Paramavivekulala Bandhuvulala In Telugu – పరమవివేకులాల బంధువులాల

పరమవివేకులాల బంధువులాల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో పరమవివేకులాల బంధువులాల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

పరమవివేకులాల బంధువులాల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : పరమవివేకులాల బంధువులాల
సంఖ్య : 475
పుట 320
రాగం: ధన్నాసి

ధన్నాసి

93 పరమవివేకులాల బంధువులాల
తెరదీసి మాకు నిది తెలుపరో

||పల్లవి||

యేడుజా నలమేనిలో నిందిరానాథుఁ డున్నాఁడు
వేడుకతో నతనిని వెదకరో
పూడిచి వున్నది మతిఁ బొందుగ వైకుంఠము
చూడరో ధ్యానముసేసి సోదించరో

॥పరమ ||

కొండుబయలలో గోవిందునినెలవఁట
చిడిముడితో నిట్టే చేరి పట్టరో
అడఁచి దాఁచివున్నది అందే బ్రహ్మానందము
విడువరో యీ ముడియ వెలయఁ జేపట్టరో

॥పరమ ||

వూని నల్లెఁడు నాలికలో నుండు శ్రీవేంకటేశుఁ-
డానుకొని బత్తితోడ నటు నిల్పరో
బెట్టివున్నది నామకీర్తనములందు
తానకముగా నేపొద్దుఁ దలఁచుకోరో

॥పరమ ||475

అవతారిక:

అన్నమాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో సాటివారిని తమ మనస్సులలోని అజ్ఞానపు తెరలను తొలగించి శ్రీహరిని దర్శించమని వేడుకొంటున్నారు. ఇది కూడా తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన. భావ వివరణ చదివినవారికి ఈ సంగతి వెంటనే అర్థమవుతుంది. గోవిందునికి మీమనస్సులో నెలవుగా వుంచితే బ్రహ్మానందము దానంతట అదే సిద్ధిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుని నామసంకీర్తనము నాలికపై నుంటే, యే పొద్దునైనా ఆయననే తలుస్తుంటే… తప్పక ఒకనాటికి ఆ స్వామి దయకలుగుతుంది.

భావ వివరణ:

పరమవివేకులాల (విశిష్ఠమైన వివేకము గల జ్ఞానులారా!) బంధువులారా! మాకు తెరదీసి (వివేకము చూపి) ఇది (ఈసంగతిని) తెలియజేయండయ్యా!

ఏడు’జానలు’ పొడుగున్న ఈ శరీరంలో ఇందిరానాధుడైన శ్రీహరివున్నాడు. కాని ప్రయత్నించి వెదకకపోతే మాత్రం కనబడడు. వైకుంఠము అనేది వేరేయెక్కడో లేదు. మనస్సులో శ్రీహరి వున్నట్లే, వైకుంఠము కూడా మన మెదడులోనే పూడ్చివున్నది, దాగివున్నది). అది వూరకనే కనబడదు. ధ్యానముచేసి, పరిశోధించి వెతికి చూస్తేకాని కనుపించదు. అయ్యలారా! అట్లే సోధించరో!

నెలవు (వుండేచోటు) నిజంగా యెక్కడవున్నది? కొడు బయలులోనట (పుడిసిలిలో ఇమిడిన ఆకాశములో వున్నాడట. చిడిముడితో (తొట్రుబాటుతో కూడిన జాగ్రత్తతో) ఆయనను ఇట్టే పట్టరో (మీ వశము చేసికొనండి). అందే (ఆయనను వశపరచుకొనుటలోనే) బ్రహ్మానందము, అణచిదాచివున్నది (అణిగి దాగివున్నది). ఈ ముడియ (మాట)లో దాగి వున్న బ్రహ్మానందము విడువరో (బయట పెట్టండి). వెలయజేపట్టరో (బయటపడంగానే) మీలో భద్రపరచుకొనండి.

శ్రీవేంకటేశ్వరుడు యెక్కడవున్నాడు? పూనినల్లెడు నాలుకలోవున్నాడు (వహించి అటూఇటూ కదలే నాలుకలోనే, ఆయన వున్నాడు). ఆనుకొని (దరిజేరి) ఆయనను బత్తితో (భక్తితో) మనస్సులో నిల్పరో. శ్రీహరి | నామసంకీర్తనములో మీ మనస్సును నానబెట్టి (నిమగ్నముచేసి ) యే | వేళనైనా తానకము (స్థానము)గా ధ్యానించుడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Celle Nicetalu Nike Ceri Medegudidinna In Telugu – చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న

చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న
సంఖ్య : 412
పుట:277
రాగం: సామంతం

సామంతం

94 చెల్లె నీచేఁతలు నీకే చేరి మేడెగుడిదిన్న
నల్లదె కంటిమి నిన్ను హనుమంతరాయ

||పల్లవి||

జంగ చాఁచినట్టి నీసంగడి పాదములు
చెంగలించి యెత్తిన నీ శ్రీహస్తము
ముంగలిఁ బిడికిలించి మొలఁజేర్చినచేయి
అంగ నీసొబగు హనుమంతరాయ

||చెల్లె||

పెరిగినవాలము పెద్దైన పిరుఁదును
అరిగి జలధి దాఁటే యాయితమును
సిరుల బంగారు కాసె చెలఁగిన సింగారము
అరుదాయ నీవునికి హనుమంతరాయ

||చెల్లె||

స్వామికార్యపుఁజింత జానికి సేమపువార్త
దీమసాన మగుడి యేతెంచిన చేఁత
రామనామజపముతో రతి శ్రీ వేంకటపతి
కా మేటిబంటవైతివి హనుమంతరాయ

||చెల్లె||413

అవతారిక:

“మేడెగుడిదిన్న” అనే గ్రామములో వెలసిన హనుమంతుని సేవిస్తూ అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తననాస్వాదిద్దాము. నీ చేతలు నీకే చెల్లినవి స్వామీ! అని కీర్తిస్తున్నారు. ఇటువంటి కీర్తనలు కోకొల్లలున్నాయి! జానకి క్షేమసమాచారము రాముని కెరిగించిన ధీశాలియైన బంటు అని, శ్రీవేంకటేశ్వరునికి కూడా ఈయన మేటి బంటేనట. ఆయన వునికే అరుదాయెనట.

భావ వివరణ:

అల్లదె (అదిగో) ‘మేడెగుడిదిన్న’లో చేరి వెలసిన హనుమంతరాయా! నిన్ను కంటిమి (నీ వైభవమును చూచితిమి). నీచేతలు నీకె చెల్లె (నీసాహసములు ఇతరులకు అసాధ్యము. అవినీకే చెల్లినవి ప్రభూ!)

జంగ చినట్టి నీ సంగడిపాదములు (బారగా పంగజాచినటువంటి నీ పాదముల జంట) కనువిందు చేయుచున్నవి. చెంగలించి (అతిశయముగా) యెత్తిన నీ శ్రీహస్తము (మంగళకరమైన చేయి ముంగలి బిడికిలించితివి (మీదికెత్తి పిడికిలి బిగించియుంటివి). ఇంకొక చేయి నీ మొలజేర్చితివి (నడుముపై వుంచుకొంటివి). ఓ హనుమంతరాయా! ఈ విధముగా నీసొబగు (శోభ) అంగమాయస్వామీ! (చాలవైభవయుతముగా నున్నది).

పొడవుగా పెంచిన నీ వాలము (తోక) నీ పెద్దవైన పిరుదులమధ్య వ్రేలాడుచున్నది. తిరిగి (వెళ్ళి) నూరుయోజనముల జలధిని (సముద్రమును దాటే నీయాయితము (నిడపు… అంటే… దూకగల సామర్థ్యము…) ను యేమని పొగడగలము! బంగార రంగు కాసే (వస్త్రము) వైభవోపేతముగానున్నది. ఆభరణములతో నీ సింగారము చెలగినది (కన్నుల పండువగా వున్నది). ఓ హనుమంతరాయా! నీ వునికి (వున్నవిధానము) అరుదాయ (బహు అరుదుగా చూడగలుగుతాము) స్వామీ!

జానకి క్షేమసమాచారము యెంత త్వరగా శ్రీరామచంద్రునికి అందించగలనా అన్నదే నీ ఆశయము. అదే నీ చింత (ఆలోచన). దీమసాన మగుడియేతెంచిన చేత (లంకలో రాక్షసులను చితకబాది, లంకా దహనము చేసి, రావణునికే హితబోధ చేసి సీతాదేవి చూడామణితో తిరిగివచ్చిన… నీ సాహసము…) అసాధ్యము. రామనామ జపముతో, రతికెక్కితివి (ప్రసిద్ధుడవైతివి). ఓ హనుమంతరాయా! శ్రీవేంకటపతియైన నీ రామునికే మేటి బంటువైతివి స్వామీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Samamatinani Nive Catuduvu In Telugu- సమమతినని నీవే చాటుదువు

సమమతినని నీవే చాటుదువు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సమమతినని నీవే చాటుదువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సమమతినని నీవే చాటుదువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : సమమతినని నీవే చాటుదువు
సంఖ్య : 366
పుట : 246
రాగం: వరాళి

వరాళి

95 సమమతినని నీవే చాటుదువు
రమణ నేరుపునేరము నెవ్వరివి

||పల్లవి||

రావణాదులైన రాక్షససమితిలో
నీవే దేవతలలో నీవేకావా
భావింప నసురలు పగ నీకు నేలైరి
యీవల సురులెల్ల (లేల?) హితులైరి

||సమ||

సకలజంతువులకుఁ జైతన్యుఁడవు నీవే
వొకరు నీకుపకారమొనరించేరా
అకట కొందరిఁ బాపాత్ములఁగాఁ జేసి
వెకలిఁ గొందరిఁ బుణ్యవిధులఁ జేసితివి

||సమ||

అటుగాన ఇట్టాయ నట్టాయనననేల
యిటు నీచిత్తముకొలఁ దింతేకాక
గటియించి శ్రీవేంకటపతి నీదాసు
లిటువలె ఘనులై రిదివో నీకృపను

||సమ||366

అవతారిక:

ఆ దేవదేవుడే మనందరి తండ్రి. రాక్షసులైన, దేవతలైన, మనబోటి నరులైనా, జంతుజాలములైనా, క్రిమికీటకములైన ఆయనబిడ్డలే. కాని వీరందరి బ్రతుకు ఒక్కలాగున లేవు. కొందరు సుఖిస్తుంటే కొందరు దు:ఖిస్తున్నారు. ఆయన కొందరికి మేలు చేస్తున్నట్లు కొందరిని శిక్షిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయనకు ‘సమమతి’ (సమానంగా చూచే బుద్ధి) లేదేమో అనిపిస్తుంది. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో ‘నీవే సమమతినని చాటుకొంటావు. రమణ నేరుపులెవ్వరివి, నేరములెవ్వరివి? నీకు దేవతలు చేసిన మంచేమిటి, రాక్షసులు చేసిన చెడేమిటి? వాళ్ళనెందుకు రక్షించావు, వీళ్ళనెందుకు శిక్షించావు? అంతా నీ చిత్తము మా ప్రాప్తము అంటున్నారు.

భావ వివరణ:

ప్రభూ! నీవే సమమతివని (పక్షపాతములేక అందరినీ సమానముగా చూచే బుద్ధికలవాడినని) చాటుకొంటావు. అట్లయినచో, రమణ నేరుపులెవరివి (ఆ చక్కని నేర్పుగల పనులు యెవరికి దక్కుతున్నవి) మరియు నేరములెవ్వారివి (చెడ్డపనులు యెవరికి దక్కుతున్నవి?)

రావణుడు మొదలైన రాక్షసులలో ఆత్మరూపుడవై వున్నదెవరు? నీవేకదా! దేవతలలో వున్నదీ నీవే కాదా? మరి భావించుటకు నీకు, అసురులు పగవారెందుకయ్యారు? మరి ఇటు చూస్తే సురులు నీకు యెట్లు హితులు అయ్యారు, ఇంతా చేసి ఇద్దరూ నీ సంతానమే కదా! ఎందుకు దేవతల్ని రక్షిస్తున్నావు, రాక్షసులనెందుకు భక్షిస్తున్నావు?

జంతువులన్నింటిలోనూ వున్న చైతన్య పదార్థాం ఒక్కటే. దాన్నే ప్రాణము అంటారు కొందరు. అది నీవే కదా! అటువంటప్పుడు ఒకరు నీకు ఉపకారమొనరించిరా అకట (అయ్యో!) కొందరిని పాపాత్ములను చేసినావే? వెకలి (ఆసక్తితో) కొందరిని పుణ్యవిధులు చేసే వారిగ నొనరించితివే? ఎందుకీ బేధ భావము నీకు కలుగుతున్నది? | ఒకర్మించేమిటి, ఇంకొకరి చెడేమిటి?

దీనికి కొందరు విధి అని పేరుపెట్టి, కర్మ అనే ఒక సిద్ధాంతం తీసికొనివచ్చి, అందుకని ఇట్లా అయింది. ఇందుకని అట్లా అయింది అని యేవేవో కారణాలు చెబుతారు. అసలేమిటంటే అంతా నీ చిత్తము మా ప్రాప్తము అంతేకాక ఇంకేమిటి? అవునా? ఓ శ్రీవేంకటేశ్వరా! ఏది ఏమైనా నీ దాసులు మాత్రం నీ కృపవల్ల ఘనులయ్యారు తండ్రీ! నీవు గటియించినచో (తలచుకొంటే) మేము తప్పక ఘనులమవుతాము.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Narayanuni Srinamamidi In Telugu – నారాయణుని శ్రీనామమిది

నారాయణుని శ్రీనామమిది - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నారాయణుని శ్రీనామమిది కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నారాయణుని శ్రీనామమిది – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : నారాయణుని శ్రీనామమిది
సంఖ్య : 73
పుట : 410
రాగం: కేదారగౌళ

కేదారగౌళ

96 నారాయణుని శ్రీ నామమిది
కోరినవిచ్చీఁ గోవో మనసా

||పల్లవి||

శుకవరదుని సొంపుగఁ దలంచుటె
సకలభవ విజయము
అకలంకము మహాభయహరణ
మొకటి నొకటి వోహెూ మనసా

||నారా||

పక్షిగమన శుభము (పదము?) దలంచుటే
అభయభోగ విహారమ్ము
వక్షపు లక్ష్మీవరుసే (చే?) సిరులు
లక్షలు గోట్లొల్లవొ మనసా

||నారా||

ఇంకా నీతలఁపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించఁగదో
అంకెలకిన్నియునైన యీ (?)
మంకపు గాక నమ్మవో మనసా

||నారా||73

అవతారిక:

తనమనసును హెచ్చరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. నారాయణుని శుభప్రదమైన నామము పలికితే చాలును. కోరినవిచ్చీగోవో అంటే కోరుకున్నవన్నీ ఇస్తాడు, స్వీకరించు అని అర్థం. కొన్ని మాటలకి నిఘంటువులలో కూడా సులభగ్రాహ్యమైన అర్థం దొరకదు. అది అట్లా అయ్యుంటుందని భావించాలి. “అంకెలకిన్నియునైన యీమంకపుగాక నమ్మవో మనసా” అంటున్నారు. అంటే యేమిటి? నీవశమయ్యేట్లుగా అన్నీ నీకు శ్రీహరే ఇస్తాడు. నీ మంకుతనము మాని ఆయనను నమ్మవే అని అర్థం. ఆయన హృదయవాసినియైన లక్ష్మీదేవి ఆయన ఇమ్మంటే లక్షలు, కోట్లు ఇస్తుంది. కానీ ఒల్లవో మనసా! నీవు అసలొప్పుకోవద్దు అంటున్నారు. | ఒప్పుకుంటే డబ్బుపిచ్చివాళ్ళవుతారు, మరి.

భావ వివరణ:

ఓ మనసా! శ్రీమన్నారాయణుని శ్రీనామము (మంగళప్రదమైన నామం ఇదే). హరీ! అను. ఇది నీవు కోరిన విచ్చీ (కోరికలు తీరుస్తుంది) కోవో (తీసికో…) కానీ ఆ నామాన్ని మాత్రం వదిలిపెట్టకు.

శుకమహర్షిని భాగవత బోధకునిగా చేసి అనుగ్రహించి తరింపజేసినది | శ్రీహరినామమే. ఆయనను సొంపుగా ధ్యానిస్తే సకల భవబంధాలు తొలగిపోతాయి. వాటిపై విజయము సాధించగలవు. ఆ శ్రీహరినామము అకలంకము (ఏ దోషమూ లేనిది). గొప్ప భయమును నివారించునది. | ఓహెూ! మనసా! అది ఒకటినొకటి (ఒకే యొక్కటి. అట్టిది ఇంకొకటి లేదు అని అర్థం.)

ఆ శ్రీహరి అలవాట్లు యేమిటో ఒకసారి గమనించండి. ఆయన పక్షిగమనుడు. అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతునిపై వెళ్ళేవాడు ఆయనే. క్షణాల మీద (తలచినదే తడవుగా) వచ్చి రక్షిస్తాడు. అభయప్రదాతయైన | శేషునిపై పవళిస్తాడు విహరిస్తాడు. ఆయన వక్షస్థలంపై సిరులరాణి శ్రీమహాలక్ష్మివుంటుంది. ఆయన సైగచేస్తే లక్షలు కోట్లు ఇస్తుందావిడ. కానీ ఓ వెళ్లి మనసా! వాటిని ఒల్లకే (ఆ లక్షలు కోట్లను అంగీకరించకే. చెడిపోతావు.

అవన్నీ అటుంచి ఈ మాట వినుము. నీకు ఈ ప్రాపంచిక తలపులు (కోర్కెలు) యెన్ని కలిగినా శ్రీవేంకటేశ్వరుని మాత్రము వదలిపెట్టకు. ఆయననే సేవించదో! అంకెలకిన్నియునైన యీ (నీ వశమయ్యేట్లుగా |ఆయన నీకెన్నియైనా ఈయగలడు. ఓ మనసా! మంకెపుగాక (మంకుతనమునకు పోక… అంటే… మొండిగా చెడిపోక) నమ్మవో (ఆయననే శరణు అని నమ్ముకో). తప్పక నీకు మేలు జరుగుతుంది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Svatantrumdavu Nivu Sarileni Doravu Ne In Telugu – స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే

స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే-
సంఖ్య 431
పుట:290
రాగం: తోడి

తోడి

97 స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే-
నతికమై యాడినట్లు ఆడఁబోయేవా

||పల్లవి||

యెత నీమనసునను యెట్టుండె నట్లనే
అంతయుఁ జేయవయ్య మాకదే చాలు
అంతకంటే నెక్కుడు నేమంటిమివో యటమీఁదఁ
జెంతల మా చెప్పినట్టు సేయఁబోయేవా

॥స్వతం॥

కమ్మి నీవు మునుప సంకల్పించినట్లనే
కిమ్ముల నారీతిఁ జిత్తగించవయ్య
అమ్మరో నేమందుకుఁ గాదనినను నీవు
సమ్మతించి మాతలఁపు సాగనిచ్చేవా

॥స్వతం॥

పొంచీదేహమున మమ్ముఁ బుట్టించినట్లనే
పెంచి నీపై భక్తిమాకుఁ బెనచవయ్య
నించిన శ్రీవేంకటేశ నేనే పదరితిఁగాక
మంచితనములు నీవు మానఁబోయేవా

॥స్వతం॥ 431

అవతారిక:

అన్నమాచార్యులవారి అద్భుత సృష్టి ఈ కీర్తన. స్వామీ! నీవు సర్వస్వతంత్రుడవు. నీకెవరన్నా ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని నిర్దేశించగలరా? నీకు సమానమైన యెవ్వరూలేని ప్రభువు నీవే. నేను ఆడమన్నట్లు ఆడతావా యేమిటి? నీ ఇష్టమొచ్చినట్లే చేస్తావు. ఏదో అజ్ఞానిని పైగా వదరుబోతును. నీ మంచితనం నీకే వుంటుంది. కాస్త నన్ను బాగుచేయవయ్యా! నీపై మాకు భక్తి పెంచవయ్యా! ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో తరిస్తాను. నన్ను మాత్రం నీ భక్తి నుండి విడదీయకు. నీనుండి విముఖుని చేయకు. నీకు పుణ్యం వుంటుంది. నాకు నీ భక్తి చాలు అంటున్నారు.

భావ వివరణ:

ప్రభూ! నీవు సర్వస్వతంత్రుడవు. నీకు సమానమైన వారెవ్వరూ లేని దొరవు (యేలికవు). నేనూ అతికమై (నిన్ను మించి) ఆడమన్నట్లు ఆడబోయేవా? (ఆడెదవా యేమి?) చివరికి నీ ఇష్టం వచ్చినట్లే నీవు చేస్తావు.

నీ మనసున యెంత యెట్లావుంటే అట్లనే అంతా చేయవయ్యా! నిన్ను | కాదనగలవారెవరు? నీవేమి చేస్తే మాకు అదే చాలు. అంతకంటే యెక్కువ యేమాత్రం యేమన్నాము? వో అటుమీద మేము చెప్పినట్లు చేయబోయేవా యేమి? నీకెట్లా తోస్తే అట్లాగే చేయవయ్యా!

మునుప (మేము అమ్మకడుపులోంచి బయటకు రాక మునుపే) నీవు కమ్మి సంకల్పించావు. (పైకొని నిశ్చయించావు). నాదేమున్నది? కిమ్ముల (రహస్యంగా) నారీతి జిత్తగించవయ్యా (అట్లాగే చేయవయ్యా). అమ్మరో! (అమ్మయ్యో!) నేము (మేము) అందుకు కాదనినను నీవు అంగీకరించి మా | ఇష్టం సాగనిస్తావా యేమన్నానా? అలాగే కానీవయ్యా!

పొంచీ (కావాలని) ఈ దేహము మాకిచ్చి నీవే మమ్ము పుట్టించావు. సరే! అయినదైదో అయింది. నా విన్నపమొక్కటే, మమ్మల్ని పెంచినట్లే మాకు నీపై భక్తిని కూడా పెంచవయ్యా! మంచితనము నిండిన ఓ శ్రీవేంకటేశ్వరా! నేనే పదరితిని (నేనేయేదో వాగాను). నీవు నీమంచితనం మానుకొంటావా యేమి? ఎట్లాగైనా నీవు మమ్మల్ని కరుణిస్తావు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Kadisi Yatamdu Mam Mumgacumgaka In Telugu – కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక

కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
సంఖ్య 445
పుట : 299
రాగం: శంకరాభరణం

శంకరాభరణం

3 కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
ఆదె యాతనికె శరణంటే నంటి నేను

॥పల్లవి||

యెవ్వని వుదరమున నిన్నిలోకములుండు.
యెవ్వని పాదము మోచె నిల యల్లను
యెవ్వఁడు రక్షకుఁ డాయ నీ జంతుకోట్లకు
అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు.

॥కదిసి||

సభలో ద్రౌపదిఁగాచె సర్వేశుఁ డెవ్వఁడు
అభయహస్త మొసంగె నాతఁ డెవ్వఁడు
ఇభవరదుఁ డెవ్వఁడు యీతనికే వొడిగట్టి
అభినవముగ శరణంటే నంటి నిప్పుడు

॥కదిసి||

శరణుచొచ్చిన విభీషణుఁ గాదె నెవ్వఁడు
అరిది యజుని తండ్రి యాతఁడెవ్వఁడు
యిరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతఁడితఁడే
ఆరసి యితనికే శరణంటే నంటి నిప్పుడు

॥కదిసి||

అవతారిక:

అదె యాతనికె శరణంటే నంటి నేను అనిపాడుతున్నారు. అన్నమయ్య. ఇదే ఈనాటి తెలుగులో అయితే ‘అతనికే శరణంటూ నంటిని’ అనే మాటను వుపయోగిస్తాము. ఈ కీర్తన కూడా యెన్నో పురాణ గాథలతో ముడి పెట్టబడియున్నందున మంచి పురాణ వాఙ్మయపరిచయం | వున్నవారికి మాత్రమే ఈ కీర్తనలోని లాలిత్యము అర్థమవుతుంది.

“ఎవని పాదము మోచె నిలయల్లను” అంటే ఎవ్వని పాదము భూమినంతా కొలిచింది అని అర్ధం. అవును ఎవరి పాదం భూమిని కొలిచిందో తెలుసా?

భావ వివరణ:

ఆతడు (ఆ శ్రీహరి) కదిసి (మాకు దగ్గరయై) మమ్ము గాచుగాన (రక్షిస్తాడు కాబట్టి), నేను అదె (అందుచేతనే ఆయనకే ‘శరణంటేనంటి’ (శరణు మహాప్రభో! అన్నాను.)

మేము మామూలు సాధారణమైనవాడిని ఆశ్రయించాలనుకొన్నారా యేమి? ఇన్ని లోకములు (ఈ పదినాలుగు భువనాలు) యెవ్వని వుదరములో (కడుపులో) నున్నవో, ఇలయెల్లను యెవ్వని పాదము మోచెన్? (ఈ భూమినంతా యెవరి పాదము కొలిచింది? (మనపొట్టి వామనమూర్తి). కోట్లాది జంతువులు విచక్షణా రహితంగా ఒకదాన్నొకటి చంపుకొంటూనే వుంటాయి. మరి వాటికి రక్షకుడెవడు? అవి ఇంకా యెందుకు జీవిస్తూనేవున్నాయి? వాడే జగద్విభుడు, వాడే నారాయణుడు. ఇప్పుడే నేను ఆయనకు శరణు మహాప్రభో! అన్నాను.

ఆరోజు, నిండు సభలో వస్త్రములూడదీసి దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయబోతే అక్షయముగా వలువలిచ్చి అభయ హస్తము నిచ్చిన ఆతడెవ్వరు? ఆ సర్వేశ్వరుడెవరు? ఇభవరదుడెవ్వడు (ఆనాడు కారడవి | కొలనులో తన కాలునుపట్టి పీడిస్తున్న మొసలి నుండి తనను రక్షించుకోలేక “నీవే తప్ప నిత:పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ అని రోదిస్తున్న గజేంద్రుని హుటాహుటివెళ్ళి రక్షించినదెవ్వరు? ఆతనికే అభినవముగ (కొత్తగా) ఒడిగట్టి (నిశ్చయుడనై) శరణు మహాప్రభో! అన్నాను.

ఎంత నచ్చజెప్పినా వినక, శ్రీరామపత్ని సీతను చెరబట్టి | కులఘాతకుడైన అన్న రావణాసురుని త్యజించి శరణుజొచ్చిన విభీషణుని రక్షించినదెవరు? అరిది (దుర్లభుడైన అజునకు (బ్రహ్మదేవునికే) | తండ్రియైన వాడెవరు? ఇంకెవరండీ… ఇదిగో ఇరవుయై (ఇక్కడ నెలకొని) ఈ శ్రీవేంకటాద్రిని యెక్కిన ఈయనే ఆయన… ఆయనే యీయన. అరసి (అది గ్రహించి) నేను ఇప్పుడు ఈయనకే “శ్రీవేంకటేశవమ్ శరణం ప్రపద్యే”… అని వేడుకొన్నాను. శరణంటేనంటినయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Kalige Makide Kaivalyasaramu In Telugu – కలిగె మాకిదె కైవల్యసారము

కలిగె మాకిదె కైవల్యసారము - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో కలిగె మాకిదె కైవల్యసారము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కలిగె మాకిదె కైవల్యసారము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : కలిగె మాకిదె కైవల్యసారము
సంఖ్య : 419
పుట: 281
రాగం: బౌళిరామక్రియ

బౌళిరామక్రియ

98 కలిగె మాకిదె కైవల్యసారము
ఫలించె నాడెదఁ బాడెద నేను

||పల్లవి|||

నీపాదతీర్థము నీరజభవుని
పైపై కమండలపానీయము
చేపట్టి శంభుని చిరుజడలలో
దీపించుగంగాతీర్థరాజము

||కలిగె||

ఘన నీ నామమె గౌరినాలిక పై
పనిగొన్న మంత్రపాఠము
అనుఁగువాణికి నాదిచదువులం
బెనఁచే మొదలి బీజాక్షరము

||కలిగె||

శ్రీవేంకటేశ్వర చేరి నీదాసుల
సేవ నాపాలిఁటి జీవనము
ఆవిటించి శరణాగతులకును
త్రోవయైన దిదె దోషహరము

||కలిగె|| 419

అవతారిక:

తనకు కైవల్యసారం సిద్ధించినదని ఆనందంతో ఉత్తుంగ తరంగమై కీర్తన నాలాపిస్తున్న అన్నమాచార్యులవారిని వినండి. తన ఆశయం ఫలించింది కావున ఆడెదను, పాడెదను అని నృత్యం చేస్తూ ఈ కీర్తన నాలాపిస్తున్నారు. త్రివిక్రముడైన శ్రీమన్నారాయణుని పాదాలను కడుగవలెనని బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీళ్ళను పోస్తే అది ఆకాశగంగయై ప్రవహించి భగీరథుని కోసం భూమిమీదకు చేరటానికి శివుని తలపై చేరి అక్కడనుండి భూమిపై దూకి ప్రవహించి యావత్ ప్రజానీకాన్ని పునీతుల్ని చేస్తున్నదట. గౌరీదేవి శ్రీహరి నామమంత్రం జపిస్తుందట. వాణికి మొదటి బీజాక్షరాలను ఆదేవ దేవుడే ఇచ్చాడట ప్రభూ! అట్టి నీదాసులను సేవించే భాగ్యం కలిగింది. అదే మాకు కైవల్యసారము అంటున్నారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! ఇదే మాకు కైవల్యము యొక్క సారము కలిగినది. మా కల ఫలించినది. ఇక నేను ఆడెద (నాట్యం చేస్తాను) పాడెద (కీర్తనలాలాపిస్తాను). ఇంతకీ నాకు సిద్ధించినదేమిటో వినవయ్యా!

ఓ ప్రభూ! నీరజభవుని (బ్రహ్మదేవుని) కమండలంలోని పానీయము (త్రాగేనీరు) శ్రీహరి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయుటకు త్రివిక్రముడైనాడు. అప్పుడు వున్నపళంగా ఆయన కాళ్ళు కడగాలని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళు పోసినాడట. ఆ శ్రీహరి పాదజలము ఆకాశగంగయై దివిలో ప్రవహించి భగీరథునికోసం భూమి చేరుటకు శంభుని శిరసుపై దూకి అచ్చటనుండి ఒక పాయ భూమిపై దూకి కోట్లాది ప్రజలు గంగా తీర్థమని సేవించు, గంగానదియై తీర్థరాజమైనది.

ఓ దేవా! నీ ఘననామము గౌరీదేవి నాలుకపై పనిగొన్న (పూనుకొనిన) మంత్రపఠనమైనది. ఆమె నిత్యమూ చేసే నీ నామసంకీర్తన మాకూ దిక్కైనది. నీ అనుగు కోడలైన వాణికి (సరస్వతీదేవికి) ఆనాడు | సోమకాసురుని జంపి తిరిగి తెచ్చిన ఆది చదువులను (వేదములను) | మొదటి బీజాక్షరములుగా నేడు మాకు విద్యనందించి ఆమెను చదువుల రాణిని చేసినది.

ఓ శ్రీవేంకటేశ్వరా! చేరి నేడు నీదాసులను సేవించుటే నా పాలిట జీవనమైనది. ఆవిటించి (వ్యాపించి) నీ శరణాగతులమైన మాబోటి వారికి | అది దోష రహితమై కైవల్యమునకు త్రోవ యైనది. తండ్రీ! నాబోటి అల్పుడు కూడా నిన్ను చేరే ఆధారమైనది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Harihari Yindariki Nabburamugani Yidi In Telugu – హరిహరి యిందరికి నబ్బురముగాని యిది

హరిహరి యిందరికి నబ్బురముగాని యిది - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో హరిహరి యిందరికి నబ్బురముగాని యిది కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరిహరి యిందరికి నబ్బురముగాని యిది – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన: హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
సంఖ్య : 363
పుట: 244
రాగం: లలిత

లలిత

99 హరిహరి యిందరికి నబ్బురముగాని
యిది పరగ నీదాసుఁడే పరతత్వవేది

||పల్లవి||

పొలసి మశకమండుఁ బొడమేటి జీవుని
తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపోయీనీ
నిలవెంత నీఁటెంత నీమాయ లివి భువి
బలిమిఁ దెలియువాఁడె పరతత్వవేది

||హరి||

తగిలి చూచిన నాత్మఁ దనుఁ గానరాదుగాని
జగమెల్ల దానైతే సరి గనీని
చిగురెంత చేగెంత శ్రీపతి యిందులో నీ-
పగటు దెలియువాఁడే పరతత్వవేది

||హరి||

యేవంకఁ దనబుద్ధి యెక్కడనుండునోకాని
శ్రీవేంకటేశ నిన్నుఁ జింతించీని
పూవెంత ఫలమెంత పురుషోత్తముఁడ నీ –
భావమెరుఁగువాఁడె పరతత్వవేది

||హరి||363

అవతారిక:

ఓ శ్రీహరీ! నీదాసుడొక్కడే పరతత్వవేది. (నీయొక్క పరా ప్రకృతిని తెలిసినవాడు). మిగిలినవారందరికీ నీ పరతత్వం అబ్బురముగానే వుంటుంది. ఒక మశకము (దోమ) ఎగురుతున్నదంటే జీవాత్మ రూపంలో నీవు దాంట్లో వుండబట్టే. ఆ ఆత్మ నాలోనూ వున్నది. కానీ కానరాదు. ఈ ఆత్మలన్నీ నీవే అవటంచేత జీవాత్మ పరమాత్మయై అద్వైత సిద్ధాంత ప్రతిపాదన సరైనదే అనిపిస్తున్నది. ఓ పురుషోత్తమా! నీ ఈ భావము తెలిసినవాడే నిజమైన పరతత్వవేది అంటున్నారు అన్నమాచార్యులవారు.

భావ వివరణ:

ఓశ్రీహరీ! ఇందరికి (ఇంతమందికి అబ్బురముగానిది (ఆశ్చర్యకరము కానిది ఇదే. అదేమిటంటే… నీదాసుడే ఈ జగతియందు భగవంతుని | పరతత్వము తెలిసినవాడగుచున్నాడు.

మశకమున (దోమయందు) పొలసి పొడమేటి (సంచరించుచు నెలకొన్న) జీవుడితలపులు చూడబోతే బ్రహ్మాండములను దాటిపోతున్నాయి. ఏమిటీ అద్భుతమాయ!! ఇది యెంతవున్నతమైనది! ఎంత నీటైనది (ఎంత మురిపెము కలిగించునది!) ఈ భువిలో దీనిని తెలియగలవాడెవడు? ఒకవేళ ఎవడన్నావుంటే… వాడేనయ్యా! | పరతంత్రుడంటే

తగిలి (పూని) వెదకినా ఆత్మ తాను కనబడదు. కాని సరిగా చూడగలిగితే జగమంతా అది నిండివుంటుంది. ఇదెట్లా సాధ్యమని ఆశ్చర్యపడుతున్నారా? అక్కరలేదండీ… చెట్టు చిగురిస్తున్నప్పుడు ఆ చిగురు యెంత అల్పమైనది!!. కాని దాని చేగు (చేవ లేక బలం) యెంత వుంటుంది. (అది మాను అయితే ఇంటి దూలమై కప్పునే మోస్తుంది కదా!) ఇది నీ దివ్యశక్తి. ఓ శ్రీపతీ! ఇందులో నీ పగలు (ప్రకాశము) తెలియగలమొనగాడెవడు? ఎవడన్నావుంటే వాడేనయ్యా! పరతంత్రుడంటే.

నరుడు తన బుద్ధి యేవంకనున్నా యెక్కడున్నా, ఓ శ్రీవేంకటేశా! నిన్ను జింతించీని (దానించునా?) నీకృప కలిగితే అట్లా చేయగలడు. వాడెలావుంటాడో యెవరికి తెలుసు? పూవు ఎంత సున్నితము, | కోమలముగా వుంటుంది. పండుయెంత పెద్దగా రాయిలా వుంటుంది. రుచిగా కూడా వుంటుందే!! ఓ పురుషోత్తమా! నీ ఈ భావము (లీల) యెరుగగలిగినవాడేనయ్యా! పరతంత్రుడంటే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Veduka Kaditadu Vittalesudu In Telugu – వేడుక కాడితడు విట్టలేశుడు

వేడుక కాడితడు విట్టలేశుడు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వేడుక కాడితడు విట్టలేశుడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : వేడుక కాడితడు విట్టలేశుడు
సంఖ్య ; 590
పుట : 340
రాగం: రామక్రియ

రామక్రియ

9 వేడుకకాఁ డితఁడు విట్టలేశుఁడు
వీడని పొందులు సేసీ విట్టలేశుఁడు

||పల్లవి||

వెన్నదిన్న మదమున వెలఁదులుఁ దానును
వెన్నెలలో నాడీ నిదె విట్టలేశుఁడు
పన్ని రతుల కింతులఁ బాంచజన్యరవమున
సన్న సేసి పిలిచీని సారె విట్టలేశుఁడు

॥వేడు॥

ఆసపడి కొలువులో నాడువారి మీఁదట
వేసీ విరులఁ గొని విట్టలేశుఁడు
వేసరక పదారువేలు సతులయిండ్ల
సేసవెట్టి పెండ్లాడీఁ జేరి విట్టలేశుఁడు

॥వేడు॥

మెల్లనె గందమిచ్చేటి మెలుతను గాఁగిలించి
వెల్లవిరిగాఁ గూడె విట్టలేశుఁడు
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డితఁడె తానై వుండి
యెల్లగాఁ గోనేట వరాలిచ్చె విట్టలేశుఁడు

॥వేడు॥590

అవతారిక:

వేడు కాడంటే నేటి పరిభాషలో ‘జల్సారాయుడు’ అన్నమాట. అట్లాంటి ఈ విట్టలేశుడు వీడని పొందులు సేసీ నంటున్నారు. అన్నమాచార్యులవారు. మెలత యొకతె మెల్లగా గంధమియ్యబోయిందట. ఈ విట్టలేశుడు వూరకుంటాడా? వెల్లవిరిగా ఆమెను కౌగలించి కూడినాడట. ఆ సంతోషంలో కోనేటి ఒడ్డున యెల్లగా వరాలిచ్చేస్తున్నాడట. అంతే కాదండీ ఈ విట్టలేశుడే ఆ శ్రీవేంకటేశ్వరుడూనూ అంటున్నారు. పండరంగి విట్టలునిపై చక్కటి సరస శృంగార కీర్తన ఇది. ఇదే బ్రహ్మానందం. అవునా?

భావ వివరణ:

ఓ భక్తులారా! ఈ విట్టలేశుడు గొప్ప వేడుకకాడు (విలాసపురుషుడు). ఈయన వీడని పొందులు సేసి (విడుపులేని రతి కూటములు గల శృంగార పురుషుడు).

ఈ విట్టలేశుడు వెన్నలనారగించి. అటు పిమ్మట సంతోషముతో పండువెన్నెలలో వెలదులతో (రమణులతో) ఆడిని రాసక్రీడల దేలినాడు. రతుల కొరకు ఈయన ఇంతులను, పన్ని (పన్నుగడతో) పాంచజన్య శంఖానాదము సంకేతముగా, సారెకు (ప్రతిసారీ) సన్నసేసి (సైగజేసి) పిలిచీని (పిలుస్తాడు). ఎంత టక్కరివాడో చూడండి.

ఈ విట్టలేశుడు ఆసపడి (వ్యామోహము కలవాడై) అంతమంది స్త్రీల గుంపులోనున్న ఆడువారిపై కూడా విరులవేసి (పూవులను జల్లి) తన వశము చేసికొంటాడు. వేసరక (విసుగు అనే మాటలేక) పదియారువేలమంది సతుల ఇండ్లలో, సేసవెట్టి (అక్షతలు జల్లి) మరీ వారిని పెండ్లాడినాడు. (ఇందులో పెండ్లాడాలనే కోర్కె ఇంతులదే సుమా!) స్వామికి యేనాడు, యెవరిపైనా, యే కోరికా వుండదు. ఎందుకంటే ఆ దేవదేవుడు నిరంజనుడు, అవునా?

ఈ కొంటె కోణంగి ఇంకా యేమిచేస్తాడో తెలుసా? తనకు గంధము పూస్తున్న పడతులను మెల్లగా సందిటజేర్చి వెల్లవిరిగా (విజృంభించి) కూడి ముచ్చట దీరుస్తాడు. ఇల్లిదే (ఇదే) శ్రీవేంకటాద్రిపై శ్రీ వేంకటేశుడైన ఇతడే నేడు ఈ కోనేటి ఒడ్డున విటలేశుడై యెల్లగా వరాలచ్చీ (అంతులేని వరములనను గ్రహించుచున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Ataditada Vennalantata Dongilinadu In Telugu – అతడితడా వెన్నలంతట దొంగిలినాడు

అతడితడా వెన్నలంతట దొంగిలినాడు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అతడితడా వెన్నలంతట దొంగిలినాడు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అతడితడా వెన్నలంతట దొంగిలినాడు
సంఖ్య: 6
పుట 4
రాగం: లలిత

లలిత

5 అతఁడితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు

||పల్లవి||

యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాఁడు
యీతఁడా వసుదేవుని యింటలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు

||అత||

మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచే యశోదపాలి భాగ్య మీతఁడా
వాటమై గొల్లెతలను వలపించినాఁడు.

||అత||

ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితఁడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు

||అత||

అవతారిక:

ఈ వెన్నలు దొంగిలించే గొల్లపిల్లవాడు ఆ తిరుమలేశుడా!! రెండు మద్ది చెట్లను ఇతడు వుద్ధతితో తోసినాడు అంటున్నారు అన్నమయ్య. ఈ కీర్తనలో వాడిన భాష తెలుగునుడికారములతో బహు పసందుగా వుంది. ఈయన కంసుని పుట్టచెండుసేసినాడు అంటున్నారు. అంటే బంతిలా ఆడుకొన్నాడన్నమాట. అదేవిధంగా “కోటికి బడెగె గాను కొండయెత్తెను” అంటే జగత్ప్రసిద్ధుడై గోవర్ధనము అనే కొండను యెత్తినాడు అని అర్థం చెప్పుకోవాలి. ముగురు వేల్పులకు మూలభూతి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలకారణమైన పరమపురుషుడు ఈ బాలుడు అని | కీర్తిస్తున్నారు. ఇప్పుడాయన యెత్తినది రామకృష్ణావతారమట. అంటే?

భావ వివరణ:

ఆహా! యేమిటీవింత!! అతడు (ఆదిదేవుడైన పరమాత్మ) ఇతడా (ఈ బాలుడా). వీడు వెన్నలనన్నింటినీ రేపల్లెలో దొంగిలించినాడు. ఏతులకు (ఉద్ధతితో) తమ పెరటిలో బహుకాలమునుంచివున్న రెండు మద్ది చెట్లను ఇల తోసినాడు (నేలపై పడతోసినాడు).

ఈతడు ఆ దేవకీదేవి గర్భవాసము నుండి జన్మించిన ఇంద్రనీల మాణిక్యము. మానవకాంతగా వచ్చిన పూతన అనే రాక్షసి చనుబ్రాలు తాగి పొదలినాడు (వర్ధిల్లినాడు). ఈతడు ఆ వసుదేవుని ఇంట వెలసిన నిధానము (పాతర వంటి నిధి). తన మేనమామయైన కంసుని చేతనే (ప్రాణాలతో) పుట్టచెండుసేసినాడు (బంతి ఆట ఆడుకొన్నాడు).

ఈ బాలుడే పెరిగి పెద్దవాడై పాండవుల తల్లి గొంతిదేవికి (కుంతీదేవికి) మేనల్లుడై అత్తా అనిపిలిచి ఆమెకు అభయమొసగినాడు. ఇతడే “కోటికిన్ |పడెగెగాను కొండయెత్తెను” (జగత్ ప్రసిద్ధమైన గోవర్ధనపర్వతమును యెత్తి | తన చిటికిన వ్రేలిపై నిలబెట్టాడు). పాటించి (ఆదరించి) పెంచిన తల్లి యశోదాదేవికి ఇతడు భాగ్యమై, మరు జన్మలో కూడా వకుళాదేవియైన ఆమెకు బిడ్డ శ్రీనివాసుడై అమ్మా అని పిలిచాడు. గోపికలను వాటమై (మరిగి) వలపించుకొనినాడు.

ఈతడు, ఆ ముగ్గురు వేలుపులకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, | మహేశ్వరులకు) మూలభూతి మాలకారణమైన పరమపురుషుడు. అయినా జిగి (వెలుగులు జిమ్మి) ఆవులను పెయ్యలను కాచినాడు. మిగుల (అధికుడై మిగిలిపోయి) శ్రీవేంకటాద్రిపైని వేంకటేశ్వరుడు కూడా ఇతడేనా? అవునయ్యా! నిజము. ఇప్పుడు బలరామకృష్ణుల అవతారమెత్తిన ఈ బాలుడే ఆ పరమాత్మ.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు