Aranya Kanda Sarga 59 In Telugu – అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గః

Aranya Kanda Sarga 59 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గం, రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణులు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు సీత హరణం జరుగుతుంది. రావణుడు మారీచుని సహాయంతో సీతను మాయాజాలంతో మోసపుచ్చి హరిస్తాడు. మారీచుడు స్వర్ణమృగం రూపంలో వస్తుంది, దాన్ని వెంటపడి తీసుకురావాలని సీత కోరుతుంది. రాముడు, లక్ష్మణుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్లడం వల్ల సీతను రక్షించడానికి ఎవరూ లేకుండా పోతారు.

లక్ష్మణాగమనవిగర్హణమ్

అథాశ్రమాదుపావృత్తమంతరా రఘునందనః |
పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్దితం పునః ||

1

తమువాచ కిమర్థం త్వమాగతోఽపాస్య మైథిలీమ్ |
యదా సా తవ విశ్వాసాద్వనే విరహితా మయా ||

2

దృష్ట్వైవాభ్యాగతం త్వాం మే మైథిలీం త్యజ్య లక్ష్మణ |
శంకమానం మహత్పాపం యత్సత్యం వ్యథితం మనః ||

3

స్ఫురతే నయనం సవ్యం బాహుశ్చ హృదయం చ మే |
దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతావిరహితం పథి ||

4

ఏవముక్తస్తు సౌమిత్రిర్లక్ష్మణః శుభలక్షణః |
భూయో దుఃఖసమావిష్టో దుఃఖితం రామమబ్రవీత్ ||

5

న స్వయం కామకారేణ తాం త్యక్త్వాహమిహాగతః |
ప్రచోదితస్తయైవోగ్రైస్త్వత్సకాశమిహాగతః ||

6

ఆర్యేణేవ పరాక్రుష్టం హా సీతే లక్ష్మణేతి చ |
పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాస్తచ్ఛ్రుతిం గతమ్ ||

7

సా తమార్తస్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలీ |
గచ్ఛ గచ్ఛేతి మామాహ రుదంతీ భయవిహ్వలా ||

8

ప్రచోద్యమానేన మయా గచ్ఛేతి బహుశస్తయా |
ప్రత్యుక్తా మైథిలీ వాక్యమిదం త్వత్ప్రత్యయాన్వితమ్ ||

9

న తత్పశ్యామ్యహం రక్షో యదస్య భయమావహేత్ |
నిర్వృతా భవ నాస్త్యేతత్కేనాప్యేవముదాహృతమ్ ||

10

విగర్హితం చ నీచం చ కథమార్యోఽభిధాస్యతి |
త్రాహీతి వచనం సీతే యస్త్రాయేత్త్రిదశానపి ||

11

కింనిమిత్తం తు కేనాపి భ్రాతురాలంబ్య మే స్వరమ్ |
రాక్షసేనేరితం వాక్యం త్రాహి త్రాహీతి శోభనే ||

12

విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి |
న భవత్యా వ్యథా కార్యా కునారీజనసేవితా ||

13

అలం వైక్లవ్యమాలంబ్య స్వస్థా భవ నిరుత్సుకా |
న సోఽస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే ||

14

జాతో వా జాయమానో వా సంయుగే యః పరాజయేత్ |
న జయ్యో రాఘవో యుద్ధే దేవైః శక్రపురోగమైః ||

15

ఏవముక్తా తు వైదేహీ పరిమోహితచేతనా |
ఉవాచాశ్రూణి ముంచంతీ దారుణం మామిదం వచః ||

16

భావో మయి తావాత్యర్థం పాప ఏవ నివేశితః |
వినష్టే భ్రాతరి ప్రాప్తుం న చ త్వం మామవాప్స్యసి ||

17

సంకేతాద్భరతేన త్వం రామం సమనుగచ్ఛసి |
క్రోశంతం హి యథాత్యర్థం నైవమభ్యవపద్యసే ||

18

రిపుః ప్రచ్ఛన్నచారీ త్వం మదర్థమనుగచ్ఛసి |
రాఘవస్యాంతరప్రేప్సుస్తథైనం నాభిపద్యసే ||

19

ఏవముక్తో హి వైదేహ్యా సంరబ్ధో రక్తలోచనః |
క్రోధాత్ ప్రస్ఫురమాణోష్ఠ ఆశ్రమాదభినిర్గతః ||

20

ఏవం బ్రువాణం సౌమిత్రిం రామః సంతాపమోహితః |
అబ్రవీద్దుష్కృతం సౌమ్య తాం వినా యత్త్వమాగతః ||

21

జానన్నపి సమర్థం మాం రాక్షసాం వినివారణే |
అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిస్సృతో భవాన్ ||

22

న హి తే పరితుష్యామి త్యక్త్వా యద్యాసి మైథిలీమ్ |
క్రుద్ధాయాః పరుషం వాక్యం శ్రుత్వా యత్త్వమిహాగతః ||

23

సర్వథా త్వపనీతం తే సీతయా యత్ప్రచోదితః |
క్రోధస్య వశమాపన్నో నాకరోః శాసనం మమ ||

24

అసౌ హి రాక్షసః శేతే శరేణాభిహతో మయా |
మృగరూపేణ యేనాహమాశ్రమాదపవాహితః ||

25

వికృష్య చాపం పరిధాయ సాయకం
సలీలబాణేన చ తాడితో మయా |
మార్గీం తనుం త్యజ్య స విక్లబస్వరో
బభూవ కేయూరధరః స రాక్షసః ||

26

శరాహతేనైవ తదార్తయా గిరా
స్వరం మమాలంబ్య సుదూరసంశ్రవమ్ |
ఉదాహృతం తద్వచనం సుదారుణం
త్వమాగతో యేన విహాయ మైథిలీమ్ ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనషష్టితమః సర్గః ||

Aranya Kanda Sarga 59 Meaning In Telugu

అప్పటి దాకా సీత ఆశ్రమంతో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ, చంపడం కానీ చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు.

ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేసాడు. “లక్ష్మణా! నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, సీతను నట్టడివిలో వదిలి వచ్చాను కదా! మరి నా ఆజ్ఞలేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా!” అని సూటిగా ప్రశ్నించాడు రాముడు.

అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. “రామా! నేను స్వయంగా సీతను విడిచి రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కానీ సీత హా సీతా హా లక్ష్మణా అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమనీ ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను.

నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే, సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి “లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెళ్లు. ఆయనను రక్షించు.” అని నన్ను తొందరపెట్టింది. అయినా నేను కదలలేదు. నన్ను వెళ్లమంటూ అనేక సార్లు తొందరపెట్టింది. అప్పటికీ నేను ఆమెతో ఇలా అన్నాడు. “సీతా! రాముని భయపెట్టే, రామునికి అపకారం చేసే వాడు ఈ భూమి మీద లేడు. నీవు నిశ్చింతగా ఉండు. అది రాముని కంఠస్వరము కాదు. ఎవరో రాముని అనుకరించారు.

ఓ సీతా! దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే! అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా! అసంభవము. ఇది రాక్షసులు పన్నాగము. రాక్షసమాయ. దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు. నిశ్చింతగా ఉండండి. ఓ సీతా! రాముడి బలపరాక్రమ ములు నాకు తెలుసు. రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు. ఇంక ఈ సామాన్య రాక్షసుడు ఎంత?” అని ఆమెను అనునయించాను.

కాని రామా! సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది. “నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్నుపొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు. నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు. లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్లవు? నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువువు. నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు.” అని నన్ను నానారకాలుగా నిందించింది.

ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది.” అని వివరించాడు లక్ష్మణుడు.

అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు. “ఏది ఏమైనా లక్ష్మణా! నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు. నా బలపరాక్రమములు తెలిసి కూడా, సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని, నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది? నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏ మాత్రం సంతోషంగా లేదు.

ఏవో నాలుగు పరుష వాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచి పెట్టి వస్తావా! అంటే అంది. ఏమయింది. ఆమెకు కోపం వచ్చింది సరే! నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు. నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు. నీవు అన్ని విధాలా తప్పు చేసావు. సరిదిద్దుకోలేని తప్పు చేసావు.

నేను వెంబడించిన మృగాన్ని నేను నా బాణంతో కొట్టాను. వెంటనే వాడు రాక్షసుడిగా మారి కిందపడ్డాడు. నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు. ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది. ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలి వచ్చావు. అంతే కదా! దాని ఫలితంగా నాసీత నాకు దూరం అయింది.” అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పు పట్టాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది తొమ్మిదవ సర్గ. సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షష్టితమః సర్గః (60) >>

Kishkindha Kanda Sarga 1 In Telugu – కిష్కింధాకాండ ప్రథమః సర్గః

రామాయణంలోని కిష్కింధాకాండలో, రాముడు, లక్ష్మణుడు సుగ్రీవుడిని కలుసుకోవడానికి కిష్కింధకు చేరుకుంటారు. సుగ్రీవుడు, తన అన్న వాలితో విభేదించి, రాముడి సహాయంతో తన రాజ్యాన్ని తిరిగి పొందాలని కోరుకుంటాడు. రాముడు సీతాన్వేషణలో సుగ్రీవుడికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. హనుమంతుడు రాముడి ప్రాముఖ్యతను గుర్తించి, సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు తన సైన్యంతో రాముడికి సహకారం అందించడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో సుగ్రీవ-రాముల మధ్య స్నేహం, సీతాన్వేషణ, వాలిని సవాలు చేయడం మొదలైన అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.

రామవిప్రలంభావేశః

స తాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలఝషాకులామ్ |
రామః సౌమిత్రిసహితో విలలాపాకులేంద్రియః || ౧ ||

తస్య దృష్ట్వైవ తాం హర్షాదింద్రియాణి చకంపిరే |
స కామవశమాపన్నః సౌమిత్రిమిదమబ్రవీత్ || ౨ ||

సౌమిత్రే శోభతే పంపా వైడూర్యవిమలోదకా |
ఫుల్లపద్మోత్పలవతీ శోభితా వివిధైర్ద్రుమైః || ౩ ||

సౌమిత్రే పశ్య పంపాయాః కాననం శుభదర్శనమ్ |
యత్ర రాజంతి శైలాభా ద్రుమాః సశిఖరా ఇవ || ౪ ||

మాం తు శోకాభిసంతప్తం మాధవః పీడయన్నివ |
భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ || ౫ ||

శోకార్తస్యాపి మే పంపా శోభతే చిత్రకాననా |
వ్యవకీర్ణా బహువిధైః పుష్పైః శీతోదకా శివా || ౬ ||

నళినైరపి సంఛన్నా హ్యత్యర్థం శుభదర్శనా |
సర్పవ్యాలానుచరితా మృగద్విజసమాకులా || ౭ ||

అధికం ప్రతిభాత్యేతన్నీలపీతం తు శాద్వలమ్ |
ద్రుమాణాం వివిధైః పుష్పైః పరిస్తోమైరివార్పితమ్ || ౮ ||

పుష్పభారసమృద్ధాని శిఖరాణి సమంతతః |
లతాభిః పుష్పితాగ్రాభిరుపగూఢాని సర్వతః || ౯ ||

సుఖానిలోఽయం సౌమిత్రే కాలః ప్రచురమన్మథః |
గంధవాన్ సురభిర్మాసో జాతపుష్పఫలద్రుమః || ౧౦ ||

పశ్య రూపాణి సౌమిత్రే వనానాం పుష్పశాలినామ్ |
సృజతాం పుష్పవర్షాణి తోయం తోయముచామివ || ౧౧ ||

ప్రస్తరేషు చ రమ్యేషు వివిధాః కాననద్రుమాః |
వాయువేగప్రచలితాః పుష్పైరవకిరంతి గామ్ || ౧౨ ||

పతితైః పతమానైశ్చ పాదపస్థైశ్చ మారుతః |
కుసుమైః పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతః || ౧౩ ||

విక్షిపన్ వివిధాః శాఖా నగానాం కుసుమోత్కచాః |
మారుతశ్చలితస్థానైః షట్పదైరనుగీయతే || ౧౪ ||

మత్తకోకిలసన్నాదైర్నర్తయన్నివ పాదపాన్ |
శైలకందరనిష్క్రాంతః ప్రగీత ఇవ చానిలః || ౧౫ ||

తేన విక్షిపతాత్యర్థం పవనేన సమంతతః |
అమీ సంసక్తశాఖాగ్రా గ్రథితా ఇవ పాదపాః || ౧౬ ||

స ఏష సుఖసంస్పర్శో వాతి చందనశీతలః |
గంధమభ్యావహన్ పుణ్యం శ్రమాపనయనోఽనిలః || ౧౭ ||

అమీ పవనవిక్షిప్తా వినదంతీవ పాదపాః |
షట్పదైరనుకూజంతో వనేషు మధుగంధిషు || ౧౮ ||

గిరిప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిర్మనోరమైః |
సంసక్తశిఖరాః శైలా విరాజంతే మహాద్రుమైః || ౧౯ ||

పుష్పసంఛన్నశిఖరా మారుతోత్క్షేపచంచలా |
అమీ మధుకరోత్తంసాః ప్రగీత ఇవ పాదపాః || ౨౦ ||

పుష్పితాగ్రాంస్తు పశ్యేమాన్ కర్ణికారాన్ సమంతతః |
హాటకప్రతిసంఛన్నాన్ నరాన్ పీతాంబరానివ || ౨౧ ||

