Aranya Kanda Sarga 33 In Telugu – అరణ్యకాండ త్రయస్త్రింశః సర్గః

Aranya Kanda Sarga 33 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయస్త్రింశః సర్గలో, శూర్పణఖ రావణుని తన రాజరిక కార్యకలాపాల కోసం నిందించింది, దీని ద్వారా అతని రాజ్యం త్వరలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. అతనికి గిబ్ చేస్తూ ఆమె ఒక రాజు, నిజంగా రాజ్యాధికారానికి తగినవాడు, రాజ్య వ్యవహారాలను ఎలా నిర్వహిస్తాడో వివరిస్తుంది. రాజులు మరియు వారి దుర్గుణాల ఆధారంగా అనేక వ్యాఖ్యానాలు తిరస్కరించబడిన అనేక నమూనాలను ఆమె మాట్లాడుతుంది.

రావణనిందా

తతః శూర్పణఖా దీనా రావణం లోకరావణమ్ |
అమాత్యమధ్యే సంక్రుద్ధా పరుషం వాక్యమబ్రవీత్ ||

1

ప్రమత్తః కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశః |
సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే ||

2

సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిమ్ |
లుబ్ధం న బహు మన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః ||

3

స్వయం కార్యాణి యః కాలే నానుతిష్ఠతి పార్థివః |
స తు వై సహ రాజ్యేన తైశ్చ కార్యైర్వినశ్యతి ||

4

అయుక్తచారం దుర్దర్శమస్వాధీనం నరాధిపమ్ |
వర్జయంతి నరా దూరాన్నదీపంకమివ ద్విపాః ||

5

యే న రక్షంతి విషయమస్వాధీనా నరాధిపః |
తే న వృద్ధ్యా ప్రకాశంతే గిరయః సాగరే యథా ||

6

ఆత్మవద్భిర్విగృహ్య త్వం దేవగంధర్వదానవైః |
అయుక్తచారశ్చపలః కథం రాజా భవిష్యసి ||

7

త్వం తు బాలస్వభావచ్చ బుద్ధిహీనశ్చ రాక్షస |
జ్ఞాతవ్యం తు న జానీషే కథం రాజా భవిష్యసి ||

8

యేషాం చారశ్చ కోశశ్చ నయశ్చ జయతాం వర |
అస్వాధీనా నరేంద్రాణాం ప్రాకృతైస్తే జనైః సమాః ||

9

యస్మాత్ పశ్యంతి దూరస్థాన్ సర్వానర్థాన్నరాధిపాః |
చారేణ తస్మాదుచ్యంతే రాజానో దీర్ఘచక్షుషః ||

10

అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతైః సచివైర్వృతమ్ |
స్వజనం చ జనస్థానం హతం యో నావబుధ్యసే ||

11

చతుర్దశ సహస్రాణి రక్షసాం క్రూరకర్మణామ్ |
హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహదూషణః ||

12

ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః |
ధర్షితం చ జనస్థానం రామేణాక్లిష్టకర్మణా ||

13

త్వం తు లుబ్ధః ప్రమత్తశ్చ పరాధీనశ్చ రావణ |
విషయే స్వే సముత్పన్నం భయం యో నావబుధ్యసే ||

14

తీక్ష్ణమల్పప్రదాతారం ప్రమత్తం గర్వితం శఠమ్ |
వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివమ్ ||

15

అతిమానినమగ్రాహ్యమాత్మసంభావితం నరమ్ |
క్రోధినం వ్యసనే హంతి స్వజనోఽపి మహీపతిమ్ ||

16

నానుతిష్ఠతి కార్యాణి భయేషు న బిభేతి చ |
క్షిప్రం రాజ్యాచ్చ్యుతో దీనస్తృణైస్తుల్యో భవిష్యతి ||

17

శుష్కైః కాష్ఠైర్భవేత్కార్యం లోష్టైరపి చ పాంసుభిః |
న తు స్థానాత్ పరిభ్రష్టైః కార్యం స్యాద్వసుధాధిపైః ||

18

ఉపభుక్తం యథా వాసః స్రజో వా మృదితా యథా |
ఏవం రాజ్యాత్పరిభ్రష్టః సమర్థోఽపి నిరర్థకః ||

19

అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియః |
కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్ఠతే చిరమ్ ||

20

నయనాభ్యాం ప్రసుప్తోఽపి జాగర్తి నయచక్షుషా |
వ్యక్తక్రోధప్రసాదశ్చ స రాజా పూజ్యతే జనైః ||

21

త్వం తు రావణ దుర్బుద్ధిర్గుణైరేతైర్వివర్జితః |
యస్య తేఽవిదితశ్చారై రక్షసాం సుమహాన్ వధః ||

22

పరావమంతా విషయేషు సంగతో
న దేశకాలప్రవిభాగతత్త్వవిత్ |
అయుక్తబుద్ధిర్గుణదోషనిశ్చయే
విపన్నరాజ్యో న చిరాద్విపత్స్యసే ||

23

ఇతి స్వదోషాన్ పరికీర్తితాంస్తయా
సమీక్ష్య బుద్ధ్యా క్షణదాచరేశ్వరః |
ధనేన దర్పేణ బలేన చాన్వితో
విచింతయామాస చిరం స రావణః ||

24

Aranya Kanda Sarga 33 In Telugu Pdf Download

“అన్నా రావణా! అక్కడ జనస్థానములో జరగకూడని ఘోరాలు జరిగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ, సంతోషంగా బంగారు సింహాసనము మీద కూర్చుని రాజభోగములు, అంత:పుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావా! నీ రాజ్యములో ఏమి జరుగుతూ ఉందో తెలుసుకోవాలి అన్న జ్ఞానం కూడా నీకు లేదా! నీ వలె కామోప భోగములలో మునిగి తేలుతూ రాజ్యక్షేమమును మరిచే రాజును ప్రజలు గౌరవించరు. అది తెలుసుకో! రాజు ఏ కాలంలో చేయాల్సిన పనులను ఆయాకాలములలో చేయక పోతే, ఆ రాజు, అతని రాజ్యము నశించిపోవడం తథ్యం.

ప్రజలకు దూరంగా ఉంటూ, గూఢచారుల ద్వారా ప్రజల కష్టనష్టములు తెలుసుకోకుండా, ఇంద్రియలోలుడై ప్రవర్తించేరాజును ప్రజలు పదవీచ్యుతుడిని చేస్తారు. తమ ఇంద్రియములను తాము నిగ్రహించుకోలేని రాజులు, ప్రజలను ఏమి రక్షిస్తారు? అత్యంత బలవంతులైన దేవతలు, గంధర్వులు, దానవులు నీకు ప్రబల విరోధులు. వారి వలన నీకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంది. కాని నీవు వారి కదలికలను గూఢచారుల వలన తెలుసుకోకుండా ప్రమత్తుడవై ఉంటున్నావు. అటువంటి వాడివి నీవు రాజుగా ఎలా ఉండగలవు?

ఓ రావణా! రాజు అయిన వాడు తన కోశాగారమును, గూఢచార వ్యవస్థను, పరిపాలనా వ్యవహారములను, తన అధీనములో ఉంచుకొని జాగరూకతతో ప్రవర్తించాలి. అలా చేయకపోతే నీకూ, మామూలు మనిషికి తేడా లేదు. ఓ రాజా! నీకు గూఢచారులు కళ్లలాంటి వారు. వారిని నీవు నిర్లక్ష్యం చేస్తే, నీవు గుడ్డివాడి కింద లెక్క. నీవే కాదు నీ మంత్రులు కూడా అసమర్థులు అని తెలుస్తూ ఉంది. లేకపోతే కనీసం వారు అయినా జనస్థానంలో ఏమి జరుగుతూ ఉందో తమ గూఢచార వ్యవస్థద్వారా తెలుసుకోకుండా ఉంటారా!

ఒక్క మానవుడు, రాముడు అనే వాడు, 14,000 మంది రాక్షస వీరులను ఒంటి చేత్తో మట్టుపెట్టాడు. ఇది నీకు తెలుసా! ఆ రాముడు రాక్షసులను చంపి దండకారణ్యములో ఉన్న ఋషులకు మునులకు రక్షణ కల్పించాడు. జనస్థానములో రాక్షసులకు నిలువనీడలేకుండా చేసాడు. ఇవన్నీ నీకు తెలియవు. నీ సుఖములు, భోగలాలసత నీది. అధికార మదంతో నీవు ఏదీ పట్టించుకోవు. నీ రాజ్యము ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని కూడా నీవు గ్రహించలేకపోతున్నావు.

ఓ రావణా! నీవు గర్వాంధుడవు. మొండివాడివి. ప్రమత్తుడివి. ఇతరుల కష్టములను చూచి ఆనందించేవాడివి. అటువంటి నీవు కష్టములలో ఉంటే నీకు ఎవరూ సాయం చెయ్యరని, నీ మొహం కూడా చూడరని గుర్తుపెట్టుకో! నీ లాంటి గర్వాంధుడిని, ప్రజల కష్టసుఖములు పట్టించుకోనివాడిని, కోపిష్టిని ప్రజలే అంతమొం దిస్తారు. కార్యాకార్య విచక్షణ తెలియని రాజు రాజ్యభ్రష్టు డవుతాడు. ఒకసారి రాజ్యభ్రష్టత పొందిన రాజు, ఎంతటి సమర్థుడైనా, ప్రజల చేత గడ్డిపరక కన్నా హీనంగా చూడబడతాడు.

(అందుకే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏదో ఒక పదవికోసం పాకులాడుతుంటారు.) అందుకని రాజు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటు పనికిరాదు. అటువంటి రాజును ప్రజలు గౌరవిస్తారు. నీతి మంతుడైన రాజును, ఎల్లప్పుడూ అప్రత్తంగా ఉండే రాజును, అతడిని ప్రజలు దేవుడి వలె పూజిస్తారు.

ఓ అన్నా! రావణా! నీలో పైన చెప్పిన సుగుణములు ఏవీ లేవు. అందుకనే నీకు జనస్థానములో జరిగిన విషయములు ఏమీ తెలియవు. ఎందుకంటే నీవు మునులను., ఋషులను అవమా నించడం, చంపడం, కామోపభోగములను అనుభవించడం, వీటితోనే కాలం గడుపుతున్నావు. నీకు విచక్షణా జ్ఞానం లేదు. మంచి చెడులను నిర్ణయించే బుద్ధిలేదు. అందుకే నీవు అతి త్వరలో ఆపదలలో చిక్కుకుంటావు. నీ రాజ్యం నశిస్తుంది. తర్వాత నీ ఇష్టం.” అని నానా విధాలుగా తిట్టి ముగించింది శూర్పణఖ.

ఆ మాటలు అన్నది వేరేవాళ్లు అయితే రావణుడు వాడి తలనరికి ఉండేవాడు. కానీ ఈ మాటలు అన్నది స్వయానా తన చెల్లెలు. ఎంతో ఆపద వస్తేనే గానీ ఆమె అలా అనదు. అందుకని శూర్పణఖ మాటలలో అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుస్త్రింశః సర్గః (34) >>

Ayodhya Kanda Sarga 98 In Telugu – అయోధ్యాకాండ అష్టనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 98

అయోధ్యాకాండం అష్టనవతితమ (98వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అయోధ్యకు తిరిగి వెళ్తాడు. అయోధ్యలో ప్రజలు భరతుని తీర్పును స్వాగతిస్తారు. భరతుడు, రాముడు లేకపోవడం వలన తన బాధను వ్యక్తం చేస్తూ, ప్రజలకు ధర్మపరంగా పాలనను అందిస్తాడు. భరతుడు రాముని ప్రతినిధిగా పాదుకలను సింహాసనంపై ఉంచి, తాను తాత్కాలికంగా పాలనను పర్యవేక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గలో భరతుని ధర్మనిష్ఠ, రాముడిపై అపారమైన ప్రేమ, ప్రజల పట్ల అతని కర్తవ్యనిష్ఠ కనిపిస్తాయి. భరతుడు రాముడి వలెనే న్యాయంగా, ధర్మబద్ధంగా పాలిస్తానని నిర్ణయిస్తాడు. ప్రజలు భరతుని తీర్పుకు సహాయం చేస్తారు, రాముని తిరిగి రాక కోసం ఎదురుచూస్తారు.

రామాన్వేషణమ్

నివేశ్య సేనాం తు విభుః పద్భ్యాం పాదవతాం వరః |
అభిగంతుం స కాకుత్స్థమియేష గురువర్తకమ్ || ౧ ||

నివిష్టమాత్రే సైన్యే తు యథోద్దేశం వినీతవత్ |
భరతో భ్రాతరం వాక్యం శత్రుఘ్నమిదమబ్రవీత్ || ౨ ||

క్షిప్రం వనమిదం సౌమ్య నరసంఘైః సమంతతః |
లుబ్ధైశ్చ సహితైరేభిస్త్వమన్వేషితుమర్హసి || ౩ ||

గుహో జ్ఞాతిసహస్రేణ శరచాపాసిధారిణా |
సమన్వేషతు కాకుత్స్థమస్మిన్ పరివృతః స్వయమ్ || ౪ ||

అమాత్యైః సహ పౌరైశ్చ గురుభిశ్చ ద్విజాతిభిః |
వనం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృతః స్వయమ్ || ౫ ||

యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలమ్ |
వైదేహీం వా మహాభాగాం న మే శాంతిర్భవిష్యతి || ౬ ||

యావన్న చంద్రసంకాశం ద్రక్ష్యామి శుభమాననమ్ |
భ్రాతుః పద్మపలాశాక్షం న మే శాంతిర్భవిష్యతి || ౭ ||

యావన్న చరణౌ భ్రాతుః పార్థివవ్యంజనాన్వితౌ |
శిరసా ధారయిష్యామి న మే శాంతిర్భవిష్యతి || ౮ ||

యావన్న రాజ్యే రాజ్యార్హః పితృపైతామహే స్థితః |
అభిషేకజలక్లిన్నో న మే శాంతిర్భవిష్యతి || ౯ ||

సిద్ధార్థః ఖలు సౌమిత్రిర్యశ్చంద్రవిమలోపమమ్ |
ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతి || ౧౦ ||

కృతకృత్యా మహాభాగా వైదేహీ జనకాత్మజా |
భర్తారం సాగరాంతాయాః పృథివ్యా యాఽనుగచ్ఛతి || ౧౧ ||

సుభగశ్చిత్రకూటోఽసౌ గిరిరాజోపమో గిరిః |
యస్మిన్వసతి కాకుత్స్థః కుబేర ఇవ నందనే || ౧౨ ||

కృతకార్యమిదం దుర్గం వనం వ్యాలనిషేవితమ్ |
యదధ్యాస్తే మహాతేజాః రామః శస్త్రభృతాం వరః || ౧౩ ||

ఏవముక్త్వా మహాతేజాః భరతః పురుషర్షభః |
పద్భ్యామేవ మహాబాహుః ప్రవివేశ మహద్వనమ్ || ౧౪ ||

స తాని ద్రుమజాలాని జాతాని గిరిసానుషు |
పుష్పితాగ్రాణి మధ్యేన జగామ వదతాం వరః || ౧౫ ||

స గిరిశ్చిత్రకూటస్య సాలమాసాద్య పుష్పితమ్ |
రామాశ్రమగతస్యాగ్నేః దదర్శ ధ్వజముచ్ఛ్రితమ్ || ౧౬ ||

తం దృష్ట్వా భరతః శ్రీమాన్ ముమోహ సహబాంధవః |
అత్ర రామ ఇతి జ్ఞాత్వా గతః పారమివాంభసః || ౧౭ ||

స చిత్రకూటే తు గిరౌ నిశమ్య
రామాశ్రమం పుణ్యజనోపపన్నమ్ |
గుహేన సార్ధం త్వరితో జగామ
పునర్నివేశ్యైవ చమూం మహాత్మా || ౧౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టనవతితమః సర్గః || ౯౮ ||

Ayodhya Kanda Sarga 98 Meaning In Telugu

భరతుడు తనసేనలను చిత్రకూట పర్వతము చుట్టు నిలిపి, రాముని వెతుక్కుంటూ కాలినడకన బయలుదేరాడు. శత్రుఘ్నుని చూచి ఇలాఅన్నాడు. “శత్రుఘ్నా! నీవు కొంత మంది సైనికులను, ఆటవికులను తీసుకొని, ఈ అరణ్యములో రాముని ఆశ్రమము ఎక్కడ ఉందో వెతుకు. గుహుడు తన పరివారముతో మరియొక పక్కనుండి వెతుకుతాడు. నేను కూడా నా పరివారముతోనూ, వసిష్ఠులవారితోనూ బ్రాహ్మణులతో కలిసి మరొక పక్కనుండి వెతుకుతాను. ఆ రాముని దర్శనభాగ్యము ఎవరికి కలుగుతుందో వారు అదృష్టవంతులు.. రాముని చూచేటంత వరకూ నాకు మనశ్శాంతి లేదు.

