Aranya Kanda Sarga 14 In Telugu – అరణ్యకాండ చతుర్దశః సర్గః

Aranya Kanda Sarga 14 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” చతుర్దశః సర్గలో, రాముడు మరియు మిగిలిన ఇద్దరు పంచవటికి వెళుతుండగా జటాయు అనే శక్తివంతమైన డేగతో పరిచయం ఏర్పడింది. రాముడు దాని గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు, జటాయు మానవులతో పాటు జంతు జాతుల సృష్టిని వివరిస్తాడు మరియు తాను దశరథ రాజుకు స్నేహితుడని మరియు అజ్ఞాతవాసంలో ఉన్న రాముడికి సహాయం చేయాలనుకుంటున్నానని రాముడికి తెలియజేస్తాడు.

జటాయుఃసంగమః

అథ పంచవటీం గచ్ఛన్నంతరా రఘునందనః |
ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమమ్ ||

1

తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ |
మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితి ||

2

స తౌ మధురయా వాచా సౌమ్యయా ప్రీణయన్నివ |
ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః ||

3

స తం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః |
స తస్య కులమవ్యగ్రమథ పప్రచ్ఛ నామ చ ||

4

రామస్య వచనం శ్రుత్వా సర్వభూతసముద్భవమ్ |
ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ ||

5

పూర్వకాలే మహాబాహో యే ప్రజాపతయోఽభవన్ |
తాన్మే నిగదతః సర్వానాదితః శృణు రాఘవ ||

6

కర్దమః ప్రథమస్తేషాం విశ్రుతస్తదనంతరః |
శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ ||

7

స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః |
పులస్త్యశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా ||

8

దక్షో వివస్వానపరోఽరిష్టనేమిశ్చ రాఘవ |
కశ్యపశ్చ మహాతేజాస్తేషామాసీచ్చ పశ్చిమః ||

9

ప్రజాపతేస్తు దక్షస్య బభూవురితి విశ్రుతమ్ |
షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః ||

10

కశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః |
అదితిం చ దితిం చైవ దనుమప్యథ కాలికామ్ ||

11

తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి |
తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యపః పునరబ్రవీత్ ||

12

పుత్రాంస్రైలోక్యభర్తౄన్వై జనయిష్యథ మత్సమాన్ |
అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ ||

13

కాలికా చ మహాబాహో శేషాస్త్వమనసోఽభవన్ |
అదిత్యాం జజ్ఞిరే దేవాస్త్రయస్త్రింశదరిందమ ||

14

ఆదిత్యా వసవో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప |
దితిస్త్వజనయత్పుత్రాన్దైత్యాంస్తాత యశస్వినః ||

15

తేషామియం వసుమతీ పురాసీత్సవనార్ణవా |
దనుస్త్వజనయత్పుత్రమశ్వగ్రీవమరిందమ ||

16

నరకం కాలకం చైవ కాలికాపి వ్యజాయత |
క్రౌంచీం భాసీం తథా శ్యేనీం ధృతరాష్ట్రీం తథా శుకీమ్ ||

17

తామ్రాపి సుషువే కన్యాః పంచైతా లోకవిశ్రుతాః |
ఉలూకాన్ జనయత్క్రౌంచీ భాసీ భాసాన్వ్యజాయత ||

18

శ్యేనీ శ్యేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః |
ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః ||

19

చక్రవాకాంశ్చ భద్రం తే విజజ్ఞే సాపి భామినీ |
శుకీ నతాం విజజ్ఞే తు నతాయా వినతా సుతా ||

20

దశ క్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసంభవాః |
మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి ||

21

మాతంగీమపి శార్దూలీం శ్వేతాం చ సురభిం తథా |
సర్వలక్షణసంపన్నాం సురసాం కద్రుకామపి ||

22

అపత్యం తు మృగాః సర్వే మృగ్యా నరవరోత్తమ |
ఋక్షాశ్చ మృగమందాయాః సృమరాశ్చమరాస్తథా ||

23

హర్యాశ్చ హరయోఽపత్యం వానరాశ్చ తరస్వినః |
తతస్త్విరావతీం నామ జజ్ఞే భద్రమదా సుతామ్ ||

24

తస్యాస్త్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః |
మాతంగాస్త్వథ మాతంగ్యా అపత్యం మనుజర్షభ ||

25

గోలాంగూలాంశ్చ శార్దూలీ వ్యాఘ్రాంశ్చాజనయత్సుతాన్ |
దిశాగజాంశ్చ కాకుత్స్థ శ్వేతాప్యజనయత్సుతాన్ ||

26

తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత |
రోహిణీం నామ భద్రం తే గంధర్వీం చ యశస్వినీమ్ ||

27

రోహిణ్యజనయద్గా వై గంధర్వీ వాజినః సుతాన్ |
సురసాజనయన్నాగాన్రామ కద్రూస్తు పన్నగాన్ ||

28

మనుర్మనుష్యాంజనయద్రామ పుత్రాన్యశస్వినః |
బ్రాహ్మణాన్క్షత్త్రియాన్వైశ్యాన్ శూద్రాంశ్చ మనజర్షభ ||

29

సర్వాన్పుణ్యఫలాన్వృక్షాననలాపి వ్యాజాయత |
వినతా చ శుకీ పౌత్రీ కద్రూశ్చ సురసా స్వసా ||

30

కద్రూర్నాగం సహస్రస్యం విజజ్ఞే ధరణీధరమ్ |
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోఽరుణ ఏవ చ ||

31

తస్మాజ్జాతోఽహమరుణాత్సంపాతిస్తు మమాగ్రజః |
జటాయురితి మాం విద్ధి శ్యేనీపుత్రమరిందమ ||

32

సోఽహం వాససహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి |
ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షససేవితమ్ |
సీతాం చ తాత రక్షిష్యే త్వయి యాతే సలక్ష్మణే ||

33

జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో
ముదా పరిష్వజ్య చ సన్నతోఽభవత్ |
పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్
జటాయుషా సంకథితం పునః పునః ||

34

స తత్ర సీతాం పరిదాయ మైథిలీం
సహైవ తేనాతిబలేన పక్షిణా |
జగామ తాం పంచవటీం సలక్ష్మణో
రిపూన్దిధక్షన్ శలభానివానలః ||

35

Aranya Kanda Sarga 14 In Telugu Pdf Download

రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు.

“నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగాడు రాముడు.

“రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు.” అని అన్నాడు.

తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది.

“రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను.

ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు.

ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ,మను, అనల అనే ఎనిమింది కన్యలను కశ్యపప్రజాపతి పెళ్లిచేసుకున్నాడు.

కశ్యపుడు తన భార్యలతో “మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి.” అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనే వారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాటమీద మనసు పెట్టలేదు.

కశ్యపుని కోరిక ప్రకారము అదితికి పన్నెండు మంది ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు), ఎనిమిది మంది వసువులను (అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కధకు మూలపురుషుడు అయ్యాడు), పదకొండు మంది రుద్రులు, ఇద్దరు అశ్వినులు, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలుపుట్టారు.

కశ్యపునకు దితి యందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది.

కశ్యపునకు దనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి, శ్యేని,ధృతరాష్ట్రి, శుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. (ఇవి అన్నీ పక్షిజాతుల పేర్లు).ఆ తరువాత క్రౌంచికి ఉలూకములు (గుడ్లగూబలు), భాసి అనేకూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. శ్యేని అనే కూతురుకు శ్యేనములు (డేగలు) పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంస జాతులు, చక్రవాక పక్షులు, జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధిచెందింది.

శుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే పదిమింది పుత్రికలు జన్మించారు. (ఇవన్నీ మృగజాతుల పేర్లు). మృగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు. ఎలుగుబంట్లు, చామరీ మృగములు ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. (అందుకే సింహమునకు కోతులకు, హరి అనే పేరు వచ్చింది.

భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్దపులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి.

సురభి రోహిణి, గంధర్వి అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి.

మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టీ చేసే వృత్తులబత్తీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు. అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది.

రామా! నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత శుకికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు.

(గరుడుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడుకి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు).

ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు. నేను, సంపాతి. నా పేరు జటాయువు. నేను శ్యేని జాతికి చెందిన వాడిని. ఇదీ నా జన్మ వృత్తాంతము.

(అవకాశము వస్తే చాలు, పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయాపాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈభూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు.)

రామా! ఈ వనమంతా నాకు బాగాతెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనపుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను.” అని అన్నాడు.

జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ పంచదశః సర్గః (15) >>

Aranya Kanda Sarga 6 In Telugu – అరణ్యకాండ షష్ఠః సర్గః

Aranya Kanda Sarga 6 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షష్ఠః సర్గం రామాయణంలో కీలకమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు పంచవటిలో నివసిస్తారు. అక్కడ సుర్పణఖ తన సోదరులైన ఖర, దూషణలను రాముని మీద దాడి చేయమని ప్రేరేపిస్తుంది. ఖర, దూషణలు తమ దళాలతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు ధైర్యంగా యుద్ధం చేసి, ఖర, దూషణలను వధిస్తాడు.

|| రక్షోవధప్రతిజ్ఞానమ్ ||

శరభంగే దివం యాతే మునిసంఘాః సమాగతాః |
అభ్యగచ్ఛంత కాకుత్స్థం రామం జ్వలితతేజసమ్ ||

1

వైఖానసా వాలఖిల్యాః సంప్రక్షాలా మరీచిపాః |
అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః ||

2

దంతోలూఖలినశ్చైవ తథైవోన్మజ్జకాః పరే |
గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః ||

3

మునయః సలిలాహారా వాయుభక్షాస్తథాపరే |
ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలశాయినః ||

4

వ్రతోపవాసినో దాంతాస్తథార్ద్రపటవాససః |
సజపాశ్చ తపోనిత్యాస్తథా పంచతపోఽన్వితాః ||

5

సర్వే బ్రాహ్మ్యా శ్రియా జుష్టా దృఢయోగాః సమాహితాః |
శరభంగాశ్రమే రామమభిజగ్ముశ్చ తాపసాః ||

6

అభిగమ్య చ ధర్మజ్ఞా రామం ధర్మభృతాం వరమ్ |
ఊచుః పరమధర్మజ్ఞమృషిసంఘాః సమాహితాః ||

7

త్వమిక్ష్వాకుకులస్యాస్య పృథివ్యాశ్చ మహారథ |
ప్రధానశ్చాసి నాథశ్చ దేవానాం మఘవానివ ||

8

విశ్రుతస్త్రిషు లోకేషు యశసా విక్రమేణ చ |
పితృభక్తిశ్చ సత్యం చ త్వయి ధర్మశ్చ పుష్కలః ||

9

త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలమ్ |
అర్థిత్వాన్నాథ వక్ష్యామస్తచ్చ నః క్షంతుమర్హసి ||

10

అధర్మస్తు మహాంస్తాత భవేత్తస్య మహీపతేః |
యో హరేద్బలిషడ్భాగం న చ రక్షతి పుత్రవత్ ||

11

యుంజానః స్వానివ ప్రాణాన్ప్రాణైరిష్టాన్సుతానివ |
నిత్యయుక్తః సదా రక్షన్సర్వాన్విషయవాసినః ||

12

ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీమ్ |
బ్రహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయతే ||

13

యత్కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశనః |
తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజా ధర్మేణ రక్షతః ||

14

సోఽయం బ్రాహ్మణభూయిష్ఠో వానప్రస్థగణో మహాన్ |
త్వన్నాథోఽనాథవద్రామ రాక్షసైర్బాధ్యతే భృశమ్ ||

15

ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనామ్ |
హతానాం రాక్షసైర్ఘోరైర్బహూనాం బహుధా వనే ||

16

పంపానదీనివాసానామనుమందాకినీమపి |
చిత్రకూటాలయానాం చ క్రియతే కదనం మహత్ ||

17

ఏవం వయం న మృష్యామో విప్రకారం తపస్వినామ్ |
క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమకర్మభిః ||

18

తతస్త్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థితాః |
పరిపాలయ నో రామ వధ్యమానాన్నిశాచరైః ||

19

పరా త్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే |
పరిపాలయ నః సర్వాన్రాక్షసేభ్యో నృపాత్మజ ||

20

ఏతచ్ఛ్రుత్వా తు కాకుత్స్థస్తాపసానాం తపస్వినామ్ |
ఇదం ప్రోవాచ ధర్మాత్మా సర్వానేవ తపస్వినః ||

21

నైవమర్హథ మాం వక్తుమాజ్ఞప్తోఽహం తపస్వినామ్ |
కేవలేనాత్మకార్యేణ ప్రవేష్టవ్యం మయా వనమ్ ||

22

విప్రకారమపాక్రష్టుం రాక్షసైర్భవతామిమమ్ |
పితుస్తు నిర్దేశకరః ప్రవిష్టోఽహమిదం వనమ్ ||

23

భవతామర్థసిద్ధ్యర్థమాగతోఽహం యదృచ్ఛయా |
తస్య మేఽయం వనే వాసో భవిష్యతి మహాఫలః ||

24

తపస్వినాం రణే శత్రూన్హంతుమిచ్ఛామి రాక్షసాన్ |
పశ్యంతు వీర్యమృషయః సభ్రాతుర్మే తపోధనాః ||

25

దత్త్వాఽభయం చాపి తపోధనానాం
ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన |
తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః
సుతీక్ష్ణమేవాభిజగామ వీరః ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠః సర్గః ||

Aranya Kanda Sarga 6 Meaning In Telugu

ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు, మొదలగు మహాఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గ లోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమ వంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధానధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకో దలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు.

రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి ఆరవ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని, దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇదీ రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలె రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము. తాపసులము. మేము రాజుకు పన్నురూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో నాలుగవ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది.

ప్రస్తుతము మేము నివసించుచున్న ఈముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము | అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా! మాతో రా! ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము.

ఈ రాక్షసులు మందాకినీ నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వతప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆ యా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంక ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామా! ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు.” అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు.

రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు.

“ఓ మహామునులారా! మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం. బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్ణయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను.” అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు.

తరువాత రాముడు, సీతతో, లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ సప్తమః సర్గః (7) >>

Ayodhya Kanda Sarga 57 In Telugu | అయోధ్యాకాండ సప్తపంచాశః సర్గః

Ayodhya Kanda Sarga 57 In Telugu

అయోధ్యా కాండ సర్గ 57 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.

సుమంత్రోపావర్తనమ్

కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ |
రామే దక్షిణకూలస్థే జగామ స్వగృహం గుహః ||

1

భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహాసనమ్ |
ఆగిరేర్గమనం తేషాం తత్రస్థైరభిలక్షితమ్ ||

2

అనుజ్ఞాతః సుమంత్రోఽథ యోజయిత్వా హయోత్తమాన్ |
అయోధ్యామేవ నగరీం ప్రయయౌ గాఢదుర్మనాః ||

3

స వనాని సుగంధీని సరితశ్చ సరాంసి చ |
పశ్యన్నతియయౌ శీఘ్రం గ్రామాణి నగరాణి చ ||

4

తతః సాయాహ్న సమయే తృతీయేఽహని సారథిః |
అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శ హ ||

5

స శూన్యామివ నిశ్శబ్దాం దృష్ట్వా పరమదుర్మనాః |
సుమంత్రశ్చింతయామాస శోకవేగసమాహతః ||

6

కచ్చిన్న సగజా సాశ్వా సజనా సజనాధిపా |
రామసంతాపదుఃఖేన దగ్ధా శోకాగ్నినా పురీ ||

7

ఇతి చింతాపరః సూతః వాజిభిః శ్రీఘ్రపాతిభిః |
నగరద్వారమాసాద్య త్వరితః ప్రవివేశ హ ||

8

సుమంత్రమభియాంతం తం శతశోఽథ సహస్రశః |
క్వ రామైతి పృచ్ఛంతః సూతమభ్యద్రవన్నరాః ||

9

తేషాం శశంస గంగాయామహమాపృచ్ఛ్య రాఘవమ్ |
అనుజ్ఞాతో నివృత్తోఽస్మి ధార్మికేణ మహాత్మనా ||

10

తే తీర్ణా ఇతి విజ్ఞాయ బాష్పపూర్ణముఖా జనాః |
అహో ధిగితి నిశ్వస్య హా రామేతి చ చుక్రుశుః ||

11

శుశ్రావ చ వచస్తేషాం బృందం బృందం చ తిష్ఠతామ్ |
హతాః స్మ ఖలు యే నేహ పశ్యామైతి రాఘవమ్ ||

12

దానయజ్ఞవివాహేషు సమాజేషు మహత్సు చ |
న ద్రక్ష్యామః పునర్జాతు ధార్మికం రామమంతరా ||

13

కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహమ్ |
ఇతి రామేణ నగరం పితృవత్పరిపాలితమ్ ||

14

వాతాయనగతానాం చ స్త్రీణామన్వంతరాపణమ్ |
రామ శోకాభితప్తానాం శుశ్రావ పరిదేవనమ్ ||

15

స రాజమార్గమధ్యేన సుమంత్రః పిహితాననః |
యత్ర రాజా దశరథస్తదేవోపయయౌ గృహమ్ ||

16

సోఽవతీర్య రథాచ్ఛీఘ్రం రాజవేశ్మ ప్రవిశ్య చ |
కక్ష్యాః సప్తాభిచక్రామ మహా జన సమాకులాః ||

17

హర్మ్యైర్విమానైః ప్రాసాదైరవేక్ష్యాథ సమాగతమ్ |
హాహాకారకృతా నార్యో రామదర్శనకర్శితాః ||

18

ఆయతైర్విమలైర్నేత్రైః అశ్రువేగపరిప్లుతైః |
అన్యోన్యమభివీక్షంతేఽవ్యక్తమార్తతరాః స్త్రియః ||

19

తతో దశరథ స్త్రీణాం ప్రాసాదేభ్యస్తతస్తతః |
రామ శోకాభితప్తానాం మందం శుశ్రావ జల్పితమ్ ||

20

సహ రామేణ నిర్యాతః వినా రామమిహాగతః |
సూతః కిం నామ కౌసల్యాం శోచంతీం ప్రతివక్ష్యతి ||

21

యథా చ మన్యే దుర్జీవమేవం న సుకరం ధ్రువమ్ |
ఆచ్ఛిద్య పుత్రే నిర్యాతే కౌసల్యా యత్ర జీవతి ||

22

సత్యరూపం తు తద్వాక్యం రాజ్ఞః స్త్రీణాం నిశామయన్ |
ప్రదీప్తమివ శోకేన వివేశ సహసా గృహమ్ ||

23

స ప్రవిశ్యాష్టమీం కక్ష్యాం రాజానం దీనమాతురమ్ |
పుత్ర శోక పరిద్యూనమపశ్యత్ పాండరే గృహే ||

24

అభిగమ్య తమాసీనం నరేంద్రమభివాద్య చ |
సుమంత్రః రామవచనం యథోక్తం ప్రత్యవేదయత్ ||

26

స తూష్ణీమేవ తచ్ఛ్రుత్వా రాజా విభ్రాంతచేతనః |
మూర్ఛితో న్యపతద్భూమౌ రామ శోకాభిపీడితః ||

27

తతోఽంతః పురమావిద్ధం మూర్ఛితే పృథివీపతౌ |
ఉద్ధృత్య బాహూ చుక్రోశ నృపతౌ పతితే క్షితౌ ||

28

సుమిత్రయా తు సహితా కౌసల్యా పతితం పతిమ్ |
ఉత్థాపయామాస తదా వచనం చేదమబ్రవీత్ ||

29

ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణః |
వనవాసాదనుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే ||

30

అద్యేమమనయం కృత్వా వ్యపత్రపసి రాఘవ |
ఉత్తిష్ఠ సుకృతం తేఽస్తు శోకే న స్యాత్ సహాయతా ||

31

దేవ యస్యా భయాద్రామం నాతుపృచ్ఛసి సారథిమ్ |
నేహ తిష్ఠతి కైకేయీ విస్రబ్ధం ప్రతిభాష్యతామ్ ||

32

సా తథోక్త్వా మహారాజం కౌసల్యా శోకలాలసా |
ధరణ్యాం నిపపాతాశు బాష్ప విప్లుత భాషిణీ ||

33

ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి |
పతిం చావేక్ష్య తాః సర్వాః సుస్వరం రురుదుః స్త్రియః ||

34

తతస్తమంతః పుర నాదముత్థితమ్
సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః |
స్త్రియశ్చ సర్వా రురుదుః సమంతతః
పురం తదాసీత్ పునరేవ సంకులమ్ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తపంచాశః సర్గః ||

Ayodhya Kanda Sarga 57 Meaning In Telugu

గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.

సుమంత్రుడు తన రథమును అయోధ్యవైపు తీసుకొని వెళుతున్నాడు. మూడవ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవిలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగరప్రవేశము చేసాడు.

రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంట బడ్డారు. “రాముడు ఎక్కడ? రాముని ఎక్కడ వదిలి వచ్చావు?” అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. సుమంత్రుడు రథము ఆపి వారితో ఇలా అన్నాడు. “నేనురాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్దనుండి ఆజ్ఞతీసుకొని వచ్చాను.” అని బాధతో చెప్పాడు సుమంత్రుడు.

“రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా. రాముడు ఇంకమాకు కనపడడా” అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు.సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్లాడు. అంత:పురములోని స్త్రీలు, రాముడు లేకుండా వంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు.

“సుమంత్రుని చూచిన కౌసల్య “నా రాముడు ఏడీ” అనిఅడిగితే కౌపల్యకు ఏమి సమాధానము చెబుతాడు. కొడుకు కోడలు తనను విడిచి పెట్టి పోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా! ఏమో ఆమె బతకడం చాలా కష్టము. ఏం జరుగుతుందో ఏమో!” అని తమలో తాము ఆందోళన చెందుతున్నారు.

ఆ మాటలన్నీవింటూ సుమంత్రుడు దశరథుని మందిరము వైపు వెళుతున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. అంతలో అంతఃపుర స్త్రీలు అందరూవచ్చి ఆయనకు ఉపచారములు చేసారు. ఇంతలో కౌసల్యసుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీసారు.

దశరథునితో కౌసల్య ఇలాఅంది.”మహారాజా! రాముని అడవిలో వదిలిపెట్టి రామసందేశమును తీసుకొని వచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి. మహారాజా! చెయ్యవలసినది అంతా చేసి ఇప్పుడు మాట్లాడ కుండా మౌనంగా ఉ ంటావెందుకు. ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పని వాడివని పేరు ప్రతిష్ఠలు గడించావు. సత్యవాక్పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులెండి. ఇక్కడ కైక లేదులెండి.

మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునిలో మాట్లా డ వచ్చును.” అని కౌసల్య పలికి ఆమెకు దుఃఖము ముంచుకురాగా కిందపడిపోయింది. కిందపడిపోయిన దశరథుని, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దుఃఖానికి అంతులేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Ayodhya Kanda Sarga 79 In Telugu – అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గః

Ayodhya Kanda Sarga 79

అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గములో, భరతుడు చిత్తతో రాముడిని అనుసరించి అరణ్యానికి చేరుకున్నాడు. అతని వెంట సుమంతుడు, వశిష్టుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి తదితరులు ఉన్నారు. రాముడు తన తల్లి కౌసల్యను పలకరించి ఆశీర్వాదం అందుకున్నాడు. భరతుడు రాముని పాదాలను తాకి అయోధ్యకు తిరిగి రావాలని వేడుకున్నాడు. రాముడు తన పాదుకలను భరతునికి సమర్పించి, అవి ఆయుధాలుగా రాజ్యం పరిపాలించమని ఆదేశించాడు. భరతుడు పాదుకలను తీసుకొని, రాముడి ఆజ్ఞ ప్రకారం నందిగ్రామంలో ఉంటూ, రాముడి ప్రతినిధిగా రాజ్యపాలన చేయడానికి తిరిగి వెళ్ళాడు. భరతుడి త్యాగం, భక్తి, సోదర ప్రేమ ఈ సర్గలో స్పష్టంగా దర్శనమిస్తుంది.

సచివప్రార్థనాప్రతిషేధః

తతః ప్రభాతసమయే దివసే చ చతుర్దశే |
సమేత్య రాజకర్తారః భరతం వాక్యమబ్రువన్ || ౧ ||

గతర్దశరథః స్వర్గం యో నో గురుతరః గురుః |
రామం ప్రవ్రాజ్య వై జ్యేష్ఠం లక్ష్మణం చ మహాబలమ్ || ౨ ||

త్వమద్య భవ నో రాజా రాజపుత్ర మహాయశః |
సంగత్యా నాపరాధ్నోతి రాజ్యమేతదనాయకమ్ || ౩ ||

ఆభిషేచనికం సర్వమిదమాదాయ రాఘవ |
ప్రతీక్షతే త్వాం స్వజనః శ్రేణయశ్చ నృపాత్మజ || ౪ ||

రాజ్యం గృహాణ భరత పితృపైతామహం మహత్ |
అభిషేచయ చాత్మానం పాహి చాస్మాన్నరర్షభ || ౫ ||

[* ఏవముక్తః శుభం వాక్యం ద్యుతిమాన్ సత్య వాక్ఛుచిః |*]
ఆభిషేచనికం భాండం కృత్వా సర్వం ప్రదక్షిణమ్ |
భరతస్తం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రతః || ౬ ||

జ్యేష్ఠస్య రాజతా నిత్యముచితా హి కులస్య నః |
నైవం భవంతః మాం వక్తుమర్హంతి కుశలా జనాః || ౭ ||

రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీపతిః |
అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ || ౮ ||

యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబలా |
ఆనయిష్యామ్యహం జ్యేష్ఠం భ్రాతరం రాఘవం వనాత్ || ౯ ||

ఆభిషేచనికం చైవ సర్వమేతదుపస్కృతమ్ |
పురః కృత్య గమిష్యామి రామహేతోర్వనం ప్రతి || ౧౦ ||

తత్రైవ తం నరవ్యాఘ్రమభిషిచ్య పురస్కృతమ్ |
ఆనేష్యామి తు వై రామం హవ్యవాహమివాధ్వరాత్ || ౧౧ ||

న సకామాం కరిష్యామి స్వామిమాం మాతృగంధినీమ్ |
వనే వత్స్యామ్యహం దుర్గే రామః రాజా భవిష్యతి || ౧౨ ||

క్రియతాం శిల్పిభిః పంథాః సమాని విషమాణి చ |
రక్షిణశ్చానుసంయాంతు పథి దుర్గ విచారకాః || ౧౩ ||

ఏవం సంభాషమాణం తం రామహేతోర్నృపాత్మజమ్ |
ప్రత్యువాచ జనస్సర్వః శ్రీమద్వాక్యమనుత్తమమ్ || ౧౪ ||

ఏవం తే భాషమాణస్య పద్మా శ్రీరుపతిష్ఠతామ్ |
యస్త్వం జ్యేష్ఠే నృపసుతే పృథివీం దాతుమిచ్ఛసి || ౧౫ ||

అనుత్తమం తద్వచనం నృపాత్మజ
ప్రభాషితం సంశ్రవణే నిశమ్య చ |
ప్రహర్షజాస్తం ప్రతి బాష్పబిందవో
నిపేతురార్యానననేత్ర సంభవాః || ౧౬ ||

ఊచుస్తే వచనమిదం నిశమ్య హృష్టాః
సామాత్యాః సపరిషదో వియాతశోకాః |
పంథానం నరవర భక్తిమాన్ జనశ్చ
వ్యాదిష్టాస్తవ వచనాచ్చ శిల్పివర్గః || ౧౭ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనాశీతితమః సర్గః || ౭౯ ||

Ayodhya Kanda Sarga 79 Meaning In Telugu

పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. “కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉ పద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు.”అని అన్నాడు.

భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి.

వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధి పతిగా ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజుకావాలి. నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి.” అని ఆదేశించాడు భరతుడ ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి, అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “భరత కుమారా! తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకు అన్ని ఏర్పాట్లు చేస్తాము.” అని అన్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము డెబ్బది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ అశీతితమః సర్గః (80) >>

Aranya Kanda Sarga 13 In Telugu – అరణ్యకాండ త్రయోదశః సర్గః

Aranya Kanda Sarga 13 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” త్రయోదశః సర్గలో, అజ్ఞాతవాసంలో ఉన్న రోజుల్లో నివాసం చేసుకోవడానికి అడవిలో ఒక స్థలాన్ని సూచించమని రాముడు అగస్త్య మహర్షిని అభ్యర్థిస్తాడు. అగస్త్య మహర్షి రామాయణం యొక్క తదుపరి కోర్సును ఊహించాడు మరియు స్త్రీత్వం మరియు సీత చుట్టూ తన సంభాషణను నడిపించాడు. అప్పుడు ఆ ఋషి పంచవటికి వెళ్లమని రాముడికి తెలియజేస్తాడు, అక్కడ సీత తన పరిసరాలను చూసి ముచ్చటగా ఉంటుంది.

పంచవటీగమనమ్

రామ ప్రీతోఽస్మి భద్రం తే పరితుష్టోఽస్మి లక్ష్మణ |
అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా ||

1

అధ్వశ్రమేణ వాం ఖేదో బాధతే ప్రచురశ్రమః |
వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా ||

2

ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ న విమానితా |
ప్రాజ్యదోషం వనం ప్రాప్తా భర్తృస్నేహప్రచోదితా ||

3

యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు |
దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్ఛతీ ||

4

ఏషా హి ప్రకృతిః స్త్రీణామాసృష్టే రఘునందన |
సమస్థమనురజ్యంతి విషమస్థం త్యజ్యంతి చ ||

5

శతహ్రదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా |
గరుడానిలయోః శైఘ్ర్యమనుగచ్ఛంతి యోషితః ||

6

ఇయం తు భవతో భార్యా దోషైరేతైర్వివర్జితా |
శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ హ్యరుంధతీ ||

7

అలంకృతోఽయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ |
వైదేహ్యా చానయా రామ వత్స్యసి త్వమరిందమ ||

8

ఏవముక్తః స మునినా రాఘవః సంయతాంజలిః |
ఉవాచ ప్రశ్రితం వాక్యమృషిం దీప్తమివానలమ్ ||

9

ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుంగవః |
గుణైః సభ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి ||

10

కిం తు వ్యాదిశ మే దేశం సోదకం బహుకాననమ్ |
యత్రాశ్రమపదం కృత్వా వసేయం నిరతః సుఖమ్ ||

11

తతోఽబ్రవీన్మునిశ్రేష్ఠః శ్రుత్వా రామస్య తద్వచః |
ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః ||

12

ఇతో ద్వియోజనే తాత బహుమూలఫలోదకః |
దేశో బహుమృగః శ్రీమాన్పంచవట్యభివిశ్రుతః ||

13

తత్ర గత్వాశ్రమపదం కృత్వా సౌమిత్రిణా సహ |
రంస్యసే త్వం పితుర్వాక్యం యథోక్తమనుపాలయన్ ||

14

కాలోఽయం గతభూయిష్ఠో యః కాలస్తవ రాఘవ |
సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే ||

15

తీర్ణప్రతిజ్ఞః కాకుత్స్థ సుఖం రాజ్యే నివత్స్యసి |
ధన్యస్తే జనకో రామ స రాజా రఘునందన ||

16

యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివ తారితః |
విదితో హ్యేష వృత్తాంతో మమ సర్వస్తవానఘ ||

17

తపసశ్చ ప్రభావేన స్నేహాద్దశరథస్య చ |
హృదయస్థశ్చ తే ఛందో విజ్ఞాతస్తపసా మయా ||

18

ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే |
వసంతం త్వాం జనాః సర్వే జ్ఞాస్యంతి రఘునందన ||

19

అతశ్చ త్వామహం బ్రూమి గచ్ఛ పంచవటీమితి |
స హి రమ్యో వనోద్దేశో మైథిలీ తత్ర రంస్యతే ||

20

స దేశః శ్లాఘనీయశ్చ నాతిదూరే చ రాఘవ |
గోదావర్యాః సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ||

21

ప్రాజ్యమూలఫలశ్చైవ నానాద్విజగణాయుతః |
వివిక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవ చ ||

22

భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే |
అపి చాత్ర వసన్రామ తాపసాన్పాలయిష్యసి ||

23

ఏతదాలక్ష్యతే వీర మధూకానాం మహద్వనమ్ |
ఉత్తరేణాస్య గంతవ్యం న్యగ్రోధమభిగచ్ఛతా ||

24

తతః స్థలముపారుహ్య పర్వతస్యావిదూరతః |
ఖ్యాతః పంచవటీత్యేవ నిత్యపుష్పితకాననః ||

25

అగస్త్యేనైవముక్తస్తు రామః సౌమిత్రిణా సహ |
సత్కృత్యామంత్రయామాస తమృషిం సత్యవాదినమ్ ||

26

తౌ తు తేనాభ్యనుజ్ఞాతౌ కృతపాదాభివందనౌ |
తదాశ్రమాత్పంచవటీం జగ్మతుః సహ సీతయా ||

27

గృహీతచాపౌ తు నరాధిపాత్మజౌ
విషక్తతూణౌ సమరేష్వకాతరౌ |
యథోపదిష్టేన పథా మహర్షిణా
ప్రజగ్మతుః పంచవటీం సమాహితౌ ||

28

అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది.

సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు.

కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత, లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు.

అగస్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు. “నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి.” అని అడిగాడు రాముడు.

“రామా! ఇక్కడికి రెండు యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలావరకు గడిచిపోయింది. కొద్దికాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి, నీవు నీ తండ్రిమాట నిలబెట్టు. ఆయనను తరింపజెయ్యి.

అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును.

అటు చూడు. అక్కడ ఒక మధూక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధూక వనమునకు ఉత్తరంగా వెళ్లండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది.” అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు.

రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుర్దశః సర్గః (14) >>

Sri Ramadasu Keerthanalu 31- 40 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 31-40

Sri Ramadasu Keerthanalu 31- 40 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

31. అసావేరి రూపకతాళం

పల్లవి : ఆవుమీ హమర బాద్దిటికి చల్ మీ
గోల్కొండకు చల్ మీ అరే లేపు మీ
అంటే యేమోయోచించేవు మీ అరే అరే ఉటో ఉటోచల్

|| ఆవుమీ||

తివాసిదిండటిక్కా నేడుదిగూ నవాబు హుకుమిదిచూడు.
జవాబు మాతోసరిగా నేడు చెప్పి నీవు మానము కాపాడు

|| ఆవుమీ||

అవురంగ బాదుతఖత్తులోన అనేక తహసీల్దార్లున్నారు
వారిపై నున్న ఏమో నీపై బాకీశానా

|| ఆవుమీ||

నిముషమైనా నిలువనీయము నిలువలన్ని ఝటా పైకము
చేకొనుము వేగమే యిపుడు చేర్చందు చేసుకొందుముచూడు

||ఆవుమీ||

ఆవు లే కానీ యీ సీమకధికారైన వేరువాము
మీదొక భద్రాద్రి శ్రీరామదాసుడని తాళలేముసుమ్మి

|| ఆవుమీ||

32. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : ఆనందమానందమాయెను శ్రీజానకిరామస్మరణచేయును
నేడార్యుల కృప మాకుగల్గెను ఇప్పుడిరువ దేడింటనున్న రాజును జూడగానే

||ఆనంద॥

పరమభక్తి శ్రద్ధగల్గెను బహుదురితజాలములెల్ల దొలగెను
పలురాగద్వేషమువల్ల వీడెఅట్టె రాజయోగమందున్న పరమాత్మ జూడగనే

||ఆనంద॥

పూర్వపుణ్యములొనగూడెను శ్రీపార్వతి జపమంత్రమీడేరెను
పూర్వకృతంబు కనబడేను పరమపావనమైన శ్రీహరి సేవ గల్గెనేడు

||ఆనంద॥

సామాన్యులచెంత చేరము వట్టిపామర జనులనింక గూడము
విషయ కామములజేరి వేడము
మాకు హరినామస్మరణజేయు పరమభాగవతులు దిక్కు

॥ఆనంద॥

రామభక్తుల జేరగల్గెను ఇతర కామముల్లను వీడగల్గెను
పరభామలపైన భ్రాంతి దొలగెను మేము నరులదోషము లెన్న మొరులకు నెదురాడము

॥ఆనంద॥

ఇతర చింతలు చేయమువేరే ఇతరదైవమును గొలిచియాడము
ధరాపతులకు మ్రొక్కింతలు చేయము ఇనకులచంద్రుడైన
భద్రాద్రిస్వామి మాదుదైవము పేరు
క్షుద్రదేవతలను దలపము దారిద్ర్యములనెల్లమది నెంచము
భద్రగిరి రామదాసు నేలిన పరమదయాళుడు గల్గె

॥ఆనంద॥

33. కాంభోజి చాపుతాళం

పల్లవి :ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
నాపామరత్వముచేత బ్రతిమాలికొనియెద రామచంద్ర

॥ఆన॥

తామసింపక యిత్తరి నన్ను కృపజూడు రామచంద్ర
తడియక మీ తల్లి దండ్రియాన తీరు రామచంద్ర

॥ఆన॥

సేవకునిగా జేసి చేయిబట్టి రక్షింపు రామచంద్ర
చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్ర

॥ఆన॥

కోరిక దయచేసి కొదవలు దీర్చుమో రామచంద్ర
కొమరొప్ప మీ కులగురువాయుదీరు రామచంద్ర

॥ఆన॥

నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్ర
వినయమిగా సౌమిత్రి యానతీరు రామచంద్ర

॥ఆన॥

వేడుకమీరగ వేగరక్షింపుమి రామచంద్ర
జోడుగ భరత శత్రుఘ్ను లానతీరు రామచంద్ర

॥ఆన॥

జంటగ మీ వెంట బంటుగ నేలుము రామచంద్ర
తంటలేని మీయింటి యానతీరు రామచంద్ర

॥ఆన॥

ఆదరింపుము నన్ను అడియేన్ దాసుడ రామచంద్ర
వాడేల రామదాసుని బ్రోవుమిక రామచంద్ర

॥ఆన॥

34. ఆనందభైరవి ఏకతాళం

పల్లవి : ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి
రఘురాములతో నే పుట్టనైతి
శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని
దశరథనందుడై దాశరథి రాముల వశముగ బాలురతో
వరదుడై యాడగ వనజనాభునకు దాసుడనై నే భయభక్తితోడ

॥ఆశ॥

సకల సేవలుసల్పుచుమురియును అకటనలుగురితోనాడుకొనుదుగద
అయోధ్యాపురిలో గజమునెక్కి అత్యుతుండు రాగాను నాట్యమాడుచు
నన్ను రక్షింపుమంచును విశ్వామిత్రుని వెంటపోగా నేనునుపోదును జనకుడు హరికి

॥ఆశ॥

జానకిని పెండ్లాడగ వారిద్దరికి నే శేషబియ్యము నిత్తును
అమ్మవారికి ఆకులమడచి యిత్తును నరులార యితడే నారాయణుడని చాటుదును

॥ఆశ॥

మనలను రక్షించే మాధవుడు వచ్చేనందును మన గతి యేమందు
ప్రభు దశరథునే బతిమాలుదుగద కైకేయిని నే గాదనందుగద
రామునికైన రాజ్యమిత్తుగద ప్రభవయి యేలగ నేనొనర్తు గద
అడవికి బోవ నంటిపోదుగద గుహునితో గూడుక కూడి మురియుదుగద

॥ఆశ॥

నిల్చి దానవుల నెత్తి గొట్టుదుగద కరయుద్ధంబున గౌగలింతుగద
కనకమృగమును రామకాంత తెమ్మంటె ఓ నిర్దయులార అయ్యోనే పోయి
ఆ మృగమును దెచ్చి అమ్మకిత్తుగద హరిని నేనుపోవదందునుగద
ఈ మృగమువెంట, దశముఖు డంతట తపోవేషమున
దశముఖు తన శౌర్యముజూపగ జానకి వణకగ ఆ రావణుడు సీతమ్మను చెరపట్టగ
అప్పుడు నేనుంటే అమ్మ కభయ మిత్తును

॥ఆశ॥

ఆ శ్రీపాదములునట్టే పట్టుకనే మ్రొక్కుదును
హరి దుఃఖింపగ అమ్మడ దెత్తును
సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును
విశ్వములో నందరు విన నట్లూరకుండిరీ
సురవరులందరు సుఖంబుగ జూచుచుండిరి.
అయ్యో యిదేమని ఆ బ్రహ్మాదుల శపింతునుగద

॥ఆశ॥

మిత్రవంశునకు నేనేమి చేయుదు నేనెవ్వరివేడుదు
ఏమరియుండిరీ మానినులందరు ఏలపోయెనో యాక్షీరాబ్ధికి
ఏల దశరథుడు యజ్ఞము చేసెను ఎందుకు బుట్టిరియీ లోకమునను
ఎందుకు వచ్చిరి యీవనమునకును ఇట్టి వరములనేలవేడిరి
ఎక్కడ నోపుదు యింతటి జాలి

॥ఆశ॥

పంపాతీరమున పరిమార్చి కబంథుని
ఇంపుగ శబరివిందులు యిష్టములోజేసి
ఇంద్రసూనుని హతముగావించి ఆంజనేయాంగదముఖ్యాదులు
మంజులవాణిని మరువక వెతకగ వారలతోగూడి వెడుదుగద
వైదేహిని ప్రేమతో సహాయముగా రమ్ము
సముద్రము నే చౌకళించి వేగ దుముకుదును
లంకను గాలించి పంకజాక్షిని నే సేవింతును
సంపాతి పోకముందు

॥ఆశ॥

అంగుళీయకమిచ్చి అమ్మా హరి యిచ్చెనందును
ఆవృత్తాంతము హరికినే విన్న వింతును
జానకిరామ జాగేల రమ్మందును అపరాధిని నేనని వారికి వాహనము
ఆంజనేయుడు ఆ లక్ష్మణునకు అంగదడా
ప్రభు రాములనే ప్రార్థించెదను గద సేనలగూడుక చెండాడు

॥ఆశ॥

కపులచే వారధి గట్టింతుగద సముద్రుడా యిది సమయమందు
గద హరిసేనతో పనులాచరింతుగద వలీముఖులకుగల బలము
జూతుగద శుభరామునితో సొంపు నొందుగద

॥ఆశ॥

లక్ష్మణాగ్రజుడు సేననురావించి లక్ష్మికొరకు కపి లంక జుటంగ
రక్షించు భద్రాద్రివాసుడనై రణములో రావణుని ద్రుంతును
మాధవుకర్పించి మురియుదును అమ్మకు మారుగ అగ్నిలో జొత్తును

॥ఆశ॥

పుష్పకమెక్కి హరితో నయోధ్యకు బోదును
భరతుడానంద భరితుడై వేడుకొనగ
జోరున వాద్యములు భువనములు నిండి మ్రోయగ
పట్టాభిషేకము పరమఋషులు సేవింపగ
జలజాక్షులు జయములు పాడంగ రాములతొడపై లక్ష్మియుండగ
లక్ష్మణానుజులు వింజామర విసరగా వాయుసుతుడు పద వనజము లొత్తగా
జేరి విభీషణ మహాత్మయనగా అర్థికపులు హరిగోవిందయనగ
బ్రహ్మాదులు హరి ప్రస్తుతింపగా తల్లిమారుతికి దండవేయగా
నా తల్లియపుడు నాకును వేయునుగద కష్టపడితినని కరుణించుగద
సీతారాములు సిరులిత్తురుగద

॥ఆశ॥

35. వరాళి రూపకతాళం

పల్లవి :ఇదిగో రండి పైకము చూడండి
దినిటీ వేయించండి తివాసులు పరిపించండి.
రవాణ ధనములు కన్నుల జూచి
రశీదు మాకు వ్రాసియివ్వండి
పండ్రేండ్లాయెమీరు బందిఖానాలోన నుంచీ
పాపమనక రామదాసుని బాధించుచున్నావు చాలు

||ఇదిగో||

పారనలేని దొరతనమట పాలించుచుండి
మీరేప్పుడూ చెల్లి చెలకలున్నను ప్రొద్దున చెల్లగట్టి పోయెదముగాని

||ఇదిగో||

రామదాసుని తల్లిదండ్రులు రయమున తనయునిగనుగొని
క్షేమమరసిపోవగ వచ్చితి మీక్షణమాలస్యము చేయుటతగదిక

||ఇదిగో||

36. కల్యాణి చాపుతాళం

పల్లవి : ఇన్ని గల్గి మీరూరకున్న నేనెవరినాడ నౌదు
కన్నతండ్రివలె రక్షించుటకును కరుణ యేలరాదు
అక్షయ మియ్యదలచిన శ్రీ మహలక్ష్మీదేవి లేదా
రక్షింప దయగలిగిన భూదేవియు రత్నగర్భగాదా

||ఇన్ని||

పక్షపాతమొదలి పని చేతిలో పరుసవేది లేదా
ఈ తక్షణమున దయగలిగిన సంచిత ధనమున్నదిగాదా

||ఇన్ని||

ననుగని నిర్హేతుక కృపజూచిన కల్పతరువు లేదా
మనవాడని నెనరుంచిన చింతామణి యున్నది గాదా

||ఇన్ని||

పెనబడు వెతదీర్పును శరణాగతి బిరుదు నీదేగదా
వనజ భవాండము లేలు దొరలు దేవరవారలెగదా

||ఇన్ని||

కరిప్రహ్లాద విభీషణాదులను కాచితివని వింటి
హరసుర బ్రహ్మాదుల కంటెను నిను నధికుడవనియంటి

||ఇన్ని||

రామసిరిదాయక నీ మరుగుజొచ్చితిని చేపట్టు మటంటి
కరుణతో భద్రాచల రామదాసుని గావుము యనియంటి

||ఇన్ని||

37. వరాళి రూపకతాళం

పల్లవి : ఎంతో మహానుభావుడవు నీవు
ఎంతో చక్కని దేవుడవు
వింతను చేసితి నీ లోకమందున
సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర

||ఎంతో||

తొలివేల్పు జాంబవంతుని చేసినావు
మలివేల్పు పవనజుగా జేసినావు
వెలయ సూర్యు సుగ్రీవుగ జేసినావు
ఇల సర్వామరుల కోతుల జేసినావు

||ఎంతో||

కారణ శ్రీ సీతగ జేసినావు
గరిమ శేషుని లక్ష్మణుని జేసినావు
ఆరెంటిని భరతశత్రుఘ్నుల జేసినావు
నారాయణ నీవు నరుడవైనావు

||ఎంతో||

రాతికి ప్రాణము రప్పించినావు
నాతి ఎంగిలి కానందించినావు
కోతి మూకలనెల్ల గొలిపించినావు
నీటిపై కొండలు నిల్పించినావు

||ఎంతో||

లంకపై దండెత్తి లగ్గెక్కినావు
రావణకుంభకర్ణుల ద్రుంచినావు
పంకజాక్షిని సీత పాలించినావు
లంకేశు దివ్యపుష్క మెక్కినావు

||ఎంతో||

పరగ నమోధ్యకు బరతెంచినావు
పట్టాభిషిక్తుడవై పాలించినావు
వర భద్రగిరి యందు వసియించినావు
ధరను రామదాసు దయ నేలినావు

||ఎంతో||

38. ఆనందభైరవి చాపుతాళం

పల్లవి :ఎటుబోతివో రామ ఎటుబోతివో
ఎటుబోతివో నిన్ను నే వేడు కొనుచుంటి
గటకటా నేడు నా కనుల జూతామంటే

||ఎటు||

అంధకారమువంటి బంధిఖానాలో
నన్ను నిందల నెడబాపనేల నీకు మ్రొక్కెదస్వామీ

||ఎటు||

పాపము లన్ని యెడబాపెడి దొరవు నీవు
ఆపదలుదీర్చి నన్నాదుకొమ్మంటీ స్వామీ

||ఎటు||

తాసీషాగారు వచ్చి సరితీర్పు చేరుదును
పైకము బంపించి వేగ బంధిఖానా వదిలింప

||ఎటు||

అపరాధినని చాల మతిచేసి మొరలిడగ
వెనుకటి నేరము లెంచక వేగమె రావే

||ఎటు||

అప్పుల వారొచ్చి యరికట్టుచున్నారు
ఒప్పుకోబడునని చెప్పక దాగినావె

||ఎటు||

నీవు భద్రాచల నిలయుడవయ్య రామ
బ్రోవవయ్య రామదాసు నేయెడ స్వామీ

||ఎటు||

39. వరాళి చాపుతాళం

పల్లవి : ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదును ఓరామా
నన్నింత కన్నడ జేయుట నీకు న్యాయము కాదు సుమీ ఓ రామా

॥ఎన్నెన్ని॥

మొదటి నిబంధనము సగమాయువు నిదురపాలై పోయెనుగా ఓ రామా
పదపడి తక్కిన సగములో పదియేండ్లు బాలత్వమున బోయెనుగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

వదలక యౌవనము పరాభావమువలన దగులనాయెనా ఓ రామా
రాముడిమి సంసారకూపములో జిక్కి మునిగి తేలగనాయేనా ఓ రామా

॥ఎన్నెన్ని॥

తను వస్థిరంబని తారకనామము తలపోయలేనైతిగా ఓ రామా
దినదినము పొట్టకొరకై దీనులవేన దీనత్వమొందితిగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

అనుదినమును గురువుపదేశయోగము నభ్యసించనైతిగా
ఎనసి నిమిషమైన మీ పాదములపైన మనసు నిల్పగనైతిగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

వాసిగ నిహములో బడిన పాటునెల్ల బాసిన పాశముగా ఓ రామా
మీ సేవజేయు మిమ్మే నమ్మిన భవపాపములంటవుగా ఓ రామా

॥ఎన్నెన్ని॥

లేశమైన కృతజేసి భద్రశైలవాస కావగా రావుగా ఓ రామా
ఆశతోనే రామదాసుడని మీకు దోసిలి యొగ్గితిరా ఓ రామా

॥ఎన్నెన్ని॥

40. బిలహరి ఆదితాళం

పల్లవి : ఎవరు దూషించిన నేమి మరి ఎవరు భూషించిన నేమి
అపగుణము మాన్పి యార్చే రా తీర్చే రా
నవనీతచోరుడు నారాయణుడుండగ

॥ఎవరు॥

పిమ్మట నాడిననేమి మంచి ప్రియములు పలికిన నేమి
కొమ్మరో రమ్మని కోరికలొసగెడి సమ్మతి నాపాలి సర్వేశ్వరుడుండగ

॥ఎవరు॥

వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల
భాషించువారితో పలుమారు పొందేల కాచి రక్షించెడి ఘనుడు రాముడు

॥ఎవరు॥

అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై యున్నారు.
విపరీత చరితలు వినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టి యుండగ

॥ఎవరు॥

వారి వన్నెలు సల్పనేల మూడు వాసనలకు భ్రమయనేల
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదాసుడై యుండగ

॥ఎవరు॥

మరిన్ని కీర్తనలు:

  1. కన్నడ ఆదితాళం
  2. సావేరి చాపుతాళం
  3. మోహన ఆదితాళం
  4. ఆనందభైరవి రూపకతాళం
  5. కళ్యాణి ఆదితాళం
  6. నాదనామక్రియ రూపకతాళం
  7. మాయామాళవగౌళ ఏకతాళం
  8. నాదనామక్రియ ఆదితాళం
  9. కాంభోజి ఆదితాళం
  10. మధ్యమావతి చాపుతాళం
  11. మోహన ఆదితాళం

Aranya Kanda Sarga 5 In Telugu – అరణ్యకాండ పంచమః సర్గః

Aranya Kanda Sarga 5 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ పంచమః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. సుర్పణఖ రాముడిని చూసి మోహించి, సీతను వదిలేయమని కోరుతుంది. రాముడు సీతను వదలకుండా సుర్పణఖతో మాట్లాడతాడు. సుర్పణఖ తన మాయలు ప్రయోగించి రాముడిని పొందాలని ప్రయత్నిస్తుంది.

|| శరభంగబ్రహ్మలోకప్రస్థానమ్ ||

హత్వా తు తం భీమబలం విరాధం రాక్షసం వనే |
తతః సీతాం పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్ ||

1

అబ్రవీల్లక్ష్మణం రామో భ్రాతరం దీప్తతేజసమ్ |
కష్టం వనమిదం దుర్గం న చ స్మ వనగోచరాః ||

2

అభిగచ్ఛామహే శీఘ్రం శరభంగం తపోధనమ్ |
ఆశ్రమం శరభంగస్య రాఘవోఽభిజగామ హ ||

3

తస్య దేవప్రభావస్య తపసా భావితాత్మనః |
సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతమ్ ||

4

విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరోపమమ్ |
అవరుహ్య రథోత్సంగాత్సకాశే విబుధానుగమ్ ||

5

అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరమ్ |
సుప్రభాభరణం దేవం విరజోంబరధారిణమ్ ||

6

తద్విధైరేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః |
హరిభిర్వాజిభిర్యుక్తమంతరిక్షగతం రథమ్ ||

7

దదర్శాదూరతస్తస్య తరుణాదిత్యసన్నిభమ్ |
పాండురాభ్రఘనప్రఖ్యం చంద్రమండలసన్నిభమ్ ||

8

అపశ్యద్విమలం ఛత్రం చిత్రమాల్యోపశోభితమ్ |
చామరవ్యజనే చాగ్ర్యే రుక్మదండే మహాధనే ||

9

గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని |
గంధర్వామరసిద్ధాశ్చ బహవః పరమర్షయః ||

10

అంతరిక్షగతం దేవం వాగ్భిరగ్ర్యాభిరీడిరే |
సహ సంభాషమాణే తు శరభంగేన వాసవే ||

11

దృష్ట్వా శతక్రతుం తత్ర రామో లక్ష్మణమబ్రవీత్ |
రామోఽథ రథముద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్ ||

12

అర్చిష్మంతం శ్రియా జుష్టమద్భుతం పశ్య లక్ష్మణ |
ప్రతపంతమివాదిత్యమంతరిక్షగతం రథమ్ ||

13

యే హయాః పురుహూతస్య పురా శక్రస్య నః శ్రుతాః |
అంతరిక్షగతా దివ్యాస్త ఇమే హరయో ధ్రువమ్ ||

14

ఇమే చ పురుషవ్యాఘ్రా యే తిష్ఠంత్యభితో రథమ్ |
శతం శతం కుండలినో యువానః ఖడ్గపాణయః ||

15

విస్తీర్ణవిపులోరస్కాః పరిఘాయతబాహవః |
శోణాంశువసనాః సర్వే వ్యాఘ్రా ఇవ దురాసదాః ||

16

ఉరోదేశేషు సర్వేషాం హారా జ్వలనసన్నిభాః |
రూపం బిభ్రతి సౌమిత్రే పంచవింశతివార్షికమ్ ||

17

ఏతద్ధి కిల దేవానాం వయో భవతి నిత్యదా |
యథేమే పురుషవ్యాఘ్రా దృశ్యంతే ప్రియదర్శనాః ||

18

ఇహైవ సహ వైదేహ్యా ముహూర్తం తిష్ఠ లక్ష్మణ |
యావజ్జానామ్యహం వ్యక్తం క ఏష ద్యుతిమాన్రథే ||

19

తమేవముక్త్వా సౌమిత్రిమిహైవ స్థీయతామితి |
అభిచక్రామ కాకుత్స్థః శరభంగాశ్రమం ప్రతి ||

20

తతః సమభిగచ్ఛంతం ప్రేక్ష్య రామం శచీపతిః |
శరభంగమనుప్రాప్య వివిక్త ఇదమబ్రవీత్ ||

21

ఇహోపయాత్యసౌ రామో యావన్మాం నాభిభాషతే |
నిష్ఠాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి ||

22

[* తావద్గచ్ఛామహే శీఘ్రం యావన్మాం నాభిభాషతే | *]
జితవంతం కృతార్థం చ ద్రష్టాహమచిరాదిమమ్ |
కర్మ హ్యనేన కర్తవ్యం మహదన్యైః సుదుష్కరమ్ ||

23

నిష్పాదయిత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి |
ఇతి వజ్రీ తమామంత్ర్య మానయిత్వా చ తాపసమ్ ||

24

రథేన హరియుక్తేన యయౌ దివమరిందమః |
ప్రయాతే తు సహస్రాక్షే రాఘవః సపరిచ్ఛదమ్ ||

25

అగ్నిహోత్రముపాసీనం శరభంగముపాగమత్ |
తస్య పాదౌ చ సంగృహ్య రామః సీతా చ లక్ష్మణః ||

26

నిషేదుః సమనుజ్ఞాతా లబ్ధవాసా నిమంత్రితాః |
తతః శక్రోపయానం తు పర్యపృచ్ఛత్స రాఘవః ||

27

శరభంగశ్చ తత్సర్వం రాఘవాయ న్యవేదయత్ |
మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీషతి ||

28

జితముగ్రేణ తపసా దుష్ప్రాపమకృతాత్మభిః |
అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానమదూరతః ||

29

బ్రహ్మలోకం న గచ్ఛామి త్వామదృష్ట్వా ప్రియాతిథిమ్ |
త్వయాఽహం పురుషవ్యాఘ్ర ధార్మికేణ మహాత్మనా ||

30

సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితమ్ |
అక్షయా నరశార్దూల మయా లోకా జితాః శుభాః ||

31

బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్ |
ఏవముక్తో నరవ్యాఘ్రః సర్వశాస్త్రవిశారదః ||

32

ఋషిణా శరభంగేణ రాఘవో వాక్యమబ్రవీత్ |
అహమేవాహరిష్యామి సర్వలోకాన్మహామునే ||

33

ఆవాసం త్వహమిచ్ఛామి ప్రదిష్టమిహ కాననే |
రాఘవేణైవముక్తస్తు శక్రతుల్యబలేన వై ||

34

శరభంగో మహాప్రాజ్ఞః పునరేవాబ్రవీద్వచః |
ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామ ధార్మికః ||

35

వసత్యరణ్యే ధర్మాత్మా స తే శ్రేయో విధాస్యతి |
సుతీక్ష్ణమభిగచ్ఛ త్వం శుచౌ దేశే తపస్వినమ్ ||

36

రమణీయే వనోద్దేశే స తే వాసం విధాస్యతి |
ఇమాం మందాకినీం రామ ప్రతిస్రోతామనువ్రజ ||

37

నదీం పుష్పోడుపవహాం తత్ర తత్ర గమిష్యసి |
ఏష పంథా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్య తాత మామ్ ||

38

యావజ్జహామి గాత్రాణి జీర్ణాం త్వచమివోరగః |
తతోఽగ్నిం సుసమాధాయ హుత్వా చాజ్యేన మంత్రవిత్ ||

39

శరభంగో మహాతేజాః ప్రవివేశ హుతాశనమ్ |
తస్య రోమాణి కేశాంశ్చ దదాహాగ్నిర్మహాత్మనః ||

40

జీర్ణాం త్వచం తథాస్థీని యచ్చ మాంసం సశోణితమ్ |
రామస్తు విస్మితో భ్రాత్రా భార్యయా చ సహాత్మవాన్ ||

41

స చ పావకసంకాశః కుమారః సమపద్యత |
ఉత్థాయాగ్నిచయాత్తస్మాచ్ఛరభంగో వ్యరోచత ||

42

స లోకానాహితాగ్నీనామృషీణాం చ మహాత్మనామ్ |
దేవానాం చ వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత ||

43

స పుణ్యకర్మా భవనే ద్విజర్షభః
పితామహం సానుచరం దదర్శ హ |
పితామహశ్చాపి సమీక్ష్య తం ద్విజం
ననంద సుస్వాగతమిత్యువాచ హ ||

44

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమః సర్గః ||

Aranya Kanda Sarga 5 Meaning In Telugu

విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము.” అని అన్నాడు.

లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు.

తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. “రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడక ముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవ కార్యము నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తరువాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరుమాత్రము రామునికి అన్నివిధాలా సాయం చెయ్యండి.” అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకొని తన రథము మీద స్వర్గమునకు వెళ్లిపోయాడు.

తరువాత రాముడు, లక్ష్మణుడు, సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్లాడు. అందరూ ఆమహామునికి పాదాభివందనము చేసారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు.

రాముడు శరభంగ మహర్షిని చూచి “ఓ మహర్షీ!
దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగోరుతాను.” అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు.

“రామా! నేను ఎంతో తపస్సు చేసాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకొని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని, నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. రామా! నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మ లోకములను, స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను. స్వీకరించు.” అని అన్నాడు.

దానికి రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షి! పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించు కోవాలేగానీ, ఒకరు ఇస్తే స్వీకరించ కూడదు.కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యములో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి.” అని అడిగాడు.

ఆ మాటలకు శరభంగ మహాముని ఇలాఅన్నాడు. “ఓ రామా! ఈ అరణ్యములో సుతీక్షుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్లి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించ గలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకినీ నది ప్రవాహము నకు ఎదురు వెళితే, (అంటే ఎగువభాగంలో అని అర్థం) సుతీక్షుడి ఆశ్రమము వస్తుంది.

రామా! నీతో మాట్లాడాను. నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూఉండు.” అని అన్నాడు. తరువాత శరభంగ మహర్షి అగ్ని గుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేసాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్ని కుండము నుండి నవయౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్లిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగమహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ షష్ఠః సర్గః (6) >>

Sri Ramadasu Keerthanalu 51-60 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

శ్రీ రామదాసు కీర్తనలు - Sri Ramadasu Keerthanalu కీర్తన: 51-60

Sri Ramadasu Keerthanalu 51-60 In Telugu – శ్రీ రామదాసు కీర్తనలు

ఈ పోస్ట్ లో శ్రీ రామదాసు గారి కీర్తనలు వేదములో అనేక సంగీత పారంపర్యాలు ఉన్నాయి.

51. సావేరి చాపుతాళం

పల్లవి : కలయే గోపాలం కస్తూరి తిలక సుఫాలం
కుండల రుచిరం లలితకపోలం
చంద్రసన్నిభ కాంతి కాంతం
జగన్నాధపురీ నిశాంతం
అనుపమ రూపం మహితమణి కనిక కలాపం
విగతగోప వినుతాడు తాపం.
ముని మనోనీరేజ తరణీం
పంకజ సన్నిభ చారుచరణం
విదిత ద్విజకాంత కరాంభోజ నవనీతం
కమల భవముని గీతం
వివిధ కుసుమాలంకారం
విమల బృందావన విహారం

॥కలయే॥

భాసిత భాసురం భద్రాద్రినివాస నిధానం
దివ్యానంత భూసురగానం
రాజకేళి విరాజమానం
రామదాస స్తుతి నిధానం

॥కలయే॥

52. మోహన ఆదితాళం

పల్లవి : కలికి యీ కల సాంగముగ వినవే
ఓ కలికి పలుకగ నీతో మైపులకలొద వేడిని
అప్పుకలుగువాడె యువతి రామదాసుడు
అప్పుడతనికై నేడు
ఇద్దరు గూడి జోడుకప్పము పుచ్చికొనెడి
చెప్పున మము బంపుడు
తప్పక యెసగుడు తడవులేక రసీదనుడు

॥కలికి॥

రామలక్ష్మణులట వా రర్క వంశజులట
రామదాసు పైకమట రసీదు బంపెనట
రాములవారు చెల్లించిరట రసీదందిపోయిందట
ఏమి కారణము యెరుగను ఈ కలను
యేమని చెప్పుదునే నెలనాగ యీ వింత
ఈ మహిమలు ఆ రాములది కాబోలు
జాము ప్రొద్దున్నది జయ మపజయమే యెరుగ

॥కలికి॥

53. ఆనందభైరవి రూపకతాళం

కలియుగ వైకుంఠము భద్రాచలనిలయము సేవింతము
అలివేణులారా మీరానందముగ వేగ విలిసితమైనట్టి వేడుక చూడరె

|| కలియుగ||

కాంచనసౌధములు కంబమును మించిన దూలములు
వజ్రములు చెక్కించిన స్తంభములు
పగడములని భ్రమించు ద్వారములు
అందయాన మరి యెంచలేనుగాదె
మంచి పచ్చలు గూర్చిన వాకిళ్ళు

|| కలియుగ||

బంగారు గోపురములు దేవళముల వెలుంగు మాణిక్యములు
భేరీమృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలు
సొంపైన కల్యాణరత్న మంటపములు
శృంగారమేమని దెలియ విన్నవింతు

|| కలియుగ||

తీరైన పురవీధులు సొంపైన కోనేరులు
సోపానములు సకల ఫలతరువులు
ఆ నదులు ఋషి గంధర్వ నివాసములు
సరసిజాక్ష వినవే సరిలేని గోదావరి స్నానములు
సంపత్కరమై యొప్పినది

॥కలియుగ॥

చక్కని స్త్రీ పురుషులు పట్టణమందు
పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు
వేదశాస్త్రతార్కిక వైష్ణవులు గ్రక్కున వారిని కన్నులజూచి
తక్కువైన పుణ్యమేయని తెల్పుదు

॥కలియుగ॥

వామాక్షులాడగను సీతనుగూడి
హేమపీఠమునందు సంపూర్ణకళలు మోము వెలుగగను
పరివారములు ప్రేమతో గొలువగను
ప్రేమచే భద్రాద్రిరామదాసుని మేలు
స్వామి శ్రీ కోదండరాము నివాసము

॥కలియుగ॥

54. కళ్యాణి ఆదితాళం

పల్లవి : కైంకర్యము చేసెను రామదాసు కైంకర్యము చేసెను
కైంకర్యముచేసె కాకుత్థ్స తిలకునకు
సంకటహరణ సర్వాత్మయని మ్రొక్కి

||కైంకర్యము॥

శ్రీ కరమగు రాజిత మణిశాలల
ప్రాకారంబుల బహుమఠమెల్లెడ
మంజుల తరమగు మణి మంటపములు
రంజరాగమణి కలితాంగంబుల

||కైంకర్యము॥

చౌకంగ కాంచన కూటంబుల
నాకాశంబున కంటెడు తేరుల
గోపుర మెరసెడి నోపురవితతుల
దీవించు వితర్థిశల బెడంగుల

||కైంకర్యము॥

తళుకుగులుకు పగడంపు కంబముల
బలుపడంబులును బలు కలువడముల
రంగుగ ముత్యపు రంగవల్లికల
శృంగారములగు చిరతపాలికల

॥కైంకర్యము॥

మకరతోరణ మణి మాల్యంబుల
ముకురతోరణ సమ్మోదంబుల
భుగభుగ వెలసెడు పూ చప్పరముల
అగరు ధూపముల నాలపట్టములు

||కైంకర్యము॥

మెరసెడు రీతిని మేలిమిగాగను
ధారాళములగు ద్వారబంధముల
చారురత్న కాంచన శిఖరంబులకు
ఘుమఘుమమనియెడు గంధవాసనల

||కైంకర్యము॥

ఘుమఘుము యను బలు కుంకుమరసముల
ఘణఘణఘణ యను గంటలు తలుపుల
ధణధణ యనెడి మృదంగ వాద్యముల
మిసమిస మెరిసెడి మేనిమిగోడల

||కైంకర్యము॥

కనకమయంబగు గరుడ ధ్వజముల
రామరామయను రామ శుకంబుల
వేమరు పొగడెడు విబుధ గణంబుల
పొసగ మ్రోయు తంబురుల పరంబుల

||కైంకర్యము॥

కొసరి యాడు భక్తుల నృత్యంబుల
వైనతేయముఖ వాహన చయముల
పూనమర్దల భూరి నినాదము
మెరసెడిరీతిని మేలిమిగాగను

||కైంకర్యము॥

వెల్లగొడుగులను వింజామరములు
మల్లెల మొల్లల మంచివాసనల
పిల్లనగ్రోవి గంభీర స్వరముల
ఝల్లరి ఢక్కా జయనాదమ్ముల

||కైంకర్యము॥

పల్లవపాణులు పాటలాటల
సల్లలితోత్పలచయ పరిమళముల
వనమాలా సంత సౌరభముల
ఘన తులసీదళ ఘన కదంబముల

॥కైంకర్యము॥

రామభజన సంభారోత్కరముల
రామతీర్థ సారసముల తావుల
రామస్మరణావ మధురమ్ముల
రామభద్ర విగ్రహదర్శనముల
హనుమదంగ వాహనముల ఘనముల

॥కైంకర్యము॥

అనుపమ శృంగారానందముల
రమణ భద్రగిరి రామాలయములు
అమలానందంబై ధరలోపల
మెరసెడిరీతిని మేలిమి గాగను

॥కైంకర్యము॥

55. నాదనామక్రియ రూపకతాళం

పల్లవి : ధన్యుడవు తానీషా నీవు
నన్ను గన్నయ్య పదములు కలగన్నావు

॥ధన్యుడవు॥

నిన్నటిరాతిరి వారు వచ్చియున్న ముచ్చటలాడి యేమేమి యున్నారు
ఎంతవేడినగాని రారు నీవు పుణ్యమూర్తివి గనుక పొడసూపినారు
తానీషా : ధన్యుడవు గోపన్న నీవు యా దాశరథికి నిజదాసుడైనావు
సామాన్యుడని యెంచుకొంటి శ్రీరామచంద్రుల సేవ మీవలన గంటి
ప్రేమతో సేవించుకొంటి నేను పామరుడనై మిమ్ము బాధింపుచుంటి

॥ ధన్యుడవు ॥

గోపన్న : ఏమి పూజలు చేసినారు మా స్వామి భద్రగిరి దాసులు మీరు
ప్రేమతో సేవించినారు శ్రీరామ కృపగల్గి రంజిల్లుతారు
తానీషా : పైకము దీసుకుపొండి భద్రాచల రామదాసులై పట్టమేలండి
అయినదెల్ల వేడుకొనండి మీరు అనుదినము రాముల నర్చించండి

॥ధన్యుడవు||

గోపన్న : ఏటిమాటలు పలికెదరు నా కేటికి రాజ్యమీ యిలలోనే మీరు
మేటి జన్మమెత్తినారు మీ సాటివారలు యీ జగములోలేరు

||ధన్యుడవు ||

తానీషా : భద్రాచలము నెప్పటికి మీ రామభద్రున కిచ్చితి బాగుగా వినుమా
ముద్ర నిశానీల్ కొనుమా శ్రీ భద్రాద్రివర రామదాసుడై యేలుమి

॥ధన్యుడవు||

56. మాయామాళవగౌళ ఏకతాళం

పల్లవి : నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవా బృందాలోలం

|| నంద ||

జలజ సంభవాది వినుత చరణారవిందం
లలితమోహన రాధావదన నళిన మిళిందం

|| నంద ||

నిటల లలిత స్ఫటికుటిల నీలాలక బృందం కృష్ణం
ఘటిత శోభిత గోపికా ధర మకరందం

॥నంద॥

గోదావరీ తీర రాజగోపికా రామం కృష్ణం
ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రి రామం

|| నంద ||

57. నాదనామక్రియ ఆదితాళం

పల్లవి : పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కయినా
వెయ్యారులు దాచుకొనియు నర్థులకియ్యని లోభుల కయ్యయ్యో

||పొయ్యే||

చరణములు :
ఇచ్చిన మాత్రం బిచ్చును దైవము హెచ్చడిగినరాదు
వచ్చేటప్పుడు వెంటనేమైన తెచ్చుకొన్నదిలేదు

||పొయ్యే||

హెచ్చుగతిది తెలియని పామరులు దురాశను తగులుకొని
ఇచ్చుటనార్జించిన ధనమెచ్చటకెత్తుకు పొయ్యే దరయ్యయ్యో

||పొయ్యే||

తనువును రక్షించుటకై మూలమూలలందును ధనము దాచెదరు
తనువును సుతబాంధవు లస్థిరమని తలచి గానగలేరు

||పొయ్యే||

58. కాంభోజి ఆదితాళం

పల్లవి : బహుకాలమునకు శ్రీ భద్రాచలశేషునకు పాదసేవకుడనైతి
అహహా నాజన్మము సఫలమాయె నేటికిని అనుమానములు దీరె నిక సుంతగను

||బహు||

తల్లి గర్భమునందు మలమూత్రముల మునిగి ధరణిపై జన్మించితి
కల్లలాడుచు పాపకర్మలొడిగట్టి కామపురుషులను జేరితి నీవేగతి

||బహు||

కోపుడను పాపుడను గుణహీనుడను నేను క్రూరుడను కుత్సితుడను
దాపుచేయక నన్ను రక్షింపదలచు శ్రీరామచంద్రునకు భారమా యికను

||బహు||

అఖిల లోకంబులకు నాధారమైయున్న యాది పురుషోత్తముడు
సక్రియతో గూడిన సమయమందుజేరి సన్నుతులు చేయకలిగి తొలుత

||బహు||

రామదాసుని నేలుకొరకై శ్రీభధ్రాద్రిధాములై యుదయించి
యేమికొదవలు మనకు నెరుగగలుగజేసే స్నేహంబునితరమెల్లకల్ల

||బహు||

59. మధ్యమావతి చాపుతాళం

పల్లవి : బిడియ మేలనిక మోక్షమిచ్చి నీవడుదుదాటిపోరా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా

॥ బిడియ॥

మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
నీ అరుదుమీరలని నెగురవేయ నే హనుమంతుడనుగాను
సరగున మ్రుచ్చుల మాటలు విన నే జాంబవంతుడను గాను
బిరబిర మీవల లోపల బడ నే విభీషణుడనుగాను

||బిడియ॥

మాయచేత వంచింపబడగనే మహేశుడనుగాను
న్యాయములేకయే యిటునటు దిరుగను నారదుండగాను
ఆయముచెడి హరినరుడని కొలువను నర్జునుండగాను
దాయాదుండని మదిలో మురియను దశరథుడనుగాను

||బిడియ||

గరిమతోడ మా సీతనుజూడ కాచితినిందాక
పరగభద్రుని శిఖరావాసా పరబలసంహార
నరహరి నను రక్షింపువేగమే నారాయణరూపా
మంచి నిదురలోనైనను మీపద సరసిజములు మరువ

||బిడియ||

60. మోహన ఆదితాళం

పల్లవి : భద్రాద్రిపురమున మేము బహుదినముల నుండి కాపురము
అద్రిజాధిప బ్రహ్మేంద్రాదులకెల్ల భద్రములొసగెడు భవ్యవిధానము

॥భద్రాద్రి॥

ఇనవంశజులు మేమిద్దరము చాలదినమునుండి యున్నారము
అనిశము రామదాసుని యాజ్ఞ చొప్పున పనులు చేయుచు

॥భద్రాద్రి॥

ఖైదు చేసిన వార్తదెలిసి యిల్లు బయలుదేరి మిమ్ములకలసి
పైకము చెల్లించి భక్తుని యాపదబాపి గొంపోయెడి పనికై వచ్చితిమి

॥భద్రాద్రి॥

భక్తుడైన రామదాసు యెంతో శక్తిచేసిరి మంచి మేలని
ముక్తిని ధానమౌ యుక్తి తెలియక యాశక్తి ధనాపేక్షకై యిటు చేసిరి

||భద్రాద్రి॥

మించిన కార్యమేమాయె యెంతో వంచన చేయుటలాయె
సంచులన్నీ మీరె యెంచి రసీదు వ్రాయించి సెలవిప్పించండి వేగమె

||భద్రాద్రి॥

రామదాసుని రప్పించు తండ్రి ప్రేమతో మాకప్పగించు
స్వామి యా భద్రాద్రి సదయుని కనుగొన రామదాసునిగూడి రయమున బోవలె

||భద్రాద్రి॥

మరిన్ని కీర్తనలు:

Ayodhya Kanda Sarga 78 In Telugu – అయోధ్యాకాండ అష్టసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 78 In Telugu

అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గములో, భరతుడు రాముని ఆశ్రమానికి చేరి ఆయనకు సమర్పణను చెప్పాడు. రాముడు తన తమ్ముడిని ఆలింగనం చేసి సంతాపం వ్యక్తం చేశాడు. భరతుడు రాముని అయోధ్యకు తిరిగి రావాలని, తాను పాదుకలు మాత్రమే ధరించి రాజ్యం పరిపాలిస్తానని కోరాడు. రాముడు తండ్రి చిత్తానికి ప్రతిబంధకుడు కావడం ఇష్టం లేక, తన నిర్ణయం మార్చుకోకుండా అడవిలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళి, అవి పీఠంపై ఉంచి రాముడి హస్తంతోనే పరిపాలన చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఇది వాక్కులు, పాదుకల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

కుబ్జావిక్షేపః

అథ యాత్రాం సమీహంతం శత్రుఘ్నః లక్ష్మణానుజః |
భరతం శోకసంతప్తమిదం వచనమబ్రవీత్ || ౧ ||

గతిర్యః సర్వ భూతానాం దుఃఖే కిం పునరాత్మనః |
స రామః సత్త్వసంపన్నః స్త్రియా ప్రవ్రాజితః వనమ్ || ౨ ||

బలవాన్ వీర్యసంపన్నో లక్ష్మణో నామ యోఽప్యసౌ |
కిం న మోచయతే రామం కృత్వా అపి పితృనిగ్రహమ్ || ౩ ||

పూర్వమేవ తు నిగ్రాహ్యః సమవేక్ష్య నయానయౌ |
ఉత్పథం యః సమారూఢో నార్యా రాజా వశం గతః || ౪ ||

ఇతి సంభాషమాణే తు శత్రుఘ్నే లక్ష్మణానుజే |
ప్రాగ్ద్వారేఽభూత్తదా కుబ్జా సర్వాభరణభూషితా || ౫ ||

లిప్తా చందనసారేణ రాజవస్త్రాణి బిభ్రతీ |
వివిధం వివిధైస్తైస్తైర్భూషణైశ్చ విభూషితా || ౬ ||

మేఖలాదామభిశ్చిత్రైః అన్యైశ్చ శుభభూషణైః |
బభాసే బహుభిర్బద్ధా రజ్జుబద్ధేవ వానరీ || ౭ ||

తాం సమీక్ష్య తదా ద్వాస్థాః సుభృశం పాపకారిణీమ్ |
గృహీత్వాఽకరుణం కుబ్జాం శత్రుఘ్నాయ న్యవేదయత్ || ౮ ||

యస్యాః కృతే వనే రామర్న్యస్త దేహశ్చ వః పితా |
సేయం పాపా నృశంసా చ తస్యాః కురు యథామతి || ౯ ||

శత్రుఘ్నశ్చ తదాజ్ఞాయ వచనం భృశదుఃఖితః |
అంతఃపురచరాన్ సర్వాన్ ఇత్యువాచ ధృతవ్రతః || ౧౦ ||

తీవ్రముత్పాదితం దుఃఖం భ్రాతౄణాం మే తథా పితుః |
యయా సేయం నృశంసస్య కర్మణః ఫలమశ్నుతామ్ || ౧౧ ||

ఏవముక్తా తు తేనాశు సఖీజనసమావృతా |
గృహీతా బలవత్ కుబ్జా సా తద్గృహమనాదయత్ || ౧౨ ||

తతః సుభృశ సంతప్తస్తస్యాః సర్వః సఖీజనః |
క్రుద్ధమాజ్ఞాయ శత్రుఘ్నం వ్యపలాయత సర్వశః || ౧౩ ||

ఆమంత్రయత కృత్స్నశ్చ తస్యాః సర్వసఖీజనః |
యథాఽయం సముపక్రాంతర్నిశ్శేషం నః కరిష్యతి || ౧౪ ||

సానుక్రోశాం వదాన్యాం చ ధర్మజ్ఞాం చ యశస్వినీమ్ |
కౌసల్యాం శరణం యామః సా హి నోఽస్తు ధ్రువా గతిః || ౧౫ ||

స చ రోషేణ తామ్రాక్షః శత్రుఘ్నః శత్రుతాపనః |
విచకర్ష తదా కుబ్జాం క్రోశంతీం ధరణీతలే || ౧౬ ||

తస్యా హ్యాకృష్యమాణాయా మంథరాయాస్తతస్తతః |
చిత్రం బహువిధం భాండం పృథివ్యాం తద్వ్యశీర్యత || ౧౭ ||

తేన భాండేన సంస్తీర్ణం శ్రీమద్రాజనివేశనమ్ |
అశోభత తదా భూయః శారదం గగనం యథా || ౧౮ ||

స బలీ బలవత్క్రోధాద్గృహీత్వా పురుషర్షభః |
కైకేయీమభినిర్భర్త్స్య బభాషే పరుషం వచః || ౧౯ ||

తైః వాక్యైః పరుషైర్దుఃఖైః కైకేయీ భృశదుఃఖితా |
శత్రుఘ్నభయసంత్రస్తా పుత్రం శరణమాగతా || ౨౦ ||

తాం ప్రేక్ష్య భరతః క్రుద్ధం శత్రుఘ్నమిదమబ్రవీత్ |
అవధ్యాః సర్వభూతానాం ప్రమదాః క్షమ్యతామితి || ౨౧ ||

హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీమ్ |
యది మాం ధార్మికో రామర్నాసూయేన్మాతృ ఘాతకమ్ || ౨౨ ||

ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవః |
త్వాం చ మాం చైవ ధర్మాత్మా నాభిభాషిష్యతే ధ్రువమ్ || ౨౩ ||

భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణానుజః |
న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరామ్ || ౨౪ ||

సా పాదమూలే కైకేయ్యాః మంథరా నిపపాత హ |
నిశ్శ్వసంతీ సుదుఃఖార్తా కృపణం విలలాప చ || ౨౫ ||

శత్రుఘ్న విక్షేప విమూఢసంజ్ఞామ్
సమీక్ష్య కుబ్జాం భరతస్య మాతా |
శనైః సమాశ్వాసయదార్తరూపామ్
క్రౌంచీం విలగ్నామివ వీక్షమాణామ్ || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టసప్తతితమః సర్గః || ౭౮ ||

Ayodhya Kanda Sarga 78 Meaning In Telugu

దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు.

“భరతా! మనము ఇంట లేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపి వేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమయింది. కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా! స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంతదూరము వచ్చిఉండెడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు.” అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసి మంథరం అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు.

ఒంటినిండా నగలు అలంకరించు కున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతి లాగ కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంథరను పట్టుకొని శత్రుఘ్నుని వద్దకు తీసుకొని వచ్చారు.

“శత్రుఘ్నకుమారా! ఈమె కైక ఆంతరంగిక దాసి. పేరు మంథర. ఈమె రాముని వనవాసమునకు, మహారాజు మరణమునకు, కారణము. ఈమెను నీ ముందర నిలబెట్టాము. ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.” అని అన్నారు.

ఆ మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం మిన్నుముట్టింది. “మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారము చేసిన ఈ దాసికి తగిన గుణపాఠము చెబుతాను.” అని అన్నాడు. ఆసమయంలో మంథర తో వచ్చిన వాళ్లు శత్రుఘ్నుని కోపం చూచి తలొకదిక్కుకూ పారిపోయారు. “ఈరోజు మంథర శత్రుఘ్నుని చేతిలో చచ్చింది” అని అందరూ అనుకున్నారు.

కొందరు గబగబా కౌసల్యకు ఈ వార్త చెప్పడానికి వెళ్లారు. శత్రుఘ్నుడు మంధరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మంధర అలంకరించుకున్న ఆభరణములు అన్నీ నేల మీద “చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతలో కైక అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మంథర మెడ పట్టుకొని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మంథరను కాపాడమని బతిమాలింది.

భరతుడు శత్రుఘ్నుని చూచి “శత్రుఘ్నా! ఆగు. ఎంత అపరాథము చేసినా స్త్రీలను చంపరాదు.. కాబట్టి మంథరను విడిచి పెట్టు. దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని. కాని రాముడికి అది ఇష్టంలేదు. అందుకని నాకోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మంథర ఒక దాసి. ఆమె ఏమి చేస్తుంది. ఆమెను క్షమించు.” అని అన్నాడు భరతుడు. భరతుని మాటలకు శత్రుఘ్నుడు తనకోపాన్ని దిగమింగుకొని మంథరను విడిచిపెట్టాడు. మంథర కైక పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బడి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనాశీతితమః సర్గః (79) >>

Ayodhya Kanda Sarga 77 In Telugu – అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గః

Ayodhya Kanda Sarga 77

అయోధ్యాకాండం సప్తసప్తతితమః సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్ర విచారం, క్షోభతో మరణించిన తరువాత, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది. భరతుడు, శతృఘ్నుడు వారి మాతామహుడి యైన అశ్వపతికి చెరి అక్కడ విషాద వార్త వింటారు. తండ్రి మరణవార్త విని, భరతుడు తీవ్ర దుఃఖంతో అయోధ్యకు తిరిగి వస్తాడు. కైకేయి చేసిన పాపాన్ని తెలుసుకొని, భరతుడు ఆమె పట్ల ఆగ్రహంతో ఉంటాడు. అయోధ్య ప్రజలు భరతుని ఆగమనాన్ని చూసి, రాముని గదిని శూన్యంగా చూచి, రాముని గురించీ భరతుని ప్రశ్నిస్తారు. దశరథుడి మరణంతో, భరతుడు బాధతో కైకేయిని విసురుకుంటాడు.

భరతశత్రుఘ్నవిలాపః

తతర్దశాహేఽతిగతే కృతశౌచో నృపాత్మజః |
ద్వాదశేఽహని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ || ౧ ||

బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం ధనమన్నం చ పుష్కలమ్ |
వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ || ౨ ||

బాస్తికం బహు శుక్లం చ గాశ్చాపి శతశస్తథా |
దాసీదాసం చ యానం చ వేశ్మాని సుమహాంతి చ || ౩ ||

బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రః రాజ్ఞస్తస్యౌర్ధ్వదైహికమ్ |
తతః ప్రభాతసమయే దివసేఽథ త్రయోదశే || ౪ ||

విలలాప మహా బాహుర్భరతః శోకమూర్ఛితః |
శబ్దాపిహితకంఠశ్చ శోధనార్థముపాగతః || ౫ ||

చితామూలే పితుర్వాక్యమిదమాహ సుదుఃఖితః |
తాత యస్మిన్నిసృష్టోఽహం త్వయా భ్రాతరి రాఘవే || ౬ ||

తస్మిన్వనం ప్రవ్రజితే శూన్యే త్యక్తోఽస్మ్యహం త్వయా |
యథా గతిరనాథాయాః పుత్రః ప్రవ్రాజితః వనమ్ || ౭ ||

తామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వం క్వ గతర్నృప |
దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస్థిస్థానమండలమ్ || ౮ ||

పితుః శరీరనిర్వాణం నిష్టనన్ విషసాద సః |
స తు దృష్ట్వా రుదన్ దీనః పపాత ధరణీతలే || ౯ ||

ఉత్థాప్యమానః శక్రస్య యంత్ర ధ్వజైవచ్యుతః |
అభిపేతుస్తతః సర్వే తస్యామాత్యాః శుచివ్రతమ్ || ౧౦ ||

అంతకాలే నిపతితం యయాతిమృషయో యథా |
శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిప్లుతమ్ || ౧౧ ||

విసంజ్ఞో న్యపతద్భూమౌ భూమి పాలమనుస్మరన్ |
ఉన్మత్తైవ నిశ్చేతా విలలాప సుదుఃఖితః || ౧౨ ||

స్మృత్వా పితుర్గుణాంగాని తని తాని తదా తదా |
మంథరాప్రభవస్తీవ్రః కైకేయీగ్రాహసంకులః || ౧౩ ||

వరదానమయోఽక్షోభ్యో అమజ్జయచ్ఛోకసాగరః |
సుకుమారం చ బాలం చ సతతం లాలితం త్వయా || ౧౪ ||

క్వ తాత భరతం హిత్వా విలపంతం గతః భవాన్ |
నను భోజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ || ౧౫ ||

ప్రవారయసి నః సర్వాన్ తన్నః కోఽన్య కరిష్యతి |
అవదారణ కాలే తు పృథివీ నావదీర్యతే || ౧౬ ||

యా విహీనా త్వయా రాజ్ఞా ధర్మజ్ఞేన మహాత్మనా |
పితరి స్వర్గమాపన్నే రామే చారణ్యమాశ్రితే || ౧౭ ||

కిం మే జీవితసామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
హీనో భ్రాత్రా చ పిత్రా చ శూన్యామిక్ష్వాకు పాలితామ్ || ౧౮ ||

అయోధ్యాం న ప్రవేక్ష్యామి ప్రవేక్ష్యామి తపోవనమ్ |
తయోర్విలపితం శ్రుత్వా వ్యసనం చాన్వవేక్ష్య తత్ || ౧౯ ||

భృశమార్తతరా భూయః సర్వ ఏవానుగామినః |
తతః విషణ్ణౌ శ్రాంతౌ చ శత్రుఘ్నభరతావుభౌ || ౨౦ || [విశ్రాంతౌ]

ధరణ్యాం సంవ్యచేష్టేతాం భగ్నశృంగావివర్షభౌ |
తతః ప్రకృతిమాన్ వైద్యః పితురేషాం పురోహితః || ౨౧ ||

వసిష్ఠో భరతం వాక్యముత్థాప్య తమువాచ హ |
త్రయోదశోఽయం దివసః పితుర్వృత్తస్య తే విభో || ౨౨ ||

సావశేషాస్థినిచయే కిమిహ త్వం విలంబసే |
త్రీణి ద్వంద్వాని భూతేషు ప్రవృత్తాన్యవిశేషతః || ౨౩ ||

తేషు చాపరిహార్యేషు నైవం భవితుమర్హతి |
సుమంత్రశ్చాపి శత్రుఘ్నముత్థాప్యాభిప్రసాద్య చ || ౨౪ ||

శ్రావయామాస తత్త్వజ్ఞః సర్వభూతభవాభవౌ |
ఉత్థితౌ తౌ నరవ్యాఘ్రౌ ప్రకాశేతే యశస్వినౌ || ౨౫ ||

వర్షాతప పరిక్లిన్నౌ పృథగింద్రధ్వజావివ |
అశ్రూణి పరిమృద్నంతౌ రక్తాక్షౌ దీనభాషిణౌ |
అమాత్యాస్త్వరయంతి స్మ తనయౌ చాపరాః క్రియాః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తసప్తతితమః సర్గః || ౭౭ ||

Ayodhya Kanda Sarga 77 Meaning In Telugu

దశరథుడు మరణించిన పదవ రోజున శుద్ధిజరిగింది. పన్నెండవ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు, బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహన దానము, వస్త్రదానములు విరివిగా చేసాడు. పదమూడవ రోజున భరతుడు అస్థిసంచయనము కొరకు శ్మశానమునకు వెళ్లాడు. తండ్రిచితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు.

“తండ్రీ! నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్లిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా, కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వుకూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయావు.” అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు.

ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దు:ఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు.

“తండ్రీ! కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగి పోయావా! నీవు భరతుని ఎంతో గారాబం చేసావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. ఓదార్చవా! మాకు కావలసిన వస్త్రములు, భోజనపదార్థములు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చే వాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చి ఇస్తారు. ధర్మాత్ముడవు అయిన నీవు పోగానే ఈ భూమి బ్రద్దలు కావాల్సింది. కాని ఎందుకో అలా జరగలేదు. తండ్రీ! మీరు వెళ్లిపోయారు. రాముడు అరణ్యములకు వెళ్లాడు. ఇంక నేను ఎవరిని చూచుకొని బతకాలి. నేనుకూడా అగ్నిప్రవేశము చేస్తాను. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాను. అంతేకానీ అయోధ్యలో అడుగుపెట్టను.” అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు.

ఆ అన్నదమ్ముల శోకమును చూచి అక్కడ ఉన్నవారికి కూడా దు:ఖము ఆగలేదు. అప్పుడు వసిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “భరతా! నీ తండ్రి మరణించి నేటికి పదమూడవ దినము. నీవు అస్థి సంచయనము చేయవలెను. ఇంకనూ నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు మూడు అవస్థలు తప్పవు. అవే ఆకలి దప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు. ధనికుడైనా,

పేదవాడైనా, మహారాజైనా కటిక దరిద్రుడైనా ఇవి అనుభవించ వలసినదే. కాబట్టి నీ తండ్రి మరణము గురించి చింతించడం అవివేకము.” అని అన్నాడు. సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పుమాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకమును విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమమును నిర్వర్తించారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

అయోధ్యాకాండ అష్టసప్తతితమః సర్గః (78) >>