Narulara Neduvo Nara Simhajayanthi In Telugu – నరులార నేఁడువో నారసింహజయంతి

నరులార నేఁడువో నారసింహజయంతి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నరులార నేఁడువో నారసింహజయంతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నరులార నేఁడువో నారసింహజయంతి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : నరులార నేఁడువో నారసింహజయంతి
సంఖ్య : 310
పుట: 208
రాగం: ముఖారి

ముఖారి

6 నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభము లొసఁగెను

||పల్లవి||

సందించి వైశాఖశుద్ధ చతుర్దశి శనివార-
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనకకశిపుని

||నరుఁ||

నరమృగరూపము నానాహస్తములు
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచి రక్షించి నిలిచె
గురుతరబ్రహ్మాండ గుహలోనను

||నరుఁ||

కాంచనపుగద్దె మీఁద గక్కనఁ గొలువైయుండి
మించుగ నిందిరఁ దొడమీఁదఁ బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచన సేయక మంచివరాలిచ్చీనదివో

||నరుఁ||

అవతారిక:

ఒకానొక నృసింహ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తననాస్వాదించండి. “ఓనరులారా! నేటిదినముననే స్తంభములో నరసింహుడు వుదయించి హిరణ్యకశిపుని తుదముట్టించి దేవతలకు శుభములను ఆనందమును యొసగినాడు” అని, ఆయన ప్రహ్లాదుని రక్షించిన వైనం కీర్తిస్తున్నారు. శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుడైన ఆ ఏడుకొండలవాడే ఈయనైనందువలన వంచన సేయక మంచి వరాలిస్తాడు అని అంటున్నారు. ఈ ఔభళేశుడు (అహెూబల నరసింహుడు) గురుతరమైన బ్రహ్మాండ గుహలో వెలసినాడట.

భావ వివరణ:

ఓ నరులారా! నేడే నృసింహ జయంతి. ఈ నరసింహ జయంతి నాడే ఆయన స్తంభమున వెలసి హిరణ్యకశిపుని వధించి సురులకు ఆనందము కలిగించి శుభములనొసగినాడు.

ఈ ఔభళేశుడు (అహోబలేశ్వరుడు) సందించి (పూని) వైశాఖ శుద్ధ చతుర్ధశినాడు, శనివారము రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించినాడు. చక్కగా ఆ హిరణ్యకశిపుని వరముల ననుసరించియే కంభములో పొడమి (స్తంభములోనుంచి పుట్టాడు కాబట్టి యే తల్లిదండ్రికి పుట్టనివాడైనాడు). ఒక కడపమీద వాడిని చంపాడు (కాబట్టి ఇంటా బయటా కాని చోటనే వాడు చచ్చాడు). కందువ (సామర్థ్యంతో) తనవాడియైన గోళ్ళతో (యే ఆయుధముతోను వాడికి చావులేదు కాబట్టి) చీల్చి ఆ కనకకశిపుని (హిరణ్య కశిపుని) వధించినాడు.

ఈయనయెట్లా వున్నాడో ఒకసారి చూడండి. ఈయనది నరమృగరూపము (తల సింహానిది శరీరము నరునిది), నానాహస్తములు (చాలా చేతులు వున్నందున నరుడు కూడా కాదు). అరిది (ఉపయోగింపబడని) శంఖచక్రములు ఆయన హస్తభూషణములుగా వున్నవి. గరిమ (అద్భుతముగా) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడి రక్షించి నిలిచినాడు. ఎక్కడ? బ్రహ్మాండమైన ఈ అహెూబలం కొండ గుహలో నిలిచినాడు.

ఎట్లా నిలిచాడో గమనించండి. ఆ దనుజుని వధానంతరం వెంటనే బంగారు గద్దెపై (సింహాసనముపై) మించుగ (వున్నతముగా) ఇందిరను (శ్రీలక్ష్మిని) తన తొడపై కూర్చుండబెట్టుకొని కొలువైయున్నాడు. ఈయనే అంచె (ఆ తరువాత) శ్రీవేంకటగిరి మీద ఆది పురుషుడు శ్రీవేంకటేశ్వరుడై నిలిచాడు. వంచన సేయక (నమ్మిన తన భక్తులను వంచించక) మంచి మంచి వరములనిస్తున్నాడు. అదిగో ఆయనకు మ్రొక్కండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
  2. వారిధిశయన వో వటపత్రపరియంక
  3. వైష్ణవులసొమ్ము నేను వారు నీసొమ్ములింతే
  4. తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
  5. అంజినీదేవి కొడుకు హనుమంతుడు
  6. అప్పడైన హరియెక్కె నదివో తేరు
  7. అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ

Neyyamulallo Nerello In Telugu – నెయ్యములల్లో నేరేళ్ళో – అన్నమయ్య కీర్తనలు

నెయ్యములల్లో నేరేళ్ళో - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నెయ్యములల్లో నేరేళ్ళో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నెయ్యములల్లో నేరేళ్ళో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : నెయ్యములల్లో నేరేళ్ళో
సంఖ్య : 179
పుట : 123
రాగం: దేసాళం

దేసాళం

86 నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో

||పల్లవి||

పలచని చెమటల బాహుమూలముల
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి
దులిపేట నీళ్ళతుంపిళ్ళో

॥నెయ్యము॥

తొటతోటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో

॥నెయ్యము॥

గగల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁ కులినుపగుగ్గిళ్ళో

॥నెయ్యము॥

అవతారిక:

జానపదులు కోలాటములాడుతూ పాడే మధురమైన కీర్తన అన్నమాచార్యులవారి ద్వారా ఆస్వాదించండి. అల్లోనేరేడు పళ్ళవలె మధరములైన నెయ్యములు (స్నేహములు) ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళురు చున్నవి. ఇది ఆట ప్రధానమైన కీర్తన. బాహుమూలములలో పలచని చెమటల గురించి వర్ణించగలిగిన సత్తా అన్నమయ్యకు మాత్రమే వున్నదని వేరే చెప్పక్కరలేదు. ఇది సుగ్రాహ్యము అనుకోవడానికి వీలులేని కీర్తన. జాగ్రత్తగా చదివితేకాని అర్థంకాదు, మరి.