రాముని చూచిన వెంటనే ఆయన పాదముల మీద నా తలపెట్టి నా కన్నీటితో ఆయన పాదములకు అభిషేకము చేసెదను. రాముడు తిరిగి అయోధ్య వచ్చి తన రాజ్యమును స్వీకరిస్తాను అని చెప్పేవరకూ నేను ఆయన పాదములు వదలను. రాముని పక్కనే ఉ ండి రామును ముఖకమలమును సర్వదా దర్శించు లక్ష్మణుడు ఎంతటి అదృష్టవంతుడో కదా!

అన్ని కష్టములకు ఓర్చి రాముని అనుసరించిన మా వదిన సీతమ్మ కృతార్థురాలు. రాముడు తిరుగాడు ఈ పర్వతము, ఈ వనములు, ఈ నది ఎంతో పుణ్యము చేసుకొన్నాయి. లేకపోతే ఎక్కడో అయోధ్యలో ఉండవలసిన రామపాద స్పర్శ వీటికి లభిస్తుందా.” అని ఆ పరిసరముల యొక్క శోభను పొగుడుతూ భరతుడు రాముని వెదకడానికి ఉపక్రమించాడు.

పర్వత చరియలు, చెట్లు, పుట్టలు కొండగుహలు అన్నీ గాలిస్తున్నాడు. వారంతా ఒక పెద్ద సాలవృక్షము వద్దకు వచ్చారు. వారికి గాలిలోకి లేస్తున్న పొగ కనపడింది. అక్కడ ఏదో ఆశ్రమము ఉండవచ్చు. అని అనుకున్నారు. అది రాముని ఆశ్రమము అక్కడ రాముడు ఉంటాడు అని మనసులో రూఢిగా అనుకున్నాడు భరతుడు. ఇంతలో గుహుడు కూడా అక్కడకు వచ్చాడు. భరతుడు గుహునితో కలిసి రాముని ఆశ్రమము వద్దకు కాలి నడకన వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ ఏకోనశతతమః సర్గః (99) >>

Aranya Kanda Sarga 25 In Telugu – అరణ్యకాండ పంచవింశః సర్గః

Aranya Kanda Sarga 25 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – పంచవింశః సర్గలో, రాముడు లక్ష్మణుడితో కలిసి పంచవటికి చేరుకుంటాడు. అక్కడ వారు సుగ్రీవుని కలుసుకుంటారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలి గురించి చెబుతూ, వారి మధ్య శత్రుత్వం వల్ల తన రాజ్యాన్ని కోల్పోయినట్లు వివరించడంతో రాముడు సుగ్రీవునికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఖరసైన్యావమర్దః

అవష్టబ్ధధనుం రామం క్రుద్ధం చ రిపుఘాతినమ్ |
దదర్శాశ్రమమాగమ్య ఖరః సహ పురఃసరైః ||

1

తం దృష్ట్వా సశరం చాపముద్యమ్య ఖరనిఃస్వనమ్ |
రామస్యాభిముఖం సూతం చోద్యతామిత్యచోదయత్ ||

2

స ఖరస్యాజ్ఞయా సూతస్తురగాన్ సమచోదయత్ |
యత్ర రామో మహాబాహురేకో ధున్వన్ స్థితో ధనుః ||

3

తం తు నిష్పతితం దృష్ట్వా సర్వే తే రజనీచరాః |
నర్దమానా మహానాదం సచివాః పర్యవారయన్ ||

4

స తేషాం యాతుధానానాం మధ్యే రథగతః ఖరః |
బభూవ మధ్యే తారాణాం లోహితాంగ ఇవోదితః ||

5

తతః శరసహస్రేణ రామమప్రతిమౌజసమ్ |
అర్దయిత్వా మహానాదం ననాద సమరే ఖరః ||

6

తతస్తం భీమధన్వానం క్రుద్ధాః సర్వే నిశాచరాః |
రామం నానావిధైః శస్త్రైరభ్యవర్షంత దుర్జయమ్ ||

7

ముద్గరైః పట్టిశైః శూలైః ప్రాసైః ఖడ్గైః పరశ్వధైః |
రాక్షసాః సమరే రామం నిజఘ్నూ రోషతత్పరాః ||

8

తే బలాహకసంకాశా మహానాదా మహౌజసః |
అభ్యధావంత కాకుత్స్థం రథైర్వాజిభిరేవ చ ||

9

గజైః పర్వతకూటాభై రామం యుద్ధే జిఘాంసవః |
తే రామే శరవర్షాణి వ్యసృజన్రక్షసాం గణాః ||

10

శైలేంద్రమివ ధారాభిర్వర్షమాణాః బలాహకాః |
స తైః పరివృతో ఘోరై రాఘవో రక్షసాం గణైః ||

11

[* తిథిష్వివ మహాదేవో వృతః పారిషదాం గణైః | *]
తాని ముక్తాని శస్త్రాణి యాతుధానైః స రాఘవః |
ప్రతిజగ్రాహ విశిఖైర్నద్యోఘానివ సాగరః ||

12

స తైః ప్రహరణైర్ఘోరైర్భిన్నగాత్రో న వివ్యథే |
రామః ప్రదీప్తైర్బహుభిర్వజ్రైరివ మహాచలః ||

13

స విద్ధః క్షతజైర్దిగ్ధః సర్వగాత్రేషు రాఘవః |
బభూవ రామః సంధ్యాభ్రైర్దివాకర ఇవావృతః ||

14

విషేదుర్దేవగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
ఏకం సహస్రైర్బహుభిస్తదా దృష్ట్వా సమావృతమ్ ||

15

తతో రామః సుసంక్రుద్ధో మండలీకృతకార్ముకః |
ససర్జ విశిఖాన్బాణాన్ శతశోఽథ సహస్రశః ||

16

దురవారాన్ దుర్విషహాన్ కాలదండోపమాన్రణే |
ముమోచ లీలయా రామః కంకపత్రానజిహ్మగాన్ ||

17

తే శరాః శత్రుసైన్యేషు ముక్తా రామేణ లీలయా |
ఆదదూ రక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతా ఇవ ||

18

భిత్త్వా రాక్షసదేహాంస్తాంస్తే శరా రుధిరాప్లుతాః |
అంతరిక్షగతా రేజుర్దీప్తాగ్నిసమతేజసః ||

19

అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాత్ |
వినిష్పేతురతీవోగ్రా రక్షః ప్రాణాపహారిణః ||

20

[* తే రథో సాంగదాన్ బాహూన్ సహస్తాభరణాన్ భుజాన్ | *]
ధనూంషి చ ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ |
బహూన్ సహస్తాభరణాన్ ఊరూన్ కరికరోపమాన్ ||

21

చిచ్ఛేద రామః సమరే శతశోఽథ సహస్రశః |
హయాన్ కాంచనసన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ ||

22

గజాంశ్చ సగజారోహాన్ సహయాన్ సాదినస్తథా |
పదాతీన్ సమరే హత్వా హ్యనయద్యమసాదనమ్ ||

23

తతో నాలీకనారాచైస్తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః |
భీమవార్తస్వరం చక్రుర్భిద్యమానా నిశాచరాః ||

24

తత్సైన్యం నిశితైర్బాణైరర్దితం మర్మభేదిభిః |
రామేణ న సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా ||

25

కేచిద్భీమబలాః శూరాః శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ |
రామస్యాభిముఖం గత్వా చిక్షిపుః పరమాయుధాన్ ||

26

తాని బాణైర్మహాబాహుః శస్త్రాణ్యావార్య రాఘవః |
జహార సమరే ప్రాణాంశ్చిచ్ఛేద చ శిరోధరాన్ ||

27

తే ఛిన్నశిరసః పేతుశ్ఛిన్నవర్మశరాసనాః |
సుపర్ణవాతవిక్షిప్తా జగత్యాం పాదపా యథా ||

28

అవశిష్టాశ్చ యే తత్ర విషణ్ణాశ్చ నిశాచరాః |
ఖరమేవాభ్యధావంత శరణార్థం శరార్దితాః ||

29

తాన్ సర్వాన్ పునరాదాయ సమాశ్వాస్య చ దూషణః |
అభ్యధావత కాకుత్స్థం క్రుద్ధో రుద్రమివాంతకః ||

30

నివృత్తాస్తు పునః సర్వే దూషణాశ్రయనిర్భయాః |
రామమేవాభ్యధావంత సాలతాలశిలాయుధాః ||

31

శూలముద్గరహస్తాశ్చ చాపహస్తా మహాబలాః |
సృజంతః శరవర్షాణి శస్త్రవర్షాణి సంయుగే ||

32

ద్రుమవర్షాణి ముంచంతః శిలావర్షాణి రాక్షసాః |
తద్బభూవాద్భుతం యుద్ధం తుములం రోమహర్షణమ్ ||

33

రామస్య చ మహాఘోరం పునస్తేషాం చ రక్షసామ్ |
తే సమంతాదభిక్రుద్ధా రాఘవం పునరభ్యయుః ||

34

తైశ్చ సర్వా దిశో దృష్ట్వా ప్రదిశశ్చ సమావృతాః |
రాక్షసైరుద్యతప్రాసైః శరవర్షాభివర్షిభిః ||

35

స కృత్వా భైరవం నాదమస్త్రం పరమభాస్వరమ్ |
సంయోజయత గాంధర్వం రాక్షసేషు మహాబలః ||

36

తతః శరసహస్రాణి నిర్యయుశ్చాపమండలాత్ |
సర్వా దశ దిశో బాణైరావార్యంత సమాగతైః ||

37

నాదదానం శరాన్ ఘోరాన్న ముంచంత శిలీముఖాన్ |
వికర్షమాణం పశ్యంతి రాక్షసాస్తే శరార్దితాః ||

38

శరాంధకారమాకాశమావృణోత్సదివాకరమ్ |
బభూవావస్థితో రామః ప్రవమన్నివ తాన్ శరాన్ ||

39

యుగపత్పతమానైశ్చ యుగపచ్చ హతైర్భ్రుశమ్ |
యుగపత్పతితైశ్చైవ వికీర్ణా వసుధాభవత్ ||

40

నిహతాః పతితాః క్షీణాశ్ఛిన్నా భిన్నా విదారితాః |
తత్ర తత్ర స్మ దృశ్యంతే రాక్షసాస్తే సహస్రశః ||

41

సోష్ణీషైరుత్తమాంగైశ్చ సాంగదైర్బాహుభిస్తథా |
ఊరుభిర్జానుభిశ్ఛిన్నైర్నానారూపవిభూషణైః ||

42

హయైశ్చ ద్విపముఖ్యైశ్చ రథైర్భిన్నైరనేకశః |
చామరైర్వ్యజనైశ్ఛత్రైర్ధ్వజైర్నానావిధైరపి ||

43

రామస్య బాణాభిహతైర్విచిత్రైః శూలపట్టిశైః |
ఖడ్గైః ఖండీకృతైః ప్రాసైర్వికీర్ణైశ్చ పరశ్వధైః ||

44

చూర్ణితాభిః శిలాభిశ్చ శరైశ్చిత్రైరనేకశః |
విచ్ఛిన్నైః సమరే భూమిర్వికీర్ణాఽభూద్భయంకరా ||

45

తాన్ దృష్ట్వా నిహతాన్ సంఖ్యే రాక్షసాన్ పరమాతురాన్ |
న తత్ర సహితుం శక్తా రామం పరపురంజయమ్ ||

46

[* బలావశేషం తు నిరస్తమాహవే ఖరాధికం రాక్షసదుర్బలం బలమ్ |
జఘాన రామః స్థిరధర్మపౌరుషో ధనుర్బలైరప్రతివారణైః శరైః || *]

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశః సర్గః ||

Aranya Kanda Sarga 25 Meaning In Telugu

ఖరుడు తన రధాన్ని తన సేనల ముందు నిలబెట్టాడు. ధనుర్బాణములతో నేలమీద నిలుచుని ఉన్న రాముని చూచాడు.

“రథమును రాముని మీదికి నడిపిపంచు” అని సారధిని ఆజ్ఞాపించాడు ఖరుడు.

ఖరుని ఆజ్ఞను అందుకొని సారథి రథమును రాముని మీదికి పోనిచ్చాడు. అది చూచి రాక్షస సేనలు కూడా రాముని మీదికి తమ తమ రథములను నడిపించాయి. రాముని చుట్టుముట్టాయి. రాముని మీద బాణముల వర్షము కురిపించాయి.

ఆ బాణఘాతములను రాముడు చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ బాణములు తన దేహమును బాధించినా ఓర్చుకున్నాడు. రాక్షసులు ప్రయోగించిన బాణములతో, ఆయుధముల దెబ్బలతో రాముని శరీరం అంతా రక్తసిక్తము అయింది. కాని రాముడు చలించలేదు.