అయం వసంతః సౌమిత్రే నానావిహగనాదితః |
సీతయా విప్రహీణస్య శోకసందీపనో మమ || ౨౨ ||

మాం హి శోకసమాక్రాంతం సంతాపయతి మన్మథః |
హృష్టః ప్రవదమానశ్చ మామాహ్వయతి కోకిలః || ౨౩ ||

ఏష నత్యూహకో హృష్టో రమ్యే మాం వననిర్ఝరే |
ప్రణదన్మన్మథావిష్టం శోచయిష్యతి లక్ష్మణ || ౨౪ ||

శ్రుత్వైతస్య పురా శబ్దమాశ్రమస్థా మమ ప్రియా |
మామాహూయ ప్రముదితా పరమం ప్రత్యనందత || ౨౫ ||

ఏవం విచిత్రాః పతగా నానారావవిరావిణః |
వృక్షగుల్మలతాః పశ్య సంపతంతి తతస్తతః || ౨౬ ||

విమిశ్రా విహగాః పుంభిరాత్మవ్యూహాభినందితాః |
భృంగరాజప్రముదితాః సౌమిత్రే మధురస్వరాః || ౨౭ ||

తస్యాః కూలే ప్రముదితాః శకునాః సంఘశస్త్విహ |
నాత్యూహరుతవిక్రందైః పుంస్కోకిలరుతైరపి || ౨౮ ||

స్వనంతి పాదపాశ్చేమే మమానంగప్రదీపనాః |
అశోకస్తబకాంగారః షట్పదస్వననిఃస్వనః || ౨౯ ||

మాం హి పల్లవతామ్రార్చిర్వసంతాగ్నిః ప్రధక్ష్యతి |
న హి తాం సూక్ష్మపక్ష్మాక్షీం సుకేశీం మృదుభాషిణీమ్ || ౩౦ ||

అపశ్యతో మే సౌమిత్రే జీవితేఽస్తి ప్రయోజనమ్ |
అయం హి దయితస్తస్యాః కాలో రుచిరకాననః || ౩౧ ||

కోకిలాకులసీమాంతో దయితాయా మమానఘ |
మన్మథాయాససంభూతో వసంతగుణవర్ధితః || ౩౨ ||

అయం మాం ధక్ష్యతి క్షిప్రం శోకాగ్నిర్న చిరాదివ |
అపశ్యతస్తాం దయితాం పశ్యతో రుచిరద్రుమాన్ || ౩౩ ||

మమాయమాత్మప్రభవో భూయస్త్వముపయాస్యతి |
అదృశ్యమానా వైదేహీ శోకం వర్ధయతే మమ || ౩౪ ||

దృశ్యమానో వసంతశ్చ స్వేదసంసర్గదూషకః |
మాం హృద్య మృగశాబాక్షీ చింతాశోకబలాత్కృతమ్ || ౩౫ ||

సంతాపయతి సౌమిత్రే క్రూరశ్చైత్రో వనానిలః |
అమీ మయూరాః శోభంతే ప్రనృత్యంతస్తతస్తతః || ౩౬ ||

స్వైః పక్షైః పవనోద్ధూతైర్గవాక్షైః స్ఫాటికైరివ |
శిఖినీభిః పరివృతాస్త ఏతే మదమూర్ఛితాః || ౩౭ ||

మన్మథాభిపరీతస్య మమ మన్మథవర్ధనాః |
పశ్య లక్ష్మణ నృత్యంతం మయూరముపనృత్యతి || ౩౮ ||

శిఖినీ మన్మథార్తైషా భర్తారం గిరిసానుషు |
తామేవ మనసా రామాం మయురోఽప్యుపధావతి || ౩౯ ||

వితత్య రుచిరౌ పక్షౌ రుతైరుపహసన్నివ |
మయూరస్య వనే నూనం రక్షసా న హృతా ప్రియా || ౪౦ ||

తస్మాన్నృత్యతి రమ్యేషు వనేషు సహ కాంతయా |
మమ త్వయం వినా వాసః పుష్పమాసే సుదుఃసహః || ౪౧ ||

పశ్య లక్ష్మణ సంరాగం తిర్యగ్యోనిగతేష్వపి |
యదేషా శిఖినీ కామాద్భర్తారం రమతేఽంతికే || ౪౨ ||

మమాప్యేవం విశాలాక్షీ జానకీ జాతసంభ్రమా |
మదనేనాభివర్తేత యది నాపహృతా భవేత్ || ౪౩ ||

పశ్య లక్ష్మణ పుష్పాణి నిష్ఫలాని భవంతి మే |
పుష్పభారసమృద్ధానాం వనానాం శిశిరాత్యయే || ౪౪ ||

రుచిరాణ్యపి పుష్పాణి పాదపానామతిశ్రియా |
నిష్ఫలాని మహీం యాంతి సమం మధుకరోత్కరైః || ౪౫ ||

వదంతి రావం ముదితాః శకునాః సంఘశః కలమ్ |
ఆహ్వయంత ఇవాన్యోన్యం కామోన్మాదకరా మమ || ౪౬ ||

వసంతో యది తత్రాపి యత్ర మే వసతి ప్రియా |
నూనం పరవశా సీతా సాఽపి శోచత్యహం యథా || ౪౭ ||

నూనం న తు వసంతోఽయం దేశం స్పృశతి యత్ర సా |
కథం హ్యసితపద్మాక్షీ వర్తయేత్సా మయా వినా || ౪౮ ||

అథవా వర్తతే తత్ర వసంతో యత్ర మే ప్రియా |
కిం కరిష్యతి సుశ్రోణీ సా తు నిర్భర్త్సితా పరైః || ౪౯ ||

శ్యామా పద్మపలాశాక్షీ మృదుపూర్వాభిభాషిణీ |
నూనం వసంతమాసాద్య పరిత్యక్ష్యతి జీవితమ్ || ౫౦ ||

దృఢం హి హృదయే బుద్ధిర్మమ సంప్రతి వర్తతే |
నాలం వర్తయితుం సీతా సాధ్వీ మద్విరహం గతా || ౫౧ ||

మయి భావస్తు వైదేహ్యాస్తత్త్వతో వినివేశితః |
మమాపి భావః సీతాయాం సర్వథా వినివేశితః || ౫౨ ||

ఏష పుష్పవహో వాయుః సుఖస్పర్శో హిమావహః |
తాం విచింతయతః కాంతాం పావకప్రతిమో మమ || ౫౩ ||

సదా సుఖమహం మన్యే యం పురా సహ సీతాయా |
మారుతః స వినా సీతాం శోకం వర్ధయతే మమ || ౫౪ ||

తాం వినా స విహంగో యః పక్షీ ప్రణదితస్తదా |
వాయసః పాదపగతః ప్రహృష్టమభినర్దతి || ౫౫ ||

ఏష వై తత్ర వైదేహ్యా విహగః ప్రతిహారకః |
పక్షీ మాం తు విశాలాక్ష్యాః సమీపముపనేష్యతి || ౫౬ ||

శృణు లక్ష్మణ సన్నాదం వనే మదవివర్ధనమ్ |
పుష్పితాగ్రేషు వృక్షేషు ద్విజానాముపకూజతామ్ || ౫౭ ||

విక్షిప్తాం పవనేనైతామసౌ తిలకమంజరీమ్ |
షట్పదః సహసాఽభ్యేతి మదోద్ధూతామివ ప్రియామ్ || ౫౮ ||

కామినామయమత్యంతమశోకః శోకవర్ధనః |
స్తబకైః పవనోత్క్షిప్తైస్తర్జయన్నివ మాం స్థితః || ౫౯ ||

అమీ లక్ష్మణ దృశ్యంతే చూతాః కుసుమశాలినః |
విభ్రమోత్సిక్తమనసః సాంగరాగా నరా ఇవ || ౬౦ ||

సౌమిత్రే పశ్య పంపాయాశ్చిత్రాసు వనరాజిషు |
కిన్నరా నరశార్దూల విచరంతి తతస్తతః || ౬౧ ||

ఇమాని శుభగంధీని పశ్య లక్ష్మణ సర్వశః |
నళినాని ప్రకాశంతే జలే తరుణసూర్యవత్ || ౬౨ ||

ఏషా ప్రసన్నసలిలా పద్మనీలోత్పలాయుతా |
హంసకారండవాకీర్ణా పంపా సౌగంధికాన్వితా || ౬౩ ||

జలే తరుణసూర్యాభైః షట్పదాహతకేసరైః |
పంకజైః శోభతే పంపా సమంతాదభిసంవృతా || ౬౪ ||

చక్రవాకయుతా నిత్యం చిత్రప్రస్థవనాంతరా |
మాతంగమృగయూథైశ్చ శోభతే సలిలార్థిభిః || ౬౫ ||

పవనాహితవేగాభిరూర్మిభిర్విమలేఽంభసి |
పంకజాని విరాజంతే తాడ్యమానాని లక్ష్మణ || ౬౬ ||

పద్మపత్రవిశాలాక్షీం సతతం పంకజప్రియామ్ |
అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచతే || ౬౭ ||

అహో కామస్య వామత్వం యో గతామపి దుర్లభామ్ |
స్మారయిష్యతి కల్యాణీం కల్యాణతరవాదినీమ్ || ౬౮ ||

శక్యో ధారయితుం కామో భవేదద్యాగతో మయా |
యది భూయో వసంతో మాం న హన్యాత్పుష్పితద్రుమః || ౬౯ ||

యాని స్మ రమణీయాని తయా సహ భవంతి మే |
తాన్యేవారమణీయాని జాయంతే మే తయా వినా || ౭౦ ||

పద్మకోశపలాశాని దృష్ట్వా దృష్టిర్హి మన్యతే |
సీతాయా నేత్రకోశాభ్యాం సదృశానీతి లక్ష్మణ || ౭౧ ||

పద్మకేసరసంసృష్టో వృక్షాంతరవినిఃసృతః |
నిఃశ్వాస ఇవ సీతాయా వాతి వాయుర్మనోహరః || ౭౨ ||

సౌమిత్రే పశ్య పంపాయా దక్షిణే గిరిసానుని |
పుష్పితాం కర్ణికారస్య యష్టిం పరమశోభనామ్ || ౭౩ ||

అధికం శైలరాజోఽయం ధాతుభిః సువిభూషితః |
విచిత్రం సృజతే రేణుం వాయువేగవిఘట్టితమ్ || ౭౪ ||

గిరిప్రస్థాస్తు సౌమిత్రే సర్వతః సంప్రపుష్పితైః |
నిష్పత్రైః సర్వతో రమ్యైః ప్రదీప్తా ఇవ కింశుకైః || ౭౫ ||

పంపాతీరరుహాశ్చేమే సంసక్తా మధుగంధినః |
మాలతీమల్లికాషండాః కరవీరాశ్చ పుష్పితాః || ౭౬ ||

కేతక్యః సింధువారాశ్చ వాసంత్యశ్చ సుపుష్పితాః |
మాధవ్యో గంధపూర్ణాశ్చ కుందగుల్మాశ్చ సర్వశః || ౭౭ ||

చిరిబిల్వా మధూకాశ్చ వంజులా వకులాస్తథా |
చంపకాస్తిలకాశ్చైవ నాగవృక్షాః సుపుష్పితాః || ౭౮ ||

నీపాశ్చ వరణాశ్చైవ ఖర్జూరాశ్చ సుపుష్పితాః |
పద్మకాశ్చోపశోభంతే నీలాశోకాశ్చ పుష్పితాః || ౭౯ ||

లోధ్రాశ్చ గిరిపృష్ఠేషు సింహకేసరపింజరాః |
అంకోలాశ్చ కురంటాశ్చ పూర్ణకాః పారిభద్రకాః || ౮౦ ||

చూతాః పాటలయశ్చైవ కోవిదారాశ్చ పుష్పితాః |
ముచులిందార్జునాశ్చైవ దృశ్యంతే గిరిసానుషు || ౮౧ ||

కేతకోద్దాలకాశ్చైవ శిరీషాః శింశుపా ధవాః |
శాల్మల్యః కింశుకాశ్చైవ రక్తాః కురవకాస్తథా || ౮౨ ||

తినిశా నక్తమాలాశ్చ చందనాః స్పందనాస్తథా |
పుష్పితాన్ పుష్పితాగ్రాభిర్లతాభిః పరివేష్టితాన్ || ౮౩ ||

ద్రుమాన్ పశ్యేహ సౌమిత్రే పంపాయా రుచిరాన్ బహూన్ |
వాతవిక్షిప్తవిటపాన్ యథాఽఽసన్నాన్ ద్రుమానిమాన్ || ౮౪ ||

లతాః సమనువర్తంతే మత్తా ఇవ వరస్త్రియః |
పాదపాత్పాదపం గచ్ఛన్ శైలాచ్ఛైలం వనాద్వనమ్ || ౮౫ ||

వాతి నైకరసాస్వాదః సమ్మోదిత ఇవానిలః |
కేచిత్పర్యాప్తకుసుమాః పాదపా మధుగంధినః || ౮౬ ||

కేచిన్ముకులసంవీతాః శ్యామవర్ణా ఇవాబభుః |
ఇదం మృష్టమిదం స్వాదు ప్రఫుల్లమిదమిత్యపి || ౮౭ ||

రాగమత్తో మధుకరః కుసుమేష్వవలీయతే |
నిలీయ పునరుత్పత్య సహసాఽన్యత్ర గచ్ఛతి || ౮౮ ||

మధులుబ్ధో మధుకరః పంపాతీరద్రుమేష్వసౌ |
ఇయం కుసుమసంఘాతైరుపస్తీర్ణా సుఖాకృతా || ౮౯ ||

స్వయం నిపతితైర్భూమిః శయనప్రస్తరైరివ |
వివిధా వివిధైః పుష్పైస్తైరేవ నగసానుషు || ౯౦ ||

వికీర్ణైః పీతరక్తా హి సౌమిత్రే ప్రస్తరాః కృతాః |
హిమాంతే పశ్య సౌమిత్రే వృక్షాణాం పుష్పసంభవమ్ || ౯౧ ||

పుష్పమాసే హి తరవః సంఘర్షాదివ పుష్పితాః |
ఆహ్వయంత ఇవాన్యోన్యం నగాః షట్పదనాదితాః || ౯౨ ||

కుసుమోత్తంసవిటపాః శోభంతే బహు లక్ష్మణ |
ఏష కారండవః పక్షీ విగాహ్య సలిలం శుభమ్ || ౯౩ ||

రమతే కాంతాయా సార్ధం కామముద్దీపయన్మమ |
మందకిన్యాస్తు యదిదం రూపమేవ మనోహరమ్ || ౯౪ ||

స్థానే జగతి విఖ్యాతా గుణాస్తస్యా మనోరమాః |
యది దృశ్యేత సా సాధ్వీ యది చేహ వసేమహి || ౯౫ ||

స్పృహయేయం న శక్రాయ నాయోధ్యాయై రఘూత్తమ |
న హ్యేవం రమణీయేషు శాద్వలేషు తయా సహ || ౯౬ ||

రమతో మే భవేచ్చింతా న స్పృహాన్యేషు వా భవేత్ |
అమీ హి వివిధైః పుష్పైస్తరవో రుచిరచ్ఛదాః || ౯౭ ||

కాననేఽస్మిన్ వినా కాంతాం చిత్తమున్మాదయంతి మే |
పశ్య శీతజలాం చేమాం సౌమిత్రే పుష్కరాయుతామ్ || ౯౮ ||

చక్రవాకానుచరితాం కారండవనిషేవితామ్ |
ప్లవైః క్రౌంచైశ్చ సంపూర్ణాం వరాహమృగసేవితామ్ || ౯౯ ||

అధికం శోభతే పంపా వికూజద్భిర్విహంగమైః |
దీపయంతీవ మే కామం వివిధా ముదితా ద్విజాః || ౧౦౦ ||

శ్యామాం చంద్రముఖీం స్మృత్వా ప్రియాం పద్మనిభేక్షణామ్ |
పశ్య సానుషు చిత్రేషు మృగీభిః సహితాన్ మృగాన్ || ౧౦౧ ||

మాం పునర్మృగశాబాక్ష్యా వైదేహ్యా విరహీకృతమ్ |
వ్యథయంతీవ మే చిత్తం సంచరంతస్తతస్తతః || ౧౦౨ ||

అస్మిన్ సానుని రమ్యే హి మత్తద్విజగణాయుతే |
పశ్యేయం యది తాం కంతాం తతః స్వస్తి భవేన్మమ || ౧౦౩ ||

జీవేయం ఖలు సౌమిత్రే మయా సహ సుమధ్యమా |
సేవతే యది వైదేహీ పంపాయాః పవనం సుఖమ్ || ౧౦౪ ||

పద్మసౌగంధికవహం శివం శోకవినాశనమ్ |
ధన్యా లక్ష్మణ సేవంతే పంపోపవనమారుతమ్ || ౧౦౫ ||

శ్యామా పద్మపలాశాక్షీ ప్రియా విరహితా మయా |
కథం ధారయతి ప్రాణాన్ వివశా జనకాత్మజా || ౧౦౬ ||

కిం ను వక్ష్యామి రాజానం ధర్మజ్ఞం సత్యవాదినమ్ |
సీతాయా జనకం పృష్టః కుశలం జనసంసది || ౧౦౭ ||

యా మామనుగతా మందం పిత్రా ప్రవ్రాజితం వనమ్ |
సీతా సత్పథమాస్థాయ క్వ ను సా వర్తతే ప్రియా || ౧౦౮ ||

తయా విహీనః కృపణః కథం లక్ష్మణ ధారయే |
యా మామనుగతా రాజ్యాద్భ్రష్టం విగతచేతసమ్ || ౧౦౯ ||

తచ్చార్వంచితపక్ష్మాక్షం సుగంధి శుభమవ్రణమ్ |
అపశ్యతో ముఖం తస్యాః సీదతీవ మనో మమ || ౧౧౦ ||

స్మితహాస్యాంతరయుతం గుణవన్మధురం హితమ్ |
వైదేహ్యా వాక్యమతులం కదా శ్రోష్యామి లక్ష్మణ || ౧౧౧ ||

ప్రాప్య దుఃఖం వనే శ్యామా సా మాం మన్మథకర్శితమ్ |
నష్టదుఃఖేవ హృష్టేవ సాధ్వీ సాధ్వభ్యభాషత || ౧౧౨ ||

కిం ను వక్ష్యామి కౌసల్యామయోధ్యాయాం నృపాత్మజ |
క్వ సా స్నుషేతి పృచ్ఛంతీం కథం చాతిమనస్వినీమ్ || ౧౧౩ ||

గచ్ఛ లక్ష్మణ పశ్య త్వం భరతం భ్రాతృవత్సలమ్ |
న హ్యహం జీవితుం శక్తస్తామృతే జనకాత్మజామ్ || ౧౧౪ ||

ఇతి రామం మహాత్మానం విలపంతమనాథవత్ |
ఉవాచ లక్ష్మణో భ్రాతా వచనం యుక్తమవ్యయమ్ || ౧౧౫ ||

సంస్థంభ రామ భద్రం తే మా శుచః పురుషోత్తమ |
నేదృశానాం మతిర్మందా భవత్యకలుషాత్మనామ్ || ౧౧౬ ||

స్మృత్వా వియోగజం దుఃఖం త్యజ స్నేహం ప్రియే జనే |
అతిస్నేహపరిష్వంగాద్వర్తిరార్ద్రాఽపి దహ్యతే || ౧౧౭ ||

యది గచ్ఛతి పాతాళం తతో హ్యధికమేవ వా |
సర్వథా రావణస్తావన్న భవిష్యతి రాఘవ || ౧౧౮ ||

ప్రవృత్తిర్లభ్యతాం తావత్తస్య పాపస్య రక్షసః |
తతో హాస్యతి వా సీతాం నిధనం వా గమిష్యతి || ౧౧౯ ||

యది యాత్యదితేర్గర్భం రావణః సహ సీతయా |
తత్రాప్యేనం హనిష్యామి న చేద్దాస్యతి మైథిలీమ్ || ౧౨౦ ||

స్వాస్థ్యం భద్రం భజస్వార్య త్యజ్యతాం కృపణా మతిః |
అర్థో హి నష్టకార్యార్థైర్నాయత్నేనాధిగమ్యతే || ౧౨౧ ||

ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్పరం బలమ్ |
సోత్సాహస్యాస్తి లోకేఽస్మిన్న కించిదపి దుర్లభమ్ || ౧౨౨ ||

ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు |
ఉత్సాహమాత్రమాశ్రిత్య సీతాం ప్రతిలభేమహి || ౧౨౩ ||

త్యజ్యతాం కామవృత్తత్వం శోకం సంన్యస్య పృష్ఠతః |
మహాత్మానం కృతాత్మానమాత్మానం నావబుధ్యసే || ౧౨౪ ||

ఏవం సంబోధితస్తత్ర శోకోపహతచేతనః |
న్యస్య శోకం చ మోహం చ తతో ధైర్యముపాగమత్ || ౧౨౫ ||

సోఽభ్యతిక్రామదవ్యగ్రస్తామచింత్యపరాక్రమః |
రామః పంపాం సురుచిరాం రమ్యపారిప్లవద్రుమామ్ || ౧౨౬ ||

నిరీక్షమాణః సహసా మహాత్మా
సర్వం వనం నిర్ఝరకందరాంశ్చ |
ఉద్విగ్నచేతాః సహ లక్ష్మణేన
విచార్య దుఃఖోపహతః ప్రతస్థే || ౧౨౭ ||

తం మత్తమాతంగవిలాసగామీ
గచ్ఛంతమవ్యగ్రమనా మహాత్మా |
స లక్ష్మణో రాఘవమప్రమత్తో
రరక్ష ధర్మేణ బలేన చైవ || ౧౨౮ ||

తావృశ్యమూకస్య సమీపచారీ
చరన్ దదర్శాద్భుతదర్శనీయౌ |
శాఖామృగాణామధిపస్తరస్వీ
వితత్రసే నైవ చిచేష్ట కించిత్ || ౧౨౯ ||

స తౌ మహాత్మా గజమందగామి
శాఖామృగస్తత్ర చిరం చరంతౌ |
దృష్ట్వా విషాదం పరమం జగామ
చింతాపరీతో భయభారమగ్నః || ౧౩౦ ||

తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం
సదైవ శాఖామృగసేవితాంతమ్ |
త్రస్తాశ్చ దృష్ట్వా హరయోఽభిజగ్ముః
మహౌజసౌ రాఘవలక్ష్మణౌ తౌ || ౧౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమః సర్గః || ౧ ||

Kishkindha Kanda Sarga 1 Meaning In Telugu

రామ లక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సునిండా పద్మములు,కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండి పోయింది.

“లక్ష్మణా! ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో. కాని సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దు:ఖమును ఎక్కువ చేస్తున్నాయి. నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో! కాని లక్ష్మణా! ఈ వనములో ఉన్న పుష్పముల మీదినుండి వీచు గాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించినది.

లక్ష్మణా! ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకూ వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా! ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా! పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు, ఈ మలయమారుతము, వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీత తో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివిదీరా అనుభవించేవాడిని కదా!

లక్ష్మణా! సీత బతికి ఉంటే, సీత ఉన్న చోటున కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా! సీత కూడా నా మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా! నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా! అవును. ఈ మనోహర దృశ్యములు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు. ఎందుకంటే నేను, సీత దేహాలు వేరైనా మా మనసులు ఒకటే. నా మనస్సు ఆమె మీద, ఆమె మనస్సు నా మీదా లగ్నం అయి ఉన్నాయి.

లక్ష్మణా! నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతము నాకు అగ్ని వీచికలవలె తాకుతూ ఉన్నాయి. లక్ష్మణా! చూచావా! ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో! నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదూ! సీతకు పద్మములు అంటే ఎంతో ఇష్టం. ఈ పంపా సరోవరములో ఉన్న పద్మములను చూచి సీత ఎంత సంతోషించేదో కదా! సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకున్నాను.

లక్ష్మణా! సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ యే వస్తువులు, దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు, అవే దృశ్యములు ఇప్పుడు నాకు భేదాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మణా! సీత నాకు కనపడితే, సీతతో సహా నేను ఇక్కడనే స్థిరనివాసము ఏర్పరచు కొనవలెనని కోరికగా ఉంది. సీతతో సహా ఇక్కడ ఉంటే, నాకు దేవేంద్రపదవి కూడా అక్కరలేదు అనిపిస్తూ ఉంది. అయోధ్యకు కూడా తిరిగి వెళ్లను. ఇక్కడే ఉండిపోతాను. ఈ వనసీమలలో, ఈ సరోవర తీరములలో, పచ్చికబయళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే, నాకు ఏ చింతా ఉండదు. ఏ వస్తువూ కావాలని అనిపించదు. ఈ అందమైన పంపాసరస్సులో నేను సీత జలకాలాడటం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు.

లక్ష్మణా! నేను లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా! ఏమో! ఆలోచించే కొద్దీ నా మనసు వికలం అవుతూ ఉంది. సీత తండ్రి జనకమహారాజు వచ్చి నా సీత ఏదీ అని అడిగితే ఏమని చెప్పాలో అర్థంకావడం లేదు. నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులకు వచ్చాను. సీత కూడా నా వెంట రావాలా! ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా! అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి! రాజ్యభ్రష్టుడు, బుద్ధిలేని వాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది!

లక్ష్మణా!సీత ఎంత మధురంగా మాట్లాడేది. నాతో పరిహాసమాడేది. అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా! నాతో పాటు అడవిలో ఎన్నో కష్టములు అనుభవించుచున్నా. సీత తాను ఏ కష్టములు పడనట్టుగా ఆనందించుచున్నట్టు కనపడేది. నా తో ఎంతో సంతోషంగా మాటలాడుతూ ఉండేది. అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే, నా తల్లి కౌసల్య “రామా! నా కోడలు సీత ఎక్కడ. ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు”అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పాలి.

ఓ లక్ష్మణా! నేనుసీత లేకుండా అయోధ్యకు రాలేదు. కాబట్టి నీవు ఒంటరిగా అయోధ్యకు వెళ్లు. నేను ఈ అరణ్యములలోనే సీతా వియోగంతో ఆ తనువు చాలిస్తాను.” అని విలపించాడు రాముడు.

ఆ మాటలు అన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు. “ఓ రామా! ఉ త్తమకులములో పుట్టిన వాడవు. అమిత పరాక్రమవంతుడవు. నీవే ఇలా అధైర్యపడితే ఎలా! నీ వంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారము మందబుద్ధితో ఆలోచించడం శోభించదు. రామా! మనకు ఎక్కువ ప్రియమైన వాళ్లు దూరమైనపుడు దుఃఖముకలగడం సహజము. దానికి ఉపాయం వెతకాలి కానీ, ఇలా దు:ఖించడం వలన ప్రయోజనము లేదు. ముందు మనము ఆ రావణునిజాడ కనుక్కోవాలి. వాడు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వాడిని వదిలేది లేదు. వాడు సీతను తెచ్చి అప్పగించాలి. లేకపోతే మనచేతిలో చావాలి.

