు రావడం వలన ఇక్కడ ఉన్న మునులకు, ఋషులకు, దేవతలకు హితము చేకూరుతుంది.’ అని పలికాడు భరద్వాజుడు.

తరువాత భరతుడు ఆయనకు నమస్కరించి ప్రయాణము నకు సిద్ధం కమ్మని తన సైన్యమునకు ఆదేశాలు ఇచ్చాడు. అందరూ తమ తమ రథములను ఎక్కారు. సైన్యం కదిలింది. వారు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు. కొండలు గుట్టలుదాటిప్రయాణము చేస్తున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రినవతితమః సర్గః (93) >>