మొట్ట మొదటిగా అందరికి నమస్కారము బాలకాండ చతుఃపంచాశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో రాముడు సీతను వివాహం చేసుకున్న తరువాత, జనక మహారాజు కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు బహుమతులు ఇస్తారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ పత్నులతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణమవుతారు. వారి ప్రయాణం సంతోషకరంగా సాగుతుంది. ఈ సందర్భంగా, రాముడు, సీత భవిష్యత్ జీవితంపై చర్చించుకుంటారు.
పప్లవాదిసృష్టిః
కామధేనుం వసిష్ఠోఽపి యదా న త్యజతే మునిః |
తదాస్య శబలాం రామ విశ్వామిత్రోఽన్వకర్షత ||
ఈ ప్రకారంగా వసిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామ ధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు.
ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడిచింది. తనలో తాను ఇలా అనుకొంది. “ఇదేమిటి. ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వసిస్థుని వద్ద ఉన్నాను కదా. వసిష్ఠుడు నన్ను విడిచి పెట్టినాడా! లేక పోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు. ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేసాను. ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేసాను కదా. ఈ రోజుకూడా వసిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా! మరి ఎందుకు నన్ను వదిలివేసాడు. ఆయననే అడుగుతాను.” అని తనలో తాను అనుకుంది.
వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగుపరుగున వసిష్ఠుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ వసిష్ఠునితో ఇలా పలికింది.
‘ ఓ బ్రహ్మర్షీ! దుర్మార్గులైన రాజ భటులు నన్ను నీ వద్దనుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేసావా. నేను ఏం అపరాధము చేసానని నన్ను వాళ్లకి ఇచ్చావు.” అని అడిగింది కామధేనువు.
ఆ మాటలు విన్న వసిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దు:ఖించాడు. ఆ కామధేనువుతో వసిష్ఠుడు ఇలాఅన్నాడు.
“ఓ కామధేనువా! నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్దనుండి తీసుకొని పోతున్నాడు. నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడ గలడు. అతడు ఈ ప్రాంతమునకు రాజు. పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నా కంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను. నిన్ను ఎలా రక్షించుకోను. ” అని అన్నాడు వసిష్ఠుడు.
“ఓ బ్రహ్మర్షీ! విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మ బలమునకు అది సాటి రాదు. అతని కన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షీ! నీ ‘బ్రహ్మ బలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను.” అని పలికింది కామధేనువు.
వెంటనే వసిష్ఠుడు పైకి లేచాడు. “ఓ కామధేనువూ! నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు.” అని ఆజ్ఞాపించాడు.
మహాఋషి ఆజ్ఞమేరకు కామధేనువు ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలమీద పడి వారిని ఓడించాయి. తరిమికొట్టాయి.
తన కళ్ల ఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేసాడు.
ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేసాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకచత్వారింశః సర్గలో అంశుమాన్ యొక్క గుర్రం కోసం అన్వేషణలో కపిల తన తండ్రి-మామలను బూడిదలో పెట్టాడని తెలుస్తుంది. అతను వారి ఆత్మలకు నివాళిగా జల సమర్పణ చేయాలనుకున్నప్పుడు అతనికి నీరు దొరకలేదు. అప్పుడు గరుడ, విష్ణువు యొక్క డేగ వాహనం మరియు అంశుమాన్ యొక్క మామ అయిన గంగా నదిని భూమిపైకి తీసుకురావాలని అతనికి సలహా ఇస్తాడు, తద్వారా ఆత్మలు శుద్ధి చేయబడి స్వర్గానికి వెళతాయి.
గంగాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత |
అగత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ |
త్రింశద్వర్షసహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః ||
26
Balakanda Sarga 41 In Telugu Pdf With Meaning
ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసరం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకూ తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు.
“కుమారా! నీవు వీరుడవు. పరాక్రమవంతుడవు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్లి చాలా కాలం అయింది. వారు ఇంకా తిరిగి రాలేదు. నీవు పోయి వారి జాడ కనుక్కొని రా. యజ్ఞాశ్వముతో తిరిగి రా! జాగ్రత్త! నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్ర ములను తీసుకొని వెళ్లు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించినవారిని నాశనం చెయ్యి. విజయుడవై తిరిగిరా!” అని పలికాడు.
సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశు మంతుడు తన పిన తండ్రులు తవ్విన మార్గమును వెతుకు కుంటూ వెళ్లాడు. దారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూపిన మార్గములో వెళ్లి అంశుమంతుడు తన పినతండ్రుల భస్మరాసుల వద్దకు వెళ్లాడు. తన పిన తండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్చిమేయుచున్న యజ్ఞాశ్వమును చూచాడు.
ఇంక మిగిలింది తన పిన తండ్రులకు తర్పణములు విడవాలి. దానికి జలము కావాలి. చుట్టూ చూచాడు ఎక్కడా జలాశయము కనపడలేదు. అప్పుడు గరుడుడు అక్కడకు వచ్చాడు. గరుడుడు వరుసకు సగర పుత్రులకు మేనమామ అవుతాడు. గరుడుడు అంశు మంతుని చూచి ఇలా అన్నాడు.
“కుమారా! నీ పినతండ్రుల మరణమునకు చింతింపకుము. వారి మరణమునకు లోకములు అంతా హర్షిస్తున్నాయి. నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు. నీ పిన తండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మము అయ్యారు. వీరికి ఉదక తర్షణము ఇవ్వడం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము. ఆ గంగానదీమ తల్లి వీరి భస్మరాసులను తడిపినపుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగ గలదు. కాబట్టి నీవు వీరిని గురించి చింతింపక హయమును తీసుకొని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము.” అని అన్నాడు.
గరుడుని మాట ప్రకారము అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు. గరుడుడు తనకు తెలిపిన విషయములు అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు.
సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు. తరువాత తేరుకొని యధావిధిగా యజ్ఞమును పూర్తిచేసాడు. ఇప్పుడు గంగను తీసుకొని వచ్చి కుమారుల భస్మరాసులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాసుల మీద పారితే గానీవారికి స్వర్గలోకము సిద్ధించదు. గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చు ఉపాయము దొరకలేదు సగరునకు.
సగరుడు 30,000 సంవత్సరములు రాజ్యపాలన చేసాడు కానీ గంగను మాత్రము భూమి మీదకు తీసుకొని రాలేకపోయాడు. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్పంచాశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో రాముడు సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్న తరువాత వారికి ఘన స్వాగతం లభిస్తుంది. దశరథ మహారాజు తన కుమారుల వివాహంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ పత్నులతో సంతోషంగా జీవనం ప్రారంభిస్తారు. ప్రజలు రాముడు మరియు సీతను ఆదర్శ దంపతులుగా కీర్తిస్తారు.
వసిష్ఠుడు రెండవ యమ దండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మ దండము పట్టుకొని “ఓరి దుష్టుడా! నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువ లేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను” అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.
విశ్వామిత్రుడు వసిష్ఠుని లెక్క చెయ్యలేదు. వసిష్ఠునిమీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వసిష్టుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది. వెనక్కు తిరిగి పోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశు పతాస్త్రము, ఇషీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణ పాశము, పైనాక, దైత అస్త్రములు, శుష్కము, అర్ధము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మ చక్రము, కాల చక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాళము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము మొద చిత్ర విచిత్ర అస్త్రములను వసిష్ఠుని మీద ప్రయోగించాడు.
విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములను అన్నింటినీ వసిస్థుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంక విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వసిష్ఠుని మీద ప్రయో గించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి.
దేవతలు, గంధర్వులు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వసిష్టుని బ్రహ్మ దండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునుకూడా మింగేసింది. లోకాలు శాంతించాయి.
ఆ సమయంలో వసిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వసిష్ఠుని దేహం నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వసిష్ఠుని చేతిలోని బ్రహ్మ దండము యమ దండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వసిష్ఠుని ఇలా ప్రార్థించారు.
” ఓ మహర్షీ! నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచెయ్యి.” అని ప్రార్థించారు.
దేవతల ప్రార్థనను మన్నించ వసిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వసిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది.
ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమానభారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది అని తెలుసుకొన్నాడు.
“ఆహా! ఏమి ఆశ్చర్యము. వసిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్ర శస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మ దండము నా అస్త్రములను అన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మ తేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియము లను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను” అని అనుకొన్నాడు విశ్వామిత్రుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనచత్వారింశః సర్గలో సగర చక్రవర్తి విడుదల చేసిన కర్మ గుర్రాన్ని ఇంద్రుడు ఆచారానికి ఆటంకం కలిగించడానికి లాక్కున్నాడు. గుర్రం లేకుండా కర్మ ముగింపుకు వెళ్లదు. అప్పుడు సగరుడు తన అరవై వేల మంది కుమారులను ఆ గుర్రం కోసం వెతకమని ఆజ్ఞాపించాడు, అది భూమిపై కనిపించకపోతే భూమిని తవ్వమని అడుగుతాడు. మరియు భూమిపై గుర్రం కనిపించనప్పుడు యువరాజులు భూమిని తవ్వి, భూలోకంలో నివసించే జీవుల దుఃఖానికి గురవుతారు.