అన్నిటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి. ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి. కార్యరంగంలోకి దూకాలి. దానికి తగిన ఉత్సాహమును తెచ్చుకోవాలి. మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు. కాబట్టి రామా! నీవుకూడా ఉత్సాహమును తెచ్చుకో. సీతను తిరిగి సాధించుటకు ప్రయత్నము చెయ్యి. నీ పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ శోకాన్ని పక్కనపెట్టు. మనస్సును నిగ్రహించుకో.” అని రామునికి హితబోధ చేసాడు లక్ష్మణుడు.

లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు. ధైర్యము, ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు పంపాసరోవరమును దాటారు.

వీరిద్దరినీ ఋష్యమూక పర్వతము పైనుండి సుగ్రీవుడు అనే వానర రాజు చూస్తున్నాడు. సుగ్రీవునికి భయం పట్టుకుంది. ఆ మానవులు ఇద్దరూ వాలి పంపగా తనకోసం వచ్చారేమో, తనను చంపుతారేమో అని భయపడ్డాడు. ఆ భయంతో కుంగిపోయాడు సుగ్రీవుడు. వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానరులతో సహా అక్కడి నుండి పారిపోయాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము మొదటి సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ ద్వితీయః సర్గః (2)>>

Aranya Kanda Sarga 58 In Telugu – అరణ్యకాండ అష్టపంచాశః సర్గః

Aranya Kanda Sarga 58 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58వ సర్గ), రాముడు లక్ష్మణుడితో కలిసి సీత కోసం ఆత్రంగా అన్వేషణ చేస్తూ, మార్గమధ్యంలో జటాయువును కలుస్తాడు. జటాయువు, రావణుడు సీతను అపహరించిన విషయాన్ని రాముడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. తన చివరి శ్వాసలో జటాయువు సీత అపహరణ వివరాలు చెప్పి మరణిస్తాడు. జటాయువు త్యాగానికి రాముడు దుఃఖిస్తూ, అతనికి అర్హమైన అంత్యక్రియలు నిర్వహిస్తాడు.

అనిమిత్తదర్శనమ్

స దృష్ట్వా లక్ష్మణం దీనం శూన్యే దశరథాత్మజః |
పర్యపృచ్ఛత ధర్మాత్మా వైదేహీమాగతం వినా ||

1

ప్రస్థితం దండకారణ్యం యా మామనుజగామ హ |
క్వ సా లక్ష్మణ వైదేహీ యాం హిత్వా త్వమిహాగతః ||

2

రాజ్యభ్రష్టస్య దీనస్య దండకాన్ పరిధావతః |
క్వ సా దుఃఖసహాయా మే వైదేహీ తనుమధ్యమా ||

3

యాం వినా నోత్సహే వీర ముహూర్తమపి జీవితుమ్ |
క్వ సా ప్రాణసహాయా మే సీతా సురసుతోపమా ||

4

పతిత్వమమరాణాం వా పృథివ్యాశ్చాపి లక్ష్మణ |
తాం వినా తపనీయాభాం నేచ్ఛేయం జనకాత్మజామ్ ||

5

కచ్చిజ్జీవతి వైదేహీ ప్రాణైః ప్రియతరా మమ |
కచ్చిత్ప్రవాజనం సౌమ్య న మే మిథ్యా భవిష్యతి ||

6

సీతానిమిత్తం సౌమిత్రే మృతే మయి గతే త్యయి |
కచ్చిత్సకామా సుఖితా కైకేయీ సా భవిష్యతి ||

7

సపుత్రరాజ్యాం సిద్ధార్థాం మృతపుత్రా తపస్వినీ |
ఉపస్థాస్యతి కౌసల్యా కచ్చిత్సౌమ్య న కేకయీమ్ ||

8

యది జీవతి వైదేహీ గమిష్యామ్యాశ్రమం పునః |
సువృత్తా యది వృత్తా సా ప్రాణాంస్త్యక్ష్యామి లక్ష్మణ ||

9

యది మామాశ్రమగతం వైదేహీ నాభిభాషతే |
పునః ప్రహసితా సీతా వినశిష్యామి లక్ష్మణ ||

10

బ్రూహి లక్ష్మణ వైదేహీ యది జీవతి వా న వా |
త్వయి ప్రమత్తే రక్షోభిర్భక్షితా వా తపస్వినీ ||

11

సుకుమారీ చ బాలా చ నిత్యం చాదుఃఖదర్శినీ |
మద్వియోగేన వైదేహీ వ్యక్తం శోచతి దుర్మనాః ||

12

సర్వథా రక్షసా తేన జిహ్మేన సుదురాత్మనా |
వదతా లక్ష్మణేత్యుచ్చైస్తవాపి జనితం భయమ్ ||

13

శ్రుతస్తు శంకే వైదేహ్యా స స్వరః సదృశో మమ |
త్రస్తయా ప్రేషితస్త్వం చ ద్రష్టుం మాం శీఘ్రమాగతః ||

14

సర్వథా తు కృతం కష్టం సీతాముత్సృజతా వనే |
ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరమ్ ||

15

దుఃఖితాః ఖరఘాతేన రాక్షసాః పిశితాశనాః |
తైః సీతా నిహతా ఘోరైర్భవిష్యతి న సంశయః ||

16

అహోఽస్మిన్ వ్యసనే మగ్నః సర్వథా శత్రుసూదన |
కింన్విదానీం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమీదృశమ్ ||

17

ఇతి సీతాం వరారోహాం చంతయన్నేవ రాఘవః |
ఆజగామ జనస్థానం త్వరయా సహలక్ష్మణః ||

18

విగర్హమాణోఽనుజమార్తరూపం
క్షుధా శ్రమాచ్చైవ పిపాసయా చ |
వినిఃశ్వసన్ శుష్కముఖో వివర్ణః
ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యమ్ ||

19

స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీరో
విహారదేశాననుసృత్య కాంశ్చిత్ |
ఏతత్తదిత్యేవ నివాసభూమౌ
ప్రహృష్టరోమా వ్యథితో బభూవ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 58 Meaning In Telugu

అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసిందిచెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు.

“లక్ష్మణా! నేను నిన్నుసీతకు రక్షణగా ఉంచాను కదా! నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది.? పర్ణశాలలో క్షేమంగా ఉందా! ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా! మరి నా సీత ఎక్కడుందో చెప్పవా?

లక్ష్మణా! నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేసావు? సీత జీవించి ఉంటుందంటావా! నా సీత మరణిస్తే, ఆమె దుఃఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా!

లక్ష్మణా! నిజంచెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించక పోతే నేను బతికి ఉండీ వృధా! లక్ష్మణా! సీత ఇంకా జీవించి ఉందంటావా! లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా! ఒకవేళ సీత బతికి ఉంటే, నా వియోగబాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా!

లక్ష్మణా! మారీచుడు హా లక్ష్మణా! అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా! నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా! లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలి వచ్చావా!

ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. నీవు రావడంతో రాక్షసులకు మన మీద పగ తీర్చుకోడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే, నేను ఖరుడిని, దూషణుడిని, రాక్షసులను చంపానుకదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూచి రాక్షసులుసీతను చంపి ఉంటారు!

లక్ష్మణా! చూచావా! అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో! ఇదంతా నా పూర్వజన్మ పాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా!” అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడి వడిగా ఆశ్రమం వేపు నడుస్తున్నావు రాముడు.

రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు. నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసి పోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టు పక్కల సీత కోసం ఆతురతగా వెదుకుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు.

“లక్ష్మణా! నేను అనుకున్నట్లే జరిగింది.” అని రోదిస్తున్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనషష్టితమః సర్గః (59) >>

Ayodhya Kanda Sarga 90 In Telugu – అయోధ్యాకాండ నవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 90

అయోధ్యాకాండలోని నవతితమః సర్గ అంటే 90వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని పాదుకలను సత్కారంతో తీసుకొని, సపరివారం అయోధ్యకు తిరిగి వచ్చాడు. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటి మార్గదర్శకత్వంలో రాజ్యాన్ని పాలిస్తానని ప్రతిజ్ఞ చేయడు. భరతుడు తన తండ్రి దశరథ మహారాజు మరణం, రాముని అరణ్యవాసం వంటి ఘోర సంఘటనల కారణంగా మనోవ్యధతో బాధపడతాడు. అతను నందిగ్రామంలో నివసిస్తూ, తాను రాముని ప్రతినిధిగా మాత్రమే ఉండి, రాముడు తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. ప్రజలందరూ భరతుని ధర్మనిష్ఠ, విధేయతను ప్రశంసిస్తూ, రాముడు తిరిగి వచ్చే రోజును ఎదురుచూస్తారు.

భరద్వాజాశ్రమనివాసః

భరద్వాజాశ్రమం దృష్ట్వా క్రోశాదేవ నరర్షభః |
బలం సర్వమవస్థాప్య జగామ సహమంత్రిభిః || ౧ ||

పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్రపరిచ్ఛదః |
వసానో వాససీ క్షౌమే పురోధాయ పురోధసమ్ || ౨ ||

తతః సందర్శనే తస్య భరద్వాజస్య రాఘవః |
మంత్రిణస్తానవస్థాప్య జగామానుపురోహితమ్ || ౩ ||

వసిష్ఠమథ దృష్ట్వైవ భరద్వాజో మహాతపాః |
సంచచాలాసనాత్తూర్ణం శిష్యానర్ఘ్యమితి బ్రువన్ || ౪ ||

సమాగమ్య వసిష్ఠేన భరతేనాభివాదితః |
అబుధ్యత మహాతేజాః సుతం దశరథస్య తమ్ || ౫ ||

తాభ్యామర్ఘ్యం చ పాద్యం చ దత్త్వా పశ్చాత్ఫలాని చ |
ఆనుపూర్వ్యాచ్ఛ ధర్మజ్ఞః పప్రచ్ఛ కుశలం కులే || ౬ ||

అయోధ్యాయాం బలే కోశే మిత్రేష్వపి చ మంత్రిషు |
జానన్ దశరథం వృత్తం న రాజానముదాహరత్ || ౭ ||

వసిష్ఠో భరతశ్చైనం పప్రచ్ఛతురనామయమ్ |
శరీరేఽగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు || ౮ ||

తథేతి తత్ప్రతిజ్ఞాయ భరద్వాజో మహాతపాః |
భరతం ప్రత్యువాచేదం రాఘవస్నేహబంధనాత్ || ౯ ||

కిమిహాగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః |
ఏతదాచక్ష్వ మే సర్వం నహి మే శుద్ధ్యతే మనః || ౧౦ ||

సుషువే యమమిత్రఘ్నం కౌసల్యాఽనందవర్ధనమ్ |
భ్రాత్రా సహ సభార్యో యశ్చిరం ప్రవ్రాజితో వనమ్ || ౧౧ ||

నియుక్తః స్త్రీనియుక్తేన పిత్రా యోఽసౌ మహాయశాః |
వనవాసీ భవేతీహ సమాః కిల చతుర్దశ || ౧౨ ||

కచ్ఛిన్న తస్యాపాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి |
అకణ్టకం భోక్తుమనాః రాజ్యం తస్యానుజస్య చ || ౧౩ ||

ఏవముక్తో భరద్వాజం భరతః ప్రత్యువాచ హ |
పర్యశ్రునయనో దుఃఖాద్వాచా సంసజ్జమానయా || ౧౪ ||

హతోఽస్మి యది మామేవం భగవానపి మన్యతే |
మత్తో న దోషమాశంకే నైవం మామనుశాధి హి || ౧౫ ||

న చైతదిష్టం మాతా మే యదవోచన్మదంతరే |
నాహమేతేన తుష్టశ్చ న తద్వచనమాదదే || ౧౬ ||

అహం తు తం నరవ్యాఘ్రముపయాతః ప్రసాదకః |
ప్రతినేతుమయోధ్యాం చ పాదౌ తస్యాభివందితుమ్ || ౧౭ ||

త్వం మామేవంగతం మత్వా ప్రసాదం కర్తుమర్హసి |
శంస మే భగవన్రామః క్వ సంప్రతి మహీపతిః || ౧౮ ||

వసిష్ఠాదిభిరృత్విగ్భిర్యాచితో భగవాంస్తతః |
ఉవాచ తం భరద్వాజః ప్రసాదాద్భరతం వచః || ౧౯ ||

త్వయ్యేతత్పురుషవ్యాఘ్ర యుక్తం రాఘవవంశజే |
గురువృత్తిర్దమశ్చైవ సాధూనాం చానుయాయితా || ౨౦ ||

జానే చైతన్మనఃస్థం తే దృఢీకరణమస్త్వితి |
అపృచ్ఛం త్వాం తథాఽత్యర్థం కీర్తిం సమభివర్ధయన్ || ౨౧ ||

జానే చ రామం ధర్మజ్ఞం ససీతం సహలక్ష్మణమ్ |
అసౌ వసతి తే భ్రాతా చిత్రకూటే మహాగిరౌ || ౨౨ ||

శ్వస్తు గంతాసి తం దేశం వసాద్య సహ మంత్రిభిః |
ఏతన్మే కురు సుప్రాజ్ఞ కామం కామార్థకోవిద || ౨౩ ||

తతస్తథేత్యేవముదారదర్శనః
ప్రతీతరూపో భరతోఽబ్రవీద్వచః |
చకార బుద్ధిం చ తదా తదాశ్రమే
నిశానివాసాయ నరాధిపాఽత్మజః || ౨౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవతితమః సర్గః || ౯౦ ||

Ayodhya Kanda Sarga 90 Meaning In Telugu

భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వసిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా, తన మంత్రులు వెనక రాగా, కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు.

భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వసిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వసిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చిసత్కరించాడు. భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికీ ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమ వాసులు ఏ బాధా లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా!” అని అడిగాడు భరతుడు.

“మహారాజా! మాకు ఏ బాధా లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్లాడు. అదినాకు తెలుసు. కాని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు. రామునికి ఏదైనా అపకారము తలపెడుతున్నావా? లేకపోతే రాజ్యమును విడిచి ఇక్కడకు రావడానికి కారణమేమి?” అని అడిగాడు భరద్వాజుడు.

భరద్వాజుడు కూడా తనను అనుమానించడం చూచి తట్టుకోలేకపోయాడు భరతుడు. తన తల్లి చేసిన పాపపు పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాడు అని అనుకున్నాడు మనసులో. భరద్వాజునితో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! తమరు కూడా నన్ను అనుమానిస్తే నాకు ఇంక మరణమే శరణ్యము. రాముని అరణ్యవాసములో నా ప్రమేయము ఎంతమాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఆ సమయములో నేను అయోధ్యలో లేను. నేను లేని సమయమున నా తల్లి కైక నా తండ్రిని అనుచితములైన వరములు కోరి నాకు ఇంత చేటు తెచ్చిపెట్టినది. రాముని అడవులపాలు చేసినది. నాకు రాజ్యము లభిస్తుంది అని నాకు ఎంత మాత్రము సంతోషముగా లేదు. నా తల్లి కోరికను నేను అనుమతించను. ఆచరించను.

ప్రస్తుతము నేను ఇక్కడకువచ్చినకారణము… రాముని ప్రార్థించి, అర్థించి, అయోధ్యకు తీసుకొని వెళ్లి ఆయనకు పట్టాభిషేకము జరిపించడం. అదే నా ప్రధమ కర్తవ్యం. కాబట్టి రాముడు ప్రస్తుతము ఎక్కడ ఉన్నాడో నాకు తెలుపండి.”అని అడిగాడు. భరతుని మాటలు విన్న భరద్వాజుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు.

“రాకుమారా! నీవు ఇక్ష్యాకు వంశములో పుట్టవలసినవాడవు. ధర్మాత్ముడవు. ధర్మము కోసరం అయాచితముగా వచ్చిన రాజ్యమును త్యజిస్తున్నావు. మరింత శ్లాఘనీయుడవు. నీ మనసులో మాట నాకు తెలియును. కానీ నీ శీలమును పదిమందికి తెలియజేయుట కొరకు ఆవిధంగా అడిగాను. ఇప్పుడు నీ ధర్మప్రవర్తన లోకమునకు వెల్లడి అయింది. రాముడు, లక్ష్మణుడు సీత ఎక్కడ ఉన్నారో నాకు తెలియును. ప్రస్తుతము వారు చిత్రకూట పర్వతము మీద నివసిస్తున్నారు. నీవు ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు చిత్రకూటమునకు వెళ్లవచ్చును.” అని పలికాడు భరద్వాజుడు. భరద్వాజుని మాట మన్నించి భరతుడు ఆ రాత్రికి ఆయన ఆశ్రమములోనే విశ్రాంతి తీసుకున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకనవతితమః సర్గః (91) >>

Aranya Kanda Sarga 57 In Telugu – అరణ్యకాండ సప్తపంచాశః సర్గః

Aranya Kanda Sarga 57 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57వ సర్గ), సీతను కనిపెట్టలేక రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాన్ని మరింత విస్తృతంగా పరిశీలిస్తాడు. సీత కోసం ఈ ఇద్దరూ నిరంతరంగా అన్వేషణ చేస్తారు. రాముడు తన వ్యాకులతతో, సీత లేకుండా జీవించడం అసాధ్యమని భావిస్తాడు. లక్ష్మణుడు రాముని ధైర్యం చెప్పి, సీతను కనుగొనడం కోసం మరింత కృషి చేస్తాడు. అరణ్యంలో అనేక రాక్షసులను ఎదుర్కొంటారు, కానీ సీతను కనుగొనలేరు.

రామప్రత్యాగమనమ్

రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణమ్ |
నిహత్య రామో మారీచం తూర్ణం పథి నివర్తతే ||

1

తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీమ్ |
క్రూరస్వనోఽథ గోమాయుర్విననాదాస్య పృష్ఠతః ||

2

స తస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణమ్ |
చింతయామాస గోమాయోః స్వరేణ పరిశంకితః ||

3

అశుభం బత మన్యేఽహం గోమాయుర్వాశ్యతే యథా |
స్వస్తి స్యాదపి వైదేహ్యా రాక్షసైర్భక్షణం వినా ||

4

మారీచేన తు విజ్ఞాయ స్వరమాలంబ్య మామకమ్ |
విక్రుష్టం మృగరుపేణ లక్ష్మణః శృణుయాద్యది ||

5

స సౌమిత్రిః స్వరం శ్రుత్వా తాం చ హిత్వా చ మైథిలీమ్ |
తయైవ ప్రహితః క్షిప్రం మత్సకాశమిహైష్యతి ||

6

రాక్షసైః సహితైర్నూనం సీతాయా ఈప్సితో వధః |
కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మామ్ ||

7

దూరం నీత్వా తు మారీచో రాక్షసోఽభూచ్ఛరాహతః |
హా లక్ష్మణ హతోఽస్మీతి యద్వాక్యం వ్యాజహార చ ||

8

అపి స్వస్తి భవేత్తాభ్యాం రహితాభ్యాం మహావనే |
జనస్థాననిమిత్తం హి కృతవైరోఽస్మి రాక్షసైః ||

9

నిమిత్తాని చ ఘోరాణి దృశ్యంతేఽద్య బహూని చ |
ఇత్యేవం చింతయన్ రామః శ్రుత్వా గోమాయునిఃస్వనమ్ ||

10

ఆత్మనశ్చాపనయనాన్ మృగరూపేణ రక్షసా |
ఆజగమ జనస్థానం రాఘవః పరిశంకితః ||

11

తం దీనమనసో దీనమాసేదుర్మృగపక్షిణః |
సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుః స్వరాన్ ||

12

తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాణి రాఘవః |
న్యవర్తతాథ త్వరితో జవేనాశ్రమమాత్మనః ||

13

స తు సీతాం వరారోహాం లక్ష్మణం చ మహాబలమ్ |
ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః ||

14

తతో లక్ష్మణమాయాంతం దదర్శ విగతప్రభమ్ |
తతోఽవిదూరే రామేణ సమీయాయ స లక్ష్మణః ||

15

విషణ్ణః సువిషణ్ణేన దుఃఖితో దుఃఖభాగినా |
సంజగర్హేఽథ తం భ్రాతా జ్యేష్ఠో లక్ష్మణమాగతమ్ ||

16

విహాయ సీతాం విజనే వనే రాక్షససేవితే |
గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః ||

17

ఉవాచ మధురోదర్కమిదం పరుషమార్తిమత్ |
అహో లక్ష్మణ గర్హ్యం తే కృతం యస్త్వం విహాయ తామ్ ||

18

సీతామిహాగతః సౌమ్య కంచిత్ స్వస్తి భవేదిహ |
న మేఽస్తి సంశయో వీర సర్వథా జనకాత్మజా ||

19

వినష్టా భక్షితా వాపి రాక్షసైర్వనచారిభిః |
అశుభాన్యేవ భూయిష్ఠం యథా ప్రాదుర్భవంతి మే ||

20

అపి లక్ష్మణ సీతాయాః సామగ్ర్యం ప్రాప్నుయావహే |
జీవంత్యాః పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై ||

21

యథా వై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవమ్ |
వాశ్యంతే శకునాశ్చాపి ప్రదీప్తామభితో దిశమ్ |
అపి స్వస్తి భవేత్తస్యా రాజపుత్ర్యా మహాబల ||

22

ఇదం హి రక్షో మృగసన్నికాశం
ప్రలోభ్య మాం దూరమనుప్రయాతమ్ |
హతం కథంచిన్మహతా శ్రమేణ
స రాక్షసోఽభూన్మ్రియమాణ ఏవ ||

23

మనశ్చ మే దీనమిహాప్రహృష్టం
చక్షుశ్చ సవ్యం కురుతే వికారమ్ |
అసంశయం లక్ష్మణ నాస్తి సీతా
హృతా మృతా వా పథి వర్తతే వా ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 57 Meaning In Telugu PDF

లంకలో సీత పరిస్థితి ఇలాఉంటే, అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు, వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకున సూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణా అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి.

“అయ్యో! ఆ అరుపులు నావి అనుకొని, నాకేమైనా ఆపద కలిగిందని శంకించి, సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా! ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో! అవును ఇప్పుడు అంతా అర్థం అయింది. ఇది రాక్షసులు మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకొని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినపుడు హా సీతా! హా లక్ష్మణా! అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది.

నేను, లక్ష్మణుడు, దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా! అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో!దానికి తోడు అప శకునములు కూడా కనపడుతున్నాయి.” ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడి వడిగా వస్తున్నాడు.

ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి లక్ష్మణుని గురించి వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనను వెదుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది. దానితో పాటు దుఃఖం కూడా వచ్చింది. లక్ష్మణుని చేతులుపట్టుకొని ఇలా అన్నాడు.

“నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను. కానీ నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచి వచ్చావు. అలా ఎందుకు చేసావు. ఇంకా సీత క్షేమంగా ఉందంటావా? లక్ష్మణా! నాకు అన్నీ అపశకునములు కనపడుతున్నాయి. సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది. లేదా సీత సంహరింపబడి ఉంటుంది. రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు. ఇందులో సందేహం ఉండటానికి వీలు లేదు.

లక్ష్మణా! మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలము అంటావా! ఆ మృగాల అరుపులు, నక్కల కూతలు వింటుంటే సీత క్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది.

అసలు జరిగిందేమిటంటే, సీత ఆ మృగము కావాలని కోరిన తరువాత నేను ఆ మృగమును వెంబడించాను. ఆ మృగాన్ని నా బాణంతో కొట్టాను. నా బాణం తగిలిన ఆ మృగం పెద్దరాక్షసునిగా మారిపోయింది. అప్పుడు అర్థం అయింది అది రాక్షస మాయ అని. అందుకే అంటున్నాను.

ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి. లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒక వేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే, ఎంతో దూరం వెళ్లి ఉ డరు. మార్గ మధ్యంలోనే ఉంటారు.” అని రాముడు తనలో తాను అనుకుంటూ వడి వడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. అక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Aranya Kanda Sarga 56 In Telugu – అరణ్యకాండ షట్పంచాశః సర్గః

Aranya Kanda Sarga 56 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56వ సర్గ), సీతను రక్షించేందుకు రాముడు పంచవటిని చుట్టుముట్టి అన్వేషిస్తాడు, అనేక రాక్షసులను ఎదుర్కొంటాడు. సీతను కనుగొనలేక, రాముడు లక్ష్మణుడితో కలిసి మరింత విస్తృతంగా వెతుకుతాడు. ఈ సమయంలో, రాముడు సీత కోసం విచారంగా పాటలు పాడుతాడు. సీత కోసం తన ప్రాణాలను అర్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

వత్సరావధికరణమ్

సా తథోక్తా తు వైదేహీ నిర్భయా శోకకర్శితా |
తృణమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత ||

1

రాజా దశరథో నామ ధర్మసేతురివాచలః |
సత్యసంధః పరిజ్ఞాతో యస్య పుత్రః స రాఘవః ||

2

రామో నామ స ధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః |
దీర్ఘబాహుర్విశాలాక్షో దైవతం హి పతిర్మమ ||

3

ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతిః |
లక్ష్మణేన సహ భ్రాత్రా యస్తే ప్రాణాన్ హరిష్యతి ||

4

ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా స్యాం ధర్షితా బలాత్ |
శయితా త్వం హతః సంఖ్యే జనస్థానే యథా ఖరః ||

5

య ఏతే రాక్షసాః ప్రోక్తా ఘోరరూపా మహాబలాః |
రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పన్నగా యథా ||

6

తస్య జ్యావిప్రముక్తాస్తే శరాః కాంచనభూషణాః |
శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయః ||

7

అసురైర్వా సురైర్వా త్వం యద్యవధ్యోఽసి రావణ |
ఉత్పాద్య సుమహద్వైరం జీవంస్తస్య న మోక్ష్యసే ||

8

స తే జీవితశేషస్య రాఘవోంతకరో బలీ |
పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభమ్ ||

9

యది పశ్యేత్ స రామస్త్వాం రోషదీప్తేన చక్షుషా |
రక్షస్త్వమద్య నిర్దగ్ధో గచ్ఛేః సద్యః పరాభవమ్ ||

10

యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేత వా |
సాగరం శోషయేద్వాపి స సీతాం మోచయేదిహ ||

11

గతాయుస్త్వం గతశ్రీకో గతసత్త్వో గతేంద్రియః |
లంకా వైధవ్యసంయుక్తా త్వత్కృతేన భవిష్యతి ||

12

న తే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి |
యాఽహం నీతా వినాభావం పతిపార్శ్వాత్త్వయా వనే ||

13

స హి దైవతసంయుక్తో మమ భర్తా మహాద్యుతిః |
నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యో వసతి దండకే ||

14

స తే దర్పం బలం వీర్యముత్సేకం చ తథావిధమ్ |
అపనేష్యతి గాత్రేభ్యః శరవర్షేణ సంయుగే ||

15

యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః |
తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశం గతాః ||

16

మాం ప్రధృష్య స తే కాలః ప్రాప్తోఽయం రాక్షసాధమ |
ఆత్మనో రాక్షసానాం చ వధాయాంతఃపురస్య చ ||

