Balakanda Sarga 47 In Telugu – బాలకాండ సప్తచత్వారింశః సర్గః

Balakanda Sarga 47 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తచత్వారింశః సర్గలో సప్తమరుత్తుల పురాణం, సప్తవాయువుల పురాణం మరియు విశాల రాజుల పురాణం రాముడు మరియు లక్ష్మణులకు చెప్పగా, విశ్వామిత్రుడు విశాల పురాణాన్ని వివరిస్తున్నాడు. దితి యొక్క అభ్యర్థన మేరకు, ఇంద్రుడు ఆమె పిండంలోని ఏడు భాగాలను సప్త మరుత్ గణాలుగా , సప్తమరుత్ గణాలుగా, ఏడు వాయుదేవతలుగా మారమని ఆశీర్వదిస్తాడు మరియు ఇంద్ర-దితి పురాణం జరిగిన ప్రదేశం, ఆ ప్రాంతం తరువాత విశాల నగరంగా మారింది.

విశాలాగమనమ్

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా |
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయోఽబ్రవీత్ ||

1

మమాపరాధాద్గర్భోఽయం సప్తధా విఫలీకృతః |
నాపరాధోఽస్తి దేవేశ తవాత్ర బలసూదన ||

2

ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భవిపర్యయే |
మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే ||

3

వాతస్కంధా ఇమే సప్త చరంతు దివి పుత్రక |
మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః ||

4

బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాఽపరః |
దివి వాయురితి ఖ్యాతస్తృతీయోఽపి మహాయశాః ||

5

చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ |
సంచరిష్యంతి భద్రం తే దేవభూతా మమాత్మజాః ||

6

త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః |
తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః ||

7

ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః |
సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః ||

8

విచరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః |
ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే ||

9

జగ్ముతుస్త్రిదివం రామ కృతార్థావితి నః శ్రుతమ్ |
ఏష దేశః స కాకుత్స్థ మహేంద్రాధ్యుషితః పురా ||

10

దితిం యత్ర తపః సిద్ధామేవం పరిచచార సః |
ఇక్ష్వాకోఽస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః ||

11

అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః |
తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా ||

12

విశాలస్య సుతో రామ హేమచంద్రో మహాబలః |
సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః ||

13

సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః |
ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత ||

14

సృంజయస్య సుతః శ్రీమాన్సహదేవః ప్రతాపవాన్ |
కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః ||

15

కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్ |
సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స్థ ఇతి విశ్రుతః ||

16

తస్య పుత్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమామ్ |
ఆవసత్పరమప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః ||

17 [అమర]

ఇక్ష్వాకోఽస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః |
దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతః సుధార్మికాః ||

18

ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయమ్ |
శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి ||

19

సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రముపాగతమ్ |
శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్ఛన్మహాయశాః ||

20

పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాంధవః |
ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ||

21

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే విషయం మునిః |
సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ ||

22

Balakanda Sarga 47 In Telugu Pdf With Meaning

తన గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండింప బడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దు:ఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది.

“కుమారా! తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నము అయింది. కానీ నీవు నాకు ఒక ఉ పకారము చెయ్యి. ఈ ఏడు ఖండములను ఏడు మరుత్తుస్థానములకు పాలకులుగా నియమించు.

నా ఏడుగురు కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురు గాక! వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగును గాక! ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మ లోకములోనూ, ఒకరు ఇంద్రలోకములోనూ, మూడవ వాడు వాయు లోకములోనూ నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి నాలుగు నా దిక్కులను పరిపాలించుదురు గాక!

నీవు నా కుమారుని ఖండించు నప్పుడు ఏడవకు ఏడవకు (మా రుత మా రుత) అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువ బడతారు.” అని పలికింది దితి.

ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేసాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. “అమ్మా నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుంది.” అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్లిపోయారు.

ఓ రామా! దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచార ములు చేసాడు.

తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది.

ఆ విశాలుని కుమారుడు హేమ చంద్రుడు. హేమ చంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాశ్వుడు. కుశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు
.
ఆ కాకుత్తుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలానగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు, ఆయన వెంట వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు.

“మహాత్మా! తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేసారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు.” అని పలికాడు సుమతి.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ అష్టచత్వారింశః సర్గః (48) >>

Ayodhya Kanda Sarga 39 In Telugu – అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 39

అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గలో, దశరథ మహారాజు మరణం తరువాత, ఐక్య రాజ్యం తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది. మరణం తరువాత, వసిష్ఠుడు, సుమంతుడు మరియు ఇతర మంత్రులు, భార్యలు కౌసల్య మరియు సుమిత్రలతో కలిసి దశరథుని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తరువాత, దశరథుని మరణ వార్తను భారతుని వద్దకు పంపే ప్రయత్నం చేస్తారు, భారతుడు తన తల్లి కైకేయితో కలిసి కేకయ దేశంలో ఉంటున్నాడు. ఇందులో, వసిష్ఠ మహర్షి వేద విద్యాసంపన్నుడిగా, రాజ్య నిర్వహణలో కీలకంగా ఉంటాడు. అతను రాజ్యంలోని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు మరియు భరతుని వెంటనే అయోధ్యకు రావలసిందిగా సందేశం పంపిస్తాడు. ఈ సందేశం ద్వారా భరతుడు తండ్రి మరణం మరియు అయోధ్యలో నెలకొన్న విషాదం గురించి తెలుసుకుంటాడు.

వనగమనాపృచ్ఛా

రామస్య తు వచః శృత్వా మునివేషధరం చ తమ్ |
సమీక్ష్య సహ భార్యాభిః రాజా విగతచేతనః || ౧ ||

నైనం దుఃఖేన సంతప్తః ప్రత్యవైక్షత రాఘవమ్ |
న చైనమభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః || ౨ ||

స ముహూర్తమివాసంజ్ఞో దుఃఖితశ్చ మహీపతిః |
విలలాప మహాబాహుః రామమేవానుచింతయన్ || ౩ ||

మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః |
ప్రాణినో హింసితా వాఽపి తస్మాదిదముపస్థితమ్ || ౪ ||

న త్వేవానాగతే కాలే దేహాచ్చ్యవతి జీవితమ్ |
కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమ న విద్యతే || ౫ ||

యోఽహం పావకసంకాశం పశ్యామి పురతః స్థితమ్ |
విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజమ్ || ౬ ||

ఏకస్యాః ఖలు కైకేయ్యాః కృతేఽయం క్లిశ్యతే జనః |
స్వార్థే ప్రయతమానాయాః సంశ్రిత్య నికృతిం త్విమామ్ || ౭ ||

ఏవముక్త్వా తు వచనం బాష్పేణ పిహితేంద్రియః |
రామేతి సకృదేవోక్త్వా వ్యాహర్తుం న శశాక హ || ౮ ||

సంజ్ఞాం తు ప్రతిలభ్యైవ ముహూర్తాత్స మహీపతిః |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్ || ౯ ||

ఔపవాహ్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమైః |
ప్రాపయైనం మహాభాగమితో జనపదాత్పరమ్ || ౧౦ ||

ఏవం మన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే |
పిత్రా మాత్రా చ యత్సాధుర్వీరో నిర్వాస్యతే వనమ్ || ౧౧ ||

రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్రః శీఘ్రవిక్రమః |
యోజయిత్వాఽఽయయౌ తత్ర రథమశ్వైరలంకృతమ్ || ౧౨ ||

తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితమ్ |
ఆచచక్షేఽంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః || ౧౩ ||

రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్తసంచయే |
ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిమ్ || ౧౪ ||

వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ |
వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమానయ || ౧౫ ||

నరేంద్రేణైవముక్తస్తు గత్వా కోశగృహం తతః |
ప్రాయచ్ఛత్సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్ || ౧౬ ||

సా సుజాతా సుజాతాని వైదేహీ ప్రస్థితా వనమ్ |
భూషయామాస గాత్రాణి తైర్విచిత్రైర్విభూషణైః || ౧౭ ||

వ్యరాజయత వైదేహీ వేశ్మ తత్సువిభూషితా |
ఉద్యతోంశుమతః కాలే ఖం ప్రభేవ వివస్వతః || ౧౮ ||

తాం భుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూర్వచనమబ్రవీత్ |
అనాచరంతీం కృపణం మూర్ధ్న్యుపాఘ్రాయ మైథిలీమ్ || ౧౯ ||

అసత్యః సర్వలోకేఽస్మిన్సతతం సత్కృతాః ప్రియైః |
భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః || ౨౦ ||

ఏష స్వభావో నారీణామనుభూయ పురా సుఖమ్ |
అల్పామప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి || ౨౧ ||

అసత్యశీలా వికృతా దుర్గ్రాహ్యహృదయాః సదా |
యువత్యః పాపసంకల్పాః క్షణమాత్రాద్విరాగిణః || ౨౨ ||

న కులం న కృతం విద్యాం న దత్తం నాపి సంగ్రహమ్ |
స్త్రీణాం గృహ్ణాతి హృదయమనిత్యహృదయా హి తాః || ౨౩ ||

సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శ్రుతే శమే |
స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే || ౨౪ ||

స త్వయా నావమంతవ్యః పుత్రః ప్రవ్రాజితో మమ |
తవ దైవతమస్త్వేషః నిర్ధనః సధనోఽపి వా || ౨౫ ||

విజ్ఞాయ వచనం సీతా తస్యా ధర్మార్థసంహితమ్ |
కృతాంజలిరువాచేదం శ్వశ్రూమభిముఖే స్థితామ్ || ౨౬ ||

కరిష్యే సర్వమేవాహమార్యా యదనుశాస్తి మామ్ |
అభిజ్ఞాఽస్మి యథా భర్తుః త్వర్తితవ్యం శ్రుతం చ మే || ౨౭ ||

న మామసజ్జనేనార్యా సమానయితుమర్హతి |
ధర్మాద్విచలితుం నాహమలం చంద్రాదివ ప్రభా || ౨౮ ||

నాతంత్రీ వాద్యతే వీణా నాచక్రో వర్తతే రథః |
నాపతిః సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా || ౨౯ ||

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ || ౩౦ ||

సాఽహమేవంగతా శ్రేష్ఠా శ్రుతర్ధర్మపరావరా |
ఆర్యే కిమవమన్యేఽహం స్త్రీణాం భర్తా హి దైవతమ్ || ౩౧ ||

సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమమ్ |
శుద్ధసత్త్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజమ్ || ౩౨ ||

తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యేఽతిసత్కృతామ్ |
రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్ || ౩౩ ||

అంబ మా దుఃఖితా భూస్త్వం పశ్య త్వం పితరం మమ |
క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి || ౩౪ ||

సుప్తాయాస్తే గమిష్యంతి నవ వర్షాణి పంచ చ |
సా సమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్వృతమ్ || ౩౫ ||

ఏతావదభినీతార్థముక్త్వా స జననీం వచః |
త్రయః శతశతార్ధాశ్చ దదర్శావేక్ష్య మాతరః || ౩౬ ||

తాశ్చాపి స తథైవార్తా మాతౄర్దశరథాత్మజః |
ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలిః || ౩౭ ||

సంవాసాత్పరుషం కించిదజ్ఞానాద్వాఽపి యత్కృతమ్ |
తన్మే సమనుజానీత సర్వాశ్చామంత్రయామి వః || ౩౮ ||

వచనం రాఘవస్యైతద్ధర్మయుక్తం సమాహితమ్ |
శుశ్రువుస్తాః స్త్రియః సర్వాః శోకోపహతచేతసః || ౩౯ ||

జజ్ఞేఽథ తాసాం సన్నాదః క్రౌంచీనామివ నిస్వనః |
మానవేంద్రస్య భార్యాణామేవం వదతి రాఘవే || ౪౦ ||

మురజపణవమేఘఘోషవ-
-ద్దశరథవేశ్మ బభూవ యత్పురా |
విలపితపరిదేవనాకులం
వ్యసనగతం తదభూత్సుదుఃఖితమ్ || ౪౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశః సర్గః || ౩౯ ||

Ayodhya Kanda Sarga 39 Meaning In Telugu

దశరథుడు రాముని వంక చూచాడు. అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. ముని కుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకము చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముని నార చీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కుకున్నాడు. దుఃఖంతో తలవంచుకొని కూర్చున్నాడు.

“పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లి తండ్రుల వద్దనుండి విడదీసిఉంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి. రాముని మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈ నాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్యా ప్రజలందరూ బాధపడు తున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా!” అని తనలో తనే కుమిలిపోతున్నాడు.

ఇంకతప్పదని సుమంత్రుని చూచి “సుమంత్రా! రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముని అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యములో విడిచిపెట్టు. సుమంత్రా! మనిషి మంచివాడుగా ఉండవచ్చు కానీ అతి మంచి వాడు కాకూడదు. రాముని అతి మంచితనమే అతనికి చేటు తెచ్చింది. ఏమి చేస్తాం. నేను నా భార్య మాట విన్నాను. రాముడు నా మాట విన్నాడు. అయోధ్య కష్టాల పాలయింది” అన్నాడు దశరథుడు.

రాజు ఆజ్ఞమేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకొని వచ్చి రాజమందిర ద్వారము దగ్గర నిలిపాడు. “రామా! రథము సిద్ధము ఉంది” అని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు. దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు.
“సీత అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో, అన్ని సంవత్సరములకూ సరిపడా అమూల్యమైన దుస్తులు, అలంకారములు, ఆభరణములు తీసుకొనిరా. ” అని ఆదేశించాడు. కోశాధికారి అదే ప్రకారము దుస్తులు ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు. సీత మారు మాటాడకుంటా పూర్వము మాదిరి విలువైన దుస్తులు, ఆభరణములు అలంకరించుకొంది. సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్న కోడలిని చూచి కౌసల్య ఆమెను గట్టిగా కౌగలించు కొంది.

“అమ్మా! సీతా! సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు. నీచ స్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు. . భర్తపట్ల ఏ మాత్రం గౌరవము చూపరు. అవకాశం వస్తే మొగుడిని వదిలేస్తారు. అది ఆడువారి స్వభావము. ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కలవారికి శీలము ఉండదు. అటువంటివారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరుక్షణంలో వారిని ద్వేషిస్తారు. వారు చాలా చంచలంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి ఉండదు.

కాని శీలవంతులూ, సత్యవ్రతులూ, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రము తమ భర్త ఏ పరిస్థితిలో ఉన్నా వారిని ఆదరిస్తారు. గౌరవిస్తారు. నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు. ప్రస్తుతము అడవులలో ఉన్నాడని రాముని అగౌరవంగా చూడకు. ధనము లేదని రాముని నిందించకు. భర్తయే పతికి దైవము. నీవు రాముని దైవసమానుడిగా భావించాలి.” అని పలికింది కౌసల్య.

అత్తగారి మాటలలో ఆంతర్యం గ్రహించింది సీత. అత్తగారితో ఇలా అంది. “అత్తగారూ! నన్ను సాధారణ స్త్రీ అనీ, దుష్టస్వభావము కల స్త్రీ అనీ ఎందుకు అనుకుంటున్నారు. నేను అలాంటి దానిని కాను. కష్టసుఖములలో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను, విన్నాను. భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు. తల్లిగానీ, తండ్రి గానీ, కుమారుడు కానీ, కుమార్తె గానీ స్త్రీకి పరిమితమైన సుఖము, ఆనందము కలిగించగలరు. కానీ భర్త మాత్రము జీవితాంతము భార్యము సుఖాన్ని ఆనందాన్ని పంచి ఇస్తాడు. అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు? గౌరవించదు? స్త్రీలకు భర్తయే దైవము. ఆవిషయం నాకు బాగా తెలుసు. అట్టి దైవాన్ని నేను ఎందుకు అవమానిస్తాను? ఆ విషయంలో మీరు ఎలాంటి చింతాపెట్టుకోవద్దు.” అని వినయంగా పలికింది సీత. సీత మాటలు విన్న కౌసల్యము మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టు మాయం అయింది. సీతను ఆదరంగా దగ్గరకు తీసుకొంది.

రాముడు తల్లి కౌసల్యకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! నీవు ఎంత మాత్రమూ దు:ఖపడవద్దు. నేను అతి త్వరలో వనవాసము ముగించుకొని నీ ముందు నిలబడతాను. నీవుమాత్రము తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకో. అమ్మా! పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎంతసేపు. ఇట్టే గడిచిపోతుంది. నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసము ముగించుకొని నీ కళ్లముందు ఉంటాను.” అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు.

తరువాత అక్కడే ఉన్న తన 350 మంది తల్లుల వంకా చూచాడు. వారందరికీ భక్తి నమస్కరించాడు. “తల్లులారా! నాకు మీతో ఉన్న పరిచయం చేత గానీ, లేక నా అవివేకము వలన గానీ తెలిసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ అందరి దగ్గరా సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడి.” అని అందరికీ నమస్కరించాడు. రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోదించారు. అలాగే రాముని ఆశీర్వదించారు. ఎల్లప్పుడూ మంగళవాద్యములతోనూ వేద మంత్రములతోనూ మార్మోగే దశరథుని గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది.

శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చత్వారింశః సర్గః (40) >>

Ayodhya Kanda Sarga 51 In Telugu | అయోధ్యాకాండ ఏకపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 51 In Telugu

అయోధ్యా కాండ సర్గ 51 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణకుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా లక్ష్మణా! అంటూ పలికిన సందర్భం లోనిది…

గుహలక్ష్మణజాగరణమ్

తం జాగ్రతమదంభేన భ్రాతురర్థాయ లక్ష్మణమ్ |
గుహః సంతాపసంతప్తో రాఘవం వాక్యమబ్రవీత్ ||

1

ఇయం తాత సుఖా శయ్యా త్వదర్థముపకల్పితా |
ప్రత్యాశ్వసిహి సాధ్వస్యాం రాజపుత్ర యథాసుఖమ్ ||

2

ఉచితోఽయం జనః సర్వః క్లేశానాం త్వం సుఖోచితః |
గుప్త్యర్థం జాగరిష్యామః కాకుత్స్థస్య వయం నిశామ్ ||

3

న హి రామాత్ప్రియతరో మమాస్తి భువి కశ్చన |
బ్రవీమ్యేతదహం సత్యం సత్యేనైవ చ తే శపే ||

4

అస్య ప్రసాదాదాశంసే లోకేఽస్మిన్సుమహద్యశః |
ధర్మావాప్తిం చ విపులామర్థావాప్తిం చ కేవలామ్ ||

5

సోఽహం ప్రియతమం రామం శయానం సహ సీతయా |
రక్షిష్యామి ధనుష్పాణిః సర్వతః జ్ఞాతిభిః సహ ||

6

న హి మేఽవిదితం కించిద్వనేఽస్మింశ్చరతః సదా |
చతురంగం హ్యపి బలం సుమహత్ప్రసహేమహి ||

7

లక్ష్మణస్తం తదోవాచ రక్ష్యమాణాస్త్వయాఽనఘ |
నాత్ర భీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యతా ||

8

కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||

9

యో న దేవాసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖసంవిష్టం తృణేషు సహ సీతయా ||

10

యో మంత్రతపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమైః |
ఏకో దశరథస్యేష్టః పుత్రః సదృశలక్షణః ||

11

అస్మిన్ప్రవ్రాజితే రాజా న చిరం వర్తయిష్యతి |
విధవా మేదినీ నూనం క్షిప్రమేవ భవిష్యతి ||

11

వినద్య సుమహానాదం శ్రమేణోపరతాః స్త్రియః |
నిర్ఘోషోపరతం చాతః మన్యే రాజనివేశనమ్ ||

12

కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ |
నాశంసే యది జీవంతి సర్వే తే శర్వరీమిమామ్ ||

13

జీవేదపి హి మే మాతా శత్రుఘ్నస్యాన్వవేక్షయా |
తద్దుఃఖం యత్తు కౌసల్యా వీరసూర్వినశిష్యతి ||

14

అనురక్తజనాకీర్ణా సుఖాలోకప్రియావహా |
రాజవ్యసనసంసృష్టా సా పురీ వినశిష్యతి ||

15

కథం పుత్రం మహాత్మానం జ్యేష్ఠం ప్రియమపస్యతః |
శరీరం ధారయిష్యంతి ప్రాణా రాజ్ఞో మహాత్మనః ||

16

వినష్టే నృపతౌ పశ్చాత్కౌసల్యా వినశిష్యతి |
అనంతరం చ మాతాఽపి మమ నాశముపైష్యతి ||

17

అతిక్రాంతమతిక్రాంతమనవాప్య మనోరథమ్ |
రాజ్యే రామమనిక్షిప్య పితా మే వినశిష్యతి ||

18

సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్కాలేఽప్యుపస్థితే |
ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపమ్ ||

19

రమ్యచత్వరసంస్థానాం సువిభక్తమహాపథామ్ |
హర్మ్యప్రాసాదసంపన్నాం గణికావరశోభితామ్ ||

20

రథాశ్వగజసంబాధాం తూర్యనాదవినాదితామ్ |
సర్వకళ్యాణసంపూర్ణాం హృష్టపుష్టజనాఽకులామ్ ||

21

ఆరామోద్యానసంపన్నాం సమాజోత్సవశాలినీమ్ |
సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ ||

22

అపి జీవేద్ధశరథో వనవాసాత్పునర్వయమ్ |
ప్రత్యాగమ్య మహాత్మానమపి పశ్యేమ సువ్రతమ్ ||

23

అపి సత్యప్రతిజ్ఞేన సార్ధంకుశలినా వయమ్ |
నివృత్తవనవాసేఽస్మిన్నయోధ్యాం ప్రవిశేమహి ||

24

పరిదేవయమానస్య దుఃఖార్తస్య మహాత్మనః |
తిష్ఠతః రాజపుత్రస్య శర్వరీ సాఽత్యవర్తత ||

25

తథాహి సత్యం బ్రువతి ప్రజాహితే
నరేంద్రపుత్రే గురుసౌహృదాద్గుహః |
ముమోచ బాష్పం వ్యసనాభిపీడితో
జ్వరాతురో నాగ ఇవ వ్యథాఽఽతురః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 51 Meaning In Telugu

గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణకుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా లక్ష్మణా!

నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికనేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది. నీకు, రామునికి ఈ అరణ్యములో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యము కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు.” అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు. “మిత్రమా! నీవు మా పక్కన ఉండగా మాకు ఏమి భయము.

అటుచూడు. నా అన్న, నా వదిన అలా కటికనేల మీద పడుకొని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది. అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది. రాజాంతఃపురములలో పట్టుపరుపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారోచూడు.

రాముడు దశరథునికి, ఎన్నో పూజలు వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టిన వాడు. అటువంటి రాముడు అడవులకు వెళితో దశరథుడు జీవించగలడా! ఏమో కొద్ది రోజులలో అయోధ్య అనాధ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంత:పుర స్త్రీలు అందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు. రాముని తల్లి కౌసల్య, దశరథుడు, రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది.

నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కానీ, ఒక్కగా నొక్క కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవము అయిపోయింది. చిన్నప్పటినుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకొన్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే. రాజు మరణించగానే, కౌసల్య ప్రాణత్యాగము చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది. వారి కందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలేమో!

మిత్రమా! నేను ఏమేమో ఊహించుకొనుచున్నాను. అవన్నీ నిజం కావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చువరకూ దశరథుడు మా కోసరం అయోధ్యానగర ముఖద్వారము వద్ద వేచి ఉండి, మమ్ములను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుపోతాడేమో! మేమందరమూ మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో!

మిత్రమా! ఏదైనా జరగ వచ్చు. దేనినీ మనము కాదనలేము కదా!” అంటూ పరిపరివిధముల మాట్లాడుచున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహుని కూడా దు:ఖము ఆగలేదు. రామునికి, అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపములతో ఆ రాత్రి గడిచి పోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదిఒకటవ సర్గసంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ద్విపంచాశః సర్గః (52) >>

Balakanda Sarga 45 In Telugu – బాలకాండ పంచచత్వారింశః సర్గః

Balakanda Sarga 45 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచచత్వారింశః సర్గలో రాముడు మరియు లక్ష్మణులు విశాల అనే నగరానికి చేరుకుని చూసినప్పుడు పాల సముద్రాన్ని మథనం చేసిన పురాణం వారికి వివరించబడింది. క్షీరసాగర మథనం నుండి హాలాహల , ప్రాణాంతక విషం అలాగే అమృతం , అమృత అమృతం ఎలా ఉద్భవించాయి మరియు శివుడు విషాన్ని ఎలా కలిగి ఉన్నాడు మరియు విష్ణువు తాబేలుగా తన అవతారంలో మథనానికి ఎలా సహాయం చేసాడో విశ్వామిత్రుడు వివరిస్తాడు.

అమృతోత్పత్తిః

విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః |
విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమథాబ్రవీత్ ||

1

అత్యద్భుతమిదం బ్రహ్మన్కథితం పరమం త్వయా |
గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణమ్ ||

2

తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా |
జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభామ్ ||

3

తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిమ్ |
ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నికమరిందమః ||

4

గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతమ్ |
క్షణభూతేవ నౌ రాత్రిః సంవృత్తేయం మహాతపః ||

5

ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాం తవ |
తరామ సరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీమ్ ||

6

నౌరేషా హి సుఖాస్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణామ్ |
భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతా ||

7

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
సంతారం కారయామాస సర్షిసంఘః సరాఘవః ||

8

ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా |
గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీమ్ ||

9

తతో మునివరస్తూర్ణం జగామ సహరాఘవః |
విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా ||

10

అథ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిమ్ |
పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాముత్తమాం పురీమ్ ||

11

కతరో రాజవంశోఽయం విశాలాయాం మహామునే |
శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హి మే ||

12

తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః |
ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనమ్ ||

13

శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభామ్ |
అస్మిన్దేశే హి యద్వృత్తం తదాపి శృణు రాఘవ ||

14

పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహాబలాః |
అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః ||

15

తతస్తేషాం నరవ్యాఘ్ర బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
అమరా అజరాశ్చైవ కథం స్యామ నిరామయాః ||

16

తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్మహాత్మనామ్ |
క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై ||

17

తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిమ్ |
మంథానం మందరం కృత్వా మమంథురమితౌజసః ||

18

అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాంసి చ |
[* అధికపాఠః –
వమంత్యతి విషం తత్ర దదంశుర్దశనైః శిలాః ||

19

ఉత్పపాతాగ్నిసంకాశం హాలాహలమహావిషమ్ |
తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషమ్ ||

20

అథ దేవా మహాదేవం శంకరం శరణార్థినః |
జగ్ముః పశుపతిం రుద్రం త్రాహిత్రాహీతి తుష్టువుః ||

21

ఏవముక్తస్తతో దేవైర్దేవదేవేశ్వరః ప్రభుః |
ప్రాదురాసీత్తతోఽత్రైవ శంఖచక్రధరో హరిః ||

22

ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః |
దైవతైర్మథ్యమానో తు యత్పూర్వం సముపస్థితమ్ ||

23

తత్త్వదీయం సురశ్రేష్ఠ సురాణామగ్రజోసి యత్ |
అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో ||

24

ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠస్తత్రైవాంతరధీయత |
దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్ఙ్గిణః ||

25

హాలాహలవిషం ఘోరం స జగ్రాహామృతోపమమ్ |
దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్హరః ||

26

తతో దేవాసురాః సర్వే మమంథూ రఘునందన |
ప్రవివేశాథ పాతాలం మంథానః పర్వతోఽనఘ ||

27

తతో దేవాః సగంధర్వాస్తుష్టువుర్మధుసూదనమ్ |
త్వం గతిః సర్వభూతానాం విశేషేణ దివౌకసామ్ ||

28

పాలయాస్మాన్మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి |
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్థితః ||

29

పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః |
పర్వతాగ్రం తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః ||

30

దేవానాం మధ్యతః స్థిత్వా మమంథ పురుషోత్తమ |
అథ వర్షసహస్రేణ ఆయుర్వేదమయః పుమాన్ ||

31 [పున]

ఉదతిష్ఠత్స ధర్మాత్మా సదండం సకమండలుః |
*]
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః ||

32

అప్సు నిర్మథనాదేవ రసస్తస్మాద్వరస్త్రియః |
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసోఽభవన్ ||

33

షష్టిః కోట్యోఽభవంస్తాసామప్సరాణాం సువర్చసామ్ |
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః ||

34

న తాః స్మ ప్రతిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః |
అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః ||

35

వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన |
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహమ్ ||

36

దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజామ్ |
అదితేస్తు సుతా వీర జగృహుస్తామనిందితామ్ ||

37

అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః |
హృష్టాః ప్రముదితాశ్చాసన్వారుణీగ్రహణాత్సురాః ||

38

ఉచ్చైఃశ్రవా హయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభమ్ |
ఉదతిష్ఠన్నరశ్రేష్ఠ తథైవామృతముత్తమమ్ ||

39

అథ తస్య కృతే రామ మహానాసీత్కులక్షయః |
అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రానసూదయన్ ||

40

ఏకతోఽభ్యాగమన్సర్వే హ్యసురా రాక్షసైః సహ |
యుద్ధమాసీన్మహాఘోరం వీర త్రైలోక్యమోహనమ్ ||

41

యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః |
అమృతం సోఽహరత్తూర్ణం మాయామాస్థాయ మోహినీమ్ ||

42

యే గతాఽభిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమమ్ |
సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా ||

43

అదితేరాత్మజా వీరా దితేః పుత్రాన్నిజఘ్నిరే |
తస్మిన్యుద్ధే మహాఘోరే దైతేయాదిత్యయోర్భృశమ్ ||

44

నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందరః |
శశాస ముదితో లోకాన్సర్షిసంఘాన్సచారణాన్ ||

45

Balakanda Sarga 45 In Telugu Pdf With Meaning

విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామ లక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు.

మరునాడు పొద్దుటే లేచారు. సంధ్వావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేసారు.” అని వినయంగా చెప్పాడు రాముడు.

తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు.

ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందిన వారు? వారి చరిత్ర ఏమిటి?
మాకు వివరించండి.” అని అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మునులకు విశాల నగర వృత్తాంతమును చెప్పడం మొదలు పెట్టాడు.

“ ఓ రామా! ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కృతయుగములో దితి పుత్రులు, అదితి పుత్రులు ఉండేవారు. వారు మహా బలవంతులు. పరాక్రమ వంతులు. ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలి తనము, మరణము, లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయము గురించి ఆలోచింప సాగారు.

వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీర సాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితి పుత్రులు, అదితి పుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మంథర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరం లో పడవేసారు. వాసుకిని తాడుగా ఆ పర్వతమునకుచుట్టారు. మంథర పర్వతము కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరమును చిలకసాగారు.

ఒక వెయ్యి సంవత్సరములు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు. ఆ విషంలో నుండి హాలా హలము పుట్టింది. ఆ హాలా హలము జగత్తును అంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలా హలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్ధించారు.

ఇంతలో విష్ణు మూర్తి కూడా అక్కడకు వచ్చాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు. “ఓ మహా దేవా! నీవు అందరి కన్నా పెద్ద వాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలా హలము పుట్టింది. అందరి కన్నా పెద్దవాడికి నువ్వు కాబట్టి, ముందు పుట్టిన హాలా హాలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి. కాబట్టి పెద్దవాడిగా ఆ హాలా హలమును తీసుకో.” అని అన్నాడు.

తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహా శివుడు హాలా హలమును అమృతము మాదిరి తాగాడు. తరువాత శివుడు కూడా వెళ్లిపోయాడు. మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు.

ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది. కింద ఆధారము ఏమీ లేక పోవడంతో, మంధర పర్వతము క్షీరసాగరం అడుక్కు పోసాగింది. అప్పుడు మరలా దేవతలు, అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు.

” ఓ మహాబాహోూ! సర్వ భూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మంధర పర్వతమును పైకెత్తు. మాకు సాయం చెయ్యి.” అని ప్రార్థించారు.

దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మ రూపం (తాబేలురూపం) ధరించి ఆ మంధర పర్వతము కింద చేరాడు. మంథర పర్వతము కుంగి పోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దేవ దానవులు మరలా క్షీరసాగరమును మథించసాగారు.

మరలా వేయి సంవత్సరములు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. “ఓ రామా! నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టిన వారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. ఆ అప్సరసలు అరవైకోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు.

తరువాత వరుణుని కుమార్తె వారుణి (మద్యమునకు అధిదేవత) తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ వారుణిని దితి పుత్రులు స్వీకరించలేదు. అదితి పుత్రులు స్వీకరించారు. ఆ కారణం చేత అనగా వారుణిని (సురను) స్వీకరించకపోవడం చేత దితి పుత్రులు అసురులు అయ్యారు. సురను స్వీకరించడం చేత అదితి పుత్రులు (దేవతలు) సురులు అయ్యారు.

మరలా క్షీర సాగర మథనం జరిగింది. క్షీర సాగరం లోనుండి ఉచ్చైశ్రవము అనే గుర్రము, కౌస్తుభము అనే మణి, దాని తరువాత అమృతము పుట్టాయి.

ఆ అమృతము కోసరము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు. అసురులు నాశనం అయ్యారు. ఆ యుద్ధములో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు. అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు.

తరువాత శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో అమృతమును హరించుకు పోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువు తో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారి నందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి, దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ షట్చత్వారింశః సర్గః (46) >>

Ayodhya Kanda Sarga 38 In Telugu – అయోధ్యాకాండ అష్టాత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 38

అయోధ్యాకాండంలోని అష్టాత్రింశః సర్గంలో, దశరథ మహారాజు తన ఆఖరి రోజులు గడుపుతున్నాడు. ఆయన రాముడి వలస కారణంగా తీవ్ర దుఃఖంలో ఉంటాడు. ఈ సమయంలో, కౌసల్య మరియు సుమిత్రలు దశరథుని పక్కన ఉంటారు. దశరథుడు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకప్పుడు చేసిన తప్పును గురించి చెబుతాడు. యవన వయసులో దశరథుడు, శ్రవణ కుమారుని అజ్ఞానంలో వేటాడి చంపిన విషయం వివరిస్తాడు. శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు అతన్ని శపిస్తారు, “నీ కుమార దుఃఖంతో నీవు కూడా మరణిస్తావు” అని. ఆ శాపం ఇప్పుడు ఫలించిందని దశరథుడు బాధపడుతాడు. రాముడి నిర్వాస వేదనతో, దశరథుడు తన ప్రాణాలు విడిచినట్లు ఈ సర్గలో తెలియజేయబడింది.

జనాక్రోశః

తస్యాం చీరం వసానాయాం నాథవత్యామనాథవత్ |
ప్రచుక్రోశ జనః సర్వో ధిక్త్వాం దశరథం త్వితి || ౧ ||

తేన తత్ర ప్రణాదేన దుఃఖితః స మహీపతిః |
చిచ్ఛేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మనః || ౨ ||

స నిశ్శ్వస్యోష్ణమైక్ష్వాకస్తాం భార్యామిదమబ్రవీత్ |
కైకేయి కుశచీరేణ న సీతా గంతుమర్హతి || ౩ ||

సుకుమారీ చ బాలా చ సతతం చ సుఖోచితా |
నేయం వనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ || ౪ ||

ఇయం హి కస్యాపకరోతి కించి-
-త్తపస్వినీ రాజవరస్య కన్యా |
యా చీరమాసాద్య జనస్య మధ్యే
స్థితా విసంజ్ఞా శ్రమణీవ కాచిత్ || ౫ ||

చీరాణ్యపాస్యాజ్జనకస్య కన్యా
నేయం ప్రతిజ్ఞా మమ దత్తపూర్వా |
యథాసుఖం గచ్ఛతు రాజపుత్రీ
వనం సమగ్రా సహ సర్వరత్నైః || ౬ ||

అజీవనార్హేణ మయా నృశంసా
కృతా ప్రతిజ్ఞా నియమేన తావత్ |
త్వయా హి బాల్యాత్ప్రతిపన్నమేతత్
తన్మాం దహేద్వేణుమివాత్మపుష్పమ్ || ౭ ||

రామేణ యది తే పాపే కించిత్కృతమశోభనమ్ |
అపకారః క ఇహ తే వైదేహ్యా దర్శితోఽథ మే || ౮ ||

మృగీవోత్ఫుల్లనయనా మృదుశీలా తపస్వినీ |
అపకారం కమిహ తే కరోతి జనకాత్మజా || ౯ ||

నను పర్యాప్తమేతత్తే పాపే రామవివాసనమ్ |
కిమేభిః కృపణైర్భూయః పాతకైరపి తే కృతైః || ౧౦ ||

ప్రతిజ్ఞాతం మయా తావత్త్వయోక్తం దేవి శృణ్వతా |
రామం యదభిషేకాయ త్వమిహాగతమబ్రవీః || ౧౧ ||

తత్త్వేతత్సమతిక్రమ్య నిరయం గంతుమిచ్ఛసి |
మైథిలీమపి యా హి త్వమీక్షసే చీరవాసినీమ్ || ౧౨ ||

ఇతీవ రాజా విలపన్మహాత్మా
శోకస్య నాంతం స దదర్శ కించిత్ |
భృశాతురత్వాచ్చ పపాత భూమౌ
తేనైవ పుత్రవ్యసనే నిమగ్నః || ౧౩ ||

ఏవం బ్రువంతం పితరం రామః సంప్రస్థితో వనమ్ |
అవాక్ఛిరసమాసీనమిదం వచనమబ్రవీత్ || ౧౪ ||

ఇయం ధార్మిక కౌసల్యా మమ మాతా యశస్వినీ |
వృద్ధా చాక్షుద్రశీలా చ న చ త్వాం దేవ గర్హతే || ౧౫ ||

మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరమ్ |
అదృష్టపూర్వవ్యసనాం భూయః సమ్మంతుమర్హసి || ౧౬ ||

పుత్రశోకం యథా నర్ఛేత్త్వయా పూజ్యేన పూజితా |
మాం హి సంచింతయంతీయమపి జీవేత్తపస్వినీ || ౧౭ ||

ఇమాం మహేంద్రోపమ జాతగర్ధినీం
తథా విధాతుం జననీం మమార్హసి |
యథా వనస్థే మయి శోకకర్శితా
న జీవితం న్యస్య యమక్షయం వ్రజేత్ || ౧౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాత్రింశః సర్గః || ౩౮ ||

Ayodhya Kanda Sarga 38 Meaning In Telugu

వసిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంతఃపుర స్త్రీలు నార చీర కట్టుకోడానికి రాక అవస్థలుపడుతున్న సీతను చూచి, కైకను దశరథుని మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గ్రహించాడు దశరథుడు.

దశరథుడు కైక వంక చూచి “ఓ కైకా! వసిష్ఠుల వారి మాటలు విన్నావు కదా! వారు చెప్పినది యదార్థము. సీత నారచీరలు ధరించనవసరము లేదు. సీత సుకుమారి. వయసులో చిన్నది. పుట్టినప్పటినుండి రాజభోగాలలో మునిగితేలింది. సీతకు వనవాసము సరికాదు. అని వసిష్ఠులవారు చెప్పినది అక్షరాలా సత్యము. జనకమహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించనవసరం లేదు. ఓ కైకా! సీత నీకు ఏమి అపకారము చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు. నేను నీకు, ‘సీత కూడా నార చీరలు ధరించి అడవులకు వెళుతుంది’ అని వరం ఇచ్చానా! మరి సీతకు ఎందుకు ఇచ్చావు నారచీరలు? ఆమె ఎవరో తెలుసా! జనకమహారాజు కూతురు.

ఆమె నారచీరలు ధరించాలా! కాబట్టి, ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతే కాదు ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను. నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున్నాడు అడవులకు వెళుతున్నాడు. వింతగా ఉంది కదూ! కాని నేను నీకు ఇచ్చిన వరాలతో, నేను నీకు ఇచ్చిన మాటతో సీతకు ఎలాంటి సంబంధము లేదు. రాముడు నీ కేమైనా అపకారము చేస్తాడని అడవులకు వెళ్లగొడుతున్నావు. అలాంటి అపకారము సీత వలన కలగదుకదా! మరి ఆమె ఎందుకు అడవులకు వెళ్లాలి? వెళ్లినా ఎందుకు నారచీరలు ధరించాలి? నీ పట్ల ఆమె ఏమి అపరాధము చేసింది?

ఓ కైకా! నీవు రాముని అడవులకు పంపుతూ మహాపాపము చేస్తున్నావు. అది చాలదన్నట్టు వాళ్లకు నారచీరలు ఇచ్చి ఘోరమైన అపరాధము చేస్తున్నావు. నరకానికిపోతావు. నరకానికి పోతావు” అని వలా వలా ఏడిచాడు దశరథుడు.

ఏడుస్తున్న తండ్రిని చూచి రాముడు ఆయన దగ్గరగా వెళ్లాడు. దశరథుని దగ్గర కూర్చుని ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నా తల్లి కౌసల్య వృధ్యాప్యములో ఉంది. ఆమెకు ఏ పాపమూ తెలియదు. నేను వనములకు వెళ్లడం చూచి ఆమెకూడా మీ మాదిరి శోక సముద్రంలో మునిగి పోయింది. మీరు కూడా ఇలా శోకిస్తూ ఉంటే ఆమెను ఎవరు ఓదారుస్తారు. నా తల్లి కౌసల్యను ఆదరంతో చూడండి. ఆమెను నిరాదరించకండి. నా మీద ప్రేమతో నా తల్లి కౌసల్య ప్రాణ త్యాగము చేసుకోకుండా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే వరము. ఈ ఒక్కవరాన్ని నాకు ప్రసాదించండి. నాకు వనములకు పోవుటకు అనుమతి ఇవ్వండి.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గః (39) >>

Balakanda Sarga 43 In Telugu – బాలకాండ త్రిచత్వారింశః సర్గః

Balakanda Sarga 43 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిచత్వారింశః సర్గలో భగీరథుని అసాధారణ ప్రయత్నంతో గంగ భూమికి దిగుతుంది. శివుడు తన తలపై గంగను దిగడానికి అంగీకరించాడు మరియు ఆమె అక్కడ నుండి బిందుసరోవర్ అనే సరస్సులోకి విడుదల చేయబడుతుంది మరియు అక్కడ నుండి ఆమె ఏడు ప్రవాహాలలో ప్రవహిస్తుంది. భూమిపై భగీరథుడు తన పూర్వీకులు తవ్విన పాతాళంలోకి ఆమెను తీసుకువెళతాడు, అక్కడ అతని తాతముత్తాతల బూడిద కుప్పలు ఉన్నాయి మరియు ఆత్మలకు మోక్షం ప్రకారం ఆ బూడిద గుట్టలను ముంచెత్తడానికి ఆమె ప్రవేశిస్తుంది.

గంగావతరణమ్

దేవదేవే గతే తస్మిన్సోంగుష్ఠాగ్రనిపీడితామ్ |
కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత ||

1

ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షో నిరాశ్రయః |
అచలః స్థాణువత్స్థిత్వా రాత్రిందివమరిందమ ||

2

అథ సంవత్సరే పూర్ణే సర్వలోకనమస్కృతః |
ఉమాపతిః పశుపతీ రాజానమిదమబ్రవీత్ ||

3

ప్రీతస్తేఽహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియమ్ |
శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహమ్ ||

4

తతో హైమవతీ జ్యేష్ఠా సర్వలోకనమస్కృతా |
తదా సా సుమహద్రూపం కృత్వా వేగం చ దుఃసహమ్ ||

5

ఆకాశాదపతద్రామ శివే శివశిరస్యుత |
అచింతయచ్చ సా దేవీ గంగాం పరమదుర్ధరా ||

6

విశామ్యహం హి పాతాలం స్రోతసా గృహ్య శంకరమ్ |
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్హరః ||

7

తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రిణయనస్తదా |
సా తస్మిన్పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని ||

8

హిమవత్ప్రతిమే రామ జటామండలగహ్వరే |
సా కథంచిన్మహీం గంతుం నాశక్నోద్యత్నమాస్థితా ||

9

నైవ నిర్గమనం లేభే జటామండలమోహితా |
తత్రైవాబంభ్రమద్దేవీ సంవత్సరగణాన్బహూన్ ||

10

తామపశ్యన్పునస్తత్ర తపః పరమమాస్థితః |
అనేన తోషితశ్చాభూదత్యర్థం రఘునందన ||

11

విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి |
తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే ||

12

హ్లాదినీ పావనీ చైవ నలినీ చ తథాఽపరా |
తిస్రః ప్రాచీం దిశం జగ్ముర్గంగాః శివజలాః శుభాః ||

13

సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ |
తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుభోదకాః ||

14

సప్తమీ చాన్వగాత్తాసాం భగీరథమథో నృపమ్ |
భగీరథోఽపి రజర్షిర్దివ్యం స్యందనమాస్థితః ||

15

ప్రాయాదగ్రే మహాతేజా గంగా తం చాప్యనువ్రజత్ |
గగనాచ్ఛంకరశిరస్తతో ధరణిమాగతా ||

16

వ్యసర్పత జలం తత్ర తీవ్రశబ్దపురస్కృతమ్ |
మత్స్యకచ్ఛపసంఘైశ్చ శింశుమారగణైస్తథా ||

17

పతద్భిః పతితైశ్చాన్యైర్వ్యరోచత వసుంధరా |
తతో దేవర్షిగంధర్వా యక్షాః సిద్ధగణాస్తథా ||

18

వ్యలోకయంత తే తత్ర గగనాద్గాం గతాం తదా |
విమానైర్నగరాకారైర్హయైర్గజవరైస్తదా ||

19

పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః |
తదద్భుతతమం లోకే గంగాపతనముత్తమమ్ ||

20

దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః |
సంపతద్భిః సురగణైస్తేషాం చాభరణౌజసా ||

21

శతాదిత్యమివాభాతి గగనం గతతోయదమ్ |
శింశుమారోరగగణైర్మీనైరపి చ చంచలైః ||

22

విద్యుద్భిరివ విక్షిప్తమాకాశమభవత్తదా |
పాండురైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా ||

23

శారదాభ్రైరివాకీర్ణం గగనం హంససంప్లవైః |
క్వచిద్ద్రుతతరం యాతి కుటిలం క్వచిదాయతమ్ ||

24

వినతం క్వచిదుద్భూతం క్వచిద్యాతి శనైః శనైః |
సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ||

25

ముహురూర్ధ్వపథం గత్వా పపాత వసుధాతలమ్ |
[* తచ్ఛంకరశిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః | *]
వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషమ్ ||

26

తత్ర దేవర్షిగంధర్వా వసుధాతలవాసినః |
భవాంగపతితం తోయం పవిత్రమితి పస్పృశుః ||

27

శాపాత్ప్రపతితా యే చ గగనాద్వసుధాతలమ్ |
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గతకల్మషాః ||

28

ధూతపాపాః పునస్తేన తోయేనాథ సుభాస్వతా |
పునరాకాశమావిశ్య స్వాఁల్లోకాన్ప్రతిపేదిరే ||

29

ముముదే ముదితో లోకస్తేన తోయేన భాస్వతా |
కృతాభిషేకో గంగాయాం బభూవ విగతక్లమః ||

30

భగీరథోఽపి రాజర్షిర్దివ్యం స్యందనమాస్థితః |
ప్రాయాదగ్రే మహాతేజాస్తం గంగా పృష్ఠతోఽన్వగాత్ ||

31

దేవాః సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||

32

సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగామ్ |
గంగామన్వగమన్ప్రీతాః సర్వే జలచరాశ్చ యే ||

33

యతో భగీరథో రాజా తతో గంగా యశస్వినీ |
జగామ సరితాం శ్రేష్ఠా సర్వపాపవినాశినీ ||

34

తతో హి యజమానస్య జహ్నోరద్భుతకర్మణః |
గంగా సంప్లావయామాస యజ్ఞవాటం మహత్మనః ||

35

తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో జహ్నుశ్చ రాఘవ |
అపిబచ్చ జలం సర్వం గంగాయాః పరమాద్భుతమ్ ||

36

తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః |
పూజయంతి మహాత్మానం జహ్నుం పురుషసత్తమమ్ ||

37

గంగాం చాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః |
తతస్తుష్టో మహాతేజాః శ్రోత్రాభ్యామసృజత్పునః ||

38

తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ |
జగామ చ పునర్గంగా భగీరథరథానుగా ||

39

సాగరం చాపి సంప్రాప్తా సా సరిత్ప్రవరా తదా |
రసాతలముపాగచ్ఛత్ సిద్ధ్యర్థం తస్య కర్మణః ||

40

భగీరథోఽపి రాజార్షిర్గంగామాదాయ యత్నతః |
పితామహాన్భస్మకృతానపశ్యద్దీనచేతనః ||

41

అథ తద్భస్మనాం రాశిం గంగాసలిలముత్తమమ్ |
ప్లావయద్ధూతపాప్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమ ||

42

Balakanda Sarga 43 In Telugu Pdf With Meaning

బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి ఒక సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు.

“ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను.” అని అన్నాడు.

అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహా వేగంతో భూమి మీదికి దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది.

‘ఏమీ! నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా! నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను.” అని మనసులో అనుకొంది గంగ.

గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సుమీద పడ్డ గంగను తన శిరస్సుమీద ఉన్న జటాజూటములలో బంధించాడు. గంగా దేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజూటములలో నుండి బయటకు రాలేకపోయింది.

ఆకాశము నుండి బయలు దేరిన గంగ భూమి మీదికి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకుల పడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచి పెట్టాడు.

శివుని జటాజూటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదికి ఏడు ప్రవాహములుగా ప్రవహించింది. ఆ ఏడు ప్రవాహములలో హ్లాదినీ, పావనీ, నళినీ అనే మూడు నదులు తూర్పుదిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే మూడు నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. ఏడవది ఆఖరుది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది.

భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశము నుండి భూమి మీదక ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు.

ఆ గంగానది నురగలు కక్కుకుంటూ భూమి మీదికి దూకుతూ ఉంది. భూమి మీదికి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగానూ, మరి కొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకర టింకర గానూ, కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది.

ఆగంగానది మొదట ఆకాశమునుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదికి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించి పోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయం అయ్యాయి.

మార్గ మధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చిది. తన ఆశ్రమం వద్ద జహ్నుమహాఋషి యాగము చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమమును ముంచి వేసింది. అది చూచిన జహ్ను మహాఋషికి కోపం వచ్చింది. గంగానది గర్వము అణచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేసాడు.

ఇది చూచి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. భగీరథుడు, దేవతా గణములు అందరూ జహ్ను మహాఋషిని పూజించి గంగను విడువమని వేడుకున్నారు. వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవులనుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికీ జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి.

గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది. సగర పుత్రులకు మోక్షము కల్గించాడినికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకొని వెళ్లాడు. గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగాజలములలో మునిగి సగర పుత్రులు అందరూ వారి వారి పాపములు నశించి, స్వర్గలోకము చేరుకున్నారు.

శ్రీమద్రామాయణము,
బాలకాండ, నలుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ చతుశ్చత్వారింశః సర్గః (44) >>

Ayodhya Kanda Sarga 37 In Telugu – అయోధ్యాకాండ సప్తత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 37

అయోధ్యాకాండంలోని సప్తత్రింశః సర్గంలో, రాముడు, సీత, లక్ష్మణులు గంగానదిని చేరి వల్మీకాశ్రమాన్ని సందర్శిస్తారు. వల్మీకి మహర్షి వారిని ఆత్మీయంగా స్వాగతించి, వారికి ఆశ్రమంలో నివాసం ఉండేందుకు అనుమతిస్తాడు. వల్మీకి వారికి భవిష్యత్తులో జరిగే విషయాల గురించి సూచనలు ఇస్తాడు. రాముడు వల్మీకికి తన పరిస్థితిని వివరించి, ధర్మం పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. వల్మీకి ఆశీస్సులు తీసుకుని, రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశిస్తారు. ఈ సర్గ రాముడి దైర్యం, సీతా సత్యసంధత, లక్ష్మణుని విశ్వాసం, వల్మీకి మహర్షి అనుగ్రహం గురించి వివరిస్తుంది.

చీరపరిగ్రహనిమిత్తవసిష్ఠక్రోధః

మహామాత్రవచః శ్రుత్వా రామో దశరథం తదా |
అభ్యభాషత వాక్యం తు వినయజ్ఞో వినీతవత్ || ౧ ||

త్యక్తభోగస్య మే రాజన్వనే వన్యేన జీవతః |
కిం కార్యమనుయాత్రేణ త్యక్తసంగస్య సర్వతః || ౨ ||

యో హి దత్త్వా గజశ్రేష్ఠం కక్ష్యాయాం కురుతే మనః |
రజ్జుస్నేహేన కిం తస్య త్యజతః కుంజరోత్తమమ్ || ౩ ||

తథా మమ సతాం శ్రేష్ఠ కిం ధ్వజిన్యా జగత్పతే |
సర్వాణ్యేవానుజానామి చీరాణ్యేవాఽనయంతు మే || ౪ ||

ఖనిత్రపిటకే చోభే సమానయత గచ్ఛతః |
చతుర్దశ వనే వాసం వర్షాణి వసతో మమ || ౫ ||

అథ చీరాణి కైకేయీ స్వయమాహృత్య రాఘవమ్ |
ఉవాచ పరిధత్స్వేతి జనౌఘే నిరపత్రపా || ౬ ||

స చీరే పురుషవ్యాఘ్రః కైకేయ్యాః ప్రతిగృహ్య తే |
సూక్ష్మవస్త్రమవక్షిప్య మునివస్త్రాణ్యవస్త హ || ౭ ||

లక్ష్మణశ్చాపి తత్రైవ విహాయ వసనే శుభే |
తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రతః || ౮ ||

అథాఽత్మపరిధానార్థం సీతా కౌశేయవాసినీ |
సమీక్ష్య చీరం సంత్రస్తా పృషతీ వాగురామివ || ౯ ||

సా వ్యపత్రపమాణేవ ప్రగృహ్య చ సుదుర్మనాః |
కైకేయీకుశచీరే తే జానకీ శుభలక్షణా || ౧౦ ||

అశ్రుసంపూర్ణనేత్రా చ ధర్మజ్ఞా ధర్మదర్శినీ |
గంధర్వరాజప్రతిమం భర్తారమిదమబ్రవీత్ || ౧౧ ||

కథం ను చీరం బధ్నంతి మునయో వనవాసినః |
ఇతి హ్యకుశలా సీతా సా ముమోహ ముహుర్ముహుః || ౧౨ ||

కృత్వా కంఠే చ సా చీరమేకమాదాయ పాణినా |
తస్థౌ హ్యకుశలా తత్ర వ్రీడితా జనకాత్మజా || ౧౩ ||

తస్యాస్తత్క్షిప్రమాగమ్య రామో ధర్మభృతాం వరః |
చీరం బబంధ సీతాయాః కౌశేయస్యోపరి స్వయమ్ || ౧౪ ||

రామం ప్రేక్ష్య తు సీతాయాః బధ్నంతం చీరముత్తమమ్ |
అంతఃపురగతా నార్యో ముముచుర్వారి నేత్రజమ్ || ౧౫ ||

ఉచుశ్చ పరమాయస్తా రామం జ్వలితతేజసమ్ |
వత్స నైవం నియుక్తేయం వనవాసే మనస్వినీ || ౧౬ ||

పితుర్వాక్యానురోధేన గతస్య విజనం వనమ్ |
తావద్దర్శనమస్యాం నః సఫలం భవతు ప్రభో || ౧౭ ||

లక్ష్మణేన సహాయేన వనం గచ్ఛస్వ పుత్రక |
నేయమర్హతి కళ్యాణీ వస్తుం తాపసవద్వనే || ౧౮ ||

కురు నో యాచనాం పుత్ర సీతా తిష్ఠతు భామినీ |
ధర్మనిత్యః స్వయం స్థాతుం న హీదానీం త్వమిచ్ఛసి || ౧౯ ||

తాసామేవంవిధా వాచః శృణ్వన్దశరథాత్మజః |
బబంధైవ తదా చీరం సీతయా తుల్యశీలయా || ౨౦ ||

చీరే గృహీతే తు తయా సమీక్ష్య నృపతేర్గురుః |
నివార్య సీతాం కైకేయీం వసిష్ఠో వాక్యమబ్రవీత్ || ౨౧ ||

అతిప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని |
వంచయిత్వా చ రాజానం న ప్రమాణేఽవతిష్ఠసే || ౨౨ ||

న గంతవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే |
అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనమ్ || ౨౩ ||

ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినామ్ |
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీమ్ || ౨౪ ||

అథ యాస్యతి వైదేహీ వనం రామేణ సంగతా |
వయమప్యనుయాస్యామః పురం చేదం గమిష్యతి || ౨౫ ||

అంతపాలాశ్చ యాస్యంతి సదారో యత్ర రాఘవః |
సహోపజీవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదమ్ || ౨౬ ||

భరతశ్చ సశత్రుఘ్నశ్చీరవాసా వనేచరః |
వనే వసంతం కాకుత్థ్సమనువత్స్యతి పూర్వజమ్ || ౨౭ ||

తతః శూన్యాం గతజనాం వసుధాం పాదపైః సహ |
త్వమేకా శాధి దుర్వృత్తా ప్రజానామహితే స్థితా || ౨౮ ||

న హి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతిః |
తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి || ౨౯ ||

న హ్యదత్తాం మహీం పిత్రా భరతః శాస్తుమర్హతి |
త్వయి వా పుత్రవద్వస్తుం యది జాతో మహీపతేః || ౩౦ ||

యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి |
పితృర్వంశచరిత్రజ్ఞః సోఽన్యథా న కరిష్యతి || ౩౧ ||

తత్త్వయా పుత్రగర్ధిన్యా పుత్రస్య కృతమప్రియమ్ |
లోకే హి స న విద్యేత యో న రామమనువ్రతః || ౩౨ ||

ద్రక్ష్యస్యద్యైవ కైకేయి పశువ్యాలమృగద్విజాన్ |
గచ్ఛతః సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్ || ౩౩ ||

అథోత్తమాన్యాభరణాని దేవి
దేహి స్నుషాయై వ్యపనీయ చీరమ్ |
న చీరమస్యాః ప్రవిధీయతేతి
న్యవారయత్తద్వసనం వసిష్ఠః || ౩౪ ||

ఏకస్య రామస్య వనే నివాస-
-స్త్వయా వృతః కేకయరాజపుత్రీ |
విభూషితేయం ప్రతికర్మనిత్యా
వసత్వరణ్యే సహ రాఘవేణ || ౩౫ ||

యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ
సుసంవృతా గచ్ఛతు రాజపుత్రీ |
వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానై-
-ర్నేయం వృతా తే వరసంప్రదానే || ౩౬ ||

తస్మింస్తథా జల్పతి విప్రముఖ్యే
గురౌ నృపస్యాప్రతిమప్రభావే |
నైవ స్మ సీతా వినివృత్తభావా
ప్రియస్య భర్తుః ప్రతికారకామా || ౩౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తత్రింశః సర్గః || ౩౭ ||

Ayodhya Kanda Sarga 37 Meaning In Telugu

సుమంత్రుడు, మంత్రి సిద్ధార్థుడు పలికిన మాటలు అన్నీ విన్నాడు రాముడు. తరువాత వినయంగా దశరథునితో ఇలా అన్నాడు. “తండ్రిగారూ! తమరు ఏల శ్రమ తీసుకుంటారు. వనములో ఉంటూ కందమూలములు భుజిస్తూ భూమి మీద పడుకొనేవాళ్లము మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు. ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగును ఇచ్చిన తరువాత, దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టు ఉంది. రాజ్యమే పోయిన తరువాత పరివారము రాజలాంఛనాలు ఎందుకు చెప్పండి. మాకు ఏమీ అవసరము లేదు. ఆ రాజభోగములు అన్నీ భరతుని అనుభవించ మని చెప్పండి. మాకు కట్టుకోడానికి నారచీరలు తెప్పించండి. మేము రేపటి నుండి వనవాసము చేయబోతున్నాము. మాకు కావలసినవి నేల చదును చేసుకోడానికి ఒక గునపము, గంప. అంతే. అవి తీసుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.” అని అన్నాడురాముడు.

ఇంతలో కైక కలుగచేసుకొని “నారచీరలు సిద్ధంగా ఉ న్నాయి. మీరు కట్టుకోవడమే తరువాయి” అని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారచీరలు అక్కడకు తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా నార చీరలు ధరించాడు.

కాని సీత మాత్రం ఆ నారచీరలు కట్టుకోడానికి చాలాఅవస్థ పడింది. ముందు ఆ నారచీరలను చూచి భయపడింది. పుట్టినప్పటి నుండి పట్టు వస్త్రములు తప్ప వేరు వస్త్రములు ధరించి ఎరుగదు. అసలు అప్పటిదాకా సీత నారచీరలను చూడనే లేదు. అందుకని కైక ఇచ్చిన నారచీరలు చూచి భయపడింది సీత. కళ్లనిండా నీళ్లు తిరిగాయి. రాముని వంక చూచింది. “వనములలో నివసించే మునికాంతలు ఈ నారచీరలు ఎలా ధరిస్తాతో నాకు తెలియదు. నేను ఏమి చెయ్యాలి. ఎలా కట్టుకోవాలి” అని రాముని అడిగింది.

రాముడు కూడా అయోమయంగా చూస్తున్నాడు. సీత ఆ నారచీరలను చేతిలో పట్టుకొని సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉంది. ఇంక చేసేది లేక రాముడు స్వయంగా తానే సీతకు ఆమె కట్టుకున్న బట్టల మీదనే ఆనారచీరలు చుట్టబెట్టాడు. ఆ దృశ్యం చూచి అంతఃపుర కాంతలు కన్నీరుమున్నీరుగా ఏడిచారు.

ఇంక తట్టుకోలేక వారందరూ రాముని వద్దకు వచ్చి “రామా! నిన్ను అడవులకు వెళ్లమన్నారు కానీ సీతను కాదు కదా! నీవునీ తండ్రి మాటను కాదనలేక అడవులకుపోతున్నావు. నీతో కూడా సీత ఎందుకు. నీవు లక్ష్మణుడు అడవులకు వెళ్లండి. సీత సుకుమారి. ఈమె అడవులలో నివసించలేదు. కాబట్టి, మా ప్రార్థనను మన్నించి సీతను ఇక్కడనే వదిలిపెట్టు. మేము ఆమెను కంటికి రెప్పలాగా చూచుకుంటాము. నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్లు.” అని ముక్త కంఠంతో అన్నారు.

రాముడు వారి మాటలు వినీ విననట్టు సీతకు చీర కడుతున్నాడు. ఆ సమయంలో వసిష్ఠుడు కైకనుచూచి ఇలా అన్నాడు. నీ ‘ ఓ కైకా! నీవు మరీ మితిమీరుతున్నావు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ చర్యల వలన ఇక్ష్వాకు వంశమును అపవిత్రము చేస్తున్నావు. నీవు నీ భర్తను మోసం చేసావు. అంతటితో తృప్తి పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. రాజపురోహితు నిగా ఆదేశిస్తున్నాను. సీత అడవులకు వెళ్ల వలసిన అవసరం లేదు. రాముని బదులు సీత సింహాసనము మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది. భర్తకు భార్య ఆత్మ వంటిది. కాబట్టి రాముని శరీరం అడవులకు వెళ్లినా రాముని ఆత్మఅయిన సీత రాజ్యపాలన చేస్తుంది. అలా కాకుండా సీత కూడా అరణ్యములకు వెళితే మేముకూడా అరణ్యములకు వెళతాము. అయోధ్య సాంతం మమ్ములను అనుసరిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య.

జనం అంతా అక్కడేఉంటారు. మంత్రులు సేనానులు రాజోద్యోగులు జానపదులు అంతా రాముడి వెంట ఉంటారు. ఇంతమంది రాముని వెంట ఉంటే రాముడు అంటే ప్రాణంపెట్టే భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉంటారా వారు కూడా నార చీరలు ధరించి రాముని వెంట అరణ్యములలో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి! నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు. అది నీకు ఇష్టమా! రాముడు లేని అయోధ్య రాజధాని కాదు. రాముడు లేని రాజ్యము రాజ్యము కాదు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. ఆ సంగతి తెలుసుకో!
మరొక విషయం గుర్తు పెట్టుకో. భరతుడు దశరథుని కుమారుడు. అందువలన తండ్రి ఇష్టపడి రాజ్యము ఇవ్వనిదే తాను రాజ్యము స్వీకరించడు.

నీ మాట విని భరతుడు రాజ్యము స్వీకరిస్తే అతడు దశరథుని కుమారుడు కాజాలడు. నీవు భరతునికి రాజ్యాభి షేకము చేసి రాజమాతగా రాజభోగములు అనుభవించాలని ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావు. కానీ రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు. రాముడు త్యజించిన రాజ్యమును స్వీకరిం ఓ కైకా! వల్లమాలిన పుత్ర ప్రేమతో నీవు నీ కుమారునికి తీరని అపకారము చేస్తున్నావు. ఒక్క భరతుడే కాదు, రాముని మాట జవదాటే వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. రాముడు వనవాసము నకు వెళుతుంటే అయోధ్యలో ఉన్న ఏనుగులు గుర్రములు, ఇతర జంతువులు, తుదకు పక్షులు, చెట్లు చేమలు కూడా రాముడు వెళ్లినవైపు చూస్తూ నిలుచుంటాయి. ఆ దృశ్యము ఇప్పుడే నీవు కనులారా చూడగలవు.

కాబట్టినా మాటవిను. సీతకు ఇచ్చిన నారచీరను వెనక్కు తీసుకో. ఆమెకు పట్టు బట్టలు ఇవ్వు. ఆభరణాలు ఇవ్వు. ఎందుకంటే నీవు రాముని నారచీరలు కట్టుకొని అరణ్యవాసము చెయ్యమని కోరావు కానీ సీతను లక్ష్మణుని నారచీరలు కట్టుకొనమని కోరలేదుగా.” అని వసిష్ఠుడు సీతను చూచి “సీతా! నీవు నారచీరలు కట్టుకో నవసరములేదు. నీవు మామూలుగానే నీవు రోజూ ధరించే వస్త్రములు,ఆభరణుము ధరించు. సీత వెంట ఆమె పరివారము, ఆమెకు రోజూ కావలసిన వస్త్రములు, ఆభరణములు, వస్తువులు అశేషంగా పంపబడతాయి. ఓ కైకా! దీనికి నీవు అడ్డుపెట్టలేవు. ఎందుకంటే నీవు కోరిన కోరికలలో సీత కూడా అరణ్యవాసము చెయ్యాలి అని నీవు కోరలేదు. అది గుర్తుంచుకో!” అని వసిష్ఠుడు కైకతో కోపంగా పలికాడు. ఆయన మాటలు విన్న తరువాత కూడా సీత, తననిర్ణయం మార్చుకోలేదు. రాముని వెంట వనములకు వెళ్లడానికి సిద్ధం అయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టాత్రింశః సర్గః (38) >>

Ayodhya Kanda Sarga 36 In Telugu – అయోధ్యాకాండ షట్త్రింశః సర్గః 

Ayodhya Kanda Sarga 36

అయోధ్యాకాండంలోని షట్త్రింశః సర్గంలో, దశరథుడు రాముడిని అరణ్యవాసానికి పంపిన తరువాత తపిస్తున్నాడు. ఆయన దుఃఖముతో ఆవేశపడతాడు మరియు కౌసల్య, సుమిత్రలు అతని బాధను తీర్చడానికి ప్రయత్నిస్తారు. దశరథుడు తన అజ్ఞానంలో చేసిన తప్పిదాలను గుర్తు చేసుకుంటాడు. గతంలో చేసిన ఒక పెద్ద పాపం కారణంగా అతను ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని భావిస్తాడు. చివరికి దశరథుడు, రాముడిని తలచుకుంటూ, మరణం పొందుతాడు. రాజమహలంలో ఉన్న అందరికి ఈ వార్త తెలుసుకుని, వారు శోకసముద్రంలో మునిగిపోతారు. ఈ సర్గ రామాయణంలోని భావోద్వేగభరితమైన భాగాలను చూపిస్తుంది.

సిద్ధార్థప్రతిబోధనమ్

తతః సుమంత్రమైక్ష్వాకః పీడితోఽత్ర ప్రతిజ్ఞయా |
సబాష్పమతినిశ్వస్య జగాదేదం పునః పునః || ౧ ||

సూత రత్నసుసంపూర్ణా చతుర్విధబలా చమూః |
రాఘవస్యానుయాత్రార్థం క్షిప్రం ప్రతివిధీయతామ్ || ౨ ||

రూపాజీవాశ్చ వాదిన్యో వణిజశ్చ మహాధనాః |
శోభయంతు కుమారస్య వాహినీం సుప్రసారితాః || ౩ ||

యే చైనముపజీవంతి రమతే యైశ్చ వీర్యతః |
తేషాం బహువిధం దత్త్వా తానప్యత్ర నియోజయ || ౪ ||

ఆయుధాని చ ముఖ్యాని నాగరాః శకటాని చ |
అనుగచ్ఛంతు కాకుత్థ్సం వ్యాధాశ్చారణ్యగోచరాః || ౫ ||

నిఘ్నన్మృగాన్కుఞ్జరాంశ్చ పిబంశ్చారణ్యకం మధు |
నదీశ్చ వివిధాః పశ్యన్న రాజ్యస్య స్మరిష్యతి || ౬ ||

ధాన్యకోశశ్చ యః కశ్చిద్ధనకోశశ్చ మామకః |
తౌ రామమనుగచ్ఛేతాం వసంతం నిర్జనే వనే || ౭ ||

యజన్పుణ్యేషు దేశేషు విసృజంశ్చాప్తదక్షిణాః |
ఋషిభిశ్చ సమాగమ్య ప్రవత్స్యతి సుఖం వనే || ౮ ||

భరతశ్చ మహాబాహుః అయోధ్యాం పాలయిష్యతి |
సర్వకామైః పునః శ్రీమాన్రామః సంసాధ్యతామితి || ౯ || [సహ]

ఏవం బ్రువతి కాకుత్స్థే కైకేయ్యా భయమాగతమ్ |
ముఖం చాప్యగమచ్ఛోషం స్వరశ్చాపి న్యరుధ్యత || ౧౦ ||

సా విషణ్ణా చ సంత్రస్తా ముఖేన పరిశుష్యతా |
రాజానమేవాభిముఖీ కైకేయీ వాక్యమబ్రవీత్ || ౧౧ ||

రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ |
నిరాస్వాద్యతమం శూన్యం భరతో నాభిపత్స్యతే || ౧౨ ||

కైకేయ్యాం ముక్తలజ్జాయాం వదంత్యామతిదారుణమ్ |
రాజా దశరథో వాక్యమువాచాయతలోచనామ్ || ౧౩ ||

వహంతం కిం తుదసి మాం నియుజ్య ధురి మాఽహితే |
అనార్యే కృత్యమారబ్ధం కిం న పూర్వముపారుధః || ౧౪ ||

తస్యైతత్క్రోధసంయుక్తంముక్తం శ్రుత్వా వరాంగనా |
కైకేయీ ద్విగుణం క్రుద్ధా రాజానమిదమబ్రవీత్ || ౧౫ ||

తవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధత్ |
అసమంజ ఇతి ఖ్యాతం తథాఽయం గంతుమర్హతి || ౧౬ ||

ఏవముక్తోధిగిత్యేవ రాజా దశరథోఽబ్రవీత్ |
వ్రీడితశ్చ జనః సర్వః సా చ తం నావబుధ్యత || ౧౭ ||

తత్ర వృద్ధో మహామాత్రః సిద్ధార్థో నామ నామతః |
శుచిర్బహుమతో రాజ్ఞః కైకేయీమిదమబ్రవీత్ || ౧౮ ||

అసమంజో గృహీత్వా తు క్రీడితః పథి దారకాన్ |
సరయ్వాః ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతిః || ౧౯ ||

తం దృష్ట్వా నాగరాః సర్వే క్రుద్ధా రాజానమబ్రువన్ |
అసమంజం వృణీష్వైకమస్మాన్వా రాష్ట్రవర్ధన || ౨౦ ||

తానువాచ తతో రాజా కిం నిమిత్తమిదం భయమ్ |
తాశ్చాపి రాజ్ఞా సంపృష్టా వాక్యం ప్రకృతయోఽబ్రువన్ || ౨౧ ||

క్రీడతస్త్వేష నః పుత్రాన్బాలానుద్భ్రాంతచేతనః |
సరయ్వాం ప్రక్షిపన్మౌర్ఖ్యాదతులాం ప్రీతిమశ్నుతే || ౨౨ ||

స తాసాం వచనం శ్రుత్వా ప్రకృతీనాం నరాధిపః |
తం తత్యాజాహితం పుత్రం తేషాం ప్రియచికీర్షయా || ౨౩ || [తాసాం]

తం యానం శీఘ్రమారోప్య సభార్యం సపరిచ్ఛదమ్ |
యావజ్జీవం వివాస్యోఽయమితి స్వానన్వశాత్పితా || ౨౪ ||

స ఫాలపిటకం గృహ్య గిరిదుర్గాణ్యలోలయత్ |
దిశః సర్వాస్త్వనుచరన్స యథా పాపకర్మకృత్ || ౨౫ ||

ఇత్యేవమత్యజద్రాజా సగరో వై సుధార్మికః |
రామః కిమకరోత్పాపం యేనైవముపరుధ్యతే || ౨౬ ||

న హి కంచన పశ్యామో రాఘవస్యాగుణం వయమ్ |
దుర్లభో హ్యస్య నిరయః శశాంకస్యేవ కల్మషమ్ || ౨౭ ||

అథవా దేవి దోషం త్వం కంచిత్పశ్యసి రాఘవే |
తమద్య బ్రూహి తత్వేన తతో రామో వివాస్యతామ్ || ౨౮ ||

అదుష్టస్య హి సంత్యాగః సత్పథే నిరతస్య చ |
నిర్దహేదపి శక్రస్య ద్యుతిం ధర్మనిరోధనాత్ || ౨౯ ||

తదలం దేవి రామస్య శ్రియా విహతయా త్వయా |
లోకతోఽపి హి తే రక్ష్యః పరివాదః శుభాననే || ౩౦ ||

శ్రుత్వా తు సిద్ధార్థవచో రాజా శ్రాంతతరస్వనః |
శోకోపహతయా వాచా కైకేయీమిదమబ్రవీత్ || ౩౧ ||

ఏతద్వచో నేచ్ఛసి పాపవృత్తే
హితం న జానాసి మమాత్మనో వా |
ఆస్థాయ మార్గం కృపణం కుచేష్టా
చేష్టా హి తే సాధుపథాదపేతా || ౩౨ ||

అనువ్రజిష్యామ్యహమద్య రామం
రాజ్యం పరిత్యజ్య ధనం సుఖం చ |
సహైవ రాజ్ఞా భరతేన చ త్వం
యథా సుఖం భుంక్ష్వ చిరాయ రాజ్యమ్ || ౩౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్త్రింశః సర్గః || ౩౬ ||

Ayodhya Kanda Sarga 36 Meaning In Telugu

సుమంత్రుడి మాటలు, కైక మొండి పట్టు చూస్తున్నాడు. దశరథుడు. సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ సుమంత్రా! ఈ మూర్ఖురాలు ఎంత చెప్పినా వినదు. కాబట్టి రాముని అరణ్యవాసమునకు ఏర్పాట్లు చెయ్యి. రామునికి రథము ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వెళ్లుటకు చతురంగ బలములతో సైన్యమును ఏర్పాటు చెయ్యి. రాముని వెంట వాద్య విశేషములను, నర్తకులను, వేశ్యలను పంపించు. రామునికి ఎవ్వరైతే ఇష్టమో వారిని ఎంత ధనమైనా ఇచ్చి రాముని వెంట అరణ్యములకు పంపు. రాముని వెంట అనేక రకములైన ఆయుధములను, బండ్లమీద పంపు. రామునికి వేటలో సాయం చెయ్యడానికి వ్యాధులను (బోయవారిని) పంపు. రామునికి అవసరమైన ధనమును ధాన్యములను సమృద్ధిగా పంపించు. రాముడు అరణ్యములలో కూడా యాగములు యజ్ఞములు చేస్తూ, ఋషులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇస్తూ, సుఖంగా ఉండాలి. ఇక్కడ భరతుడు రాజ్యము చేస్తూ ఎలాంటి సుఖములు అనుభవిస్తాడో, అన్ని సుఖములను రాముడు అరణ్యములలో అనుభవిస్తాడు. …”అని చెబుతున్నాడు దశరథుడు.

ఇవన్నీ విన్న కైకకు భయం పట్టుకొంది. ఇవన్నీ ఉంటే రాముడు అడవులలో ఉన్నా ఒకటే అయోధ్యలో ఉన్నా ఒకటే అనుకొంది. దశరథుని చూచిఇలా అంది. “ఓ మహారాజా! సైనికులు, బ్రాహ్మణులు, జానపదులు అందరూ వెళ్లిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు తాగుబోతులు, దుండగులు తప్ప. ఇలాంటిరాజ్యము భరతునికి అక్కరలేదు. అంతా తిన్న తరువాత మిగిలిన ఎంగిలి మెతుకుల్లాంటి ఈ రాజ్యము భరతునికి ఎందుకు? ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం?” అనిసూటిగా అడిగింది.

దానికి దశరథుడు కోపంతో ఇలా అన్నాడు. ” ఓ కైకా! నువ్వునాకు భార్యవు కావు. శత్రువు. నన్ను బండికి కట్టి లాగమంటున్నావు. అదీ కాకుండా కర్రతో పొడుస్తావా. రామునికి ఎలాంటి సౌకర్యాలు ఉండకూడదు అని మొదటే చెప్పవచ్చు కదా. నన్ను అన్నీ చెప్పనిచ్చి ఇప్పుడు కాదు అంటావా దుర్మార్గురాలా!” అని కోపంతో అన్నాడు దశరథుడు.

అంతే కోపంతో కైక దశరథునికి బదులు చెప్పింది. ” ఓ రాజా! తమరి వంశంలో సగరుడు తన పెద్దకొడుకు అసమంజుని రాజ్యం ఇవ్వకుండా వెళ్లగొట్టాడు. రాముడు కూడా అలా కట్టుబట్టలతో వెళ్లాలి.”అని ఖచ్చితంగా పలికింది కైక. ఉంది. ఆసమయంలో అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే దశరథుని మంత్రి ఇలా అన్నాడు.

“కైకకు అసలు విషయం తెలియనట్టు ఉంది. సగరుడి పెద్దకొడుకు అసమంజుడు దుర్మార్గుడు. ఆడుకొనే పిల్లలను పట్టుకొని సరయూ నదిలో విసిరేసేవాడు. వాళ్లు గిలా గిలా కొట్టుకుంటుంటే చూచి ఆనందించేవాడు. అప్పుడు పౌరులందరూ సగరుని చూచి “ఓ రాజా! మీకు దుర్మార్గుడైన కుమారుడు అసమంజుడు కావాలా లేక అయోధ్య కావాలా తేల్చుకోండి” అని అన్నారు. సగరుడకి ఏమీ అర్థం కాలేదు. ” ఎందుకు అలా అడుగుతున్నారు?” అని అడిగాడు. అప్పుడు ప్రజలు ఇలా చెప్పారు. ” ఓ రాజా! నీ కుమారుడు అసమంజుడు బుద్ధిలేనివాడు, మూర్ఖుడు. క్రూరుడైన మీ కుమారుడు మా పిల్లలను సరయూనదిలోకి విసిరేసి ఆనందిస్తున్నాడు. అందుకని అలా అన్నాము అని అన్నారు పౌరులు. వెంటనే సగరుడు తనపెద్దకుమారుడు అసమంజుని, అతని భార్యను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్ల గొట్టాడు.

కాబట్టి, దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడు అయిన అసమంజునికి రామునికి పోలికా. రాముడు ఏం తప్పు చేసాడని ఆయనను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెళ్లగొడు తున్నారు. చంద్రునిలో ఏ దోషమూ లేనట్టు రామునిలో మాకు గానీ, అయోధ్యా పౌరులకు కానీ ఏదోషమూ కనపడటం లేదు. ధర్మాత్ముడైన రామునిలో ఏ దోషమూ ఉండటానికి అవకాశము లేదు. పోనీ మీ కళ్లకు రామునిలో ఏ దోషమైనా కనబడితే అది అందరి ముందూ స్పష్టంగా చెప్పండి. రామునిలో దోషము ఉన్నట్టు మీరు నిరూపించ గలిగితే రాముని అడవులకు పంపవచ్చును. అలా కాకుండా, ఏ దోషమూ లేని, ధర్మాన్ని పాటించే రాముని అకారణంగా అడవులకు పంపడం అధర్మం. అక్రమం. అది ఈ అయోధ్యనే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఓ కైకా! మీరు అయోధ్యను కాపాడండి. మీకూ చెడ్డపేరు తెచ్చుకోకండీ. మామాట మన్నించండి.” అని అన్నాడు సిద్ధార్థుడు అనే మంత్రి.
ఆ మాటలకు కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉన్న కైకను చూచి దశరథుడు ఇలా అన్నాడు. “ఓ కైకా! నీకు నిజంగానే బుద్ధిలేదు. లేకపోతే అంత విపులంగా నీ మేలుగోరి సిద్ధార్థుడు చెప్పిన మాటలను కూడా లెక్క చెయ్యడం లేదు. ఇంక నీతో వాదించి లాభం లేదు. నేను కూడా నా రామునితో పాటు అరణ్యములకు పోతాను. నీవు నీ కుమారుడు సుఖంగా రాజ్యం ఏలుకోండి. ” అని అక్కసుగా అన్నాడు దశరథుడు.

శ్రీమద్రామాయణము,
అయోధ్యాకాండము ముప్పదిఆరవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తత్రింశః సర్గః (37) >>

Balakanda Sarga 50 In Telugu – బాలకాండ పంచాశః సర్గః

Balakanda Sarga 50 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ పంచాశః సర్గ అంటే 50వ సర్గ. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళతాడు. మార్గమధ్యలో, వారు గంగానదిని దాటుతారు. సారథి సుమంతుడు గంగానది మహిమలను వివరించగా, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రునితో కలిసి గంగానదిని గౌరవంగా దర్శిస్తారు. తరువాత, గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు.

జనకసమాగమః

తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ |
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

1

రామస్తు మునిశార్దూలమువాచ సహలక్ష్మణః |
సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి జనకస్య మహాత్మనః ||

2

బహూనీహ సహస్రాణి నానాదేశనివాసినామ్ |
బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్ ||

3

ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీశతసంకులాః |
దేశో విధీయతాం బ్రహ్మన్యత్ర వత్స్యామహే వయమ్ ||

4

రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః |
నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే ||

5

విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా |
శతానందం పురస్కృత్య పురోహితమనిందితమ్ ||

6

ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః |
ఋత్విజోఽపి మహాత్మానస్త్వర్ఘ్యమాదాయ సత్వరమ్ ||

7

విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్రపురస్కృతమ్ |
ప్రతిగృహ్య తు తాం పూజాం జనకస్య మహాత్మనః ||

8

పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయమ్ |
స తాంశ్చాపి మునీన్పృష్ట్వా సోపాధ్యాయపురోధసః ||

9

యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ప్రహృష్టవత్ |
అథ రాజా మునిశ్రేష్ఠం కృతాంజలిరభాషత ||

10

ఆసనే భగవానాస్తాం సహైభిర్మునిపుంగవైః | [సత్తమైః]
జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః ||

11

పురోధా ఋత్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః |
ఆసనేషు యథాన్యాయముపవిష్టాన్సమంతతః ||

12

దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రమథాబ్రవీత్ |
అద్య యజ్ఞసమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా ||

13

అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా |
ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవ ||

14

యజ్ఞోపసదనం బ్రహ్మన్ప్రాప్తోఽసి మునిభిః సహ |
ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః ||

15

తతో భాగార్థినో దేవాన్ద్రష్టుమర్హసి కౌశిక |
ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా ||

16

పునస్తం పరిపప్రచ్ఛ ప్రాంజలిః ప్రణతో నృపః |
ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ ||

17

గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ |
పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ ||

18

అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ |
యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ ||

19

కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే |
పుండరీకవిశాలాక్షౌ వరాయుధధరావుభౌ ||

20

బద్ధగోధాంగులిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ |
కాకపక్షధరో వీరౌ కుమారావివ పావకీ ||

21

రూపైదార్యర్గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణౌ |
ప్రకాశ్య కులమస్మాకం మాముద్ధర్తుమిహాగతౌ ||

22

[* వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే | *]
భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరమ్ |
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః ||

23

[కాకపక్షధరౌ వీరౌ]
కస్య పుత్రౌ మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః |
తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః ||

24

న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ |
సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా ||

25

తచ్చాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనమ్ |
అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్ |
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా ||

26

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే |
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహామునిః ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచాశః సర్గః ||

Balakanda Sarga 50 Meaning In Telugu

యాభయ్యవ సర్గ

రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మునులు అందరూ మిథిలా నగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహూతులతో మిథిలా నగరము క్రిక్కిరిసి పోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది.

అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు.” అని అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దములేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథిగృహమును ఏర్పాటు చేసాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది.

జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంట బెట్టుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు.

“ఓ జనక మహారాజా! నీకు క్షేమమేనా! నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా! యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా!” అని అడిగాడు.

తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, ఉపా ధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిని కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వా

మిత్రుడు ఆసనము మీద కూర్చున్నాడు. తరువాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

” ఓ మహర్షీ! మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేసారు. తమరి దర్శనభాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. ఓ విశ్వామిత్ర మహర్షీ! యజ్ఞము సమాప్తమగుటకు ఇంక పన్నెండు దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అందరూ వస్తారు.” అని అన్నాడు…

తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు.

“ఓ మహర్షి! ఈ రాకుమారులు ఎవరు? వీరు మహా పరాక్రమ వంతుల మాదిరి కనపడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు. వీరు ఇరువురూ ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వీరు ధనుర్బాణములను, ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్య చంద్రులు ఒకే సారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశము రాకుమారులు? మీ వెంట కాలి నడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పనిమీద వచ్చారు? సెలవియ్యండి.” అని వినయంగా అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు.

“ఓ జనకమహారాజా! వీరు క్షత్రియ కుమారులు. అయోధ్యా నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజునకు పుత్రులు. నేను సిద్ధాశ్రమములో ఒక యజ్ఞము తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను. వీరు ఇరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు. తరువాత అహల్యా దర్శనము చేసుకొని, గౌతమ మహామునిని కలుసుకొని, అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడటానికి కుతూహలపడుతున్నారు.” అని విశ్వామిత్రుడు జనకునితో రామ లక్ష్మణులకు గురించి వివరంగా చెప్పాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Balakanda Sarga 52 In Telugu – బాలకాండ ద్విపంచాశః సర్గః

Balakanda Sarga 52 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ ద్విపంచాశః సర్గ అంటే 52వ సర్గ. ఈ సర్గలో, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళతాడు. మిథిలాకు చేరుకున్న తరువాత, వారు జనక మహారాజును కలుస్తారు. జనకుడు రామలక్ష్మణులను చూసి ఆనందపడి, వారిని ఆత్మీయంగా స్వాగతిస్తాడు. జనకుడు సీతా స్వయంవరానికి సంబంధించిన వివరాలను వారికి వివరిస్తాడు.

వసిష్ఠాతిథ్యమ్

స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః | [తం]
ప్రణమ్య విధినా వీరో వసిష్ఠం జపతాం వరమ్ ||

1

స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా |
ఆసనం చాస్య భగవాన్వసిష్ఠో వ్యాదిదేశ హ ||

2

ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే |
యథాన్యాయం మునివరః ఫలమూలాన్యుపాహరత్ ||

3

ప్రతిగృహ్య చ తాం పూజాం వసిష్ఠాద్రాజసత్తమః |
తపోగ్నిహోత్రశిష్యేషు కుశలం పర్యపృచ్ఛత ||

4

విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా |
సర్వత్ర కుశలం చాహ వసిష్ఠో రాజసత్తమమ్ ||

5

సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః |
పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వసిష్ఠో బ్రహ్మణః సుతః ||

6

కచ్చిత్తే కుశలం రాజన్కచ్చిద్ధర్మేణ రంజయన్ |
ప్రజాః పాలయసే రాజన్ రాజవృత్తేన ధార్మిక ||

7

కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్ఠంతి శాసనే |
కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన ||

8

కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప |
కుశలం తే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ ||

9

సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్ |
విశ్వామిత్రో మహాతేజా వసిష్ఠం వినయాన్వితః ||

10

కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తాః కథాః శుభాః |
ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరమ్ ||

11

తతో వసిష్ఠో భగవాన్కథాంతే రఘునందన |
విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ ||

12

ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల |
తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛ మే ||

13

సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతామ్ |
రాజా త్వమతిథిశ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||

14

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః |
కృతమిత్యబ్రవీద్రాజా పూజావాక్యేన మే త్వయా ||

15 [ప్రియ]

ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశ్రమే |
పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ ||

16

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః |
గమిష్యామి నమస్తేఽస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా ||

17

ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవ హి |
న్యమంత్రయత ధర్మాత్మా పునః పునరుదారధీః ||

18

బాఢమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ |
యథా ప్రియం భగవతస్తథాస్తు మునిసత్తమ ||

19

ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః |
ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః ||

20

ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ |
సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితోఽస్మ్యహమ్ ||

21

భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే |
యస్య యస్య యథాకామం షడ్రసేష్వభిపూజితమ్ ||

22

తత్సర్వం కామధుక్ క్షిప్రమభివర్ష కృతే మమ |
రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్ |
అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విపంచాశః సర్గః ||

Balakanda Sarga 52 Meaning In Telugu

విశ్వామిత్రుడు వసిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేసాడు. వసిష్ఠమహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానిం చాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠుని ఇలా అడిగాడు. “ఓ మహర్షీ! మీకు మీ శిష్యులకు క్షేమమే కదా! మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా! మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా! ” అని అడిగాడు.

విశ్వామిత్ర మహారాజా! తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారా! మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా! రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా! నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా! నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా! నీవు శత్రుసంహారము చేసి, శాంతి స్థాపన చేసావు కదా! ఓ విశ్వామిత్రా! నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా! ” అని కుశల ప్రశ్నలు అడిగాడు వసిష్ఠుడు.

వసిష్ఠుడు అడిగిన దానికి “ఓ మహర్షీ! తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరమూ కుశలముగానే ఉన్నాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహారాజా! మీరు మీ పరివారము ఈ రోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన, నీకును నీ పరివారమునకూ నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు.” అని అడిగాడు.

“ఓ వసిష్ట మహర్షీ! మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్లి వస్తాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

కాని వసిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేసాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు.

వెంటనే వసిష్ఠుడు తన వద్దఉన్న కామధేనువును పిలిచాడు.

“ఓ కామధేనువా! ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనకు అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రక రకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికీ ఎట్టి లోపము రానీయవద్దు.” అని పలికాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము,
బాలకాండము యాభైరెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ త్రిపంచాశః సర్గః (53) >>