Ayodhya Kanda Sarga 66 In Telugu – అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 66

అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గ రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు సీతా దేవితో కలిసి వనవాసానికి బయలుదేరుతాడు. రథంలో ప్రయాణిస్తూ రాముడు గంగా నదిని చేరుకుంటాడు. అప్పుడు గుహుడు అనే నిశాద రాజు రాముడు, సీత, లక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వడమే కాక, వారికి సహాయం చేస్తాడు. వారు గంగా నదిని దాటడానికి పడవను అందిస్తాడు. రాముడు తన పట్టాభిషేకం రద్దయినప్పటికీ, ధైర్యంగా వనవాసం అంగీకరించి ధర్మాన్ని పాటిస్తాడు. ఈ సర్గ రాముని నిశ్చలత, ధర్మానుస్థానం, మరియు ఆపదలో ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది.

తైలద్రోణ్యధిశయనమ్

తమగ్నిమివ సంశాంతమంబు హీనమివార్ణవమ్ |
హతప్రభమివాదిత్యం స్వర్గస్థం ప్రేక్ష్య పార్థివమ్ || ౧ ||

కౌసల్యా బాష్పపూర్ణాక్షీ వివిధం శోకకర్శితా |
ఉపగృహ్య శిరః రాజ్ఞః కైకేయీం ప్రత్యభాషత || ౨ ||

సకామా భవ కైకేయి భుంక్ష్వ రాజ్యమకణ్టకమ్ |
త్యక్త్వా రాజానమేకాగ్రా నృశంసే దుష్టచారిణి || ౩ ||

విహాయ మాం గతః రామః భర్తా చ స్వర్గతః మమ |
విపథే సార్థహీనేవ నాహం జీవితుముత్సహే || ౪ ||

భర్తారం తం పరిత్యజ్య కా స్త్రీ దైవతమాత్మనః |
ఇచ్చేజ్జీవితుమన్యత్ర కైకేయ్యాస్త్యక్తధర్మణః || ౫ ||

న లుబ్ధో బుధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ |
కుబ్జానిమిత్తం కైకేయ్యా రాఘవాణాం కులం హతమ్ || ౬ ||

అనియోగే నియుక్తేన రాజ్ఞా రామం వివాసితమ్ |
సభార్యం జనకః శ్రుత్వా పరితప్స్యత్యహం యథా || ౭ ||

స మామనాథాం విధవాం నాద్య జానాతి ధార్మికః |
రామః కమలపత్రాక్షో జీవనాశమితః గతః || ౮ ||

విదేహరాజస్య సుతా తథా సీతా తపస్వినీ |
దుఃఖస్యానుచితా దుఃఖం వనే పర్యుద్విజిష్యతి || ౯ ||

నదతాం భీమఘోషాణాం నిశాసు మృగపక్షిణామ్ |
నిశమ్య నూనం సంత్రస్తా రాఘవం సంశ్రయిష్యతి || ౧౦ ||

వృద్ధశ్చైవాల్ప పుత్రశ్చ వైదేహీమనిచింతయన్ |
సోఽపి శోకసమావిష్టర్నను త్యక్ష్యతి జీవితమ్ || ౧౧ ||

సాఽహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రతా |
ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనమ్ || ౧౨ ||

తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్వినీమ్ |
వ్యపనిన్యుః సుదుహ్ఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః || ౧౩ || [వ్యపనీయ]

తైలద్రోణ్యామథామాత్యాః సంవేశ్య జగతీపతిమ్ |
రాజ్ఞః సర్వాణ్యథాదిష్టాశ్చక్రుః కర్మాణ్యనంతరమ్ || ౧౪ ||

న తు సఙ్కలనం రాజ్ఞో వినా పుత్రేణ మంత్రిణః |
సర్వజ్ఞాః కర్తుమీషుస్తే తతః రక్షంతి భూమిపమ్ || ౧౫ ||

తైలద్రోణ్యాం తు సచివైః శాయితం తం నరాధిపమ్ |
హా మృతోఽయమితి జ్ఞాత్వా స్త్రియస్తాః పర్యదేవయన్ || ౧౬ ||

బాహూనుద్యమ్య కృపణా నేత్రప్రస్రవణైః ముఖైః |
రుదంత్యః శోకసంతప్తాః కృపణం పర్యదేవయన్ || ౧౭ ||

హా మహారాజ రామేణ సతతం ప్రియవాదినా |
విహీనాః సత్యసంధేన కిమర్థం విజహాసి నః || ౧౮ ||

కైకేయ్యా దుష్టభావాయాః రాఘవేణ వియోజితాః |
కథం పతిఘ్న్యా వత్స్యామః సమీపే విధవా వయమ్ || ౧౯ ||

స హి నాథః సదాఽస్మాకం తవ చ ప్రభురాత్మవాన్ |
వనం రామో గతః శ్రీమాన్ విహాయ నృపతిశ్రియమ్ || ౨౦ ||

త్వయా తేన చ వీరేణ వినా వ్యసనమోహితాః |
కథం వయం నివత్స్యామః కైకేయ్యా చ విదూషితాః || ౨౧ ||

యయా తు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబలః |
సీతయా సహ సంత్యక్తాః సా కమన్యం న హాస్యతి || ౨౨ ||

తా బాష్పేణ చ సంవీతాః శోకేన విపులేన చ |
వ్యవేష్టంత నిరానందా రాఘవస్య వరస్త్రియః || ౨౩ ||

నిశా చంద్రవిహీనేవ స్త్రీవ భర్తృవివర్జితా |
పురీ నారాజతాయోధ్యా హీనా రాజ్ఞా మహాత్మనా || ౨౪ ||

బాష్ప పర్యాకులజనా హాహాభూతకులాంగనా |
శూన్యచత్వరవేశ్మాంతా న బభ్రాజ యథాపురమ్ || ౨౫ ||

గతే తు శోకాత్ త్రిదివం నరాధిపే
మహీతలస్థాసు నృపాంగనాసు చ |
నివృత్తచారః సహసా గతో రవిః
ప్రవృత్తచారా రాజనీ హ్యుపస్థితా || ౨౬ ||

ఋతే తు పుత్రాద్దహనం మహీపతేః
నరోచయంతే సుహృదః సమాగతాః |
ఇతీవ తస్మిన్ శయనే న్యవేశయన్
విచింత్య రాజానమచింత్య దర్శనమ్ || ౨౭ ||

గతప్రభా ద్యౌరివ భాస్కరం వినా
వ్యపేతనక్షత్రగణేవ శర్వరీ |
పురీ బభాసే రహితా మహాత్మనా
న చాస్ర కంఠాకుల మార్గచత్వరా || ౨౮ ||

నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘః
విగర్హమాణా భరతస్య మాతరమ్ |
తదా నగర్యాం నరదేవసంక్షయే
బభూవురార్తా న చ శర్మ లేభిరే || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్షష్ఠితమః సర్గః || ౬౬ ||

Ayodhya Kanda Sarga 66 Meaning In Telugu

కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దు:ఖిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది. “ఏమ్మా! కైకా! నీ కోరిక తీరిందా! నీ మనస్సు శాంతించిందా! ఇంక నువ్వు, నీ కొడుకు, ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్లిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు. ఎవరి కోసం బతకాలి. నీ లాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా.

ఓ కైకా! నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేసావా! లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేసావు. ఓ కైకా! నీవు మాకే కాదు. జనక మహారాజును కూడా దు:ఖములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంతదు:ఖిస్తున్నాడో కదా! ఇంతకూ రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది. తన తల్లి అనాధ అయింది అని ఎవరు చెబుతారు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు! నా భర్త రాముని గూర్చి, సీతను గూర్చి, తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళతాను. నా భర్తతో పాటు చితి మీదకూర్చుని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్పనాకు వేరుమార్గము లేదు.” అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకొని భోరు భోరున ఏడుస్తూ ఉంది.

ఇంతలో కులగురువు వసిష్టులు, అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వసిష్ఠుని ఆదేశము మేరకు అంత:పురపరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవులలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహనక్రియలు నిర్వర్తించడానికి వీలులేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు.

(తైలద్రోణి అంటే పలు విధములైన నూనెలు(preservatives) కలిగిన తొట్టె అని అర్థము. ఈ రోజుల్లో కూడా శవాలను చెడిపోకుండా భద్రపరచడానికి యాసిడ్లు పూసి భద్రపరుస్తారు. మమ్మీలు అన్నీ అలా భద్రపరచబడినవే. ఇదే ప్రక్రియ త్రేతాయుగములో కూడా ఉంది అని తెలుస్తూ ఉంది.)
అప్పటి దాకా దూర దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోదిస్తున్నారు.

“ఓ మహారాజా! మాకు రాముడిని దూరం చేసావు. ఇప్పుడు నువ్వుకూడా దూరంగా వెళ్లిపోయావా! చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము. రాముడూ లేకుండా, నీవూ లేకుండా, ఈ కైక పెట్టే బాధలనుసహిస్తూ మేము ఎలా జీవించగలము. ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసరం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచి పెడుతుందా?” అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలచుకుంటూ నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు.

వీరి పరిస్థితి ఇలా ఉంటే, అటు రాముని, ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురు కున్నాయి. అందరూ శోమసముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజులేని అయోధ్య శోభావిహీన అయింది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణమును చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకున్నాయి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గః (67) >>

Ayodhya Kanda Sarga 67 In Telugu – అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 67

అయోధ్యాకాండ సప్తషష్ఠితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. ఈ సర్గలో, రాముడు సీత, లక్ష్మణులతో కలిసి గంగానదిని దాటి దక్షిణ దిశగా పయనిస్తాడు. వారు చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు, అక్కడ సురమ్యమైన ప్రకృతిని చూస్తారు. చిత్రకూటంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి, వారు నివసించేందుకు సిద్ధపడతారు. అయోధ్యలో, రాముని వనవాసం కారణంగా దశరథుడు మరణిస్తాడు. భరతుడు తన తండ్రి మరణవార్త విని కైకేయి మీద కోపంతో ఉన్నా, రాముని తీసుకురావాలనే సంకల్పంతో చిత్రకూటానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. ఈ సర్గ రాముని త్యాగం, భరతుని భక్తి, మరియు దశరథుని దుఃఖాన్ని ప్రతిబింబిస్తుంది.

అరాజకదురవస్థావర్ణనమ్

ఆక్రందితనిరానందా సాస్రకంఠజనాకులా |
ఆయోధ్యాయామవతతా సా వ్యతీయాయ శర్వరీ || ౧ ||

వ్యతీతాయాం తు శర్వర్యామాదిత్యస్యోదయే తతః |
సమేత్య రాజకర్తారః సభామీయుర్ద్విజాతయః || ౨ ||

మార్కండేయోఽథ మౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః |
కాత్యయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః || ౩ ||

ఏతే ద్విజాః సహామాత్యైః పృథగ్వాచముదీరయన్ |
వసిష్ఠమేవాభిముఖాః శ్రేష్ఠం రాజపురోహితమ్ || ౪ ||

అతీతా శర్వరీ దుఃఖం యా నో వర్షశతోపమా |
అస్మిన్ పంచత్వమాపన్నే పుత్ర శోకేన పార్థివే || ౫ ||

స్వర్గతశ్చ మహారాజో రామశ్చారణ్యమాశ్రితః |
లక్ష్మణశ్చాపి తేజస్వీ రామేణైవ గతః సహ || ౬ ||

ఉభౌ భరత శత్రుఘ్నౌ కేకయేషు పరంతపౌ |
పురే రాజగృహే రమ్యే మాతామహనివేశనే || ౭ ||

ఇక్ష్వాకూణామిహాద్యైవ కశ్చిద్రాజా విధీయతామ్ |
అరాజకం హి నో రాష్ట్రం న వినాశమవాప్నుయాత్ || ౮ ||

నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః |
అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణా || ౯ ||

నారాజకే జనపదే బీజముష్టిః ప్రకీర్యతే |
నారాజకే పితుః పుత్రః భార్యా వా వర్తతే వశే || ౧౦ ||

అరాజకే ధనం నాస్తి నాస్తి భార్యాఽప్యరాజకే |
ఇదమత్యాహితం చాన్యత్ కుతః సత్యమరాజకే || ౧౧ ||

నారాజకే జనపదే కారయంతి సభాం నరాః |
ఉద్యానాని చ రమ్యాణి హృష్టాః పుణ్యగృహాణి చ || ౧౨ ||

