Balakanda Sarga 42 In Telugu – బాలకాండ ద్విచత్వారింశః సర్గః

Balakanda Sarga 42 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – ద్విచత్వారింశః సర్గలో, రాముడు విశ్వామిత్రుని వెంట యజ్ఞాన్ని రక్షించేందుకు సిద్దమవుతాడు. యాత్రలో, వారు తాడకాతో ఎదురవుతారు. తాడక, దానవుల రాణి, యజ్ఞాలను దుష్ప్రభావం చేస్తుంది. రాముడు తన ధైర్యం మరియు శక్తితో తాడకను సమరంలో సంహరిస్తాడు. ఈ సంఘటన రాముని శక్తి, ధర్మనిరతత, మరియు గురుభక్తిని చూపిస్తుంది.

భగీరథవరప్రదానమ్

కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీజనాః |
రాజానం రోచయామాసురంశుమంతం సుధార్మికమ్ ||

1

స రాజా సుమహానాసీదంశుమాన్రఘునందన |
తస్య పుత్రో మహానాసీద్దిలీప ఇతి విశ్రుతః ||

2

తస్మిన్రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన |
హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణమ్ ||

3

ద్వాత్రింశచ్చ సహస్రాణి వర్షాణి సుమహాయశాః |
తపోవనం గతో రామ స్వర్గం లేభే మహాయశాః ||

4

దిలీపస్తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధమ్ |
దుఃఖోపహతయా బుద్ధ్యా నిశ్చయం నాధ్యగచ్ఛత ||

5

కథం గంగావతరణం కథం తేషాం జలక్రియా |
తారయేయం కథం చైతానితి చింతాపరోఽభవత్ ||

6

తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః |
పుత్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మికః ||

7

దిలీపస్తు మహాతేజా యజ్ఞైర్బహుభిరిష్టవాన్ |
త్రింశద్వర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్ ||

8

అగత్వా నిశ్చయం రాజా తేషాముద్ధరణం ప్రతి |
వ్యాధినా నరశార్దూల కాలధర్మముపేయివాన్ ||

9

ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణా |
రాజ్యే భగీరథం పుత్రమభిషిచ్య నరర్షభః ||

10

భగీరథస్తు రాజర్షిర్ధార్మికో రఘునందన |
అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజాః ||

11

మంత్రిష్వాధాయ తద్రాజ్యం గంగావతరణే రతః |
స తపో దీర్ఘమాతిష్ఠద్గోకర్ణే రఘునందన ||

12

ఊర్ధ్వబాహుః పంచతపా మాసాహారో జితేంద్రియః |
తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః ||

13

అతీతాని మహబహో తస్య రాజ్ఞో మహాత్మనః |
సుప్రీతో భగవాన్బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః ||

14

తతః సురగణైః సార్ధముపాగమ్య పితామహః |
భగీరథం మహాత్మానం తప్యమానమథాబ్రవీత్ ||

15

భగీరథ మహాభాగ ప్రీతస్తేఽహం జనేశ్వర |
తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత ||

16

తమువాచ మహాతేజాః సర్వలోకపితామహమ్ |
భగీరథో మహాభాగః కృతాంజలిరుపస్థితః ||

17

యది మే భగవన్ప్రీతో యద్యస్తి తపసః ఫలమ్ |
సగరస్యాత్మజాః సర్వే మత్తః సలిలమాప్నుయుః ||

18

గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనామ్ |
స్వర్గం గచ్ఛేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః ||

19

దేయా చ సంతతిర్దేవ నావసీదేత్కులం చ నః |
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏష మేఽస్తు వరః పరః ||

20

ఉక్తవాక్యం తు రాజానం సర్వలోకపితామహః |
ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరామ్ ||

21

మనోరథో మహానేష భగీరథ మహారథ |
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకుకులవర్ధన ||

22

ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠా హిమవతః సుతా |
తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతామ్ ||

23

గంగాయాః పతనం రాజన్పృథివీ న సహిష్యతి |
తాం వై ధారయితుం వీర నాన్యం పశ్యామి శూలినః ||

24

తమేవముక్త్వా రాజానం గంగాం చాభాష్య లోకకృత్ |
జగామ త్రిదివం దేవః సహ దేవైర్మరుద్గణైః ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విచత్వారింశః సర్గః ||

Balakanda Sarga 42 Meaning In Telugu

సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశు మంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశు మంతుని కుమారుడు దిలీపుడు. అంశు మంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు.

దిలీపుడు తన పితామహులకు స్వర్గ లోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు.

ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.

” ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో” అని అడిగాడు బ్రహ్మ.

“దేవా! నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమీ మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితా మహులకు జలతర్పణము వదులుతాను.” అని కోరుకున్నాడు.

” ఓ భగీరథా! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగను భూమి మీదికి తేవడం అత్యతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హిమవంతుని పెద్దకుమార్తె. హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగాప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి.” అని అన్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓంతత్సత్

బాలకాండ త్రిచత్వారింశః సర్గః (43) >>

Balakanda Sarga 31 In Telugu – బాలకాండ ఏకత్రింశః సర్గః

Balakanda Sarga 31 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకత్రింశః సర్గలో ఋషి విశ్వామిత్రుడు మిథిలా రాజ్యానికి జనక రాజు యొక్క ఆచారానికి హాజరయ్యేందుకు మరియు యుగాల నుండి జనకుని రాజభవనంలో పూజించబడుతున్న శివుని పవిత్రమైన విల్లును చూడటానికి కూడా ప్రయాణిస్తాడు. ఇతర ఋషులు రాముడికి సూచించారు, అతను కూడా తమతో పాటు ఆ అద్భుత విల్లును చూడమని అక్కడికి వెళ్ళవచ్చు. వారంతా సిద్ధ ఆశ్రమం నుండి గంగా నదికి ఉపనది అయిన సోనా నది వైపు వెళ్లి ఒక రాత్రి దాని ఒడ్డున విడిది చేస్తారు.

మిథిలాప్రస్థానమ్

అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ |
ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా ||

1

ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్ణికక్రియౌ |
విశ్వామిత్రమృషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః ||

2

అభివాద్య మునిశ్రేష్ఠం జ్వలంతమివ పావకమ్ |
ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ ||

3

ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపాగతౌ |
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావ కిమ్ ||

4

ఏవముక్తాస్తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః |
విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్ ||

5

మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి |
యజ్ఞః పరమధర్మిష్ఠస్తస్య యాస్యామహే వయమ్ ||

6

త్వం చైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి |
అద్భుతం చ ధనూరత్నం తత్రైకం ద్రష్టుమర్హసి ||

7

తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః |
అప్రమేయబలం ఘోరం మఖే పరమభాస్వరమ్ ||

8

నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః |
కర్తుమారోపణం శక్తా న కథంచన మానుషాః ||

9

ధనుషస్తస్య వీర్యం హి జిజ్ఞాసంతో మహీక్షితః |
న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః ||

10

తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః |
తత్ర ద్రక్ష్యసి కాకుత్స్థ యజ్ఞం చాద్భుతదర్శనమ్ ||

11

తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః |
యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః ||

12

ఆయాగభూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ |
అర్చితం వివిధైర్గంధైర్ధూపైశ్చాగరుగంధిభిః ||

13

ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా |
సర్షిసంఘః సకాకుత్స్థ ఆమంత్ర్య వనదేవతాః ||

14

స్వస్తి వోఽస్తు గమిష్యామి సిద్ధః సిద్ధాశ్రమాదహమ్ |
ఉత్తరే జాహ్నవీతీరే హిమవంతం శిలోచ్చయమ్ ||

15

ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమమ్ |
ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే ||

16

తం ప్రయాంతం మునివరమన్వయాదనుసారిణామ్ |
శకటీశతమాత్రం చ ప్రయాతే బ్రహ్మవాదినామ్ ||

17 [ప్రయాణే]

మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః |
అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిమ్ ||

18

నివర్తయామాస తతః పక్షిసంఘాన్మృగానపి |
తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే ||

19

వాసం చక్రుర్మునిగణాః శోణకూలే సమాగతాః |
తేఽస్తం గతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః ||

20

విశ్వామిత్రం పురస్కృత్య నిషేదురమితౌజసః |
రామో హి సహసౌమిత్రిర్మునీంస్తానభిపూజ్య చ ||

21

అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః |
అథ రామో మహాతేజా విశ్వామిత్రం మహామునిమ్ ||

22

పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహలసమన్వితః |
భగవన్కోన్వయం దేశః సమృద్ధవనశోభితః ||

23

శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్త్వతః |
చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః |
తస్య దేశస్య నిఖిలమృషిమధ్యే మహాతపాః ||

24

Balakanda Sarga 31 In Telugu Pdf With Meaning

యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు.

మరునాడు ప్రాత:కాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు, తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు.

“ ఓ మహర్షీ! మేము నీ భటుల మాదిరి వచ్చినిలిచి ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి.” అని చేతులుకట్టుకొని వినయంగా నిలబడ్డారు.

వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు. ” ఓ రామా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరమూ ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. చాలా బలము కలది. భయంకరమైనది. ఆ ధనుస్సును

పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు,రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు. ఎక్కుపెట్టలేరు. ఇంక మానవుల సంగతి చెప్ప పనిలేదు కదా! అంతటి బలమైనది ఆ ధనుస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతము ఆ మహత్తర ధనుస్సు జనక మహారాజు పూజా మందిరములో పూజింపబడుతూ ఉంది.” అని పలికారు.

తరువాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో, తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణము అయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. దాదాపు నూరు బండ్లలో అందరూ వెళు తున్నారు.

చాలా దూరము ప్రయాణము చేసి అందరూ శోణ నదీ తీరము చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలను కున్నారు. సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము, అగ్ని కార్యములను పూర్తి చేసుకొని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామితుని ఇలా అడిగాడు.

“ఓ మహర్షీ! ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియజేయండి.” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ
ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ ద్వాత్రింశః సర్గః (32) >>

Balakanda Sarga 40 In Telugu – బాలకాండ చత్వారింశః సర్గః

Balakanda Sarga 40 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – చత్వారింశః సర్గః:, విష్ణుమూర్తి వామనావతారం స్వీకరిస్తాడు మరియు మహాబలిని ఎదుర్కొంటాడు. వామనుడు మహాబలిని మూడు అడుగుల భూమి యాచిస్తాడు. మహాబలి తన దానాన్ని పునీతం చేసేందుకు వామనునికి ఆర్ద్రతతో అందివ్వాలని నిర్ణయిస్తాడు. వామనుడు రెండు అడుగులతో భూమి, ఆకాశాన్ని కవర్ చేస్తాడు. మూడవ అడుగు ఎక్కడ వేయాలో అడిగితే, మహాబలి తన తల వంచి ఆ అడుగును వేయమంటాడు.

కపిలదర్శనమ్

దేవతానాం వచః శ్రుత్వా భగవాన్ వై పితామహః |
ప్రత్యువాచ సుసంత్రస్తాన్కృతాంతబలమోహితాన్ ||

1

యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః |
[* మహిషీ మాధవస్యైషా స ఏష భగవాన్ ప్రభుః | *]
కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరామ్ ||

2

తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః |
పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః ||

3

సగరస్య చ పుత్రాణాం వినాశోఽదీర్ఘజీవినామ్ |
పితామహవచః శ్రుత్వా త్రయస్త్రింశదరిందమ ||

4

దేవాః పరమసంహృష్టాః పునర్జగ్ముర్యథాగతమ్ |
సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీన్మహాత్మనామ్ ||

5

పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాతసమనిఃస్వనః |
తతో భిత్త్వా మహీం కృత్స్నాం కృత్వా చాభిప్రదక్షిణమ్ ||

6

సహితాః సాగరాః సర్వే పితరం వాక్యమబ్రువన్ |
పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవంతశ్చ సూదితాః ||

7

దేవదానవరక్షాంసి పిశాచోరగకిన్నరాః | [పన్నగాః]
న చ పశ్యామహేఽశ్వం తమశ్వహర్తారమేవ చ ||

8

కిం కరిష్యామ భద్రం తే బుద్ధిరత్ర విచార్యతామ్ |
తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం రాజసత్తమః ||

9

సమన్యురబ్రవీద్వాక్యం సగరో రఘునందన |
భూయః ఖనత భద్రం వో నిద్భిద్య వసుధాతలమ్ ||

10

అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తథ |
పితుర్వచనమాస్థాయ సగరస్య మహాత్మనః ||

11

షష్టిః పుత్రసహస్రాణి రసాతలమభిద్రవన్ |
ఖన్యమానే తతస్తస్మిన్దదృశుః పర్వతోపమమ్ ||

12

దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలమ్ |
సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునందన ||

13

శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజః |
యదా పర్వణి కాకుత్స్థ విశ్రమార్థం మహాగజః ||

14

ఖేదాచ్చాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్ |
తం తే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్ ||

15

మానయంతో హి తే రామ జగ్ముర్భిత్వా రసాతలమ్ |
తతః పూర్వాం దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః ||

16

దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజమ్ |
మహాపద్మం మహాత్మానం సుమహాపర్వతోపమమ్ ||

17

శిరసా ధారయంతం తే విస్మయం జగ్మురుత్తమమ్ |
తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః ||

18

షష్టిః పుత్రసహస్రాణి పశ్చిమాం బిభిదుర్దిశమ్ |
పశ్చిమాయామపి దిశి మహాంతమచలోపమమ్ ||

19

దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః |
తం తే ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్ ||

20

ఖనంతః సముపక్రాంతా దిశం హైమవతీం తతః |
ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ దదృశుర్హిమపాండురమ్ ||

21

భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమామ్ |
సమాలభ్య తతః సర్వే కృత్వా చైనం ప్రదక్షిణమ్ ||

22

షష్టిః పుత్రసహస్రాణి బిభిదుర్వసుధాతలమ్ |
తతః ప్రాగుత్తరాం గత్వా సాగరాః ప్రథితాం దిశమ్ ||

23

రోషాదభ్యఖనన్సర్వే పృథివీం సగరాత్మజాః |
తే తు సర్వే మహత్మానో భిమవేగా మహబలాః ||

24

దదృశుః కపిలం తత్ర వాసుదేవం సనాతనమ్ |
హయం చ తస్య దేవస్య చరంతమవిదూరతః ||

25

ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వే తే రఘునందన |
తే తం హయహరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః ||

26

ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరాః |
అభ్యధావంత సంక్రుద్ధాస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్ ||

27

అస్మాకం త్వం హి తురగం యజ్ఞీయం హృతవానసి |
దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్విద్ధి నః సగరాత్మజాన్ ||

28

శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన |
రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా ||

29

తతస్తేనాప్రమేయేణ కపిలేన మహాత్మనా |
భస్మరాశీకృతాః సర్వే కాకుత్స్థ సగరాత్మజాః ||

30

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చత్వారింశః సర్గః ||

Balakanda Sarga 40 Meaning In Telugu

భయంతో వణికి పోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.

” ఓ దేవతలారా! భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది.” అని అన్నాడు.

ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు.

“తండ్రీ! మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగ జాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి.” అని అడిగారు.

కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది.

“మీరు ఇంకా భూమిని తవ్వండి. అశ్వమును పట్టండి. అశ్వము లేకుండా తిరిగిరాకండి.” అని ఆజ్ఞాపించాడు సగరుడు.

సగరకుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళ లోకము చేరుకున్నారు.

వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగరకుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పుదిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును చూచి సగర కుమారులు ఆశ్చర్య పోయారు. సగరకుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేసారు. ఆ సారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలము తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి, ఉత్తర దిక్కుగా త్వరం భించారు. ఉత్తరదిక్కున కూడా వారికి భూమండలము ను మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు.

తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డిమేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు.

అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకొని తమ వద్దఉన్న ఆయుధములతో కపిలుని మీదికి దూకారు.

“ఓరీ! నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది. మేము ఎవరమో తెలియునా! మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా!” అంటూ కపిలుని చుట్టుముట్టారు.

కపిలుడు కళ్లు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారం లోనుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలభయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకచత్వారింశః సర్గః (41) >>

Balakanda Sarga 29 In Telugu – బాలకాండ ఏకోనత్రింశః సర్గః

Balakanda Sarga 29 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనత్రింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణులు పూర్వ అధ్యాయంలో సిద్ధ ఆశ్రమాన్ని, సిద్ధ ఆశ్రమాన్ని విచారించారు, దీని కోసం ఋషి విశ్వామిత్రుడు ఆ సన్యాసం వారసత్వం గురించి తెలియజేస్తాడు, ఎందుకంటే అది ఒకప్పుడు వామ్నా అవతారంలో విష్ణువుకు చెందినది. విశ్వామిత్రుడు దాని గురించి మరియు వామన అనే మరుగుజ్జు సన్యాసి బాలుడు భూమిపై చెడును ఎలా నిర్మూలించాడో వివరిస్తాడు. ఈ రామావతారంలో కూడా అలాగే చేయమని విశ్వామిత్ర మహర్షి నుండి రాముడికి ఒక సూచన.

సిద్ధాశ్రమః

అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః |
విశ్వామిత్రో మహాతేజా వ్యాఖ్యాతుముపచక్రమే ||

1

ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవరః ప్రభుః |
వర్షాణి సుబహూన్యేవ తథా యుగశతాని చ ||

2

తపశ్చరణయోగార్థమువాస సుమహాతపాః |
ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః ||

3

సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః |
ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనిర్బలిః ||

4

నిర్జిత్య దైవతగణాన్సేంద్రాంశ్చ సమరుద్గణాన్ |
కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః ||

5

[* యజ్ఞం చకార సుమహాన్ అసురేంద్రో మహాబలః | *]
బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః |
సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే ||

6

బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమమ్ |
అసమాప్తే క్రతౌ తస్మిన్ స్వకార్యమభిపద్యతామ్ ||

7

యే చైనమభివర్తంతే యాచితార ఇతస్తతః |
యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్ఛతి ||

8

స త్వం సురహితార్థాయ మాయాయోగముపాశ్రితః |
వామనత్వం గతో విష్ణో కురు కల్యాణముత్తమమ్ ||

9

ఏతస్మిన్నంతరే రామ కశ్యపోఽగ్నిసమప్రభః |
అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా ||

10

దేవీసహాయో భగవన్దివ్యం వర్షసహస్రకమ్ |
వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్ ||

11

తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్ |
తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురోషోత్తమమ్ ||

12

శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో |
త్వమనాదిరనిర్దేశ్యస్త్వామహం శరణం గతః ||

13

తమువాచ హరిః ప్రీతః కశ్యపం ధూతకల్మషమ్ |
వరం వరయ భద్రం తే వరార్హోఽసి మతో మమ ||

14

తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కశ్యపోఽబ్రవీత్ |
అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః ||

15

వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత |
పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ ||

16

భ్రాతా భవ యవీయాంస్త్వం శక్రస్యాసురసూదన |
శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి ||

17

అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి |
సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ఠ భగవన్నితః ||

18

అథ విష్ణుర్మహాతేజా అదిత్యాం సమజాయత |
వామనం రూపమాస్థాయ వైరోచనిముపాగమత్ ||

19

త్రీన్క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః |
ఆక్రమ్య లోకాఁల్లోకాత్మా సర్వలోకహితే రతః ||

20

మహేంద్రాయ పునః ప్రాదాన్నియమ్య బలిమోజసా |
త్రైలోక్యం స మహాతేజాశ్చక్రే శక్రవశం పునః ||

21

తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమః శ్రమనాశనః |
మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే ||

22

ఏతమాశ్రమమాయాంతి రాక్షసా విఘ్నకారిణః |
అత్రైవ పురుషవ్యాఘ్ర హంతవ్యా దుష్టచారిణః ||

23

అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమమనుత్తమమ్ |

తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ |
[* ఇత్యుక్త్వా పరమప్రీతో గృహ్య రామం సలక్ష్మణమ్ | *]
ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహామునిః ||

24

శశీవ గతనీహారః పునర్వసుసమన్వితః |
తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమనివాసినః ||

25

ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయన్ |
యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే ||

26

తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియామ్ |
ముహూర్తమివ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ||

27

ప్రాంజలీ మునిశార్దూలమూచతూ రఘునందనౌ |
అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుంగవ ||

28

సిద్ధాశ్రమోఽయం సిద్ధః స్యాత్సత్యమస్తు వచస్తవ |
ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

29

ప్రవివేశ తతో దీక్షాం నియతో నియతేంద్రియః |
కుమారావపి తాం రాత్రిముషిత్వా సుసమాహితౌ ||

30

ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాముపాస్య చ |
స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేన చ |
హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతామ్ ||

31

రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా, విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు.

” ఓ రామా! ఈ ప్రదేశములోనే శ్రీ మహా విష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేసాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహా విష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన, దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవత లందరినీ జయించి ముల్లోకములనూ పరిపాలిస్తున్నాడు. ఆ బలి చక్రవర్తి ఒక సారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్నా విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు.

ఓ విష్ణూ! బలి చక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు.

ఓ దేవా! నీవు దేవతల మేలు కోరి, వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి, మాకు మేలు చేయుము. ” అని ప్రార్థించారు.

అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు.

” ఓ పురుషోత్తమా! నీవు తపోమయు డవు. తపోరాశివి. తపోమూర్తివి. తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది, అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను. ” అని ప్రార్థించాడు.

అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు.

“భగవాన్! నీవు నాకు అదితికి పుత్రుడుగా జన్మించు. దేవేంద్రునికి తమ్ముడుగా జన్మించు. దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరములు తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్! నాకు పుత్రుడుగా జన్మించి నన్ను కృతార్ధుడిని చెయ్యి” అని ప్రార్థించాడు కశ్యపుడు.

కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణు మూర్తి, కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. తనకు మూడు అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలి చక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుట స్థలమును ఇస్తూ నీటిని ధారపోసాడు. వామనుడు బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. ముల్లోకములను ఆక్రమించాడు. బలి చక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతోముల్లోకములు మరలా మహేంద్రుని అధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమములో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి.

రామా! ఇప్పుడు మనము సిద్ధాశ్రమములో ప్రవేశిస్తున్నాము. రామా! ఈ ఆశమములో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు. ” అని అన్నాడు ఈ విశ్వామిత్రుడు.

రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమములో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకొని వెళ్లారు. వారిని పూజంచారు. అతిథి సత్కారములు చేసారు. రామ లక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు.

తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకుశుభం కలుగుతుంది. తమరు ఈ రోజునుండే యాగము ప్రారంభించండి. మేము యాగ రక్షణ చేస్తాము.” అని అన్నారు.

ఆ మాటలు విన్న విశ్రామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగ దీక్షను స్వీకరించాడు. రామ లక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రాత:కాల సంధ్యావందనము ఆచరించి, విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి, ఆయనతో ఇలా అన్నారు.

వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ త్రింశః సర్గః (30) >>

Ayodhya Kanda Sarga 10 In Telugu – అయోధ్యాకాండ దశమః సర్గః

Ayodhya Kanda Sarga 10 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ దశమ సర్గ రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం అయోధ్యను విడిచి వెళ్ళిన తరువాత జరిగే సంఘటనలు చిత్రించబడ్డాయి. వారి వనవాస ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, కష్టాలు, మరియు వారు కలసిన వ్యక్తులను ఈ సర్గ వివరంగా వర్ణిస్తుంది. అలాగే, అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు మరియు ఇతర కుటుంబ సభ్యుల మనోభావాలను కూడా ఈ సర్గ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సర్గ ద్వారా రాముడు మరియు అతని కుటుంబం ఎదుర్కొనే దుఃఖం, త్యాగం, మరియు ధైర్యం వంటి అంశాలు పాఠకుల హృదయాలను తాకుతాయి.

కైకేయ్యనునయః

విదర్శితా యదా దేవీ కుబ్జయా పాపయా భృశమ్ |
తదా శేతే స్మ సా భూమౌ దిగ్ధవిద్ధేవ కిన్నరీ ||

1

నిశ్చిత్య మనసా కృత్యం సా సమ్యగితి భామినీ |
మంథరాయై శనైః సర్వమాచచక్షే విచక్షణా ||

2

సా దీనా నిశ్చయం కృత్వా మంథరావాక్యమోహితా |
నాగకన్యేవ నిశ్వస్య దీర్ఘముష్ణం చ భామినీ ||

3

ముహూర్తం చింతయామాస మార్గమాత్మసుఖావహమ్ |
సా సుహృచ్చార్థకామా చ తన్నిశమ్య సునిశ్చయమ్ ||

4

బభూవ పరమప్రీతా సిద్ధిం ప్రాప్యేవ మంథరా |
అథ సా మర్షితా దేవీ సమ్యక్కృత్వా సునిశ్చయమ్ ||

5

సంవివేశాబలా భూమౌ నివేశ్య భృకుటీం ముఖే |
తతశ్చిత్రాణి మాల్యాని దివ్యాన్యాభరణాని చ ||

6

అపవిద్ధాని కైకేయ్యా తాని భూమిం ప్రపేదిరే |
తయా తాన్యపవిద్ధాని మాల్యాన్యాభరణాని చ ||

7

అశోభయంత వసుధాం నక్షత్రాణి యథా నభః |
క్రోధాగారే నిపతితా సా బభౌ మలినాంబరా ||

8

ఏకవేణీం దృఢం బధ్వా గతసత్త్వేవ కిన్నరీ |
ఆజ్ఞాప్య తు మహారాజో రాఘవస్యాభిషేచనమ్ ||

9

ఉపస్థాసమనుజ్ఞాప్య ప్రవివేశ నివేశనమ్ |
అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇతి జజ్ఞివాన్ ||