అన్ని వేల మంది రాక్షసులు ఒక్కుమ్మడిగా ఒంటరిగా ఉన్న రాముని చుట్టుముట్టి గాయపరచడం చూచి ఆకాశంలో నిలబడ్డ దేవతలు, గంధర్వులు ఎంతో వ్యధచెందారు. అన్ని దెబ్బలు తింటేగానీ, రామునికి రాక్షసులను చంపాలి అన్నంత కోపం రాలేదు. (రాముడు కోపం తెచ్చుకున్నాడు అన్న మాటకు అర్థం ఇదేకాబోలు.)

అప్పుడు రాముడు కోపంతో కంపించి పోయాడు. తన ధనుస్సును మండలాకారంగా వంచి వేలకొలది బాణములను రాక్షసులు మీద ప్రయోగించాడు. (ధనుస్సు నిలువుగా ఉంటుంది. ఎక్కుపెడితో గుండ్రంగా వంగుతుంది. రాముని ధనుస్సు గుండ్రంగా ఉంది అంటే రాముడు ఎంత వేగంగా బాణాలు ప్రయోగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు)

రాముడు తన వద్ద ఉన్న దివ్యాస్త్రములను వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము నేలకొరిగింది. రాముడు వదిలిన ఒక్కొక్క బాణము ఒక్కొక్క రాక్షసుని గుండెలు చీల్చింది. రాముడు ప్రయోగించిన వేలకొలది బాణములు వేలకొలది రాక్షసులను మట్టుబెట్టాయి. రాముడు తన బాణములతో రాక్షసుల రథములను విరగ్గొట్టాడు. హయములను, గజములను చంపాడు. పతాకములను విరిచాడు. రథికులు, ఆశ్వికులు, పదాతి దళము అందరూ రామ బాణములకు ఆహుతి అయ్యారు. రాముని బాణముల దెబ్బలకు తాళలేక రాక్షసులు చేయు హాహాకారములతో ఆ ప్రాంతము అంతా మార్మోగి పోయింది.

చావగా మిగిలిన రాక్షస వీరులు రాముని మీదికి గండ్రగొడ్డళ్లను, శూలములను, కత్తులను విసిరారు. రాముడు నిర్విరామంగా బాణప్రయోగం చేస్తూ వారు విసిరిన నానారకాల ఆయుధములను మధ్యలోనే తుంచేసాడు. ఆ ఆయుధములు ప్రయోగించిన వారి కంఠములు ఖండించాడు. అలా రాక్షసులు తలకాయలు తెగి పడుతుంటే, ఆ ప్రాంతమంతా రాక్షసుల కళేబరాలతో నిండిపోయింది. చావగా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున ఖరుని వద్దకు పోయి దాక్కున్నారు.

ఖరుని పక్కనే ఉన్న దూషణుడు వారినందరినీ ఓదార్చి, ధైర్యము చెప్పి, వారినందరినీ వెంటబెట్టుకొని పట్టరాని కోపంతో రాముని మీదికి ఉరికాడు. దూషణుని నాయకత్వంలో రాక్షసులు చేతికి అందిన రాళ్లను, చెట్లను పట్టుకొని రాముని మీదికి లంఘించారు. రాముని మీదికి చెట్లను రాళ్లను విసిరారు. రాముడు వాటిని తన శరములతో పిండి పిండి చేసాడు.

ఆ ప్రకారంగా రాక్షసులకు రామునికి ఘోరయుద్ధము జరిగింది. ఇలా కాదని రాక్షసులు అందరూ రాముని చుట్టు చేరి ఆయుధములను ప్రయోగించారు. అది చూచిన రాముడు వారి మీద గాంధర్వము అనే అస్త్రమును ప్రయోగించాడు.

ఆ ప్రభావంతో రాక్షసులకు తాము ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. రాముడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియడం లేదు. రాముని ధనుస్సు మండలాకారంలో ఉండటం మాత్రం కనపడుతూ ఉంది వారికి. కాని రాముని ధనుస్సునుండి వెలువడిన బాణములు రాక్షసులను హతమారుస్తున్నాయి.

ఆ ప్రాంతమంతా రాక్షసుల తలలతోనూ, కాళ్లతోనూ, మొండెములతోనూ నిండిపోయింది. వారి వారి ఆయుథములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారే కాదు వారు ఎక్కి వచ్చిన గుర్రములు, ఏనుగులు కూడా చచ్చి పడి ఉన్నాయి. రథములు, వాటికి కట్టిన పతాకములు తునా తునకలుగా విరిగిపడి ఉన్నాయి. రాక్షసుల మృతకళేబరములతో ఆ ప్రాంతం అంతా భయంకరంగా, భీభత్సంగా ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యపర్వము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షడ్వింశః సర్గః (26) >>

Aranya Kanda Sarga 32 In Telugu – అరణ్యకాండ ద్వాత్రింశః సర్గః

Aranya Kanda Sarga 32 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాత్రింశః సర్గలో, రావణుడి ఆడంబరం మరియు వైభవం అతని విలక్షణత మరియు వ్యక్తిత్వం, అతని విజయాలు మరియు విజయాలు, అతని అసూయలు మరియు దురాశలతో పాటు చిత్రీకరించబడింది. లక్ష్మణుడి చేతిలో తన గతి గురించి తెలియజేయడానికి శూర్పణఖ అతనిని సమీపించింది.

శూర్పణఖోద్యమః

తతః శూర్పణఖా దృష్ట్వా సహస్రాణి చతుర్దశ |
హతాన్యేకేన రామేణ రక్షసాం భీమకర్మణామ్ ||

1

దూషణం చ ఖరం చైవ హతం త్రిశిరసా సహ |
దృష్ట్వా పునర్మహానాదం ననాద జలదో యథా ||

2

సా దృష్ట్వా కర్మ రామస్య కృతమన్యైః సుదుష్కరమ్ |
జగామ పరమోద్విగ్నా లంకాం రావణపాలితామ్ ||

3

సా దదర్శ విమానాగ్రే రావణం దీప్తతేజసమ్ |
ఉపోపవిష్టం సచివైర్మరుద్భిరివ వాసవమ్ ||

4

ఆసీనం సూర్యసంకాశే కాంచనే పరమాసనే |
రుక్మవేదిగతం ప్రాజ్యం జ్వలంతమివ పావకమ్ ||

5

దేవగంధర్వభూతానామృషీణాం చ మహాత్మనామ్ |
అజేయం సమరే శూరం వ్యాత్తాననమివాంతకమ్ ||

6

దేవాసురవిమర్దేషు వజ్రాశనికృతవ్రణమ్ |
ఐరావతవిషాణాగ్రైరుద్ఘృష్టకిణవక్షసమ్ ||

7

వింశద్భుజం దశగ్రీవం దర్శనీయపరిచ్ఛదమ్ |
విశాలవక్షసం వీరం రాజలక్షణశోభితమ్ ||

8

స్నిగ్ధవైడూర్యసంకాశం తప్తకాంచనకుండలమ్ |
సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమమ్ ||

9

విష్ణుచక్రనిపాతైశ్చ శతశో దేవసంయుగే |
అన్యైః శస్త్రప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితమ్ ||

10

ఆహతాంగం సమస్తైశ్చ దేవప్రహరణైస్తథా |
అక్షోభ్యాణాం సముద్రాణాం క్షోభణం క్షిప్రకారిణమ్ ||

11

క్షేప్తారం పర్వతేంద్రాణాం సురాణాం చ ప్రమర్దనమ్ |
ఉచ్ఛేత్తారం చ ధర్మాణాం పరదారాభిమర్శనమ్ ||

12

సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞవిఘ్నకరం సదా |
పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిమ్ ||

13

తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహార యః |
కైలాసపర్వతం గత్వా విజిత్య నరవాహనమ్ ||

14

విమానం పుష్పకం తస్య కామగం వై జహార యః |
వనం చైత్రరథం దివ్యం నలినీం నందనం వనమ్ ||

15

వినాశయతి యః క్రోధాద్దేవోద్యానాని వీర్యవాన్ |
చంద్రసూర్యౌ మహాభాగావుత్తిష్ఠంతౌ పరంతపౌ ||

16

నివారయతి బాహుభ్యాం యః శైలశిఖరోపమః |
దశవర్షసహస్రాణి తపస్తప్త్వా మహావనే ||

17

పురా స్వయంభువే ధీరః శిరాంస్యుపజహార యః |
దేవదానవగధర్వపిశాచపతగోరగైః ||

18

అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాదృతే |
మంత్రైరభిష్టుతం పుణ్యమధ్వరేషు ద్విజాతిభిః ||

19

హవిర్ధానేషు యః సోమముపహంతి మహాబలః |
ఆప్తయజ్ఞహరం క్రూరం బ్రహ్మఘ్నం దుష్టచారిణమ్ ||

20

కర్కశం నిరనుక్రోశం ప్రజానామహితే రతమ్ |
రావణం సర్వభూతానాం సర్వలోకభయావహమ్ ||

21

రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలమ్ |
తం దివ్యవస్త్రాభరణం దివ్యమాల్యోపశోభితమ్ ||

22

ఆసనే సూపవిష్టం చ కాలకాలమివోద్యతమ్ |
రాక్షసేంద్రం మహాభాగం పౌలస్త్యకులనందనమ్ ||

23

రావణం శత్రుహంతారం మంత్రిభిః పరివారితమ్ |
అభిగమ్యాబ్రవీద్వాక్యం రాక్షసీ భయవిహ్వలా ||

24

తమబ్రవీద్దీప్తవిశాలలోచనం
ప్రదర్శయిత్వా భయమోహమూర్ఛితా |
సుదారుణం వాక్యమభీతచారిణీ
మహాత్మనా శూర్పణఖా విరూపితా ||

25

Aranya Kanda Sarga 32 In Telugu Pdf Download

తన అన్నలు ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యము తన కళ్లముందు నాశనం కావడం చూచి తట్టుకోలేక పోయింది శూర్పణఖ. ఒక్క రాముని చేతిలోనే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చావడం చూచి పెద్దగా కేకలుపెట్టింది. భయంతో శూర్పణఖ వణికిపోయింది. వెంటనే ఈ విషయం తన అన్న రావణునకు చెప్పడానికి శూర్పణఖ లంకకు పరుగెత్తింది.

లంకానగరంలో, రావణుడు, మూర్తీభవించిన దేవేంద్రుని వలె, సభాప్రాంగణంలో, తన బంగారు సింహాసనము మీద, కూర్చుని ఉన్నాడు. రావణుని చుట్టు అతని మంత్రులు కూర్చుని ఉన్నారు.

రావణుడు సామాన్యుడు కాడు. దేవతలను, గంధర్వులను యుద్ధములో గెలిచినవాడు. ముల్లోకములలో అతనికి తిరుగు లేదు. శత్రువులకు యముడు లాగా వెలుగుతున్నాడు రావణుడు. దేవాసుర యుద్ధములో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలనా, విష్ణువు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయాలకు చిహ్నాలుగా రావణుని ఒంటిమీద ప్రకాశిస్తున్నాయి. రావణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి.

రావణుడు దశకంఠుడు. అంటే పది తలలు కలవాడు. అతనికి ఇరువది చేతులు, పది తలలు. ఆ కనకపు సింహాసనము మీద వెండి కొండమాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు. రావణుడు పరాక్రమవంతుడే కాదు. ఇతరుల భార్యలు అంటే అతనికి మక్కువ ఎక్కువ. ఒకసారి భోగవతీ నగరానికి పోయి, తక్షకుని భార్యను బలాత్కారంగా తీసుకొని వచ్చాడు. రావణునికి ధర్మాచరణము మీద నమ్మకము లేదు. రావణుడు కుబేరుని ఓడించి అతని వద్ద ఉన్న పుష్పక
విమానమును అపహరించాడు.

రావణుడు దివ్యాస్త్రములను ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, అంతే నేర్పుతో సాధుజనులు చేయు యజ్ఞయాగములను భగ్నం చేస్తాడు. రావణునికి కోపం వస్తే సుందర ఉద్యానవనములను, అందమైన వనములను, సరస్సులను నాశనం చేస్తాడు. ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే తత్వం రావణునిది. రావణుడు ఎంతటి అధర్మపరుడైనా గొప్ప తపశ్శాలి.

పూర్వము బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేసాడు. తన శిరస్సులను ఖండించి బ్రహ్మదేవునికి సమర్పించాడు. దాని ప్రతిఫలంగా బ్రహ్మదేవుని వద్దనుండి తనకు యుద్ధములో దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పక్షిజాతులు, సర్పజాతులు, ఒక్క మానవులు తప్ప ఏ ఇతర జీవ జాతుల నుండి కూడా తనకు మరణము లేకుండా వరం పొందాడు. మానవులు తనను ఏమీ చేయలేరని గుడ్డినమ్మకం రావణునిది.

రావణునికి దేవతలు అంటే మంట. ఋత్విక్కులు యజ్ఞయాగములలో హవిస్సులు దేవతలకు ఇవ్వకుండా ఆ యజ్ఞములను నాశనం చేసేవాడు. రావణుడు బ్రాహ్మణులను, ఋషులను, మునులను కూరంగా చంపేవాడు. అతని హృదయము పాషాణము. జాలి అనే పదానికి రావణునికి అర్థం తెలియదు. ప్రజలను హింసించడంలో ఆసక్తి చూపేవాడు.

అటువంటి రావణునికి శూర్పణఖ చెల్లెలు. తన గోడు చెప్పుకోడానికి శూర్పణఖ పరుగు పరుగున రావణుని వద్దకు వచ్చింది. కోయబడిన తన ముక్కు, చెవులను రావణుని చూపించి ఇలా పలికింది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయస్త్రింశః సర్గః (33) >>

Aranya Kanda Sarga 24 In Telugu – అరణ్యకాండ చతుర్వింశః సర్గః

Aranya Kanda Sarga 24 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – చతుర్వింశః సర్గలో, రాముడు సీతతో పాటు లక్ష్మణుడితో దండకారణ్యంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఆయన రాక్షసులపై శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. రాక్షసులు రాముని శక్తిని పరీక్షించేందుకు అనేక మార్గాల్లో అతనిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా వారిని ఎదుర్కొంటాడు.

రామఖరబలసంనికర్షః

ఆశ్రమం ప్రతియాతే తు ఖరే ఖరపరాక్రమే |
తానేవోత్పాతికాన్ రామః సహ భ్రాత్రా దదర్శ హ ||

1

తానుత్పాతాన్ మహాఘోరానుత్థితాన్ రోమహర్షణాన్ |
ప్రజానామహితాన్ దృష్ట్వా వాక్యం లక్ష్మణమబ్రవీత్ ||

2

ఇమాన్ పశ్య మహాబాహో సర్వభూతాపహారిణః |
సముత్థితాన్ మహోత్పాతాన్ సంహర్తుం సర్వరాక్షసాన్ ||

3

అమీ రుధిరధారాస్తు విసృజంతః ఖరస్వనాన్ |
వ్యోమ్ని మేఘా వివర్తంతే పరుషా గర్దభారుణాః ||

4

సధూమాశ్చ శరాః సర్వే మమ రుద్ధాభినందితాః |
రుక్మపృష్ఠాని చాపాని వివేష్టంతే చ లక్ష్మణ ||

5

యాదృశా ఇహ కూజంతి పక్షిణో వనచారిణః |
అగ్రతో నో భయం ప్రాప్తం సంశయో జీవితస్య చ ||

6

సంప్రహారస్తు సుమహాన్ భవిష్యతి న సంశయః |
అయమాఖ్యాతి మే బాహుః స్ఫురమాణో ముహుర్ముహుః ||

7

సన్నికర్షే తు నః శూర జయం శత్రోః పరాజయమ్ |
సప్రభం చ ప్రసన్నం చ తవ వక్త్రం హి లక్ష్యతే ||

8

ఉద్యతానాం హి యుద్ధార్థం యేషాం భవతి లక్ష్మణ |
నిష్ప్రభం వదనం తేషాం భవత్యాయుఃపరిక్షయః ||

9

రక్షసాం నర్దతాం ఘోరః శ్రూయతే చ మహాధ్వనిః |
ఆహతానాం చ భేరీణాం రాక్షసైః క్రూరకర్మభిః ||

10

అనాగతవిధానం తు కర్తవ్యం శుభమిచ్ఛతా |
ఆపదం శంకమానేన పురుషేణ విపశ్చితా ||

11

తస్మాద్గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధరః |
గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులామ్ ||

12

ప్రతికూలితుమిచ్ఛామి న హి వాక్యమిదం త్వయా |
శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్స మా చిరమ్ ||

13

త్వం హి శూరశ్చ బలవాన్హన్యా హ్యేతాన్న సంశయః |
స్వయం తు హంతుమిచ్ఛామి సర్వానేవ నిశాచరాన్ ||

14

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సహ సీతయా |
శరానాదాయ చాపం చ గుహాం దుర్గాం సమాశ్రయత్ ||

15

తస్మిన్ప్రవిష్టే తు గుహాం లక్ష్మణే సహ సీతయా |
హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామః కవచమావిశత్ ||

16

స తేనాగ్నినికాశేన కవచేన విభూషితః |
బభూవ రామస్తిమిరే విధూమోఽగ్నిరివోత్థితః ||

17

స చాపముద్యమ్య మహచ్ఛరానాదాయ వీర్యవాన్ |
బభూవావస్థితస్తత్ర జ్యాస్వనైః పూరయన్ దిశః ||

18

తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ సహ చారణైః |
సమేయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ||

19

ఋషయశ్చ మహాత్మానో లోకే బ్రహ్మర్షిసత్తమాః |
సమేత్య చోచుః సహితా అన్యోన్యం పుణ్యకర్మణః ||

20

స్వస్తి గోబ్రాహ్మణేభ్యోఽస్తు లోకానాం యేఽభిసంగతాః |
జయతాం రాఘవో యుద్ధే పౌలస్త్యాన్రజనీచరాన్ ||

21

చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్ |
ఏవముక్త్వా పునః ప్రోచురాలోక్య చ పరస్పరమ్ ||

22

చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి ||

23

ఇతి రాజర్షయః సిద్ధాః సగణాశ్చ ద్విజర్షభాః |
జాతకౌతూహలాస్తస్థుర్విమానస్థాశ్చ దేవతాః ||

24

ఆవిష్టం తేజసా రామం సంగ్రామశిరసి స్థితమ్ |
దృష్ట్వా సర్వాణి భూతాని భయాద్వివ్యథిరే తదా ||

25

రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్టకర్మణః |
బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః ||

26

ఇతి సంభాష్యమాణే తు దేవగంధర్వచారణైః |
తతో గంభీరనిర్హ్రాదం ఘోరవర్మాయుధధ్వజమ్ ||

27

అనీకం యాతుధానానాం సమంతాత్ప్రత్యదృశ్యత |
సింహనాదం విసృజతామన్యోన్యమభిగర్జతామ్ ||

28

చాపాని విస్ఫారయతాం జృంభతాం చాప్యభీక్ష్ణశః |
విప్రఘుష్టస్వనానాం చ దుందుభీశ్చాపి నిఘ్నతామ్ ||

29

తేషాం సుతుములః శబ్దః పూరయామాస తద్వనమ్ |
తేన శబ్దేన విత్రస్తాః శ్వాపదా వనచారిణః ||

30

దుద్రువుర్యత్ర నిఃశబ్దం పృష్ఠతో న వ్యలోకయన్ |
తత్త్వనీకం మహావేగం రామం సముపసర్పత ||

31

ఘృతనానాప్రహరణం గంభీరం సాగరోపమమ్ |
రామోఽపి చారయంశ్చక్షుః సర్వతో రణపండితః ||

32

దదర్శ ఖరసైన్యం తద్యుద్ధాభిముఖముత్థితమ్ |
వితత్య చ ధనుర్భీమం తూణ్యోశ్చోద్ధృత్య సాయకాన్ ||

33

క్రోధమాహారయత్తీవ్రం వధార్థం సర్వరక్షసామ్ |
దుష్ప్రేక్షః సోఽభవత్క్రుద్ధో యుగాంతాగ్నిరివ జ్వలన్ ||

34

తం దృష్ట్వా తేజసాఽఽవిష్టం ప్రాద్రవన్వదేవతాః |
తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య దదృశే తదా |
దక్షస్యేవ క్రతుం హంతుముద్యతస్య పినాకినః ||

35

[* ఆవిష్టం తేజసా రామం సంగ్రామశిరసి స్థితమ్ |
దృష్ట్వా సర్వాణి భూతాని భయార్తాని ప్రదుద్రువుః || *]

తత్కార్ముకైరాభరణైర్ధ్వజైశ్చ
తైర్వర్మభిశ్చాగ్నిసమానవర్ణైః |
బభూవ సైన్యం పిశితాశనానాం
సూర్యోదయే నీలమివాభ్రవృందమ్ ||

36

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్వింశః సర్గః ||

Aranya Kanda Sarga 24 Meaning In Telugu

జనస్థానములో ఖరుడికి కనపడ్డ దుశ్శకునములు అన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులకు కూడా కనపడ్డాయి. వాటిని చూచిన రాముడు లక్షణునితో ఇలా అన్నాడు.

“లక్ష్మణా! ఆకాశంలో కనపడే దుశ్శకునములను చూచావు కదా! ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి శకునములు ఒక మహాయుద్ధమునకు ముందుకనపడతాయి. అరణ్యములో మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయము కలుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ప్రాణాపాయము కూడా కలగ వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధము జరగబోతోంది అనుటలో సందేహము లేదు.

లక్ష్మణా! జాగ్రత్తగా విను. రాక్షసుల అరుపులు, భేరీనినాదములు వినిపిస్తున్నాయి. రాక్షసులు మనమీదికి యుద్ధానికి వస్తున్నారు. కాబట్టి మనము జరగబోయే దానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నీవు ధనుర్బాణములు ధరించి, సీతను తీసుకొని, చెట్లతోనూ, పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు. నా మాటకు అడ్డు చెప్పవద్దు.

“నేనే రాక్షసులను చంపుతాను.” అనే మాటలు చెప్పవద్దు. మనకు సీత క్షేమము ముఖ్యము. నీవు సీతకు రక్షణగా ఉండు. నేను రాక్షసులను చంపుతాను. అంటే నీవు రాక్షసులను చంపలేవని కాదు. నీవు వీరాధివీరుడవు, శూరుడవు. నీవు ఒక్కడివే అందరు రాక్షసులను మట్టుపెట్టగలవు. కానీ నేను ఒక్కడినే రాక్షస సంహారము చేయవలెనని కోరికగా ఉంది. అందుకనీ నీవు సీతను తీసుకొని వెళ్లు.” అని అన్నాడు రాముడు.

రాముని మాటను మీరలేక, లక్ష్మణుడు, సీతను తీసుకొని గుహలోకి ప్రవేశించాడు. రాముడు కవచమును ధరించాడు. ధనుర్బాణములు తీసుకున్నాడు. ధనుష్టంకారము చేసాడు. రాముడు మొదటిసారిగా రాక్షసులతో యుద్ధ చేయబోతున్నాడు. అందుకని ఆకాశంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు అందరూ సమావేశమయ్యారు.

“రాముడు ఒక్కడు. రాక్షస సేనలు 14,000. ఎలా యుద్ధం చేస్తాడు.” అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. వాళ్ల కళ్లకు రాముడు ప్రళయ కాల రుద్రుడిలా కనపడుతున్నాడు.

ఇంతలో రాక్షస సైన్యము అక్కడకు చేరుకుంది. నాలుగు పక్కల నుండి రాక్షసులు రాముని చుట్టుముట్టారు. పెద్దగా కేకలుపెడుతున్నారు. కొందరు ధనుస్సులను ఠంగు ఠంగున మోగిస్తున్నారు. యుద్ధభేరీలు మోగుతున్నాయి. ఆ భయంకర ధ్వనులకు అడవిలో ఉన్న క్రూరమృగములు సైతము పారిపోయాయి. రాక్షస సైన్యము నలుదిక్కుల నుండి రాముని దగ్గర దగ్గరగా వస్తూ ఉంది.

రాముడు చుట్టూ చూచాడు. తనను చుట్టుముట్టిన రాక్షసులను పరికించి చూచాడు. అమ్ములపొదిలోనుండి బాణములను తీసాడు. రాక్షసులు మీదికి సంధించాడు. రాక్షస సంహారం కోసరము తీవ్రమైన కోపమును తెచ్చుకున్నాడు.

(ఈవిషయము మనకు బాల కాండలో రాముని గుణగణముల గురించి చెప్పేటప్పుడు చదువుకున్నాము. రాముడు శాంతస్వభావుడు. కోపం అనేది తెలియదు. కాని అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు. అవసరం తీరిపోగానే కోపాన్ని వదిలేస్తాడు. మరలా శాంత మూర్తి అవుతాడు. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. కాని మనం చీటికి మాటికీ కోపం తెచ్చుకుంటాము. అన్ని అనర్థాలను తలకు చుట్టుకుంటాము. కష్టనష్టాలను అనుభవిస్తాము. అన్ని కష్టాలు నాకే పెట్టావా భగవంతుడా అని దేవుడిని తిడతాము. అందుకే మనం మానవులం అయ్యాము.)

రాముని కోపం ఆవహించింది. రాక్షసుల మీద కోపంతో ఊగిపోయాడు రాముడు. దక్షయజ్ఞంలో విజృంభించిన రుద్రునిలా ప్రకాశించాడు రాముడు. రాక్షస సైన్యము ఆయుధములతో రాముని చుట్టుముట్టింది..

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచవింశః సర్గః (25) >>

Aranya Kanda Sarga 31 In Telugu – అరణ్యకాండ ఏకత్రింశః సర్గః

Aranya Kanda Sarga 31 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, అకంపన అనే రావణుడి గూఢచారి రాముడు జనస్థానాన్ని నాశనం చేసిన వార్తను తెలియజేయడానికి అతని వద్దకు పరుగెత్తాడు. సీతను అపహరించమని రావణుడిని సూచిస్తాడు. ఎందుకంటే సీతని విడిచిపెట్టడం వల్ల రాముడికి శోకం కలుగుతుంది మరియు తద్వారా అతను మరణిస్తాడు. కొంతసేపు ఆలోచిస్తూ, సీతను అపహరించడంలో సహాయం కోరుతూ మరీచ వద్దకు రావణుడు వెళ్తాడు. మారీచా రాముడి సామర్థ్యాలను వివరిస్తూ, విష్ణువు యొక్క అవతారాలను గుర్తుచేస్తాడు మరియు రావణుడికి ఉన్నదానితో సంతృప్తి చెందమని సలహా ఇస్తాడు.

రావణఖరవృత్తోపలంభః

త్వరమణస్తతో గత్వా జనస్థానాదకంపనః |
ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్ ||

1

జనస్థానస్థితా రాజన్ రాక్షసా బహవో హతాః |
ఖరశ్చ నిహతః సంఖ్యే కథంచిదహమాగతః ||

2

ఏవముక్తో దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః |
అకంపనమువాచేదం నిర్దహన్నివ చక్షుషా ||

3

కేన రమ్యాం జనస్థానం హతం మమ పరాసునా |
కో హి సర్వేషు లోకేషు గతిం చాధిగమిష్యతి ||

4

న హి మే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖమ్ |
ప్రాప్తుం వైశ్రవణేనాపి న యమేన న విష్ణునా ||

5

కాలస్య చాప్యహం కాలో దహేయమపి పావకమ్ |
మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే ||

6

దహేయమపి సంక్రుద్ధస్తేజసాఽఽదిత్యపావకౌ |
వాతస్య తరసా వేగం నిహంతుమహముత్సహే ||

7

తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపనః |
భయాత్ సందిగ్ధయా వాచా రావణం యాచతేఽభయమ్ ||

8

దశగ్రీవోఽభయం తస్మై ప్రదదౌ రక్షసాం వరః |
స విశ్రబ్ధోఽబ్రవీద్వాక్యమసందిగ్ధమకంపనః ||

9

పుత్రో దశరథస్యాస్తి సింహసంహననో యువా |
రామో నామ వృషస్కంధో వృత్తాయతమహాభుజః ||

10

వీరః పృథుయశాః శ్రీమానతుల్యబలవిక్రమః |
హతం తేన జనస్థానం ఖరశ్చ సహదూషణః ||

11

అకంపనవచః శ్రుత్వా రావణో రాక్షసాధిపః |
నాగేంద్ర ఇవ నిఃశ్వస్య వచనం చేదమబ్రవీత్ ||

12

స సురేంద్రేణ సంయుక్తో రామః సర్వామరైః సహ |
ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిదకంపన ||

13

రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపనః |
ఆచచక్షే బలం తస్య విక్రమం చ మహాత్మనః ||

14

రామో నామ మహాతేజాః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్ |
దివ్యాస్త్రగుణసంపన్నః పురంధరసమో యుధి ||

15

తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దుందుభిస్వనః |
కనీయాన్ లక్ష్మణో నామ భ్రాతా శశినిభాననః ||

16

స తేన సహ సంయుక్తః పావకేనానిలో యథా |
శ్రీమాన్రాజవరస్తేన జనస్థానం నిపాతితమ్ ||

17

నైవ దేవా మహత్మానో నాత్ర కార్యా విచారణా |
శరా రామేణ తూత్సృష్టా రుక్మపుంఖాః పతత్రిణః ||

18

సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్ |
యేన యేన చ గచ్ఛంతి రాక్షసా భయకర్శితాః ||

19

తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రతః స్థితమ్ |
ఇత్థం వినాశితం తేన జనస్థానం తవానఘ ||

20

అకంపనవచః శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ |
జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణమ్ ||

21

అథైవముక్తే వచనే ప్రోవాచేదమకంపనః |
శ్రుణు రాజన్యథావృత్తం రామస్య బలపౌరుషమ్ ||

22

అసాధ్యః కుపితో రామో విక్రమేణ మహాయశాః |
ఆపగాయాః సుపూర్ణాయా వేగం పరిహరేచ్ఛరైః ||

23

సతారాగ్రహనక్షత్రం నభశ్చాప్యవసాదయేత్ |
అసౌ రామస్తు మజ్జంతీం శ్రీమానభ్యుద్ధరేన్మహీమ్ ||

24

భిత్త్వా వేలాం సముద్రస్య లోకానాప్లావయేద్విభుః |
వేగం వాఽపి సముద్రస్య వాయుం వా విధమేచ్ఛరైః ||

25

సంహృత్య వా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః |
శక్తః స పురుషవ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజాః ||

26

న హి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయా యుధి |
రక్షసాం వాఽపి లోకేన స్వర్గః పాపజనైరివ ||

27

న తం వధ్యమహం మన్యే సర్వైర్దేవాసురైరపి |
అయం తస్య వధోపాయస్తం మమైకమనాః శృణు ||

28

భార్యా తస్యోత్తమా లోకే సీతా నామ సుమధ్యమా |
శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషితా ||

29

నైవ దేవీ న గంధర్వీ నాఽప్సరా నాఽపి దానవీ |
తుల్యా సీమంతినీ తస్యా మానుషీషు కుతో భవేత్ ||

30

తస్యాపహర భార్యాం త్వం ప్రమథ్య తు మహావనే |
సీతయా రహితః కామీ రామో హాస్యతి జీవితమ్ ||

31

అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిపః |
చింతయిత్వా మహాబాహురకంపనమువాచ హ ||

32

బాఢం కాల్యం గమిష్యామి హ్యేకః సారథినా సహ |
ఆనయిష్యామి చ వైదేహీమిమాం హృష్టో మహాపురీమ్ ||

33

అథైవముక్త్వా ప్రయయౌ ఖరయుక్తేన రావణః |
రథేనాదిత్యవర్ణేన దిశః సర్వాః ప్రకాశయన్ ||

34

స రథో రాక్షసేంద్రస్య నక్షత్రపథగో మహాన్ |
సంచార్యమాణః శుశుభే జలదే చంద్రమా ఇవ ||

35

స మారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమత్ |
మారీచేనార్చితో రాజా భక్ష్యభోజ్యైరమానుషైః ||

36

తం స్వయం పూజయిత్వా తు ఆసనేనోదకేన చ |
అర్థోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్ ||

37

కచ్చిత్సుకుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర |
ఆశంకే నాథ జానే త్వం యతస్తూర్ణమిహాగతః ||

38

ఏవముక్తో మహాతేజా మారీచేన స రావణః |
తతః పశ్చాదిదం వాక్యమబ్రవీద్వాక్యకోవిదః ||

39

ఆరక్షో మే హతస్తాత రామేణాక్లిష్టకర్మణా |
జనస్థానమవధ్యం తత్సర్వం యుధి నిపాతితమ్ ||

40

తస్య మే కురు సాచివ్యం తస్య భార్యాపహారణే |
రాక్షసేంద్రవచః శ్రుత్వా మారీచో వాక్యమబ్రవీత్ ||

41

ఆఖ్యాతా కేన సీతా సా మిత్రరూపేణ శత్రుణా |
త్వయా రాక్షసశార్దూల కో న నందతి నిందితః ||

42

సీతామిహానయస్వేతి కో బ్రవీతి బ్రవీహి మే |
రక్షోలోకస్య సర్వస్య కః శృంగం ఛేత్తుమిచ్ఛతి ||

43

ప్రోత్సాహయతి కశ్చిత్వాం స హి శత్రురసంశయః |
ఆశీవిషముఖాదంష్ట్రాముద్ధర్తుం చేచ్ఛతి త్వయా ||

44

కర్మణా తేన కేనాఽసి కాపథం ప్రతిపాదితః |
సుఖసుప్తస్య తే రాజన్ ప్రహృతం కేన మూర్ధని ||

45

విశుద్ధవంశాభిజనాగ్రహస్త-
-స్తేజోమదః సంస్థితదోర్విషాణః |
ఉదీక్షితుం రావణ నేహ యుక్తః
స సంయుగే రాఘవగంధహస్తీ ||

46

అసౌ రణాంతః స్థితిసంధివాలో
విదగ్ధరక్షోమృగహా నృసింహః |
సుప్తస్త్వయా బోధయితుం న యుక్తః
శరాంగపుర్ణో నిశితాసిదంష్ట్రః ||

47

చాపావహారే భుజవేగపంకే
శరోర్మిమాలే సుమహాహవౌఘే |
న రామపాతాలముఖేఽతిఘోరే
ప్రస్కందితుం రాక్షసరాజ యుక్తమ్ ||

48

ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర
లంకాం ప్రసన్నో భవ సాధు గచ్ఛ |
త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యమ్
రామః సభార్యో రమతాం వనేషు ||

49

ఏవముక్తో దశగ్రీవో మారీచేన స రావణః |
న్యవర్తత పురీం లంకాం వివేశ చ గృహోత్తమమ్ ||

50

Aranya Kanda Sarga 31 In Telugu Pdf Download

(ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. ఇది ప్రక్షిప్తము అనగా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము)

ఖరుడు, దూషణుడు తమతమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది. వెంటను అకంపనుడు అనే రాక్షసుడు లంకానగరానికి బయలు దేరాడు. రావణుని కలుసుకున్నాడు.

“ఓ రావణా! నేను జనస్థానము నుండి వస్తున్నాను. అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న ఖరుడు, దూషణుడు, వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు. నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను.” అని జరిగింది క్లుప్తంగా వివరించాడు.

ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండి పడ్డాడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు.

“ఓ అకంపనా! ఇది నిజమా! నా అధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి, ఖరదూషణాదులను చంపిన వాడు ఎవరు? వాడికి ఆయువు మూడిందా! లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు. నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బతకలేరు కదా!

ఇంక వీడెంత? వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది. నేను యముడికి యముడను. అగ్నిని కూడా కాల్చివేయగల సమర్థుడను. మృత్యుదేవతకే మృత్యువును. నాకు కోపం వస్తే సూర్యుడిని, అగ్నిని కూడా దహించివేస్తాను. వాయువును కూడా శాసించగలను. అకంపనా! ఇంతకూ వాడెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు. ఎక్కడ ఉంటాడు?” అని కోపంగా అడిగాడు రావణుడు.

ప్రళయాగ్నితో సమానమైన రావణుని కోపం చూచి అకంపనుడు భయంతో వణికిపోయాడు. “నన్ను తమరు చంపను అని అభయం ఇస్తే జరిగింది చెబుతాను” అని అన్నాడు గడగడా వణుకుతూ.

రావణుడు కొంచెం శాంతించాడు. “అలాగే అభయం ఇచ్చాను. ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు” అని అన్నాడు. అకంపనుడు ఇలా చెప్పసాగాడు.

“అయోధ్యానగరమును పరిపాలించు దశరథుని కుమారుడు రాముడు. యువకుడు. మహా పరాక్రమశాలి. ఆజానుబాహుడు. గొప్ప వీరుడు. అతడే ఒంటరిగా ఖరుని, దూషణుని, ససైన్యంగా సంహరించాడు.” అని మరలా క్లుప్తంగానే చెప్పాడు ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో.

ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. రావణునిలో ఇదివరకు ఉన్న కోపం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. “అకంపనా! రాముడు ఒంటరిగా జనస్థానమునకు వచ్చాడా లేక ఇంద్రుని, దేవతలను తోడుగా తీసుకొని వచ్చాడా?” అని అడిగాడు, రాముని వెనుక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామనే ఆలోచనతో.

రావణుని కోపం తగ్గగానే అకంపనుడిలో ధైర్యం పుంజుకుంది. మరలా రాముడి గురించి చెప్పసాగాడు.

“ఆ రాముడు మహాతేజస్సు కలవాడు. సర్వశ్రేష్ఠధనుర్ధారి. దివ్యాస్త్ర సంపన్నుడు. ఇంతెందుకు దేవేంద్రునితో సమానమైన వాడు. ఆ రాముడి వెంట లక్ష్మణుడు అని అతని తమ్ముడు ఉన్నాడు. అన్నకంటే మించిన వాడు. మహా బలశాలి. రామ లక్ష్మణుల చేరికతో వాయువు తోడైనట్టే.

అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానమును సర్వనాశనం చేసాడు. అంతేగానీ తమరు అన్నట్టు దేవేంద్రుడు గానీ, దేవతలు గానీ జనస్థానమునకు రాలేదు. రాముడు ప్రయోగించిన బాణములు కాలసర్పముల వలె జనస్థానములో ఉన్న రాక్షసులను కబళించి వేసాయి.

ఓ రాక్షసరాజా! రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కోరాముడిలాగా ప్రత్యక్షం అయి వాళ్లను నాశనం చేసాడు. ” అని అన్నాడు అకంపనుడు.

అకంపనుని మాటలు సావధానంగా విన్నాడు రావణుడు. ఎవరిని పంపినా లాభం లేదు అనుకున్నాడు. తానే జనస్థానమునకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు.

“అకంపనా! ఇంక నీవు వెళ్లవచ్చు. నేనుస్వయంగా జనస్థానమునకు వెళ్తాను.” అని అన్నాడు.

“రాక్షసరాజా! నా మనవి వినండి. రాముడు సామాన్యుడు కాడు. రాముని జయించడం మన వల్లకాదు. రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు. రాముడు భూమ్యాకాశాలను ఏకం చేయగల వీరుడు. సప్తసముద్రము లను ఏకం చేసి ఈ భూమిని ముంచివేయగల పరాక్రమశాలి.

రాముడు ఈ లోకములనన్నిటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి. (సృష్టి, స్థితి, లయకారకుడు అని అర్థం. రాముడు భగవంతుడు అని అకంపనుడి అభిప్రాయం). ఓ రావణా! నీవుగానీ, నీ రాక్షస సైన్యము కానీ రాముని జయించడం కల్ల. నీవే కాదు. దేవాసురులు ఏకమై వచ్చినా రాముని యుద్ధంలో ఎదుర్కొనలేరు.

కాని రావణా! ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది కదా! ఆ మార్గంలో వెళితే రాముని చంపవచ్చు. ఆ రామునికి సీత అనే అతిలోకసౌందర్యవతి భార్య ఉంది. మంచి యౌవనవతి. దేవతా స్త్రీలుగానీ, అప్సరసలు కానీ అందంలో ఆమెకు సాటిరారు. సీత అంటే రాముడికి పంచప్రాణాలు. సీత లేకుండా రాముడు బతకలేడు. నీవు కనక సీతను అపహరించి తీసుకొని వస్తే, సీత మీద బెంగతో రాముడు ప్రాణాలు విడుస్తాడు. రాముని చంపడానికి ఇది ఒకటే మార్గము.” అని ఒక ఉపాయం చెప్పాడు అకంపనుడు.

రావణునికి ఈ మాటలు కర్ణపేయంగా వినపడ్డాయి. ఒక దెబ్బతో రెండు పిట్టలు. సీతను అపహరిస్తే అటు రాముడు చస్తాడు, ఇటు సీతా తనకు దక్కుతుంది. ఇలా వక్రంగా ఆలోచించాడు రావణుడు, అకంపనుని చూచి ఇలా అన్నాడు.
“అకంపనా! మంచి ఆలోచన చెప్పావు. నేను ఒక్కడినే రేపే జనస్థానమునకు వెళ్లి, సీతను నా రథము మీద కూర్చుండపెట్టుకొని లంకకు తీసుకొని వస్తాను.” అని అన్నాడు.

వెంటనే మంచి గాడిదలు కట్టిన రథమును సిద్ధం చేయమన్నాడు. గాడిదలు కట్టిన రథంలో రావణుడు ఆకాశమార్గంలో జనస్థానమునకు వెళ్లాడు. జనస్థానము దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు, రావణుడు మారీచుని వద్దకు వెళ్లాడు. రావణుని చూచి మారీచుడు అతనికి సకల ఉపచారములు చేసాడు. భక్ష్యములను, భోజన పదార్థములను సమర్పించాడు. రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనము మీద కూర్చున్నాడు. అప్పుడు మారీచుడు రావణునితో ఇలా అన్నాడు.

“రాక్షసరాజా! నీకు జయము కలుగు గాక! లంకలో అందరూ క్షేమమే కదా! ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసైగతో పూర్తి చేయగల సమర్థుడవు, అటువంటిది నీవే స్వయంగా ఇక్కడకు వస్తే నాకు ఏదో సందేహముగా ఉంది. అందుకని అడిగాను. తమరు ఏదో తొందరపని మీద ఇక్కడకు వచ్చి ఉంటారు అని అనుకుంటాను.” అని అన్నాడు మారీచుడు, “ఏం పని మీద వచ్చారు” అని సూటిగా రావణుని అడక్కుండా.

మారీచుని మాటలు విన్న రావణునికి మారీచుని మనసులోని సందేహం అర్థం అయింది. అందుకని సూటిగానే చెప్పాడు.

“మారీచా! ఎవరో రాముడు అట. జనస్థానములో ఉన్న ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యమును ఒంటి చేత్తో తుదముట్టించాడట. ఎవరికీ తేరిపార చూడటానికి శక్యం కాని జనస్థానమును సర్వనాశనం చేసాడట. ఆ రాముని ఉపాయంతో చంపవలెనని అనుకుంటున్నాను. ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము. ఆ సీతను అపహరిస్తే, రాముడు ప్రాణాలు విడుస్తాడు. అందుకని రాముని భార్య సీతను అపహరించవలెనని అనుకుం టున్నాను. దానికీ నీ సాయం కావాలి.” అని సూటిగా అడిగాడు రావణుడు.

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు పడ్డాడు మారీచుడు. “రావణా! నీకు ఇటువంటి ఆలోచన చెప్పిన వాడు ఎవరు? రాముని భార్య సీతను అపహరించమని చెప్పిన ఆ దుర్మారుడు, దుష్టుడు ఎవరు? వాడు నీకు ఆప్తుడు కాదు. నీకు పరమశత్రువు. నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచన కలిగించాడు. “సీతను అపహరించాలి” అనే ఆలోచనే నీ సర్వనాశనానికి దారితీస్తుంది. నీకు ఈ ఆలోచన చెప్పివాడు ఎవరో కానీ, నిన్ను తప్పుదోవ పట్టించాడు. వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరలు పీకమని చెబుతాడా?

రావణా! నేను చెబుతున్నాను విను. రాముడు ఒక మదగజము. దాని కాళ్ల కిందపడి నలిగిపోతావు. రాముడు ఒక సింహము. ఆ సింహము జూలుపట్టి లాగకు. లేడిపిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు. రాముడు ఒక సుడిగుండము. అనవసరంగా ఆ సుడిగుండములో దూకకు. మరలా ప్రాణాలతో బయటకు రాలేవు. ఆ ప్రవాహవేగానికి కొట్టుకుపోతావు.

ఓ లంకేశ్వరా! నా మాటవిను. తిరిగి లంకకు వెళ్లు. హాయిగా లంకను పాలించు. నీ భార్యలతో సుఖించు. రాముడిని తన భార్యతో ఆ అడవిలోనే ఉండనీ. రాముని జోలికి పోకు.” అని హెచ్చరించాడు మారీచుడు. రావణుడు మారీచుని మాటలు విని తిరిగి లంకకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్వాత్రింశః సర్గః (32) >>

Ayodhya Kanda Sarga 97 In Telugu – అయోధ్యాకాండ సప్తనవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 97

అయోధ్యాకాండం సప్తనవతితమ (97వ) సర్గలో, భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి పాలన చేయడానికి సిద్ధమవుతాడు. ఈ సర్గలో, భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, ఇతర రుషులు, సైనికులు రాముని వద్దకు చేరుకుంటారు. భరతుడు రాముని పాదాలు స్పృశించి, తన తండ్రి మరణాన్ని, తన బాధను వ్యక్తపరుస్తాడు. భరతుడు రాముని తిరిగి రావాలని ప్రాధేయపడతాడు, కానీ రాముడు తన వాగ్దానం ప్రకారం అరణ్యవాసం కొనసాగిస్తానని చెప్పి, తన ధర్మాన్ని పాటిస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని, అయోధ్యకు తిరిగి వెళ్లి, అవి సింహాసనంపై ఉంచి, రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాడు.

భరతగుణప్రశంసా

సుసంరబ్ధం తు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్ఛితమ్ |
రామస్తు పరిసాంత్వ్యాథ వచనం చేదమబ్రవీత్ || ౧ ||

కిమత్ర ధనుషా కార్యమసినా వా సచర్మణా |
మహేష్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే || ౨ ||

పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతమ్ |
కిం కరిష్యామి రాజ్యేన సాపవాదేన లక్ష్మణ || ౩ ||

యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ |
నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్విషకృతానివ || ౪ ||

ధర్మమర్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ |
ఇచ్ఛామి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమి తే || ౫ ||

భ్రాతౄణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణ |
రాజ్యమప్యహమిచ్ఛామి సత్యేనాయుధమాలభే || ౬ ||

నేయం మమ మహీ సౌమ్య దుర్లభా సాగరాంబరా |
న హీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ || ౭ ||

యద్వినా భరతం త్వాం చ శత్రుఘ్నం చాపి మానద |
భవేన్మమ సుఖం కించిద్భస్మ తత్కురుతాం శిఖీ || ౮ ||

మన్యేఽహమాగతోఽయోధ్యాం భరతో భ్రాతృవత్సలః |
మమ ప్రాణాత్ప్రియతరః కులధర్మమనుస్మరన్ || ౯ ||

శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణమ్ |
జానక్యాసహితం వీర త్వయా చ పురుషర్షభ || ౧౦ ||

స్నేహేనాఽక్రాంతహృదయః శోకేనాకులితేంద్రియః |
ద్రష్టుమభ్యాగతో హ్యేష భరతో నాన్యథాఽఽగతః || ౧౧ ||

అంబాం చ కైకయీం రుష్య పరుషం చాప్రియం వదన్ |
ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగతః || ౧౨ ||

ప్రాప్తకాలం యదేషోఽస్మాన్ భరతో ద్రష్టుమిచ్ఛతి |
అస్మాసు మనసాఽప్యేషః నాప్రియం కించిదాచరేత్ || ౧౩ ||

విప్రియం కృతపూర్వం తే భరతేన కదా ను కిమ్ |
ఈదృశం వా భయం తేఽద్య భరతం యోఽత్ర శంకసే || ౧౪ ||

న హి తే నిష్ఠురం వాచ్యో భరతో నాప్రియం వచః |
అహం హ్యప్రియముక్తః స్యాం భరతస్యాప్రియే కృతే || ౧౫ ||

కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది |
భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః || ౧౬ ||

యది రాజ్యస్య హేతోస్త్వమిమాం వాచం ప్రభాషసే |
వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతామ్ || ౧౭ ||

ఉచ్యమానోఽపి భరతో మయా లక్ష్మణ తత్త్వతః |
రాజ్యమస్మై ప్రయచ్ఛేతి బాఢమిత్యేవ వక్ష్యతి || ౧౮ ||

తథోక్తో ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః |
లక్ష్మణః ప్రవివేశేవ స్వాని గాత్రాణి లజ్జయా || ౧౯ ||

తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా వ్రీడితః ప్రత్యువాచ హ |
త్వాం మన్యే ద్రష్టుమాయాతః పితా దశరథః స్వయమ్ || ౨౦ ||

వ్రీడితం లక్ష్మణం దృష్ట్వా రాఘవః ప్రత్యువాచ హ |
ఏష మన్యే మహాబాహురిహాస్మాన్ ద్రష్టుమాగతః || ౨౧ ||

అథవా నౌ ధ్రువం మన్యే మన్యమానః సుఖోచితౌ |
వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి || ౨౨ ||

ఇమాం వాఽప్యేష వైదేహీమత్యంతసుఖసేవినీమ్ |
పితా మే రాఘవః శ్రీమాన్ వనాదాదాయ యాస్యతి || ౨౩ ||

ఏతౌ తౌ సంప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ |
వాయువేగసమౌ వీర జవనౌ తురగోత్తమౌ || ౨౪ ||

సైష సుమహాకాయః కంపతే వాహినీముఖే |
నాగః శత్రుంజయో నామ వృద్ధస్తాతస్య ధీమతః || ౨౫ ||

న తు పశ్యామి తచ్ఛత్త్రం పాండరం లోకసత్కృతమ్ |
పితుర్దివ్యం మహాబాహో సంశయో భవతీహ మే || ౨౬ ||

వృక్షాగ్రాదవరోహ త్వం కురు లక్ష్మణ మద్వచః |
ఇతీవ రామో ధర్మాత్మా సౌమిత్రం తమువాచ హ || ౨౭ ||

అవతీర్య తు సాలాగ్రాత్తస్మాత్స సమితింజయః |
లక్ష్మణః ప్రాంజలిర్భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః || ౨౮ ||

భరతేనాపి సందిష్టా సమ్మర్దో న భవేదితి |
సమంతాత్తస్య శైలస్య సేనా వాసమకల్పయత్ || ౨౯ ||

అధ్యర్ధమిక్ష్వాకుచమూర్యోజనం పర్వతస్య సా |
పార్శ్వే న్యవిశదావృత్య గజవాజిరథాకులా || ౩౦ ||

సా చిత్రకూటే భరతేన సేనా
ధర్మం పురస్కృత్య విధూయ దర్పమ్ |
ప్రసాదనార్థం రఘునందనస్య
విరాజతే నీతిమతా ప్రణీతా || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తనవతితమః సర్గః || ౯౭ ||

Ayodhya Kanda Sarga 97 Meaning In Telugu

భరతుని మీద కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. “లక్ష్మణా! శాంతించు. తొందర పడకు. వచ్చేవాడు భరతుడు అని నువ్వే చెప్పావు. భరతుడు మన సోదరుడు. పైగా ధర్మాత్ముడు. ఇప్పుడు మనకు కత్తులతోనూ విల్లుతోనూ అస్త్రశస్త్రములతోనూ పని ఏమున్నది. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించుటకు అరణ్యములకు వచ్చాను. ఇప్పుడు భరతుని చంపి ఆ రాజ్యమును ఏమి చేసుకుంటాను. ఎందుకంటే నేను 14 సంవత్సరముల దాకా రాజ్యపాలన చేయలేను కదా. అదీకాకుండా సోదరుని చంపితే వచ్చేరాజ్యము విషము వంటిది. దానిని నేను ముట్టను.

మరొక విషయం. నేను ఈ రాజ్యమును కోరుతున్నానుఅంటే అది మీ కొరకే గానీ నాకు కాదు. నాకు ఏమీ అక్కరలేదు. ఈ పదునాలుగు సంవత్సరముల తరువాత కూడా నేను మీ కొరకు మాత్రమే రాజ్యపాలన చేస్తాను. నాకు రాజ్య కాంక్ష ఏ మాత్రమూ లేదు. ఇది నా ప్రతిజ్ఞ. మరొక మాట. నేను కావాలి అనుకుంటే శత్రువుల నందరినీ సమూలంగా నాశనం చేసి రాజ్యము కైవసము చేసు కోగలను. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అధర్మపరంగా వచ్చే ఇంద్రపదవి కూడా నాకు ఇష్టం లేదు. అయినా మీకు లేని సుఖము నాకు ఎందుకు. భరతుడు, శత్రుఘ్నుడు, లేని రాజ్యము నాకు ఎందుకు. కాబట్టి శాంతించు. అసలు విషయం తెలుసుకో. నా ఊహ ప్రకారము భరతుడు తన మాతామహుల ఇంటి నుండి తిరిగి వచ్చి, తన తల్లి మూలంగా మనము అరణ్యములకు వెళ్లినట్టు తెలుసుకొని, తిరిగి మనలను అయోధ్యకు తీసుకొని వెళ్లుటకు వచ్చిఉంటాడు. ఎందుకంటే మన కులధర్మము ప్రకారము జ్యేష్టుడే రాజు కావలయును కదా. అందువలన భరతుడు పట్టాభిషేకమునకు అంగీకరించడు. కేవలము మనలను చూచుటకే వస్తూఉంటాడు.

అదీకాకుండా తన తల్లి మూలంగా ఇది అంతా జరిగింది అని తెలుసుకొని నన్ను తిరిగిఅయోధ్యకు తీసుకొనివెళ్లి పట్టాభిషేకము జరిపించవలెనని నా రాజ్యము తిరిగి నాకు ఇవ్వవలెననే ఉద్దేశ్యముతోనే వస్తూ ఉంటాడు. కాబట్టి భరతుడు మనకు కలలో కూడా అపకారము తలపెట్టడు.

అదీకాకుండా లక్ష్మణా! భరతుని సంగతి నీకు తెలియదా! ఇంతకు పూర్వము భరతుడు నీకు ఎప్పుడైనా ఎలాంటి అపకారమైనా చేసాడా! ఇలాంటి భయమును కలిగించాడా! లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు భరతుడు మనకు అపకారము చేస్తాడు అని భయపడు తున్నావు. కాబట్టి భరతుని ఒక్క మాట కూడా అనకు. ఎందుకంటే భరతుని తిడితే నన్ను తిట్టినట్టే.

మరొక మాట ఈ లోకంలో ఎవరైనా ఎంతటి ఆపదలో ఉన్నా కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరులను చంపుకుంటారా! పోనీ నీవు రాజ్యము కావలెనని కోరుకుంటూ ఉంటే చెప్పు. భరతునితో చెప్పి అయోధ్యను నా బదులు నీకు ఇప్పిస్తాను. హాయిగా రాజ్యము ఏలుకో. ఎందుకంటే, ‘భరతా! ఈరాజ్యము లక్ష్మణునికి ఇమ్ము’ అని అనగానే భరతుడు సంతోషంగా నీకు రాజ్యము ఇస్తాడు. ఆ నమ్మకము నాకు ఉంది. చెప్పు నీకు రాజ్యము కావాలా!” అని అడిగాడు రాముడు. లక్ష్మణుడు తన అవివేకపు మాటలకు సిగ్గుతో తల దించుకున్నాడు.

“లక్ష్మణా! అసలు విషయం ఏమిటంటే, భరతుడు రాగానే, మన తండ్రి దశరథుడు, భరతుని వెంటబెట్టుకొని మనలను చూడటానికి వస్తున్నాడు అని అనుకుంటున్నాను. అంతే కాదు, మనము పడుతున్న కష్టములను చూచి, మనలను తిరిగి అయోధ్యకు ఆహ్వానించుటకు వస్తున్నాడేమో అని కూడా అనుమానంగా ఉంది. ఒక వేళ మనము అయోధ్యకు రావడానికి ఇష్టపడక పోతే, కనీసము సీతనైనా తన వెంట తీసుకొని వెళతాడు దశరథుడు.

లక్ష్మణా! అటుచూడు అది మన తండ్రిగారి భద్రగజము కదా! మంద్రగమనంతో ఇటే వస్తూ ఉంది. కాని ఆగజము మీద మన తండ్రి గారి చిహ్నమైన తెల్లటి గొడుగు ఉండాలే. అది కనపడటం లేదు. ఏమయి ఉంటుంది. తండ్రిగారు వస్తుంటే ఆయనవెంట రాజచిహ్నమైన శ్వేతఛత్రము తప్పనిసరిగా ఉంటుంది కదా! అంటే తండ్రిగారు రావడం లేదా! భరతుడు ఒక్కడే వస్తున్నాడా! సరేలే. నువ్వు ఇక్కడే ఉండు.

నేనుచెప్పువరకూ కదలకు.”అని ఆదేశించాడు రాముడు. ఇక్కడ ఇలా ఉంటే, అక్కడ భరతుడు తన సేనలకు ఆజ్ఞఇచ్చాడు. “ఇక్కడ రాముని ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమము వద్ద శాంతికి భంగము కలగకూడదు. కాబట్టి సైన్యము అంతా ఈ పర్వతము చుట్టు విడిది చేయండి.” అని ఆజ్ఞాపించాడు. భరతుని ఆజ్ఞ ప్రకారము భరతుని సైన్యము చిత్రకూట పర్వతము చుట్టూ ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ అష్టనవతితమః సర్గః (98) >>

Ayodhya Kanda Sarga 96 In Telugu – అయోధ్యాకాండ షణ్ణవతితమః సర్గః

Ayodhya Kanda Sarga 96

అయోధ్యాకాండం షణ్ణవతితమ (96వ) సర్గలో, భరతుడు రాముని వనవాసం నుండి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా సాగుతుంది. భరతుడు తన సైన్యంతో కలిసి చిత్రకూటానికి చేరుకుంటాడు. అక్కడ, అతను రాముడు, సీత, లక్ష్మణులను చూస్తాడు. రాముడు భరతుని ఆత్మీయతను, ప్రేమను గమనించి ఆనందిస్తాడు. భరతుడు రాముని తనతో తిరిగి రావలసిందిగా వేడుకుంటాడు. కానీ, రాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించడం ధర్మమని, వనవాసం పూర్తి చేయడం తన కర్తవ్యమని తేల్చి చెబుతాడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకుని, అవి రాముని ప్రతీకగా సింహాసనంపై ఉంచి, రాముడు తిరిగి వచ్చేవరకు పాలన చేస్తానని చెప్పి అయోధ్యకు తిరిగి వెళ్తాడు.

లక్ష్మణక్రోధః

తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరినిమ్నగామ్ |
నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్ || ౧ ||

ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా |
ఏవమాస్తే స ధర్మాత్మా సీతయా సహ రాఘవః || ౨ ||

తథా తత్రాసతస్తస్య భరతస్యోపయాయినః |
సైన్యరేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాస్తాం నభస్పృశౌ || ౩ ||

ఏతస్మిన్నంతరే త్రస్తాః శబ్దేన మహతా తతః |
అర్దితా యూథపా మత్తాః సయూథా దుద్రువుర్దిశః || ౪ ||

స తం సైన్యసముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవః |
తాంశ్చ విప్రద్రుతాన్ సర్వాన్ యూథపానన్వవైక్షత || ౫ ||

తాంశ్చ విద్రవతో దృష్ట్వా తం చ శ్రుత్వా చ నిస్వనమ్ |
ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్తతేజసమ్ || ౬ ||

హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయా |
భీమస్తనితగంభీరస్తుములః శ్రూయతే స్వనః || ౭ ||

గజయూథాని వాఽరణ్యే మహిషా వా మహావనే |
విత్రాసితా మృగాః సింహైః సహసా ప్రద్రుతా దిశః || ౮ ||

రాజా వా రాజమాత్రో వా మృగయామటతే వనే |
అన్యద్వా శ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి || ౯ ||

సుదుశ్చరో గిరిశ్చాయం పక్షిణామపి లక్ష్మణ |
సర్వమేతద్యథాతత్త్వమచిరాజ్ఞాతుమర్హసి || ౧౦ ||

స లక్ష్మణః సంత్వరితః సాలమారుహ్య పుష్పితమ్ |
ప్రేక్షమాణో దిశస్సర్వాః పూర్వాం దిశముదైక్షత || ౧౧ ||

ఉదఙ్ముఖః ప్రేక్షమాణో దదర్శ మహతీం చమూమ్ |
రథాశ్వగజసంబాధాం యత్తైర్యుక్తాం పదాతిభిః || ౧౨ ||

తామశ్వగజసంపూర్ణాం రథధ్వజవిభూషితామ్ |
శశంస సేనాం రామాయ వచనం చేదమబ్రీత్ || ౧౩ ||

అగ్నిం సంశమయత్వార్యః సీతా చ భజతాం గుహామ్ |
సజ్యం కురుష్వ చాపం చ శరాంశ్చ కవచం తథా || ౧౪ ||

తం రామః పురుషవ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ హ |
అంగావేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చమూమ్ || ౧౫ ||

ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ |
దిధక్షన్నివ తాం సేనాం రుషితః పావకో యథా || ౧౬ ||

సంపన్నం రాజ్యమిచ్ఛంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనమ్ |
ఆవాం హంతుం సమభ్యేతి కైకేయ్యా భరతః సుతః || ౧౭ ||

ఏష వై సుమహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే |
విరాజత్యుద్గతస్కంధః కోవిదారధ్వజో రథే || ౧౮ ||

భజంత్యేతే యథాకామమశ్వానారుహ్య శీఘ్రగాన్ |
ఏతే భ్రాజంతి సంహృష్టా గజానారుహ్య సాదినః || ౧౯ ||

గృహీతధనుషౌ చావాం గిరిం వీరశ్రయావహై |
అథవేహైవ తిష్ఠావః సన్నద్ధావుద్యతాయుధౌ || ౨౦ ||

అపి నౌ వశమాగచ్ఛేత్ కోవిదారధ్వజో రణే |
అపి ద్రక్ష్యామి భరతం యత్కృతే వ్యసనం మహత్ || ౨౧ ||

త్వయా రాఘవ సంప్రాప్తం సీతయా చ మయా తథా |
యన్నిమిత్తం భవాన్ రాజ్యాచ్చ్యుతో రాఘవ శాశ్వతాత్ || ౨౨ ||

సంప్రాప్తోఽయమరిర్వీర భరతో వధ్యైవ మే |
భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ || ౨౩ ||

పూర్వాపకారిణాం త్యాగే న హ్యధర్మో విధీయతే |
పూర్వాపకారీ భరతస్త్యక్తధర్మశ్చ రాఘవ || ౨౪ ||

ఏతస్మిన్నిహతే కృత్స్నామనుశాధి వసుంధరామ్ |
అద్య పుత్రం హతం సంఖ్యే కైకేయీ రాజ్యకాముకా || ౨౫ ||

మయా పశ్యేత్సుదుఃఖార్తా హస్తిభగ్నమివ ద్రుమమ్ |
కైకేయీం చ వధిష్యామి సానుబంధాం సబాంధవామ్ || ౨౬ ||

కలుషేణాద్య మహతా మేదినీ పరిముచ్యతామ్ |
అద్యేమం సంయతం క్రోధమసత్కారం చ మానద || ౨౭ ||

మోక్ష్యామి శత్రుసైన్యేషు కక్షేష్వివ హుతాశనమ్ |
అద్యైతచ్చిత్రకూటస్య కాననం నిశితైః శరైః || ౨౮ ||

భిందన్ శత్రుశరీరాణి కరిష్యే శోణితోక్షితమ్ |
శరైర్నిర్భిన్నహృదయాన్ కుంజరాంస్తురగాంస్తథా || ౨౯ ||

శ్వాపదాః పరికర్షంతు నరాంశ్చ నిహతాన్మయా |
శరాణాం ధనుషశ్చాహమనృణోఽస్మి మహామృధే |
ససైన్యం భరతం హత్వా భవిష్యామి న సంశయః || ౩౦ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమః సర్గః || ౯౬ ||

Ayodhya Kanda Sarga 96 Meaning In Telugu

ఆ విధంగా మందాకినీ నదీతీరములో ఆనందముగా విహరిస్తున్న సీతా రాములకు, భరతుని సైన్యము వచ్చునప్పుడు రేగిన ధూళి కనపడింది. సేనలు వచ్చునపుడు పుట్టే ధ్వనులు, ఏనుగుల ఘీంకారములు, అశ్వముల పదఘట్టనములు, సైనికుల కోలాహలము రామునికి లీలామాత్రంగా వినపడ్డాయి. ఆ సైన్యముల రాకతో భయపడి పారిపోతున్న మృగములను కూడా చూచాడు రాముడు.

రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచాడు. “లక్ష్మణా! . జాగ్రత్తగా విను. ఏదో మహా సైన్యము వచ్చుచున్న సవ్వడి వినిపించడంలేదూ! ఆ ఏనుగుల ఘీంకారములు, సైనికుల పదఘట్టనములు, గుర్రముల సకిలింపులు, సైన్యములకు బెదిరి పారిపోవు అడవిమృగములు–ఇవన్నీ చూస్తుంటే ఏదో మహాసైన్యముఇక్కడకు వస్తున్నట్టు కనపడుతూఉంది. ఇక్కడకు సైన్యము రావడం ఆశ్చర్యం గా ఉంది. ఎవరైనా రాజ కుమారుడు ఈ అరణ్యమునకు వేట నిమిత్తము వచ్చాడా! లేక ఏదైనా భయంకర మృగముల దండు ఈ అరణ్యములోని ప్రవేశించిందా! నీవు పోయి దాని విషయం కనుక్కొనిరా.”అని అన్నాడు రాముడు.

వెంటనే లక్ష్మణుడు పోయి ఒక పొడుగాటి సాలవృక్షమును ఎక్కాడు. నలుదిక్కులా చూచాడు. తూర్పు దిక్కునుంచి వస్తున్న ఒక రథ, గజ, తురగ, పదాతి దళములతో కూడిన మహా సైన్యము కనపడింది. లక్ష్మణుడు వెంటనే చెట్టు దిగి వచ్చి ఆ సైన్యము రాక గురించి రామునికి చెప్పాడు. వెంటనే రాముడు తగుజాగ్రత్తలు తీసుకున్నాడు. బయట మండుతున్న అగ్నిని ఆర్పివేసారు. సీతను ఒక గుహలో దాచిపెట్టారు. రామలక్ష్మణులు ఇద్దరూ తమతమ వింటినారిని సంధించారు. అమ్ములపొదులను సరిచేసుకున్నారు. కవచములను ధరించారు.

మరలా రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆసేన ఎవరిదో ఆనవాలు పట్టగలవా!” అని అడిగాడు. మరలా లక్ష్మణుడు చెట్టు ఎక్కి పరిశీలనగా పతాకములను చూచి అవి అయోధ్యానగరపతాకములు అని గుర్తించాడు. చెట్టు దిగివచ్చి “అన్నయ్యా! అది భరతునిసేన. భరతుడుసేనా సమేతంగా ఇక్కడకు వస్తున్నాడు. భరతుడు తన మార్గమును నిష్కంటకము చేయదలచుకొని మనలనిద్దరినీ చంపడానికి వస్తున్నాడని నా ఊహ. ఆ రథము మీద అయోధ్య రాజ చిహ్నమగు కోవిదార వృక్షము గల పతాకము ఎగురుతూ ఉంది. రామా! మనము ఇద్దరమూ ఇక్కడే ఉందామా! లేక పర్వతశిఖరములు ఎక్కి అక్కడ పొంచి ఉందామా! ఈ భరతుడు మనలను ఇక్కడ కూడా సుఖంగా ఉండనీయక తన సైన్యముతో మనమీదకు దాడి వస్తున్నాడు. ఏం చేద్దాము? రామా! ఎవరి కొరకు కైక నిన్ను అడవులకు పంపిందో, ఆ భరతుడు నీ మీదికి వస్తున్నాడు.

కాబట్టి భరతుడు మనకు శత్రువు. శత్రుడైన భరతుడు చంపతగ్గవాడు. భరతుడు నీ రాజ్యము అపహరించి నీకు అపకారమే చేసాడు. కాబట్టి అతనిని చంపుటలో దోషము ఏమీ లేదు. నేను భరతుని సంహరిస్తాను. నీ రాజ్యము నీకు ఇప్పిస్తాను. అడవులలో ఉన్న మనలను వదలకుండా, భరతుడు మన మీదికి వచ్చినపుడు అతనిని సంహరించడంలో తప్పులేదు కదా! దీనితో కైకకు తగినశాస్తి జరుగుతుంది. నాచే చంపబడిన భరతుని చూచి కైక కుళ్లి కుళ్లి ఏడవాలి. అలా ఏడుస్తున్న కైకను కూడా నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాను. దానితో పాపశేషము తొలగిపోతుంది. పాపాత్ముల నుండి భూదేవికి విముక్తి కలుగుతుంది. నాడు నిన్ను అడవులకు పంపునపుడు నాకు వచ్చిన కోపము ఈ రోజుతో చల్లారుతుంది. మన శత్రువుల రక్తంతో ఈ చిత్రకూట పర్వతమును తడిపివేస్తాను. భరతుని చతురంగ బలముల శవాలతో ఈ అడవిలో ఉన్న క్రూరమృగములు విందు చేసుకుంటాయి. నేను ఈ ధనురాణములు ధరించినందుకు, భరతుని సేనలను చంపి వాటి ఋణం తీర్చుకుంటాను. ఇందుకుసందేహము లేదు.”అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొంభయ్యి ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అయోధ్యాకాండ సప్తనవతితమః సర్గః (97) >>

Aranya Kanda Sarga 23 In Telugu – అరణ్యకాండ త్రయోవింశః సర్గః

Aranya Kanda Sarga 23 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ – త్రయోవింశః సర్గలో, రాముడు సీతను దుర్భాషలాడిన రాక్షసిని దండిస్తాడు. సీతకు సాంత్వన చెప్పి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత రాముడు సీతను తోటలో తిరగడానికి తీసుకెళతాడు. సీత రాముడికి ధైర్యం చెబుతూ తమ ప్రయాణం సాఫల్యం చెందాలని కోరుకుంటుంది. రాముడు సీతకు విశ్వాసాన్ని నూరిపోస్తాడు.

|| ఉత్పాతదర్శనమ్ ||

తస్మిన్ యాతే జనస్థానాదశివం శోణితోదకమ్ |
అభ్యవర్షన్మహామేఘస్తుములో గర్దభారుణః ||

1

నిపేతుస్తురగాస్తస్య రథయుక్తా మహాజవాః |
సమే పుష్పచితే దేశే రాజమార్గే యదృచ్ఛయా ||

2

శ్యామం రుధిరపర్యంతం బభూవ పరివేషణమ్ |
అలాతచక్రప్రతిమం పరిగృహ్య దివాకరమ్ ||

3

తతో ధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితమ్ |
సమాక్రమ్య మహాకాయస్తస్థౌ గృధ్రః సుదారుణః ||

4

జనస్థానసమీపే తు సమాగమ్య ఖరస్వనాః |
విస్వరాన్వివిధాంశ్చక్రుర్మాంసాదా మృగపక్షిణః ||

5

వ్యాజహ్రుశ్చ ప్రదీప్తాయాం దిశి వై భైరవస్వనమ్ |
అశివం యాతుధానానాం శివా ఘోరా మహాస్వనాః ||

6

ప్రభిన్నగిరిసంకాశాస్తోయశోణితధారిణః |
ఆకాశం తదనాకాశం చక్రుర్భీమా బలాహకాః ||

7

బభూవ తిమిరం ఘోరముద్ధతం రోమహర్షణమ్ |
దిశో వా విదిశో వాఽపి న చ వ్యక్తం చకాశిరే ||

8

క్షతజార్ద్రసవర్ణాభా సంధ్యా కాలం వినా బభౌ |
ఖరస్యాభిముఖా నేదుస్తదా ఘోరమృగాః ఖగాః ||

9

కంకగోమాయుగృధ్రాశ్చ చుక్రుశుర్భయశంసినః |
నిత్యాశుభకరా యుద్ధే శివా ఘోరనిదర్శనాః ||

10

నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననైః |
కబంధః పరిఘాభాసో దృశ్యతే భాస్కరాంతికే ||

11

జగ్రాహ సూర్యం స్వర్భానురపర్వణి మహాగ్రహః |
ప్రవాతి మారుతః శీఘ్రం నిష్ప్రభోఽభూద్దివాకరః ||

12

ఉత్పేతుశ్చ వినా రాత్రిం తారాః ఖద్యోతసప్రభాః |
సంలీనమీనవిహగా నలిన్యః శుష్కపంకజాః ||

13

తస్మిన్ క్షణే బభూవుశ్చ వినా పుష్పఫలైర్ద్రుమాః |
ఉద్ధూతశ్చ వినా వాతం రేణుర్జలధరారుణః ||

14

వీచీకూచీతి వాశ్యంత్యో బభూవుస్తత్ర శారికాః |
ఉల్కాశ్చాపి సనిర్ఘాతా నిపేతుర్ఘోరదర్శనాః ||

15

ప్రచచాల మహీ సర్వా సశైలవనకాననా |
ఖరస్య చ రథస్థస్య నర్దమానస్య ధీమతః ||

16

ప్రాకంపత భుజః సవ్యః స్వరశ్చాస్యావసజ్జత |
సాస్రా సంపద్యతే దృష్టిః పశ్యమానస్య సర్వతః ||

17

లలాటే చ రుజా జాతా న చ మోహాన్న్యవర్తత |
తాన్ సమీక్ష్య మహోత్పాతానుత్థితాన్రోమహర్షణాన్ ||

18

అబ్రవీద్రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్ స ఖరస్తదా |
మహోత్పాతానిమాన్ సర్వానుత్థితాన్ ఘోరదర్శనాన్ ||

19

న చింతయామ్యహం వీర్యాద్బలవాన్ దుర్బలానివ |
తారా అపి శరైస్తీక్ష్ణైః పాతయామి నభఃస్థలాత్ ||

20

మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహమ్ |
రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చాస్య లక్ష్మణమ్ ||

21

అహత్వా సాయకైస్తీక్ష్ణైర్నోపావర్తితుముత్సహే |
సకామా భగినీ మేఽస్తు పీత్వా తు రుధిరం తయోః ||

22

యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య విపర్యయః |
న క్వచిత్ప్రాప్తపూర్వో మే సంయుగేషు పరాజయః ||

23

యుష్మాకమేతత్ప్రత్యక్షం నానృతం కథయామ్యహమ్ |
దేవరాజమపి క్రుద్ధో మత్తైరావతయాయినమ్ ||

24

వజ్రహస్తం రణే హన్యాం కిం పునస్తౌ కుమానుషౌ |
సా తస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచమూః ||

25

ప్రహర్షమతులం లేభే మృత్యుపాశావపాశితా |
సమీయుశ్చ మహాత్మానో యుద్ధదర్శనకాంక్షిణః ||

26

ఋషయో దేవగంధర్వాః సిద్ధాశ్చ సహ చారణైః |
సమేత్య చోచుః సహితాస్తేఽన్యోన్యం పుణ్యకర్మణః ||

27

స్వస్తి గోబ్రాహ్మణేభ్యోఽస్తు లోకానాం యేఽభిసంగతాః |
జయతాం రాఘవః సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్ ||

28

చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్ |
ఏతచ్చాన్యచ్చ బహుశో బ్రువాణాః పరమర్షయః ||

29

జాతకౌతూహలాస్తత్ర విమానస్థాశ్చ దేవతాః |
దదృశుర్వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషామ్ ||

30

రథేన తు ఖరో వేగాదుగ్రసైన్యో వినిఃసృతః |
తం దృష్ట్వా రాక్షసం భూయో రాక్షసాశ్చ వినిఃసృతాః ||

31

శ్యేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః |
దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః ||

32

మేఘమాలీ మహామాలీ సర్పాస్యో రుధిరాశనః |
ద్వాదశైతే మహావీర్యాః ప్రతస్థురభితః ఖరమ్ ||

33

మహాకపాలః స్థూలాక్షః ప్రమాథీ త్రిశిరాస్తథా |
చత్వార ఏతే సేనాన్యో దూషణం పృష్ఠతో యయుః ||

34

సా భీమవేగా సమరాభికామా
మహాబలా రాక్షసవీరసేనా |
తౌ రాజపుత్రౌ సహసాఽభ్యుపేతా
మాలా గ్రహాణామివ చంద్రసూర్యౌ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశః సర్గః ||

Aranya Kanda Sarga 23 Meaning In Telugu PDF

రాముని మీదికి ఉత్సాహంగా బయలుదేరిన ఖరునికి ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. వారి మీద రక్తవర్షము కురిసింది. ఖరుని రథమునకు కట్టిన గుర్రములు సమతలప్రదేశము మీద కూడా తడబడుతూ పరుగెడుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఖరుని రథముమీద ఎగురుతున్న ధ్వజము మీద నిలబడింది. అనేకములైన క్రూర మృగములు జనస్థానము వద్ద గుమిగూడి వికృతంగా అరుస్తున్నాయి. ఒక పక్కనుంచి నక్కలు తలలు పైకెత్తి ఏదో అమంగళము జరగబోతున్నట్టు కూస్తున్నాయి. పక్షులు, డేగలు, గ్రద్దలు ఖరుని రథానికి అడ్డంగా ఎగురుతున్నాయి.

ఇంతలో సాయం సమయం అయింది.. గ్రహణ కాలం కాకుండానే రాహువు సూర్యుని మింగుతున్నాడా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు. ఆకాశంనుండి ఉల్కాపాతం జరిగింది. స్వల్పంగా భూమి కంపించింది. రథం మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న ఖరుడికి ఎడమ భుజము అదిరింది. మాట తడబడుతూ ఉంది. కళ్లు మండటం మొదలెట్టాయి.

ఇన్ని అపశకునాలు కనపడుతున్నా ఖరుడు చలించలేదు. వెనుకకు మరలలేదు. ముందుకు దూకుతున్నాడు. “సైనికులారా! ఈ ఉత్పాతాలకు భయపడకండి. ఇలాంటివి పిరికి వాళ్లను భయపెడతాయి కానీ మనలను కాదు. ధైర్యంగా ముందుకు దూకండి. ఆ రామలక్ష్మణులను చంపి గానీ వెనకకు తిరగ వద్దు. వాళ్లను చంపి వాళ్ల రక్తం తాగితేనే గానీ నా సోదరి శూర్పణఖ అవమానము చల్లారదు. మనం ఎన్నడూ యుద్ధంలో ఓడిపోలేదు. ఇప్పుడూ ఓడిపోము. నేను తల్చుకుంటే ఆ దేవేంద్రుని కూడా సంహరించగలను. ఈ మానవులు ఎంత?” అని ఖరుడు తనకు తానే ధైర్యము చెప్పుకుంటూ సేనలను ఉత్సాహపరుస్తున్నాడు.

ఈ విధంగా రాక్షసులు యుద్ధానికి కదలడం చూచి ఆ అడవిలో ఉన్న ఋషులు, మునులు, ఏంజరుగుతుందో అని ఆతురతగా చూస్తున్నారు. అందరూ లోక క్షేమాన్ని కోరి (అంటే రాక్షస సంహారాన్ని కోరి) ప్రార్థనలు చేస్తున్నారు. “చక్రాయుధమును ధరించిన శ్రీమహావిష్ణువు దానవులను సంహరించినట్టు ధనుర్ధారి అయిన రాముడు రాక్షస సంహారము చేయుగాక!” అని మనసులో ఆకాంక్షిస్తున్నారు. ఇంక పైనుంచి దేవతలు విమానములు ఎక్కి రాక్షస సైన్యమును చూస్తున్నారు. ఖరుని సేనలో పన్నెండు మంది మహావీరులైన రాక్షసులు ఉన్నారు.

వారు శ్యేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సరాస్యుడు, రుధిరాశనుడు ( పైన చెప్పి పేర్లలో వారి అలవాట్లు, గుణగణాలు ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు… శ్యేనగామి పక్షిలా తిరిగేవాడు. యజ్ఞశత్రువు = యజ్ఞములను పాడుచేసేవాడు, విహంగముడు=పక్షిలా ఎగిరేవాడు, పరుషుడు=ఎప్పుడూ పరుషంగా, కఠినంగా మాట్లాడేవాడు, రుధిరాశనుడు=రక్తం తాగేవాడు). వీరే కాకుండా దూషణుని వెంట మహాకపాలి,, స్థూలాక్షుడు, ప్రమాథీ, త్రిశిరస్సుడు అనే మరో నలుగురు రాక్షస సేనానాయకులు తమ తమ సేనలతో నడుస్తున్నారు. వీరందరూ రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళుతున్నారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుర్వింశః సర్గః (24) >>

Aranya Kanda Sarga 20 In Telugu – అరణ్యకాండ వింశః సర్గః

Aranya Kanda Sarga 20 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” వింశః సర్గలో, పద్నాలుగు రాక్షసులు శూర్పణఖచే మార్గనిర్దేశం చేయబడిన రాముని కుటీరానికి చేరుకుంటారు మరియు వారు రాముడితో యుద్ధం చేస్తారు, అందులో రాముడు వారి ఆయుధాలన్నింటినీ నాశనం చేస్తాడు మరియు వారందరినీ నాశనం చేస్తాడు. ఈ ఓటమిని చూసిన శూర్పణఖ ఓటమిని నివేదించడానికి తన సోదరుడి వద్దకు తిరిగి వెళుతుంది.

చతుర్దశరక్షోవధః

తతః శూర్పణఖా ఘోరా రాఘవాశ్రమమాగతా |
రక్షసామాచచక్షే తౌ భ్రాతరౌ సహ సీతయా ||

1

తే రామం పర్ణశాలాయాముపవిష్టం మహాబలమ్ |
దదృశుః సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ ||

2

తాన్ దృష్ట్వా రాఘవః శ్రీమానాగతాం తాం చ రాక్షసీమ్ |
అబ్రవీద్భ్రాతరం రామో లక్ష్మణం దీప్తతేజసమ్ ||

3

ముహూర్తం భవ సౌమిత్రే సీతాయాః ప్రత్యనంతరః |
ఇమానస్యా వధిష్యామి పదవీమాగతానిహ ||

4

వాక్యమేతత్తతః శ్రుత్వా రామస్య విదితాత్మనః |
తథేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్ ||

5

రాఘవోఽపి మహచ్చాపం చామీకరవిభూషితమ్ |
చకార సజ్యం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవీత్ ||

6

పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ |
ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనమ్ ||

7

ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ ||

8

యుష్మాన్పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే |
ఋషీణాం తు నియోగేన ప్రాప్తోఽహం సశరాయుధః ||

9

తిష్ఠతైవాత్ర సంతుష్టా నోపావర్తితుమర్హథ |
యది ప్రాణైరిహార్థో వా నివర్తధ్వం నిశాచరాః ||

10

తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ |
ఊచుర్వాచం సుసంక్రుద్ధా బ్రహ్మఘ్నాః శూలపాణయః ||

11

సంరక్తనయనా ఘోరా రామం సంరక్తలోచనమ్ |
పరుషం మధురాభాషం హృష్టా దృష్టపరాక్రమమ్ ||

12

క్రోధముత్పాద్య నో భర్తుః ఖరస్య సుమహాత్మనః |
త్వమేవ హాస్యసే ప్రాణానద్యాస్మాభిర్హతో యుధి ||

13

కా హి తే శక్తిరేకస్య బహూనాం రణమూర్ధని |
అస్మాకమగ్రతః స్థాతుం కిం పునర్యోద్ధుమాహవే ||

14

ఏహి బాహుప్రయుక్తైర్నః పరిఘైః శూలపట్టిశైః |
ప్రాణాంస్త్యక్ష్యసి వీర్యం చ ధనుశ్చ కరపీడితమ్ ||

15

ఇత్యేవముక్త్వా సంక్రుద్ధా రాక్షసాస్తే చతుర్దశ |
ఉద్యతాయుధనిస్త్రింశా రామమేవాభిదుద్రువుః ||

16

చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయమ్ |
తాని శూలాని కాకుత్స్థః సమస్తాని చతుర్దశ ||

17

తావద్భిరేవ చిచ్ఛేద శరైః కాంచనభూషణైః |
తతః పశ్చాన్మహాతేజా నారాచాన్ సూర్యసన్నిభాన్ ||

18

జగ్రాహ పరమక్రుద్ధశ్చతుర్దశ శిలాశితాన్ |
గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ||

19

ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివ శతక్రతుః |
రుక్మపుంఖాశ్చ విశిఖా దీప్తా హేమవిభూషితాః ||

20

తే భిత్త్వా రక్షసాం వేగాద్వక్షాంసి రుధిరాప్లుతాః |
వినిష్పేతుస్తదా భూమౌ న్యమజ్జంతాశనిస్వనాః ||

21

తే భిన్నహృదయా భూమౌ ఛిన్నమూలా ఇవ ద్రుమాః |
నిపేతుః శోణితార్ద్రాంగా వికృతా విగతాసవః ||

22

తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛితా |
పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజద్భైరవస్వనాన్ ||

23

సా నదంతీ మహానాదం జవాచ్ఛూర్పణఖా పునః |
ఉపగమ్య ఖరం సా తు కించిత్సంశుష్కశోణితా ||

24

పపాత పునరేవార్తా సనిర్యాసేవ సల్లకీ |
భ్రాతుః సమీపే శోకార్తా ససర్జ నినదం మహుః |
సస్వరం ముమోచే బాష్పం విషణ్ణవదనా తదా ||

25

నిపాతితాన్ దృష్య రణే తు రాక్షసాన్
ప్రధావితా శూర్పణఖా పునస్తతః |
వధం చ తేషాం నిఖిలేన రక్షసాం
శశంస సర్వం భగినీ ఖరస్య సా ||

26

Aranya Kanda Sarga 20 In Telugu Pdf Download

శూర్పణఖ ఆ పదునాలుగు మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకొని వెళ్లింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాసి అయిన సీతను చూచారు.

రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు.” అని అన్నాడు.

లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు.

“ఓ రాక్షసులారా! నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గానీ, మా లాంటి తాపసులు కానీ మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు. చంపుతున్నారు. మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోండి. లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణాలు పోగొట్టుకోండి.” అని అన్నాడు రాముడు.

ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటి దాకా వారిని చూచి భయపడ్డవారే గానీ, వారిని ఎదిరించి భయపెట్టిన వారు లేరు. అలాంటిది వీళ్లు ఎదిరిస్తున్నారు అంటే కోపం ఆపుకోలేకపోయారు.

“మా ప్రభువు ఖరుడు. నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులు కోసి, అవమానించి, ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బతకడం కల్ల. ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము. నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములు నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సు వదిలిపారిపోతావు. కాచుకో!” అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదికి తమ తమ ఆయుధములను విసిరారు.

రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్కబాణంతో ముక్కలు చేసాడు. తరువాత రాముడు 14 నారాచములను వారి మీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేసాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్ద అయినాయి. వారి గుండెలు చీలడంతో, ఆ 14 మంది రాక్షసులు నేల మీద పడి ప్రాణాలు వదిలారు.

శూర్పణఖ ఆశ్చర్యంలో ఆ రాక్షసుల వంక చూచింది. రామలక్ష్మణుల వంక చూచింది. శూర్పణఖకు కోపము, భయము, ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలు పెట్టింది. అక్కడి నుండి పరుగెత్తింది. ఖరుని వద్దకు పరుగుపరుగున వచ్చింది. ఖరుని ముందు నేల మీద పడి భోరు భోరున ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకవింశః సర్గః (21) >>