నారాజకే జనపదే యజ్ఞశీలా ద్విజాతయః |
సత్రాణ్యన్వాసతే దాంతా బ్రాహ్మణాః సంశితవ్రతాః || ౧౩ ||

నారాజకే జనపదే మహాయజ్ఞేషు యజ్వనః |
బ్రాహ్మణా వసుసంపన్నా విసృజంత్యాప్తదక్షిణాః || ౧౪ ||

నారాజకే జనపదే ప్రభూతనటనర్తకాః |
ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధనాః || ౧౫ ||

నారజకే జనపదే సిద్ధార్థా వ్యవహారిణః |
కథాభిరనురజ్యంతే కథాశీలాః కథాప్రియైః || ౧౬ ||

నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః |
సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః || ౧౭ ||

నారాజకే జనపదే వాహనైః శీఘ్రగామిభిః |
నరా నిర్యాంత్యరణ్యాని నారీభిః సహ కామినః || ౧౮ ||

నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః |
శేరతే వివృత ద్వారాః కృషిగోరక్షజీవినః || ౧౯ ||

నారాజకే జనపదే బద్దఘంటావిషాణినః |
ఆటంతి రాజమార్గేషు కుంజరా షష్టిహాయనాః || ౨౦ ||

నారాజకే జనపదే శరాన్ సతతమస్యతామ్ |
శ్రూయతే తలనిర్ఘోష ఇష్వస్త్రాణాముపాసనే || ౨౧ ||

నారాజకే జనపదే వణిజో దూరగామినః |
గచ్ఛంతి క్షేమమధ్వానం బహుపణ్యసమాచితాః || ౨౨ ||

నారాజకే జనపదే చరత్యేకచరః వశీ |
భావయన్నాత్మనాఽఽత్మానం యత్ర సాయంగృహో మునిః || ౨౩ ||

నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే |
నచాప్యరాజకే సేనా శత్రూన్ విషహతే యుధి || ౨౪ ||

నారాజకే జనపదే హృష్టైః పరమవాజిభిః |
నరాః సంయాంతి సహసా రథైశ్చ పరిమండితాః || ౨౫ ||

నారాజకే జనపదే నరాః శాస్త్రవిశారదాః |
సంవదంతోఽవతిష్ఠంతే వనేషూపవనేషు చ || ౨౬ ||

నారాజకే జనపదే మాల్యమోదకదక్షిణాః |
దేవతాభ్యర్చనార్థయ కల్ప్యంతే నియతైర్జనైః || ౨౭ ||

నారాజకే జనపదే చందనాగురురూషితాః |
రాజపుత్రా విరాజంతే వసంత ఇవ శాఖినః || ౨౮ ||

యథా హ్యనుదకా నద్యో యథా వాఽప్యతృణం వనమ్ |
అగోపాలా యథా గావస్తథా రాష్ట్రమరాజకమ్ || ౨౯ ||

ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసోః |
తేషాం యో నో ధ్వజో రాజ స దేవత్వమితో గతః || ౩౦ ||

నారాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్ |
మత్స్యా ఇవనరా నిత్యం భక్షయంతి పరస్పరమ్ || ౩౧ ||

యే హి సంభిన్నమర్యాదా నాస్తికాశ్చిన్న సంశయాః |
తేఽపి భావాయ కల్పంతే రాజదండనిపీడితాః || ౩౨ ||

యథా దృష్టిః శరీరస్య నిత్యమేవప్రవర్తతే |
తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవః సత్యధర్మయోః || ౩౩ ||

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౩౪ ||

యమో వైశ్రవణః శక్రో వరుణశ్చ మహాబలః |
విశేష్యంతే నరేంద్రేణ వృత్తేన మహతా తతః || ౩౫ ||

అహో తమైవేదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన |
రాజా చేన్న భవేల్లోకే విభజన్ సాధ్వసాధునీ || ౩౬ ||

జీవత్యపి మహారాజే తవైవ వచనం వయమ్ |
నాతిక్రమామహే సర్వే వేలాం ప్రాప్యేవ సాగరః || ౩౭ ||

స నః సమీక్ష్య ద్విజవర్య వృత్తమ్
నృపం వినా రాజ్యమరణ్యభూతమ్ |
కుమారమిక్ష్వాకు సుతం వదాన్యమ్
త్వమేవ రాజానమిహాభిషించ || ౩౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్ఠితమః సర్గః || ౬౭ ||

Ayodhya Kanda Sarga 67 Meaning In Telugu

మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు బ్రాహ్మణులు పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజ పురోహితుడైన వసిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు.

“నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్దకుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో (తాతగారి ఇంటిలో) ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది.

రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పుచేసిన వారిని శిక్షించే వారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్యీర్యము అవుతంఉది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలునిర్భయంగా తిరగడానికి భయపడతారు.

శత్రు రాజులు మన దేశము మీదికి దండెత్తే అవకాశము ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు, ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు.రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేదిరాజు. అందుకనే రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము అవుతుంది. కాబట్టి ఓ వసిష్ట మహర్షీ! మేము చెప్పిన విషయములను పరిశీలించి, ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం.” అని పలికారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము, అరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టషష్ఠితమః సర్గః (68) >>

Ayodhya Kanda Sarga 65 In Telugu – అయోధ్యాకాండ పంచషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 65

అయోధ్యాకాండ పంచషష్ఠితమః సర్గః రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో దశరథుడు రాముని వనవాసం పంపడంలో ఉద్భవించిన విచారాన్ని వర్ణిస్తారు. కైకేయి మాట ప్రకారం రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనానికి వెళ్ళడానికి సిద్దపడతాడు. ప్రజలు విచారంతో రాముని వెంటవెళ్లి వనవాసం ఆరంభాన్ని చూస్తారు. దశరథుడు రాముని వనవాసం వెళ్ళిపోవడం వల్ల తీవ్ర విషాదంలో ఉంటాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాటిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, వనవాసం చేయడం ప్రారంభిస్తాడు. ఈ సర్గ రాముని ధర్మపాలనను, కుటుంబ బాంధవ్యాలను, బాధ్యతను ప్రతిబింబిస్తుంది.

అంతఃపురాక్రందః

అథ రాత్ర్యాం వ్యతీతాయాం ప్రాతరేవాపరేఽహని |
వందినః పర్యుపాతిష్ఠన్ తత్పార్థివనివేశనమ్ || ౧ ||

సూతాః పరమసంస్కారాః మంగళాశ్చోత్తమశ్రుతాః |
గాయకాః స్తుతిశీలాశ్చ నిగదంతః పృథక్ పృథక్ || ౨ ||

రాజానం స్తువతాం తేషాముదాత్తాభిహితాశిషామ్ |
ప్రాసాదాభోగవిస్తీర్ణః స్తుతిశబ్దో హ్యవర్తత || ౩ ||

తతస్తు స్తువతాం తేషాం సూతానాం పాణివాదకాః |
అపదానాన్యుదాహృత్య పాణివాదా నవాదయన్ || ౪ ||

తేన శబ్దేన విహగాః ప్రతిబుద్ధా విసస్వనుః |
శాఖాస్థాః పంజరస్థాశ్చ యే రాజకులగోచరాః || ౫ ||

వ్యాహృతాః పుణ్యశబ్దాశ్చ వీణానాం చాపి నిస్స్వనాః |
ఆశీర్గేయం చ గాథానాం పూరయామాస వేశ్మ తత్ || ౬ ||

తతః శుచి సమాచారాః పర్యుపస్థాన కోవిదాః |
స్త్రీవర్షవరభూయిష్ఠాః ఉపతస్థుర్యథాపురమ్ || ౭ ||

హరిచందన సంపృక్తముదకం కాంచనైః ఘటైః |
ఆనిన్యుః స్నాన శిక్షాజ్ఞా యథాకాలం యథావిధి || ౮ ||

మంగళాలంభనీయాని ప్రాశనీయాన్యుపస్కరాన్ |
ఉపనిన్యుస్తథాప్యన్యాః కుమారీబహుళాః స్త్రియః || ౯ ||

సర్వలక్షణసంపన్నం సర్వం విధివదర్చితమ్ |
సర్వం సుగుణలక్ష్మీవత్తద్భభూవాభిహారికమ్ || ౧౦ ||

తత్తు సూర్యోదయం యావత్సర్వం పరిసముత్సుకమ్ |
తస్థావనుపసంప్రాప్తం కిం స్విదిత్యుపశంకితమ్ || ౧౧ ||

అథయాః కోసలేంద్రస్య శయనం ప్రత్యనంతరాః |
తాః స్త్రియస్తు సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్ || ౧౨ ||

తథాఽప్యుచితవృత్తాస్తాః వినయేన నయేన చ |
నహ్యస్య శయనం స్పృష్ట్వా కించిదప్యుపలేభిరే || ౧౩ ||

తాః స్త్రీయః స్వప్నశీలజ్ఞాస్చేష్టాసంచలనాదిషు |
తా వేపథుపరీతాశ్చ రాజ్ఞః ప్రాణేషు శంకితాః || ౧౪ ||

ప్రతిస్రోతస్తృణాగ్రాణాం సదృశం సంచకంపిరే | [సంచకాశిరే]
అథ సంవేపమానానాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివమ్ || ౧౫ ||

యత్తదాశంకితం పాపం తస్య జజ్ఞే వినిశ్చయః |
కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకపరాజితే || ౧౬ ||

ప్రసుప్తే న ప్రబుధ్యేతే యథా కాలసమన్వితే |
నిష్ప్రభా చ వివర్ణా చ సన్నా శోకేన సన్నతా || ౧౭ ||

న వ్యరాజత కౌసల్యా తారేవ తిమిరావృతా |
కౌసల్యాఽనంతరం రాజ్ఞః సుమిత్రా తదంతనరమ్ || ౧౮ ||

న స్మ విభ్రాజతే దేవీ శోకాశ్రులులితాననా |
తే చ దృష్ట్వా తథా సుప్తే ఉభే దేవ్యౌ చ తం నృపమ్ || ౧౯ ||

సుప్తమేవోద్గతప్రాణమంతః పురమదృశ్యత |
తతః ప్రచుక్రుశుర్దీనాః సస్వరం తా వరాంగనాః || ౨౦ ||

కరేణవైవారణ్యే స్థాన ప్రచ్యుత యూథపాః |
తాసామాక్రంద శబ్దేన సహసోద్గత చేతనే || ౨౧ ||

కౌసల్యా చ సుమిత్రాచ త్యక్తనిద్రే బభూవతుః |
కౌసల్యా చ సుమిత్రా చ దృష్ట్వా స్పృష్ట్వా చ పార్థివమ్ || ౨౨ ||

హా నాథేతి పరిక్రుశ్య పేతతుర్ధరణీతలే |
సా కోసలేంద్రదుహితా వేష్టమానా మహీతలే || ౨౩ ||

న బభ్రాజ రజోధ్వస్తా తారేవ గగనాచ్చ్యుతా |
నృపే శాంతగుణే జాతే కౌసల్యాం పతితాం భువి || ౨౪ ||

ఆపశ్యంస్తాః స్త్రియః సర్వాః హతాం నాగవధూమివ |
తతః సర్వా నరేంద్రస్య కైకేయీప్రముఖాః స్త్రియః || ౨౫ ||

రుదంత్యః శోకసంతప్తా నిపేతుర్గతచేతనాః |
తాభిః స బలవాన్నాదః క్రోశంతీభిరనుద్రుతః || ౨౬ ||

యేన స్థిరీకృతం భూయస్తద్గృహం సమనాదయత్ |
తత్సముత్త్రస్తసంభ్రాంతం పర్యుత్సుక జనాకులమ్ || ౨౭ ||

సర్వతస్తుములాక్రందం పరితాపార్తబాంధవమ్ |
సద్యో నిపతితానందం దీనవిక్లబదర్శనమ్ || ౨౮ ||

బభూవ నరదేవస్య సద్మ దిష్టాంతమీయుషః |
అతీతమాజ్ఞాయ తు పార్థివర్షభమ్
యశస్వినం సంపరివార్య పత్నయః |
భృశం రుదంత్యః కరుణం సుదుఃఖితాః
ప్రగృహ్య బాహూ వ్యలపన్ననాథవత్ || ౨౯ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచషష్ఠితమః సర్గః || ౬౫ ||

Ayodhya Kanda Sarga 65 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. రోజూ మాదిరి వంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరములైన వాక్యములు పలుకుతూ స్తోత్రపాఠములు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశ చరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములతో కౌసల్యా మందిరము మారుమోగిపోయింది.

పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరకు వచ్చారు. మరి కొంత మంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకొని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈపాటికి నిద్రలేచేవారు. కాని ఇన్ని స్తోత్రపాఠములు చదువుతున్నా ఆయన అటు ఇటు కూడా కదలడం లేదు. వారికి అనుమానం కలిగింది. కాని అలాగే నిలబడి పోయారు.
ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు, దశరథుని వద్ద చనువు ఉన్న వాళ్లు, అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరకువెళ్లారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణవార్తను బయటకు చెప్పడానికి వారికి ధైర్యము చాలడం లేదు. వారు పరుగుపరుగున కౌసల్య సుమిత్రల వద్దకు వెళ్లారు. అప్పటికి వారు నిద్రలేవలేదు. అప్పటికి వారికి విషయం బోధపడింది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత దశరథుని ప్రాణాలు నిద్రలోనే పోయాయి. ఆవిషయం రాణులకు తెలియదు అని వారికి అవగతమయింది. వారు ఏడుస్తూ

కౌసల్యను నిద్ర లేపారు. వారికి ఏం చెప్పాలో తోచలేదు. దశరధుని వంక చూపించారు. కౌసల్య దశరధుని వద్దకు వెళ్లింది. ఆయన మరణించాడు అనిఅర్థం అయింది. “హా నాధా!” అంట బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. దశరథుని మరణ వార్త అంత:పురము అంతటా వ్యాపించింది. దశరథుని భార్యలందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కైకకు కూడా దు:ఖము కట్టలు తెంచుకొని వస్తోంది. ఆమెకూడా బిగ్గరగా ఏడుస్తోంది. వారి రోదనలతో అంత:పురము నిండిపోయింది. పరిచారికలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అటుఇటు పరుగెత్తుతున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్షష్ఠితమః సర్గః (66) >>

Balakanda Sarga 61 In Telugu – బాలకాండ ఏకషష్టితమః సర్గః

Balakanda Sarga 61 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకషష్టితమః సర్గలో, శునాశేప పురాణం ప్రారంభమైంది మరియు విశ్వామిత్ర పురాణంలో భాగంగా శతానంద మహర్షి దీనిని కొనసాగిస్తున్నాడు. రాముడి తాతయ్య అంబరీషుడు ఒక కర్మను చేపట్టినప్పుడు, ఇంద్రుడు ఆ కర్మ యొక్క గుర్రాన్ని బంధించాడు. అప్పుడు అంబరీషుడు ఆ తప్పిపోయిన గుర్రానికి బదులుగా ఒక మానవ-జంతువుని తీసుకురావలసి వచ్చింది. ఎవరూ అందుబాటులో లేనప్పుడు ఋషికా ఋషి కుమారుడు మరియు విశ్వామిత్రుని మేనల్లుడు అయిన శునాశేప అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు ధన మార్పిడిని అందజేస్తాడు.

శునఃశేపవిక్రయః

విశ్వామిత్రో మహాత్మాథ ప్రస్థితాన్ప్రేక్ష్య తానృషీన్ |
అబ్రవీన్నరశార్దూలః సర్వాంస్తాన్వనవాసినః ||

1

మహావిఘ్నః ప్రవృత్తోఽయం దక్షిణామాస్థితో దిశమ్ |
దిశమన్యాం ప్రపత్స్యామస్తత్ర తప్స్యామహే తపః ||

2

పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః |
సుఖం తపశ్చరిష్యామో పరం తద్ధి తపోవనమ్ ||

3

ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః |
తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ||

4

ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః |
అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే ||

5

తస్య వై యజమానస్య పశుమింద్రో జహార హ |
ప్రణష్టే తు పశౌ విప్రో రాజానమిదమబ్రవీత్ ||

6

పశురద్య హృతో రాజన్ప్రణష్టస్తవ దుర్నయాత్ |
అరక్షితారం రాజానం ఘ్నంతి దోషా నరేశ్వర ||

7

ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతన్నరం వా పురుషర్షభ |
ఆనయస్వ పశుం శీఘ్రం యావత్కర్మ ప్రవర్తతే ||

8

ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభ |
అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహస్రశః ||

9

దేశాంజనపదాంస్తాంస్తాన్నగరాణి వనాని చ |
ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః ||

10

స పుత్రసహితం తాత సభార్యం రఘునందన |
భృగుతుంగే సమాసీనమృచీకం సందదర్శ హ ||

11

తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రసాద్య చ |
బ్రహ్మర్షి తపసా దీప్తం రాజర్షిరమితప్రభః ||

12

పృష్ట్వా సర్వత్ర కుశలమృచీకం తమిదం వచః |
గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది ||

13

పశోరర్థే మహాభాగ కృతకృత్యోఽస్మి భార్గవ |
సర్వే పరిసృతా దేశా యజ్ఞీయం న లభే పశుమ్ ||

14

దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ |
ఏవముక్తో మహాతేజా ఋచీకస్త్వబ్రవీద్వచః ||

15

నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన |
ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్ ||

16

ఉవాచ నరశార్దూలమంబరీషమిదం వచః | [తపస్వినీ]
అవిక్రేయం సుతం జ్యేష్ఠం భగవానాహ భార్గవః ||

17

మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప |
తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ ||

18

ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః |
మాతౄణాం చ కనీయాంసస్తస్మాద్రక్షే కనీయసమ్ ||

19

ఉక్తవాక్యే మునౌ తస్మిన్మునిపత్న్యాం తథైవ చ |
శునఃశేపః స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్ ||

20

పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసమ్ |
విక్రీతం మధ్యమం మన్యే రాజన్పుత్రం నయస్వ మామ్ ||

21

[* అధికశ్లోకం –
అథ రాజా మహాన్రామ వాక్యాంతే బ్రహ్మవాదినః |
హిరణ్యస్య సువర్ణస్య కోటిభీ రత్నరాశిభిః ||
*]

గవాం శతసహస్రేణ శునఃశేపం నరేశ్వరః |
గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన ||

22

అంబరీషస్తు రాజర్షీ రథమారోప్య సత్వరః |
శునఃశేపం మహాతేజా జగామాశు మహాయశాః ||

23

Balakanda Sarga 61 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ ఆ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిను ఋషులతో ఇలా అన్నాడు. “ఇప్పటి వరకూ నేను దక్షిణ దిక్కున తపస్సు చేసాను. ఇక్కడ అన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసు కుంటాను.”అని అన్నాడు.

ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేసాడు.

అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు, యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“రాజా! యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా లేక పోతే పశు వుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది.” అని అన్నాడు పురోహితుడు.

అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేక పోయింది. ఆ సమయంలో ఋచీకుడు అనే మహర్షి తన భార్యా పుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

అంబరీషుడు ఆ ఋచీకమహర్షి వద్దకు వెళ్లాడు. జరిగినది అంతా చెప్పాడు. “ ఓ మహర్షీ! నేను నీకు లక్ష ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా!” అని అడిగాడు.

“లేదు. నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా!” అని అన్నాడు.

ఋచీకుని భార్య ఇలా అంది. “నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను.” అని చెప్పింది.

ఋచీకునకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“ఓ అంబరీషా! పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటంలేదు అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్లండి.” అని అన్నాడు.

అంబరీషుడు సంతోషంగా ఋచీకునకు లక్షగోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకొని వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ద్విషష్టితమః సర్గః (62) >>

Narayana Upanishat In Telugu – నారాయణోపనిషత్తు

Narayana Upnishad

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమూల్య అంశాలు అందిస్తాయి మరియు ప్రత్యేక సాంప్రదాయాలను వ్యాఖ్యానించేవి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నారాయణోపనిషత్తు గురించి తెలుసుకుందాం.

నారాయణోపనిషత్తు

ఓం అథపురుషో వై నారాయణో కామయత, ప్రజాః సృజేయేతి, నారాయణా త్రాణో జాయతే, మన స్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రావః పృధివీ విశ్వస్య ధారిణీ, నారాయణా ద్రహ్మాజాయతే, నారాయణాద్రుద్రో జాయతే, నారాయణా దింద్రో జాయతే, నారాయణా త్ప్రజాపతిః ప్రజాయతే, నారాయణా ద్వాదశాదిత్యా రుద్రా వసవ స్సర్వాణి ఛందాంసి, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణా త్ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే, ఏత దృగ్వేదశిరో ధీతే.

సృష్టి ప్రారంభంలో ఉన్నవాడు పరమేశ్వరుడైన నారాయణు డొక్కడే.’ అతడు సృష్టి చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు నారాయణు

ని శరీరం నుంచి సూక్ష్మరూపి అయిన హిరణ్య గర్భుడు పుట్టాడు. ఆ తరువాత ఆకాశాది పంచ భూతాలు పుట్టినాయి. ఈ రకంగా నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మరీచి, కశ్యపుడు, మొదలైన ప్రజాపతులు, ఏక దశ రుద్రులు, ద్వాద శాదిత్యులు, అష్ట వసువులు, సకల వేదాలు, ఉద్భవించాయి. ఒకటేమిటి చరా చర జగత్తంతా నారాయణుని నుంచే పుట్టింది. ఇవన్నీ అసలు నారాయణుని లోనే ఉన్నాయి. చివరకు నారాయణుని యందే లయమవు తున్నాయి. ఈ తత్వము ఋగ్వేదంలో చెప్పబడింది.

అథ నిత్యో నారాయణః, బ్రహ్మానారాయణ, శివశ్చ నారాయణః, శక్రశ్చ నారా యణః, ద్యావాపృధివ్యౌ చ నారాయణ: కాలళ్ళ నారాయణః, దివశ్చ నారాయణః ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేద సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః, న ద్వితీయో…స్తి కృశ్చిత్, య ఏవం వేద స విష్ణు రేవ భవతి స విష్ణురేవ భవతి, ఏత ద్యజుర్వేద శిరో ధీతే.

Narayana Upnishad Pic

నారాయణుడే సత్యము, నిత్యము అయిన వాడు. నారాయణుడే బ్రహ్మ, నారాయణుడే శివుడు, అతడే ఇంద్రుడు, భూమి, ఆకాశము, కాలము, ధశ దిశలు అంతా నారాయణుడే. ఊర్ధ్వ భాగాన ఉన్నది నారాయణుడే, అధో భాగాన ఉన్నది – నారాయణుడే, మధ్య భాగాన ఉన్నది నారాయణుడే, బాహ్యాంభ్యంత రములందంతటా ఉన్నది నారాయణుడే, భూత భవిష్యద్వర్తమానాలు నారా యణుడే. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వి కల్పుడు, పరిశుద్ధమైన వాడు, అద్వితీయుడు. అతన్ని వాక్కులతో నిర్వచించ లేము. నారాయణుడు తప్ప వేరెవ్వరూ లేరు. ఈ విషయం గ్రహించినవాడు కూడా నారాయణుడే అవుతాడు. ఈ విషయము యజుర్వేదంలో చెప్పబడింది.

ఓమి త్యగ్రే వ్యాహరేత్, నమ ఇతిపశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్, ఓమిత్యేకాక్షరమ్ నమఇతి ద్వే అక్షరే, నారాయణాయేతి పంచాక్షరాణి, ఏతద్వై నారాయణస్యాష్టా క్షరం పదమ్, యోహవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి, అనపబ్రు వస్సర్వ మాయు రేతి, విందతే ప్రాజాపత్యమ్, రాయస్పోషం గౌపత్యమ్, తతో.. మృతత్వ మశ్నుతే తతో. మృతత్వమశ్నుత ఇతి, ఏత త్సామవేద శిరో.. ధీతే.

ముందుగా ‘ఓం’ అనాలి. తరువాత ‘నమో’ అనాలి. ఆ తరువాత ‘నారాయణాయ’ అని చెప్పాలి. ఓం నమో నారాయణాయ అనేది ఎనిమి అక్షరాలు గల అష్టాక్షరీ మహామంత్రం. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించిచేవాడు పూర్ణా యుష్కుడవుతాడు. ధనధాన్యలు పొందుతాడు. స్వర్గాన్ని పొందుతాడు. బ్రహ్మ పదవి పొందుతాడు. చివరకు అమృతత్వాన్ని కూడా పొందుతాడు అని సామవేదం లో చెప్పబడింది.

ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్, అకార ఉకారో మకార ఇతి, తానే కథా సమభవ తదేత దోమితి య ముక్త్వా ముచ్యతే యోగి జన్మసంసారబంధనాత్, ఓం నమోనారాయణాయేతి మంత్రోపాసకః, వైకుంఠభవనం గమిష్యతి, తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్తటిదాభమాత్రమ్, బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూధన ఇతి, సర్వభూతస్థ మేకం పై నారాయణం కారణపురుష మకారణం పరంబ్రహ్మోమ్, ఏతదధర్వశిరో ఒధీతే.

అకార, ఉకార, మకారములు కలిసి ‘ఓం’ అనే ప్రణవము అవుతున్నది. ఈ ప్రణవానికి అర్థం – ప్రత్యగాత్మ. ఓంకారాన్ని అర్థయుక్తంగా జపించేవాడు. జనన మరణాది సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు. అష్టాక్షరీ మంత్రో పాసనచేసినవాడు వైకుంఠము చేరతాడు.

సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ హృదయ పద్మంలో ప్రకాశిస్తుంటాడు. పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు దేవకీ పుత్రుడు, మధుసూదనుడు. జీవ కోటి యందంతటా అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. అతడు సర్వవ్యాపి, ఈ జగత్తుకు కారణభూతుడు. తనకు వేరొక కారణము లేనివాడు. ఈ విషయము అధర్వ వేదంలో చెప్పబడింది.

ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి, సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి, తత్సాయంప్రాతరధీయానః అపావో భవతి, మాధ్యందిన మాది త్యాభి ముఖి. ఖో ధీయానః పంచమహాపాతకో 2 సపాతకా త్ప్రముచ్యతే, సర్వవే దపారాయణపుణ్యం లభతే, నారాయణసాయుజ్య మవాప్నోతి, శ్రీమన్నారాయణ సాయుజ్య మవాప్నోతి, య ఏవం వేద, ఇత్యుపనిషత్.

ఈ ఉపనిషత్తును ఉదయం పూట పారాయణ చేస్తే రాత్రి చేసిన పాపం నశించి పోతుంది. సాయంత్రం పారాయణ చేస్తే పగలు చేసిన పాపం నశిస్తుంది. మధ్యాహ్న కాలంలో సూర్యుని ఎదురుగా కూర్చుని ఈ ఉపనిషత్తు పారాయణ చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి.

నారాయణోపనిషత్తును పారాయణ చేస్తే నాలుగు వేదాలు పారాయణ చేసిన ఫలితము దక్కుతుంది. అంత్యకాలంలో నారాయణుని సాయుజ్యం లభిస్తుంది. ఈ రకంగా దీన్ని గురించి తెలుసుకున్నవాడు కూడా సాయుజ్యం పొందుతాడు.

ఓం తత్ సత్

మరిన్ని పండుగలు:

Balakanda Sarga 72 In Telugu – బాలకాండ ద్విసప్తతితమః సర్గః

Balakanda Sarga 72 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విసప్తతితమః సర్గలో యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని సిధాశ్రమానికి తీసుకువెళతాడు. యజ్ఞం సమయంలో రాక్షసులు సుబాహు, మారీచు దాడి చేస్తారు. రాముడు సుబాహును వధించి, మారీచును దూరంగా తరిమేస్తాడు. తర్వాత విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకువెళతాడు.

|| గోదానమంగళమ్ ||

తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః |
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్ ||

1

అచింత్యాన్యప్రమేయాని కులాని నరపుంగవ |
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోఽస్తి కశ్చన ||

2

సదృశో ధర్మసంబంధః సదృశో రూపసంపదా |
రామలక్ష్మణయో రాజన్సీతా చోర్మిలయా సహ ||

3

వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ |
భ్రాతా యవీయాన్ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః ||

4

అస్య ధర్మాత్మనో రాజన్రూపేణాప్రతిమం భువి |
సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే ||

5

భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః |
వరయేమ సుతే రాజంస్తయోరర్థే మహాత్మనోః ||

6

పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః |
లోకపాలోపమాః సర్వే దేవతుల్యపరాక్రమాః ||

7

ఉభయోరపి రాజేంద్ర సంబంధో హ్యనుబధ్యతామ్ |
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః ||

8

విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా |
జనకః ప్రాంజలిర్వాక్యమువాచ మునిపుంగవౌ ||

9

కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ |
సదృశం కులసంబంధం యదాజ్ఞాపయథః స్వయమ్ ||

10

ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే |
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ ||

11

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే |
పాణీన్గృహ్ణంతు చత్వారో రాజపుత్రా మహాబలాః ||

12

ఉత్తరే దివసే బ్రహ్మన్ఫల్గునీభ్యాం మనీషిణః |
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః ||

13

ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః |
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్ ||

14

పరో ధర్మః కృతో మహ్యం శిష్యోఽస్మి భవతోః సదా |
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ ||

15

యథా దశరథస్యేయం తథాఽయోధ్యా పురీ మమ |
ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హథ ||

16

తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః |
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్ ||

17

యువామసంఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ |
ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః ||

18

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్ |
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్ ||

19

తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా |
మునీంద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహాయశాః ||

20

స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః |
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్ ||

21

గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః |
ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః ||

22

సువర్ణశృంగాః సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః |
గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః ||

23

విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునందనః |
దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః ||

24

స సుతైః కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా |
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతిః ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విసప్తతితమః సర్గః ||

Balakanda Sarga 72 Meaning In Telugu

జనకుని మాటలు విన్న వసిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహాఋషులు జనకునితో ఇలా అన్నారు.

“ఓ జనకమహారాజా! అటు ఇక్ష్వాకు వంశము, ఇటు విదేహ వంశమూ రెండూ విశిష్టమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చెయ్యడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగిఉన్నది.

ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అంద చందములలోనూ, రూప లావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామ లక్ష్మణు లకు ఏ విధంగానూ తీసి పోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు ధృడమైన సంబంధ బాంధవ్యుములు కలిగి ఉంటాయి.” అని పలికారు.

ఆ మాటలు విన్న జనకుడు, వసిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు.’ .” ఓ మునిశ్రేష్ఠులారా! మీ సంబంధములతో నేను నా
తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శ్రుతకీర్తి లను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నాతమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. ఈ నాలుగు వివాహములు ఒకే రోజున ఒకే సమయములో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాను.

ఉత్తర ఫల్గునీ నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభనక్షత్రములో ఈ నాలుగు వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహ రాజ్యములు ఒకటవుతాయి.” అని వినయంతో పలికాడు జనకుడు.

ఆమాటలు విన్న దశరథుడు ఇలాఅన్నాడు. “ఓ జనక మహారాజా! నీవు, నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు. ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనంద దాయకము. నేను ఇంక మా నివాసమునకు వెళ్ళెదను. నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధకర్మలను, దానములను నిర్వర్తింప జేస్తాను.” అని పలికాడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్లాడు. ఆరోజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను నిర్వర్తింపజేసాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారునిచేత లక్ష గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారులచేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులు నాలుగులక్షల ఆవులను ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు.

(ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధ కర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధ కర్మలు అంటే శుభకార్యము జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవచ్చు)

శ్రీమద్రామాయణము
బాలకాండము, డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ త్రిసప్తతితమః సర్గః (73) >>

Balakanda Sarga 70 In Telugu – బాలకాండ సప్తతితమః సర్గః

Balakanda Sarga 70 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ సప్తతితమః సర్గలో రాముడు విశ్వామిత్రునితో కలిసి సిధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ పుత్రకామేష్ఠి యాగం జరుగుతుంది. యాగం సమయంలో రావణుడు, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు యాగాన్ని భగ్నం చేయడానికి వస్తారు. రాముడు, లక్ష్మణుడు వీరిని వధించి యాగాన్ని రక్షిస్తారు. యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత, అగ్నిదేవుడు దశరథ మహారాజుకు పాయసం అందిస్తాడు, దానిని సంతానము కోసం పంపిస్తారు.

|| కన్యావరణమ్ ||

తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః |
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితమ్ ||

1

భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మికః |
కుశధ్వజ ఇతి ఖ్యాతః పురీమధ్యవసచ్ఛుభామ్ ||

2

వార్యాఫలకపర్యంతాం పిబన్నిక్షుమతీం నదీమ్ |
సాంకాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్ ||

3

తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా స మే మతః |
ప్రీతిం సోఽపి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ ||

4

ఏవముక్తే తు వచనే శతానందస్య సన్నిధౌ |
ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్సమాదిశత్ ||

5

శాసనాత్తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః |
సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా ||

6

సాంకాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్ |
న్యవేదయన్యథావృత్తం జనకస్య చ చింతితమ్ ||

7

తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః |
ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజః ||

8

స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్ |
సోఽభివాద్య శతానందం రాజానాం చాతిధార్మికమ్ ||

9 [జనకం]

రాజార్హం పరమం దివ్యమాసనం సోఽధ్యరోహత |
ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావమితౌజసౌ ||

10

ప్రేషయామాసతుర్వీరౌ మంత్రిశ్రేష్ఠం సుదామనమ్ |
గచ్ఛ మంత్రిపతే శీఘ్రమైక్ష్వాకమమితప్రభమ్ ||

11

ఆత్మజైః సహ దుర్ధర్షమానయస్వ సమంత్రిణమ్ |
ఔపకార్యాం స గత్వా తు రఘూణాం కులవర్ధనమ్ ||

12

దదర్శ శిరసా చైనమభివాద్యేదమబ్రవీత్ |
అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః ||

13

సత్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయపురోహితమ్ |
మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా ||

14

సబంధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే |
స రాజా మంత్రిసహితః సోపాధ్యాయః సబాంధవః ||

15

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్ |
విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతమ్ ||

16

వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవానృషిః |
విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః ||

17

ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠస్తే యథాక్రమమ్ |
తూష్ణీం‍భూతే దశరథే వసిష్ఠో భగవానృషిః ||

18

ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోహితమ్ | [పురోధసమ్]
అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః ||

19

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః |
వివస్వాన్కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః ||

20

మనుః ప్రజాపతిః పూర్వమిక్ష్వాకుస్తు మనోః సుతః |
తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ ||

21

ఇక్ష్వాకోఽస్తు సుతః శ్రీమాన్కుక్షిరిత్యేవ విశ్రుతః |
కుక్షేరథాత్మజః శ్రీమాన్వికుక్షిరుదపద్యత ||

22

వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్ |
బాణస్య తు మహాతేజా అనరణ్యో మహాయశాః ||

23 [ప్రతాపవాన్]

అనరణ్యాత్పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోః సుతః |
త్రిశంకోరభవత్పుత్రో ధుంధుమారో మహాయశాః ||

24

ధుంధుమారాన్మహాతేజా యువనాశ్వో మహాబలః |
యువనాశ్వసుతస్త్వాసీన్మాంధాతా పృథివీపతిః ||

25

మాంధాతుస్తు సుతః శ్రీమాన్సుసంధిరుదపద్యత |
సుసంధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ ||

26

యశస్వీ ధ్రువసంధేస్తు భరతో నామ నామతః |
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్ ||

27

యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశబిందవః ||

28

తాంస్తు స ప్రతియుధ్యన్వై యుద్ధే రాజ్యాత్ప్రవాసితః |
హిమవంతముపాగమ్య భార్యాభ్యాం సహితస్తదా ||

29

అసితోఽల్పబలో రాజా కాలధర్మముపేయివాన్ |
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్ ||

30

ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ |
తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః ||

31

భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః |
తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్ ||

32

వవందే పద్మపత్రాక్షీ కాంక్షంతీ సుతముత్తమమ్ | [ఆత్మనః]
తమృషిం సాఽభ్యుపాగమ్య కాలిందీ చాభ్యవాదయత్ ||

33

స తామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని |
తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాయశాః ||

34 [బలః]

మహావీర్యో మహాతేజా అచిరాత్సంజనిష్యతి |
గరేణ సహితః శ్రీమాన్మా శుచః కమలేక్షణే ||

35

చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా |
పతిశోకాతురా తస్మాత్పుత్రం దేవీ వ్యజాయత ||

36

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
సహ తేన గరేణైవ జాతః స సగరోఽభవత్ ||

37

సగరస్యాసమంజస్తు అసమంజాత్తథాంశుమాన్ |
దిలీపోఽంశుమతః పుత్రో దిలీపస్య భగీరథః ||

38

భగీరథాత్ కకుత్స్థోఽభూత్ కకుత్స్థస్య రఘుః సుతః |
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః ||

39

కల్మాషపాదో హ్యభవత్తస్మాజ్జాతశ్చ శంఖణః |
సుదర్శనః శంఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్ ||

40

శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః సుతః |
మరోః ప్రశుశ్రుకస్త్వాసీదంబరీషః ప్రశుశ్రుకాత్ ||

41

అంబరీషస్య పుత్రోఽభూన్నహుషః సత్యవిక్రమః | [పృథివీపతిః]
నహుషస్య యయాతిశ్చ నాభాగస్తు యయాతిజః ||

42

నాభాగస్య బభూవాజో అజాద్దశరథోఽభవత్ |
అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

43

ఆదివంశవిశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణామ్ |
ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినామ్ ||

44

రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప |
సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ||

45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తతితమః సర్గః ||

Balakanda Sarga 70 Meaning In Telugu

మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తిచేసాడు. తనపురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు.

“శతానందులవారూ! మా తమ్ముడు శతధ్వజుని, ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకని సోదరుడు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకాశ్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాశ్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్మానించారు.

వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్టుడు అయిన సుదాముని దశరథమహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకొని వచ్చుటకు పంపారు.

సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు.

దశరథునితో ఇలా అన్నాడు.

“దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడు.

సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు, ఋషులు వెంట రాగా, జనకుని వద్దకు వెళ్లాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు.

“ఓ జనక మహారాజా! మా కులగురువు, వసిష్ఠుడు అని మీకు తెలియును కదా! బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వసిష్ఠుడు తమరికి మా వంశ వృక్షము గురించి, మా వంశములోని పూర్వ రాజుల గురించి వివరంగా చెప్పగలడు.” అని పలికి దశరథుడు వసిష్ఠునని వంక చూచాడు.

దశరథుని మాటలు విన్న వసిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుని, సదానందుని చూచి ఇలా అన్నాడు.

“ఓ జనకమహారాజా! సభాసదులారా! ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోవుచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటి సారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆ వించింది.

ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుని కుమారుడు మాంధాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధికి ఇరువురు కుమారులు వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు అసితుడు.

హైహయ రాజులైన హైహయుడు, తాలజంఘుడు, శశిబిందు అనువారు అసితునితో శతృత్వము వహించారు. వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు.

ఆ సమయములో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భస్రావము అగుటకు విషప్రయోగము చేసింది. ఆ సమయములోనే భృగు వంశములో పుట్టిన చ్యవనుడు అక్కడకు రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశ్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగము జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చ్యవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది.

చ్యవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి “ఓ భాగ్యశాలీ! నీ గర్భములో మహా బలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహా వీరుడు. తేజశ్శాలి. ఆ కుమారుడు నీ శరీరములో ఉన్న విషముతో కూడా జన్మించగలడు.” అని పలికాడు. చ్యవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజశ్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు.

ఆ సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమిమీదికి తీసుకొని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుత్తుడు. కకుత్తుని కుమారుడు రఘువు. ఆయన పేరుమీదనే రఘువంశము మొదలయింది.

రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాప వశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మాషపాదుడు అనే పేరుకూడా ఉంది. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురు. శ్రీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుక్రుడు. ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు.

అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథమహారాజు. ఈ దశరథమహారాజు పుత్రులే రామలక్ష్మణులు.

ఓ జనక మహారాజా! వీరి వంశక్రమము వింటివి కదా! వీరు మొదటి నుండీ విశుద్ధమైన వంశములో పుట్టినవారు. పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు. వీరులు. సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహము చేయడం శుభప్రదము.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్భయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకసప్తతితమః సర్గః (71) >>

Balakanda Sarga 59 In Telugu – బాలకాండ ఏకోనషష్ఠితమః సర్గః

Balakanda Sarga 59 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనషష్ఠితమః సర్గలో, విశ్వామిత్రుడు త్రిశంకు యొక్క వైదిక కర్మను చేపట్టాడు మరియు వేద పండితులందరినీ ఆహ్వానించడానికి శిష్యులను పంపుతాడు. వశిష్ఠుడు మరియు అతని కుమారులు తప్ప చాలా మంది ఋషులు వచ్చారు. ఇంకా, వశిష్ట కుమారులు విశ్వామిత్ర మరియు త్రిశంకు యొక్క ఈ ఆచారాన్ని అపహాస్యం చేసారు. విశ్వామిత్రుడు విసుగు చెంది వశిష్ట కుమారులపై శాపనార్థాలు పెట్టాడు.

వాసిష్ఠశాపః

ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః |
అబ్రవీన్మధురం వాక్యం సాక్షాచ్చండాలరూపిణమ్ ||

1

ఐక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్ |
శరణం తే భవిష్యామి మా భైషీర్నృపపుంగవ ||

2

అహమామంత్రయే సర్వాన్మహర్షీన్పుణ్యకర్మణః |
యజ్ఞసాహ్యకరాన్రాజంస్తతో యక్ష్యసి నిర్వృతః ||

3

గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే |
అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి ||

4

హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప |
యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః ||

5

ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్పరమధార్మికాన్ |
వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్యజ్ఞసంభారకారణాత్ ||

6

సర్వాన్ శిష్యాన్సమాహూయ వాక్యమేతదువాచ హ |
సర్వానృషిగణాన్ వత్సా ఆనయధ్వం మమాజ్ఞయా ||

7

సశిష్యసుహృదశ్చైవ సర్త్విజః సుబహుశ్రుతాన్ |
యదన్యో వచనం బ్రూయాన్మద్వాక్యబలచోదితః ||

8

తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా ||

9

ఆజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః |
తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలితతేజసమ్ ||

10

ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినామ్ |
శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః ||

11

సర్వదేశేషు చాగచ్ఛన్వర్జయిత్వా మహోదయమ్ |
వాసిష్ఠం తచ్ఛతం సర్వం క్రోధపర్యాకులాక్షరమ్ ||

12

యదాహ వచనం సర్వం శృణు త్వం మునిపుంగవ |
క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః ||

13

కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః |
బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాలభోజనమ్ ||

14

కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః |
ఏతద్వచననైష్ఠుర్యమూచుః సంరక్తలోచనాః ||

15

వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః |
తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః ||

16

క్రోధసంరక్తనయనః సరోషమిదమబ్రవీత్ |
యే దూషయంత్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితమ్ ||

17

భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః |
అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్ ||

18

సప్త జాతిశతాన్యేవ మృతపాః సంతు సర్వశః |
శ్వమాంసనియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః ||

19

వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్ |
మహోదయశ్చ దుర్బుద్ధిర్మామదూష్యం హ్యదూషయత్ ||

20

దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి |
ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః ||

21

దీర్ఘకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి |
ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః |
విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః ||

22

Balakanda Sarga 59 In Telugu Pdf With Meaning

ఛండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలి పడ్డాడు. అతని తో ఇలా అన్నాడు.

“ఓ త్రిశంకూ! బాధ పడకు. నిన్ను, నీ కోరికను, నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయ పడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహా ఋషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ ఛండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయంలేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు.

విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. “మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి.”అని ఆజ్ఞాపించాడు.

విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు అందరూ నలు దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు.

“గురువు గారూ! తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. కాని మహోదయుడు, వసిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్న వారు ఈ విధంగా అన్నారు.

‘ఒక ఛండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం. దానిని ఒక క్షత్రియు డైన విశ్వామిత్రుడు చేయించడం. బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు. క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని ఛండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసినవారు బ్రాహ్మణులైనా, ఋషులైనా వారు స్వర్గానికి ఎలావెళతారు? ఇది సంభవమా!’

అని చాలా దుర్భాషలాడారు గురువు గారూ!” అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు.

ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. “ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా! వసిష్టకుమారులు అందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ ఏడు వందల జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్కమాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తింటూ చాలాకాలము నిషాదుడుగా జీవిస్తాడు.” అని శపించాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షష్టితమః సర్గః (60) >>

Ayodhya Kanda Sarga 52 In Telugu | అయోధ్యాకాండ ద్విపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 52 In Telugu

అయోధ్యా కాండ సర్గ 52 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు.” అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు.

గంగాతరణమ్

ప్రభాతాయాం తు శర్వర్యాం పృథు వృక్షా మహా యశాః |
ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం శుభ లక్షణమ్ ||

1

భాస్కరోదయ కాలోఽయం గతా భగవతీ నిశా |
అసౌ సుకృష్ణో విహగః కోకిలస్తాత కూజతి ||

2

బర్హిణానాం చ నిర్ఘోషః శ్రూయతే నదతాం వనే |
తరామ జాహ్నవీం సౌమ్య శీఘ్రగాం సాగరంగమామ్ ||

3

విజ్ఞాయ రామస్య వచః సౌమిత్రిర్మిత్ర నందనః |
గుహమామంత్ర్య సూతం చ సోఽతిష్ఠద్భ్రాతురగ్రతః ||

4

స తు రామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య చ |
స్థపతిస్తూర్ణమాహుయ సచివానిదమబ్రవీత్ ||

5

అస్య వాహనసంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభామ్ |
సుప్రతారాం దృఢాం తీర్థే శీగ్రం నావముపాహర ||

6

తం నిశమ్య సమాదేశం గుహామాత్యగణో మహాన్ | [గుహాదేశం]
ఉపోహ్య రుచిరాం నావం గుహాయ ప్రత్యవేదయత్ ||

7

తతః సప్రాంజలిర్భూత్వా గుహో రాఘవమబ్రవీత్ |
ఉపస్థితేయం నౌర్దేవ భూయః కిం కరవాణి తే ||

8

తవామరసుతప్రఖ్య తర్తుం సాగరగాం నదీమ్ |
నౌరియం పురుషవ్యాఘ్ర తాం త్వమారోహ సువ్రత! ||

9

అథోవాచ మహాతేజాః రామో గుహమిదం వచః |
కృతకామోఽస్మి భవతా శీఘ్రమారోప్యతామితి ||

10

తతః కలాపాన్ సన్నహ్య ఖడ్గౌ బద్ధ్వా చ ధన్వినౌ |
జగ్మతుర్యేన తౌ గంగాం సీతయా సహ రాఘవౌ ||

11

రామమేవ తు ధర్మజ్ఞముపగమ్య వినీతవత్ |
కిమహం కరవాణీతి సూతః ప్రాంజలిరబ్రవీత్ ||

12

తతోఽబ్రవీద్దాశరథిః సుమంత్రమ్ |
స్పృశన్ కరేణోత్తమదక్షిణేన |
సుమంత్ర శీఘ్రం పునరేవ యాహి |
రాజ్ఞః సకాశే భవచాప్రమత్తః ||

13

నివర్తస్వ ఇత్యువాచైనమేతావద్ధి కృతం మమ |
రథం విహాయ పద్భ్యాం తు గమిష్యామి మహావనమ్ ||

14

ఆత్మానం తు అభ్యనుజ్ఞాతమవేక్ష్యార్తః స సారథిః |
సుమంత్రః పురుష వ్యాఘ్రమైక్ష్వాకమిదమబ్రవీత్ ||

15

నాతిక్రాంతమిదం లోకే పురుషేణేహ కేనచిత్ |
తవ సభ్రాతృ భార్యస్య వాసః ప్రాకృతవద్వనే ||

16

న మన్యే బ్రహ్మ చర్యేఽస్తి స్వధీతే వా ఫలోఽదయః |
మార్దవార్జవయోః వాఽపి త్వాం చేద్వ్యసనమాగతమ్ ||

17

సహ రాఘవ వైదేహ్యా భ్రాత్రా చైవ వనే వసన్ |
త్వం గతిం ప్రాప్స్యసే వీర త్రీన్ లోకాంస్తు జయన్నివ ||

18

వయం ఖలు హతా రామ యే తయాఽప్యుపవంచితాః |
కైకేయ్యా వశమేష్యామః పాపాయా దుఃఖ భాగినః ||

19

ఇతి బ్రువన్నాత్మసమం సుమంత్రః సారథిస్తదా |
దృష్ట్వా దూరగతం రామం దుఃఖార్తః రురుదే చిరమ్ ||

20

తతస్తు విగతే బాష్పే సూతం స్పృష్టోదకం శుచిమ్ |
రామస్తు మధురం వాక్యం పునః పునరువాచ తమ్ ||

21

ఇక్ష్వాకూణాం త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే |
యథా దశరథో రాజా మాం న శోచేత్తథా కురు ||

22

శోకోపహత చేతాశ్చ వృద్ధశ్చ జగతీ పతిః |
కామ భారావసన్నశ్చ తస్మాదేతద్బ్రవీమి తే ||

23

యద్యదాజ్ఞాపయేత్కించిత్ స మహాత్మా మహీపతిః |
కైకేయ్యాః ప్రియకామార్థం కార్యం తదవికాంక్షయా ||

24

ఏతదర్థం హి రాజ్యాని ప్రశాసతి నరేశ్వరాః |
యదేషాం సర్వకృత్యేషు మనో న ప్రతిహన్యతే ||

25

యద్యథా స మహారాజో నాలీకమధిగచ్ఛతి |
న చ తామ్యతి దుఃఖేన సుమంత్ర కురు తత్తథా ||

26

అదృష్టదుఃఖం రాజానం వృద్ధమార్యం జితేంద్రియమ్ |
బ్రూయాస్త్వమభివాద్యైవ మమ హేతోరిదం వచః ||

27

నైవాహమనుశోచామి లక్ష్మణో న చ మైథిలీ |
అయోధ్యాయాశ్చ్యుతాశ్చేతి వనే వత్స్యామహేతి చ ||

28

చతుర్దశసు వర్షేషు నివృత్తేషు పునః పునః |
లక్ష్మణం మాం చ సీతాం చ ద్రక్ష్యసి క్షిప్రమాగతాన్ ||

29

ఏవముక్త్వా తు రాజానం మాతరం చ సుమంత్ర మే |
అన్యాశ్చ దేవీః సహితాః కైకేయీం చ పునః పునః ||

30

ఆరోగ్యం బ్రూహి కౌసల్యామథ పాదాభివందనమ్ |
సీతాయా మమ చాఽఽర్యస్య వచనాల్లక్ష్మణస్య చ ||

31

బ్రూయాశ్చ హి మహారాజం భరతం క్షిప్రమానయ |
ఆగతశ్చాపి భరతః స్థాప్యో నృపమతే పదే ||

32

భరతం చ పరిష్వజ్య యౌవరాజ్యేఽభిషిచ్య చ |
అస్మత్సంతాపజం దుఃఖం న త్వామభిభవిష్యతి ||

33

భరతశ్చాపి వక్తవ్యో యథా రాజని వర్తసే |
తథా మాతృషు వర్తేథాః సర్వాస్వేవావిశేషతః ||

34

యథా చ తవ కైకేయీ సుమిత్రా చ విశేషతః |
తథైవ దేవీ కౌసల్యా మమ మాతా విశేషతః ||

35

తాతస్య ప్రియకామేన యౌవరాజ్యమవేక్షతా |
లోకయోరుభయోః శక్యం నిత్యదా సుఖమేధితుమ్ ||

36

నివర్త్యమానో రామేణ సుమంత్రః శోకకర్శితః |
తత్సర్వం వచనం శ్రుత్వా స్నేహాత్ కాకుత్స్థమబ్రవీత్ ||

37

యదహం నోపచారేణ బ్రూయాం స్నేహాదవిక్లబః |
భక్తిమానితి తత్తావద్వాక్యం త్వం క్షంతుమర్హసి ||

38

కథం హి త్వద్విహీనోఽహం ప్రతియాస్యామి తాం పురీమ్ |
తవ తావద్వియోగేన పుత్ర శోకాకులామివ ||

39

సరామమపి తావన్మే రథం దృష్ట్వా తదా జనః |
వినా రామం రథం దృష్ట్వా విదీర్యేతాపి సా పురీ ||

40

దైన్యం హి నగరీ గచ్చేద్దృష్ట్వా శూన్యమిమం రథమ్ |
సూతావశేషం స్వం సైన్యం హత వీరమివాహవే ||

41

దూరేఽపి నివసంతం త్వాం మానసేనాగ్రతః స్థితమ్ |
చింతయంత్యోఽద్య నూనం త్వాం నిరాహారాః కృతాః ప్రజాః ||

42

దృష్టం తద్ధి త్వయా రామ యాదృశం త్వత్ప్రవాసనే |
ప్రజానాం సఙ్కులం వృత్తం త్వచ్ఛోకక్లాంతచేతసామ్ ||

43

ఆర్తనాదో హి యః పౌరైః ముక్తస్త్వద్విప్రవాసనే |
సరథం మాం నిశామ్యైవ కుర్యుః శత గుణం తతః ||

44

అహం కిం చాపి వక్ష్యామి దేవీం తవ సుతః మయా |
నీతోఽసౌ మాతులకులం సంతాపం మా కృథా ఇతి ||

45

అసత్యమపి నైవాహం బ్రూయాం వచనమీదృశమ్ |
కథమప్రియమేవాహం బ్రూయాం సత్యమిదం వచః ||

46

మమ తావన్నియోగస్థాస్త్వద్బంధు జనవాహినః |
కథం రథం త్వయా హీనం ప్రవక్ష్యంతి హయోత్తమాః ||

47

తన్న శక్ష్యామ్యహం గంతుమయోధ్యాం త్వదృతేఽనఘ |
వనవాసానుయానాయ మామనుజ్ఞాతుమర్హసి ||

48

యది మే యాచమానస్య త్యాగమేవ కరిష్యసి |
సరథోఽగ్నిం ప్రవేక్ష్యామి త్యక్త మాత్రైహ త్వయా ||

49

భవిష్యంతి వనే యాని తపోవిఘ్నకరాణి తే |
రథేన ప్రతిబాధిష్యే తాని సత్త్వాని రాఘవ ||

50

తత్కృతేన మయాఽవాప్తం రథచర్యాకృతం సుఖమ్ |
ఆశంసే త్వత్కృతేనాహం వనవాసకృతం సుఖమ్ ||

51

ప్రసీదేచ్ఛామి తేఽరణ్యే భవితుం ప్రత్యనంతరః |
ప్రీత్యాఽభిహితమిచ్ఛామి భవ మే పత్యనంతరః ||

52

ఇమే చాపి హయా వీర యది తే వనవాసినః |
పరిచర్యాం కరిష్యంతి ప్రాప్స్యంతి పరమాం గతిమ్ ||

53

తవ శుశ్రూషణం మూర్ధ్నా కరిష్యామి వనే వసన్ |
అయోధ్యాం దేవలోకం వా సర్వథా ప్రజహామ్యహమ్ ||

54

న హి శక్యా ప్రవేష్టుం సా మయా అయోధ్యా త్వయా వినా |
రాజధానీ మహేంద్రస్య యథా దుష్కృతకర్మణా ||

55

వనవాసే క్షయం ప్రాప్తే మమైష హి మనోరథః |
యదనేన రథేనైవ త్వాం వహేయం పురీం పునః ||

56

చతుర్దశ హి వర్షాణి సహితస్య త్వయా వనే |
క్షణ భూతాని యాస్యంతి శతసంఖ్యాఽన్యతోఽన్యథా ||

57

భృత్యవత్సల తిష్ఠంతం భర్తృపుత్రగతే పథి |
భక్తం భృత్యం స్థితం స్థిత్యాం త్వం న మాం హాతుమర్హసి ||

58

ఏవం బహువిధం దీనం యాచమానం పునః పునః |
రామః భృత్యానుకంపీ తు సుమంత్రమిదమబ్రవీత్ ||

59

జానామి పరమాం భక్తిం మయి తే భర్తృవత్సల |
శృణు చాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీమితః ||

60

నగరీం త్వాం గతం దృష్ట్వా జననీ మే యవీయసీ |
కైకేయీ ప్రత్యయం గచ్ఛేదితి రామః వనం గతః ||

61

పరితుష్టా హి సా దేవి వనవాసం గతే మయి |
రాజానం నాతిశంకేత మిథ్యా వాదీతి ధార్మికమ్ ||

62

ఏష మే ప్రథమః కల్పో యదంబా మే యవీయసీ |
భరతారక్షితం స్ఫీతం పుత్రరాజ్యమవాప్నుయాత్ ||

63

మమ ప్రియార్థం రాజ్ఞశ్చ సరథస్త్వం పురీం వ్రజ |
సందిష్టశ్చాసి యానర్థాన్ తాంస్తాన్ బ్రూయాస్తథా తథా ||

64

ఇత్యుక్త్వా వచనం సూతం సాంత్వయిత్వా పునః పునః |
గుహం వచనమక్లీబః రామః హేతుమదబ్రవీత్ ||

65

నేదానీం గుహ యోగ్యోఽయం వసో మే సజనే వనే |
అవశ్యం హ్యాశ్రమే వాసః కర్తవ్యస్తద్గతో విధిః ||

66

సోఽహం గృహీత్వా నియమం తపస్విజనభూషణమ్ |
హితకామః పితుర్భూయః సీతాయా లక్ష్మణస్య చ ||

67

జటాః కృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయ |
తత్క్షీరం రాజపుత్రాయ గుహః క్షిప్రముపాహరత్ ||

68

లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తేనాకరోజ్జటాః |
దీర్ఘబాహుర్నరవ్యాఘ్రో జటిలత్వమధారయత్ ||

69

తౌ తదా చీరవసనౌ జటామండలధారిణౌ |
అశోభేతామృషిసమౌ భ్రాతరౌ రామరక్ష్మణౌ ||

70

తతః వైఖానసం మార్గమాస్థితః సహలక్ష్మణః |
వ్రతమాదిష్టవాన్ రామః సహాయం గుహమబ్రవీత్ ||

71

అప్రమత్తః బలే కోశే దుర్గే జనపదే తథా |
భవేథా గుహ రాజ్యం హి దురారక్షతమం మతమ్ ||

72

తతస్తం సమనుజ్ఞాయ గుహమిక్ష్వాకునందనః |
జగామ తూర్ణమవ్యగ్రః సభార్యః సహలక్ష్మణః ||

73

స తు దృష్ట్వా నదీతీరే నావమిక్ష్వాకునందనః |
తితీర్షుః శీఘ్రగాం గంగామిదం లక్ష్మణమబ్రవీత్ ||

74

ఆరోహ త్వం నరవ్యాఘ్ర స్థితాం నావమిమాం శనైః |
సీతాం చారోపయాన్వక్షం పరిగృహ్య మనస్వినీమ్ ||

75

స భ్రాతుః శాసనం శృత్వా సర్వమప్రతికూలయన్ |
ఆరోప్య మైథిలీం పూర్వమారురోహాత్మవాంస్తతః ||

76

అథారురోహ తేజస్వీ స్వయం లక్ష్మణపూర్వజః |
తతో నిషాదాధిపతిర్గుహో జ్ఞాతీనచోదయత్ ||

77

రాఘవోఽపి మహాతేజాః నావమారుహ్య తాం తతః |
బ్రహ్మవత్ క్షత్రవచ్చైవ జజాప హితమాత్మనః ||

78

ఆచమ్య చ యథాశాస్త్రం నదీం తాం సహ సీతయా |
ప్రాణమత్ప్రీతిసంహృష్టో లక్ష్మణశ్చామితప్రభః ||

79

అనుజ్ఞాయ సుమంత్రం చ సబలం చైవ తం గుహమ్ |
ఆస్థాయ నావం రామస్తు చోదయామాస నావికాన్ ||

80

తతస్తైశ్చోదితా సా నౌః కర్ణధారసమాహితా |
శుభస్ఫ్యవేగాభిహతా శీఘ్రం సలిలమత్యగాత్ ||

81

మధ్యం తు సమనుప్రాప్య భాగీరథ్యాస్త్వనిందితా |
వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదమబ్రవీత్ ||

82

పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమతః |
నిదేశం పాలయత్వేమం గంగే త్వదభిరక్షితః ||

83

చతుర్దశ హి వర్షాణి సమగ్రాణ్యుష్య కాననే |
భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి ||

84

తతస్త్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగతా |
యక్ష్యే ప్రముదితా గంగే సర్వకామసమృద్ధినీ ||

85

త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే |
భార్యా చోదధి రాజస్య లోకేఽస్మిన్ సంప్రదృశ్యసే ||

86

సా త్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే |
ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే ||

87

గవాం శతసహస్రం చ వస్త్రాణ్యన్నం చ పేశలమ్ |
బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి తవ ప్రియచికీర్షయా ||

88

సురాఘటసహస్రేణ మాంసభూతౌదనేన చ |
యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగతా ||

89

యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ |
తాని సర్వాణి యక్ష్యామి తీర్థాన్యాయతనాని చ ||

90

పునరేవ మహాబాహుర్మయా భ్రాత్రా చ సంగతః |
అయోధ్యాం వనవాసాత్తు ప్రవిశత్వనఘోఽనఘే ||

91

తథా సంభాషమాణా సా సీతా గంగామనిందితా |
దక్షిణా దక్షిణం తీరం క్షిప్రమేవాభ్యుపాగమత్ ||

92

తీరం తు సమనుప్రాప్య నావం హిత్వా నరర్షభః |
ప్రాతిష్ఠత సహ భ్రాత్రా వైదేహ్యా చ పరంతపః ||

93

అథాబ్రవీన్మహాబాహుః సుమిత్రానంద వర్ధనమ్ |
భవ సంరక్షణార్థాయ సజనే విజనేఽపి వా ||

94

అవశ్యం రక్షణం కార్యమదృష్టే విజనే వనే |
అగ్రతః గచ్ఛ సౌమిత్రే సీతా త్వామనుగచ్ఛతు ||

95

పృష్ఠతోఽహం గమిష్యామి త్వాం చ సీతాం చ పాలయన్ |
అన్యోన్యస్యేహ నో రక్షా కర్తవ్యా పురుషర్షభ ||

96

న హి తావదతిక్రాంతా సుకరా కాచన క్రియా |
అద్య దుఃఖం తు వైదేహీ వనవాసస్య వేత్స్యతి ||

97

ప్రనష్టజనసంబాధం క్షేత్రారామవివర్జితమ్ |
విషమం చ ప్రపాతం చ వనం హ్యద్య ప్రవేక్ష్యతి ||

98

శృత్వా రామస్య వచనం ప్రతిస్థే లక్ష్మణోఽగ్రతః |
అనంతరం చ సీతాయాః రాఘవో రఘునందనః ||

99

గతం తు గంగాఽపరపారమాశు
రామం సుమంత్రః ప్రతతం నిరీక్ష్య |
అధ్వ ప్రకర్షాద్వినివృత్త దృష్టిః
ముమోచ బాష్పం వ్యథితస్తపస్వీ ||

100

స లోకపాలప్రతిమప్రభావవాన్
తీర్త్వా మహాత్మా వరదో మహానదీమ్ |
తతః సమృద్ధాన్ శుభసస్యమాలినః
క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్ ||

101

తౌ తత్ర హత్వా చతురః మహామృగాన్
వరాహమృశ్యం పృషతం మహారురుమ్ |
ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ|
వాసాయ కాలే యయతుర్వనః పతిమ్ ||

102

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 52 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు.” అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు.

“మిత్రమా! నన్ను నావను ఎక్కించుము” అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా! మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెళుతున్నారు. నేనేమి చేయాలి. సెలవివ్వండి.” అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపుమీద చేయి వేసి ఆప్యాయంగా అన్నాడు.

నిమిరి “సుమంత్రా! నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకొమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. ఇంక నేను కాలి నడకన అరణ్యములలోకి వెళ్లెదను. నీవు అయోధ్యకు వెళ్లుము.” అని అన్నాడు రాముడు.
అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు.

“రామా! అయోధ్యకు రాజువై ఉండి కూడా, నీవు సామాన్యుని వలె అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞప్రకారము ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కాని నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితములో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంక వేదాధ్యయనము చేసి గానీ, మంచి ప్రవర్తన కలిగి ఉండి గానీ ప్రయోజనమేమి.

రామా! నీవు చేసిన వనవాసము వృధాపోదు. ఈవనవాసమునకు ప్రతిఫలముగా నీకు సద్గతులు లభిస్తాయి. కాని మేమే దురదృష్ట వంతులము. నిన్ను అడవుల పాలుచేసిన ఆ కైక చేతి కింద బ్రతుక వలసిన దౌర్భాగ్య ము పట్టినది. ఏం చేస్తాము.” అని రాముని చూచి ఏడ్చాడు సుమంత్రుడు.

రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. “సుమంత్రా! అన్ని తెలిసినవాడవు నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగ. మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రిగారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రిగారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రిగారు ఏమి చెప్పినా, ఆయన మనస్సు బాధపడ కుండా నీవు ఆపనులు అన్నీ చేయాలి కదా! ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యము. దశరథమహారాజు అనుచితమైన పనులు చెప్పినా

అవి చేయడం మన కర్తవ్యము. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు, నేను నమస్కరించినట్టుగా చెప్పి, ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు. “తండ్రిగారూ! నేను గానీ, లక్ష్మణుడు గానీ, సీత గానీ, మేము అడవులలో నివసించవలసి వచ్చినదే అని ఏ మాత్రమూ బాధపడటం లేదు.

అరణ్యవాసము పదునాలుగుసంవత్సరములు పూర్తిచేసుకొని మేము అయోధ్యకు తిరిగి వస్తాము. అప్పుడు మేమందరమూ నీ కళ్ల ఎదుటనే ఉంటాము.” అని నా మాటగా మా తండ్రిగారికి చెప్పు.
అలాగే మాతల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమము లను అడిగినట్టు చెప్పు.

నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభి వందనము చేసామని చెప్పు. మా తండ్రిగారికి మేమందరమూ పాదాభివందనము చేసామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకొని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకము చేయమని నామాటగా మా తండ్రిగారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడు అయిన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు.

“భరతా! నీకు నీ తల్లి కైక ఎలాగో. నా తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్రకూడా అలాగే. మన తండ్రిగారి కోరిక అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడవై ఇహపరములలో సుఖాలు అనుభవించు.” ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్రా! ఇంక నీవు అయోధ్యకు బయలు దేరు.” అని అన్నాడు.

రాముడు చెప్పి మాటలన్నీ విన్న సుమంత్రుడి దుఃఖానికి అంతులేదు. రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను నీ అనుచరుడను. భక్తుడను. కాని, నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవులలో విడిచి పెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్లలేను. రాముడు నా రథము మీద అడవులకు వస్తున్నప్పుడు, అయోధ్యా వాసులు ఆ రథం వెంట పరుగెత్తి ఎంతో దు:ఖించారు.

ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకొని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువుదీరి ఉన్నావు. వారు దూరంగా ఉన్నా అనుక్షణం నిన్ను తలచుకుంటూనే ఉంటారు. ఓ రామా! నీవు అరణ్యమునకు నారథము మీద వచ్చునప్పుడు అయోధ్యాపౌరులు ఎంతగా ఏడ్చారో, ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూచి అంత కన్నా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకొని వెళ్లలేను.

అది సరే! నేను కౌసల్య వద్దకు పోయి ఏమని చెప్ప మంటావు? నీ కుమారుని అరణ్యములలో విడిచివచ్చాను అని చెప్పమంటావా! అది నా వల్లకాదు. ఆమాట చెప్పి నీ తల్లిని మరింత దుఃఖపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్లిపోతే, నేను ఇక్కడే చితి పేర్చుకొని అగ్నిలో దూకుతాను. ఓ రామా! నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగాఉంటాను.

అనువైన మార్గములలో నిన్ను రథం మీద తీసుకొని వెళతాను. ఇంతకాలము నీవు ఎక్కిన రథము తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాససుఖము అనుభవిస్తాను. ఓ రామా! నేనే కాదు. నీకు సేవచేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు.

నీతోపాటు అరణ్యములలో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసము పూర్తి అయిన తరువాత మనమందరమూ ఇదే రథము మీద అయోధ్యకు పోదాము. ఓ రామా! నీ వెంట ఉంటే ఈ పదునాలుగు సంవత్సరములు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు.” అని వేడుకున్నాడు సుమంత్రుడు.

ఆ మాటలువిన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “నీకు నా మీద ఉన్న భక్తి, గౌరవము నాకు తెలియవా చెప్పు. అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా! నేను నిజంగా వనవాసమునకు వెళ్లాను అని నీవు కైకకు చెబితే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరేచోటికి పంపి వనవాసము నకు పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది.

కాబట్టి నీవు వెళ్లి మా వనవాసము సంగతి చెప్పి, కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి.
నీ మాట నమ్మి కైక తన కుమారునికి పట్టాభిషేకము చేయిస్తుంది. లేకపోతే అయోధ్య అనాధగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్లక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి

చెయ్యమని చెప్పానో అవన్నీ చేయి.” అని పలికాడు రాముడు. తరువాత గుహుని చూచి రాముడు ఇలా అన్నాడు. “మిత్రమా! నేను జనావాసములలో నివసించరాదు. కేవలము అరణ్యములలో ఆశ్రమములలో ముని వేషధారణలో నివసించాలి. కాబట్టి నేను లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువగు మర్రిపాలు తెప్పించు.” అని అన్నాడు.

వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలను రాముడు లక్ష్మణుడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి ముని కుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రామక్ష్మణులు ముని కుమారులవలె శోభించారు. తరువాత రాముడు వెంటనే త్వర త్వరగా గంగానది వైపు వెళ్లాడు. సీత, లక్ష్మణుడు రాముని అనుసరించారు. అందరూ పడవను సమీపించారు.

“లక్ష్మణా! ముందు నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించుము.” అని అన్నాడు. కాని లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. తరువాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లిగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదీమతల్లికి నమస్కరించారు. రాముడు గుహునికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు.

పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది. “తల్లీ గంగా మాతా! నేను, రాముడు, లక్ష్మణుడు పద్నాలుగేళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేట్టు దీవించు. తిరిగి వచ్చునపుడు నిన్ను పూజిస్తాను. నీదీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకము చేసుకున్న నాడు, నీకు సంతోషము కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను, దానంగా ఇస్తాను.

బ్రాహ్మణులకు భోజనము పెడతాను. నేను వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత నీకు నూరు కుండలతో సురను (మద్యమును), మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరమున గల సమస్త దేవాలయములలోనూ పూజలు చేయిస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేట్టు దీవించు.” అని గంగా దేవికి మొక్కుకుంది సీత.

పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్షణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము జనావాసములలో ఉన్నను, జనములు లేని ప్రదేశములో ఉన్నను, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలను మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యములో జన సంచారము కనపడటంలేదు.

వన్యమృగములనుండి మనలను మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు. నేను నీ వెనక నడిచెదను. మనమధ్య సీత ఉంటుంది. మనము ఇద్దరము ఒకరిని ఒకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. లక్ష్మణా! మనకు ముందుజాగ్రత్త అవసరము. పరిస్థితి దాటిపోయిన తరువాత, చింతించి ప్రయోజనము లేదు. సీతకు వనవాసములోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీతా! ఈ అరణ్యములలో ఉద్యానవనములు చేయి

ఉండవు. అగాధమైన లోయలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలి.”అని అన్నాడు రాముడు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు. తరువాత సీత, ఆమె వెనక రాముడు నడుస్తున్నారు.
వీరి సంగతి ఇలాఉంటే అక్కడ సుమంత్రుడు, పడవ కంటికి కనపడినంతవరకూ రాముని చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే, దుఃఖంతో కుమిలిపోయాడు. రథమును తీసుకొని అయోధ్యకు వెళ్లాడు.

రాముడు, సీతా లక్ష్మణులతో అడవులలో ప్రయాణం చేసి వత్సదేశము చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామ లక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పులను, చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షము మొదట విశ్రమించారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది రెండవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిపంచాశః సర్గః (53) >>

Ayodhya Kanda Sarga 45 In Telugu – అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 45 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గ, “పౌరయాచనమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, అయోధ్య నగర ప్రజలు రాముడిని తిరిగి రావలసిందిగా అభ్యర్థిస్తారు. రాముడు వనవాసానికి వెళ్లిపోవడం తో, అయోధ్య ప్రజలు దుఃఖంలో మునిగిపోయి, అతడిని తిరిగి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తారు. వారు రాముడి నిష్కళంకత, ధర్మపరిపాలన మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమను వర్ణిస్తూ, అతడి అనువర్తితాన్ని రాముడికి విన్నవిస్తారు. ఈ సర్గలో, ప్రజలు రాముడి పట్ల ఉన్న అభిమానాన్ని, ఆరాధనను, మరియు అయోధ్య ప్రజలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపుతుంది.

పౌరయాచనమ్

అనురక్తా మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ |
అనుజగ్ముః ప్రయాంతం తం వనవాసాయ మానవాః ||

1

నివర్తితేఽపి చ బలాత్సుహృద్వర్గే చ రాజని |
నైవ తే సంన్యవర్తంత రామస్యానుగతా రథమ్ ||

2

అయోధ్యానిలయానాం హి పురుషాణాం మహాయశాః |
బభూవ గుణసంపన్నః పూర్ణచంద్ర ఇవ ప్రియః ||

3

స యాచ్యమానః కాకుత్స్థః స్వాభిః ప్రకృతిభిస్తదా |
కుర్వాణః పితరం సత్యం వనమేవాన్వపద్యత ||

4

అవేక్షమాణః సస్నేహం చక్షుషా ప్రపిబన్నివ |
ఉవాచ రామః స్నేహేన తాః ప్రజాస్స్వాః ప్రజా ఇవ ||

5

యా ప్రీతిర్బహుమానశ్చ మయ్యయోధ్యానివాసినామ్ |
మత్ప్రియార్థం విశేషేణ భరతే సా నివేశ్యతామ్ ||

6

స హి కళ్యాణచారిత్రః కైకేయ్యానందవర్ధనః |
కరిష్యతి యథావద్వః ప్రియాణి చ హితాని చ ||

7

జ్ఞానవృద్ధో వయోబాలో మృదుర్వీర్యగుణాన్వితః |
అనురూపః స వో భర్తా భవిష్యతి భయాపహః ||

8

స హి రాజగుణైర్యుక్తో యువరాజః సమీక్షితః |
అపి చాపి మయా శిష్టైః కార్యం వో భర్తృశాసనమ్ ||

9

న చ తప్యేద్యథా చాసౌ వనవాసం గతే మయి |
మహారాజస్తథా కార్యో మమ ప్రియచికీర్షయా ||

10

యథాయథా దాశరథిర్ధర్మ ఏవ స్థితోఽభవత్ |
తథాతథా ప్రకృతయో రామం పతిమకామయన్ ||

11

బాష్పేణ పిహితం దీనం రామః సౌమిత్రిణా సహ |
చకర్షేవ గుణైర్బద్ధ్వా జనం పునరివాసినమ్ ||

12

తే ద్విజాస్త్రివిధం వృద్ధాః జ్ఞానేన వయసౌజసా |
వయః ప్రకంపశిరసో దూరాదూచురిదం వచః ||

13

వహంతః జవనా రామం భోభో జాత్యాస్తురంగమాః |
నివర్తధ్వం న గంతవ్యం హితా భవత భర్తరి ||

14

కర్ణవంతి హి భూతాని విశేషేణ తురంగమాః |
యూయం తస్మాన్నివర్తధ్వం యాచనాం ప్రతివేదితాః ||

15

ధర్మతః స విశుద్ధాత్మా వీరః శుభదృఢవ్రతః |
ఉపవాహ్యస్తు వో భర్తా నాపవాహ్యః పురాద్వనమ్ ||

16

ఏవమార్తప్రలాపాంస్తాన్వృద్ధాన్ప్రలపతో ద్విజాన్ |
అవేక్ష్య సహసా రామః రథాదవతతార హ ||

17

పద్భ్యామేవ జగామాథ ససీతః సహలక్ష్మణః |
సన్నికృష్టపదన్యాసో రామః వనపరాయణః ||

18

ద్విజాతీంస్తు పదాతీంస్తాన్రామశ్చారిత్రవత్సలః |
న శశాక ఘృణాచక్షుః పరిమోక్తుం రథేన సః ||

19

గచ్ఛంతమేవ తం దృష్ట్వా రామం సంభ్రాంతచేతసః |
ఊచుః పరమసంతప్తా రామం వాక్యమిదం ద్విజాః ||

20

బ్రాహ్మణ్యం కృత్స్నమేతత్త్వాం బ్రహ్మణ్యమనుగచ్ఛతి |
ద్విజస్కంధాధిరూఢాస్త్వామ్ అగ్నయోఽప్యనుయాంత్యమీ ||

21

వాజపేయసముత్థాని ఛత్రాణ్యేతాని పశ్య నః |
పృష్ఠతోనుప్రయాతాని మేఘానివ జలాత్యయే ||

22

అనవాప్తాతపత్రస్య రశ్మిసంతాపితస్య తే |
ఏభిశ్ఛాయాం కరిష్యామః స్వైశ్ఛత్రైర్వాజపేయికైః ||

23

యా హి నః సతతం బుద్ధిర్వేదమంత్రానుసారిణీ |
త్వత్కృతే సా కృతా వత్స వనవాసానుసారిణీ ||

24

హృదయేష్వేవ తిష్ఠంతి వేదా యే నః పరం ధనమ్ |
వత్స్యంత్యపి గృహేష్వేవ దారాశ్చారిత్రరక్షితాః ||

25

న పునర్నిశ్చయః కార్యస్త్వద్గతౌ సుకృతా మతిః |
త్వయి ధర్మవ్యపేక్షే తు కిం స్యాద్ధర్మమపేక్షితుమ్ || [పథేస్థితమ్]

26

యాచితో నో నివర్తస్వ హంసశుక్లశిరోరుహైః |
శిరోభిర్నిభృతాచార మహీపతనపాంసులైః ||

27

బహూనాం వితతా యజ్ఞా ద్విజానాం య ఇహాగతాః |
తేషాం సమాప్తిరాయత్తా తవ వత్స నివర్తనే ||

28

భక్తిమంతి హి భూతాని జంగమాఽజంగమాని చ |
యాచమానేషు రామ త్వం భక్తిం భక్తేషు దర్శయ ||

29

అనుగంతుమశక్తాస్త్వాం మూలైరుద్ధతవేగినః |
ఉన్నతా వాయువేగేన విక్రోశంతీవ పాదపాః ||

30

నిశ్చేష్టాహారసంచారా వృక్షైకస్థానవిష్ఠితాః |
పక్షిణోఽపి ప్రయాచంతే సర్వభూతానుకంపినమ్ ||

31

ఏవం విక్రోశతాం తేషాం ద్విజాతీనాం నివర్తనే |
దదృశే తమసా తత్ర వారయంతీవ రాఘవమ్ ||

32

తతః సుమంత్రోఽపి రథాద్విముచ్య
శ్రాంతాన్హయాన్సంపరివర్త్య శ్రీఘ్రమ్ |
పీతోదకాంస్తోయపరిప్లుతాంగాన్
అచారయద్వై తమసావిదూరే ||

33

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచచత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 45 Meaning In Telugu

అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంట, అక్కడ రాముడు రథము మీద అరణ్యములకు వెళుతున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్యాపౌరులు రాముని అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయ లేక పోయింది. తన తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు, రామునికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్లకూడదు అని వారు అనుకున్నట్టున్నారు.

తన వెంటవచ్చు అయోధ్యాపౌరులను చూచి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూచి ఇలా అన్నాడు. “ఓ అయోధ్యా ప్రజలారా! మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానములకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాని నాది ఒక కోరిక. నా మీద మీరు
చూపుతున్న ప్రేమాభిమానములు ఇదేరీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది.

భరతుడు నా తమ్ముడు. సద్గుణవంతుడు. నా కాన్న బాగుగా రాజ్యమును పరిపాలించగలడు. నా తమ్ముడు భరతుడు వయసులో నా కన్నా చిన్న వాడయినా జ్ఞానములో నా కన్నా పెద్దవాడు. నా కంటే పరాక్రమ వంతుడు. అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్నివిధములా రాజు కాదగినవాడు.

మనందరికీ ప్రభువు దశరథమహారాజు. ఆయన తన కుమారుడు భరతుని యువరాజుగా ప్రకటించాడు. మనకు మన మహారాజు మాటలను మన్నించాలి. నేను సంతోషంగా అడవులకు వెళ్లాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంటనీరు పెట్టకుండా చూచుకోవాలి. కాబట్టి మీరందరూ వెనుకకు మరలండి.” అని అన్నాడు రాముడు.

కాని వారు రాముని మాట వినలేదు. మౌనంగా ఉన్నారు. కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముని చూచి ఇలాఅన్నారు. “రామా! నీవు అరణ్యములకు వెళ్లవద్దు. రాముని రథమునకు కట్టిన ఓ హయములారా! మీరు ముందుకు సాగకండి. మన రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని రండి. ధర్మాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముని మీరు అయోధ్యకు తీసుకొని రావలెనే గానీ, అడవులకు తీసుకొని వెళ్లకూడదు.” అని దీనంగా పలికారు.

వారి దీనాలాపములను విన్న రాముడు రథం దిగాడు. సీతను, లక్ష్మణుని కూడా రథం దిగమన్నాడు. నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు. అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచివెళుతున్నారు. వారు రామునితో ఇలా అన్నారు.

“ఓ రామా! మేమంతా బ్రాహ్మణులము. నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందుకని మేమంతా నీ వెంట వచ్చుచున్నాము. మేము ప్రతిరోజూ అర్చించే అగ్నులను మా వెంట మోసుకొని వస్తున్నాము. మేము వాజపేయము చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు(ఛత్రములు) కూడా మా వెంట వస్తున్నాయి. ప్రస్తుతము నీకు ఛత్రము లేదు. నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో.

మాకు వేదాధ్యయనము, వేద పఠనము తప్ప మరోవ్యాపకము లేదు. ప్రస్తుతము నీ వెంటవచ్చుటయే మాకు వ్యాపకము. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. మా వెంట వేదములు ఉంటాయి. మా భార్యలు మమ్ములను తలుచుకుంటూ అయోధ్యలో ఉండగలరు. నీవు అయోధ్యకు తిరిగి రావలెనని మా నిర్ణయము. మా నిర్ణయము ధర్మసమ్మతము. ధర్మసమ్మతమైన మా నిర్ణయమును ధర్మాత్ముడవైన నీవే మన్నించకపోతే వేరువాళ్లు ఎవరు మన్నిస్తారు. మేమందరమూ వృద్ధులము. మా వెంట్రుకలు తెల్లబడ్డాయి. మా ఆశలు కూడా తెల్లబడనీయకు. అయోధ్యకు మరలిరా!

నీ వెంబడి వచ్చుచున్న బ్రాహ్మణులు చాలామంది ఎన్నో యజ్ఞములు మొదలు పెట్టారు. వారందరూ తమ తమ యజ్ఞములను వదిలి వచ్చారు. వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములు పూర్చిచేయాలంటే నీవు అయోధ్యకు తిరిగిరావాలి. వారు నీ వెంట అడవులకు వస్తే, వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములను ఎలా పూర్తి చేస్తారు.

ఓ రామా! మేమే కాదు. అయోధ్యలో ఉన్న చరాచరములు, సకల జీవరాసులు అన్నీ నీ రాక కొరకు ఎదురుచూస్తున్నాయి.

రామా! ఆ వృక్షములను చూడు. అవి కూడా నీ వెంట అడవులకు రావలెనని ఎంతో కుతూహలముగా ఉన్నాయి కాని వాటి వేళ్లు భూమిలో పాతుకొని పోవడం వల్ల కదలలేక, నీకోసం విలపిస్తున్నాయి. ఆ వృక్షములే కాదు, ఆ వృక్షముల మీద గూళ్లు కట్టుకొని నవసిస్తున్న పక్షలు కూడా ఆహారము మాని నీ కోసం జాలిగా ఎదురు చూస్తున్నాయి. నిన్ను వెనుకకు మరలమని వేడుకుంటున్నాయి.”అని ఆ బ్రాహ్మణులు రాముని వెంట నడుస్తున్నారు.

రాముడు అడవులకు వెళ్లడం తనకు కూడా ఇష్టంలేదు. అన్నట్టు తమసానది వాళ్లకు అడ్డంగా వచ్చింది. అందరూ తమసా నదీ తీరము చేరుకున్నారు. సుమంత్రుడు రథమునకు కట్టిన గుర్రములను విప్పి వాటికి స్నానం చేయించి నీరు త్రాగించాడు. వాటికి తిండి పెట్టాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్చత్వారింశః సర్గః (46) >>