10

ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం వివేశాంతఃపురం వశీ |
స కైకేయ్యా గృహం శ్రేష్ఠం ప్రవివేశ మహాయశాః ||

11

పాండురాభ్రమివాకాశం రాహుయుక్తం నిశాకరః |
శుకబర్హిణసంఘుష్టం క్రౌంచహంసరుతాయుతమ్ ||

12

వాదిత్రరవసంఘుష్టం కుబ్జావామనికాయుతమ్ |
లతాగృహైశ్చిత్రగృహైశ్చంపకాశోకశోభితైః ||

13

దాంతరాజతసౌవర్ణవేదికాభిః సమాయుతమ్ |
నిత్యపుష్పఫలైర్వృక్షైర్వాపీభిశ్చోపశోభితమ్ ||

14

దాంతరాజతసౌవర్ణైః సంవృతం పరమాసనైః |
వివిధైరన్నపానైశ్చ భక్ష్యైశ్చ వివిధైరపి ||

15

ఉపపన్నం మహార్హైశ్చ భూషణైస్త్రిదివోపమమ్ |
తత్ప్రవిశ్య మహారాజః స్వమంతఃపురమృద్ధిమత్ ||

16

న దదర్శ ప్రియాం రాజా కైకేయీం శయనోత్తమే |
స కామబలసంయుక్తో రత్యర్థం మనుజాధిపః ||

17

అపశ్యన్దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాద చ |
న హి తస్య పురా దేవీ తాం వేలామత్యవర్తత ||

18

న చ రాజా గృహం శూన్యం ప్రవివేశ కదాచన |
తతో గృహగతో రాజా కైకేయీం పర్యపృచ్ఛత ||

19

యథాపురమవిజ్ఞాయ స్వార్థలిప్సుమపండితామ్ |
ప్రతిహారీ త్వథోవాచ సంత్రస్తా రచితాంజలిః ||

20

దేవ దేవీ భృశం కృద్ధా క్రోధాగారమభిదృతా |
ప్రతిహార్యా వచః శ్రుత్వా రాజా పరమదుర్మనాః ||

21

విషసాద పునర్భూయో లులితవ్యాకులేంద్రియః |
తత్ర తాం పతితాం భూమౌ శయానామతథోచితామ్ ||

22

ప్రతప్త ఇవ దుఃఖేన సోఽపశ్యజ్జగతీపతిః |
స వృద్ధస్తరుణీం భార్యాం ప్రాణేభ్యోఽపి గరీయసీమ్ ||

23

అపాపః పాపసంకల్పాం దదర్శ ధరణీతలే |
లతామివ వినిష్కృత్తాం పతితాం దేవతామివ ||

24

కిన్నరీమివ నిర్ధూతాం చ్యుతామప్సరసం యథా |
మాయామివ పరిభ్రష్టాం హరిణీమివ సంయతామ్ ||

25

కరేణుమివ దిగ్ధేన విద్ధాం మృగయునా వనే |
మహాగజ ఇవారణ్యే స్నేహాత్పరిమమర్శ తామ్ ||

26

పరిమృశ్య చ పాణిభ్యామభిసంత్రస్తచేతనః |
కామీ కమలపత్రాక్షీమువాచ వనితామిదమ్ ||

27

న తేఽహమభిజానామి క్రోధమాత్మని సంశ్రితమ్ |
దేవి కేనాభిశప్తా౭సి కేన వాఽసి విమానితా ||

28

యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసుషు |
భూమౌ శేషే కిమర్థం త్వం మయి కళ్యాణచేతసి ||

29

భూతోపహతచిత్తేవ మమ చిత్తప్రమాథినీ |
సంతి మే కుశలా వైద్యాస్త్వభితుష్టాశ్చ సర్వశః ||

30

సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిమాచక్ష్వ భామినీ |
కస్య వా తే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతమ్ ||

31

కః ప్రియం లభతామద్య కో వా సుమహదప్రియమ్ |
మా రోదీర్మా చ కార్షీస్త్వం దేవి సంపరిశోషణమ్ ||

32

అవధ్యో వధ్యతాం కో వా కోవా వధ్యః విముచ్యతామ్ |
దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్ వాఽప్యకించనః ||

33

అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః |
న తే కించిదభిప్రాయం వ్యాహంతుమహముత్సహే ||

34

ఆత్మనో జీవితేనాపి బ్రుహి యన్మనసేచ్ఛసి |
బలమాత్మని జానంతీ న మాం శంకితుమర్హసి ||

35

కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే |
యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా ||

36

ప్రాచీనాః సింధుసౌవీరాః సౌరాష్ట్రా దక్షిణాపథాః |
వంగాంగమగధా మత్స్యాః సమృద్ధాః కాశికోసలాః ||

37

తత్ర జాతం బహుద్రవ్యం ధనధాన్యమజావికమ్ |
తతో వృణీష్వ కైకేయి యద్యత్త్వం మనసేచ్ఛసి ||

38

కిమాయాసేన తే భీరు ఉత్తిష్ఠోత్తిష్ఠ శోభనే |
తత్త్వం మే బ్రూహి కైకేయి యతస్తే భయమాగతమ్ ||

39

తత్తే వ్యపనయిష్యామి నీహారమివ భాస్కరః | [రశ్మివాన్]
తథోక్తా సా సమాశ్వస్తా వక్తుకామా తదప్రియమ్ |
పరిపీడయితుం భూయో భర్తారముపచక్రమే ||

40

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే దశమః సర్గః ||

Ayodhya Kanda Sarga 10 Meaning In Telugu

కైక, మంధర, ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో దశరథుడు వస్తే ఇలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడు కున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లాపడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది.

ఇంతలో మరునాడు జరగ వలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు, వసిష్ఠుడు వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని, ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని, వడి వడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు.

ఎప్పుడూ కళకళలాడే కైకేయీ మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైకజాడ లేదు.

ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసు కొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకొని వెళ్లేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం. కాని తప్పలేదు. అడిగాడు.

వారు దశరథునికి నమస్కరించి వినయంగా “మహారాజా! కైకేయీ మహారాణీవారు. కోపగృహంలో ఉన్నారు.”అని చెప్పారు.

ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా! ఎందుకు! ఏమీ కారణము! అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. దశరథుడు. మెల్ల మెల్ల గా కైకేయీ పడుకొని ఉన్న కోపగృహమునకు వెళ్లాడు. నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బతగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగ నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లిగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు.

“దేవీ! ఏమిటీ ఈ అలుక. దేనికి ఈ అలుక. నామీద కోపం ఎందుకు. నేను చేసిన అపరాధము ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా! లేక ఎవరన్నా నిన్ను అవమానించారా! నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేల? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు?

అయ్యో ఇన్ని అడుగుతున్నాను. నీ ఆరోగ్యము సంగతే అడగ లేదు. నీకు ఆరోగ్యము సరిగా లేదా! రాజ వైద్యులను పిలిపించనా! నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలని అనుకొంటున్నావా. ఎవరైనా సరే వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా చెప్పు. వాళ్లను కఠినంగా శిక్షిస్తాను.

అయ్యో దేవీ! ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు. ఇదిగో ఒకే మాట. చెబుతున్నాను విను. నీవు కోరితే చంప కూడని వాడి నన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసినవాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను.

దేవీ! నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ, అసంభవాన్ని సంభవంగానూ చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు. నేను నా మంత్రులు, పరివారమూ ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది. మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా! ఇంకా ఈ దిగులు ఎందుకు దేవీ. ఇంతకూ నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయిన సరే నెరవేరుస్తాను.

నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలము మీద ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు. నెరవేరుస్తాను. ఈ దేశమే నీది. ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది. కోరుకో! నీ ఇష్టం వచ్చినవి కోరుకో!

నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా! ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్యు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము. సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశమూ, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యమూ అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో ఇస్తాను.

ఓ లలనా మణీ! ఇంతకూ నీ దుఃఖ కారణము, భయ కారణము ఏమి. నాకు చెప్పవా. చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు.” అని సకలవిధాలా అనునయించాడు దశరథుడు.

దశరథుని మాటలు అన్నీ విన్న కైక “ఇనుము బాగా కాలి సమ్మెటదెబ్బలకు అనుకూలంగా ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది.” అని మనసులో అనుకొంది కైక.

ఇప్పుడు తన మనసులోని మాట మెల్ల మెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

(ఇంతకుముందు సర్గలో మనకు మంధర పాత్ర వచ్చింది. ఈ సర్గలో దశరథుని పాత్ర ప్రాముఖ్యం వహించింది. మంధర కైకేయి దాసి. పుట్టింటి నుండి వచ్చింది. సాధారణంగా మంథర మాటకు విలువ ఇస్తుంది కైక. కాని కైకకు రాముడు అంటే చిన్నప్పటినుండి ఎంతో ప్రేమ, మక్కువ. తన కుమారుడు భరతుని తో పాటుపెంచింది. రామునికి పట్టాభిషేకము అంటే ఎంతో సంతోషించింది. ఆ మాట చెప్పిన మంథరకు బహుమానం కూడా ఇచ్చింది.

కైక దశరథుని భార్య. బాగా చదువుకున్నది. విచక్షణా జ్ఞానం కలది అనుకోవాలి. కాని చెప్పుడు మాటలకు మోసపోయింది. ఒకే విషయం పదే పదే చెప్పడం వల్ల అది నిజం అవుతుంది అంటారు పెద్దలు. రాముడు అయోధ్యలో ఉంటే భరతునికి భవిష్యత్తులేదు అనేమాటను పదే పదే వల్లించింది మంథర. రకరకాలుగా వర్ణించి చెప్పింది. అది దాని ఆలోచన. ఒక దాసి అంతకన్నా ఉన్నతంగా ఎలా ఆలోచించగలదు! కాని ఆ మాటలను గుడ్డిగా నమ్మేసింది కైక.

చెప్పుడు మాటలు వినరాదు అని మనకు అందరికీ తెలుసు. కాని సోదాహరణంగా నిరూపించాడు వాల్మీకి. ఎందరో ఎన్నో చెబుతుంటారు. కాని ప్రతివాడూ తన విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి.

ఒకాయన ఆఫీసుకు వెళ్లాడు. ఆయన భార్యకు ఆమె తల్లి హాస్పిటల్ లో చేరిందని ఫోన్ వస్తుంది. ఆమె హడావిడిగా బయటకు వస్తుంది. పక్కింటి రామారావు తన బైక్ మీద అప్పుడే బయటకు వెళు తుంటాడు. హాస్పిటల్ దాకా లిఫ్టుఅడుగుతుంది ఆమె. ఆయన సరే అంటాడు. ఆయన వెనక బైక్ మీద కూర్చుని హాస్పిటలుకు వెళుతుంది. వీళ్లిద్దరూ బైక్ మీద వెళ్లడం ఒక అనుమాన పక్షిచూస్తాడు. దానికి కాస్త మసాలా తగిలించి ఆమె భర్తకు “నీ భార్య ఎవరితోనో తిరుగుతూ ఉంది” అని నూరిపోస్తాడు. వాడు నమ్మేస్తాడు. వ్యవహారం విడాకుల దాకా వెళుతుంది. ఇది సర్వసాధారణం. అతడు కాస్త విచక్షణా జ్ఞానం ఉపయోగించి “నాతో ఇన్నాళ్లు పవిత్రంగా నమ్మకంగా కాపురం చేసిన భార్య ఈనాడు సడన్ గా ఎందుకు పరాయివాడితో తిరుగుతుంది” అని కొన్ని క్షణాలు తర్కించుకుంటే నిజానిజాలు బయటపడతాయి. వాళ్ల కాపురంలో కలతలు రావు. అలాగే “రాముడు నా కుమారుడికి ఇంత ద్రోహం చేస్తాడా. మంథర మాటలలో నిజం ఎంత” అని కైక కొంచెం ఆలోచించి ఉంటే రామాయణం మరొక విధంగా ఉండేది. కాబట్టి చెప్పుడు మాటలు వినడం, తొందరగా నిర్ణయాలు తీసుకోడం ఆత్మహత్యాసదృశం అని మనకు బోధ చేస్తుంది రామాయణం.

తరువాత ఈ సర్గలో దశరథుని పాత్ర. దశరథుడు అయోధ్యకు మహారాజు. ఎన్నో యజ్ఞములు యాగములు చేసాడు. వసిష్ఠుని పురోహితునిగా కలవాడు. జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు. ఆయన భార్య కైక. మూడో భార్య కైక మీద ఆయనకు అధికమైన ప్రేమ ఉందని, ఆయనకు ముద్దులభార్యఅని నానుడి. కాని ఆ విషయం మనకు ఎక్కడా కనపడలేదు. పైగా పాయసం పంచడంలో కైకకు ఎనిమిదవ వంతు మాత్రమే ఇచ్చాడు దశరథుడు. అదీ ఒక వంతు మాత్రం ఇచ్చాడు. రెండవ ఎనిమిదవ భాగం సుమిత్రకు ఇచ్చాడు. దశరథునికి కైక మీద అత్యధిక ప్రేమ ఉంటే సగభాగం ఇచ్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక మీద దశరథునికి అధికమైన ప్రేమ ఉంది అనడానికి ఆధారాలు లేవు.

కాని రాబోవు సర్గలలో ఒక విషయం ప్రస్ఫుటంగా అర్థం. అవుతుంది. కౌసల్య పేరుకు పట్టపు రాణి అయినా ఆమెను దశరథుడు నిరాదరించాడు. ఏనాడూ తక్కిన భార్యలతో సమానంగా చూడలేదు. అందుకే కౌసల్య సవతులందరిలో నిరాదరణకు గురి అయింది. రాముడు వనవాసమునకు వెళితో సవతులు తనను బతకనివ్వరు అనివాపోతుంది. దీనిని బట్టి దశరథుడు కైకను ఎక్కువగా ఆదరించాడు అని మనకు తెలుస్తూ ఉంది.

అలాంటి కైక మంథర మాటలు విని కోపగృహంలో పడుకొని ఉంది. దశరథుడు కోపగృహం ప్రవేశించాడు. కోపకారణం అడిగాడు. ఆమె బదులు చెప్పలేదు. అప్పుడు మొదలెట్టాడు. ఈ రాజ్యం నీది అన్నాడు. నేను, నా పరివారము, నీకు దాసులము అన్నాడు. చంపదగని వాడినికూడా నువ్వు కావాలంటే చంపుతాను అన్నాడు. చంపదగిన వాడిని కూడా నువ్వు ఊ అంటే వదిలేస్తాను అన్నాడు. (అంటే నీ కోసం హంతకులను వదిలేస్తాను, నిరపరాధులను ఉ రితీస్తాను అని అర్థం). నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను అంటాడు.

దశరథుడు లాంటి చక్రవర్తి తన భార్య కేవలం కోపంతో ఉంది అన్నంత మాత్రాన ఇంత దిగజారిపోవాలా! పోనీ అన్నీ అబద్ధాలు చెప్పాడు అని అనుకుంటే ఆయన సత్యసంధుడు అని పేరు. మరి వాల్మీకి ఎందుకు అలా రాసాడు? కారణం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఎంతటివారలైనా కాంత దాసులే. రాబోవు కాలంలో జరగబోయే పరిణామాన్ని త్రేతాయుగంలోనే చెప్పాడు వాల్మీకి. నేడు మనం ఎన్నో స్త్రీ సంబంధమైన స్కాండల్సు వింటున్నాము. చూస్తున్నాము. ఎంతటి గొప్పవారైనా తాను కోరుకున్న స్త్రీ ముందు దాసోహం అంటారు. సమస్తం ధారపోయడానికి సిద్ధపడతారు . వాళ్లు చదువుకున్న ఉన్నత విద్యలు, పదవులు, సంస్కారము, ఏవీ గుర్తుకురావు. అడ్డురావు. సమస్తం ఆమెతోడిదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తారు. చివరకు ఊబిలో పడిపోతారు. అలాంటి ప్రమాదాల నుండి జాగ్రత్త పడమని వాల్మీకి ఈ సంఘటనల ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు.

అలాగే అహల్య వృత్తాంతం కూడా. అహల్య తన భర్త గౌతముని కాకుండా పరాయి పురుషుడితో కామక్రీడలు కొనసాగించింది. ఫలితం వెంటనే అనుభవించింది. కొన్ని వందల సంవత్సరాల పాటు అచేనంగా ఒంటరిగా దుమ్ము ధూళిలో పడి ఉంది. ఈరోజుల్లో కూడా పరాయి పురుషుడి మోజులో పడిన స్త్రీలు, స్వంత భర్తను, పిల్లలను హతమార్చడం లాంటి సంఘటనలు వింటున్నాము. వెంటనే కటకటాల పాలవుతున్నారు. శిక్షలు అనుభవిస్తున్నారు.

ఈ రోజుల్లో స్త్రీలు పతివ్రతలు కానక్కరలేదు. కనీసం భర్తకు విధేయతగా ఉంటేచాలు. సంసారం సాఫీగా గడిచిపోతుంది. ఈ సందేశాన్ని మనకు అహల్య వృత్తాంతం ద్వారా అందించాడు వాల్మీకి.

రామాయణం కేవలం ఆధ్యాత్మిక కావ్యంగా కాకుండా ఒక సామాజిక గ్రంధంగా చదవగలిగితే ఇలాంటి సూక్తులు ఎన్నో మనకు మన దైనందిన జీవితంలో ఉపకరిస్తాయి అని నా భావన.)

అయోధ్యాకాండ ఏకాదశః సర్గః (11) >>

Ayodhya Kanda Sarga 9 In Telugu – అయోధ్యాకాండ నవమః సర్గః

Ayodhya Kanda Sarga 9 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండం లోని నవమ సర్గ, రామాయణంలోని ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు అయోధ్యను విడిచిపోవడం మరియు ఆ క్రమంలో జరిగిన సంఘటనలు చిత్రీకరించబడ్డాయి. రాముడి పుట్టుక, బాల్యము, మరియు రాజ్యాభిషేకము వరకు జరిగిన సంఘటనలు అయోధ్యాకాండలో ప్రస్తావించబడినవి. నవమ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరుతారు. ఈ సందర్భంలో దశరథ మహారాజు, కౌసల్యా మరియు అయోధ్య ప్రజలు అనుభవించిన దుఃఖాన్ని ఈ సర్గలో వివరించబడింది. కుటుంబబాంధవ్యాలు, విధి, మరియు త్యాగం వంటి ముఖ్యమైన విషయాలు ఈ సర్గలో ప్రధానంగా ఉంటాయి.

రామప్రవాసనోపాయచింతా

ఏవముక్తా తు కైకేయీ క్రోధేన జ్వలితాననా |
దీర్ఘముష్ణం వినిశ్వస్య మంథరామిదమబ్రవీత్ ||

1

అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహమ్ |
యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||

2

ఇదం త్విదానీం సంపశ్యే కేనోపాయేన మంథరే |
భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన ||

3

ఏవముక్తా తు సా దేవ్యా మంథరా పాపదర్శినీ |
రామార్థముపహింసంతీ కైకేయీమిదమబ్రవీత్ ||

4

హంతేదానీం ప్రవక్ష్యామి కైకేయి శ్రూయతాం చ మే |
యథా తే భరతో రాజ్యం పుత్రః ప్రాప్స్యతి కేవలమ్ ||

5

కిం న స్మరసి కైకేయి స్మరంతీ వా నిగూహసే |
యదుచ్యమానమాత్మార్థం మత్తస్త్వం శ్రోతుమిచ్ఛసి ||

6

మయోచ్యమానం యది తే శ్రోతుం ఛందో విలాసిని |
శ్రూయతామభిధాస్యామి శ్రుత్వా చాపి విమృశ్యతామ్ ||

7

శ్రుత్వైవం వచనం తస్యాః మంథరాయాస్తు కైకయీ |
కించిదుత్థాయ శయనాత్స్వాస్తీర్ణాదిదమబ్రవీత్ ||

8

కథయ త్వం మమోపాయం కేనోపాయేన మంథరే |
భరతః ప్రాప్నుయాద్రాజ్యం న తు రామః కథంచన ||

9

ఏవముక్తా తయా దేవ్యా మంథరా పాపదర్శినీ |
రామార్థముపహింసంతీ కుబ్జా వచనమబ్రవీత్ ||

10

తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిః పతిః |
అగచ్ఛత్త్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ ||

11

దిశమాస్థాయ వై దేవి దక్షిణాం దండకాన్ప్రతి |
వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిధ్వజః ||

12

స శంబర ఇతి ఖ్యాతః శతమాయో మహాసురః |
దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైరనిర్జితః ||

13

తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షతవిక్షతాన్ |
రాత్రౌ ప్రసుప్తాన్ ఘ్నంతి స్మ తరసాఽఽసాద్య రాక్షసాః ||

14

తత్రాకరోన్మహద్యుద్ధం రాజా దశరథస్తదా |
అసురైశ్చ మహాబాహుః శస్త్రైశ్చ శకలీకృతః ||

15

అపవాహ్య త్వయా దేవి సంగ్రామాన్నష్టచేతనః |
తత్రాపి విక్షతః శస్త్రైః పతిస్తే రక్షితస్త్వయా ||

16

తుష్టేన తేన దత్తౌ తే ద్వౌ వరౌ శుభదర్శనే |
స త్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరౌ ||

17

గృహ్ణీయామితి తత్తేన తథేత్యుక్తం మహాత్మనా |
అనభిజ్ఞా హ్యహం దేవి త్వయైవ కథితా పురా ||

18

కథైషా తవ తు స్నేహాత్ మనసా ధార్యతే మయా |
రామాభిషేకసంభారాన్నిగృహ్య వినివర్తయ ||

19

తౌ వరౌ యాచ భర్తారం భరతస్యాభిషేచనమ్ |
ప్రవ్రాజనం తు రామస్య త్వం వర్షాణి చతుర్దశ ||

20

చతుర్దశ హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనమ్ |
ప్రజాభావగతస్నేహః స్థిరః పుత్రో భవిష్యతి ||

21

క్రోధాగారం ప్రవిశ్యాద్య క్రుద్ధేవాశ్వపతేః సుతే |
శేష్వానంతర్హితాయాం త్వం భూమౌ మలినవాసినీ ||

22

మా స్మైనం ప్రత్యుదీక్షేథా మా చైనమభిభాషథాః |
రుదంతీ చాపి తం దృష్ట్వా జగత్యాం శోకలాలసా ||

23

దయితా త్వం సదా భర్తుః అత్ర మే నాస్తి సంశయః |
త్వత్కృతే స మహారాజో విశేదపి హుతాశనమ్ ||

24

న త్వాం క్రోధయితుం శక్తో న క్రుద్ధాం ప్రత్యుదీక్షితుమ్ |
తవ ప్రియార్థం రాజా హి ప్రాణానపి పరిత్యజేత్ ||

25

న హ్యతిక్రమితుం శక్తస్తవ వాక్యం మహీపతిః |
మందస్వభావే బుద్ధ్యస్వ సౌభాగ్యబలమాత్మనః ||

26

మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ |
దద్యాద్దశరథో రాజా మాస్మ తేషు మనః కృథాః ||

27

యౌ తౌ దైవాసురే యుద్ధే వరౌ దశరథోఽదదాత్ |
తౌ స్మారయ మహాభాగే సోఽర్థో మా త్వామతిక్రమేత్ ||

28

యదాతు తే వరం దద్యాత్ స్వయముత్థాప్య రాఘవః |
వ్యవస్థాప్య మహారాజం త్వమిమం వృణుయా వరమ్ ||

29

రామం ప్రవ్రాజయారణ్యే నవ వర్షాణి పంచ చ |
భరతః క్రియతాం రాజా పృథివ్యాః పార్థివర్షభః ||

30

చతుర్దశ హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనమ్ |
రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః ||

31

రామప్రవ్రాజనం చైవ దేవి యాచస్వ తం వరమ్ |
ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాస్తవ భామినీ ||

32

ఏవం ప్రవ్రాజితశ్చైవ రామోఽరామో భవిష్యతి |
భరతశ్చ హతామిత్రస్తవ రాజా భవిష్యతి ||

33

యేన కాలేన రామశ్చ వనాత్ప్రత్యాగమిష్యతి |
తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి ||

34

సుగృహీతమనుష్యశ్చ సుహృద్భిః సార్ధమాత్మవాన్ |
ప్రాప్తకాలం తు తే మన్యే రాజానం వీతసాధ్వసా ||

35

రామాభిషేకసంభారాన్నిగృహ్య వినివర్తయ |
అనర్థమర్థరూపేణ గ్రాహితా సా తతస్తయా ||

36

హృష్టా ప్రతీతా కైకేయీ మంథరామిదమబ్రవీత్ |
సా హి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథం గతా ||

37

కైకేయీ విస్మయం ప్రాప్తా పరం పరమదర్శనా |
కుబ్జే త్వాం నాభిజానామి శ్రేష్ఠాం శ్రేష్ఠాభిధాయినీమ్ ||

38

పృథివ్యామసి కుబ్జానాముత్తమా బుద్ధినిశ్చయే |
త్వమేవ తు మమాఽర్థేషు నిత్యయుక్తా హితైషిణీ ||

39

నాహం సమవబుధ్యేయం కుబ్జే రాజ్ఞశ్చికీర్షితమ్ |
సంతి దుఃసంస్థితాః కుబ్జా వక్రాః పరమదారుణాః ||

40

త్వం పద్మమివ వాతేన సన్నతా ప్రియదర్శనా |
ఉరస్తేఽభినివిష్టం వై యావత్స్కంధాత్ సమున్నతమ్ ||

41

అధస్తాచ్చోదరం శాతం సునాభమివ లజ్జితమ్ |
పరిపూర్ణం తు జఘనం సుపీనౌ చ పయోధరౌ ||

42

విమలేందుసమం వక్త్రమహో రాజసి మంథరే |
జఘనం తవ నిర్ఘుష్టం రశనాదామశోభితమ్ ||

43

జంఘే భృశముపన్యస్తే పాదౌ చాప్యాయతావుభౌ |
త్వమాయతాభ్యాం సక్థిభ్యాం మంథరే క్షౌమవాసినీ ||

44

అగ్రతో మమ గచ్ఛంతీ రాజహంసీవ రాజసే |
ఆసన్యాః శంబరే మాయాః సహస్రమసురాధిపే ||

45

సర్వాస్త్వయి నివిష్టాస్తా భూయశ్చాన్యాః సహస్రశః |
తవేదం స్థగు యద్దీర్ఘం రథఘోణమివాయతమ్ ||

46

మతయః క్షత్రవిద్యాశ్చ మాయాశ్చాత్ర వసంతి తే |
అత్ర తే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీమ్ ||

47

అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే |
జాత్యేన చ సువర్ణేన సునిష్టప్తేన మంథరే || [సుందరి]

48

లబ్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు |
ముఖే చ తిలకం చిత్రం జాతరూపమయం శుభమ్ ||

49

కారయిష్యామి తే కుబ్జే శుభాన్యాభరణాని చ |
పరిధాయ శుభే వస్త్రే దేవతేవ చరిష్యసి ||

50

చంద్రమాహ్వయమానేన ముఖేనాప్రతిమాననా |
గమిష్యసి గతిం ముఖ్యాం గర్వయంతీ ద్విషజ్జనమ్ ||

51

తవాపి కుబ్జాః కుబ్జాయాః సర్వాభరణభూషితాః |
పాదౌ పరిచరిష్యంతి యథైవ త్వం సదా మమ ||

52

ఇతి ప్రశస్యమానా సా కైకేయీమిదమబ్రవీత్ |
శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ ||

53

గతోదకే సేతుబంధో న కళ్యాణి విధీయతే |
ఉత్తిష్ఠ కురు కళ్యాణి రాజానమనుదర్శయ ||

54

తథా ప్రోత్సాహితా దేవీ గత్వా మంథరయా సహ |
క్రోధాగారం విశాలాక్షీ సౌభాగ్యమదగర్వితా ||

55

అనేకశతసాహస్రం ముక్తాహారం వరాంగనా |
అవముచ్య వరార్హాణి శుభాన్యాభరణాని చ ||

56

తతో హేమోపమా తత్ర కుబ్జావాక్యవశం గతా |
సంవిశ్య భూమౌ కైకేయీ మంథరామిదమబ్రవీత్ ||

57

ఇహ వా మాం మృతాం కుబ్జే నృపాయావేదయిష్యసి |
వనం తు రాఘవే ప్రాప్తే భరతః ప్రాప్స్యతి క్షితిమ్ ||

58

న సువర్ణేన మే హ్యర్థో న రత్నైర్న చ భూషణైః |
ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే ||

59

అథో పునస్తాం మహిషీం మహీక్షితో
వచోభిరత్యర్థమహాపరాక్రమైః |
ఉవాచ కుబ్జా భరతస్య మాతరం
హితం వచో రామముపేత్య చాహితమ్ ||

60

ప్రపత్స్యతే రాజ్యమిదం హి రాఘవో
యది ధ్రువం త్వం ససుతా చ తప్స్యసే |
అతో హి కళ్యాణి యతస్వ తత్తథా
యథా సుతస్తే భరతోఽభిషేక్ష్యతే ||

61

తథాఽతివిద్ధా మహిషీ తు కుబ్జయా
సమాహతా వాగిషుభిర్ముహుర్ముహుః |
నిధాయ హస్తౌ హృదయేఽతివిస్మితా
శశంస కుబ్జాం కుపితా పునః పునః ||

62

యమస్య వా మాం విషయం గతామితో
నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి |
వనం గతే వా సుచిరాయ రాఘవే
సమృద్ధకామో భరతో భవిష్యతి ||

63

అహం హి నైవాస్తరణాని న స్రజో
న చందనం నాంజనపానభోజనమ్ |
న కించిదిచ్ఛామి న చేహ జీవితం
న చేదితో గచ్ఛతి రాఘవో వనమ్ ||

64

అథైతదుక్త్వా వచనం సుదారుణం
నిధాయ సర్వాభరణాని భామినీ |
అసంవృతామాస్తరణేన మేదినీ-
-మథాధిశిశ్యే పతితేవ కిన్నరీ ||

65

ఉదీర్ణసంరంభతమోవృతాననా
తథావముక్తోత్తమమాల్యభూషణా |
నరేంద్రపత్నీ విమనా బభూవ సా
తమోవృతా ద్యౌరివ మగ్నతారకా ||

66

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే నవమ సర్గః ||

Ayodhya Kanda Sarga 9 Meaning In Telugu 

ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్తితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాసుల దగ్గరినుంచీ నిరక్షరాస్యులవరకూ జరుగుతుంది. కైక విద్వాంసురాలు. దశరథుని భార్య. కేకయ దేశపు రాకుమార్తె. కాని మంథర మాటలకు లోబడి పోయింది. రాముడు పుట్టినప్పటినుండి, రాముని తన కుమారునికన్న ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మంథర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ అనురాగము ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము అసూయ ప్రబలాయి.

మంథర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారస్థాయికి చేరుకుంది. రోషంతో మంథరతో ఇలా అంది.

“మంధరా! ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంక ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంత వరకూ భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్లాలి, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మంథరా! నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు.” అని అడిగింది కైక.

తన పాచిక పారినందుకు మంథర లోలోపల సంతోషించింది. ఇందులో మంథరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మంధరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మంథరకు పదివేలు. మంథర రెచ్చిపోయి కైకతో ఇలా అంది.

“నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉ దమ్మా. ఏ పని అయిన చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంత సేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా! నేను చెప్పాలా చెప్పు. నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా!” అంది మంథర

వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీది నుండి లేచి మంథర దగ్గరగా వచ్చింది. “లేదే మంథరా. నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు.” అని అడిగింది కైక.

“దానికే వస్తున్నానమ్మా! నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా. అదేనమ్మా! దేవాసుర యుద్ధంజరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్లాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్లావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధము చేసాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రి రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోసారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. కాని రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కిందపడి నీ పోయాడు. స్పృహ కోల్పోయాడు.

అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకొని పోయి కాపాడావు కదా! కాని రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేసారు. మరలా నీవు నీ భర్తను రణరంగంనుండి రాక్షసుల కంట పడకుండా దూరంగా తీసుకొని పోయి కాపాడావు. అలా నీ భర్తను రెండు సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీకు రెండు సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు రెండు వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టంవచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది.

ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. రెండవ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరిచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇదీ పధకము.

ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని, తలకు కట్టుకట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా! దశరథుడు నీ దగ్గరకు వచ్చినపుడు పెద్దపెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు. మాట్లాడ కూడదు. ఆయన మాట్లాడించినా ఎడమొహం పెడమొహంగా ఉండాలి.

నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ అభిమానము. నీ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏం అడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న రెండు వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు, రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. రెండు వరాలు జాగ్రత్తగా కోరుకో.

మొదటి వరం రాముని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. రెండవ వరము గా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లూనుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరిచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒక వేళ వనవాసము నుండి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను.” అని మంథర కైకకు ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది.

మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలను చెప్పిన మంథరను మనసులోనే అభినందించింది.

(ఇక్కడ వాల్మీకి ఒక వాక్యం రాసాడు. కైకేయి స్వతాహాగా మంచి గుణములు కలది అయినా తన దాసి మంథర దుర్బోధలను విని ఏమీ తెలియని అమాయకురాలైన బాలిక వలె చెడుతోవలో నడిచింది. అని. ఇలాంటి మంధరలు మనకు ప్రతి ఇంటా కనపడతారు. వాళ్లు మన బంధువులైనా కావచ్చు లేక పక్కింటి వాళ్లు ఎదురింటి వాళ్లు కావచ్చు. వారి చెప్పుడు మాటలకు లోబడి సంసారాలు చెడ గొట్టుకొనే కైకలు ఎంతో మంది మన కళ్లముందే కనపడతున్నారు.)

“ఆ హా మంధరా! నీకు ఎన్ని విషయాలు తెలుసే. నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకూ తెలియదు. నీమేలు ఎన్నటికీ మరువలేను. మంథరా! అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో, ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను.” అని మంథరను పొగిడింది.

తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మంథర పొంగి పోయింది. “ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా. నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరిచిపోయావా” అంది మంథర.

“లేదు లేవే. అన్నీ గుర్తున్నాయి.” అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టు బట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టు కట్టింది. నేలమీద పడుకుంది.

“మంథరా! రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి. లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు.” అని పలికింది.

“అవన్నీ నాకు తెలుసు లేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్ఛితంగా ఉండు. రాముని అరణ్య వాసము, భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలి అని చెప్పు.” అని చెప్పింది మంథర.

“అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే.” అని పలికింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ దశమః సర్గః (10) >>

Ayodhya Kanda Sarga 35 In Telugu – అయోధ్యాకాండ పంచత్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 35

అయోధ్యాకాండము పంచత్రింశః సర్గము (35వ సర్గ) రామాయణంలో భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు చీరలను ధరించి, గంగా నదిని చేరుకుంటారు. అక్కడ నదిని దాటేందుకు గుహ అనే గిరిజన రాజును కలుస్తారు. గుహ, రామునికి తన భక్తిని, ప్రేమను ప్రదర్శిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులకు సేవ చేస్తాడు. వారు అరణ్యవాసం ప్రారంభం చేసేందుకు నదిని దాటుతారు. ఈ సర్గ రాముని వినయాన్ని, సీతా, లక్ష్మణుల సహనాన్ని, గుహ భక్తిని మరియు దాతృత్వాన్ని చూపిస్తుంది. రాముడు ధర్మాన్ని పాటిస్తూ ప్రజల కోసం త్యాగం చేసే వ్యక్తిగా ఇక్కడ ప్రదర్శించబడతాడు.

సుమంత్రగర్హణమ్

తతో నిర్ధూయ సహసా శిరో నిఃశ్వస్య చాసకృత్ |
పాణిం పాణౌ వినిష్పిష్య దంతాన్కటకటాప్య చ || ౧ ||

లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ |
కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః || ౨ ||

మనః సమీక్షమాణశ్చ సూతో దశరథస్య సః |
కంపయన్నివ కైకేయ్యా హృదయం వాక్ఛరైః శితైః || ౩ ||

వాక్యవజ్రైరనుపమైర్నిర్భిందన్నివ చాశుగైః |
కైకేయ్యాః సర్వమర్మాణి సుమంత్రః ప్రత్యభాషత || ౪ ||

యస్యాస్తవ పతిస్త్యక్తో రాజా దశరథః స్వయమ్ |
భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ || ౫ ||

న హ్యకార్యతమం కించిత్తవ దేవీహ విద్యతే |
పతిఘ్నీం త్వామహం మన్యే కులఘ్నీమపి చాంతతః || ౬ ||

యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యమివాచలమ్ |
మహోదధిమివాక్షోభ్యం సంతాపయసి కర్మభిః || ౭ ||

మాఽవమంస్థా దశరథం భర్తారం వరదం పతిమ్ |
భర్తురిచ్ఛా హి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే || ౮ ||

యథావయో హి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే |
ఇక్ష్వాకుకులనాథేఽస్మింస్తల్లోపయితుమిచ్ఛసి || ౯ ||

రాజా భవతు తే పుత్రో భరతః శాస్తు మేదినీమ్ |
వయం తత్ర గమిష్యామో యత్ర రామో గమిష్యతి || ౧౦ ||

న హి తే విషయే కశ్చిద్బ్రాహ్మణో వస్తుమర్హతి |
తాదృశం త్వమమర్యాదమద్య కర్మ చికీర్షసి || ౧౧ ||

ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశమ్ |
ఆచరంత్యా న వివృతా సద్యో భవతి మేదినీ || ౧౨ ||

మహాబ్రహ్మర్షిసృష్టా హి జ్వలంతో భీమదర్శనాః |
ధిగ్వాగ్దండా న హింసంతి రామప్రవ్రాజనే స్థితామ్ || ౧౩ ||

ఆమ్రం ఛిత్వా కుఠారేన నింబం పరిచరేత్తు యః |
యశ్చైనం పయసా సించేన్నైవాస్య మధురో భవేత్ || ౧౪ ||

అభిజాతం హి తే మన్యే యథా మాతుస్తథైవ చ |
న హి నింబాత్స్రవేత్క్షౌద్రం లోకే నిగదితం వచః || ౧౫ ||

తవ మాతురసద్గ్రాహం విద్మః పూర్వం యథా శ్రుతమ్ |
పితుస్తే వరదః కశ్చిద్దదౌ వరమనుత్తమమ్ || ౧౬ ||

సర్వభూతరుతం తస్మాత్సంజజ్ఞే వసుధాధిపః |
తేన తిర్యగ్గతానాం చ భూతానాం విదితం వచః || ౧౭ ||

తతో జృంభస్య శయనే విరుతాద్భూరివర్చసః |
పితుస్తే విదితో భావః స తత్ర బహుధాహసత్ || ౧౮ ||

తత్ర తే జననీ క్రుద్ధా మృత్యుపాశమభీప్సతీ |
హాసం తే నృపతే సౌమ్య జిజ్ఞాసామీతి చాబ్రవీత్ || ౧౯ ||

నృపశ్చోవాచ తాం దేవీం దేవి శంసామి తే యది |
తతో మే మరణం సద్యో భవిష్యతి న సంశయః || ౨౦ ||

మాతా తే పితరం దేవి తతః కేకయమబ్రవీత్ |
శంస మే జీవ వా మా వా న మామపహసిష్యసి || ౨౧ ||

ప్రియయా చ తథోక్తః సన్కేకయః పృథివీపతిః |
తస్మై తం వరదాయార్థం కథయామాస తత్త్వతః || ౨౨ ||

తతః స వరదః సాధూ రాజానం ప్రత్యభాషత |
మ్రియతాం ధ్వంసతాం వేయం మా కృథాస్త్వం మహీపతే || ౨౩ ||

స తచ్ఛ్రుత్వా వచస్తస్య ప్రసన్నమనసో నృపః |
మాతరం తే నిరస్యాశు విజహార కుబేరవత్ || ౨౪ ||

తథా త్వమపి రాజానం దుర్జనాచరితే పథి |
అసద్గ్రాహమిమం మోహాత్కురుషే పాపదర్శిని || ౨౫ ||

సత్యశ్చాద్య ప్రవాదోఽయం లౌకికః ప్రతిభాతి మా |
పితౄన్సమనుజాయంతే నరా మాతరమంగనాః || ౨౬ ||

నైవం భవ గృహాణేదం యదాహ వసుధాధిపః |
భర్తురిచ్ఛాముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ || ౨౭ ||

మా త్వం ప్రోత్సాహితా పాపైర్దేవరాజసమప్రభమ్ |
భర్తారం లోకభర్తారమసద్ధర్మముపాదధాః || ౨౮ ||

న హి మిథ్యా ప్రతిజ్ఞాతం కరిష్యతి తవానఘః |
శ్రీమాన్దశరథో రాజా దేవి రాజీవలోచనః || ౨౯ ||

జ్యేష్ఠో వదాన్యః కర్మణ్యః స్వధర్మస్యాభిరక్షితా |
రక్షితా జీవలోకస్య బ్రూహి రామోఽభిషిచ్యతామ్ || ౩౦ ||

పరివాదో హి తే దేవి మహాఁల్లోకే చరిష్యతి |
యది రామో వనం యాతి విహాయ పితరం నృపమ్ || ౩౧ ||

స రాజ్యం రాఘవః పాతు భవ త్వం విగతజ్వరా |
న హి తే రాఘవాదన్యః క్షమః పురవరే వసేత్ || ౩౨ ||

రామే హి యౌవరాజ్యస్థే రాజా దశరథో వనమ్ |
ప్రవేక్ష్యతి మహేష్వాసః పూర్వవృత్తమనుస్మరన్ || ౩౩ ||

ఇతి సాంత్వైశ్చ తీక్ష్ణైశ్చ కైకేయీం రాజసంసది |
సుమంత్రః క్షోభయామాస భూయ ఏవ కృతాంజలిః || ౩౪ ||

నైవ సా క్షుభ్యతే దేవీ న చ స్మ పరిదూయతే |
న చాస్యా ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశః సర్గః || ౩౫ ||

Ayodhya Kanda Sarga 35 Meaning In Telugu

అప్పటి దాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు. అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది. చేతులు నులుముకుంటున్నాడు. మాటి మాటికీ తల కొట్టుకుం టున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంక తట్టుకోలేక పోయాడు. కైకను చూచి ఇలా అన్నాడు.

“ఓ కైకా దేవీ! మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకూ గౌరవించాము. మీరు మా మహారాజునే వదిలి పెట్టాము అన్నారు. మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు. మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు. నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు. మహారాజుగారు నీవుకోరిన వరాలు ఇస్తానన్నాడు కదా. ఇలాంటి వరాలు కోరాలా! స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా! రాజుగారు మరణించినపుడు జ్యేష్టుడు రాజ్యాధి కారము వహిస్తాడు. ఈ ధర్మము నీకు తెలియదా! నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరమూ రామునితో పాటు అడవులకు వెళుతాము. నీవు చేస్తున్న దుర్మార్గాలనూ ధర్మవిరుద్ధమైన పనులనూ చూస్తూ బ్రాహ్మణుడు ఎవరూ అయోధ్యలో ఉండడు. అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలా అంతా రాముని అనుసరించి వెళ్లాక, నీవు, నీకొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి. ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేనూ చూస్తాను.

నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలయి నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను ఛీ కొట్టుచున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వేపచెట్టుకు పాలుపోసి పెంచినా దాని చేదు పోనట్టు మా మహారాజుగారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చినదా అని సందేహాము గా ఉంది. ఎందుకంటే నీ తల్లి నీ కన్నా క్రూరురాలు అని మేము విన్నాము.

నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలూ అర్ధం అయ్యేవి. ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేల మీద పాకుచున్న చీమ మాటలు విని, పక్కున నవ్వాడు. ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడు అని అనుకొంది. “నన్నుచూచి ఎందుకు నవ్వుతున్నావు,కారణమేమి” అని నీ తండ్రిని నిలదీసింది. “దేవీ! నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుకని దాని గురించి నన్ను అడగవద్దు.” అని అన్నాడు. అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా! “నీవు బతికితే బతుకు, లేకపోతే చావు. కాని నన్ను పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి” అనిపట్టుబట్టింది. అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా! “నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను. నువ్వు ఉంటే ఉండు పోతే పో. నేను మాత్రము చెప్పను.” అని అన్నాడు.

ఓ కైకా! నీకూ నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయి అని నీవల్ల ఋజువు అయింది. కనీసం ఇప్పటి కన్నా నీ బుద్ధి మార్చుకొని, నీ పట్టుదల మాని, నీ వరములు ఉపసంహరించుకో. ఈ అయోధ్యను, ప్రజలను కాపాడు.
మరి ఇది నీవు పుట్టిన బుద్ధి లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కానీ నీచేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చేయకు. మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు. కానీ నీవే నీ మాట మార్చుకో. వేరే ఏవైనా కోరుకో. జ్యేష్టుడైన రామునికి పట్టాభిషేకము జరిపించు. అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది. ఇంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటావు. నా మాట విను. రామ పట్టాభి షేకము జరిపించు. తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సుచేసుకోడానికి అడవులకు వెళతాడు.” అని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కాని కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు. తన పట్టు వీడలేదు. రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షట్త్రింశః సర్గః (36) >>

Balakanda Sarga 38 In Telugu – బాలకాండ అష్టత్రింశః సర్గః

Balakanda Sarga 38 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టత్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో అష్టత్రింశః సర్గః ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి జనక మహారాజు యజ్ఞానికి చేరుతారు. అక్కడ వారు శివుని ధనుస్సును (ధనుర్బాణాన్ని) దర్శిస్తారు. జనకుడు, శివుని వును ఎవరైతే విరిచివేస్తారో, ఆ వ్యక్తికి తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు.

సగరపుత్రజన్మ

తాం కథాం కౌశికో రామే నివేద్య మధురాక్షరమ్ |
పునరేవాపరం వాక్యం కాకుత్స్థమిదమబ్రవీత్ ||

1

అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః |
సగరో నామ ధర్మాత్మా ప్రజాకామః స చాప్రజాః ||

2

వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః |
జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ ||

3

అరిష్టనేమిదుహితా రూపేణాప్రతిమా భువి |
ద్వితీయా సగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞితా ||

4

తాభ్యాం సహ తదా రాజా పత్నీభ్యాం తప్తవాంస్తపః |
హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ ||

5

అథ వర్షశతే పూర్ణే తపసాఽఽరాధితో మునిః |
సగరాయ వరం ప్రాదాద్భృగుః సత్యవతాం వరః ||

6

అపత్యలాభః సుమహాన్భవిష్యతి తవానఘ |
కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ ||

7

ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ |
షష్టిం పుత్రసహస్రాణి అపరా జనయిష్యతి ||

8

భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్య తమ్ |
ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా ||

9

ఏకః కస్యాః సుతో బ్రహ్మన్కా బహూన్జనయిష్యతి |
శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్సత్యమస్తు వచస్తవ ||

10

తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః |
ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోఽత్ర విధీయతామ్ ||

11

ఏకో వంశకరో వాఽస్తు బహవో వా మహాబలాః |
కీర్తిమంతో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి ||

12

మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన |
పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ ||

13

షష్టిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా |
మహోత్సాహాన్కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్ ||

14

ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాఽభిప్రణమ్య చ |
జగామ స్వపురం రాజా సభార్యో రఘునందన ||

15

అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత |
అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజమ్ ||

16

సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం వ్యజాయత |
షష్టిః పుత్రాః సహస్రాణి తుంబభేదాద్వినిస్సృతాః ||

17

ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్తాన్సమవర్ధయన్ |
కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే ||

18

అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః |
షష్టిః పుత్రసహస్రాణి సగరస్యాభవంస్తదా ||

19

స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః సగరస్యాత్మసంభవః |
బాలాన్గృహీత్వా తు జలే సరయ్వా రఘునందన ||

20

ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్నిరీక్ష్య వై |
ఏవం పాపసమాచారః సజ్జనప్రతిబాధకః ||

21

పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ |
తస్య పుత్రోంశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్ ||

22

సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః |
తతః కాలేన మహతా మతిః సమభిజాయత |
సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా ||

23

స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా |
యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టత్రింశః సర్గః ||

Balakanda Sarga 38 Meaning In Telugu

” ఓ రామా! ఇప్పుడు నీకు సగరుడి కధ చెబుతాను విను. పూర్వము అయోధ్యా నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజు కుమారి కేశిని అతని మొదటి భార్య.. సుమతి ఆయన రెండవ భార్య..

పుత్ర సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతము మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేసారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు.

“ఓ సగర చక్రవర్తీ! నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు.” అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు.

కాని వారికి ఒక సందేహము కలిగింది. ” ఓ మహర్షీ! మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు.” అని అడిగారు.

“ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి.” అని అన్నాడు.

భృగుమహర్షి

అప్పుడు కేశిని ” ఓ మహర్షి! నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి.” అని కోరుకుంది.
రెండవ భార్య సుమతి “నాకు 60,000 వేల మంది కుమారులను ప్రసాదించండి.” అని కోరుకుంది.

భృగుమహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగుమహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు. పెద్ద భార్య కేశిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్ద వారు అయ్యారు.

వారందరూ ఆటలు ఆడుతు ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి, వారు అరిచి కేకలు పెడుతుంటే, ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యమునుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశు మంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు. సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు.

కొంత కాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋత్తిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకోనచత్వారింశః సర్గః (39) >>

Balakanda Sarga 27 In Telugu – బాలకాండ సప్తవింశః సర్గః

Balakanda Sarga 27 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తవింశః సర్గలో, పెద్దల ఆదేశాలను పాటించి, తనకు అప్పగించిన పనిని చేయడంలో రాముడి ప్రవర్తనతో విశ్వామిత్ర మహర్షి సంతృప్తి చెందాడు, రాముడికి శాస్త్రం, అస్త్రాలు అని అనేక ఆయుధాలను ఇచ్చాడు . ఆయుధాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి శాస్త్రం – కత్తి, లాన్స్ లేదా గద్ద వంటి చేతితో పట్టుకునే ఆయుధం.

అస్త్రగ్రామప్రదానమ్

అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః |
ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరమ్ ||

1

పరితుష్టోఽస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః |
ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః ||

2

దేవాసురగణాన్వాపి సగంధర్వోరగానపి |
యైరమిత్రాన్ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి ||

3

తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః |
దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ ||

4

ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ |
విష్ణుచక్రం తథాఽత్యుగ్రమైంద్రమస్త్రం తథైవ చ ||

5

వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా |
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఏషీకమపి రాఘవ ||

6

దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమమ్ |
గదే ద్వే చైవ కాకుత్స్థ మోదకీ శిఖరీ ఉభే ||

7

ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ |
ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ ||

8

పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమమ్ |
అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునందన ||

9

దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా |
ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః ||

10

వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ |
అస్త్రం హయశిరో నామ క్రౌంచమస్త్రం తథైవ చ ||

11

శక్తిద్వయం చ కాకుత్స్థ దదామి తవ రాఘవ |
కంకాలం ముసలం ఘోరం కాపాలమథ కంకణమ్ ||

12

ధారయంత్యసురా యాని దదామ్యేతాని సర్వశః |
వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామ నామతః ||

13

అసిరత్నం మహాబాహో దదామి నృవరాత్మజ |
గాంధర్వమస్త్రం దయితే మానవం నామ నామతః ||

14 [మోహనం]

ప్రస్వాపనప్రశమనం దద్మి సౌరం చ రాఘవ |
దర్పణం శోషణం చైవ సంతాపనవిలాపనే ||

15

మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా |
[* గాంధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః | *]
పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః ||

16

ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః |
తామసం నరశార్దూల సౌమనం చ మహాబల ||

17

సంవర్తం చైవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ |
సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరమ్ ||

18

ఘోరం తేజఃప్రభం నామ పరతేజోఽపకర్షణమ్ |
సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వాష్ట్రమస్త్రం సుదామనమ్ ||

19

దారుణం చ భగస్యాపి శితేషుమథ మానవమ్ |
ఏతాన్రామ మహాబాహో కామరూపాన్మహాబలాన్ ||

20

గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ |
స్థితస్తు ప్రాఙ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా ||

21

దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామమనుత్తమమ్ |
సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభమ్ ||

22

తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్ |
జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ||

23

ఉపతస్తుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్ |
ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాంజలయస్తదా ||

24

ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవ |
[* అధికపాఠః –
యద్యదిచ్ఛసి భద్రం తే తత్సర్వం కరవామ వై |
తతో రామః ప్రసన్నాత్మా తైరిత్యుక్తో మహాబలైః |
*]
ప్రతిగృహ్య చ కాకుత్స్థః సమాలభ్య చ పాణినా |
మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్ ||

25

తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిమ్ |
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే ||

26

Balakanda Sarga 27 In Telugu Pdf With Meaning

మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలము లో ఆచ రించ వలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు.

విశ్వామిత్రుడు రామునితో “రామా! నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు.

రామా! నీకు దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటి కంటే ఉత్తమము, శ్రేష్ఠము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను.

రామా! నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటులను అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగాఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను.

రామా! నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.

ఓ రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటు వంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను.

ఓ రామా! నీకు విద్యాధరముఅనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగ చేస్తాయి. నిద్రావస్థనుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావము ఉంది.

ఓ రామా! నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను.

ఓ రామా! ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తి వంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము, మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను.

ఓ రామా! ఈ అస్త్రములు అన్నీ కామ రూపులు. తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు. అత్యంత బలము కలవి. వీటిని నానుండి వెంటనే గ్రహించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లబము. అటువంటిది రాముడు ఆ అస్త్రసముదాయమును అవలీలగా అధ్యయనం చేసాడు.

విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్ఛరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధి దేవతలు వచ్చిరాముని ముందు నిలబడి “రామా! ఇకనుండి మేమందరమూ నీకు దాసులము” అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి “మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించి నపుడు నా వద్దకు రండి” అనిపలికాడు.

తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ అష్టావింశః సర్గః (28) >>

Ayodhya Kanda Sarga 34 In Telugu – అయోధ్యాకాండ చతుస్త్రింశః సర్గః

Ayodhya Kanda Sarga 34

అయోధ్యాకాండము చతుస్త్రింశః సర్గము (34వ సర్గ) రామాయణంలో ముఖ్యమైన ఘట్టం. ఈ సర్గలో, కౌసల్య, సుమిత్ర, సీతలతో కలిసి అరణ్యానికి వెళ్ళడానికి రాముడు సిద్ధమవుతాడు. అటువంటి సమయంలో, కౌసల్య రాముని నిరోధిస్తుంది, తల్లి భర్తవ్రతాన్ని గురించి మాట్లాడుతుంది. రాముడు ధర్మం, పితృవాక్యపాలనం గురించి సమాధానమిస్తాడు. సీత, లక్ష్మణులు రాముని వెనుక నడుస్తారు. చివరికి, రాముడు తన తల్లి కౌసల్యకు, తనను అనుమతించమని అభ్యర్థిస్తూ దీవెనలు కోరుతాడు. ఈ సర్గ రాముని ధర్మ నిష్ఠ, పితృవాక్య పాలనం, సీత, లక్ష్మణుల భక్తిని, కౌసల్యాదేవి ప్రేమను ప్రదర్శిస్తుంది.

దశరథసమాశ్వాసనమ్

తతః కమలపత్రాక్షః శ్యామో నిరుదరో మహాన్ |
ఉవాచ రామస్తం సూతం పితురాఖ్యాహి మామితి || ౧ ||

స రామప్రేషితః క్షిప్రం సంతాపకలుషేంద్రియః |
ప్రవిశ్య నృపతిం సూతో నిఃశ్వసంతం దదర్శ హ || ౨ ||

ఉపరక్తమివాదిత్యం భస్మచ్ఛన్నమివానలమ్ |
తటాకమివ నిస్తోయమపశ్యజ్జగతీపతిమ్ || ౩ ||

ఆలోక్య తు మహాప్రాజ్ఞః పరమాకులచేతసమ్ |
రామమేవానుశోచంతం సూతః ప్రాంజలిరాసదత్ || ౪ ||

తం వర్ధయిత్వా రాజానం సూతః పూర్వం జయాశిషా |
భయవిక్లబయా వాచా మందయా శ్లక్ష్ణమబ్రవీత్ || ౫ ||

అయం స పురుషవ్యాఘ్రో ద్వారి తిష్ఠతి తే సుతః |
బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా సర్వం చైవోపజీవినామ్ || ౬ ||

స త్వా పశ్యతు భద్రం తే రామః సత్యపరాక్రమః |
సర్వాన్సుహృద ఆపృచ్ఛ్య త్వామిదానీం దిదృక్షతే || ౭ ||

గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే |
వృతం రాజగుణైః సర్వైరాదిత్యమివ రశ్మిభిః || ౮ ||

స సత్యవాదీ ధర్మాత్మా గాంభీర్యాత్సాగరోపమః |
ఆకాశ ఇవ నిష్పంకో నరేంద్రః ప్రత్యువాచ తమ్ || ౯ ||

సుమంత్రానయ మే దారాన్యే కేచిదిహ మామకాః |
దారైః పరివృతః సర్వైర్ద్రష్టుమిచ్ఛామి రాఘవమ్ || ౧౦ || [ధార్మికమ్]

సోఽంతఃపురమతీత్యైవ స్త్రియస్తా వాక్యమబ్రవీత్ |
ఆర్యాహ్వయతి వో రాజాఽగమ్యతాం తత్ర మా చిరమ్ || ౧౧ ||

ఏవముక్తాః స్త్రియః సర్వాః సుమంత్రేణ నృపాజ్ఞయా |
ప్రచక్రముస్తద్భవనం భర్తురాజ్ఞాయ శాసనమ్ || ౧౨ ||

అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాస్తామ్రలోచనాః |
కౌసల్యాం పరివార్యాథ శనైర్జగ్ముర్ధృతవ్రతాః || ౧౩ ||

ఆగతేషు చ దారేషు సమవేక్ష్య మహీపతిః |
ఉవాచ రాజా తం సూతం సుమంత్రానయ మే సుతమ్ || ౧౪ ||

స సూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తదా |
జగామాభిముఖస్తూర్ణం సకాశం జగతీపతేః || ౧౫ ||

స రాజా పుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్కృతాంజలిమ్ |
ఉత్పపాతాసనాత్తూర్ణమార్తః స్త్రీజనసంవృతః || ౧౬ ||

సోఽభిదుద్రావ వేగేన రామం దృష్ట్వా విశాంపతిః |
తమసంప్రాప్య దుఃఖార్తః పపాత భువి మూర్ఛితః || ౧౭ ||

తం రామోఽభ్యపతత్క్షిప్రం లక్ష్మణశ్చ మహారథః |
విసంజ్ఞమివ దుఃఖేన సశోకం నృపతిం తదా || ౧౮ ||

స్త్రీసహస్రనినాదశ్చ సంజజ్ఞే రాజవేశ్మని |
హా హా రామేతి సహసా భూషణధ్వనిమూర్ఛితః || ౧౯ ||

తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ |
పర్యంకే సీతయా సార్ధం రుదంతః సమవేశయన్ || ౨౦ ||

అథ రామో ముహూర్తేన లబ్ధసంజ్ఞం మహీపతిమ్ |
ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవపరిప్లుతమ్ || ౨౧ ||

ఆపృచ్ఛే త్వాం మహారాజ సర్వేషామీశ్వరోఽసి నః |
ప్రస్థితం దండకారణ్యం పశ్య త్వం కుశలేన మామ్ || ౨౨ ||

లక్ష్మణం చానుజానీహి సీతా చాన్వేతి మాం వనమ్ |
కారణైర్బహుభిస్తథ్యైర్వార్యమాణౌ న చేచ్ఛతః || ౨౩ ||

అనుజానీహి సర్వాన్నః శోకముత్సృజ్య మానద |
లక్ష్మణం మాం చ సీతాం చ ప్రజాపతిరివ ప్రజాః || ౨౪ ||

ప్రతీక్షమాణమవ్యగ్రమనుజ్ఞాం జగతీపతేః |
ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవమ్ || ౨౫ ||

అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః |
అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్య మామ్ || ౨౬ ||

ఏవముక్తో నృపతినా రామో ధర్మభృతాం వరః |
ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః || ౨౭ ||

భవాన్వర్షసహస్రాయ పృథివ్యా నృపతే పతిః |
అహం త్వరణ్యే వత్స్యామి న మే కార్యం త్వయాఽనృతమ్ || ౨౮ ||

నవ పంచ చ వర్షాణి వనవాసే విహృత్య తే |
పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప || ౨౯ ||

రుదన్నార్తః ప్రియం పుత్రం సత్యపాశేన సంయతః |
కైకేయ్యా చోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్ || ౩౦ ||

శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ |
గచ్ఛస్వారిష్టమవ్యగ్రః పంథానమకుతోభయమ్ || ౩౧ ||

న హి సత్యాత్మనస్తాత ధర్మాభిమనసస్తవ |
వినివర్తయితుం బుద్ధిః శక్యతే రఘునందన || ౩౨ ||

అద్య త్విదానీం రజనీం పుత్ర మా గచ్ఛ సర్వథా |
ఏకాహదర్శనేనాపి సాధు తావచ్చరామ్యహమ్ || ౩౩ ||

మాతరం మాం చ సంపశ్యన్వసేమామద్య శర్వరీమ్ |
తర్పితః సర్వకామైస్త్వం శ్వః కాలే సాధయిష్యసి || ౩౪ ||

దుష్కరం క్రియతే పుత్ర సర్వథా రాఘవ త్వయా |
మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా యద్యాసి విజనం వనమ్ || ౩౫ ||

న చైతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవ |
ఛన్నయా చలితస్త్వస్మి స్త్రియా ఛన్నాగ్నికల్పయా || ౩౬ ||

వంచనా యా తు లబ్ధా మే తాం త్వం నిస్తర్తుమిచ్ఛసి |
అనయా వృత్తసాదిన్యా కైకేయ్యాఽభిప్రచోదితః || ౩౭ ||

న చైతదాశ్చర్యతమం యత్త్వం జ్యేష్ఠః సుతో మమ |
అపానృతకథం పుత్ర పితరం కర్తుమిచ్ఛసి || ౩౮ ||

అథ రామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితమ్ |
లక్ష్మణేన సహ భ్రాత్రా దీనో వచనమబ్రవీత్ || ౩౯ ||

ప్రాప్స్యామి యానద్య గుణాన్కో మే శ్వస్తాన్ప్రదాస్యతి |
ఉపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే || ౪౦ ||

ఇయం సరాష్ట్రా సజనా ధనధాన్యసమాకులా |
మయా విసృష్టా వసుధా భరతాయ ప్రదీయతామ్ || ౪౧ ||

వనవాసకృతా బుద్ధిర్న చ మేఽద్య చలిష్యతి |
యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరద త్వయా || ౪౨ ||

దీయతాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివ |
అహం నిదేశం భవతో యథోక్తమనుపాలయన్ || ౪౩ ||

చతుర్దశ సమా వత్స్యే వనే వనచరైః సహ |
మా విమర్శో వసుమతీ భరతాయ ప్రదీయతామ్ || ౪౪ ||

న హి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా ప్రియమ్ |
యథానిదేశం కర్తుం వై తవైవ రఘునందన || ౪౫ ||

అపగచ్ఛతు తే దుఃఖం మా భూర్బాష్పపరిప్లుతః |
న హి క్షుభ్యతి దుర్ధర్షః సముద్రః సరితాం పతిః || ౪౬ ||

నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీమ్ |
నైవ సర్వానిమాన్కామాన్న స్వర్గం నైవ జీవితమ్ || ౪౭ ||

త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభ |
ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే || ౪౮ ||

న చ శక్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో |
స శోకం ధారయస్వేమం న హి మేఽస్తి విపర్యయః || ౪౯ ||

అర్థితో హ్యస్మి కైకేయ్యా వనం గచ్ఛేతి రాఘవ |
మయా చోక్తం వ్రజామీతి తత్సత్యమనుపాలయే || ౫౦ ||

మా చోత్కంఠాం కృథా దేవ వనే రంస్యామహే వయమ్ |
ప్రశాంతహరిణాకీర్ణే నానాశకునినాదితే || ౫౧ ||

పితా హి దైవతం తాత దేవతానామపి స్మృతమ్ |
తస్మాద్దైవతమిత్యేవ కరిష్యామి పితుర్వచః || ౫౨ ||

చతుర్దశసు వర్షేషు గతేషు నరసత్తమ |
పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపోఽయం విముచ్యతామ్ || ౫౩ ||

యేన సంస్తంభనీయోఽయం సర్వో బాష్పగళో జనః |
స త్వం పురుషశార్దూల కిమర్థం విక్రియాం గతః || ౫౪ ||

పురం చ రాష్ట్రం చ మహీ చ కేవలా
మయా నిసృష్టా భరతాయ దీయతామ్ |
అహం నిదేశం భవతోఽనుపాలయ-
-న్వనం గమిష్యామి చిరాయ సేవితుమ్ || ౫౫ ||

మయా నిసృష్టాం భరతో మహీమిమాం
సశైలషండాం సపురాం సకాననామ్ |
శివాం సుసీమామనుశాస్తు కేవలం
త్వయా యదుక్తం నృపతే తథాఽస్తు తత్ || ౫౬ ||

న మే తథా పార్థివ ధీయతే మనో
మహత్సు కామేషు న చాత్మనః ప్రియే |
యథా నిదేశే తవ శిష్టసమ్మతే
వ్యపైతు దుఃఖం తవ మత్కృతేఽనఘ || ౫౭ ||

తదద్య నైవానఘ రాజ్యమవ్యయం
న సర్వకామాన్న సుఖం న మైథిలీమ్ |
న జీవితం త్వామనృతేన యోజయ-
-న్వృణీయ సత్యం వ్రతమస్తు తే తథా || ౫౮ ||

ఫలాని మూలాని చ భక్షయన్వనే
గిరీంశ్చ పశ్యన్సరితః సరాంసి చ |
వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం
సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః || ౫౯ ||

ఏవం స రాజా వ్యసనాభిపన్నః
శోకేన దుఃఖేన చ తామ్యమానః |
ఆలింగ్య పుత్రం సువినష్టసంజ్ఞో
మోహం గతో నైవ చిచేష్ట కించిత్ || ౬౦ ||

దేవ్యస్తతః సంరురుదుః సమేతా-
-స్తాం వర్జయిత్వా నరదేవపత్నీమ్ |
రుదన్సుమంత్రోఽపి జగామ మూర్ఛాం
హాహాకృతం తత్ర బభూవ సర్వమ్ || ౬౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశః సర్గః || ౩౪ ||

Ayodhya Kanda Sarga 34 Meaning In Telugu

రాముడు ఆదేశానుసారము సుమంత్రుడు రామ, లక్ష్మణ, సీతల రాకను దశరథునికి ఎరింగించుటకు అంతఃపురములోకి వెళ్లాడు. అంత:పురములో దశరథుడు గ్రహణం పట్టిన చంద్రుడి మాదిరి కళావిహీనంగా కూర్చుని ఉన్నాడు. సుమంత్రుడు దశరథుని వద్దకుపోయి “మహారాజులకు జయము. తమరి కుమారుడు రామలక్ష్మణులు, తమరి కోడలు సీత తమరి దర్శనార్ధము వచ్చి ఉన్నారు.” అని అన్నాడు.

ఆ మాటలువిన్న దశరథుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. సుమంత్రుని వంక బేలగా చూచాడు. మరలా సుమంత్రుడు ఇలా అన్నాడు. “మహారాజా! వారు అరణ్యములకు పోయే ముందు తమరి దర్శనార్థము ద్వారము వద్ద నిలబడి ఉన్నారు. వారికి తమరి దర్శన భాగ్యము కలిగించండి. అంతేకాదు అడవులకు పోయే ముందు మీరు కూడా రాముని ఒక సారి కనులారా చూడండి. తరువాత మీకు ఆ భాగ్యం కలుగుతుందో లేదో.” అని అన్నాడు సుమంత్రుడు.

అప్పుడు దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “సుమంత్రా! అంత:పురములో ఉన్న నా భార్యలను అందరినీ తీసుకొని రమ్ము. వారితో కలిసి నేను రాముని చూడదలచాను.” అని అన్నాడు.

వెంటనే సుమంత్రుడు అంత:పురములోనికి వెళ్లి దశరథుని భార్యలనందరినీ పిలుచుకొని వచ్చాడు. దశరథునికి 350 మంది భార్యలు. వారి అందరిలోకి పెద్దభార్య కౌసల్య కౌసల్య ముందురాగా, 350 మంది అక్కడకు వచ్చారు. అందరూ వచ్చారు అని సరి చూసుకొని తృప్తిపడిన తరువాత దశరధుడు సుమంత్రుని చూచి “సుమంత్రా! ఇప్పుడు రాముని లోపలకు తీసుకొని రా!” అని ఆదేశించాడు.

సుమంత్రుడు బయటకు వెళ్లి రాముడు, లక్ష్మణుడు, సీతను లోపలకు తీసుకొని వెళ్లాడు. లోపల దశరథుడు తన 350మంది భార్యలు చుట్టు ఉండగా ఒక ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చూడగానే దశరథునకు దు:ఖము ఆగలేదు. వెంటనే ఆసనము మీదినుండి లేచాడు. రాముని వద్దకు గబా గబా నడుచుకుంటూ వెళ్లాడు. కాని మధ్యలోనే దుఃఖము ఆపుకోలేక కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు.

తండ్రి గారు కిందపడటం చూచిన రామలక్ష్మణులు ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్లారు. రాముని చూడగానే అంతఃపుర స్త్రీలందరూ దుఃఖము ఆపుకోలేక హా హా కారాలు చేసారు. వారి దు:ఖమును చూచి రామలక్ష్మణులకు కూడా దు:ఖము ఆగలేదు. వారు తమ తండ్రి దశరథుని పైకి లేపి ఒక పాన్పు మీద పడుకోబెట్టారు. దశరథుడు స్పృహలోకి వచ్చాడు. దుఃఖించుచున్న తండ్రిని చూచి రాముడు ఇలా అన్నాడు.

“మహారాజా! మీరు మాకందరికీ అధిపతులు. తమరి వద్దనుండి నేను దండకారణ్యములకు పోవుటకు అనుమతి కోరుచున్నాను. కాస్త తల ఎత్తి నన్ను చూడండి. నాతో పాటు నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసమునకు వచ్చుటకు అనుమతి ఇవ్వండి. నేను ఎన్నోసార్లు చెప్పి చూచాను. వీరిద్దరూ నా మాట వినలేదు. నాతోపాటు అరణ్యములకు వస్తానని పట్టుబట్టారు. ఆకారణంగా వీరు కూడా నా వెంట అడవులకు వస్తున్నారు. కాబట్టి మా ముగ్గురికీ అనుమతి ప్రసాదించండి.” అని పలికి రాముడు చేతులు కట్టుకొని తండ్రి ఎదురుగా నిలబడ్డాడు. తండ్రిమాటలు విని రాముడు ఇలా అన్నాడు. “మహారాజా! తమరు అయోధ్యను ఎన్నో సంవత్సరముల నుండి పరిపాలిస్తున్నారు. అందుకని తమరు అయోధ్యలోనే ఉండండి. నేను అడవులలో ఉంటాను. నా గురించి మీరు ఆడినమాట తప్పకండి. తమరు విధించిన పదునాలుగు సంవత్సరముల వనవాసము తృటిలో పూర్తిచేసుకొని మీ పాదముల చెంత వాలుతాను. నాకు అనుమతి ఇవ్వండి.” అని పలికాడు రాముడు.

దశరథుని పక్కనే ఉన్న కైక “ఏమిటా మంతనాలు. తొందరగా అడవులకు వెళ్లమనండి. మరలా భరతుడు వచ్చేస్తాడు. ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు” అని రహస్యంగా దశరథునితో చెప్పింది. రామునితో తనివితీరా మాట్లాడుకోడానికి కూడా అనుమతించని కైకను చూచి దుఃఖిస్తూ దశరథుడు రామునితో ఇలాఅన్నాడు. “రామా! నీకు, నీ భార్యకు, తమ్ముడికి మంగళమగు గాక! నీవు అన్నట్టు ఈ వనవాసము తృటిలో ముగించుకొని రమ్ము. నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రామా! నీవు ధర్మము పాటిస్తావు. అందుకని నిన్ను వెళవద్దు అన్నా వెళ్లడం మానవు. నీ బుద్ధి మరల్చడం నాకు చేతకాదు. కాని ఒక కోరిక. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దుటే వెళ్లు. ఈ ఒక్కరోజు నిన్ను కనులారా చూస్తూ కాలం గడిపేస్తాను. నాకు నీ తల్లి కౌసల్యకు కనువిందు చేస్తూ ఈ రాత్రికి ఉండు. రేపు ఉదయమే వెళ్లు.

ఓరామా! నేను అన్న మాటను నిలబెట్టడానికి నువ్వు అరణ్యములకు వెళుతున్నావు. ఇంతవరకూ ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావు. రామా! నువ్వు అరణ్యములకు పోవడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదుగో ఈ దుష్టురాలు కైక నన్ను మోసం చేసింది. నా దగ్గర నుండి ముందు మాట తీసుకొని తరువాత ఈ వనవాస విషయం విషం కక్కినట్టు కక్కింది. ఇది సత్యము. నువ్వు నా జ్యేష్ట పుత్రుడవు కాబట్టి, తండ్రిమాట నిలబెట్టడానికి, ఆ వంచకి మాటలను నువ్వు నిజం చేస్తున్నావు. నీరాజ్యం నీవు తీసుకోమని చెప్పినా నీవు వినడం లేదు. ఏం చేసేది.”అని దుఃఖిస్తున్నాడు దశరథుడు.

ఆమాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. “తండ్రీ! ఈ రాజభోగములు శాశ్వతములు కావు కదా! ఈనాడు ఉంటాయి రేపుపోతాయి. శాశ్వతముగా నిలిచిపోయేది, సత్యము పలకడం, ఆడిన మాట తప్పకుండా ఉండటం. నీవు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను. అయోధ్యమీద నాకు ఉన్న రాజ్యాధికారమును నేను వదులుకొంటున్నాను. ఈ రాజ్యమును భరతునికి ఇమ్ము. తల్లి కైకకు ఇచ్చిన రెండు వరములు పూర్తిగా నెరవేర్చుము. భరతుని రాజ్యాభిషిక్తుని చేయుము.

మీరు అన్న మాట నేను ఎలా నిలబెట్టుకుంటున్నానో తమరు కూడా తల్లి కైకకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీమాట ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉంటాను. మీరు కూడా భరతునికి రాజ్యాభిషేకము చేయండి. నాకు ఈ రాజ్యము మీద గానీ, రాజభోగముల మీద గానీ ఎలాంటి వ్యామోహము లేదు. తమరి ఆదేశము నెరవేర్చడమే నా కర్తవ్యము. నా గురించి మీరు దు:ఖపడ వద్దు. మీరు అన్న మాటను నిలబెట్టుకోండి.

నేనుకూడా సత్యము మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. నానిర్ణయము నేను మార్చుకోను. నేను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేను. ఈ ఒక్కరాత్రి ఉన్నంత మాత్రాన ఒరిగేదేముంది. నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమంది. నేను వెళతాను అని అన్నాను. ఆమాట నిలబెట్టుకుంటాను.” అని అన్నాడు రాముడు.

రాముడు ఎన్ని విధముల అనునయించిననూ దశరథుడు దు:ఖము మానలేదు. రాముడు మరలా ఇలా అన్నాడు. “రాజా! తమరు మా గురించి దిగులు పెట్టుకోకండి. మీరు నాకు పితృదేవులు. దైవసమానులైన మీ మాట నాకు శిరోధార్యము. ఓ రాజా! మరలా చెప్పుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు నిమేషమాత్రములో గడిపి మరలా మీపాదముల చెంతకు వస్తాను. అప్పుడు నేను శాశ్వతంగా మీ వద్దనే ఉంటాను. ఇప్పుడు మాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి.

తండ్రిగారూ! అటు చూడండి. అయోధ్యా వాసులు ఎంతో దు:ఖపడుతున్నారు. మీరు మహారాజులు. వారిని మీరు ఓదార్చాలి. అటువంటి మీరే ఇలా దుఃఖిస్తే వారిని ఎవరూ ఓదారుస్తారు. కాబట్టి వెంటనే మాకు అడవులకు పోవుటకు అనుమతి ఇవ్వండి. మీరు వెంటనే భరతునికి పట్టాభిషేకము చేయించండి. అన్నమాట నిలబెట్టుకోండి.”అనిపలికాడు రాముడు.

రాముని మాటలకు దశరథునికి దుఃఖము పొంగుకొని వచ్చింది. ఏడుస్తూ కిందపడిపోయాడు. ఒక్క కైక తప్ప మిగిలిన రాణులందరూ హాహాకారాలు చేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచత్రింశః సర్గః (35) >>