17

న శక్యా యజ్ఞమధ్యస్థా వేదిః స్రుగ్భాండమండితా |
ద్విజాతిమంత్రపూతా చ చండాలేనావమర్దితుమ్ ||

18

తథాఽహం ధర్మనిత్యస్య ధర్మపత్నీ పతివ్రతా |
త్వయా స్ప్రష్టుం న శక్యాఽస్మి రాక్షసాధమ పాపినా ||

19

క్రీడంతీ రాజహంసేన పద్మషండేషు నిత్యదా |
హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకమ్ ||

20

ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధ వా ఖాదయస్వ వా |
నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస ||

21

న తు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః |
ఏవముక్త్వా తు వైదేహీ క్రోధాత్ సుపరుషం వచః ||

22

రావణం మైథిలీ తత్ర పునర్నోవాచ కించన |
సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణమ్ ||

23

ప్రత్యువాచ తతః సీతాం భయసందర్శనం వచః |
శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని ||

24

కాలేనానేన నాభ్యేషి యది మాం చారుహాసిని |
తతస్త్వాం ప్రాతరాశార్థం సూదాశ్ఛేత్స్యంతి లేశశః ||

25

ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణః శత్రురావణః |
రాక్షసీశ్చ తతః క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ ||

26

శీఘ్రమేవ హి రాక్షస్యో వికృతా ఘోరదర్శనాః |
దర్పమస్యా వినేష్యధ్వం మాంసశోణితభోజనాః ||

27

వచనాదేవ తాస్తస్య సుఘోరా రాక్షసీగణాః |
కృతప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్ ||

28

స తాః ప్రోవాచ రాజా తు రావణో ఘోరదర్శనః |
ప్రచాల్య చరణోత్కర్షైర్దారయన్నివ మేదినీమ్ ||

29

అశోకవనికామధ్యే మైథిలీ నీయతామియమ్ |
తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారితా ||

30

తత్రైనాం తర్జనైర్ఘోరైః పునః సాంత్వైశ్చ మైథిలీమ్ |
ఆనయధ్వం వశం సర్వా వన్యాం గజవధూమివ ||

31

ఇతి ప్రతిసమాదిష్టా రాక్షస్యో రావణేన తాః |
అశోకవనికాం జగ్ముర్మైథిలీం ప్రతిగృహ్య తు ||

32

సర్వకాలఫలైర్వృక్షైర్నానాపుష్పఫలైర్వృతామ్ |
సర్వకాలమదైశ్చాపి ద్విజైః సముపసేవితామ్ ||

33

సా తు శోకపరీతాంగీ మైథిలీ జనకాత్మజా |
రాక్షసీవశమాపన్నా వ్యాఘ్రీణాం హరిణీ యథా ||

34

శోకేన మహతా గ్రస్తా మైథిలీ జనకాత్మజా |
న శర్మ లభతే భీరుః పాశబద్ధా మృగీ యథా ||

35

న విందతే తత్ర తు శర్మ మైథిలీ
విరూపనేత్రాభిరతీవ తర్జితా |
పతిం స్మరంతీ దయితం చ దైవతం
విచేతనాఽభూద్భయశోకపీడితా ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 56 Meaning In Telugu

తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకూ రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలాఅంది..

“ఓ రావణా! ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజాను బాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు, నా భర్త. నా భర్తే నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయివేసినట్టయితే, నీసోదరుడు ఖర, దూషణులకు పట్టిన గతే నీకూపట్టి ఉండేది.

ఇందాకటినుండి, నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా! నా రాముని ధనుస్సునుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో!

నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావక పోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెరనుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది. నీ వైభవం నశించింది. నీ లంకా రాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది. అది తెలుసుకో!

నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీకు కూడా రాబోవు జన్మలలో భార్యవియోగం తప్పదు. వినాశకాలే విపరీతబుద్ధి అని నీకు పోయేకాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధిపుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞభూమిని. నన్ను నీ వంటి ఛండాలుడు తాకనుకూడా తాక జాలడు. నేను రాముని ధర్మ పత్నిని. నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలవని దానను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు.

నేను రాజహంసను. నీవు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు. చిత్రహింసలకు గురిచెయ్యి.. లేకపోతే చంపెయ్యి. నీనుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను. జాగ్రత్త!” అని పలికి తలవంచుకొని నిలుచుంది సీత.

సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు. కానీ సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు.

“ఓ సీతా! ఇంక నీవు ఏమి చెప్పినా నేను వినదలచుకోలేదు. నీకు పన్నెండు మాసాలు గడువు విధిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి, ముక్కలు ముక్కలు గా నరికించి, నాకు ఆహారంగా తయారు చేయించు కుంటాను. జాగ్రత్త!” అని పలికాడు.

సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. “మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చేయండి.” అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టు వలయాకారంలో నిలబడ్డారు.

“ఈ సీత రాజాంతఃపురములో ఉండటానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోక వనమునకు తీసుకొని వెళ్లండి. ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి. ప్రతిరోజూ ఈమెను బతిమాలో భయపెట్టో ఆమె మనసు నా మీద లగ్నం అయేట్టు చేయండి.” అని ఆదేశించాడు.

వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకొని వెళ్లారు. లంకారాజ్యములో ఉన్న అశోక వనము ఫలవృక్షములతోనూ పూల తోటలతోనూ, చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయ మానంగా ఉంది. ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండిసుకుమారంగా పెరిగిన సీత, భయంకారాకారులైన ఆ రాక్షసస్త్రీల ఆకారములు చూచి, అరుపులు విని భయంతో మూర్ఛపోయింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57) >>

Aranya Kanda Sarga 55 In Telugu – అరణ్యకాండ పంచపంచాశః సర్గః

Aranya Kanda Sarga 55 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55వ సర్గ), శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవితో కలిసి పంచవటిలో నివసిస్తున్నారు. పంచవటిలో ఉన్నప్పుడు, రావణాసురుడు హరిణి రూపంలో వచ్చి సీతను అపహరిస్తాడు. సీతను రక్షించేందుకు లక్ష్మణుడికి ఆదేశాలు ఇచ్చిన రాముడు, సీత అందుబాటులో లేకపోవడంతో విచారంలో పడతాడు.

సీతావిలోభనోద్యమః

సందిశ్య రాక్షసాన్ ఘోరాన్ రావణోఽష్టౌ మహాబలాన్ |
ఆత్మానం బుద్ధివైక్లవ్యాత్ కృతకృత్యమమన్యత ||

1

స చింతయానో వైదేహీం కామబాణసమర్పితః |
ప్రవివేశ గృహం రమ్యం సీతాం ద్రష్టుమభిత్వరన్ ||

2

స ప్రవిశ్య తు తద్వేశ్మ రావణో రాక్షసాధిపః |
అపశ్యద్రాక్షసీమధ్యే సీతాం శోకపరాయణామ్ ||

3

అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితామ్ |
వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నావమర్ణవే ||

4

మృగయూథపరిభ్రష్టాం మృగీం శ్వభిరివావృతామ్ |
అధోముఖముఖీం సీతామభ్యేత్య చ నిశాచరః ||

5

తాం తు శోకపరాం దీనామవశాం రాక్షసాధిపః |
స బలాద్దర్శయామాస గృహం దేవగృహోపమమ్ ||

6

హర్మ్యప్రాసాదసంబాధం స్త్రీసహస్రనిషేవితమ్ |
నానాపక్షిగణైర్జుష్టం నానారత్నసమన్వితమ్ ||

7

కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి |
వజ్రవైడూర్యచిత్రైశ్చ స్తంభైర్దృష్టిమనోహరైః ||

8

దివ్యదుందుభినిర్హ్రాదం తప్తకాంచనతోరణమ్ |
సోపానం కాంచనం చిత్రమారురోహ తయా సహ ||

9

దాంతికా రాజతాశ్చైవ గవాక్షాః ప్రియదర్శనాః |
హేమజాలావృతాశ్చాసంస్తత్ర ప్రాసాదపంక్తయః ||

10

సుధామణివిచిత్రాణి భూమిభాగాని సర్వశః |
దశగ్రీవః స్వభవనే ప్రాదర్శయత మైథిలీమ్ ||

11

దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ నానావృక్షసమన్వితాః |
రావణో దర్శయామాస సీతాం శోకపరాయణామ్ ||

12

దర్శయిత్వా తు వైదేహ్యాః కృత్స్నం తద్భవనోత్తమమ్ |
ఉవాచ వాక్యం పాపాత్మా సీతాం లోభితుమిచ్ఛయా ||

13

దశ రాక్షసకోట్యశ్చ ద్వావింశతిరథాపరాః |
తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణామ్ ||

14

వర్జయిత్వా జరావృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్ |
సహస్రమేకమేకస్య మమ కార్యపురఃసరమ్ ||

15

యదిదం రాజతంత్రం మే త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ |
జీవితం చ విశాలాక్షి త్వం మే ప్రాణైర్గరీయసీ ||

16

బహూనాం స్త్రీసహస్రాణాం మమ యోఽసౌ పరిగ్రహః |
తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్యా భవ ప్రియే ||

17

సాధు కిం తేఽన్యథా బుద్ధ్యా రోచయస్వ వచో మమ |
భజస్వ మాఽభితప్తస్య ప్రసాదం కర్తుమర్హసి ||

18

పరిక్షిప్తా సహస్రేణ లంకేయం శతయోజనా |
నేయం ధర్షయితుం శక్యా సేంద్రైరపి సురాసురైః ||

19

న దేవేషు న యక్షేషు న గంధర్వేషు పక్షిషు |
అహం పశ్యామి లోకేషు యో మే వీర్యసమో భవేత్ ||

20

రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుషా |
కిం కరిష్యసి రామేణ మానుషేణాల్పతేజసా ||

21

భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశస్తవ |
యౌవనం హ్యధ్రువం భీరు రమస్వేహ మయా సహ ||

22

దర్శనే మా కృథా బుద్ధిం రాఘవస్య వరాననే |
కాఽస్య శక్తిరిహాగంతుమపి సీతే మనోరథైః ||

23

న శక్యో వాయురాకాశే పాశైర్బద్ధుం మహాజవః |
దీప్యమానస్య చాప్యగ్నేర్గ్రహీతుం విమలాం శిఖామ్ ||

24

త్రయాణామపి లోకానాం న తం పశ్యామి శోభనే |
విక్రమేణ నయేద్యస్త్వాం మద్బాహుపరిపాలితామ్ ||

25

లంకాయాం సుమహద్రాజ్యమిదం త్వమనుపాలయ |
త్వత్ప్రేష్యా మద్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరాః ||

26

అభిషేకోదకక్లిన్నా తుష్టా చ రమయస్వ మామ్ |
దుష్కృతం యత్పురా కర్మ వనవాసేన తద్గతమ్ ||

27

యశ్చ తే సుకృతో ధర్మస్తస్యేహ ఫలమాప్నుహి |
ఇహ మాల్యాని సర్వాణి దివ్యగంధాని మైథిలీ ||

28

భూషణాని చ ముఖ్యాని సేవస్వ చ మయా సహ |
పుష్పకం నామ సుశ్రోణి భ్రాతుర్వైశ్రవణస్య మే ||

29

విమానం సూర్యసంకాశం తరసా నిర్జితం మయా |
విశాలం రమణీయం చ తద్విమానమనుత్తమమ్ ||

30

తత్ర సీతే మయా సార్ధం విహరస్వ యథాసుఖమ్ |
వదనం పద్మసంకాశం విమలం చారుదర్శనమ్ ||

31

శోకార్తం తు వరారోహే న భ్రాజతి వరాననే |
ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన వరాంగనా ||

32

పిధాయేందునిభం సీతా ముఖమశ్రూణ్యవర్తయత్ |
ధ్యాయంతీం తామివాస్వస్థాం దీనాం చింతాహతప్రభామ్ ||

33

ఉవాచ వచనం పాపో రావణో రాక్షసేశ్వరః |
అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ||

34

ఆర్షోఽయం దైవనిష్యందో యస్త్వామభిగమిష్యతి |
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ ||

35

ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసోఽహమస్మి తే |
ఇమాః శూన్యా మయా వాచః శుష్యమాణేన భాషితాః |
న చాపి రావణః కాంచిన్మూర్ధ్నా స్త్రీం ప్రణమేత హ ||

36

ఏవముక్త్వా దశగ్రీవో మైథీలీం జనకాత్మజామ్ |
కృతాంతవశమాపన్నో మమేయమితి మన్యతే ||

37

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 55 Meaning In Telugu

ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు, ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచంచడం మొదలెట్టాడు. సీతను తలచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంతఃపురమునకు వెళ్లాడు.

రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్లనుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమెతలవంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు ఆమెను చెయ్యిపట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంతఃపురము అంతా చూపించాడు.

రావణుని అంతఃపురము అనేక మేడలతోనూ, ప్రాసాదము లతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖ ద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి.

రావణుడు సీతను తీసుకొని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు రావణుడు. తన ఐశ్వర్యము అంతా చూచి సీత తనకు వశము అవుతుందని రావణుని భ్రమ.

“ఓ సీతా! ఈ లంకలో బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారి కందరికీ నేనే రాజును. నేను కనుసైగ చేస్తే చాలు వేయి మంది పరిచారికలు నాముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను. నా పరిచారికలు అందరూ నీ ఆజ్ఞానువర్తులు అవుతారు.

నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకొని వచ్చి నా అంతఃపురములో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నీవు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఇంకా సందేహిస్తావు ఎందుకు. వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు. నా రాణిగా ఉండు.

నాచే పరిపాలింపబడు అంకారాజ్యము నూరు యోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టు భయంకరమైన సముద్రము ఉంది. అందువలన మానవమాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు సురులు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు. ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు.

నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు. నేను లంకాధీశుడను. రాముడు ముని వృత్తిలో ఉన్నాడు. నేను రాజభోగములు అనుభవించుచున్నాను. రాముడు మానవమాత్రుడు. నేను దైవాంశసంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు. నాకు చావు లేకుండా బ్రహ్మ వరం ఉంది. ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు.

ఓ సీతా! రా! నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యౌవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము. నేటి సుఖం నేటిదే. రేపురాదు కదా!

ఓ సీతా! ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళతాడని ఆశపడుతున్నావేమో! అది ఒట్టి మాట. రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒక వేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా, నా రక్షణలో ఉన్న నిన్ను చూడటం, తాకడం, తీసుకొని వెళ్లడం అసాధ్యం.

నీవు నన్ను వరించి నా రాణివి అయితే, దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను లంకారా సింహాసనము మీదకూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము.

సీతా! నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములను, మైపూతలను తెప్పించాను. వాటిని అలంకరించుకో.

ఓ సీతా! నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్దనుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకొని వచ్చాను. ఆ విమానము అద్భుతమైనది. విశాలమైనది. నీవు నేను కలిసి పుష్పకవిమానములో విహరిద్దాము.

నేను ఇన్ని చెప్పినా, నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు. నాపట్ల ప్రసన్నంగా ఉండు.” అని పరి పరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు.

రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడటం చూచాడు రావణుడు సీతలో ఇలా అన్నాడు.

“ఓ సీతా! నీకు పెళ్లి అయిందనీ, నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందనీ అపోహ పడవద్దు. బహు భార్యాత్వము మాదిరి మా రాక్షసులలో బహుభర్తృత్వము ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులుపడవద్దు. ఓ సీతా! నాకు నీ పాదములే శరణ్యము నీ పాదములు అంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు. నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో! ఈ రావణుడు ఇంతవరకూ ఏ స్త్రీ ముందరా ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది.” అని ప్రాధేయ పడ్డాడు. లోలోపల ఇంక నాకు సీత వశము అయింది అని సంతోషంతో పొంగిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56) >>

Ayodhya Kanda Sarga 89 In Telugu – అయోధ్యాకాండ ఏకోననవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 89

అయోధ్యాకాండలోని ఏకోననవతితమః సర్గ అంటే 89వ సర్గ. ఈ సర్గలో, భరతుడు రాముని అశ్రువులతో వేడుకుంటాడు, అతని తండ్రి మరణం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించమని కోరతాడు. రాముడు తన వనవాస ప్రతిజ్ఞను విరమించలేదని భరతునికి చెప్తాడు. భరతుడు తన ప్రార్థనలు విఫలమయ్యాక, రాముని పాదుకలను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళతాడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు తాత్కాలికంగా రాజ్యాన్ని పాలించవలసిన బాధ్యతను స్వీకరిస్తాడు. భరతుడు రాముని సాక్షిగా కాబట్టి తాను పాలకుడు కాకుండా సేవకుడిగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా భరతుడు రాముని ఆజ్ఞలను పాటిస్తూ ధర్మాన్ని కాపాడతాడు.

గంగాతరణమ్

పుష్య రాత్రిం తు తత్రైవ గంగాకూలే స రాఘవః |
భరతః కాల్యముత్థాయ శత్రుఘ్నమిదమబ్రవీత్ || ౧ ||

శత్రుఘ్నోత్తిష్ఠ కిం శేషే నిషాదాధిపతిం గుహమ్ |
శీఘ్రమానయ భద్రం తే తారయిష్యతి వాహినీమ్ || ౨ ||

జాగర్మి నాహం స్వపిమి తమేవార్యం విచింతయన్ |
ఇత్యేవమబ్రవీద్భ్రాత్రా శత్రుఘ్నోఽపి ప్రచోదితః || ౩ ||

ఇతి సంవదతోరేవమన్యోన్యం నరసింహయోః |
ఆగమ్య ప్రాంజలిః కాలే గుహో భరతమబ్రవీత్ || ౪ ||

కచ్చిత్సుఖం నదీతీరేఽవాత్సీః కాకుత్స్థ శర్వరీమ్ |
కచ్చిత్తే సహసైన్యస్య తావత్సర్వమనామయమ్ || ౫ ||

గుహస్య వచనం శ్రుత్వా తత్తు స్నేహాదుదీరితమ్ |
రామస్యానువశో వాక్యం భరతోఽపీదమబ్రవీత్ || ౬ ||

సుఖా నః శర్వరీ రాజన్ పూజితాశ్చాపి తే వయమ్ |
గంగాం తు నౌభిర్బహ్వీభిర్దాశాః సంతారయంతు నః || ౭ ||

తతో గుహః సంత్వరితం శ్రుత్వా భరతశాసనమ్ |
ప్రతిప్రవిశ్య నగరం తం జ్ఞాతిజనమబ్రవీత్ || ౮ ||

ఉత్తిష్ఠత ప్రబుధ్యధ్వం భద్రమస్తు చ వః సదా |
నావః సమనుకర్షధ్వం తారయిష్యామ వాహినీమ్ || ౯ ||

తే తథోక్తాః సముత్థాయ త్వరితా రాజశాసనాత్ |
పంచనావాం శతాన్యాశు సమానిన్యుః సమంతతః || ౧౦ ||

అన్యాః స్వస్తికవిజ్ఞేయాః మహాఘంటాధరా వరాః |
శోభమానాః పతాకాభిర్యుక్తవాతాః సుసంహతాః || ౧౧ ||

తతః స్వస్తికవిజ్ఞేయాం పాండుకంబలసంవృతామ్ |
సనందిఘోషాం కళ్యాణీం గుహో నావముపాహరత్ || ౧౨ ||

తామారురోహ భరతః శత్రుఘ్నశ్చ మహాబలః |
కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా రాజయోషితః || ౧౩ ||

పురోహితశ్చ తత్పూర్వం గురవో బ్రాహ్మణాశ్చ యే |
అనంతరం రాజదారాస్తథైవ శకటాపణాః || ౧౪ ||

ఆవాసమాదీపయతాం తీర్థం చాప్యవగాహతామ్ |
భాండాని చాదదానానాం ఘోషస్త్రిదివమస్పృశత్ || ౧౫ ||

పతాకిన్యస్తు తా నావః స్వయం దాశైరధిష్ఠితాః |
వహంత్యో జనమారూఢం తదా సంపేతురాశుగాః || ౧౬ ||

నారీణామభిపూర్ణాస్తు కాశ్చిత్ కాశ్చిచ్చ వాజినామ్ |
కాశ్చిదత్ర వహంతి స్మ యానయుగ్యం మహాధనమ్ || ౧౭ ||

తాః స్మ గత్వా పరం తీరమవరోప్య చ తం జనమ్ |
నివృత్తాః కాండచిత్రాణి క్రియంతే దాశబంధుభిః || ౧౮ ||

సవైజయంతాస్తు గజాః గజారోహప్రచోదితాః |
తరంతః స్మ ప్రకాశంతే సధ్వజా ఇవ పర్వతాః || ౧౯ ||

నావస్త్వారురుహుశ్చాన్యే ప్లవైస్తేరుస్తథాపరే |
అన్యే కుంభఘటైస్తేరురన్యే తేరుశ్చ బాహుభిః || ౨౦ ||

సా పుణ్యా ధ్వజినీ గంగా దాశైః సంతారితా స్వయమ్ |
మైత్రే ముహూర్తే ప్రయయౌ ప్రయాగవనముత్తమమ్ || ౨౧ ||

ఆశ్వాసయిత్వా చ చమూం మహాత్మా
నివేశయిత్వా చ యథోపజోషమ్ |
ద్రష్టుం భరద్వాజమృషిప్రవర్యమ్
ఋత్విగ్వృతః సన్భరతః ప్రతస్థే || ౨౨ ||

స బ్రాహ్మణస్యాఽశ్రమమభ్యుపేత్య
మహాత్మనో దేవపురోహితస్య |
దదర్శ రమ్యోటజవృక్షషండమ్
మహద్వనం విప్రవరస్య రమ్యమ్ || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోననవతితమః సర్గః || ౮౯ ||

Ayodhya Kanda Sarga 89 Meaning In Telugu

భరతుని మాటలకు అక్కడున్నవారికి దు:ఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. “శత్రుఘ్నా! సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకొని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు.” అని అన్నాడు.

అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. “నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొనిపడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను.”అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు.

“రాజకుమారులారా! మీకు మీసైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా! గంగాతీరమున మీరుసుఖంగా నిద్రించారుకదా!” అని కుశల ప్రశ్నలు వేసాడు గుహుడు. “మిత్రమా! మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు.” అని అన్నాడు.

వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ పిలిచాడు. “భరతుని ఆదేశము ప్రకారము మనమందరమూ భరతుని ఆయన పరివారమును, సైన్యమును గంగానదిని దాటించవలెను. పడవలను సిద్ధం చేయండి.” అని ఆదేశించాడు.

గుహుని ఆదేశము ప్రకారము ఐదువందల పడవలను సిద్ధం చేసారు. భరతుని కోసరము బాగా అలంకరింపబడిన స్వస్తికము అనే పడవను సిద్ధం చేసాడు గుహుడు. ముందుగా వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులు ఆ పడవలో ఎక్కారు. తరువాత రాజ మాతలు ఎక్కారు. తరువాత భరతుడు, శత్రుఘ్నుడు ఎక్కారు. భరతుని వెంట వచ్చిన పరివారము, సైన్యములు వారి వారికి నియమింపబడ్డ పడవలలో ఎక్కారు. అందరూగంగానదిని క్షేమంగా దాటారు.

ఏనుగులు మొదలగు జంతువులు హాయిగా ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరాయి. మరి కొందరు ఔత్సాహికులు గంగానదిని ఈదుకుంటూ దాటారు. అందరూ ప్రయాగ వనమును చేరుకున్నారు. అందరినీ అక్కడవిడిది చేయమని చెప్పి, భరతుడు వసిష్ఠుడు మొదలగు పురోహితులతో భరద్వాజ ఆశ్రమమునకువెళ్లారు. అందరూ ఫలవృక్షములతో నిండి ఉన్న భరద్వాజ ఆశ్రమము చేరుకున్నారు.

శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
ఎనుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ నవతితమః సర్గః (90) >>

Aranya Kanda Sarga 54 In Telugu – అరణ్యకాండ చతుఃపంచాశః సర్గః

Aranya Kanda Sarga 54 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుఃపంచాశః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గంలో, రాముడు మరియు లక్ష్మణులు సీతను వెతుకుతూ శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి ఒక దివ్య భక్తురాలిగా, రాముడిని కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. రాముడు ఆమె భక్తిని, విశ్వాసాన్ని ప్రశంసిస్తూ సత్సంగం చేస్తాడు.

లంకాప్రాపణమ్

హ్రియమాణా తు వైదేహీ కంచిన్నాథమపశ్యతీ |
దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానరపుంగవాన్ ||

1

తేషాం మధ్యే విశాలాక్షీ కౌశేయం కనకప్రభమ్ |
ఉత్తరీయం వరారోహా శుభాన్యాభరణాని చ ||

2

ముమోచ యది రామాయ శంసేయురితి మైథిలీ |
వస్త్రముత్సృజ్య తన్మధ్యే నిక్షిప్తం సహభూషణమ్ ||

3

సంభ్రమాత్తు దశగ్రీవస్తత్కర్మ న స బుద్ధవాన్ |
పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరనిమిషైరివ ||

4

విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః |
స చ పంపామతిక్రమ్య లంకామభిముఖః పురీమ్ ||

5

జగామ రుదతీం గృహ్య వైదేహీం రాక్షసేశ్వరః |
తాం జహార సుసంహృష్టో రావణో మృత్యుమాత్మనః ||

6

ఉత్సంగేనేవ భుజగీం తీక్ష్ణదంష్ట్రాం మహావిషామ్ |
వనాని సరితః శైలాన్ సరాంసి చ విహాయసా ||

7

స క్షిప్రం సమతీయాయ శరశ్చాపాదివ చ్యుతః |
తిమినక్రనికేతం తు వరుణాలయమక్షయమ్ ||

8

సరితాం శరణం గత్వా సమతీయాయ సాగరమ్ |
సంభ్రమాత్పరివృత్తోర్మీ రుద్ధమీనమహోరగః ||

9

వైదేహ్యాం హ్రియమాణాయాం బభూవ వరుణాలయః |
అంతరిక్షగతా వాచః ససృజుశ్చారణాస్తదా ||

10

ఏతదంతో దశగ్రీవ ఇతి సిద్ధాస్తదాఽబ్రువన్ |
స తు సీతాం వివేష్టంతీమంకేనాదాయ రావణః ||

11

ప్రవివేశ పురీం లంకాం రూపిణీం మృత్యుమాత్మనః |
సోఽభిగమ్య పురీం లంకాం సువిభక్తమహాపథామ్ ||

12

సంరూఢకక్ష్యాబహులం స్వమంతఃపురమావిశత్ |
తత్ర తామసితాపాంగాం శోకమోహపరాయణామ్ ||

13

నిదధే రావణః సీతాం మయో మాయామివ స్త్రియమ్ |
అబ్రవీచ్చ దశగ్రీవః పిశాచీర్ఘోరదర్శనాః ||

14

యథా నేమాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యత్యసమ్మతః |
ముక్తామణిసువర్ణాని వస్త్రాణ్యాభరణాని చ ||

15

యద్యదిచ్ఛేత్తదేవాస్యా దేయం మచ్ఛందతో యథా |
యా చ వక్ష్యతి వైదేహీం వచనం కించిదప్రియమ్ ||

16

అజ్ఞానాద్యది వా జ్ఞానాన్న తస్యా జీవితం ప్రియమ్ |
తథోక్త్వా రాక్షసీస్తాస్తు రాక్షసేంద్రః ప్రతాపవాన్ ||

17

నిష్క్రమ్యాంతఃపురాత్తస్మాత్కిం కృత్యమితి చింతయన్ |
దదర్శాష్టౌ మహావీర్యాన్ రాక్షసాన్ పిశితాశనాన్ ||

18

స తాన్ దృష్ట్వా మహావీర్యో వరదానేన మోహితః |
ఉవాచైతానిదం వాక్యం ప్రశస్య బలవీర్యతః ||

19

నానాప్రహరణాః క్షిప్రమితో గచ్ఛత సత్వరాః |
జనస్థానం హతస్థానం భూతపూర్వం ఖరాలయమ్ ||

20

తత్రోష్యతాం జనస్థానే శూన్యే నిహతరాక్షసే |
పౌరుషం బలమాశ్రిత్య త్రాసముత్సృజ్య దూరతః ||

21

బలం హి సుమహద్యన్మే జనస్థానే నివేశితమ్ |
సదూషణఖరం యుద్ధే హతం రామేణ సాయకైః ||

22

తత్ర క్రోధో మమామర్షాద్ధైర్యస్యోపరి వర్తతే |
వైరం చ సుమహజ్జాతం రామం ప్రతి సుదారుణమ్ ||

23

నిర్యాతయితుమిచ్ఛామి తచ్చ వైరమహం రిపోః |
న హి లప్స్యామ్యహం నిద్రామహత్వా సంయుగే రిపుమ్ ||

24

తం త్విదానీమహం హత్వా ఖరదూషణఘాతినమ్ |
రామం శర్మోపలప్స్యామి ధనం లబ్ధ్వేవ నిర్ధనః ||

25

జనస్థానే వసద్భిస్తు భవద్భీ రామమాశ్రితా |
ప్రవృత్తిరుపనేతవ్యా కిం కరోతీతి తత్త్వతః ||

26

అప్రమాదాచ్చ గంతవ్యం సర్వైరపి నిశాచరైః |
కర్తవ్యశ్చ సదా యత్నో రాఘవస్య వధం ప్రతి ||

27

యుష్మాకం చ బలజ్ఞోఽహం బహుశో రణమూర్ధని |
అతశ్చాస్మిన్ జనస్థానే మయా యూయం నియోజితాః ||

28

తతః ప్రియం వాక్యముపేత్య రాక్షసా
మహార్థమష్టావభివాద్య రావణమ్ |
విహాయ లంకాం సహితాః ప్రతస్థిరే
యతో జనస్థానమలక్ష్యదర్శనాః ||

29

తతస్తు సీతాముపలభ్య రావణః
సుసంప్రహృష్టః పరిగృహ్య మైథిలీమ్ |
ప్రసజ్య రామేణ చ వైరముత్తమం
బభూవ మోహాన్ముదితః స రాక్షసః ||

30

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుఃపంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 54 Meaning In Telugu PDF

రావణాసురుడు సీతను తీసుకొని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండశిఖరం మీద కొంత మంది వానరులు కూర్చుని ఉండటం గమనించింది సీత.

సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు. ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు.

తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుడు, రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వేపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణదిక్కుగా వెళ్లాడు.

రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు.

నేరుగా తన అంతఃపురానికి వెళ్లాడు రావణుడు. సీతను తన అంతఃపురములో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు.

“ఈమెను నేను చెరబట్టి తీసుకొని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీలులేదు. బయట వాళ్లు పురుషులు కానీ, స్త్రీలుకానీ ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరు రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇదినా ఆజ్ఞ” అని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు.

తరువాత రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే నరమాంసమును తినే ఎనిమిది మంది రాక్షసులను పిలిచాడు.

“మీరు ఆయుధ ధారులై వెంటనే జనస్థానమునకు వెళ్లండి. అక్కడ ఇదివరకు ఖరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానములో జనస్థానములో నివసించండి. జనస్థానములో ఉన్న ఖరదూషణులను, 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధము ఏర్పడింది.

ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారము తీర్చుకోవాలి. రాముని చంపిన గాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానములో నివసిస్తూ, ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియజేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధములలో నాతో పాటు పాల్గొని మీ ధైర్యసాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్ములను ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను.” అని పలికాడు.

రావణుని మాటలను శిరస్సున దాల్చారు ఆ ఎనిమిది మంది రాక్షసులు. రావణుడికి నమస్కరించి, లంకను విడిచి జనస్థానము నకు బయలుదేరారు.

అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ ఎనిమిది మంది రాక్షసుల చేతిలో రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ పంచపంచాశః సర్గః (55) >>

Ayodhya Kanda Sarga 86 In Telugu – అయోధ్యాకాండ షడశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 86

అయోధ్యాకాండంలో షడశీతితమః సర్గ అంటే 86వ సర్గ. ఈ సర్గలో దశరథ మహారాజు శ్రీరాముని వలక పంపించడంపై దుఃఖంతో మరణిస్తాడు. ఆయన మరణం తరువాత, భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి తీవ్ర దుఃఖంలో ఉంటారు. భారతుడు, శత్రుఘ్నుడు తల్లిదండ్రుల మరణవార్త విని శోకసముద్రంలో మునిగిపోతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఇతర సకల గురువులు, మరియు మంత్రి వర్గం దశరథ మహారాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. దశరథుడి మరణం తర్వాత ప్రజలు విసిగిపోతారు. రాజ్యంలో ఈ విషాదం మహోన్నతమైన సంఘటనగా ప్రజలు బాధపడతారు. ఇది రామాయణం యొక్క ప్రధాన సంఘటనలలో ఒకటి.

గుహవాక్యమ్

ఆచచక్షేఽథ సద్భావం లక్ష్మణస్య మహాత్మనః |
భరతాయాప్రమేయాయ గుహో గహనగోచరః || ౧ ||

తం జాగ్రతం గుణైర్యుక్తం శరచాపాసిధారిణమ్ |
భ్రాతృగుప్త్యర్థమత్యంతమహం లక్ష్మణమబ్రవమ్ || ౨ ||

ఇయం తాత సుఖా శయ్యా త్వదర్థముపకల్పితా |
ప్రత్యాశ్వసి హి శేష్వాస్యాం సుఖం రాఘవనందన || ౩ ||

ఉచితోఽయం జనః సర్వో దుఃఖానాం త్వం సుఖోచితః |
ధర్మాత్మంస్తస్య గుప్త్యర్థం జాగరిష్యామహే వయమ్ || ౪ ||

న హి రామాత్ప్రియతరో మమాస్తి భువి కశ్చన |
మోత్సుకోభూర్బ్రవీమ్యేతదప్యసత్యం తవాగ్రతః || ౫ ||

అస్య ప్రసాదాదాశంసే లోకేఽస్మిన్ సుమహద్యశః |
ధర్మావాప్తిం చ విపులామర్థావాప్తిం చ కేవలామ్ || ౬ ||

సోఽహం ప్రియసఖం రామం శయానం సహ సీతయా |
రక్షిష్యామి ధనుష్పాణిః సర్వైః స్వైర్జ్ఞాతిభిః సహ || ౭ ||

న హి మేఽవిదితం కించిద్వనేఽస్మింశ్చరతః సదా |
చతురంగం హ్యపి బలం ప్రసహేమ వయం యుధి || ౮ ||

ఏవమస్మాభిరుక్తేన లక్ష్మణేన మహాత్మనా |
అనునీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యతా || ౯ ||

కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా || ౧౦ ||

యో న దేవాసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య గుహ సంవిష్టం తృణేషు సహ సీతయా || ౧౧ ||

మహతా తపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమైః |
ఏకో దశరథస్యైష పుత్రః సదృశలక్షణః || ౧౨ ||

అస్మిన్ప్రవ్రాజితే రాజా న చిరం వర్తయిష్యతి |
విధవా మేదినీ నూనం క్షిప్రమేవ భవిష్యతి || ౧౩ ||

వినద్య సుమహానాదం శ్రమేణోపరతాః స్త్రియః |
నిర్ఘోషోపరతం నూనమద్య రాజనివేశనమ్ || ౧౪ || [విరతో]

కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ |
నాశంసే యది జీవేయుః సర్వే తే శర్వరీమిమామ్ || ౧౫ ||

జీవేదపి హి మే మాతా శత్రుఘ్నస్యాన్వవేక్షయా |
దుఃఖితా యా తు కౌసల్యా వీరసూర్వినశిష్యతి || ౧౬ ||

అతిక్రాంతమతిక్రాంతమనవాప్య మనోరథమ్ |
రాజ్యే రామమనిక్షిప్య పితా మే వినశిష్యతి || ౧౭ ||

సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్కాలే హ్యుపస్థితే |
ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపమ్ || ౧౮ ||

రమ్యచత్వరసంస్థానాం సువిభక్త మహాపథామ్ |
హర్మ్యప్రాసాదసంపన్నాం సర్వరత్నవిభూషితామ్ || ౧౯ ||

గజాశ్వరథసంబాధాం తూర్యనాదవినాదితామ్ |
సర్వకల్యాణసంపూర్ణాం హృష్టపుష్టజనాకులామ్ || ౨౦ ||

ఆరామోద్యానసంపూర్ణాం సమాజోత్సవశాలినీమ్ |
సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ || ౨౧ ||

అపి సత్యప్రతిజ్నేన సార్ధం కుశలినా వయమ్ |
నివృత్తే సమయే హ్యస్మిన్ సుఖితాః ప్రవిశేమహి || ౨౨ ||

పరిదేవయమానస్య తస్యైవం సుమహాత్మనః |
తిష్ఠతో రాజపుత్రస్య శర్వరీ సాఽత్యవర్తత || ౨౩ ||

ప్రభాతే విమలే సూర్యే కారయిత్వా జటావుభౌ |
అస్మిన్ భాగీరథీతీరే సుఖం సంతారితౌ మయా || ౨౪ ||

జటా ధరౌ తౌ ద్రుమచీరవాససౌ
మహాబలౌ కుంజర యూథపోపమౌ |
వరేషుచాపాసిధరౌ పరంతపౌ
వ్యవేక్షమాణౌ సహ సీతయా గతౌ || ౨౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షడశీతితమః సర్గః || ౮౬ ||

Ayodhya Kanda Sarga 86 Meaning In Telugu

ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు. “ఓ మహారాజా! రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు.

ఆ సమయంలో నేను లక్ష్మణునితో “లక్ష్మణా! నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేసారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా! మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేలుకొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్లి నిద్రించు.

మిత్రమా లక్ష్మణా! నాకు రాముని కంటే ప్రియమైన వాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకూ రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేత బూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప్పచెప్పి నీవు వెళ్లి సుఖముగా నిద్రించు.” అని అన్నాను.

నామాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు. “మిత్రమా! నాతోపాటు రాజభోగములు అనుభవించిన రాముడు కటికనేల మీద నిద్రించుచుండగా నాకు సుఖమైన శయ్యమీద నిద్ర ఎలా పడుతుంది. అటుచూడు. హంసతూలికా తల్పము మీద శయనించ వలసిన రాముడు గడ్డి మీద పడుకొని ఉన్నాడు.

ఈ రాముడు సామాన్యుడు కాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేస్తే, ఆయాగముల ఫలితంగా రాముడు జన్మించాడు. ఈ రాముని వదిలి దశరథుడు ఎంతోకాలము జీవించలేడు. నా ఉద్దేశ్యము ప్రకారము దశరథుడు ఈ పాటికి రామ వియోగమును భరించలేక పరలోకగతుడై ఉంటాడు. నా తల్లి సుమిత్ర, రాముని తల్లి కౌసల్యకూడా రాముని విడిచి జీవించలేరు. కనీసము నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ నా తల్లి సుమిత్ర ఉండగలదేమో కాని, రాముని వదిలి కౌసల్య జీవించలేదు.

రాముని రాజ్యాభిషిక్తుని చేయలేక పోగా, అరణ్యములకు పంపిన దు:ఖంతో దశరథుడు మరణించడం తథ్యం. ఆ సమయంలో దశరథునికి ప్రేతసంస్కారములు చేయు అదృష్టము కలిగిన భరతుడు, శత్రుఘ్నుడు ధన్యులు. తరువాత భరతుడు పట్టాభిషిక్తుడగును. అందరూ సంతోషంగా ఉంటారు. కాని మేమే ఈ పదునాలుగు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టగలమా అని అనుమానము.” అని లక్ష్మణుడు ఆ రాత్రి పరి పరి విధములు గా చింతించుచూ నిద్రలేకుడా గడిపాడు.

మరునాడు సీతారామలక్ష్మణులు పడవ మీద గంగానదిని దాటారు. ఆ నావను నేనే వారికి సమకూర్చాను. రాముడు ఇక్కడే మర్రిపాలు పూసుకొని జటలు కట్టుకున్నాడు. నారచీరలు ధరించాడు. వారు గంగానదిని దాటివెళ్లిపోయారు.” అని గుహుడు భరతునికి ఆ రాత్రి జరిగిన వృత్తాంతమును వివరించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తాశీతితమః సర్గః (87) >>