“ఓ మహర్షీ! సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు. తెలియ జేయండి.” అని అడిగాడు.
విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు. ” ఓ రామా! సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచి పెట్టాడు. సగరుని మనుమడైన అంశు మంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్తిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు.
“ ఓ సగర చక్రవర్తీ! యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను.” అని అన్నారు.
ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు. “ ఓ కుమారులారా! ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరి తలము మీద దొరకకపోతే మీ రందరూ ఒక్కొకరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకూ నేను.ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీ కోసము నిరీక్షిస్తూ ఉంటాము.” అని పలికాడు సగరుడు..
తండ్రి ఆజ్ఞ ప్రకారము సగర పుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వ నారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సరములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగర పుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున అరవై వేల యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారి పోయింది. పెద్ద గొయ్యిగా తయారయింది. సగర పుత్రులు జంబూ ద్వీపము అంతా తవ్వేశారు.
ఇది చూచి దేవతలరు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లారు. “ఓ బ్రహ్మ దేవా! యజ్ఞాశ్వము కొరకు సగర పుత్రులు భూమి నంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికన వాడిని దొరికనట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించి పోతున్నాయి. నీ సృష్టి అంతా సర్వ నాశనము అయి పోతోంది. మీరే కాపాడాలి.” అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము బాలకాండ అష్టచత్వారింశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో విష్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణుల్ని సీతా స్వయంవరానికి తీసుకువెళతారు. రాముడు శివ ధనుస్సును విరచి సీతను గెలుచుకుంటాడు. ఈ సందర్భంలో, పరశురాముడు రాముడి శక్తిని పరీక్షించడానికి వస్తాడు. రాముడు శాంతంగా పరశురాముడి పరీక్షను తట్టుకుని తన శౌర్యాన్ని నిరూపిస్తాడు.
సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
“ఓ విశ్వామిత్ర మహర్షి! నీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలిఉంది. వారు అమితమైన బల పరాక్రమ ములు కలవారిగా కన్పట్టుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనము లోకి అడుగుపెడుతున్నారు. వారి సౌందర్యము అశ్వినీ దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లి తండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలి నడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి.” అని అడిగాడు సుమతి.
విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధ ఆశ్రమములో నివసించుట, ఆశ్రమములో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నచేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకూ అన్ని విషయములు చెప్పాడు.
విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథపుత్రులైన రామ లక్ష్మణులకు అతిధి సత్కారములు చేసాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, సుమతి మందిరములో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణము అయ్యారు.
మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు. దీనికి కారణమేమి?” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.
“ఓ రామా! ఇది గౌతమ ముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండే వాడు. ఒక రోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమములో లేని సమయమున, ఆయన వేషము వేసుకొని ఆశ్రమములో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు.
“ఓ సుందరీ! నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా! నేను నీతో రతి సంగమ మును కోరుచున్నాను.” అని అన్నాడు..
తన భర్త వేషములో వచ్చిన వాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుప వలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది.
“ఓ దేవేంద్రా! నేను కృతార్థురాలను అయ్యాను. (కోరిక తీరినదానను అయ్యాను). దేవేంద్రా! ఇక్కడి నుండి తొందరగా వెళ్లిపొండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము.”అని అంది అ
అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ” ఓ సుందరీ! నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను.” అని అన్నాడు ఇంద్రుడు.
ఓ రామా! ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు, ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ, గౌతముని ఆశ్రమము నుండి త్వర త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు, సమిధలను, దర్భలను తీసుకొని, ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషములో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు.
గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెల వెల బోయింది. ముని వేషములో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడు ఇలా అన్నాడు.
“ఓ దుర్మతీ! నేను ఆశ్రమములో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమములో ప్రవేశించి నాభార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కిందపడిపోవు గాక!” అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి.
తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడ గడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు.
‘అహల్యా! నీవు పాపం చేసావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్యరూపంలో వేల సంవత్సరములు, మట్టిలో దొర్లుతూ, నిరాహారంగా, కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, ఈ ఆశ్రమములో పడి ఉండు.
దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినపుడు నీకు శాపవిముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిధ్యము ఇచ్చి, శాపవిమోచనము పొందిన తరువాత, నీలో ఉన్న మోహము నశించి, పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు.” అని పలికాడు.
తరువాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హిమవత్పర్వము నకు వెళ్లిపోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తత్రింశః సర్గలో విశ్వామిత్ర మహర్షి గంగ యొక్క భూమార్గం గురించి, ఆమె కార్తికేయను కనడం, కృత్తిక నక్షత్రాలు ఆ అబ్బాయికి తల్లిపాలు ఇవ్వడం, దేవతలు ఆ అబ్బాయికి కార్తికేయ అని పేరు పెట్టడం మరియు ఆ బాలుడు ఖగోళ సైన్యాలకు అధిపతిగా అభిషేకం చేయడం గురించి తన కథనాన్ని కొనసాగిస్తున్నాడు.
ఓ రామా! పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధి పతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు పోయి అగ్ని దేవుని ముందు పెట్టుకొని తమ కోరిక ను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు.
“ ఓ బ్రహ్మ దేవా! ఇప్పటి దాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధి పతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధి పతిని నీవే ఏర్పరుప వలెను.” అని వేడుకున్నారు.
ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.
” ఓ దేవతలారా! ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతానయోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధి పతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా. అగ్ని దేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్ని దేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరపెట్టదు.” అని అన్నాడు.
బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు.
అగ్నిదేవుడు గంగ దేవి దగ్గరకు పోయి ” ఓ గంగాదేవీ! దేవతల కోరిక మేరకు నీవు నావలన గర్భము ధరింపుము.” అని కోరాడు.
“ఓ అగ్నీ! నేను ఈ వీర్యమును ధరింపలేను. నా వళ్లు అంతా దహించికుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పి పోతూ ఉంది. నా వల్ల కాదు.” అని చెప్పింది.
“ఓ గంగాదేవీ! అటులయిన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడువుము.” అని అన్నాడు అగ్ని.
గంగానది అగ్ని దేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది.
మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శివసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువ బడ్డాడు.
గంగాదేవి గర్భము నుండి జారి పడ్డాడు కాబట్టి స్కంధుడు అని కూడా పిలువ బడ్డాడు. కృత్తికలు ఆరుగురు. ఆరుగు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము (చనుబాలు) ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకే సారి ఆరుముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది.
తరువాత ఆ కుమారుడు దేవ సేనలకు సైన్యాధి పతి గా నియమింప బడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామా! దీనినే కుమార సంభవము అని అంటారు.” అని విశ్వామిత్రుడు రామునికి కుమార స్వామి జననము గురించి చెప్పాడు.
అయోధ్యా కాండ సర్గ 30 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది. “రామా! నీవు అసలు మగాడివేనా! కాదు.
నీవు పురుషరూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా… రాముల వారిని తన వెంట తీసుకెళ్లమని…పరి పరి విదాలు వేడుకొన్న సీతా దేవి… రాములవారి పరాక్రమము గూర్చి అడిగిన సందర్భం లోనిది…
రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది.
“రామా! నీవు అసలు మగాడివేనా! కాదు. నీవు పురుషరూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా.
ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి. అలాంటి పరాక్రమ వంతుడివి…. నన్ను అడవులకు తీసుకొనివెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా! ఉంటే అదేమిటి? కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్లడానికి కారణమేమి? భయమా! లేక పరాక్రమము లేకనా! నీ భయమునకు కారణమేమి?
మీరు సావిత్రీ సత్యవంతుల కథ వినలేదా! సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్లింది. నేను కేవలం అడవులకు మాత్రం వస్తాను అంటున్నాను. అంతే కదా! నాధా! నేనుసామాన్య స్త్రీల వంటి దానను కాను. పరపురుషుని కన్నెత్తి కూడా చూడను. నేను ఇక్కడ ఒకరి పంచన బతకలేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నేను స్వయంగా నీ భార్యను.
యవ్వనంలో ఉన్నాను. నీతో కొంతకాలము కాపురము చేసాను. అటువంటి నన్ను దిక్కులేని దాని మాదిరి పరాయి వాళ్ల ఇంట ఉంచడం ఉచితమా! నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలిగా ఉండమంటున్నావు. రామా! నీకు నీ వారు ఎక్కువ కానీ నాకు కాదు కదా! నాకు నా భర్త ఎక్కువ. ఎవరి కోసరమో నేను నిన్ను విడిచి ఒంటరిగా అయోధ్యలో ఉండలేను.
మీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం ఉచితము కాదు. మీ సన్నిధిలో నాకు అరణ్యమైనా స్వర్గమైనా సమానమే! మీరు ఎక్కడ ఉంటే అదే నాకు రాజభవనము. నేను రాజభవనములో ఎలాఉంటానో అరణ్యములో కూడా అలాగే ఉంటాను. మీతో కలిసి ప్రయాణము చేస్తుంటే నాకు ముళ్లు కూడా పూల మాదిరి ఉంటాయి.
అడవులలో ఉన్న దుమ్ముకూడా చందనముతో సమానమే. హాయిగా, ఆకాశమే పందిరిగా పచ్చికబయళ్లే పూల పానుపుగా మీతో పాటు శయనించడం కన్నా, రాజభవనములలో ఉన్న హంసతూలికా తల్పములు ఎక్కువ సుఖాన్ని ఇవ్వవు. మీరు తీసుకొని వచ్చిన కందమూలములు, ఫలములే నాకు పంచభక్ష్య పరమాన్నములు.
నేను అడవులలో ఉన్నప్పుడు మా పుట్టింటికానీ నా తల్లితండ్రులను గానీ తలచుకొని బెంగపెట్టుకోను. నా వలన మీకు ఎలాంటి కష్టము కలగనీయను. నాకు అది కావాలి ఇది కావాలి అని అడగను. దొరికిన
దానితో తృప్తిపడతాను.
నాధా! మరలాచెబుతున్నాను. నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేనిచోట నరకమే. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యము. అంతే గాని, అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను. ఎందుకంటే, మీ వియోగముతో నేను కొంతకాలము తరువాత అయినా కృంగి కృశించి చచ్చిపోతాను. అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా!
ఒక్కక్షణమైనా మిమ్ములను విడిచి బతకలేని నేను పదునాలుగు సంవత్సరములు మిమ్ములను విడిచి పరాయి పంచన ఎలా ఉంటాను అని అనుకుంటున్నారు.” అంటూ సీత రాముని కౌగలించుకొని పెద్దగా ఏడవసాగింది. సీత కళ్లనుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శరీరం వశం తప్పుతూ ఉంది. అలాగే రాముని చేతులలో నుండి కిందికి జారిపోయింది. రాముడు సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఓదారుస్తున్నాడు.
“ఓ సీతా! ఎందుకీ ఏడుపు. నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నాకు స్వర్గములో కూడా సుఖము లభించదు. నేను ఎవరికీ భయపడను. తుదకు ఆ బ్రహ్మదేవునికికూడా! నేను నిన్ను సర్వవేళలా రక్షించు కొనుటకు సమర్థుడను. కానీ నీ అభిప్రాయము తెలుసుకొనడానికి అలా అన్నాను.
అలా కాకుండా, నిన్ను నా వెంట అరణ్యములకు రమ్మంటే, పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నీవు నన్ను అపార్థము చేసుకొనే అవకాశము ఉంది కదా! ఓ సీతా! నేను మాత్రము నిన్ను విడిచి క్షణమైనా బతుక గలనా! ఆ బ్రహ్మ మన ఇద్దరికీ వనవాసము చెయ్యమని రాసి పెట్టినట్టున్నాడు. అందుకే ఈ విపరీత పరిణామము.
సీతా! ఇంక నేను వనవాసమునకు ఎందుకు వెళుతున్నానో వివరిస్తాను. పితృవాక్యపరిపాలన మా కులధర్మము. దానిని నేను పాటించి తీరవలెను. కారణములు ఏవైనా, నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు. ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళు తున్నాను. ఒకకుమారుడిగా తల్లి తండ్రుల ఎడల నా ధర్మమును అతిమ్రించుటకు నేను ఇష్టపడను.
నాకు నా తల్లి, తండ్రి, గురువు మూడు లోకములతో సమానము. వీరి తరువాతే నాకు దేవుడు. నా తల్లి తండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు. నా తండ్రి ఆజ్ఞను పాలించడంతోనే, నాకు స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, సంతానము, రాజభోగములు లభించినట్టు భావిస్తాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు, నాకు ఇవేవీ దొరకవు.
మాతాపితరుల సేవతో నేను ఉత్తమ లోకములు పొందుతాను. ఎందుకంటే పితృవాక్య పరిపాలన మన సనాతన ధర్మము. నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకొని పోయి కష్టముల పాటు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నీ ధృఢనిశ్చయము విని నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను.
నా సహధర్మ చారిణిగా నా వెంట అడవులకు రా. నీవు నాతో వస్తాను అని అనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని మన వంశగౌరవము కాపాడావు. కాబట్టి సీతా! మనకు వనవాసమునకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. నిన్ను విడిచి నేనుకూడా ఒక క్షణము కూడా ఉండలేను కదా!
బ్రాహ్మణులకు దానధర్మములు చెయ్యి. వారికి భోజనము పెట్టి సంతృప్తి పరుచు. నీవు ధరించు ఆభరణములు, విలువైన వస్త్రములు, వస్తువులు అన్నీ నీ పరిచారికలకు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు.” అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సీత సంతోషంతో పొంగి పోయింది. రాముడు చెప్పినట్టు తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చివేసింది. విలువైన బంగారు ఆభరణములు, రత్నములు, మణులు, పట్టు వస్త్రములు తన పరిచారికలకు ఇచ్చింది.
అయోధ్యా కాండ సర్గ 29 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది. ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి. అని కుతూహలంతో రాములవారిని వేడుకున్నా సందర్భం లోనిది…
అదీ కాకుండా, భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది. అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది.
ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి.
నాధా! మీరు చెప్పినట్టు అరణ్యవాసములో ఎన్నో దు:ఖములు ఉంటాయి. కాని అవి అన్నీ అధైర్యపరులకు కానీ తమరి వంటి ధీరోదాత్తులకు కాదు కదా! అవునండోయ్! మరిచి పోయాను. నేను మిథిలలో ఉండగా ఒక రోజు ఒక బిక్షుకి కూడా నా జాతకములో వనవాసము రాసి పెట్టి ఉన్నదని జోస్యము చెప్పినది.
అవి అన్నీ ఇప్పుడు నిజము అవుతున్నాయి. నాడు జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుండి, భిక్షుకి చెప్పినప్పటినుండి ఎప్పుడెప్పుడు వనవాసమునకు వెళదామా అని ఉత్సాహంతో ఉన్నాను. కాబట్టి తమరి వెంట నన్నుకూడా వనములకు తీసుకొని వెళ్లండి.
ఏమండీ! ఏమండీ! అక్కడ నేను మిమ్ములను ఎంతో ప్రేమగా చూచుకుంటానండీ. మీరు ఎక్కడికి పోతే అక్కడకు వస్తాను. ఎందుకంటే నా భర్తయే నాకు దైవము. మీరు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే కదా!
ఒక్క వనవాసమే కాదు, మరణంలో కూడా నేను మిమ్ములను అనుసరించి వస్తాను. ఏనాడైతే తల్లి తండ్రులు తమ కుమార్తెను ఎవరికైతే మంత్రపూర్వకముగా ధారపోసారో ఆ నాటి నుండి ఆమె అతనికి సహధర్మచారిణి అవుతుంది. మరణానంతరము కూడా ఆమె అతనినే అనుసరిస్తుంది అని వేదములు ఘోషిస్తున్నాయి కదా!
ఆ వేదవాక్కును అనుసరించి మీరు ఎక్కడకు పోతే అక్కడకు నేను మిమ్ములను ఒక భార్యగా అనుసరిస్తాను. చివరకు మరణంలో కూడా. అది సరే. అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు. నేను మంచి దాననుగానా?నేను పతివ్రతనండీ. పైగా మీ భక్తురాలను.
సుఖదుఃఖములను సమంగా చూడగలిగిన నేర్పు కల దానను. మీసుఖమే నా సుఖమనీ, మీ కష్టమే నా కష్టమనీ భావించే మనసు కలదానను. ఇవన్నీ మీకు తెలుసు కదా! అటువంటప్పుడు నన్ను వెంట తీసుకొని పోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు. కాబట్టి నేను మీ వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడు ఇక్కడే ప్రాణములు వదులుతాను.” అని నయానా భయానా బతిమాలింది సీత.
సీత ఎన్ని చెప్పినను అటువంటి సుకుమారిని వనములకు తీసుకొని పోయి ఆమెను కష్టముల పాలు చేయడం ఇష్టం లేని రాముడు, ఆమె తన వెంట రావడానికి సుతరామూ ఒప్పుకోలేదు. సీతకూడా తన పట్టు విడవ లేదు. ఏడుపు మానలేదు. సీత ఏడుపు మానడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను తనతో రాకుండా నివారించడానికి రాముడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
శ్రీమన్మహాలక్ష్మీదేవి తన అష్ట విధ అంశలతో లీలా రూపంగా ధరించిన అష్టలక్ష్మీ అవతారాలలో ప్రధమమైనది శ్రీ ఆదిలక్ష్మీదేవి. ఈ తల్లి ప్రాణశక్తికి అధిష్టాన దేవత. ఆది అనే పదంలోనే సనాతనమైనది, మూలాధారమైనటువంటిది అనే అర్థాలు స్ఫురిస్తాయి. జీవించడానికి అత్యవసరమైనది ప్రాణశక్తి. అదికంటికి కనబడని శక్తి. సమస్త జీవరాశులలోనూ ప్రాణశక్తి పరిపుష్టంగా వున్నప్పుడే మిగిలిన శక్తులు రాణిస్తాయి. ఆ రకంగా ప్రాణశక్తి మీద వ్యక్తి వికాసం, తద్వారా సమాజ వికాసం కూడా ఆధారపడి వుంటాయి అంటే అతిశయోక్తి కాదు. జీవి తల్లి గర్భంలో పాంచ భౌతిక శరీరాన్ని దాల్చటానికి అవసరమైన మొదటి శక్తి ప్రాణశక్తే. “ప్రాణాధ్యైవ ఖల్విమాని భూతాని జాయన్తి ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయన్త్యభిసం విశంతీతి” అని తైత్తీరియోపనిషత్లోని భృగువల్లిలో ప్రాణశక్తి ప్రభావం గురించి చెప్పబడింది.
శ్రీ ఆదిలక్ష్మీదేవి స్వరూప స్వభావాలు
ఆదిలక్ష్మీదేవి శుద్ధ జ్ఞానానికి ప్రతిరూపమైన పద్మంలో చతుర్భుజమూర్తిగా మనకి దర్శనం యిస్తుంది. అరుణకాంతులు వెదజల్లే ఎర్రని పట్టుచీరధరించి, రెండు చేతులలో పద్మాలను పట్టుకుని, రెండు చేతులతో భక్తులకు అభయ ప్రదానం చేస్తూ వుంటుంది. ‘సుమనస వందిత’ మంచి మనస్సుతో ఆరాధించే వారికి సత్వరం మంచి ఫలితాలను యిస్తుంది. ఆదిలక్ష్మీ మాత. భక్తుల ఎడల ఎంతో కరుణని చూపించే ఆ తల్లి స్వభావరీత్యా అలక్ష్యాన్నీ, నిరాదరణనీ, మర్యాదా ఉల్లంఘనాన్ని ఎంతమాత్రమూ సహించదు. తనకి చేసే ఉపచారాల విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా సహించదు. వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తూ ఆ ప్రదేశాన్ని వీడిపోతుంది. భక్తులు తప్పు తెలుసుకుని ప్రార్థిస్తే తప్పకుండా మళ్ళీ కరుణిస్తుంది. ఆమె ఆగ్రహం కూడా చివరికి అనుగ్రహంగా పరిణమిస్తుంది. ప్రణవ స్వరూపిణిగా, గాయత్రి రూపిణిగా, సర్వదేవ నమస్కృతగా వినుతికెక్కిన ఈ తల్లిని దేవతలు కూడా సదా ఆరాధిస్తూ వుంటారు. సర్వమంత్ర ఫలప్రద, సర్వతీర్థ స్థిత, అపరాజిత అయిన ఈ తల్లి భవబంధవినాశిని.
విష్ణు పురాణగాధల ననుసరించి ఆదిలక్ష్మి భృగుమహర్షి పుత్రికగా తెలియవస్తోంది. ఆ తల్లికి “భార్గవి” అనే పేరు అందువల్లనే వచ్చింది. భృగువు బ్రహ్మమానస పుత్రుడని ప్రతీతి. భృగుమహర్షి జ్ఞానానికి ప్రతీక. అపార తపశ్శక్తి సంపన్నుడు, జ్ఞాన వృద్ధుడు అయిన ఈ మహర్షికి బ్రహ్మ అనుగ్రహం వల్ల అరికాలిలో జ్ఞాననేత్రం వుండేది. అలాంటి జ్ఞాన సంపన్నుడైన భృగువు ఎంతో కాలం ఘోర తపస్సు చేసి లక్ష్మీదేవి తన ఔరస పుత్రిక అయ్యేటట్లు వరం పొందాడు. తద్వారా వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడు భృగువుకి అల్లుడయ్యాడు. విష్ణుమూర్తి సంకల్పశక్తి అయిన ఆదిలక్ష్మీదేవి నారాయణిగా, వైకుంఠ లక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.
శ్రీ ఆదిలక్ష్మీదేవి ప్రభావము
శ్రీ ఆదిలక్ష్మీదేవి స్వభావాన్ని, ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహ ప్రభావాలను తెలిపే -రెండు కథలు పురాణాలలో విస్తృత ప్రాచుర్యంలో వున్నాయి.
అయోధ్యా కాండ సర్గ 28 రామాయణంలోని ఆసక్తికరమైన భాగం. సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనా ఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. ‘ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లోగానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము. సీతా దేవి తో రాముడు అరణ్యమునకు వద్దని అరణ్యము గూర్చి వివరించే ప్రస్తావనను కళ్ళకు కట్టినట్టు చెప్పిన సందర్భము…
వనదుఃఖప్రతిబోధనమ్
స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సలః |
న నేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ ||
సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనాఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. ‘ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లోగానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము.
అరణ్యములలో ఉండే బాధలు నీకు తెలియవు. నీమేలు కోరి చెబుతున్నాను. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఏలోటూ రాదు. చిన్నప్పటి నుండి సుఖములలో పెరిగిన దానవు. ఆ అడవులలో కలిగే కష్టములను తట్టుకోలేవు. అడవులలో సుఖము అనే మాట వినపడదు. అన్నీ కష్టాలే. ఎత్తైన కొండల మీది నుండి దుమికే సెల ఏళ్ల ధ్వనులు, పులుల గాండ్రింపులు, సింహగర్జనలు, అడవి ఏనుగుల ఘీంకారములు, భయంకరంగా ఉంటాయి. అడవులలో సంచరించు క్రూరమృగములు మానవులను చూడగానే మీద పడతాయి. వాటి బారి నుండి తప్పించుకోడం చాలా కష్టం.
పైగా నగరములలో ఉన్నట్టు అడవులలో రాచ మార్గములు ఉండవు. అన్నీ ముళ్లు రాళ్లతో నిండిన కాలి మార్గములే. పైగా తాగడానికి మంచి నీరు కూడా దొరకదు. తినడానికి తిండి దొరకదు. రాలి పడిన పండ్లు తినాలి. లేకపోతే దొరికినవాటితో కడుపు నింపు కోవాలి. ఒక్కోసారి అవీ దొరక్కపోతే ఉపవాసములుచెయ్యాల్సి ఉంటుంది. పగలంతా నడక. రాత్రి నేలమీద పడక. నిద్రపట్టదు. జీవితం దుర్భరంగా ఉంటుంది. కట్టుకోడానికి బట్టలు ఉండవు. నారచీరలు, ఆకులు కట్టుకోవాలి.
వనవాసవ్రతములో ఉన్నవారు నిత్యమూ దేవతలను, పితరులను, అతిధులను పూజించాలి. మూడుపూట్లాస్నానం చెయ్యాలి. స్వయంగా పూలు పండ్లు కోసుకొని రావాలి. ఋషులకు, మునులకు పెట్టాలి. మిగిలింది మనం తినాలి. అదీ మితంగా తినాలి. దొరికింది తినాలి. అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు. అందుకే వనవాసము అత్యంత దుర్భరము. నీవు చేయలేవు.
ఇంకా సీతా! వనవాస సమయములో మనము ప్రకృతి వైపరీత్యములను తట్టుకోవాల్సి ఉంటుంది. పెనుగాలులు, వర్షాలు, గాడాంధకారమైన చీకటి, ఆ చీకట్లో సంచరించే వివిధ రకాలైన విషము చిమ్మే పాములు, దీనికి తోడు భయంకరమైన ఆకలి దప్పులు, సకాలమునకు దొరకని ఆహారము, ఇవన్నీ అంతులేని బాధలు….. వనవాసములో కలుగుతాయి.
వాటిని నీవు తట్టుకోలేవు. వీటికి తోడు వ్యాధులు కలిగించు కీటకములు, దోమలు, భయంకరమైన విషపూరితములైన తేళ్లు, స్వేచ్ఛగా సంచరించు అరణ్యములలో నీవు ఒక్క క్షణమైనా ఉండలేవు. అరణ్యములలో నివసించు వారు కామ, క్రోధములను విడిచి పెట్టి మనసును తపస్సుమీదనే లగ్నం చేయాలి. భయము అనే మాటను మనసులోకి రానీయకూడదు. అది నీ బోటి దానికి సాధ్యం కాదు.
కాబట్టి నీ వంటి సుకుమారికి అరణ్యవాసము యోగ్యము కాదు. నీవు ఇచ్చటనే వ్రతములు, ఉపవాసములు చేస్తూ నా క్షేమమును కోరుతూ ఉండు. నేను క్షణములో వనవాసమును పూర్తి చేసుకొని నీ చెంత వాలుతాను.” అని వనవాసములోని కష్టనష్టముల గురించి వివరంగా చెప్పాడు రాముడు.