Raghumaharaju Kautsudu In Telugu | రఘుమహారాజు – కౌత్సుడు

raghumaharaju-kautsudu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రఘుమహారాజు – కౌత్సుడు నీతికథ.

రఘుమహారాజు – కౌత్సుడు

పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. వరతంతుడనే ముని యొక్క గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.

శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరువేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.

గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజిత్ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టిపాత్రలలో పూలు పెట్టుకుని దైవపూజ చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “జేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.

పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్ర చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాచబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.

తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి 14 రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది?” అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురుపుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
  2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
  3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Satyasandhah In Telugu – సత్యసంధః

satyasandhah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే…సత్యసంధః నీతికథ.

సత్యసంధః

మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.

ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుజ్జెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. “పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు స్వామి. వారు “సర్వేశ్వరా! సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివి” అని తమ దైన్యత వ్యక్తపఱచినారు. కళ్ళు చెమ్మగిల్లిన స్వామి “ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదను” అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.

సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద నెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది “ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంభించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే “వ్యసనంతో” రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేద న్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది.

“పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మఱచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో పచ్చి “స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను” అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆయుధములు పట్టరాదని శాస్త్రము. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై కూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు” అని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు.

“దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం.

సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ సిగ్గు ఓరిమి తాలిమి సంయమం దయ అహింస అనసూయత త్యాగం చింతన శీలసంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు.
  2. మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దెగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మన పెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vrathalu – వ్రతాలు

Vrathalu

వ్రతములు మనస్సును ఆరోగ్యకరముగా, ధర్మప్రియముగా, సామాజిక సహజముగా నిర్వహించే మార్గములు. ఇవి ఆత్మశుద్ధి, మానసిక శాంతి, అంతర్ముఖ సౌమ్యత, సమాజ భద్రత మరియు భగవద్భక్తిని ఉన్నతముగా చేస్తాయి. వ్రతములు మన జీవితాన్ని సరళముగా, సాధారణముగా మరియు మొండిగా ఉంచుతాయి. వ్రతములు మనస్సును ద్యానంలో, ధర్మపథములో, సంయవనంలో ఉంచుతాయి.

ఇవి మన జీవితంలో నేర్పించిన ప్రతీ అదృష్టం ఒక అత్యంత ప్రాముఖ్యత మరియు అద్భుతమైన మూలకము. వ్రతములు మన మనసును సరళముగా మరియు శుద్ధిగా చేస్తాయి, మన సమాజానికి కల్యాణం, సమృద్ధి, శాంతి మరియు సౌమ్యతను అందిస్తాయి. ఏ ఏ వ్రతాలు చేస్తే ఏమి ఫలితం వస్తుంది ఈ క్రింది లింకులను అనుసరించండి.

Vrathalu – వ్రతాలు

Sukti – సూక్తి

Suktulu

సూక్తులు వేదాన్ని ఆధారం పొందిన సంహితలు, మంత్రములు. ఇవి సూక్తి, ఆదర్శాలను, ధర్మం, జ్ఞానం, అర్థం మరియు మోక్షము వంటి అంశాలను బోధిస్తాయి. సూక్తులు మనసును పరమ ధ్యానంలో ఉంచుతాయి, అంతర్ముఖ జ్ఞానంలో అనుభవం చేస్తాయి. ఇవి మన జీవితంలో శాంతి, సమాధానం మరియు సమృద్ధిని తెలుపుతాయి. సూక్తులు సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రగతిని ప్రోత్సహిస్తాయి, మన జీవితాన్ని సంతోషంగా, ప్రేమతో, ఆనందంగా నిర్వహిస్తాయి.

సూక్తులు ఆధ్యాత్మిక మార్గాన్ని మార్గదర్శకంగా చూపిస్తాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మరియు సాధారణ మనుషులుగా ఉంటే అనంత ప్రేమ మరియు గౌరవాన్ని అనుభవించగలిగే విధానమును ప్రదర్శిస్తాయి. మరిన్ని సూక్తుల కోసం ఈ క్రింద ఇవ్వబడిన లింకులను అనుసరించండి…

Suktulu – సూక్తులు

Vinayam Viveka Lakshanam In Telugu – వినయం వివేక లక్షణమ్‌

Vinayam Viveka Lakshanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… వినయం వివేక లక్షణమ్‌.

వినయం వివేక లక్షణమ్‌

పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమళాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్లీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ట మహర్షి వద సకల ళాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్తద్రుష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద బల అతిబలాది విద్యలు మజీయు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్పులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్నమును ప్రసాదించెను.

ఒక్క బాణముతో శ్రీ రామ చంద్రు మూర్తి మహాబలళాలియైన తాటకను నేలకూల్చెను. ఒకేసారి మానవాస్త్రము ఆగ్నేయాస్త్యము ప్రయోగించి సుబాహుని సంహారము చేసి మారీచుని నూరుయోజనముల దూరములో పడవేశను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విజిగెను. శ్రీ రాముడొక్కడే ప్రహరార్శకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి పధ్నాలుగు వేలసేనలను సంహరించెను.

ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలీదు. ఆ దయార్హ హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘటము. శ్రీ రాముని సైన్యము సముద్హ లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్బ్ఞుడైన రాముడు ఉపాయము ఎజిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్ర్తములనైనను శుష్కింప చేయగలదు. అయినను సముద్దునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్మబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద అప్పటికి పట్టుమని 30 రోజులుకూడాలేవు. అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్పార్భింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్సెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్టార్భించెను. ఇట్లు 3 దివసములు సముద్దునికై ప్టార్భించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి. వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాశువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్వుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్పముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం జౌషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. శ్రీ రాముడు ఎంత బలళాలి అయిననూ సముద్చునివై బలప్రదర్శనము చేయక వినయముతో ప్పార్శించెను. వినయము సజ్బనుని భూషణము.
  2. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణము. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
  3. దయాగుణం ఉత్తమగుణము. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
  4. సజ్బనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్దుని పై కినుకబూని అస్తృం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.

మరిన్ని నీతికథలు మీకోసం:

Dharmagnyah In Telugu – ధర్మజ్ఞః

Dharmagnyah

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమద్రామాయణం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ధర్మజ్ఞః నీతికథ.

ధర్మజ్ఞః

“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్నవాడై శ్రీ రామ చంద్పుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్పులతో వచ్చి ఆకాశమార్నాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్తీవుని “మిత్రమా! నీ అభిషప్పాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ముడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టము. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలళాలి. సాయుధులైన నలుగురు మంత్పులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్చేశ్యం”.

స్మితపూర్వభాషి అయిన శ్రీ రాముడు ఇట్టు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్సిన బోయవాడు ఆర్హుడైవచ్చినప్పుడు ఆకపోతరాజు బోయవానికి శరణమీయలేదా! (కపోత కపోతి కథ చూడండి) అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:

దీనుడై ప్పార్భించుచు శ్రణుజొచ్చిన శత్తువునైనా చంపకూడదు. సజ్బనుడు తన ప్పాణాలసైతం ఇచ్చి శరణార్చి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్పాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.

అతడే సితిలోనున్నను ఏ ఉద్చేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎజుగని ధర్మజ్నతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర, మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్‌. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన ప్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట
  2. ఇదే సందేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్వౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జీ జీ లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్స మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపజుస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:
  3. “ద్హాపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Slokalu – స్లోకాలు