భావ వివరణ:

మా నెయ్యములు (స్నేహము) అల్లోనేరేడు పండ్లవలె మధురమైనవి. ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళూరెడ్డి మా అనుబంధం దినదిన ప్రవర్ధమానమవుగాక!

బాహుమూలములలో పరిఢవిల్లిన లే చిత్తడి చెమటల చెలమలలో అందములు అలంకార ప్రాయమైనవి. ఈ నృత్యమువలన చెమట ఇంకా అధికమై, థళథళమను (తళతళమని) మెరయు ముత్యములను చెరుగు సురటి (విసనకఱ్ఱ), దులిపేటి నీళ్ళతుంపరల వలె వున్నవి.

ఈ గోవిందుడు తన విరహంతో ఆమెనెంత బాధిస్తున్నాడంటే, ఆమె కన్నుల నుండి తొట తొటమని కన్నీరు కురియుచున్నది. ఆమె అది తాళలేక అలుక వహించినది. ఆ చిటిపొటి (చిన్న చిన్న) అలుకలు చివరికి చిరునవ్వులై రావిపండురంగులోనున్న నీ వన్నెల అధరమునాస్వాదించి | గుక్కిళ్ళువేయుచూ (గుటకలు మింగించినది). అలుకలు మరింత మధురమైనవి.

ఓ గరగరికల (నిర్మలుడవైన) వేంకటేశ్వరా! నీ కౌగిటిలో పరిమళములు వెదజల్లు మీ ఒంటిపై పూతలు ఒండొరులకు ఎలా వున్నాయంటే మన్మథుని వింటినుండి వెలువడిన కమ్మని పుష్పబాణములు కూడా గురిగా తాకునట్లు మీపై వేసిన ఇనుప గుగ్గిళ్ళవలెనున్నవి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Anjaliranjalirayam Te In Telugu – అంజలిరంజలిరయం తే

అంజలిరంజలిరయం తే - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అంజలిరంజలిరయం తే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంజలిరంజలిరయం తే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : అంజలిరంజలిరయం తే
సంఖ్య : 289
పుట 197
రాగం: శ్రీరాగం

శ్రీరాగం

87 అంజలిరంజలిరయం తే
కిం జనయసి మమ భేదం వచనై:

||పల్లవి||

మాం కిం భజసే మయా కింతే
త్వం కోవా మే తవ కా౭హం
కిం కార్యమితో గేహే మమ తే
శంకాం వినా కిం సమాగతోసి

||అంజలి||

నను వినయోక్తేర్న యోగ్యా హం
పున: పునస్త్వం పూజ్యోసి
దినదిన కలహవిధినా తే కిం
మనసిజజనక రమారమణ

||అంజలి||

దైవం బలవత్తరం భువనే
నైవ రోచతే నర్మ మయి
ఏవమేవ భవదిష్టం కురు కురు
శ్రీ వేంకటాద్రి శ్రీనివాస.

||అంజలి||

అవతారిక:

చక్కటి సంస్కృత కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నాయిక శ్రీవేంకటేశ్వరునిపై అలిగింది. నీకు దండం పెడతాను నన్నెందుకు మాటలతో ఏడిపిస్తావు. అని రుసరుసలాడిందామె. నీవెవరివి? నేనెవరిని? పోపోవయ్యా! అని పోట్లాడింది. కాని ఆయన లేకుండా క్షణం |వుండలేదామె. చివరికి నీ ఇష్టం మహాప్రభో! అని లొంగిపోయింది.

భావ వివరణ:

నీకు ఈ నమస్కారములు, వందనములు. నాకు నీ మాటలతో యెందుకు దుఃఖమును కలిగిస్తున్నావు?

దేవా! నన్నెందుకు తలచెదవు? నాతో నీకేమిటి? నీవెవరవు? నీకు నేనేమవుతాను? నీవు నాకేమవుతావు? పనివున్నదయ్యా? నాపై నీకు శంకలేకుంటే ఇక్కడికెందుకు వచ్చావు?

ఓ మనసిజ జనకా! (మన్మధునికి తండ్రీ) నీ వినయపు మాటలకు నేను యోగ్యురాలనా? కానయ్యా! నీవు మరల మరల పూజింపదగిన వాడివైయున్నావు. దినదినమూ జరిగే ఈ కలహాలతో నీకేమి పనిలే? ఓ | రమారమణా! నేను దీనితో విసిగిపోయాను.

భువనములో దైవమే బలవత్తరమైనది. నాయందు నీవంచనలు నాకు రుచించవు. పోనీలే, నీకేది ఇష్టమో అదేచేయుము. ఓ వేంకటాద్రిపైనున్న శ్రీనివాసా! నేనేమనగలను?

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Sri Ramadasu Keerthanalu 61-68 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన 61-68

Sri Ramadasu Keerthanalu 61-68 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

61. నాదనామక్రియ రూపకతాళం

పల్లవి : ముచ్చటైన వాడవేమిరా కోదండపాణి
ముచ్చటైన వాడవేమిరా

॥ముచ్చటైన॥

ముచ్చటైన వాడవేమి ముదముతో మీ పాదములు
మరువక నెల్లప్పుడు నామదిని విడువక దలచెదను నేను

॥ముచ్చటైన||

ఎందాకనే వేడుకొందు ఏమి చేయుదు నీ వేళయందు
చెంతకు చేరితి నన్ను జేపట్టుమిక మ్రొక్కెదను

॥ముచ్చటైన॥

పండ్రెండేండ్లాయెను నేను బంధిఖానాలో నుండి
నల్లుల దోమలచేత నలుగుచున్నది దేహము

॥ముచ్చటైన॥

చైత్ర వైశాఖములిపుడు చెప్పతరముగాదు ఎంతో
తహసీలు చేయగ నాకు జామీనైనా యెవ్వరులేరు

॥ముచ్చటైన||

తానీషాగారు వచ్చి తహసీలు చేసెదరు
కాసులుపంపించి నన్ను కరుణతో చెరవిడిపించు

॥ముచ్చటైన||

నేనొక్కడను మీకు సుంతనాపై నెనరులేక
మా తల్లి సీతమ్మకైన మనవిచెప్పగ నెటుబోతివో

॥ముచ్చటైన||

ఒంటరిగ నన్ను నింటి దగ్గర ఎవ్వరు
జంటతో సీతాలక్ష్మణులు వెంటనే కూడివచ్చి

॥ముచ్చటైన॥

వేమారు శ్రీభద్రాచల రామస్వామి
మీరిప్పుడు రామదాసుని చేపట్టి రక్షింపకున్న

॥ముచ్చటైన||

62. ఆనందభైరవి రూపకతాళం

పల్లవి : మేలైన చిటికెనవ్రేలు ప్రాతఃకాలమందున గుట్టె తేలు
బాలత్వమున నేను బావి నీళ్ళకు పోయి
కాలుబెట్టగ చిన్నతేలు పొడిచెనయ్య

॥మేలైన॥

చలివచ్చెనని నొప్పిచేత దీని వేడిమి పాపిష్టిఘాత
యీలాగునైన నేనేలాగు తాళుదు
మూలమైన గురుమూర్తి పాదములాన

॥మేలైన॥

మిక్కిలి నలుపుచున్నది రాముగ్రక్కన నాదరించినది
వెక్కసపెట్టుచు కడతేరనీయదు
మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను

||మేలైన॥

దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులు చేసినరీతి చేసెదవా
పుడమిలోపల భద్రగిరిరామదాసుని బడనీక కాపాడు తండ్రివి నీవే

||మేలైన॥

63. పున్నాగవరాళి ఏకతాళం

పల్లవి : రక్షించు దీనుని రామ రామ నీ రమణి తోడు నన్ను
రక్షింపకున్నను మీ తండ్రి దశరథరాజుతోడు

॥రక్షించు||

అరుదుమీరగ విభీషణుని బ్రోచితి వల్ల నాడు అట్లు
కరుణింపకున్న మీతల్లి కౌసల్యదేవితోడు

॥రక్షించు||

గిరికొన్న ప్రేమ సుగ్రీవుని బ్రోచితివల్లనాడు అట్లు
సిరులియ్యకున్న మీ కులగురువు వసిష్ఠుని తోడు

॥రక్షించు||

అలికుల వేణి యహల్య శాపము బాపితివల్లనాడు అట్లు
కలుషములన్నియు బాపకున్న లక్ష్మణునితోడు

॥రక్షించు||

పాపాత్ముడైన యక్రూరుని బ్రోచితివల్లనాడు అట్లు
నెపములెంచక కృపజూడకున్న మీయింటితోడు

॥రక్షించు||

వదలక నీ మీదనే నాసలు పెట్టవలసె నేడు
భద్రాచలరామదాసుని యేలకున్న నీ పాదములతోడు

॥రక్షించు||

64. బిళహరి ఆదితాళము

పల్లవి : రక్షించే దొరవని నమ్మితి నిన్ను
రక్షింప తప్పేమి చేసితి

॥రక్షించే॥

రక్షింప మీకంటె రక్షకులెవరు
దాక్షిణ్యమింతైన తలపుల నుంచవు

॥రక్షించే॥

నీ ప్రాపు నెఱనమ్మియుంటిని నన్ను
కాపాడు బిరుదు నీతంటినీ
చేపట్టి విడనాడజెల్లదు యిక నాకు
దాపుననుండియు మీరె దైవము సాక్షిగ

॥రక్షించే॥

ఎంతో వేడిన యేలపల్కవు నే
నెంతద్రోహినో దయజూడవు
ఎంతేసి వారల నేలేటి కర్తవు
అంతకంతకు నాపై యరమరచే సేవు

॥రక్షించే॥

భద్రాద్రివాస నీ బంటును ఇతర
పాపములేదు నావెంటను
అద్రిజ సన్నుత యమరాది వందిత
భద్రేభవరద నాపాలిటి దైవము

॥రక్షించే॥

65. శంకరాభరణ ఆదితాళము

రక్షింపుముదేవా రాచకార్యముపుట్టె రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెశీ వరింక రామచంద్ర

॥రక్షింపుము॥

అప్పులవారితో అరికట్టుకొన్నారు రామచంద్ర స్వామీ
చెప్పశక్యముకాదు చక్షుర్గోచరమాయె రామచంద్ర

॥ రక్షింపుము॥

కుక్షిలో మీమీద కోరిక పుట్టెను రామచంద్రస్వామీ
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన గానవే రామచంద్ర

॥రక్షింపుము॥

పక్షి వాహన నన్ను పాలింపదయజూడు రామచంద్రస్వామీ
అక్షయకటాక్ష మభిమానముంచవే రామచంద్ర

॥రక్షింపుము॥

అధికుని చేపట్టి అడ్డమేమనుకొంటి రామచంద్రస్వామీ
అధములకన్నను అన్యాయమైపోతి రామచంద్ర

॥రక్షింపుము॥

భయమేమి నే రామదాసుడ ననుకొంటి రామచంద్రస్వామీ
భయముబాపి బ్రోవు భద్రాద్రిపురినిలయ రామచంద్ర

॥రక్షింపుము॥

66. సౌరాష్ట్ర చాపుతాళము

పల్లవి : రామచంద్ర నన్నేల రక్షింపవో నేనేమెరుగ
నీ చిత్తము నా భాగ్యము నిన్నే నెరనమ్మితి

॥రామ||

భరతునివలె పాదుకలు పూజింపనేర
కోరి లక్ష్మణునివలె కొల్వనేర
ఓర్పుతో గుహుని నోడ నడుపనేర

॥రామ||

అంగదునివలె నేను ఆడవము బట్టనేర
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర
గాలిపక్షివలెనేను తాలిమిగమోయ నేర
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర

||రామ||

లీలతో శబరివలె లాలించి విందిడ నేర
మేలిమిగ సీతవలె మెప్పిరంపనేర
గజరాజువలె నేను గట్టిగా మొరపెట్టనేర
విజయుని సతివలె వినుతింపనేర
గురిగ జాంబవంతునివలె కోరిభజింపగ నేర

॥రామ||

చేరి విభీషణునివలె శరణననేర
వరజటాయువలె ప్రాణములియ్యనేర
కరము నహల్యవలె గీర్తింపనేర
నేను రామదాసులవలె పూని మిము భజియింపనేర
నన్ను రక్షింపు భద్రాచల రామధీర

॥రామ||

67. పున్నాగవరాళి ఆదితాళము

పల్లము : రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ
పామరుడను జడుడను తామసుడను
నేను వర్ణితంబగు నరపశువును నీ మహత్మ్య మెన్న నెంతటి వాడను

॥రామ||

రామ రామ యనిదలతు నిరంజన రామ
పరుల వేడనంటి నీ పదయుగ్మములే నమ్మి యుంటిని
నన్నరమర చేయవద్దంటిని శ్రీహరియని వేడుకొంటి

॥రామ॥

మొరలిడినంతనే కరివరు నేలిన దొరవని నమ్మితిని
నిరసించతగదు మందర గిరిధర
త్రిభువనసుందర యిందిరాసుందరీ మనోహర

॥రామ॥

ఏలనాపై గోపము మున్నేమి చేసితినో పాపము
నీలవర్ణ నీరూపము నిరతము కన్నుల జూపుము
మేలొనరించెడి శ్రీలోలుడవని చాలా నమ్మియుంటి

॥రామ॥

అఘములను బాపర నేను జేసెదను నీ సేవను
ఆశించిన శ్రీరామదాసు నిటుమోసము చేసిన దోసంబెవరిదో
వాసవార్చితాంఘ్రజలజయుగళ కైలాసవాసనుత భద్రగిరి హరి

॥రామ॥

68. ముఖారి ఆదితాళము

పల్లవి: రామరామ నీవేగతిగద సంరక్షణంబు చేయు
ఏమనందు హా దైవమా నీ మనసింక కరుగదాయె

॥రామ॥

పుడమిలోన నావంటి దురాత్ముడు పుట్టడింక నంటి
విడువబోకుమయ్యా యని మున్నే విన్నవించుకొంటి

॥రామ||

ఎన్ని విధంబుల పిలిచిన పలుకవు ఏమదృష్టముందు
ఎన్నరాని వైవస్వతు వేదనకెటు తాళుకొందు

॥రామ||

న్యాయమటయ్యా మ్రొక్కినా మొరనాలకించబోవు
శ్రీయుతముగ నిను నమ్మిన దాసు కోర్కెలొసగరావు

॥రామ||

స్వామి నేను నీవాడను నాయెడ చలము చేయకుమయ్యా
ప్రేమమీర నినుగని గొనియాడెద మోముజూపవయ్యా

॥రామ॥

నేను గొప్పగ భద్రాచలమందిర నిను నమ్మలేదా
ప్రేమజూచి బంటును శ్రీరామదాసు నేలరాదా

॥రామ||

మరిన్ని కీర్తనలు:

Pralapanavacanai : Phalamihakim In Telugu – ప్రలపనవచనై: ఫలమిహకిం

ప్రలపనవచనై ఫలమిహకిం - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ప్రలపనవచనై: ఫలమిహకిం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ప్రలపనవచనై: ఫలమిహకిం – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన : ప్రలపనవచనై: ఫలమిహకిం
సంఖ్య : 39
పుట:27
రాగం: శుద్ధ వసంతం రచ్చెతాళం

శుద్ధవసంతం-రచ్చెతాళం

89 ప్రలపనవచనైః ఫలమిహకిం
చల చల కుడ్యక్షాళనయా కిం

||పల్లవి||

ఇతర వధూ మోహితం త్వాం ప్రతి
హితవచనై రీహితు మిహ కిం
సతతం తవానుసరణమిదం మమ
గతజల సేతూకరణ విదానీం

||ప్రలప||

వికలవినయ దుర్విటం త్వాం ప్రతి
సుకుమారారస్తుతం కిం
ప్రకటబహల కోపనం మమ తే
సకల చర్విత చర్వణమేవ

||ప్రలప||

శిరసా నతసుస్థిరం త్వాం ప్రతి
విరసాలాపన విధినా కిం
తిరువేంకటగిరి దేవ త్వదీయ-
విరహవిలపనం వృథాచరణం

||ప్రలప||

అవతారిక:

అద్భుతమైన సంస్కృత కీర్తననావిష్కరిస్తున్నారు అన్నమాచార్యులవారు. కృష్ణుని మాయమాటలు నమ్మి మోసపోయాననుకొని చింతిస్తున్న నాయిక నిర్వేదంతో అంటున్న పలుకులివి. ఎందుకు ప్రేలాపనలవంటి మాటలు మాట్లాడతావు. దానివల్ల యేమిలాభం? పోపోవయ్యా! అని ఆవిడ విసుక్కొంటున్నది. నీకు నమస్కరించినందువల్ల ప్రయోజనమేమిటి అనేంత నిస్పృహకు లోనైంది ఆమె.

భావ వివరణ:

ప్రేలాపనలవంటి మాటల వలన ప్రయోజనమేమిటి? పోపోవయ్యా! | పో గోడను నీళ్ళతో కడిగినందువలన ప్రయోజనమేమిటి?

ఇతర వధూటీమణులయందు వ్యామోహము గలిగిన నీకు హితవు బోధించాలని చూడటం ఎంత అవివేకమైన పని? నిన్నే నమ్ముకొన్న నన్ను కల్లబొల్లి కబుర్లతో ప్రసన్నురాలను చేయాలని చూచెదవు, యెందుకు? | గతజల సేతుబంధనము వలన కలిగే ప్రయోజనమేమిటి?

నీవు కపటివి. కపట వినయములు. నీవు దుర్మతివైన విటుడవు. నీకు సున్నితమైన స్తుతులవలన ప్రయోజనమేమిటి? నాయందు గొప్ప | క్రోధమును ప్రకటిస్తున్నావు. ఇదంతా చర్వితచరణమే.

నీయందు స్థిరమైనట్టి నా నమస్కారములు, విరసాలాపనలు అవుతుంటే… యేమి ప్రయోజనము కలుగుతుంది? ఓ తిరువేంకటగిరి దేవా! నీయందు విరహవేదన నిష్ప్రయోజనమవుతున్నది ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Sinnavadavani Nammaselladuninnu In Telugu – సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను

సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: సిన్నవాడవని నమ్మసెల్లదునిన్ను
సంఖ్య : 15
పుట: 11
రాగం: భైరవి

భైరవి

88 సి (చి)న్న వాఁడవని నమ్మ సెల్లదు నిన్ను
సిన్నైన యాటదెల్ల సిక్కు సీరై పోయను

||పల్లవి||

అవుర బాలకిసు రాయఁడ నీవు సంటిపాలు
సవులంటా నెత్తురెల్ల సప్పరించఁగా
కవకవ నవ్వి నవ్వి కన్నులు దేలగిలఁగ
సవరన్ని (ని) యాటదెల్ల సప్పుసారై పోయను

||సిన్న||

రారా గోపాలకిసునరాయ నీవదె గొల్ల-
వారి మగుపల సూవు (పు) వల్లె వేయఁగా
సూరఁబోయె రేపల్లె సొక్కని యా గుబ్బెతల-
సేరలంతల కన్నుల సిన్ని సిన్ని సిగ్గులు

||సిన్న||

కిన్నెర వెంకటగిరి కిసునరాయఁడ నీవు
వన్నెలుగ వీధి వీధి వాయించఁగా
మిన్ను దాఁకి లోకానకు మేఁటియైన లకిమమ్మ
నిన్ను సేరి సరుగన నిలుసుండే సొక్కెను

||సిన్న||

అవతారిక:

జానపదుల బాణీలో సాగిన కృష్ణలీలామృతం వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో ఆయన వాడిన బాలకిసున రాయడు, సిక్కుసీరై పోయను, సప్పుసారైపోయను వంటి మాటలు జానపద సాహిత్యంలో వుంటాయేమోకాని నేటి తెలుగు పాఠకులకు సుపరిచితాలు కాదు. ఈ బాలకృష్ణుని చిన్నవాడని నమ్మటానికి వీలులేదట. నేడు ఈ వెంకటగిరి కిసునరాయడు వీధివీధిలో కిన్నెర వాయిస్తుంటే లకిమమ్మ ఆయనను సేరి సరుగున నిలుసుండిందట. ఈ పాటికి మీకూ కొంత బుర్రకెక్కింది కదా!

భావ వివరణ:

ఓ కిసునరాయా! (కృష్ణరాయా!) నిన్ను చిన్నవాడవని నమ్మసెల్లదు. (నమ్మకూడదు). సిన్నైన యాటదెల్లా (యుక్తవయసు వచ్చిన ప్రతి ఆడపిల్లా) | నీమూలంగా, సిక్కు సీరై పోయను (సిగ్గుతో చితికిపోయింది).

అవుర బాలకిసునరాయడ (ఔరా! బాలకృష్ణరాయా!) నీవు సంటిపాలు (స్తన్యము) రుచిగావుంటుందని పూతన స్తనము చప్పరించి నెత్తురంతా పీల్చేస్తే అది కవకవ (వికటంగా నవ్వినవ్వి కళ్ళు తేలేసింది. సవరని యాటదెల్ల (అందమైన ఆ యువతి పూతన) సప్పుసారైపోయను (చచ్చి శవమై పోయింది).

ఓ గోపాల కృష్ణరాయా! నీవు అదిగో ఆ గొల్లవాడలో మగువల చూపులు వల్లెవేయగా (చూపులతో చూపులు కలిపి చిలిపి సంకేతాలీయగా), సూరబోయె రేపల్లె (సిగ్గుతో రేపల్లె చితికిపోయింది). గుబ్బలవంటి కుచగిరులున్న గొల్లెతల చేరడేసి కన్నులు ‘సిన్ని సిన్ని సిగ్గులు’ చిమ్మినవి.

ఓ వేంకటగిరి కిసునరాయ (వేంకట కృష్ణరాయా!) నీవు వన్నెలుగ (అందముగా) వీధివీధిలోనూ కిన్నెర (వీణ) వాయించగా అది, మిన్నుదాకి (ఆకాశంలో మారుమ్రోగి) జగదేకసుందరియైన ‘లకిమమ్మ’ (లక్ష్మీదేవి) నిన్ను చేరి సరుగున (నీ పక్కన) నిలుసుండే సొక్కెను (నిలబడి యుండగానే పరవశంతో నిద్రించినది).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Talaledu Tokaledu Daivamani Mayalaku In Telugu- తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు

తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు
సంఖ్య : 368
పుట : 247
రాగం: కన్నడగౌళ

కన్నడగౌళ

90 తల లేదు తోఁక లేదు దైవమా నీమాయలకు
తెలిసియుఁ దెలియక తిరిగేము నేము

||పల్లవి||

తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో
యెనయు సంసార సుఖ మిది యేఁటిదో
వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక
దినదినమును నేమో తిరిగేము నేము

||తల||

పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో
ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో
మట్టులేని హరినిర్మాణ చక్రములోన
దిట్టలమై యేమేమో తిరిగేము నేము

||తల||

నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీదాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే

||తల||368

అవతారిక:

చక్కటి వైరాగ్య దీపికవంటి కీర్తననావిష్కరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “ఓ దైవమా! నీమాయలకు తలతోక వుండవయ్యా! మేము మాత్రం తెలియనివాటిని తెలుసునని, తెలిసినవాటిని తెలియవని తలపోస్తూ తిరుగుతుంటాము. మాకు దేంట్లోనూ నేర్పులేదు. మాకు తెలిసిందల్లా నీ దాసులుగా వుండటం. మమ్మల్ని యెలాగో వొకలాగ ఒడ్డునపడవెయ్యవయ్యా! కరుణించు” అంటున్నారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! నీ మాయలకు (లీలలకు) తలలేదు తోకలేదు (ఆరంభం యెప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు). నీమాయ ఆవరించినంతసేపూ, పిచ్చిపట్టినట్లు తెలిసీ తెలియక యేవేవో భ్రమలలో పడి, తిరుగాడుతూనే వుంటాము.

మా అంత పిచ్చివాళ్ళున్నారా ప్రభూ! మా ఈ శరీరం యెట్లా వచ్చిందో మాకు తెలియదు. దీనికి ఆలోచనలెలావస్తున్నాయో తెలియదు. సంసార సుఖము యెట్లా వుంటుందో తెలియదు. వెనక ముందేటిదో వివేకమెరుగము (పూర్వజన్మలో నేనెవరినో తెలియదు. మళ్ళీ నేను చచ్చాక యేమవుతానో తెలియదు). బ్రతికున్నంతకాలమూ ప్రతిరోజూ యేమో తిరుగుతూనే వుంటాము. ఏమిటి నీమాయ?

తల్లి కడుపులో యెప్పుడు యెలా పడ్డామో తెలియదు. ఏ క్షణాన గుటుక్కుమని కన్ను మూస్తామో తెలియదు. నాకు ధనమెలా వచ్చిందో, యెన్నాళ్ళుంటుందో, వున్నట్లుండి యెప్పుడు పోతాయో తెలియదు. శ్రీహరియొక్క ఈ “నిర్మాణ చక్రములో” మట్టు లేకుండా (పొందిక లేకుండా) తిరుగుతూనే వున్నాము. విచిత్రమేమంటే అట్లా తిరుగుతున్నా మేమే దిట్టలము (సమర్థులము) అని అనుకొంటుంటాము.

నీ కృపతో చివరికి ఒకనాటికి నాకు జ్ఞానోదయమయింది. నేర్వవలసిన దేమిటో తెలిసింది. ఇక నాకు నేర్పుతోను పనిలేదు. నిలిచినది వొక్కటేననే నేర్పు యేదో అది నా స్వంతమయింది. ఇక వూరకనే నీ దాసులమై వున్నారు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను వెదకి చేరుకుని నన్ను యేలినావు. ఇక నన్ను విడువకు. గారవించి కరుణించి కావగదవే (మన్నించి కరుణతో రక్షించుము తండ్రీ!) నాకు నీవే దిక్కు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Namo Namo Dasarathanandana Mammu Raksincu In Telugu – నమో నమో దశరథనందన మమ్ము రక్షించు

నమో నమో దశరథనందన మమ్ము రక్షించు - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో నమో నమో దశరథనందన మమ్ము రక్షించు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నమో నమో దశరథనందన మమ్ము రక్షించు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
సంఖ్య : 301
పుట: 202
రాగం: మాళవశ్రీ

మాళవశ్రీ

91 నమో నమో దశరథనందన మమ్ము రక్షించు
కమనీయ శరణాగతవజ్రపంజరా

||పల్లవి||

కోదండదీక్షాగురుఁడ రామచంద్ర
ఆదిత్యకుల దివ్యాస్త్రవేది
సోదించుమారీచునితలగుండుగండ
ఆదినారాయణ యసురభంజనా

॥నమో॥

ఖరదూషణశిరః ఖండనప్రతాప
శరధిబంధన విభీషణవరదా
అరయ విశ్వామిత్రయాగసంరక్షణ
ధరలోన రావణదర్వాపహరణ

||నమో||

పొలుపొంద నయోధ్యపురవరాధీశ్వర
గెలుపుమీరిన జానకీరమణ
అలఘుసుగ్రీవాంగదాదికపి సేవిత
సలలిత శ్రీవేంకటశైలనివాసా

||నమో|| 301

అవతారిక:

దశరథనందనుడైన శ్రీరామచంద్రమూర్తిని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో కూడా రామాయణ ఘట్టములను | వర్ణిస్తూ రాముని నామాలను సన్నుతిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనా యజ్ఞంలో ఈ దీక్షితులు సమర్పిస్తున్న ఈ కీర్తన సంఖ్య 1000. సహస్రాక్షుడు, సహస్రబాహువు, సహస్రముఖుడు, సహస్రరూపుడు అయిన ఆ “సాసముఖుని” సహస్రకీర్తనల వివరణతో అర్చించగలుగుతున్నాను. ఈ జన్మకిది చాలు. అన్నమయ్య అన్నట్లు “ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి, యిదిగాక వైభవంబికవొకటి కలదే”!

భావ వివరణ:

దశరథనందునడవైన ఓ శ్రీరామచంద్రా! నమో నమో! నీకు వేలకొలది వందనములు. మమ్ము రక్షింపుము తండ్రీ! నీవెవ్వరివి ప్రభూ “కమనీయ శరణాగత వజ్రపంజరుడవు” (నీ శరణార్థులకు మనోజ్ఞమైన వజ్రపు కవచము వంటి రక్షకుడవు).

ఓ రామంచంద్రా! నీవు నీదాసులు రక్షణకై యెప్పుడూ కోదండమును ధరించియే వుంటాను, అనే దీక్ష నిర్వహించిన దీక్షితుడవు. ఆదిత్యకులములో (సూర్య వంశములో) జన్మించిన సకల శస్త్రాస్త్రపారంగతుడవు. మాయలేడివలె వచ్చిన మారీచుని సోదించు (వెదుకునట్టి) తలగుండు గండవు (శిక్షగా తలపై పెట్టుకొని తిరిగే పెద్దబండ వంటి మొనగాడివి). అంటే మారీచునివంటి కపటుల పాలిటి యముడివి అని భావము.

ఖరదూషణుల తలలను ఖండించి పదివేల మంది రాక్షసులను క్షణంలో మట్టుబెట్టావు. శరధిని బంధించి (వారధి నిర్మించి) విభీషణునికి వరదుడవైన ప్రతాపశాలివి. విశ్వామిత్రుని యాగమును సంరక్షించిన | జగజ్జెట్టివి. పుడమియందు జన్మించి, రావణాసురని చంపగలిగి కూడా “నేడుపోయి విశ్రాంతి తీసికొని తిరిగి రేపటికి తేరుకొని రా!” అని వదలివైచి వాడి గర్వాన్ని సమూలంగా హరించిన వీరాధివీరుడవు.

కీర్తితో అయోధ్యాపురాధీశ్వరుడవై యేలిన చక్రవర్తివి. గెలుపుమీరిన (కీర్తికాంత, భూకాంత, శ్రీకాంతలను కూడా గెలిచిన) జానకీరమణుడవు. కపిసేనలో అలఘులైన (ఉద్దండులైన) సుగ్రీవుడు అంగదుడు మొదలైన వారందరిచే సేవించబడినవాడవు. ఇంతే కాదు స్వామీ! నీవు సలలితము (దివ్యసౌందర్యోపేతమైన) శ్రీవేంకటశిఖర నివాసివైన మా దైవము శ్రీవేంకటేశ్వరుడవూ నీవే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Atadepo Mayelika Atade Jaganmula In Telugu – ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల

ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల
సంఖ్య : 109
పుట: 73
రాగం: మాళవి

మాళవి

2 ఆతఁడేపో మాయేలిక ఆతఁడే జగన్మూల-
మాతఁడే శ్రీవేంకటాద్రియందు మీఁదిదైవము

||పల్లవి||

కమలవాసినియైన కాంతఁ బెండ్లాడినాఁ (నవాఁ?)డు
కమలములో బిడ్డఁ గన్నవాఁడు
కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు
కమలనాభుఁడేపో కలుగుమాదైవము

||ఆతఁ||

జలధి బంధించి లంక సంహరించినవాఁడు
జలధిచొచ్చినదైత్యుఁ జంపినవాఁడు
జలధిసుతునకు వరుస బావైనవాఁడు
జలధిశయునుఁడేపో చక్కని మాదైవము

||ఆతఁ||

కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు
కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు
కొండలకు నెక్కుడైనగురుతు శ్రీవేంకటాద్రి
కొండరూపు దానేపో కోరిన మాదైవము

||ఆతఁ||

అవతారిక:

అన్నమాచార్యులవారి ఈ కీర్తన అర్థం కావాలంటే పురాణాలమీద మంచి పట్టు వుండితీరాలి. ఆతడే జగన్మూలమైన శ్రీవేంకటాద్రిమీది దైవము అని కీర్తిస్తున్నారు. ఈ స్వామి కమలాప్తుడైన సూర్యునిలోని వెలుగై దీప్తించువాడు. ఈయన జలధిసుతునకు బావగారు అంటున్నారు. మరి ఆబావమరిది యెవరో? ఈయన కొండవంటి రాకాసిని కొట్టినవాడట. మరి ఆ రాకాసియెవరో? శ్రీవేంకటాద్రి కొండరూపు తానేపో అంటున్నారు. అంటే ఏంటి? భావవివరణ చదివితే అన్నీ పూసగుచ్చినట్లు అర్థమవుతాయి మరి.

భావ వివరణ:

ఆతడే (ఆ శ్రీవేంకటేశ్వరుడే) పో మాయేలిక (ప్రభువు). అతడే జగమునకు మూలకారణము. ఆతడే శ్రీవేంకటగిరిపై వెలసిన దైవము.

ఆతడెటువంటివాడో తెలియునా? కమలములో వసించు కాంతను బెండ్లాడినవాడు. కమలములో బిడ్డను (బ్రహ్మదేవుని) గన్నవాడు (కన్నతండ్రి). కమలాప్తుడైన సూర్యునిలో గలిగి (నెలకొని) వెలుగులు జిమ్మేవాడు. అటువంటి కమలనాభుడే పో మాకున్న దైవము.

ఇంకా చెప్పాలంటే, ఆయన జలధిని బంధించినవాడు (సేతువును సాగరముపై నిర్మించిన శ్రీరాముడు). లంక (లంకిణి) అను రాక్షసిని సంహరించినవాడు (చంపించినవాడు). ఆయనే జలధి జొచ్చిన దైత్యుని | (వేదములను అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుని) చంపిన శ్రీమన్నారాయణుడు కూడా ఆయనే. జలధిసుతునకు (క్షీరసాగర | మథనమున పుట్టిన చంద్రునికి) వరుస బావ (అతని యొక్క సోదరి శ్రీలక్ష్మిని పెండ్లాటుచేత వరుసకు బావ) అయినవాడు. అటువంటి | క్షీరసాగరముపై పవ్వళించు స్వామియే పో మా దైవము.

ఇంతేకాక తన శ్రీకృష్ణావతారమున ఈయనే కొండను (గోవర్ధన పర్వతమును) గొడుగువలె చేతబట్టుకొని గోవులను, గోకులమును రక్షించినాడు. ఈతడే కొండవంటి రాకాసిని (రాక్షసి పూతనని) గొట్టినవాడు | (చనుబాలు త్రాగు నెపముతో సంహరించినవాడు). కొండలకు నెక్కుడైన (కొండలలో అత్యంత శ్రేష్ఠమైన) శ్రీవేంకటాద్రిపైన కొండరూపములో వున్నాడు (ఆ వేంకటాద్రి పడుకొని వున్న స్వామి శిరస్సును స్ఫురింపజేస్తుంది). తానేపో (ఆ శ్రీవేంకటేశ్వరుడే పో) మా దైవము.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Iviye Po Pradyumna Yihaparasadhanamu In Telugu – ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము

ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము - అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : ఇవియే పో ప్రద్యుమ్నా యిహపరసాధనము
సంఖ్య : 405
పుట : 272
రాగం: భూపాళం

భూపాళం

92 ఇవియే పో ప్రద్యుమ్న యిహపరసాధనము
భవజలధులతేప పరమయోగులకు

||పల్లవి||

వామన గోవింద విష్ణు వాసుదేవ హరి కృష్ణ
దామోదరాచ్యుత మాధవ శ్రీధరా
నీమహిమ గానలేము నిన్నెంచఁగలేము నీ –
నామజపమే చాలు నాలుక (కు) సులభము

||ఇవి||

అనిరుద్ధ పురుషోత్తమాధోక్షజ ఉపేంద్ర
జనార్దన కేశవ సంకర్షణా
నినుఁ దలఁచఁగ లేము నిన్నుఁ దెలియఁగ లేము
నునుపై నీనామమే నోటికి సులభము

||ఇవి||

నారాయణ పద్మనాభ హృషీకేశ
నారసింహ మధుసూదన త్రివిక్రమ
నీరూపు భావించలేము నిక్కపు శ్రీవేంకటేశ
ఆరయ నీనామజప మన్నిటా సులభము

||ఇవి||405

అవతారిక:

ప్రద్యుమ్నుడు అంటే ‘ప్రకృష్టమైన ‘ద్యుమ్నము’ కలవాడు. అనగా అతిశయించిన బలముకలవాడని అర్థం. మన్మథుని కున్న పర్యాయపదం అది. శ్రీమన్నారాయణుని కేశవనామాలలో కూడా ప్రత్యుమ్నునిపేరు చూస్తాము. శ్రీహరి కూడా అతిక్రమించ సాధ్యంకాని బలము కలవాడు కావున ఆయననూ ప్రద్యుమ్నుడు అంటారు. “ఓ ప్రద్యుమ్నా! పరమ యోగులకైనా భవసాగరమును దాటించే తెప్ప ఇవియే. ఇహమున సుఖము పరమున మోక్షము ఇవ్వవలెనంటే ఇవియేపో సాధనములు” . అంటున్నారు అన్నమాచార్యులవారు. భజన సాంప్రదాయంలో సాగే కీర్తన పాడితే కేశవనామాలు చదివినట్లే. మీదే ఆలస్యం…

భావ వివరణ:

ఓ ప్రద్యుమ్నా! (అతిశయించిన బలము కలవాడా) ఇహపరసాధనములు | (బ్రతికుండగా ఈలోకములో సుఖము చనిపోయాక పైలోకములలో మోక్షము సాధించు మార్గము) ఇవియేపో (ఇవియే సుమా!) పరమయోగులైన వారికి, భవజలధి తేప (సంసార సాగరమును దాటించగల నావ ఇదియే కదా!)

ఓ వామనమూర్తి! గోవిందుడా! విష్ణుదేవా! వాసుదేవా! శ్రీహరీ! శ్రీకృష్ణా! దామోదరా! (ఉదరమునకు తల్లి యశోదచే దామముతో కట్టబడినవాడా!) అచ్యుతా! మాధవా! శ్రీధరా! (లక్ష్మీవల్లభా!) నీమహిమను | గాలేము (తెలుసుకొనలేము). నిన్ను ఇటువంటివాడని అంచనావేయలేము. మరి ఇక యేమి చేయగలం? నాలుకకు అతి సులభమైన పని నీ నామమును జపించుట. అది చాలునాకు.

ఓ అనిరుద్ధా! (పరులచేత అడ్డగింపలేనివాడు) పురుషోత్తమా! అధోక్షజా! (ఇంద్రియములను జయించిన వారికి మాత్రమే కనబడువాడు) ఉపేంద్రా! జనార్ధనా! కేశవా! సంకర్షణా! (ప్రళయకాలమందు అందరినీ అంతముజేయువాడు) నిన్ను దలచలేము (నీగురించి ఆలోచించలేము). ఇక నిన్ను యెట్లు తెలియగలము? నునుపైన (పట్టుకోవటానికి తేలికైన) నీ నామము నోటితో సులభముగా పలికెదను ప్రభూ!

ఓ నారాయణుడా! పద్మనాభుడా!, హృషీకేశా! (ఇంద్రియములకు అధిపతి) నారసింహ! మధుసూదనా! త్రివిక్రమా! నీరూపము విశ్వరూపమైనందువలన యెట్లుండునో వూహింపజాలము. కానీ నేడు మాకన్నులయెదుట నిజముగా కనుపించుచున్న నిక్కపు వేంకటేశ్వరుడవు నీవే తండ్రీ! దర్శించి జపించుటకు అతి సులభమైన నీనామజపమును అన్నిటా స్వీకరింతును. ఎందుకంటే సులభమైన తరుణోపాయము ఓం నమో వేంకటేశాయ! అనడమే సుమా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు