Aranya Kanda Sarga 12 In Telugu – అరణ్యకాండ ద్వాదశః సర్గః

Aranya Kanda Sarga 12 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ద్వాదశః సర్గలో, రాముడు, లక్ష్మణుడు, సీత అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అగస్త్య మహర్షి కూడా చాలా కాలం పాటు రాముడిని స్వీకరించడానికి వేచి ఉన్నాడు మరియు ఇప్పుడు వారిని అన్ని గౌరవాలతో స్వీకరిస్తాడు, రాముడిని విష్ణువు అవతారంగా గ్రహించాడు. అగస్త్య మహర్షి విష్ణువు యొక్క దివ్యమైన ధనుస్సును, ఎప్పుడూ బాణాలతో నిండిన రెండు వణుకులను మరియు బంగారు తొడుగులో బంగారు ఖడ్గాన్ని రాముడికి ఇస్తాడు, అదే ఆయుధాలతో విష్ణువు ఒకప్పుడు భూమిపై చెడును నిర్మూలించాడని చెప్పాడు.

అగస్త్యదర్శనమ్

స ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః |
అగస్త్యశిష్యమాసాద్య వాక్యమేతదువాచ హ ||

1

రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలీ |
రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా ||

2

లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వవరజో హితః |
అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః ||

3

తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ |
ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతామ్ ||

4

తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః |
తథేత్యుక్త్వాఽగ్నిశరణం ప్రవివేశ నివేదితుమ్ ||

5

స ప్రవిశ్య మునిశ్రేష్ఠం తపసా దుష్ప్రధర్షణమ్ |
కృతాంజలిరువాచేదం రామాగమనమంజసా ||

6

యథోక్తం లక్ష్మణేనైవ శిష్యోఽగస్త్యస్య సమ్మతః |
పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవ చ ||

7

ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా |
ద్రష్టుం భవంతమాయాతౌ శుశ్రూషార్థమరిందమౌ ||

8

యదత్రానంతరం తత్త్వమాజ్ఞాపయితుమర్హసి |
తతః శిష్యాదుపశ్రుత్య ప్రాప్తం రామం సలక్ష్మణమ్ ||

9

వైదేహీం చ మహాభాగామిదం వచనమబ్రవీత్ |
దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః ||

10

మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి |
గమ్యతాం సత్కృతో రామః సభార్యః సహలక్ష్మణః ||

11

ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశితః |
ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మనా ||

12

అభివాద్యాబ్రవీచ్ఛిష్యస్తథేతి నియతాంజలిః |
తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ ||

13

క్వాసౌ రామో మునిం ద్రష్టుమేతు ప్రవిశతు స్వయమ్ |
తతో గత్వాఽఽశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణః ||

14

దర్శయామాస కాకుత్స్థం సీతాం చ జనకాత్మజామ్ |
తం శిష్యః ప్రశ్రితో వాక్యమగస్త్యవచనం బ్రువన్ ||

15

ప్రావేశయద్యథాన్యాయం సత్కారార్హం సుసత్కృతమ్ |
ప్రవివేశ తతో రామః సీతయా సహ లక్ష్మణః ||

16

ప్రశాంతహరిణాకీర్ణమాశ్రమం హ్యవలోకయన్ |
స తత్ర బ్రహ్మణః స్థానమగ్నేః స్థానం తథైవ చ ||

17

విష్ణోః స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః |
సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ||

18

ధాతుర్విధాతుః స్థానే చ వాయోః స్థానం తథైవ చ |
నాగరాజస్య చ స్థానమనంతస్య మహాత్మనః ||

19

స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానమేవ చ |
స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః ||

20

కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి |
తతః శిష్యైః పరివృతో మునిరప్యభినిష్పతత్ ||

21

తం దదర్శాగ్రతో రామో మునీనాం దీప్తతేజసామ్ |
అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ ||

22

ఏష లక్ష్మణ నిష్క్రామత్యగస్త్యో భగవానృషిః |
ఔదార్యేణావగచ్ఛామి నిధానం తపసామిమమ్ ||

23

ఏవముక్త్వా మహాబాహురగస్త్యం సూర్యవర్చసమ్ |
జగ్రాహ పరమప్రీతస్తస్య పాదౌ పరంతపః ||

24

అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః సలక్ష్మణః ||

25

ప్రతిజగ్రాహ కాకుత్స్థమర్చయిత్వాసనోదకైః |
కుశలప్రశ్నముక్త్వా చ హ్యాస్యతామితి చాబ్రవీత్ ||

26

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథీన్ప్రతిపూజ్య చ |
వానప్రస్థేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ ||

27

ప్రథమం చోపవిశ్యాథ ధర్మజ్ఞో మునిపుంగవః |
ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదమ్ ||

28

అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథిం ప్రతిపూజయేత్ |
అన్యథా ఖలు కాకుత్స్థ తపస్వీ సముదాచరన్ ||

29

దుఃసాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్ |
రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః ||

30

పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ప్రాప్తః ప్రియాతిథిః |
ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైరన్యైశ్చ రాఘవమ్ ||

31

పూజయిత్వా యథాకామం పునరేవ తతోఽబ్రవీత్ |
ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్నవిభూషితమ్ ||

32

వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణా |
అమోఘః సూర్యసంకాశో బ్రహ్మదత్తః శరోత్తమః ||

33

దత్తౌ మమ మహేంద్రేణ తూణీ చాక్షయసాయకౌ |
సంపూర్ణౌ నిశితైర్బాణైర్జ్వలద్భిరివ పావకైః ||

34

మహారజత కోశోఽయమసిర్హేమవిభూషితః |
అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ||

35

ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసామ్ |
తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద ||

36

జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా |
ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధమ్ |
దత్త్వా రామాయ భగవానగస్త్యః పునరబ్రవీత్ ||

37

Aranya Kanda Sarga 12 Meaning In Telugu PDF

రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి” అని అన్నాడు.

ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి “మీరు ఎవరు?” అని అడిగాడు.

“నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించు చున్నాము. ” అని అన్నాడు.

“మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను.” అని లోపలకు వెళ్లాడు.

అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు.

“ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా. రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా. వెంటనే నావద్దకు తీసుకొని రావలదా! ” అని శిష్యునితో అన్నాడు.

వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి “రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును.” అని అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి, సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకొని వెళ్లాడు.

రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! అటు చూడు! అగ్ని వలె వెలుగుతున్న అగస్త్యమహర్షి మనకోసం వస్తున్నాడు.” అని అన్నాడు.

రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేసారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని, అతిథిపూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! ముందుగా అగ్నిహోత్రము చేసి, అతిధులను పూజించి, తరువాత భోజనము చేయవలెను. అలాచేయని వాడు నరకానికి పోతాడు.

రామా! నీవు క్షత్రియుడవు. అయోధ్యకు రాజువు. ధర్మము తెలిసినవాడవు. అందరి చేతా గౌరవింప తగినవాడవు. అలాంటి నీవు ఈ రోజు మాకు అతిథిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది.

రామా! నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూణీరము. ఈ తూణీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు.

ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు. ఈ ఆయుధములను నీవు స్వీకరించు. నీకు జయం కలుగుతుంది.” అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను, ఖడ్గమును రామునికి ఇచ్చాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ త్రయోదశః సర్గః (13) >>

Sri Ramadasu Keerthanalu 41-50 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 41-50

Sri Ramadasu Keerthanalu 41-50 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

41. నాదనామక్రియ ఏకతాళం

పల్లవి : తానీషా : ఏ దేశమున నుండువారు మీరలెందుండి యిట వచ్చినారు
రామ : తొలుత గోదావరియందు మా స్థలమది భద్రాచలమందు
తానీషా : ఎవరి జవానులు మీరు మిమ్మెవరు బంపక వచ్చినారు
రామ :దాసజవానులు మేము రామదాసు పంపగ వచ్చినాము
తానీషా : ఏ కులమువారు మీరు మీరిద్దరు నే వరుసవారు
రామ : ఇనవంశమున బుట్టినాము మేమిద్దర మన్నదమ్ములము
తానీషా : ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు
రామ : రామోజీ లక్ష్మోజినామం వహ్వా రామానుజ మతమువారం
తానీషా : ఎన్నిదినములనుండి మీరు వారిసన్నిధి కొలువై యున్నారు
రామ : తాతముత్తాతలు మేము మూడుతరములనుండి యున్నాము
తానీషా : ఏమి జీతమిచ్చెదరు మీకు ఏమి జీవనమిచ్చెదరు
రామ : సమ్మతిలేని జీతము ప్రసాదమునకే కుదిరినాము
తానీషా : ఎందుకు పంపించినారు మీరేమి పనిగ వచ్చినారు.
రామ : సర్కార్బాకీ పైకము మాచేత బంపగ వచ్చినాము
తానీషా : అర్థమంతయు దెచ్చినారా లేక వ్యర్థముగ వచ్చినారా
రామ : వ్యర్థులముగ మేము రాము మీయర్థమంత దెచ్చినాము
తానీషా : బైఠోజి బైరోజి మీ మాటలు చూడగ వేరు
రామ : బైఠోజి వారముగాము మీ భేటికి వచ్చినాము
తానీషా : లక్షలారును దెచ్చినారా యింకా శిక్షలో నుండమన్నారా
రామ : లక్షలారునియ్యగలము మూడు లక్షలు మేమియ్యగలము
తానీషా : పంపిన పైకము తెండి యాపయిన తమాషా చూడండి
రామ : పదివేలు తెచ్చినామండి యాపయిన మాచేత లేదండి
తానీషా : మగురూర్మాటలు మీతో మాతో మరలించుచున్నారు.
రామ : మగురూరి వారితో మేము మాట్లాడువారము కాము
తానీషా : ధనము మాచేతికియ్యండి యావెనుక ఖైదులోకి పొండి
రామ : ఖైదులోకి మేము పోము మీ ఖజాన పైకమిచ్చేము
తానీషా : చెల్లింతురా ద్రవ్యమంత రసీదు నడుగుట కడువింత
రామ : ఉంగరంబులీడెమందు నుప్పొంగుచు తొడదట్టెయందు
తానీషా : మొహరువేసినంతను మోహనాంగుడు సంతసమునను

42. మధ్యమావతి చాపుతాళం

పల్లవి : ఏదేశము మీది యెవ్వరు బంపిరి యెందుకై వచ్చితిరి
భేదమొందక యతి భీతి నొందక మాకు
ఖ్యాతిగ జెప్పిన గాచేము మిమ్మిపుడు
అజునికైన నలవికాదిచటికి రాగ అర్థరాత్రియందున
గజ సింహములనైన ఖండించు భటులెంతో
కావలియుండగ గడిచివచ్చితి రెట్లు
అర్థమంతయు జూడ నాశ్చర్యమాయేను
అటు భారమెటు దెస్తిరి
భద్రేభములకైన బరువైతోచు నీ యర్థము
మీరెచట నార్జించి తొ చ్చితిరి

॥ఏదేశము॥

మీ రూపు మీ సొగసు మీ చక్కదన మెన్నలేరు
ఈ ధరయందున
మాయావేషముల గారడి మాయమీరు
నెరవుతో బన్నివారనితోచెను
ఇంత రాత్రివేల నీ యర్థమిప్పుడు
ఎంతని పరికింపను
రంతు సేయక రేపంతయు చెల్లింపుడు

॥ఏదేశము॥

అంతదనుక ఖైదులోనుండు డనెనపుడు

||ఏదేశము ||

43. ఆనందభైరవి ఆదితాళం

పల్లవి : ఏమిటిది దయరాదు శ్రీరాములు
నన్ను నేమిటికి రక్షింప శ్రీ రాములు
పరులను వేడబోను శ్రీరాములు
నీకే కరములు చాచి యున్నాను శ్రీరాములు
పండ్రెండేండ్లాయె నేమి శ్రీరాములు
బందిఖానాలో నేనుండినాను శ్రీరాములు

||ఏమిటిది||

అర్థము తెమ్మనుచునన్ను శ్రీరాములు
ఇప్పుడరికట్టనెంచినారు శ్రీరాములు

||ఏమిటిది||

తానీషాగారి జవానులు నన్ను
తహసీలు చేయుచున్నారు శ్రీరాములు

||ఏమిటిది||

ముచ్చటైన యాడతేన శ్రీరాములు
నీవు యిచ్చే యర్థము లియ్యనేడు శ్రీరాములు

||ఏమిటిది||

నీచేగాకున్న నింకను శ్రీరాములు
మాతల్లి సీతమ్మలేదా శ్రీరాములు

||ఏమిటిది||

మాతల్లి సీతమ్మకైన శ్రీరాములు
నేను మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు

||ఏమిటిది||

ఆశించియుండిన దాసుని శ్రీరాములు
నీకు పోషి భారము లేదా శ్రీరాములు

||ఏమిటిది॥

నిన్ను నమ్మినానయ్య శ్రీరాములు
నేను గట్టిగా నా మదిలో శ్రీరాములు

॥ఏమిటిది ||

ఇల్లు వదలిటురావదేమి శ్రీరాములు
మీకు విడిది భద్రాచలమాయెనో శ్రీరాములు

॥ఏమిటిది ||

వాసిగభద్రాద్రి వెలిసిన శ్రీరాములు
రామదాసుని రక్షింపరాదా శ్రీరాములు

॥ఏమిటిది ||

44. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : ఏమిరా రామా నావల్ల నేరమేమిరా రామ
ఏమి రామ యీలాగుకష్టము నీ మహిమో నా ప్రారబ్ధమో
కుండలి శయనా వేదండరక్ష కాఖండతేజ నాయండ నుండవే

||ఏమిరా||

పంకజలోచన శంకరసుత సంకటములు మాన్పవే పొంకముతోను

||ఏమిరా||

సుందరధర నీ సుందర పదములు ఇందిరేశ కనుగొందుచూపవే

||ఏమిరా||

దినమొక యేడుగ ఘనమున గడిపెద తనయుని మీదను దయలేదయ్యయ్యో

||ఏమిరా||

సదయాహృదయ నీ మృదుపదములు నా హృదయ కమలమున వదలక నిల్పెద
రామరామ భద్రాచల సీతారామదాసుని ప్రేమతో నేలవే

||ఏమిరా॥

45. బేగడ ఏకతాళం

పల్లవి : ఎలాగు తాళుదు నేమి సేతు రామా
ఈ జాలిచేతను తాళజాలను రామా
దీనజనుల కెల్ల దిక్కు నీవే రామా
మనమున నిన్ను నేమరవనో రామా

||ఏలాగు||

పావనమూర్తి యో పట్టాభి రామా
కావవే యీవేళ కౌశల్య రామా

||ఏలాగు||

శరణుని నీ మరుగు జేరితి రామా
శరణంటే కాచేది బిరుదు రఘురామా

||ఏలాగు||

చెప్పరాని ప్రేమ నెంచు దాతుర రామా
ఆపన్న రక్షకుడ నాపాలి శ్రీరామా

||ఏలాగు||

నీ సొమ్మునే నటుల నిజమాయె రామా
నా దోషములనన్ని దొలగింపవె రామా

||ఏలాగు||

రాతికైన చెమట రంజిల్లునో రామా
ఆతీరు నీ మనసు నొందుదు శ్రీరామా

||ఏలాగు||

యమబాధ నొందగ నేరనో రామా
యమదండనలు లేక యెడబాపు రామా

||ఏలాగు||

వాసిగ రామకీర్తనలు జేసితి రామా
రామదాసునిమీద దయయుంచు శ్రీరామా

||ఏలాగు||

46. మధ్యమావతి ఆదితాళం

పల్లవి : ఓరఘు నీవాయని నే బిలిచిన
నోహో యనరాదా
సారెకు మరి వేసారి యన్యము
చేరదు నామది యేరా ధీరా
నీటజిక్కి కరి మాటికి వేసరి
నాకట ధర నీపాటల బాడగ
మేటి మకరి తలమీటి కాదు దయ
ఏనాటికి నాపై నేటికి రాదో

||ఓరగు||

మున్ను సభను నా పన్నత వేడుచు
మిమ్ము కృష్ణాయని యెన్నగ ద్రౌపది
కెన్నో వలువలిచ్చి మన్నన బ్రోచిన
వెన్నుడ నా మొర వింటివో లేదో

||ఓరగు||

బంటునైతినని యుంటే పరాకున
నుంటిని తెలిసి ముక్కంటి వినుత నా
జంట బాయకను వెంట రమ్మని వేడు
కొంటి భద్రగిరి రామదాస పోషక

||ఓరగు||

47. శంకరాభరణము రూపకతాళం

పల్లవి : కంటినేడు మా రాముల కనుగొంటి నేడు
కంటి నేడు భక్తగుణముల మాపాలి
మా జంటభద్రగిరి నంటియున్నవాని

॥కంటినేడు॥

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువు తీరిన మా కోదండరామ

॥కంటినేడు॥

కమలాప్త తిలకము ఘన నీల గాత్రము
కరుణారసము గురియు కందోయి గలవాని

॥కంటినేడు॥

హుకుమంజి ముత్యాలసరములు మెరయగ
మురిపెంపు చిరునవ్వు మోము గలిగినవాని

॥కంటినేడు॥

ఘల్లుఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయు
తళుకు బెళుకు పాదతలము గలిగినవాని

॥కంటినేడు॥

కరకు బంగారుచేల కాంతిజగము గొప్ప
శరచాపములు కేల ధరియించు స్వామి

॥కంటినేడు॥

ధరణి శ్రీరామదాసుని రక్షించు
పరమపురుషుడైన భద్రగిరీశుని

॥కంటినేడు॥

48. కాంభోజి ఏకతాళం

పల్లవి : కటకట నీదు సంకల్పమెట్టిదో గాని
నేనెంతవాడనురా రామా
నిటలాక్షుడు తొల్లి నీ మాయ గనలేక
తటుకుపడి నీవల దగిలెను గనుక

॥కటకట॥

శరణన్న మునులను బిరబిర బ్రోచెడు
బిరుదుగల్గిన దొరవే ఓ రామా
పరిపరి విధముల మొరలిడ వినక
నన్నరమర చేసిన హరి నిన్నే మందు

॥కటకట॥

భావ జనక నా భావ మెరుగవే
వేగమున రాగదే దేవా
దేవాదిదేవా దీనశరణ్య
నీవే దిక్కని నిక్కము నమ్మితి

॥కటకట॥

గీర్వాణసుత భద్రగిరివాసా
సర్వయోగీశ్వర రామా
సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయా
సర్వాధారా పరాకేల రామా

॥కటకట॥

49. సౌరాష్ట్ర ఆదితాళం

పల్లవి : కరుణించి దైవలరామ అహో
పరమపావననామ పట్టాభిరామా

||కరుణించి||

అన్న వస్త్రము లిత్తుమనుచు దొరలన్నారు మన్నించెదవనుచు
ఆయురన్నం ప్రయచ్ఛతి యనుచు మారకున్నను నీవే మాకున్నావనుచు

||కరుణించి||

మరియింత కాలమ్ముదనుకా మమ్ము మరచితివని ఒప్పుకొనర
మమ్ము దరిజేర్చినంతదనుకా మీది శరణాగత త్రాణ బిరుదటు కనుక

||కరుణించి||

నరులను గొలచుటకన్నా భద్రగిరిరాఘవుని వేడుకొన్నా
ఇహపరము లిలగలవని విన్నా నేను దరహాసము నా రామదాస ప్రసన్నా

||కరుణించి||

50. కన్నడ ఆదితాళం

పల్లవి : కలనిజమాయె కలికిరో వినవే
కలనిజమాయెనే
చూపున బాలారే సొగసైన రౌతులే
రేపనరాదే యో రమామణి నమ్మలేదు

||కల||

నా మదిలో నిన్ను నరులని గాన లే
నీ మహిలో నేనెరుగనివారే

||కల||

పురుషులు చూడగ పురాణపురుషులే
మర్యాదలేదే మహానుభావులే

||కల||

దాస జవానులే జాతి కబీరులే
వాసవిసుతులే వారిజనేత్రులే

||కల||

భద్రాద్రి వాసులే భవ్య యశోద్భష్ణాలే
భద్రాద్రి రామదాసపాలిట చిద్విరాసులే

||కల||

మరిన్ని కీర్తనలు:

Aranya Kanda Sarga 4 In Telugu – అరణ్యకాండ చతుర్థః సర్గః

Aranya Kanda Sarga 4 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చతుర్థ సర్గం రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటిలో నివసిస్తారు. ఈ క్రమంలో, శూర్పణఖ రాముణ్ని చూసి, అతనిపై మోహించి, ప్రేమను ప్రదర్శిస్తుంది. అయితే, రాముడు ఆమెను తిరస్కరిస్తాడు. కోపంతో శూర్పణఖ సీతపై దాడి చేస్తుంది.

విరాధనిఖననమ్

హ్రియమాణౌ తు తౌ దృష్ట్వా వైదేహీ రామలక్ష్మణౌ |
ఉచ్చైఃస్వరేణ చుక్రోశ ప్రగృహ్య సుభుజా భుజౌ ||

1

ఏష దాశరథీ రామః సత్యవాన్ శీలవాన్ శుచిః |
రక్షసా రౌద్రరూపేణ హ్రియతే సహలక్ష్మణః ||

2

మాం వృకా భక్షయిష్యంతి శార్దూలా ద్వీపినస్తథా |
మాం హరోత్సృజ్య కాకుత్స్థౌ నమస్తే రాక్షసోత్తమ ||

3

తస్యాస్తద్వచనం శ్రుత్వా వైదేహ్యా రామలక్ష్మణౌ |
వేగం ప్రచక్రతుర్వీరౌ వధే తస్య దురాత్మనః ||

4

తస్య రోద్రస్య సౌమిత్రిర్బాహుం సవ్యం బభంజ హ |
రామస్తు దక్షిణం బాహుం తరసా తస్య రక్షసః ||

5

స భగ్నబాహుః సంవిగ్నో నిపపాతాశు రాక్షసః |
ధరణ్యాం మేఘసంకాశో వజ్రభిన్న ఇవాచలః ||

6

ముష్టిభిర్జానుభిః పద్భిః సూదయంతౌ తు రాక్షసమ్ |
ఉద్యమ్యోద్యమ్య చాప్యేనం స్థండిలే నిష్పిపేషతుః ||

7

స విద్ధో బహుభిర్బాణైః ఖడ్గాభ్యాం చ పరిక్షతః |
నిష్పిష్టో బహుధా భూమౌ న మమార స రాక్షసః ||

8

తం ప్రేక్ష్య రామః సుభృశమవధ్యమచలోపమమ్ |
భయేష్వభయదః శ్రీమానిదం వచనమబ్రవీత్ ||

9

తపసా పురుషవ్యాఘ్ర రాక్షసోఽయం న శక్యతే |
శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే ||

10

తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం రాక్షసః ప్రశ్రితం వచః |
ఇదం ప్రోవాచ కాకుత్స్థం విరాధః పురుషర్షభమ్ ||

11

హతోఽహం పురుషవ్యాఘ్ర శక్రతుల్యబలేన వై |
మయా తు పూర్వం త్వం మోహన్న జ్ఞాతః పురుషర్షభః ||

12

కౌసల్యా సుప్రజా తాత రామస్త్వం విదితో మయా | [రామ తాత]
వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః ||

13

అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుమ్ |
తుంబురుర్నామ గంధర్వః శప్తో వైశ్రవణేన హ ||

14

ప్రసాద్యమానశ్చ మయా సోఽబ్రవీన్మాం మహాయశాః |
యదా దాశరథీ రామస్త్వాం వధిష్యతి సంయుగే ||

15

తదా ప్రకృతిమాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి |
ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురాఽనఘ ||

16

అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహార హ |
తవ ప్రసాదాన్ముక్తోఽహమభిశాపాత్సుదారుణాత్ ||

17

భువనం స్వం గమిష్యామి స్వస్తి వోఽస్తు పరంతప |
ఇతో వసతి ధర్మాత్మా శరభంగః ప్రతాపవాన్ ||

18

అధ్యర్ధయోజనే తాత మహర్షిః సూర్యసన్నిభః |
తం క్షిప్రమభిగచ్ఛ త్వం స తే శ్రేయో విధాస్యతి ||

19

అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ |
రక్షసాం గతసత్త్వానామేష ధర్మః సనాతనః ||

20

అవటే యే నిధీయంతే తేషాం లోకాః సనాతనాః |
ఏవముక్త్వా తు కాకుత్స్థం విరాధః శరపీడితః ||

21

బభూవ స్వర్గసంప్రాప్తో న్యస్తదేహో మహాబలః |
తచ్ఛ్రుత్వా రాఘవో వాక్యం లక్ష్మణం వ్యాదిదేశ హ ||

22

కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్యాస్య లక్ష్మణ |
వనేఽస్మిన్ సుమహచ్ఛ్వభ్రం ఖన్యతాం రౌద్రకర్మణః ||

23

ఇత్యుక్త్వా లక్ష్మణం రామః ప్రదరః ఖన్యతామితి |
తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్ ||

24

తతః ఖనిత్రమాదాయ లక్ష్మణః శ్వభ్రముత్తమమ్ |
అఖనత్పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః ||

25

తం ముక్తకంఠం నిష్పిష్య శంకుకర్ణం మహాస్వనమ్ |
విరాధం ప్రాక్షిపచ్ఛ్వభ్రే నదంతం భైరవస్వనమ్ ||

26

తమాహవే నిర్జితమాశువిక్రమౌ
స్థిరావుభౌ సంయతి రామలక్ష్మణౌ |
మదాన్వితౌ చిక్షిపతుర్భయావహం
నదంతముత్క్షిప్య బిలే తు రాక్షసమ్ ||

27

అవధ్యతాం ప్రేక్ష్య మహాసురస్య తౌ
శితేన శస్త్రేణ తదా నరర్షభౌ |
సమర్థ్య చాత్యర్థవిశారదావుభౌ
బిలే విరాధస్య వధం ప్రచక్రతుః ||

28

స్వయం విరాధేన హి మృత్యురాత్మనః
ప్రసహ్య రామేణ వధార్థమీప్సితః |
నివేదితః కాననచారిణా స్వయం
న మే వధః శస్త్రకృతో భవేదితి ||

29

తదేవ రామేణ నిశమ్య భాషితం
కృతా మతిస్తస్య బిలప్రవేశనే |
బిలం చ రామేణ బలేన రక్షసా
ప్రవేశ్యమానేన వనం వినాదితమ్ ||

30

ప్రహృష్టరూపావివ రామలక్ష్మణౌ
విరాధముర్వ్యాం ప్రదరే నిఖాయ తమ్ | [నిహత్య తౌ]
ననందతుర్వీతభయౌ మహావనే
శిలాభిరంతర్దధతుశ్చ రాక్షసమ్ ||

31

తతస్తు తౌ కార్ముకఖడ్గధారిణౌ
నిహత్య రక్షః పరిగృహ్య మైథిలీమ్ |
విజహ్నతుస్తౌ ముదితౌ మహావనే
దివి స్థితౌ చంద్రదివాకరావివ ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థః సర్గః ||

Aranya Kanda Sarga 4 Meaning In Telugu

ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది.

“ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది.

ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు.

కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు.

“లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చి పెట్టడానికి తగినంత గొయ్యి తవ్వు.” అని అన్నాడు. గొయ్యి తవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతు మీద కాలు పెట్టి నిలుచున్నాడు.

అప్పుడే మూర్ఛనుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు.

“రామా! నువ్వు ఎవరో గుర్తించాను. నీభార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహా పరాక్రమ వంతులు. మీచేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు. ఇంక నా గురించి చెబుతాను.

నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒక సారి నేను రంభయొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. “దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది” అని కుబేరుడు నాకు శాపవిమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శనభాగ్యము కలిగింది. నాకు శాపవిమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్లిపోతాను. నాకు అనుజ్ఞు ఇవ్వండి.” అని ప్రార్థించాడు.

రామ లక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇక్కడికి ఒకటిన్నర యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్లండి మీకుశుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతి పెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.” అని అన్నాడు.

తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీసాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీసాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్ద గా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోసాడు.

ఆ ప్రకారంగా రామలక్ష్మణులు, ఏ ఆయుధము చేత కూడా చావని విరాధుని, గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావ వలెనని కోరిక కల విరాధుడు, తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండ రాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు.

(విరాధుని కధ మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదూ! పైన చెప్పిన విధంగా గోరఖపూర్ ప్రతిలో ఉంది. రాముడు మహా బలవంతుడు. అస్త్రశస్త్ర సంపన్నుడు. అటువంటి రాముడు విరాధుడు సీతను ఎత్తుకొని పోగానే ఏడుస్తాడు. అదీ సీతను విరాధుడు ఎత్తుకొని పోయినందుకు కాదు. తమకు కలిగిన కష్టములను చూచి కైక కళ్లు చల్లబడ్డాయి కదా అని ఏడుస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని పరాక్రమమును గుర్తుచేస్తాడు. అయినా రాముడు ఏమీ చేయడు.

తరువాత విరాధుడు రామ లక్ష్మణులను బుజాల మీద ఎత్తుకొని పోతుంటే, “ఎటూ మనం అటే వెళతాము కదా కాస్త దూరం కలిసి వచ్చిందిలే” అని అనుకుంటాడు రాముడు. అంతేగానీ సీత ఒంటరిగా ఉంది, ఆమెకు ఏమన్నా ఆపద కలుగుతుంది అని గుర్తుకు రాదు. సీత కూడా “రామా నన్ను రక్షించు” అని ఏడవదు. విరాధునితో “నన్ను ఇక్కడ క్రూరమృగాలు తింటాయి. కావాలంటే నన్నుఎత్తుకొని పో, రామలక్ష్మణులను వదిలిపెట్టు” అని అరుస్తుంది. అప్పుడు రామునికి సీత ఒంటరిగా ఉంది అని గుర్తుకు వస్తుంది.

తాము విరాధుని చంపాలి అని అనుకుంటాడు. తరువాత విరాధుడు కూడా తనశాపవృత్తాంతము చెబుతాడు. తన శరీరాన్ని గోతిలో పెట్టి పాతిపెట్టమని కోరతాడు. తరువాత ప్రాణాలు విడుస్తాడు. రాముడు విరాధుని గొంతు మీద కాలు తీయగానే పెద్దగా అరుస్తాడు. అలా అరుస్తూ గిలా గిలా కొట్టుకుంటున్న విరాధుని రామలక్ష్మణులు గోతిలోకి తోసి కప్పెడతారు. వాడు లేవకుండా బండరాళ్లు పెడతారు. విరాధుడు ఇలాగే చస్తాడు అని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా!

కాని రామాయణం ప్రాచ్య ప్రతిలో కధ వేరుగా ఉంది. విరాధుడు సీతను లాక్కుని తన తొడమీద కూర్చోపెట్టుకోగానే సీతకు కలిగిన దుస్థితికి రాముడికి దుఃఖము కలుగుతుంది. లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి విరాధుని మీద ఏడు బాణాలు ప్రయోగిస్తాడు. విరాధుడు లక్ష్మణుని మీద శూలం విసురుతాడు. రాముడు దానిని రెండు ముక్కలుగా విరిచేస్తాడు. మరొక బాణంతో రాముడు విరాధుని వక్షస్థలం చీలేట్టు కొడతాడు. విరాధుడు కిందపడతాడు. కాని చావడు.

రామునికి తనశాప వృత్తాంతము చెబుతాడు. రామునికి కోపం తెప్పించడానికే, రాముని చేతిలో మరణించి శాపవిముక్తి పొందడానికే సీతను లాక్కున్నాను అని చెబుతాడు. తరువాత రాక్షసుల ఆచారం కార తన శరీరాన్ని గోతిలో కప్పెట్టమంటాడు. తరువాత శరభంగ ముని గురించి చెప్పి, తన నిజ స్వరూపంతో గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఈకథ సందర్భోచితంగా ఉంది. కాబట్టి మనము దీనినే అనుసరిద్దాము. పైవిషయములను నేను ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్రీమద్రామాయణము అరణ్యకాండ నుండి గ్రహించాను. వారికి నా పాదాభివందనములు. కృతజ్ఞతలు.)

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ పంచమః సర్గః (5) >>

Sri Ramadasu Keerthanalu 1-10 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు -Sri Ramadasu Keerthanalu కీర్తన:1-10

Sri Ramadasu Keerthanalu 1-10 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

1. వరాళిరాగం ఆదితాళం

పల్లవి : అంతా రామమయం యీ జగమంతా రామమయం
అంతరంగమున నాత్మారాముం డనంత రూపమున వింతలు సలుపగ

||అంతా॥

సౌమసూర్యులను సురలుదారలను
ఆ మహాంబుధులు నఖిల జగంబులు
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు

||అంతా||

నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు

||అంతా||

అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులు నరిషడ్వర్గములు

||అంతా||

ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము

||అంతా||

2. అసావేరి ఆదితాళం

పల్లవి : అబ్బ బ్బ దెబ్బలకు తాళలేనురా
రామప్ప గొబ్బున నన్నేలు కోరా

||అబ్బబ్బ||

మేలు చేయుదునంటి గదరా
వరహాలు మొహరీలు జమచేస్తిగదరా
నీ పరిచారులకు నే పెట్టితి గదరా

||అబ్బబ్బ||

పరులకొక్కరువ్వ యీయలేదు గదరా
ఓ పరమాత్మ నీ పాదముల్ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా
హరసుత గోవిందం హరితాళలేనురా

||అబ్బబ్బ||

అంతటిలో నిను నెరనమ్మినానురా
శరణాగత గోవిందలహరి తాళలేనురా
శరధి బంధించిన శౌర్యమెక్కడరా
రాక్షస సంహార రక్షింపరారా

||అబ్బబ్బ||

రామ భద్రాద్రిరామ సీతారామా
నీ నామమెప్పుడు భజయించితి గదురా
రామదాసుని నిటుల చేయించి తేరా

||అబ్బబ్బ||

3. వరాళి ఏకతాళం

పల్లవి : ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతాముదిత లక్ష్మణులు
కలసి కొలువగా రఘుపతి యుండెడి
చరణములు
చారుస్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి

||ఇదిగో||

అనుపమానమై అతిసుందరమై
దనరుచక్రము ధగధగ మెరిసెడి

||ఇదిగో||

కలియుగమందున నిలవైకుంఠము
నలరుచున్నది నయముగ మ్రొక్కుడి

||ఇదిగో||

పొన్నల పొగడల పూపొదరిండ్లను
చెన్ను మీగడను శృంగారంబడు

||ఇదిగో||

శ్రీకరముగ రామదాసునును
ప్రాకటముగ బ్రోచె ప్రభువాసము

||ఇదిగో||

4. కాంభోజి ఆదితాళం

పల్లవి : ఇక్ష్వాకుల తిలక ఇకనైన బలుకవు రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా

॥ఇక్ష్వాకు॥

చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర
యాప్రాకారములకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ జూడక యిత్తరి బ్రోవుము రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
యాపతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలత్రాడు రామచంద్ర
ఆ మొలత్రాటికిబట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
యా పతకముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
యా పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్ర
జగన్మోహన సంకెళ్లు వేసిరి కాళ్లకు రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

కలికి తురాయి నీకు మెరుపుగ జేయిస్తే రామచంద్ర
నీవు కులుకుచు దిరిగెదవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

మీ తండ్రి దశరధమహారాజు పెట్టెనా రామచంద్ర
లేక మీ మామ జనక మహారాజు పంపైనా రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

అబ్బ తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
యీ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

ఏటికి చల్లిన నీళ్లాయె నా బ్రతుకు రామచంద్ర
నేను అథమురాలికంటె నన్యాయమైతిని రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

సర్కారు పైకము తృణముగ నెంచక రామచంద్ర
దెబ్బలు తినలేను యప్పుదీర్చుమయ్య రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

కౌసల్య పుత్రుడ దశరథ తనయుడ రామచంద్ర
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్ర

॥ఇక్ష్వాకు॥

భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్ర
నీవు క్షేమముగ శ్రీరామదాసుని నేలుము రామచంద్ర

॥ఇక్ష్వాకు॥

5. వరాళి ఆదితాళం

పల్లవి : ఏడనున్నాడో భద్రాద్రివాసు డేడ నున్నాడో
నాపాలి రాముడేడ నున్నాడో

||ఏడ||

ఏడనున్నాడో గాని జాడ తెలియలేదు
నాడు గజేంద్రుని కీడుబాపిన స్వామి

||ఏడ||

ద్రౌణీబాణ జ్వాలదాకిన బాలకునికి
ప్రాణమిచ్చిన జగత్రాణ రక్షకుడు

||ఏడ||

పాంచాలి సభలోన భంగమొందిననాడు
వంచనలేకను వలువలిచ్చిన తండ్రి

||ఏడ||

దుర్వాసు డుగ్రమున ధర్మసుతుని జూడ
నిర్వహించిన నవనీత చోరకుడు

||ఏడ||

అక్షయముగ శ్రీ భద్రాచలమందున
సాక్షాత్కరించిన జగదేకవీరుడు

||ఏడ||

6. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి :ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా

చరణములు :
శ్రీరఘునందన సీతారమణా శ్రితిజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా

॥ఏ తీరుగ॥

మురిపెముతో నా స్వామిని నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచ నేమరుగు జొచ్చితిని రామా

॥ఏ తీరుగ॥

క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవే దైవశిఖామణి రామా

॥ఏ తీరుగ॥

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబనీ యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా

॥ఏ తీరుగ॥

తాండవమున కఖిలాండకోటి బ్రహ్మాండనాయకా రామా
భండనమున నీ నామము దలచిన బ్రహ్మానందము రామా

॥ఏ తీరుగు॥

వాసవకమలభవ సురవందిత వారధిబంధన రామా
సార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘురామా

॥ఏ తీరుగ॥

వాసవనుత రామదాస పోషకవందన మయోధ్యరామా
భాసురవద సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

॥ఏ తీరుగ॥

7. కల్యాణిరాగము రూపకతాళము

పల్లవి :ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ తెలియవశమా
కామారి వినుతగుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్న తండ్రి రామా
సుతుడనుచు కవులు క్షితినాథుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతితపావనుడనుచు
మతి తెలియలేరైరి.

॥ఏమయ్య॥

చెలిమి కొడవనుచు పాండవులు నిజ
విరోధివటంచు నల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరి గాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి

॥ఏమయ్య॥

నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడవనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

॥ఏమయ్య॥

8. పున్నాగరావళి చాపుతాళం

పల్లవి : ఏల దయరాదో రామయ్య నీకేల దయరాదో
మీ మేలుకై పాటుబడితిని యేల మీ భండము చాలుచాలును

॥ఏల॥

చరణములు
బ్రహ్మ గూర్పగదే అహోవరబ్రహ్మకావగదే
బ్రహ్మజనక భవ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మానందము పాలైనారట

॥ఏల॥

పాపములచేత రామయ్య నేనోపలేను గదే
శ్రీభూపతి యే ప్రాపులేక నీ ప్రాపేగోరితి ఘోరరూపయిక

॥ఏల॥

తలపగడాల ఆనందభాష్పములూరెగదె
నీలినీరదనిభకోమలరూప భద్రశైలవాస రామదాసునేలగ

॥ఏల॥

9. నాదనామక్రియ ఏకతాళం

పల్లవి : కోదండరామ కోదండరామ కోదండరామ కోదండరామ
నీదండనాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు

॥కోదండ॥

శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరోగ్యమిమ్ము

॥కోదండ॥

జయరఘువీర జగదేకవీర భయనివార భక్తమందార

॥కోదండ॥

మణిమయభూష మంజులభాష రణజయ ఘోష రమణీయ వేష

॥కోదండ॥

ఏలరావయ్య యేమందునయ్య పాలింపవయ్య ప్రౌడిగనయ్య

॥కోదండ॥

తండ్రివి నీవే తల్లివి నీవే దాతవు నీవే దైవము నీవే

॥కోదండ॥

అద్భుత కుండలామలదండ సద్గుణదండ సమర ప్రచండ

॥కోదండ॥

సరసిజనేత్ర సౌందర్యగాత్ర పరమపవిత్ర భవ్యచరిత్ర

॥కోదండ॥

నీబుద్ధి వీడు ఎరుగనివాడు పాపడువీడు బడలియున్నాడు

॥కోదండ॥

పాపనులేపి ప్రజలనుగల్పి యాపదబాపి యటు ప్రీతిజూపి

॥కోదండ॥

నమ్మిన చిన్నవాడెందున నున్న మమ్ములగన్న మాయన్న వన్న

॥కోదండ॥

ఎవరు మీతోటి ఎవరు మీసాటిరారు మీపాటి రాజులమేటి

॥కోదండ॥

దశరథబాలదాసావన దశముఖకాల ధరణీశపాల

॥కోదండ॥

మారుతభీమ మాల్యాభిరామ కల్యాణనామ కారుణ్యధామ

॥కోదండ॥

మంజులభాష మణిమయభూష కుంజరపోష కువలయవేష

॥ కోదండ॥

పుట్టింప నీవే పోషింప నీవే కులమియ్య నీవే భాగ్యము నీవే

॥కోదండ॥

శరణన్న చోట క్షమచేయుమాట బిరుదునీదౌట నెరిగిన మాట

॥కోదండ॥

రామయ్యవీని రక్షింతుగాని సేవచేసేవాని సుతుడుగానీ

॥కోదండ॥

మురళీవిలోల మునిజనపాల తులసీవనమాల తుంబురలోల

॥ కోదండ॥

రావణభంగ రమణీయాంగ మందరోద్దార మౌక్తికహార

॥ కోదండ॥

వందనమయ్య వాదేలనయ్య దండనసేయ తగదు మీకయ్య

॥కోదండ||

లాలితహాసలక్ష్మివిలాస పాలితదాస భద్రిద్రివాస

॥ కోదండ॥

శ్రీవిజయరామ శ్రీతులసిరామ పావనరామ భద్రాద్రిరామ

॥ కోదండ॥

10. యమునా కల్యాణి ఆదితాళం

పల్లవి : గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమపురుష ఏ వెరవులేక నీ మరుగుజొచ్చితిని
అరమర సేయక

॥గరుడ॥

పిలువగానేరమ్మి అభయము తలపగానెయిమ్మి
కలిమిబలిమి నాకలలో నీవని పలవరించిన నన్ను గన్నయ్య

॥గరుడ॥

పాలకడలిశయనా దశరథబాల జలజనయనా
పాలముంచిన నీటముంచిన నీపాలబడితిని జాలము సేయక

॥గరుడ॥

ఏలరావు స్వామి నను నిపుడేలుకోవదేమి
ఏలువాడవని చాలనమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి

॥గరుడ॥

ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాళ
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతిపై రక్షింపుము

॥గరుడ॥

మరిన్ని కీర్తనలు:

Ayodhya Kanda Sarga 56 In Telugu | అయోధ్యాకాండ షట్పంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 56 In Telugu

అయోధ్యా కాండ సర్గ 56 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.

చిత్రకూటనివాసః

అథ రాత్ర్యాం వ్యతీతాయామవసుప్తమనంతరమ్ |
ప్రబోధయామాస శనైః లక్ష్మణం రఘునందనః ||

1

సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనమ్ |
సంప్రతిష్ఠామహే కాలః ప్రస్థానస్య పరంతప ||

2

స సుప్తః సమయే భ్రాత్రా లక్ష్మణః ప్రతిబోధితః |
జహౌ నిద్రాం చ తంద్రీం చ ప్రసక్తం చ పథిశ్రమమ్ ||

3

తతౌత్థాయ తే సర్వే స్పృష్ట్వా నద్యాః శివం జలమ్ |
పంథానమృషిణాఽఽదిష్టం చిత్రకూటస్య తం యయుః ||

4

తతః సంప్రస్థితః కాలే రామః సౌమిత్రిణా సహ |
సీతాం కమల పత్రాక్షీమిదం వచనమబ్రవీత్ ||

5

ఆదీప్తానివ వైదేహి సర్వతః పుష్పితాన్నగాన్ |
స్వైః పుష్పైః కింశుకాన్ పశ్య మాలినః శిశిరాత్యయే ||

6

పశ్య భల్లాతకాన్ ఫుల్లాన్ నరైః అనుపసేవితాన్ |
ఫల పత్రైః అవనతాన్ నూనం శక్ష్యామి జీవితుమ్ ||

7

పశ్య ద్రోణప్రమాణాని లంబమానాని లక్ష్మణ |
మధూని మధుకారీభిః సంభృతాని నగే నగే ||

8

ఏష క్రోశతి నత్యూహస్తం శిఖీ ప్రతికూజతి |
రమణీయే వనోద్దేశే పుష్పసంస్తరసంకటే ||

9

మాతంగయూథానుసృతం పక్షి సంఘానునాదితమ్ |
చిత్రకూటమిమం పశ్య ప్రవృద్ధశిఖరం గిరిమ్ ||

10

సమభూమితలే రమ్యే ద్రుమైర్బహుభిరావృతే |
పుణ్యే రంస్యామహే తాత చిత్రకూటస్య కాననే ||

11

తతస్తౌ పాదచారేణ గచ్ఛంతౌ సహ సీతయా |
రమ్యమాసేదతుః శైలం చిత్రకూటం మనోరమమ్ ||

12

తం తు పర్వతమాసాద్య నానాపక్షిగణాయుతమ్ |
బహుమూలఫలం రమ్యం సంపన్నం సరసోదకమ్ ||

13

మనోజ్ఞోఽయం గిరిః సౌమ్య నానాద్రుమలతాయతః |
బహుమూలఫలో రమ్యః స్వాజీవః ప్రతిభాతి మే ||

14

మునయశ్చ మహాత్మానో వసంత్యస్మిన్ శిలోచ్చయే |
అయం వాసో భవేత్తావదత్ర సౌమ్య రమేమహి ||

15

ఇతి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలిః |
అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకి మభివాదయన్ ||

16

తాన్మహర్షిః ప్రముదితః పూజయామాస ధర్మవిత్ |
ఆస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్య చ ||

17

తతోఽబ్రవీన్మహాబాహుర్లకమణం లక్ష్మణాగ్రజః |
సంనివేద్య యథాన్యాయమాత్మానమృషయే ప్రభుః ||

18

లక్ష్మణానయ దారూణి దృఢాని చ వరాణి చ |
కురుష్వావసథం సౌమ్య వాసే మే అభిరతం మనః ||

19

తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిర్వివిధాన్ ద్రుమాన్ |
ఆజహార తతశ్చక్రే పర్ణశాలామరిందమః ||

20

తాం నిష్ఠితాం బద్ధకటాం దృష్ట్వా రమః సుదర్శనామ్ |
శుశ్రూషమాణమేకాగ్రమిదం వచనమబ్రవీత్ ||

21

ఐణేయం మాంసమాహృత్య శాలాం యక్ష్యామహే వయమ్ |
కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః ||

22

మృగం హత్వాఽఽనయ క్షిప్రం లక్ష్మణేహ శుభేక్షణ |
కర్తవ్యః శాస్త్రదృష్టో హి విధిర్ధర్మమనుస్మర ||

23

భ్రాతుర్వచన మాజ్ఞాయ లక్ష్మణః పరవీరహా |
చకార స యథోక్తం చ తం రామః పునరబ్రవీత్ ||

24

ఐణేయం శ్రపయస్వైతచ్ఛాలాం యక్ష్యమహే వయమ్ |
త్వరసౌమ్య ముహూర్తోఽయం ధ్రువశ్చ దివసోఽప్యయమ్ ||

25

స లక్ష్మణః కృష్ణమృగం హత్వా మేధ్యం ప్రతాపవాన్ |
అథ చిక్షేప సౌమిత్రిః సమిద్ధే జాతవేదసి ||

26

తం తు పక్వం సమాజ్ఞాయ నిష్టప్తం ఛిన్న శోణితమ్ |
లక్ష్మణః పురుషవ్యాఘ్రమథ రాఘవమబ్రవీత్ ||

27

అయం కృష్ణః సమాప్తాంగః శృతః కృష్ణమృగే యథా |
దేవతాం దేవసంకాశ యజస్వ కుశలో హ్యసి ||

28

రామః స్నాత్వా తు నియతః గుణవాన్ జప్యకోవిదః |
సంగ్రహేణాకరోత్సర్వాన్ మంత్రాన్ సత్రావసానికాన్ ||

29

ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశావసథం శుచిః |
బభూవ చ మనోహ్లాదో రామస్యామితతేజసః ||

30

వైశ్వదేవబలిం కృత్వా రౌద్రం వైష్ణవమేవ చ |
వాస్తుసంశమనీయాని మంగళాని ప్రవర్తయన్ ||

31

జపం చ న్యాయతః కృత్వా స్నాత్వా నద్యాం యథావిధి |
పాప సంశమనం రామశ్చకార బలిముత్తమమ్ ||

32

వేదిస్థలవిధానాని చైత్యాన్యాయతనాని చ |
ఆశ్రమస్యానురూపాణి స్థాపయామాస రాఘవః ||

33

వన్యైర్మాల్యైః ఫలైర్మూలైః పక్వైర్మామ్సైర్యథావిధి |
అద్భిర్జపైశ్చ వేదోక్తైర్ధర్భైశ్చ ససమిత్కుశైః ||

34

తౌ తర్పయిత్వా భూతాని రాఘవౌ సహ సీతయా |
తదా వివిశతుః శాలాం సుశుభాం శుభలక్షణౌ ||

35

తాం వృక్షపర్ణచ్ఛదనాం మనోజ్ఞాం
యథా ప్రదేశం సుకృతాం నివాతామ్ |
వాసాయ సర్వే వివిశుః సమేతాః
సభాం యథా దేవగణాః సుధర్మామ్ ||

36

అనేకనానామృగపక్షిసంకులే
విచిత్రపుష్పస్తబకైర్ద్రుమైః యుతే |
వనోత్తమే వ్యాలమృగానునాదితే
తథా విజహ్రుః సుసుఖం జితేంద్రియాః ||

37

సురమ్యమాసాద్య తు చిత్రకూటం
నదీం చ తాం మాల్యవతీం సుతీర్థామ్ |
ననంద హృష్టః మృగ పక్షిజుష్టాం
జహౌ చ దుఃఖం పురవిప్రవాసాత్ ||

38

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్పంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 56 Meaning In Telugu

మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. “లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు.

రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.

“లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు.

వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా!మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకొని వచ్చి కుటీరము నిర్మించు.” అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. “లక్ష్మణా! మనకు ఈ పర్ణశాలలో చాలాకాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి. వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము.

కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు.” అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొనివచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేసాడు. “రామా! లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీసిద్ధం చేసాను.ఇంక పూజకు ఉపక్రమించండి.” అని అన్నాడు లక్ష్మణుడు.

రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ,వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేసాడు. దేవతల నందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేసాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు.

లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసముసేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ, ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్ధములు సేకరిస్తూ, వాటిని తింటూ, ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తపంచాశః సర్గః (౫౭) >>

Ayodhya Kanda Sarga 82 In Telugu – అయోధ్యాకాండ ద్వ్యశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 82 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ 82వ సర్గ, “సేనాప్రస్థాపనమ్”, రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడిని తిరిగి తీసుకురావడానికి వనానికి సేనను ప్రస్థానిస్తాడు. భరతుడు తన సైన్యంతో సహా, రాముడు ఉంటున్న అరణ్యానికి బయలుదేరతాడు. ఈ సర్గ భరతుడి ధైర్యం, రాముడి పట్ల అతని అపారమైన ప్రేమ, మరియు రాముడు తిరిగి రావాలని కోరుకునే భరతుడి పట్టుదలను స్పష్టంగా చూపిస్తుంది. సేనాప్రస్థాపన సందర్భంలో, భరతుడు తన సైన్యానికి మార్గదర్శకత్వం చేస్తూ, రాముడి సేవలో ఉండడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఈ సర్గ భరతుడి విధేయత, ధర్మపరాయణత, మరియు కుటుంబ ప్రేమను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తుంది.

సేనాప్రస్థాపనమ్

తామార్యగణసంపూర్ణాం భరతః ప్రగ్రహాం సభామ్ |
దదర్శ బుద్ధి సంపన్నః పూర్ణచంద్రో నిశామివ ||

1

ఆసనాని యథాన్యాయమార్యాణాం విశతాం తదా |
వస్త్రాంగరాగప్రభయా ద్యోతితా సా సభోత్తమా ||

2

సా విద్వజ్జనసంపూర్ణా సభా సురుచిరా తదా |
అదృశ్యత ఘనాపాయే పూర్ణచంద్రేవ శర్వరీ ||

3

రాజ్ఞస్తు ప్రకృతీః సర్వాః సమగ్రాః ప్రేక్ష్య ధర్మవిత్ |
ఇదం పురోహితః వాక్యం భరతం మృదు చాబ్రవీత్ ||

4

తాత రాజా దశరథః స్వర్గతర్ధర్మమాచరన్ |
ధనధాన్యవతీం స్ఫీతాం ప్రదాయ పృథివీం తవ ||

5

రామస్తథా సత్యధృతిః సతాం ధర్మమనుస్మరన్ |
నాజహాత్పితురాదేశం శశీ జ్యోత్స్నామివోదితః ||

6

పిత్రా భ్రాత్రా చ తే దత్తం రాజ్యం నిహతకణ్టకమ్ |
తద్భుంక్ష్వ ముదితామాత్యః క్షిప్రమేవాభిషేచయ ||

7

ఉదీచ్యాశ్చ ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ కేవలాః |
కోట్యాపరాంతాః సాముద్రా రత్నాన్యభిహరంతు తే ||

8

తచ్ఛ్రుత్వా భరతః వాక్యం శోకేనాభిపరిప్లుతః |
జగామ మనసా రామం ధర్మజ్ఞో ధర్మకాంక్షయా ||

9

స బాష్ప కలయా వాచా కలహంస స్వరః యువా |
విలలాప సభామధ్యే జగర్హే చ పురోహితమ్ ||

10

చరిత బ్రహ్మచర్యస్య విద్యాస్నాతస్య ధీమతః |
ధర్మే ప్రయతమానస్య కో రాజ్యం మద్విధో హరేత్ ||

11

కథం దశరథాజ్ఞాతః భవేద్రాజ్యాపహారకః |
రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తుమిహార్హసి ||

12

జ్యేష్ఠః శ్రేష్ఠశ్చ ధర్మాత్మా దిలీపనహుషోపమః |
లబ్ధుమర్హతి కాకుత్స్థో రాజ్యం దశరథో యథా ||

13

అనార్య జుష్టమస్వర్గ్యం కుర్యాం పాపమహం యది |
ఇక్ష్వాకూణామహం లోకే భవేయం కులపాంసనః ||

14

యద్ధి మాత్రా కృతం పాపం నాహం తదపిరోచయే |
ఇహస్థో వనదుర్గస్థం నమస్యామి కృతాంజలిః ||

15

రామమేవానుగచ్ఛామి స రాజా ద్విపదాం వరః |
త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవో ||

16

తద్వాక్యం ధర్మసంయుక్తం శ్రుత్వా సర్వే సభాసదః |
హర్షాన్ముముచురశ్రూణి రామే నిహితచేతసః ||

17

యది త్వార్యం న శక్ష్యామి వినివర్తయితుం వనాత్ |
వనే తత్రైవ వత్స్యామి యథాఽర్యో లక్ష్మణస్తథా ||

18

సర్వోపాయం తు వర్తిష్యే వినివర్తయితుం బలాత్ |
సమక్షమార్య మిశ్రాణాం సాధూనాం గుణవర్తినామ్ ||

19

విష్టికర్మాంతికాః సర్వే మార్గశోధకరక్షకాః |
ప్రస్థాపితా మయా పూర్వం యాత్రాఽపి మమ రోచతే ||

20

ఏవముక్త్వా తు ధర్మాత్మా భరతః భ్రాతృవత్సలః |
సమీపస్థమువాచేదం సుమంత్రం మంత్రకోవిదమ్ ||

21

తూర్ణముత్థాయ గచ్ఛ త్వం సుమంత్ర మమ శాసనాత్ |
యాత్రామాజ్ఞాపయ క్షిప్రం బలం చైవ సమానయ ||

22

ఏవముక్తః సుమంత్రస్తు భరతేన మహాత్మనా |
హృష్టస్తదాదిశత్సర్వం యథాసందిష్టమిష్టవత్ ||

23

తాః ప్రహృష్టాః ప్రకృతయో బలాధ్యక్షా బలస్య చ |
శ్రుత్వా యాత్రాం సమాజ్ఞప్తాం రాఘవస్య నివర్తనే ||

24

తతః యోధాంగనాః సర్వా భర్త్రూన్ సర్వాన్ గృహే గృహే |
యాత్రా గమనమాజ్ఞాయ త్వరయంతి స్మ హర్షితాః ||

25

తే హయైర్గోరథైః శీఘ్రైః స్యందనైశ్చ మహాజవైః |
సహయోధైః బలాధ్యక్షాః బలం సర్వమచోదయన్ ||

26

సజ్జం తు తద్బలం దృష్ట్వా భరతః గురుసన్నిధౌ |
రథం మే త్వరయస్వేతి సుమంత్రం పార్శ్వతోఽబ్రవీత్ ||

27

భరతస్య తు తస్యాజ్ఞాం ప్రతిగృహ్య చ హర్షితః |
రథం గృహీత్వా ప్రయయౌ యుక్తం పరమవాజిభిః ||

28

స రాఘవః సత్యధృతిః ప్రతాపవాన్
బ్రువన్ సుయుక్తం దృఢసత్యవిక్రమః |
గురుం మహారణ్యగతం యశస్వినమ్
ప్రసాదయిష్యన్భరతోఽబ్రవీత్తదా ||

29

తూర్ణం సముత్థాయ సుమంత్ర గచ్ఛ
బలస్య యోగాయ బలప్రధానాన్ |
ఆనేతుమిచ్ఛామి హి తం వనస్థమ్
ప్రసాద్య రామం జగతః హితాయ ||

30

స సూతపుత్రః భరతేన సమ్యక్
ఆజ్ఞాపితః సంపరిపూర్ణకామః |
శశాస సర్వాన్ప్రకృతి ప్రధానాన్
బలస్య ముఖ్యాంశ్చ సుహృజ్జనం చ ||

31

తతః సముత్థాయ కులే కులే తే
రాజన్యవైశ్యా వృషలాశ్చ విప్రాః |
అయూయుజన్నుష్ట్రరథాన్ ఖరాంశ్చ
నాగాన్ హయాంశ్చైవ కులప్రసూతాన్ ||

32

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వ్యశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga 82 Meaning In Telugu

రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు.

‘రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు.” అని పలికాడు వసిష్ఠుడు.

అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. “కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా అభిప్రాయము. నా తండ్రి దశరథుడు ఈ రాజ్యమునకు అధినేత. ఆయన మరణానంతరము ఆయన పెద్దకుమారుడు రాముడు ఈ రాజ్యమునకు అధినేత. రామునికి తప్ప వేరెవ్వరికీ ఈ రాజ్యము మీద అర్హత లేదు. ఇప్పుడు నేను అయోధ్యకు పట్టాభిషిక్తుడను అయితే అంత కన్నా మహాపాపము వేరొకటి ఉండదు. ఆ పాపము చేసి నేను ఇక్ష్వాకువంశమునకు కళంకము తీసుకు రాలేను. నా తల్లి చేసిన పాప కార్యములో నేను పాలుపంచుకోలేను. నా అన్న రామునికి ఇక్కడి నుండి నమస్కారము చేయుచున్నాను. రాముని బదులు నా తల్లి కోరిక నేను తీర్చెదను. రామునికి పట్టాభిషేకము చేసి ఆయన బదులు నేను వనవాసము చేసెదను. ఇది నానిర్ణయము.” అని పలికాడు భరతుడు.

భరతుని నిర్ణయానికి సభలో ఉన్న వారందరూ జయజయధ్వానాలు చేసారు. భరతుడు ఇంకా తన ప్రసంగము కొనసాగించాడు.

“మీ అందరి సహకారంతో నేను ఎలాగైనా రాముని అయోధ్యకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాను. ఒక వేళ రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి రాకపోతే, నేను కూడా లక్ష్మణునితో పాటు అడవులలోనే ఉంటాను. రాముని వద్దకు వెళ్లుటకు నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. సుమంత్రా! నీవు వెళ్లి రాముని వద్దకు పోవుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా వెంట సైన్యము కూడా రావలెను. రాముని రాజలాంఛనములతో అయోధ్యకు తీసుకురావలెను. వెంటనే నా రథమును కూడా సిద్ధము చెయ్యి ” అని అన్నాడు.

భరతుని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రధము సిద్ధము చేసాడు. సైన్యాధ్యక్షులు తమ తమ అధీనములో ఉన్న సైన్యములను ప్రయాణానికి సమాయత్తం చేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

అయోధ్యాకాండ త్ర్యశీతితమః సర్గః (83) >>

Ayodhya Kanda Sarga 81 In Telugu – అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 81 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గ, “సభాస్తానమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత, అయోధ్యను ఎలా పాలించాలో నిర్ణయించడానికి రాజసభలో సమావేశం నిర్వహిస్తాడు. భరతుడు, రాముడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమను మరియు విధేయతను ప్రతిబింబిస్తూ, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తనను తాను ప్రతినిధిగా ప్రకటిస్తాడు. ఈ సర్గలో, భరతుడు తన ధర్మాన్ని, భక్తిని, మరియు రాముడి పట్ల ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తూ, ప్రజలతో పాటు తన సామంతులను మరియు రాజకుటుంబాన్ని చర్చించుకుంటాడు. ఈ సంఘటన భరతుడి వినయం, విధేయత, మరియు నిస్వార్థతను హృదయానికి హత్తుకునేలా చూపుతుంది.

సభాస్తానమ్

తతో నాందీముఖీం రాత్రిం భరతం సూతమాగధాః |
తుష్టువుర్వాగ్విశేషజ్ఞాః స్తవైః మంగళసంహితైః ||

1

సువర్ణ కోణాభిహతః ప్రాణదద్యామదుందుభిః |
దధ్ముః శంఖాంశ్చ శతశో నాదాంశ్చోచ్చావచస్వరాన్ ||

2

స తూర్యఘోషః సుమహాన్ దివమాపూరయన్నివ |
భరతం శోకసంతప్తం భూయః శోకైరరంధ్రయత్ ||

3

తతః ప్రబుద్ధో భరతస్తం ఘోషం సంనివర్త్య చ |
నాహం రాజేతి చాప్యుక్త్వా శత్రుఘ్నమిదమబ్రవీత్ ||

4

పశ్య శత్రుఘ్న కైకేయ్యా లోకస్యాపకృతం మహత్ |
విసృజ్య మయి దుఃఖాని రాజా దశరథో గతః ||

5

తస్యైషా ధర్మరాజస్య ధర్మమూలా మహాత్మనః |
పరిభ్రమతి రాజశ్రీః నౌరివాకర్ణికా జలే ||

6

యో హి నః సుమహాన్నాథః సోఽపి ప్రవ్రాజితో వనమ్ |
అనయా ధర్మముత్సృజ్య మాత్రా మే రాఘవః స్వయమ్ ||

7

ఇత్యేవం భరతం ప్రేక్ష్య విలపంతం విచేతనమ్ |
కృపణం రురుదుః సర్వాః సస్వరం యోషితస్తదా ||

8

తథా తస్మిన్విలపతి వసిష్ఠో రాజధర్మవిత్ |
సభామిక్ష్వాకునాథస్య ప్రవివేశ మహాయశాః ||

9

శాతకుంభమయీం రమ్యాం మణిరత్నసమాకులామ్ |
సుధర్మామివ ధర్మాత్మా సగణః ప్రత్యపద్యత ||

10

స కాంచనమయం పీఠం సుఖాస్తరణసంవృతమ్ |
అధ్యాస్త సర్వవేదజ్ఞో దూతాననుశశాస చ ||

11

బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ అమాత్యాన్ గణవల్లభాన్ |
క్షిప్రమానయతావ్యగ్రాః కృత్యమాత్యయికం హి నః ||

12

సరాజభృత్యం శత్రుఘ్నం భరతం చ యశస్వినమ్ |
యుధాజితం సుమంత్రం చ యే చ తత్ర హితా జనాః ||

13

తతః హలహలాశబ్దో మహాన్సముదపద్యత |
రథైరశ్వైః గజైశ్చాపి జనానాముపగచ్ఛతామ్ ||

14

తతః భరతమాయాంతం శతక్రతుమివామరాః |
ప్రత్యనందన్ ప్రకృతయో యథా దశరథం తథా ||

15

హ్రదైవ తిమినాగసంవృతః
స్తిమితజలో మణిశంఖశర్కరః |
దశరథసుతశోభితా సభా
సదశరథేవ బభౌ యథా పురా ||

16

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga Meaning 81 In Telugu

దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వరోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగథులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపు తున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుఃఖము ఎక్కువ అయింది.

“ఆపండి. నేను రాజును కాను.” అని గట్టిగా అరిచాడు.

అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు.

“శత్రుఘ్నా! చూచావా. కైక వలన ఎంతటి అనర్ధము వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.’ అని రోదిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే వసిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేసాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారినీ, అమాత్యులనూ, పురప్రముఖులను, గణాధ్యక్షులను, సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనములమీద కూర్చున్నారు. తరువాత వసిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకొని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు, శత్రుఘ్ను సమేతంగా వచ్చిసభలో కూర్చున్నాడు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదములు తెలియ జేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వ్యశీతితమః సర్గః (82) >>

Aranya Kanda Sarga 11 In Telugu – అరణ్యకాండ ఏకాదశః సర్గః

Aranya Kanda Sarga 11 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” ఏకాదశః సర్గలో, రాముడు సరస్సు దాటి వస్తాడు, దాని నుండి దివ్య సంగీతం వినిపిస్తుంది. సరస్సు యొక్క నీటి క్రింద నుండి సంగీత స్వరాలను చూసి ఆశ్చర్యపోయిన అతను అనుసరిస్తున్న ఋషిని విచారించాడు మరియు ఆ ఋషి ఋషి మందకర్ణి యొక్క ఘట్టాన్ని వివరిస్తాడు.

అగస్త్యాశ్రమః

అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా |
పృష్ఠతస్తు ధనుష్పాణిర్లక్ష్మణోఽనుజగామ హ ||

1

తౌ పశ్యమానౌ వివిధాన్ శైలప్రస్థాన్వనాని చ |
నదీశ్చ వివిధా రమ్యా జగ్మతుః సీతయా సహ ||

2

సారసాంశ్చక్రవాకాంశ్చ నదీపులినచారిణః |
సరాంసి చ సపద్మాని యుక్తాని జలజైః ఖగైః ||

3

యూథబద్ధాంశ్చ పృషతాన్మదోన్మత్తాన్విషాణినః |
మహిషాంశ్చ వరాహాంశ్చ నాగాంశ్చ ద్రుమవైరిణః ||

4

తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే |
దదృశుః సహితా రమ్యం తటాకం యోజనాయతమ్ ||

5

పద్మపుష్కరసంబాధం గజయూథైరలంకృతమ్ |
సారసైర్హంసకాదంబైః సంకులం జలచారిభిః ||

6

ప్రసన్నసలిలే రమ్యే తస్మిన్సరసి శుశ్రువే |
గీతవాదిత్రనిర్ఘోషో న తు కశ్చన దృశ్యతే ||

7

తతః కౌతూహలాద్రామో లక్ష్మణశ్చ మహాబలః |
మునిం ధర్మభృతం నామ ప్రష్టుం సముపచక్రమే ||

8

ఇదమత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే |
కౌతూహలం మహజ్జాతం కిమిదం సాధు కథ్యతామ్ ||

9

వక్తవ్యం యది చేద్విప్ర నాతిగుహ్యమపి ప్రభో |
తేనైవముక్తో ధర్మాత్మా రాఘవేణ మునిస్తదా ||

10

ప్రభావం సరసః కృత్స్నమాఖ్యాతుముపచక్రమే |
ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలికమ్ ||

11

నిర్మితం తపసా రామ మునినా మాండకర్ణినా |
స హి తేపే తపస్తీవ్రం మాండకర్ణిర్మహామునిః ||

12

దశ వర్షసహస్రాణి వాయుభక్షో జలాశ్రయః |
తతః ప్రవ్యథితాః సర్వే దేవాః సాగ్నిపురోగమాః ||

13

అబ్రువన్వచనం సర్వే పరస్పరసమాగతాః |
అస్మాకం కస్యచిత్స్థానమేష ప్రార్థయతే మునిః ||

14

ఇతి సంవిగ్నమనసః సర్వే తే త్రిదివౌకసః |
తత్ర కర్తుం తపోవిఘ్నం దేవైః సర్వైర్నియోజితాః ||

15

ప్రధానాప్సరసః పంచ విద్యుత్సదృశవర్చసః | [చ్చలిత]
అప్సరోభిస్తతస్తాభిర్మునిర్దృష్టపరావరః ||

16

నీతో మదనవశ్యత్వం సురాణాం కార్యసిద్ధయే |
తాశ్చైవాప్సరసః పంచ మునేః పత్నీత్వమాగతాః ||

17

తటాకే నిర్మితం తాసామస్మిన్నంతర్హితం గృహమ్ |
తథైవాప్సరసః పంచ నివసంత్యో యథాసుఖమ్ ||

18

రమయంతి తపోయోగాన్మునిం యౌవనమాస్థితమ్ |
తాసాం సంక్రీడమానానామేష వాదిత్రనిఃస్వనః ||

19

శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహరః |
ఆశ్చర్యమితి తస్యైతద్వవచనం భావితాత్మనః ||

20

రాఘవః ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశాః |
ఏవం కథయమానస్య దదర్శాశ్రమమండలమ్ ||

21

కుశచీరపరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతమ్ |
ప్రవిశ్య సహ వైదేహ్యా లక్ష్మణేన చ రాఘవః ||

22

ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః |
తథా తస్మిన్స కాకుత్స్థః శ్రీమత్యాశ్రమమండలే ||

23

ఉషిత్వా తు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః |
జగామ చాశ్రమాంస్తేషాం పర్యాయేణ తపస్వినామ్ ||

24

యేషాముషితవాన్పూర్వం సకాశే స మహాస్త్రవిత్ |
క్వచిత్పరిదశాన్మాసానేకం సంవత్సరం క్వచిత్ ||

25

క్వచిచ్చ చతురో మాసాన్పంచషట్ చాపరాన్క్వచిత్ |
అపరత్రాధికం మాసాదప్యర్ధమధికం క్వచిత్ ||

26

త్రీన్ మాసానష్టమాసాంశ్చ రాఘవో న్యవసత్సుఖమ్ |
తథా సంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై ||

27

రమతశ్చానుకూల్యేన యయుః సంవత్సరా దశ |
పరివృత్య చ ధర్మజ్ఞో రాఘవః సహ సీతయా ||

28

సుతీక్ష్ణస్యాశ్రమం శ్రీమాన్పునరేవాజగామ హ |
స తమాశ్రమమాసాద్య మునిభిః ప్రతిపూజితః ||

29

తత్రాపి న్యవసద్రామః కించిత్కాలమరిందమః |
అథాశ్రమస్థో వినయాత్కదాచిత్తం మహామునిమ్ ||

30

ఉపాసీనః స కాకుత్స్థః సుతీక్ష్ణమిదమబ్రవీత్ |
అస్మిన్నరణ్యే భగవన్నగస్త్యో మునిసత్తమః ||

31

వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శ్రుతమ్ |
న తు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా ||

32

కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీమతః |
ప్రసాదాత్తత్రభవతః సానుజః సహ సీతయా ||

33

అగస్త్యమభిగచ్ఛేయమభివాదయితుం మునిమ్ |
మనోరథో మహానేష హృది మే పరివర్తతే ||

34

యదహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయమ్ |
ఇతి రామస్య స మునిః శ్రుత్వా ధర్మాత్మనో వచః ||

35

సుతీక్ష్ణః ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజమ్ |
అహమప్యేతదేవ త్వాం వక్తుకామః సలక్ష్మణమ్ ||

36

అగస్త్యమభిగచ్ఛేతి సీతయా సహ రాఘవ |
దిష్ట్యా త్విదానీమర్థేఽస్మిన్స్వయమేవ బ్రవీషి మామ్ ||

37

అహమాఖ్యామి తే వత్స యత్రాగస్త్యో మహామునిః |
యోజనాన్యాశ్రమాదస్మాత్తథా చత్వారి వై తతః ||

38

దక్షిణేన మహాంఛ్రీమానగస్త్యభ్రాతురాశ్రమః |
స్థలీప్రాయే వనోద్దేశే పిప్పలీవనశోభితే ||

39

బహుపుష్పఫలే రమ్యే నానాశకునినాదితే |
పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్నసలిలాః శివాః ||

40

హంసకారండవాకీర్ణాశ్చక్రవాకోపశోభితాః |
తత్రైకాం రజనీం వ్యుష్య ప్రభాతే రామ గమ్యతామ్ ||

41

దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః |
తత్రాగస్త్యాశ్రమపదం గత్వా యోజనమంతరమ్ ||

42

రమణీయే వనోద్దేశే బహుపాదపసంవృతే |
రంస్యతే తత్ర వైదేహీ లక్ష్మణశ్చ సహ త్వయా ||

43

స హి రమ్యో వనోద్దేశో బహుపాదపసంకులః |
యది బుద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిమ్ ||

44

అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః |
ఇతి రామో మునేః శ్రుత్వా సహ భ్రాత్రాఽభివాద్య చ ||

45

ప్రతస్థేఽగస్త్యముద్దిశ్య సానుజః సీతయా సహ |
పశ్యన్వనాని రమ్యాణి పర్వతాంశ్చాభ్రసన్నిభాన్ ||

46

సరాంసి సరితశ్చైవ పథి మార్గవశానుగాః |
సుతీక్ష్ణేనోపదిష్టేన గత్వా తేన పథా సుఖమ్ ||

47

ఇదం పరమసంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్ |
ఏతదేవాశ్రమపదం నూనం తస్య మహాత్మనః ||

48

అగస్త్యస్య మునేర్భ్రాతుర్దృశ్యతే పుణ్యకర్మణః |
యథా హి మే వనస్యాస్య జ్ఞాతాః పథి సహస్రశః ||

49

సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః |
పిప్పలీనాం చ పక్వానాం వనాదస్మాదుపాగతః ||

50

గంధోఽయం పవనోత్క్షిప్తః సహసా కటుకోదయః |
తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్ఠసంచయాః ||

51

లూనాశ్చ పథి దృశ్యంతే దర్భా వైడూర్యవర్చసః |
ఏతచ్చ వనమధ్యస్థం కృష్ణాభ్రశిఖరోపమమ్ ||

52

పావకస్యాశ్రమస్థస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే |
వివిక్తేషు చ తీర్థేషు కృతస్నాతా ద్విజాతయః ||

53

పుష్పోపహారం కుర్వంతి కుసుమైః స్వయమార్జితైః |
తత్సుతీక్ష్ణస్య వచనం యథా సౌమ్య మయా శ్రుతమ్ ||

54

అగస్త్యస్యాశ్రమో భ్రాతుర్నూనమేష భవిష్యతి |
నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా ||

55

యస్య భ్రాత్రా కృతేయం దిక్ఛరణ్యా పుణ్యకర్మణా |
ఇహైకదా కిల క్రూరో వాతాపిరపి చేల్వలః ||

56

భ్రాతరౌ సహితావాస్తాం బ్రాహ్మణఘ్నౌ మహాసురౌ |
ధారయన్బ్రాహ్మణం రూపమిల్వలః సంస్కృతం వదన్ ||

57

ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణః |
భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్తం మేషరూపిణమ్ ||

58

తాన్ద్విజాన్భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణా |
తతో భుక్తవతాం తేషాం విప్రాణామిల్వలోఽబ్రవీత్ ||

59

వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతా వదన్ |
తతో భ్రాతుర్వచః శ్రుత్వా వాతాపిర్మేషవన్నదన్ ||

60

భిత్త్వా భిత్త్వా శరీరాణి బ్రాహ్మణానాం వినిష్పతత్ |
బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభిః ||

61

వినాశితాని సంహత్య నిత్యశః పిశితాశనైః |
అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా ||

62

అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః |
తతః సంపన్నమిత్యుక్త్వా దత్త్వా హస్తోదకం తతః ||

63

భ్రాతరం నిష్క్రమస్వేతి చేల్వలః సోఽభ్యభాషత |
స తం తథా భాషమాణం భ్రాతరం విప్రఘాతినమ్ ||

64

అబ్రవీత్ప్రహసన్ధీమానగస్త్యో మునిసత్తమః |
కుతో నిష్క్రమితుం శక్తిర్మయా జీర్ణస్య రక్షసః ||

65

భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాదనమ్ |
అథ తస్య వచః శ్రుత్వా భ్రాతుర్నిధనసంశ్రయమ్ ||

66

ప్రధర్షయితుమారేభే మునిం క్రోధాన్నిశాచరః |
సోఽభిద్రవన్మునిశ్రేష్ఠం మునినా దీప్తతేజసా ||

67

చక్షుషాఽనలకల్పేన నిర్దగ్ధో నిధనం గతః |
తస్యాయమాశ్రమో భ్రాతుస్తటాకవనశోభితః ||

68

విప్రానుకంపయా యేన కర్మేదం దుష్కరం కృతమ్ |
ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ ||

69

రామస్యాస్తం గతః సూర్యః సంధ్యాకాలోఽభ్యవర్తత |
ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథావిధి ||

70

ప్రవివేశాశ్రమపదం తమృషిం సోఽభ్యవాదయత్ |
సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః ||

71

న్యవసత్తాం నిశామేకాం ప్రాశ్య మూలఫలాని చ |
తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే ||

72

భ్రాతరం తమగస్త్యస్య హ్యామంత్రయత రాఘవః |
అభివాదయే త్వాం భగవన్సుఖమధ్యుషితో నిశామ్ ||

73

ఆమంత్రయే త్వాం గచ్ఛామి గురుం తే ద్రష్టుమగ్రజమ్ |
గమ్యతామితి తేనోక్తో జగామ రఘునందనః ||

74

యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చావలోకయన్ |
నీవారాన్పనసాంస్తాలాంస్తిమిశాన్వంజులాన్ధవాన్ ||

75

చిరిబిల్వాన్మధూకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్ |
పుష్పితాన్పుష్పితాగ్రాభిర్లతాభిరనువేష్టితాన్ ||

76

దదర్శ రామః శతశస్తత్ర కాంతారపాదపాన్ |
హస్తిహస్తైర్విమృదితాన్వానరైరుపశోభితాన్ ||

77

మత్తైః శకునిసంఘైశ్చ శతశశ్చ ప్రణాదితాన్ |
తతోఽబ్రవీత్సమీపస్థం రామో రాజీవలోచనః ||

78

పృష్ఠతోఽనుగతం వీరం లక్ష్మణం లక్ష్మివర్ధనమ్ |
స్నిగ్ధపత్రా యథా వృక్షా యథా శాంతమృగద్విజాః ||

79 [క్షాంతా]

ఆశ్రమో నాతిదూరస్థో మహర్షేర్భావితాత్మనః |
అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా ||

80

ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంతశ్రమాపహః |
ప్రాజ్యధూమాకులవనశ్చీరమాలాపరిష్కృతః ||

81

ప్రశాంతమృగయూథశ్చ నానాశకునినాదితః |
నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా ||

82

దక్షిణా దిక్కృతా యేన శరణ్యా పుణ్యకర్మణా |
తస్యేదమాశ్రమపదం ప్రభావాద్యస్య రాక్షసైః ||

83

దిగియం దక్షిణా త్రాసాద్దృశ్యతే నోపభుజ్యతే |
యదాప్రభృతి చాక్రాంతా దిగియం పుణ్యకర్మణా ||

84

తదాప్రభృతినిర్వైరాః ప్రశాంతా రజనీచరాః |
నామ్నా చేయం భగవతో దక్షిణా దిక్ప్రదక్షిణా ||

85

ప్రథితా త్రిషు లోకేషు దుర్ధర్షా క్రూరకర్మభిః |
మార్గం నిరోద్ధుం నిరతో భాస్కరస్యాచలోత్తమః ||

86

నిదేశం పాలయన్యస్య వింధ్యః శైలో న వర్ధతే |
అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుతకర్మణః ||

87

అగస్త్యస్యాశ్రమః శ్రీమాన్వినీతజనసేవితః |
ఏష లోకార్చితః సాధుర్హితే నిత్యరతః సతామ్ ||

88

అస్మానభిగతానేష శ్రేయసా యోజయిష్యతి |
ఆరాధయిష్యామ్యత్రాహమగస్త్యం తం మహామునిమ్ ||

89

శేషం చ వనవాసస్య సౌమ్య వత్స్యామ్యహం ప్రభో |
అత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ||

90

అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే |
నాత్ర జీవేన్మృషావాదీ క్రూరో వా యది వా శఠః ||

91

నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః |
అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగైః సహ ||

92

వసంతి నియతాహారా ధర్మమారాధయిష్ణవః |
అత్ర సిద్ధా మహాత్మానో విమానైః సూర్యసన్నిభైః ||

93

త్యక్తదేహా నవైర్దేహైః స్వర్యాతాః పరమర్షయః |
యక్షత్వమమరత్వం చ రాజ్యాని వివిధాని చ ||

94

అత్ర దేవాః ప్రయచ్ఛంతి భూతైరారాధితాః శుభైః |
ఆగతాః స్మాశ్రమపదం సౌమిత్రే ప్రవిశాగ్రతః |
నివేదయేహ మాం ప్రాప్తమృషయే సీతయా సహ ||

95

Aranya Kanda Sarga 11 Meaning In Telugu PDF

ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు.

ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు.

“రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న ఐదుగురు అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు.

ఆ అప్సరసలు మాణ్ణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ ఐదుగురు
అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ ఐదుగురు అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్య ధ్వనులే మీరు వింటున్నారు.” అని అన్నాడు.

ఆ మాటలు విన్న రామలక్ష్మణులు సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశమములలో కొంత కాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంత కాలము నివసించాడు.

ఒక ఆశ్రమములో పది మాసములు, మరొక ఆశ్రమములో ఒక సంవత్సరము, మరొక ఆశ్రమములో నాలుగు మాసములు, ఐదు మాసములు, ఆరు మాసములు, ఒక మాసము, ఒకటిన్నర మాసము, మూడు మాసములు, ఎనిమిది మాసములు ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసిం చారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, అక్ష్మణుడు తమ వనవాస కాలములో పది సంవత్సరములు ఆనందంగాగడిపారు.

(దీనికి సంబంధించిన శ్లోకము ఇక్కడ ఉదహరిస్తాను. చదవండి.)
తదాసంవసతస్తస్య మునీనామాశ్రమేషు వై,
రమతశ్చానుకూల్యేన యయు: సంవత్సరా దశ.

ఆ విధంగారాముడు ఆశ్రమములలో నివసిస్తూ ఉండగా పది సంవత్సరములు అనుకూలంగా గడిచిపోయాయి. అంటే ఈ పదిసంవత్సరములు రాముడు ఒక్క రాక్షసుని కూడా చంపలేదు. మరి రాముడు మునులను రక్షిస్తాను అని వారికి ఇచ్చిన మాట ఏమైనట్టు. వారు రాక్షసుల చేతిలో అనుదినమూ బాధలు పడుతున్నారా! చస్తున్నారా! సీతను, లక్ష్మణుని అయినా వదులుకుంటాను కానీ నేను మునులకు ఇచ్చిన మాట తప్పను. అందుకే ధనుర్బాణాలు ధరించాను అన్న రాముడు వారి ఊసెత్తకుండా పది సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. కానీ వారి కష్టాలు బాధలు తీర్చలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?దీని అర్థం ఏమయి ఉంటుంది.

దీనికి సమాధానం మనకు ముప్పదవ సర్గలో కనిపిస్తుంది. రాముడు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఇష్టపడలేదు. ఒకేసారి రాక్షసులనందరినీ మట్టు పెట్టాలని అనుకున్నాడు. అదును కోసం వేచి ఉన్నాడు. శూర్పణఖ వల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం 14,000+5,000 సైనికులను ఖరుని, దూషణుని, త్రిశిరుని ఒకేసారి సంహరించి దండకారణ్యములో రాక్షస బాధను శాశ్వతంగా నివారించాడు. రాముడు తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసరం వేచిఉన్నాడు. ఇలా అర్థం చేసుకుంటే రాముని ఆంతర్యం మనకు అర్థం అవుతుంది.)

తరువాత ధర్మజ్ఞుడైన రాముడు, సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ, తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు.

ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. “మహాత్మా! అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలు కధలు గా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి.” అని ప్రార్థించాడు.

“రామా! మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి నాలుగు యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు (అగస్త్యభ్రాత) ఆశ్రమము కలదు.

(ఈ అగస్త్య భ్రాత గురించి మన ఇంట్లో పెద్ద వాళ్లకు తెలుసు. అగస్త్యుని సోదరునికి పేరు లేదు. అంతా అగస్త్య భ్రాత అంటారు. “వీడెవడో అగస్త్య భ్రాతలా ఉన్నాడే!” అని అనడం మనం వింటూ ఉంటాము. అగస్త్యభ్రాత అనేది ఒక నానుడి.)

రామా! నీవు అగస్త్య భ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లు. అగస్త్య భ్రాత ఆశ్రమము నకు ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది.” అని అన్నాడు.

తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలు దేరాడు. దక్షిణ దిశగా నాలుగు యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును చేరుకున్నారు.

ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నార చీరలు, చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్ని హోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో! సందేహము లేదు. ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము.

లక్ష్మణా! నీకు తెలుసా! అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు తాపసులకు వారికి ఎంతో ఉపకారము చేసాడు. ఎలాగంటే…..

ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొనేవాడు. “ ఈ రోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి” అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకొని వెళ్లేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారి పోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు.

బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత “వాతాపీ! బయటకు రా!” అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి, ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరేఅన్నాడు.

ఒక రోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేసాడు. “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ బ్రేవ్మంటూ త్రేన్చాడు. అంతే. అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు “వాతాపీ! బయటకు రా!’ అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు.

అగస్త్యుడు నవ్వాడు. “ఇంకెక్కడి వాతాపి. వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు.” అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేసాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేసాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత” అని వివరించాడు రాముడు.

(ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గు, పాలు పట్టిన తరువాత “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మా అబ్బాయి తాగిన పాలుజీర్ణం” అని పొట్ట మీద నిమురడం మనం చూస్తూ ఉంటాము.)

అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయంసంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేసారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు.

మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని అగస్త్యభ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్య భ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు.

ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హెూమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకొన్నాడు. అంతలోనే నారచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మృగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి.

“ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహా ముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు.

ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, ఈ క్రూరులకు, వంచకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి, స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇదీ ఆ ఆశ్రమ మహాత్మ్యం.

లక్ష్మణా! ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను, సీత మహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత ఓం తత్సత్.

అరణ్యకాండ ద్వాదశః సర్గః (12) >>

Balakanda Sarga 77 In Telugu – బాలకాండ సప్తసప్తతితమః సర్గః

BalaKanda Sarga 77 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిసప్తతితమః సర్గలో, పరశు రాముడు నిష్క్రమణ సమయంలో వివాహ బృందం అయోధ్యకు చేరుకుంటుంది. వివాహానికి ముందు వచ్చిన భరతుని మామ అయిన యుధాజిత్ ఇప్పుడు భరతుడు మరియు శత్రుఘ్నులను తన రాజ్యానికి తీసుకువెళతాడు. అప్పటి నుండి రామ, లక్ష్మణులు తమ తండ్రి కోరిక మేరకు వారి వారి సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. రాముడు మరియు సీత వారి ఆనందకరమైన వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారు.

అయోధ్యాప్రవేశః

గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః |
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకమ్ ||

1

అభివాద్య తతో రామో వసిష్ఠప్రముఖానృషీన్ |
పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందనః ||

2

జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ |
అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాథేన పాలితా ||

3

రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథః సుతమ్ |
బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవమ్ ||

4

గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః |
పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవ చ ||

5

చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీమ్ |
పతాకాధ్వజినీం రమ్యాం జయోద్ఘుష్టనినాదితామ్ ||

6 [తూర్య]

సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
రాజప్రవేశసుముఖైః పౌరైర్మంగళవాదిభిః ||

7

సంపూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైః సమలంకృతామ్ |
పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః ||

8

పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః |
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం ప్రియమ్ ||

9

ననంద సజనో రాజా గృహే కామైః సుపూజితః |
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా ||

10

వధూప్రతిగ్రహే యుక్తా యాశ్చాన్యా రాజయోషితః |
తతః సీతాం మహాభాగామూర్మిలాం చ యశస్వినీమ్ ||

11

కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః |
మంగలాలేపనైశ్చైవ శోభితాః క్షౌమవాససః ||

12

దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్ |
అభివాద్యాభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా ||

13

రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః |
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః ||

14

శుశ్రూషమాణాః పితరం వర్తయంతి నరర్షభాః |
కస్యచిత్త్వథ కాలస్య రాజా దశరథః సుతమ్ ||

15

భరతం కేకయీపుత్రమబ్రవీద్రఘునందనః |
అయం కేకయరాజస్య పుత్రో వసతి పుత్రక ||

16

త్వాం నేతుమాగతో వీర యుధాజిన్మాతులస్తవ |
శ్రుత్వా దశరథస్యైతద్భరతః కైకయీసుతః ||

17

గమనాయాభిచక్రామ శత్రుఘ్నసహితస్తదా |
ఆపృచ్ఛ్య పితరం శూరో రామం చాక్లిష్టకారిణమ్ ||

18

మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శత్రుఘ్నసహితో యయౌ |
గతే చ భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః ||

19

పితరం దేవసంకాశం పూజయామాసతుస్తదా |
పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః ||

20

చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ |
మాతృభ్యో మాతృకార్యాణి రామః పరమయంత్రితః ||

21 [కృత్వా]

గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత | [చకార హ]
ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తదా ||

22

రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః |
తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః ||

23

స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః |
రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్ ||

24

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి |
మనస్వీ తద్గతమనా నిత్యం హృది సమర్పితః ||

25

గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత |
తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే ||

26

అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా |
తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా |
దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ ||

27

తయా స రాజర్షిసుతోఽభిరామయా
సమేయివానుత్తమరాజకన్యయా |
అతీవ రామః శుశుభేఽతికామయా
విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః ||

28

Balakanda Sarga 77 In Telugu Pdf With Meaning

పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వసిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి ఇలాఅన్నాడు.

“తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి.” అని అన్నాడు.

అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్లి పోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుట పడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణము సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు.

వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు.

కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు,మాండవికి, శ్రుతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేసారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవచేసు కుంటూ ఉన్నారు.

కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు.

“నాయనా భరతా! నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకొని వెళ్లుటకు కేకయ రాజ్యము నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథిలలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగు చుండుట వలన వీలు కాలేదు. నీవు నీ తాత గారింటికి వెళ్లి ఆయనను సంతోష పెట్టు.” అని అన్నాడు.

భరతుడు తండ్రి మాట ప్రకారము చేసాడు. తండ్రికి తల్లులకు, పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు.

భరత శత్రుఘ్నులు వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రిగారికి సేవజేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సూ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు.

రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరు కున్నారు.

రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠము నందు నిలుపుకొనే వాడు.

సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యాను రాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసి పోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము.
బాలకాండము సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

వాల్మీకి రామాయణే అయోధ్యకాండ >>

Ayodhya Kanda Sarga 76 In Telugu – అయోధ్యాకాండ షట్సప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 76

అయోధ్యాకాండం యొక్క షట్సప్తతితమః సర్గంలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్రంగా దుఃఖిస్తూ తన గత పాపాలను తలుచుకుంటాడు. ఆయన కైకేయితో చేసిన వాగ్దానం ఫలితంగా రాముడు అడవికి వెళ్లిపోయినందుకు పశ్చాత్తాపంతో బాధపడతాడు. రాత్రిలో దశరథుడు కౌసల్య, సుమిత్రలతో తన బాధను పంచుకుంటాడు. దశరథుడు రాముని విడిచి ఉండలేక, ఆ వేదనతో అణచిపడి, తన ప్రాణాలను విడుస్తాడు. ఆయన చివరి క్షణాలలో రాముని మరియాదలను, అతని కరుణామయ స్వభావాన్ని తలుచుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు దశరథుని మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోతారు, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది.

దశరథౌర్ధ్వదైహికమ్

తమేవం శోకసంతప్తం భరతం కేకయీ సుతమ్ |
ఉవాచ వదతాం శ్రేష్ఠో వసిష్ఠః శ్రేష్ఠ వాగృషిః || ౧ ||

అలం శోకేన భద్రం తే రాజపుత్ర మహాయశః |
ప్రాప్తకాలం నరపతేః కురు సంయానముత్తమమ్ || ౨ ||

వసిష్ఠస్య వచః శృత్వా భరతర్ధారణాం గతః |
ప్రేతకార్యాణి సర్వాణి కారయామాస ధర్మవిత్ || ౩ ||

ఉద్ధృతం తైలసంరోదాత్ స తు భూమౌ నివేశితమ్ |
ఆపీతవర్ణవదనం ప్రసుప్తమివ భూపతిమ్ || ౪ ||

సంవేశ్య శయనే చాగ్ర్యే నానారత్నపరిష్కృతే |
తతర్దశరథం పుత్రః విలలాప సుదుఃఖితః || ౫ ||

కిం తే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యనాగతే |
వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలమ్ || ౬ ||

క్వ యాస్యసి మహారాజ హిత్వేమం దుఃఖితం జనమ్ |
హీనం పురుషసింహేన రామేణాక్లిష్ట కర్మణా || ౭ ||

యోగక్షేమం తు తే రాజన్ కోఽస్మిన్ కల్పయితా పురే |
త్వయి ప్రయాతే స్వస్తాత రామే చ వనమాశ్రితే || ౮ ||

విధవా పృథివీ రాజన్ త్వయా హీనా న రాజతే |
హీనచంద్రేవ రజనీ నగరీ ప్రతిభాతి మామ్ || ౯ ||

ఏవం విలపమానం తం భరతం దీనమానసమ్ |
అబ్రవీద్వచనం భూయో వసిష్ఠస్తు మహామునిః || ౧౦ ||

ప్రేత కార్యాణి యాన్యస్య కర్తవ్యాని విశాంపతేః |
తాన్యవ్యగ్రం మహాబాహో క్రియంతామవిచారితమ్ || ౧౧ ||

తథేతి భరతః వాక్యం వసిష్ఠస్యాభిపూజ్య తత్ |
ఋత్విక్ పురోహితాచార్యాన్ త్వరయామాస సర్వశః || ౧౨ ||

యే త్వగ్నయో నరేంద్రస్య చాగ్న్యగారాద్బహిష్కృతాః |
ఋత్విగ్భిర్యాజకైశ్చైవ తే హ్రియంతే యథావిధి || ౧౩ || [ఆహ్రియంత]

శిబికాయామథారోప్య రాజానం గతచేతనమ్ |
బాష్పకంఠా విమనసః తమూహుః పరిచారకాః || ౧౪ ||

హిరణ్యం చ సువర్ణం చ వాసాంసి వివిధాని చ |
ప్రకిరంతః జనా మార్గం నృపతేరగ్రతః యయుః || ౧౫ ||

చందనాగురునిర్యాసాన్ సరలం పద్మకం తథా |
దేవదారూణి చాహృత్య క్షేపయంతి తథాపరే || ౧౬ ||

గంధానుచ్చావచాంశ్చాన్యాన్ తత్ర గత్త్వాఽథ భూమిపమ్ |
తతః సంవేశయామాసుశ్చితా మధ్యే తమృత్విజః || ౧౭ ||

తథా హుతాశనం దత్వా జేపుస్తస్య తదృత్విజః |
జగుశ్చ తే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః || ౧౮ ||

శిబికాభిశ్చ యానైశ్చ యథాఽర్హం తస్య యోషితః |
నగరాన్నిర్యయుస్తత్ర వృద్ధైః పరివృతాస్తదా || ౧౯ ||

ప్రసవ్యం చాపి తం చక్రురృత్విజోఽగ్నిచితం నృపమ్ |
స్త్రియశ్చ శోకసంతప్తాః కౌసల్యా ప్రముఖాస్తదా || ౨౦ ||

క్రౌంచీనామివ నారీణాం నినాదస్తత్ర శుశ్రువే |
ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశః || ౨౧ ||

తతః రుదంత్యో వివశాః విలప్య చ పునః పునః |
యానేభ్యః సరయూతీరమ్ అవతేరుర్వరాంగనాః || ౨౨ ||

కృతోదకం తే భరతేన సార్ధమ్
నృపాంగనా మంత్రిపురోహితాశ్చ |
పురం ప్రవిశ్యాశ్రుపరీతనేత్రాః
భూమౌ దశాహం వ్యనయంత దుఃఖమ్ || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తతితమః సర్గః || ౭౬ ||

Ayodhya Kanda Sarga 76 Meaning In Telugu

మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. “నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దుఃఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు.” అని పలికాడు. కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దు:ఖించాడు.

“మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది.” అని విలపిస్తున్నాడు భరతుడు. ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వసిష్ఠుడు ఇలా అన్నాడు.

“భరతా! పోయినవారి గురించి చింతించి ప్రయోజనములేదు. జరుగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు.” అని అన్నాడు. అగ్ని గృహమునుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకొని వచ్చారు. దశరథుని పార్థివశరీరమును బయటకుతీసుకొని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకొని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేసారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు. ఋత్విక్కులు హెమం చేసారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు.

ఋత్విక్కులు, దశరథుని భార్యలు దశరథుని చితికి అప్రదక్షిణంగా తిరిగారు. అంత:పుర స్త్రీలందరూ రోదిస్తున్నారు. భరతుడు దశరథుని చితికి నిప్పంటించాడు. భరతుడు, మహారాజు భార్యలు, అందరూ దశరథునికి జలతర్షణములు విడిచారు. పదిదినములు గడిచిపోయినవి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గః (77) >>