Slokalu

స్లోకాలు సంస్కృత శాస్త్రములో ఒక అత్యంత ప్రముఖమైన భాగము. ఇవి దేవుళ్ళ కృపను, మనస్సును శుద్ధిగా చేసేవి, ఆధ్యాత్మిక ప్రగతిని కల్గిస్తాయి. ఇవి దేవుళ్ళ గుణములను, జీవన మార్గములను, ధర్మమును, అర్థమును, కామమును మరియు మోక్షమును తెలుపేవి. స్లోకాలు మనస్సును శాంతిగా ఉంచుతాయి, సమాధానంగా మరియు ఆనందంగా ఉంచుతాయి. ఇవి మనసును ధ్యానం లోపలించి, ఆధ్యాత్మిక ప్రేరణను పొందిస్తాయి, మరియు జీవన మార్గాన్ని వెల్లడిస్తాయి. స్లోకాలు మన జీవితంలో ఒక మహత్వపూర్ణ స్థానము పడుతాయి, సనాతన సత్యములను బోధిస్తాయి, మరియు మనసును దేవుని సమీపములో తీసుకోగలిగేవి. మొదలగు స్లోకాలు కోసం ఈ క్రింది లింకులు ద్వారా తెలుసుకుందాం…

Slokalu – స్లోకాలు

 

 

హనుమాన్ చాలీసా | Hanuman Chalisa Lyrics

Hanuman Chalisa

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “శ్రీహనుమాన్ చాలీసా” అను ‘హనుమంతుని నలుబది’ నలుబది చౌపాయిలలో శ్రీహనుమంతుని కీర్తినివివరించు స్తోత్రము. ప్రతిజీవియు లోకమున కష్టనినృత్తి-అభీష్టావ్యా ప్తి-సుఖసంతోషములఁ గోరుచుండును. సాధుసత్పురుషులు వారియనుభవములను లోకమునకు చాటుదురు. అట్టి వారి పలుకులే వేదములు – శిలాక్షరములు. వారియందు విశ్వాసము కలిగిఅను సరించు భ క్తులకు ‘దై వము అధీనుడై తోడ్పడును. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా – Hanuman Chalisa In Hindi

దోహా

శ్రీగురు చరణ సరోజరజ। నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ। జో దాయక ఫల చారి,
బుది హీనతను జానికె । సుమిరౌ పవన కుమార్:
బలబుధి విద్యా దేహుమొహి। హరహు కలేశ వికార్.

చౌపాఈ

1. జయ। హనుమాన। జ్ఞాన గుణసాగర।
జయ। కపీశ। తిహుఁలోక వుజాగర।

2. రామదూత। అతులిత బలధామా।
అంజనిపుత్ర। పవన సుతనామా

3. మహావీర విక్రమ – బజరంగీ ।
కుమతి నివార। సుమతి కే సంగీ

4. కంచన వరణ విరాజ సువేశా ।
కాననకుండల కుంచిత కేశా

5. హాథ వజ్ర అగు ధ్వజా విరాజై ।
కాంధేమూంజ జనేవూఛా జై

6. శంకర సువన కేసరీ నందన।
తేజ ప్రతాప మహాజగ వందన।

7. విద్యావాన గునీ అతిచాతుర ।
రామకాజ కరివేకో ఆతుర.

8. ప్రభు చరిత్ర సుని వేకో రసియా ।
రామలఖన సీతా మన బసియా

9. సూక్ష్మరూప ధరి సియహిఁదిఖావా।
వికటరూప ధరి లంక జరావా.

10. భీమరూప ధరి అసుర సంహారే ।
రామచంద్రకే కాజ సఁవా రే.

11. లాయ సజీవన లఖన జియాయే ।
శ్రీరఘువీర హరభి పుర లాయే

12. రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
కహా భరత సమ తుమ ప్రియభాయీ

13. సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై.

14. సనకాదిక బ్రహ్మాది మునీశా।
నారద శారద సహిత అహీశా.

15. యమ కుబేర దిగపాల జహాఁ తే ।
కవికోవిద కహి సకైకహాఁ తే.

16. తుమ ఉపకార సుగ్రీవహిఁ కీన్హా.।
రామ మిలాయ రాజపద దీన్హా.

17. తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లం కేశ్వర భయే సబ జగజానా.

18. యుగ సహస్ర యోజన పరభానూ ।
లీల్యోతాహి మధుర ఫల జానూ

19. ప్రభుముద్రికా మేలి ముఖ మాహీఁ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ.

20. దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే,

21. రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే

22. సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా

23. ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై

24. పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై

25. నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా

26. సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై

27. సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా

28. ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై

29. చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా

30. సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే

31. అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా

32. రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా

33. తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై

34. అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ

35. ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ

36. సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా

37. జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ

38. జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ

39. జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా

40. తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం:

Dilipa Maharaju Katha In Telugu – దిలీప మహారాజు కథ | శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీకాళిదాసకృత రఘువంశం నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… దిలీప మహారాజు కథ.

దిలీప మహారాజు కథ

రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సదురు దర్శనం కోసం వసిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపజచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ముల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేపేంద్రులోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి.

ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు బుతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేళావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!

అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు.

చేసిన తప్పును సరిదిద్భుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటక్టై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.

ఇలా వసిష్కులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్పారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది.

త్పుటిలో ఒక సింహం ఆ పోోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్చాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్తపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్నపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను.

నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. సేను నికుంభ మిత్తుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్పాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్టాంతాలకి వచ్చే ఏ మృగానై్వైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.

“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నపే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కాంచెం కుదుటపడ్డాడు. “భగవత్‌ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్పితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్బరికీ శ్రీేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.

ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్తాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్సిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్బి అపకీర్తి రాదు.

గురుద్దోహం అంటదు” అని అన్నాడు దిలీఫుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ‘క్ష్తతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుజుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న
ప్పాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్పార్భన మన్నించు” అని అన్నాడు.

ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్చిద్నామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుజు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ట మహర్షి తపళ్ళక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిదామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.

అప్పుడు ధర్మజ్నడైన దిలీపుడిలా అన్నాడు “తల్సీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలక్టై ఎదుజు చూస్తుంది. మహర్షులు యజ్నార్భము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆజోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్తునిగా పొందినాడు దిలీపుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్బనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
  2. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్పాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
  3. దూడ త్తాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటాను” అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్భి మనకు అవగతమైనది. ఇట ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Hirakani In Telugu – హీరాకానీ | శివాజీ వీరగాధలలోని కథ

శివాజీ వీరగాధలలోని కథ - నీతికథలు

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శివాజీ వీరగాధలలోని కథ నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… హీరాకానీ నీతికథ.

హీరాకానీ

దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మజిచిపోయిన ధర్మాన్ని మాతృదేశభక్తిని ప్రతిష్టించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్పాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ.

భారతీయతత్త్వాన్ని బాగా జీర్మించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యం చేళాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు.

శివాజీ రాయగథ్‌ కోట శత్తువులకు అభేద్యంగా కట్పుదిట్పంగా ఉండేది. ప్ప్రొద్దున ఆజింటికి తెజీచిన కోట తలుపులు రాత్రి, తొమ్మిదిగంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్న. రాజ్య రక్షణార్భం ఇట్సి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్సి పరిస్ఫితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెజవబడదు.

హీరాకానీ అనే గ్యామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందథికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది. పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.

కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్మ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. “అయ్యో! ఇంట్సో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది. హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్బ మేము మీఅలేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్హోనే పడుకో. ఉదయం ఆయజుకాగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊలఅడించినారు.

మణునాడు ప్పొద్భురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమజచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్బ హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి ప్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్తీ అభేద్యమైన కోట అర్బరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్పితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.

ఇంతలో హీరాకానీ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలక్రై ఏడుస్తున్న నా బిడ్మడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్పలూ తుప్పలూ ఆ నడిరాత్తి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్న ఒక్కడే నాకు జ్నప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్పార్భించింది హీరాకానీ.

శత్తువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానీకి అందజూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకానీబురుజు అనే పిలవబడుతోంది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయివుండికూడా శివాజీ
    అందజీముందూ సామాన్యురాలైన హీరాకానీ పాదాలపై పడి నమస్కరించెను.
  2. తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేద పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్భిని మనకు నేర్చింది హీరాకానీ.
  3. ఎంత హీరాకానీ మీద జాలి ఉన్నా రాజాజ్నను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలి వాళ్ళు ధన్యులు.

మరిన్ని నీతికథలు మీకోసం: