Ayodhya Kanda Sarga 64 In Telugu – అయోధ్యాకాండ చతుఃషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 64

అయోధ్యాకాండ చతుఃషష్ఠితమః సర్గః రామాయణంలో కీలకమైన సర్గ. ఈ సర్గలో, కైకేయి మనసు వశం చేసేందుకు మంతర ప్రేరణతో, దశరథుని వద్ద రెండు వరాలు కోరుతుంది. మొదటిదిగా, భరతుడిని రాజుగా ప్రకటించాలని, రెండవదిగా రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించాలని కోరుతుంది. దశరథుడు ఈ శోకంతో కృంగిపోయి, కైకేయి మాటలను స్వీకరించి, రాముడికి అరణ్యవాసం నిశ్చయిస్తాడు. రాముడు ఈ నిర్ణయాన్ని సమ్మతించి, సీత మరియు లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్ళి, తన తండ్రి ఆజ్ఞను పాటిస్తాడు. ఈ సర్గలో భక్తి, విధేయత, ధర్మాన్ని సృష్టిస్తూ, రాముడి ధైర్యం, కర్తవ్య పరాయణతను చూపుతుంది.

దశరథదిష్టాంతః

వధమప్రతిరూపం తు మహర్షేస్తస్య రాఘవః |
విలపన్నేవ ధర్మాత్మా కౌసల్యాం పునరబ్రవీత్ ||

1

తదజ్ఞానాన్మహత్పాపం కృత్వాహం సంకులేంద్రియః |
ఏకస్త్వచింతయం బుద్ధ్యా కథం ను సుకృతం భవేత్ ||

2

తతస్తం ఘటమాదయ పూర్ణం పరమవారిణా |
ఆశ్రమం తమహం ప్రాప్య యథాఖ్యాతపథం గతః ||

3

తత్రాహం దుర్బలావంధౌ వృద్ధావపరిణాయకౌ |
అపశ్యం తస్య పితరౌ లూనపక్షావివ ద్విజౌ ||

4

తన్నిమిత్తాభిరాసీనౌ కథాభిరపరిక్రమౌ |
తామాశాం మత్కృతే హీనౌ ఉదాసీనావనాథవత్ ||

5

శోకోపహతచిత్తశ్చ భయసంత్రస్తచేతనః |
తచ్చాశ్రమపదం గత్వా భూయః శోకమహం గతః ||

6

పదశబ్దం తు మే శ్రుత్వా మునిర్వాక్యమభాషత |
కిం చిరాయసి మే పుత్ర పానీయం క్షిప్రమానయ ||

7

యన్నిమిత్తమిదం తాత సలిలే క్రీడితం త్వయా |
ఉత్కంఠితా తే మాతేయం ప్రవిశ క్షిప్రమాశ్రమమ్ ||

8

యద్వ్యలీకం కృతం పుత్ర మాత్రా తే యది వా మయా |
న తన్మనసి కర్తవ్యం త్వయా తాత తపస్వినా ||

9

త్వం గతిస్త్వగతీనాం చ చక్షుస్త్వం హీనచక్షుషామ్ |
సమాసక్తాస్త్వయి ప్రాణాః కిం త్వం నో నాభిభాషసే ||

10

మునిమవ్యక్తయా వాచా తమహం సజ్జమానయా |
హీనవ్యంజనయా ప్రేక్ష్య భీతః భీతైవాబ్రవమ్ ||

11

మనసః కర్మ చేష్టాభిరభిసంస్తభ్య వాగ్బలమ్ |
ఆచచక్షే త్వహం తస్మై పుత్రవ్యసనజం భయమ్ ||

12

క్షత్రియోఽహం దశరథో నాహం పుత్రో మహాత్మనః |
సజ్జనావమతం దుఃఖమిదం ప్రాప్తం స్వకర్మజమ్ ||

13

భగవంశ్చాపహస్తోఽహం సరయూతీరమాగతః |
జిఘాంసుః శ్వాపదం కించిత్ నిపానే చాగతం గజమ్ ||

14

తత్ర శ్రుతః మయా శబ్దో జలే కుంభస్య పూర్యతః |
ద్విపోఽయమితి మత్వాఽయం బాణేనాభిహతః మయా ||

15

గత్వా నద్యాస్తతస్తీరమపశ్యమిషుణా హృది |
వినిర్భిన్నం గతప్రాణం శయానం భువి తాపసమ్ ||

16

భగవన్ శబ్దమాలక్ష్య మయా గజజిఘాంసునా |
విసృష్టోఽంభసి నారాచస్తేన తే నిహతస్సుతః ||

17 [తతస్తే]

తతస్తస్యైవ వచనాదుపేత్య పరితప్యతః |
స మయా సహసా బణోద్ధృతో మర్మతస్తదా ||

18

స చోద్ధృతేన బాణేన తత్రైవ స్వర్గమాస్థితః |
భవంతౌ పితరౌ శోచన్నంధావితి విలప్య చ ||

19

అజ్ఞానాద్భవతః పుత్రః సహసాఽభిహతః మయా |
శేషమేవం గతే యత్స్యాత్ తత్ప్రసీదతు మే మునిః ||

20

స తచ్ఛ్రుత్వా వచః క్రూరం మయోక్తమఘశంసినా |
నాశకత్తీవ్రమాయాసమకర్తుం భగవానృషిః ||

21

స బాష్పపూర్ణవదనో నిఃశ్వసన్ శోకకర్శితః |
మామువాచ మహాతేజాః కృతాంజలిముపస్థితమ్ ||

22

యద్యేతదశుభం కర్మ న త్వం మే కథయేః స్వయమ్ |
ఫలేన్మూర్ధా స్మ తే రాజన్ సద్యః శతసహస్రధా ||

23

క్షత్రియేణ వధో రాజన్ వానప్రస్థే విశేషతః |
జ్ఞానపూర్వం కృతః స్థానాత్ చ్యావయేదపి వజ్రిణమ్ ||

24

సప్తధా తు ఫలేన్మూర్ధా మునౌ తపసి తిష్ఠతి |
జ్ఞానాద్విసృజతః శస్త్రం తాదృశే బ్రహ్మవాదిని ||

25

అజ్ఞానాద్ధి కృతం యస్మాత్ ఇదం తేనైవ జీవసి |
అపి హ్యద్య కులం నస్యాత్ ఇక్ష్వాకూణాం కుతః భవాన్ ||

26

నయ నౌ నృప తం దేశమితి మాం చాభ్యభాషత |
అద్య తం ద్రష్టుమిచ్ఛావః పుత్రం పశ్చిమదర్శనమ్ ||

27

రుధిరేణావసిక్తాంగం ప్రకీర్ణాజిన వాససమ్ |
శయానం భువి నిస్సంజ్ఞం ధర్మ రాజవశం గతమ్ ||

28

అథాహమేకస్తం దేశం నీత్వా తౌ భృశదుఃఖితౌ |
అస్పర్శయమహం పుత్రం తం మునిం సహ భార్యయా ||

29

తౌ పుత్రమాత్మనః స్పృష్ట్వా తమాసాద్య తపస్వినౌ |
నిపేతతుః శరీరేఽస్య పితా తస్యేదమబ్రవీత్ ||

30

నాభివాదయసే మాఽద్య న చ మామభిభాషసే |
కిం ను శేషే తు భూమౌ త్వం వత్స కిం కుపితో హ్యసి ||

31

న త్వహం తే ప్రియం పుత్ర మాతరం పస్య ధార్మిక |
కిం ను నాలింగసే పుత్ర సుకుమార వచో వద ||

32

కస్య వాఽపరరాత్రేఽహం శ్రోష్యామి హృదయంగమమ్ |
అధీయానస్య మధురం శాస్త్రం వాన్యద్విశేషతః ||

33

కో మాం సంధ్యాముపాస్యైవ స్నాత్వా హుతహుతాశనః |
శ్లాఘయిష్యత్యుపాసీనః పుత్ర శోకభయార్దితమ్ ||

34

కందమూలఫలం హృత్వా కో మాం ప్రియమివాతిథిమ్ |
భోజయిష్యత్యకర్మణ్యమ్ అప్రగ్రహమనాయకమ్ ||

35

ఇమామంధాం చ వృద్ధాం చ మాతరం తే తపస్వినీమ్ |
కథం వత్స భరిష్యామి కృపణాం పుత్ర గర్ధినీమ్ ||

36

తిష్ఠ మాం మాగమః పుత్ర యమస్య సదనం ప్రతి |
శ్వో మయా సహ గంతాఽసి జనన్యా చ సమేధితః ||

37

ఉభావపి చ శోకార్తౌ అవనాథౌ కృపణౌ వనే |
క్షిప్రమేవ గమిష్యావస్త్వయాఽహీనౌ యమక్షయమ్ ||

38

తతః వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతీమ్ |
క్షమతాం ధర్మరాజో మే బిభృయాత్పితరావయమ్ ||

39

దాతుమర్హతి ధర్మాత్మా లోకపాలో మహాయశాః |
ఈదృశస్య మమాక్షయ్యా మేకామభయదక్షిణామ్ ||

40

అపాపోఽసి యదా పుత్ర నిహతః పాపకర్మణా |
తేన సత్యేన గచ్ఛాశు యే లోకాః శస్త్రయోధినామ్ ||

41

యాంతి శూరా గతిం యాం చ సంగ్రామేష్వనివర్తినః |
హతాస్త్వభిముఖాః పుత్ర గతిం తాం పరమాం వ్రజ ||

42

యాం గతిం సగరః శైబ్యో దిలీపో జనమేజయః |
నహుషో ధుంధుమారశ్చ ప్రాప్తాస్తాం గచ్ఛ పుత్రక ||

43

యా గతిః సర్వసాధూనాం స్వాధ్యాయాత్తపసాచ యా |
యా భూమిదస్యాహితాగ్నేః ఏకపత్నీ వ్రతస్య చ ||

44

గో సహస్రప్రదాతౄణాం యా యా గురుభృతామపి |
దేహన్యాసకృతాం యా చ తాం గతిం గచ్ఛ పుత్రక ||

45

న హి త్వస్మిన్ కులే జాతః గచ్ఛత్యకుశలాం గతిమ్ |
స తు యాస్యతి యేన త్వం నిహతో మమ బాంధవః ||

46

ఏవం స కృపణం తత్ర పర్యదేవయతాసకృత్ |
తతోఽస్మై కర్తుముదకం ప్రవృత్తః సహభార్యయా ||

47

స తు దివ్యేన రూపేణ మునిపుత్రః స్వకర్మభిః |
స్వర్గమాధ్యారుహత్ క్షిప్రం శక్రేణ సహ ధర్మవిత్ || ౪౮ ||

48

ఆబభాషే చ వృద్ధౌ తౌ సహ శక్రేణ తాపసః |
ఆశ్వాస్య చ ముహూర్తం తు పితరౌ వాక్యమబ్రవీత్ ||

49

స్థానమస్మి మహత్ప్రాప్తః భవతోః పరిచారణాత్ |
భవంతావపి చ క్షిప్రం మమ మూలముపైష్యతః ||

50

ఏవముక్త్వా తు దివ్యేన విమానేన వపుష్మతా |
ఆరురోహ దివం క్షిప్రం మునిపుత్రః జితేంద్రియః ||

51

స కృత్వా తూదకం తూర్ణం తాపసః సహ భార్యయా |
మామువాచ మహాతేజాః కృతాంజలిముపస్థితమ్ ||

52

అద్యైవ జహి మాం రాజన్ మరణే నాస్తి మే వ్యథా |
యచ్ఛరేణైకపుత్రం మాం త్వమకర్షీరపుత్రకమ్ ||

53

త్వయా తు యదవిజ్ఞానాత్ నిహతః మే సుతః శుచిః |
తేన త్వామభిశప్స్యామి సుదుఃఖమతిదారుణమ్ ||

54

పుత్రవ్యసనజం దుఃఖం యదేతన్మమ సాంప్రతమ్ |
ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి ||

55

అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా మునిః |
తస్మాత్త్వాం నావిశత్యాశు బ్రహ్మహత్యా నరాధిప ||

56

త్వామప్యేతాదృశో భావః క్షిప్రమేవ గమిష్యతి |
జీవితాంతకరో ఘోరో దాతారమివ దక్షిణా ||

57

ఏవం శాపం మయి న్యస్య విలప్య కరుణం బహు |
చితామారోప్య దేహం తన్మిథునం స్వర్గమభ్యయాత్ ||

58

తదేతచ్ఛింతయానేన స్మృతం పాపం మయా స్వయమ్ |
తదా బాల్యాత్కృతం దేవి శబ్దవేధ్యనుకర్షిణా ||

59

తస్యాయం కర్మణో దేవి విపాకః సముపస్థితః |
అపథ్యైః సహ సంభుక్తః వ్యాధిరన్నరసో యథా ||

60

తస్మాన్మామాగతం భద్రే తస్యోదారస్య తద్వచః |
యదహం పుత్రశోకేన సంత్యక్ష్యామ్యద్య జీవితమ్ ||

61

చక్షుర్భ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మా స్పృశ |
ఇత్యుక్త్వా స రుదంస్త్రస్తో భార్యామాహ చ భూమిపః ||

62

ఏతన్మే సదృశం దేవి యన్మయా రాఘవే కృతమ్ |
సదృశం తత్తు తస్యైవ యదనేన కృతం మయి ||

63

దుర్వృత్తమపి కః పుత్రం త్యజేద్భువి విచక్షణః |
కశ్చ ప్రవ్రాజ్యమానో వా నాసూయేత్పితరం సుతః ||

64

యది మాం సంస్పృశేద్రామః సకృదద్య లభేత వా |
యమక్షయమనుప్రాప్తా ద్రక్ష్యంతి న హి మానవాః ||

65

చక్షుషా త్వాం న పశ్యామి స్మృతిర్మమ విలుప్యతే |
దూతా వైవస్వతస్యైతే కౌసల్యే త్వరయంతి మామ్ ||

66

అతస్తు కిం దుఃఖతరం యదహం జీవితక్షయే |
న హి పశ్యామి ధర్మజ్ఞం రామం సత్యపరాక్రమమ్ ||

67

తస్యాదర్శనజః శోకః సుతస్యాప్రతికర్మణః |
ఉచ్ఛోషయతి మే ప్రాణాన్వారి స్తోకమివాతపః ||

68

న తే మనుష్యా దేవాస్తే యే చారుశుభకుండలమ్ |
ముఖం ద్రక్ష్యంతి రామస్య వర్షే పంచదశే పునః ||

69

పద్మపత్రేక్షణం సుభ్రు సుదంష్ట్రం చారునాసికమ్ |
ధన్యా ద్రక్ష్యంతి రామస్య తారాధిపనిభం ముఖమ్ ||

70

సదృశం శారదస్యేందోః ఫుల్లస్య కమలస్య చ |
సుగంధి మమ నాథస్య ధన్యా ద్రక్ష్యంతి తన్ముఖమ్ ||

71

నివృత్తవనవాసం తమయోధ్యాం పునరాగతమ్ |
ద్రక్ష్యంతి సుఖినో రామం శుక్రం మార్గగతం యథా ||

72

కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతీవ మే |
వేదయే న చ సంయుక్తాన్ శబ్దస్పర్శరసానహమ్ ||

73

చిత్తనాశాద్విపద్యంతే సర్వాణ్యేవేంద్రియాణి మే |
క్షిణస్నేహస్య దీపస్య సంసక్తా రశ్మయో యథా ||

74

అయమాత్మ భవః శోకో మామనాథమచేతనమ్ |
సంసాదయతి వేగేన యథా కూలం నదీరయః ||

75

హా రాఘవ మహాబాహో హా మమాఽయాసనాశన |
హా పితృప్రియ మే నాథ హాఽద్య క్వాఽసి గతః సుత ||

76

హా కౌసల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని |
హా నృశంసే మమామిత్రే కైకేయి కులపాంసని ||

77

ఇతి రామస్య మాతుశ్చ సుమిత్రాయాశ్చ సన్నిధౌ |
రాజా దశరథః శోచన్ జీవితాంతముపాగమత్ ||

78

యథా తు దీనం కథయన్నరాధిపః
ప్రియస్య పుత్రస్య వివాసనాతురః |
గతేఽర్ధరాత్రే భృశదుఃఖపీడితః |
తదా జహౌ ప్రాణముదారదర్శనః ||

79

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃషష్ఠితమః సర్గః ||

80

Ayodhya Kanda Sarga 64 Meaning In Telugu

“కౌసల్యా! ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ ముని కుమారుని మరణానికి కారకుడిని అయ్యాను. అప్పుడు నాకు ఏంచెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఉపాయము తట్టింది. నేను కుండ నిండుగా స్వచ్ఛమైన జలమును తీసుకొని ఆ ముని కుమారుడు చెప్పిన మార్గములో నడుచుకుంటూ వారి ఆశ్రమమునకు చేరుకున్నాను.

ఆ ఆశ్రమములో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారు అంధులు. లేవలేకుండా ఉన్నారు. ఎవరైనా లేచి నడిపిస్తే గానీ నడవలేకున్నారు. వారే ఆ మునికుమారుని తల్లి తండ్రులు అని అనుకున్నాను. వారు తమ కుమారుని రాక కోసరము ఎదురు చూస్తున్నారు.తమ కుమారుని మంచి తనము గురించి మాట్లాడు కుంటున్నారు. కాని వారి కుమారుడు ఇంక ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తల్చుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముని కుమారుని చంపిన దు:ఖము కంటే ఆవృద్ధ దంపతులను చూచిన తరువాత కలిగిన దుఃఖము రెట్టింపు అయింది.

నేను వారికి దగ్గరగా వెళ్లాను. నా అడుగుల చప్పుడు విన్ని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు. “కుమారా! ఏమి నాయనా. నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యం అయింది. నాకు చాలా దాహంగా ఉంది. కొంచెము నీళ్లు ఇవ్వు నాయనా. తాగుతాను. అయినా నీకు ఇంకా నీటిలో ఆటలు ఏమిటి చెప్పు. నీ కోసరం మీ అమ్మ బెంగపెట్టుకుంది. లోపలకు వెళ్లి ఆమెను పలకరించు” అని అన్నాడు ఆ వృద్ధుడు.
నేను వారికి ఏమి సమాధానము చెప్పలేదు. “నాయనా కుమారా! ఏమి నాయనా మాతో మాట్లాడవు. నామీద కోపమా. ఈ వృద్ధుల మీద కోపం ఎందుకు కుమారా! మాకు నువ్వే కదా రెండు కళ్లు. నీ కళ్లతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. నీ మీద ఆధార పడ్డ మామీద కోసం ఎందుకు కుమారా!” అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఆయనను చూచి భయం కూడా వేసింది. అందుకని తత్తరపాటుతో భయం భయంగా ఆయనతో ఇలా అన్నాను.

“మహాత్మా! నేను మీ కుమారుడిని కాదు. దశరథుడు అనే క్షత్రియుడను. అహంకారముతో, అజ్ఞానముతో అవివేకముతో ఈ దుఃఖమును చేజేతులా తెచ్చిపెట్టు కున్నాను. నేను వేటకోసరము సరయూ నదీ తీరమునకు వచ్చాను. ఏనుగును చంపవలెనని మాటువేసి ఉన్నాను. నీ కుమారుడు నీరు కుండలో నీరు నింపు ధ్వని వినపడినది. అది ఏనుగు నీరు త్రాగు శబ్దము అని భ్రమించి శబ్దవేధి బాణముతో కొట్టాను. ఒక మానవ స్వరము హాహాకారము చేయడం వినిపించింది. వెంటనే పోయి చూచాను. అక్కడ నా బాణము దెబ్బతిన్న తమరి కుమారుడు కనిపించాడు. కేవలము ఏనుగును చంపవలెనని నేను వదిలిన బాణము మీ కుమారునికి తగిలినది. మీ కుమారుడు మీ గురించి నాకు తెలియజేసాడు. నేను మీ కుమారుని కోరిక ప్రకారము ఆయన బాధను తొలగించుటకు ఆయన గుండెలలో గుచ్చుకున్న బాణమును లాగివేసితిని. వెంటనే మీ కుమారుడు మరణించాడు. నేను నీరు తీసుకొని మీ కుమారుడు చెప్పిన మార్గములో మీ వద్దకు వచ్చాను. నేను కావాలని మీకుమారుని చంపలేదు. కేవలము అవివేకము వలన తొందరపాటువలన జరిగినది. మీరు ఏ శిక్షవేసినా నేను స్వీకరిస్తాను. మీ ఇష్టము.” అని వారి ముందు నిలబడ్డాను.

ఆయన కొంచెము సేపు మాట్లాడలేదు. తరువాత ఇలా అన్నాడు. “ఓ రాజా! నీవు ఇక్కడకు వచ్చి నా కుమారుని మరణ వార్త చెప్పావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీ శిరస్సు వేయి వక్కలు అయి ఉండేది. ఎవరైనా క్షత్రియుడు తెలిసి తెలిసీ ముని కుమారుని చంపితే అతను దేవేంద్రుని పదవిలో ఉన్నాసరే అతడు శిక్షార్హుడే. ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మునిని కానీ, మునికుమారుని గానీ చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలయిపోతుంది. కాని నీవు ఈ అకృత్యమును తెలియక పొరపాటున చేసావు. కాబట్టి ఇంకా బతికి ఉన్నావు. లేకపోతే నీవే కాదు నీ వంశము సాంతము నాశనము అయి ఉండేది. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నీవు మా ఇద్దరినీ మా కుమారుని శరీరము ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. మా కుమారుని శరీరాన్ని కడసారిగా తడిమి తడిమి చూచుకుంటాము.” అని అన్నాడు. అప్పుడు నేను ఆ ఇరువురు వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలమునకు తీసుకొని వెళ్లాను. ఆతల్లి తండ్రులు వారి కుమారుని శవమును మీదపడి ఏడుస్తున్నారు. వారి శోకానికి అంతులేదు.

“కుమారా! నేను రా. మీ తండ్రిని వచ్చాను. లేచి నమస్కారము చేయి నాయనా! అయ్యో నేలమీద పడుకొని ఉన్నావా. లే నాయనా. మా మీద కోపం ఎందుకు నాయనా. మాతో మాట్లాడు. రేపటినుండి ప్రతి రోజూ ప్రాతఃకాలమున మాకు వేదము ఎవరు చదివి వినిపిస్తారు నాయనా! రేపటి నుండి నీ మధురమైన కంఠస్వరము మాకు వినపడదా! రేపటి నుండి ఎవరు పొద్దుటే స్నానసంధ్య ముగించుకొని నా పక్కన కూర్చుని నాకు సేవలు చేస్తారు. రేపటి నుండి మాకు ఎవరు ఫలములు కందమూలములు తెచ్చి తినిపిస్తారు. కుమారా! నీ తల్లిని చూడు నాయనా. కళ్లులేని కబోధి. రేపటి నుండి ఆమె ఆలనా పాలనా ఎవరు చూస్తారు.

రా నాయనా. నీవు యమలోకమునకు వెళ్లకు. మన ఇంటికి రా పోదాము. రేపు మేము కూడా నీ వెంట యమలోకమునకు వస్తాము. అందరమూ కలిసే వెళదాము. నీవు లేని ఈ లోకంలో మేము ఉండలేము. అక్కడ యమునితో నేను మాట్లాడతాను. నీవు మా ఇద్దరినీ పోషించడానికి అనుమతి తీసుకుంటాను. నిస్సహాయులమైన మాకు యముడు ఆ మాత్రం అనుమతి ఇవ్వడా! తప్పకుండా ఇస్తాడు.

నాయనా! కుమారా! నీవు ఏం పాపం చేసావనిరా ఈ పాపాత్ముడు నిన్ను పొట్టన పెట్టుకున్నాడు. నీవు వీరగతిని పొందావు. నీవు కూడా వీరులు పోయే లోకములకు పోతావు. నీవు కూడా దిలీపుడు, సగరుడు, శైబ్యుడు, జనమేజయుడు, నహుషుడు, దుందుమారుడు మొదలగు మహానుభావులు పొందిన వీరగతినే నీవు పొందుతావు. అదీ కాకపోతే, నీవు ముని కుమారుడవు. నీకు సాధువులకు ఏ ఉత్తమగతి లభిస్తుందో ఆ ఉత్తమ గతులు పొందుతావు. నీకూ నిన్ను చంపిన వాడికీ ఉత్తమ గతులు కలుగుతాయి.”

అని ఆ వృద్ధుడు కొడుకును తలచుకుంటూ విలపిస్తున్నాడు. తరువాత ఆ వృద్ధుడు తన కుమారునికి ఉదక క్రియలు నిర్వర్తించాడు. వారు ఆ కార్యక్రమము చేయు నప్పుడు నేను వారి పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను. ఆ వృద్ధుడు తన కుమారునికి జలతర్షణములు వదిలిన తరువాత నన్ను చూచి ఇలా అన్నాడు. “ఓ రాజా! నీవు నీ బాణముతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేసావు. మేము బతికీ ప్రయోజనము లేదు. కాబట్టి మా ఇద్దరినీ కూడా చంపెయ్యి. మేము మరణమును గురించి చింతించడం లేదు. కాని నీవు నా కుమారుని తెలిసి చంపినా తెలియక చంపినా, తప్పు తప్పే. దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు.

“నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమారా కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నానో, నువ్వు కూడా నీ కొడుకును చేజేతులా పోగొట్టుకొని హా పుత్రా హా పుత్రా అని ఏడుస్తూ మరణించు. ఇదే నేను నీకు ఇచ్చే శాపము.” అని నన్ను శపించాడు. తరువాత వారు ఒక చితిని పేర్పించుకొని అగ్నికి ఆహుతి అయ్యారు.

కౌసల్యా! ఆ ప్రకారంగా నేను ఆ ముని కుమారుని మృతికి కారకుడినయి ఆతని తండ్రి శాపానికి ఆహుతి అయ్యాను. ఈ నాడు ఆ శాప ప్రభావంతో నా కుమారుని చేజేతులా అడవులపాలు చేసుకొని రామా రామా అంటూ ఏడుస్తున్నాను. నేను కూడా ఆ వృద్ధుడి వలెనే కొడుకా కొడుకా అని ఏడుస్తూ మరణించవలసిన సమయము ఆసన్నమయినట్టుంది.” అని ఏడుస్తున్నాడు దశరథుడు.

కౌసల్యకు భర్తను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మౌనంగా ఉంది. తరువాత దశరథుడే అన్నాడు. “ఓ కౌసల్యా! నేను తెలివితక్కువగా అడవులకు వెళ్లమంటే, రాముడు ధర్మం ధర్మం అంటూ అడవులకు వెళ్లాడు. రాముడు చేసింది ధర్మమే. కాని నేనే అధర్మానికి పాలుబడ్డాను. కొడుకును అడవులకు పంపాను.

లేకపోతే ఎవడైనా చేజేతులా కొడుకును పోగొట్టుకుంటాడా! పోనీ నేను తెలివి తక్కువ వాడిని. ఏ కొడుకైనా తండ్రి అడవులకు పో అంటే కోపించకుండా ఉంటాడా! కాని రాముడు కోపం తెచ్చుకోలేదు. అదే ధర్మం అంటాడు. నేను అధర్మంగా ప్రవర్తించినా రాముడు ధర్మంగా ప్రవర్తించాడు. కాని నాకు అవసాన దశ సమీపించింది. ఈ ఆఖరి ఘడియలలో రాముడు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. కౌసల్యా! అటు చూడు.యమదూతలు నాకోసరం వస్తున్నారు. శాప వశాత్తు నాకు నా మరణ కాలంలో నా రాముడు దూరం అయ్యాడు.

కౌసల్యా! నా ప్రాణాలు యమభటులు తీసుకుపోనవసరం లేదు. రాముడు నాకు దూరం కావడమే నా పుత్రశోకమే నాప్రాణాలు తీసేస్తుంది. రాముడు పద్నాలుగు సంవత్సరాల తరువాత అయోధ్యకు వచ్చినపుడు చూచే అదృష్టం నాకు లేదు. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. కేవలము దేవతలే ఆ దృశ్యము చూడగలరు. నా వంటిపాపాత్ముడికి ఆ అర్హత లేదు.

కౌసల్యా! ఒక్కొక్కటిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి. నా ఆయువు క్షీణించి పోతూ ఉంది. ఈ ఆఖరు క్షణాలలో కూడా రాముని స్మరణ నన్ను వదలడం లేదు. రామా! రామా! ఎక్కడున్నావయ్యా! ఏం చేస్తున్నావయ్యా! ఒక్కసారి నా కళ్లకు కనపడవయ్యా! కౌసల్యా! నేను మరణిస్తున్నాను.

ఓ కైకా! నీ ఉసురు కొట్టి నేను చచ్చిపోతున్నాను. నీవు ఆనందంగా ఉండు. నా కులాన్ని నాశనం చేసావు. నన్ను మరణానికి గురిచేసావు. నీవు కోరుకున్నట్టు నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతున్నాను.” అంటూ పలవరిస్తున్నాడు దశరథుడు. అలా పలవరిస్తూనే దశరథుడు ప్రాణాలు వదిలాడు. దశరథుడు తాను పొందిన ముని శాపము గురించి చెబుతూ ఉండగానే కౌసల్య శోకభారంతో నిద్రలోకి జారుకుంది. అంతకు ముందే సుమిత్రకూడా నిద్రపోయింది. అందుకని వారికి నిద్రలోనే పలవరిస్తూ దశరథుడు ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. కౌసల్య అంత:పురములో నిశ్శబ్దము ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువదినాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచషష్ఠితమః సర్గః (65) >>

Ayodhya Kanda Sarga 44 In Telugu – అయోధ్యాకాండ చతుశ్చత్వారింశః సర్గః

Ayodhya Kanda Sarga 44 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ చతుశ్చత్వారింశః సర్గ, “సుమిత్రాశ్వాసనమ్”, రామాయణంలోని ఒక హృద్యమైన భాగం. ఈ సర్గలో, సుమిత్రా దేవి తన కుమారుడు లక్ష్మణుడు రాముడితో వనవాసానికి వెళ్లిన సందర్భంలో కౌసల్యా దేవిని ఆత్మీయంగా స్వాంతన పలుకుతుంది. సుమిత్రా తన కుమారుని ధైర్యాన్ని, విధి పట్ల అతని నిబద్ధతను, మరియు రాముడికి తోడుగా ఉండే లక్ష్మణుని త్యాగాన్ని ప్రశంసిస్తుంది. సుమిత్రా మాట్లాడే మాటలు, ఆమె ధైర్యం, మరియు కుటుంబ బాంధవ్యాల పరిరక్షణ పట్ల ఆమె శ్రద్ధ ఈ సర్గలో స్పష్టంగా కనపడతాయి. ఈ సర్గ సుమిత్రా దేవి యొక్క మానసిక బలం, ఆమె పాండిత్యం, మరియు కుటుంబ ప్రీతిని ప్రతిబింబిస్తుంది.

సుమిత్రాశ్వాసనమ్

విలపంతీం తథా తాం తు కౌసల్యాం ప్రమదోత్తమామ్ |
ఇదం ధర్మే స్థితా ధర్మ్యం సుమిత్రా వాక్యమబ్రవీత్ ||

1

తవార్యే సద్గుణైర్యుక్తః స పుత్రః పురుషోత్తమః |
కిం తే విలపితేనైవం కృపణం రుదితేన వా ||

2

యస్తవార్యే గతః పుత్రస్త్యక్త్వా రాజ్యం మహాబలః |
సాధు కుర్వన్మహాత్మానం పితరం సత్యవాదినామ్ ||

3

శిష్టైరాచరితే సమ్యక్ఛశ్వత్ప్రేత్య ఫలోదయే |
రామో ధర్మే స్థితః శ్రేష్ఠో న స శోచ్యః కదాచన ||

4

వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణోఽస్మిన్సదాఽనఘః |
దయావాన్సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః ||

5

అరణ్యవాసే యద్దుఃఖం జానతీ వై సుఖోచితా |
అనుగచ్ఛతి వైదేహీ ధర్మాత్మానం తవాత్మజమ్ ||

6

కీర్తిభూతాం పతాకాం యో లోకే భ్రామయతి ప్రభుః |
దర్మసత్యవ్రతధనః కిం న ప్రాప్తస్తవాత్మజః ||

7

వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమమ్ |
న గాత్రమంశుభిః సూర్యః సంతాపయితుమర్హతి ||

8

శివః సర్వేషు కాలేషు కాననేభ్యో వినిస్సృతః |
రాఘవం యుక్తశీతోష్ణః సేవిష్యతి సుఖోఽనిలః ||

9

శయానమనఘం రాత్రౌ పితేవాభిపరిష్వజన్ |
రశ్మిభిః సంస్పృశన్శీతైః చంద్రమాహ్లాదయిష్యతి ||

10

దదౌ చాస్త్రాణి దివ్యాని యస్మై బ్రహ్మా మహౌజసే |
దానవేంద్రం హతం దృష్ట్వా తిమిధ్వజసుతం రణే ||

11

స శూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః |
అసంత్రస్తోప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి ||

12

యస్యేషుపదమాసాద్య వినాశం యాంతి శత్రవః |
కథం న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి ||

13

యా శ్రీః శౌర్యం చ రామస్య యా చ కళ్యాణసత్త్వతా |
నివృత్తారణ్యవాసః స క్షిప్రం రాజ్యమవాప్స్యతి ||

14

సూర్యస్యాపి భవేత్సూర్యో హ్యగ్నేరగ్నిః ప్రభోః ప్రభుః |
శ్రియః శ్రీశ్చ భవేదగ్ర్యా కీర్తిః కీర్త్యాః క్షమాక్షమా ||

15

దైవతం దైవతానాం చ భూతానాం భూతసత్తమః |
తస్య కే హ్యగుణా దేవి రాష్ట్రే వాఽప్యథవా పురే ||

16

పృథివ్యా సహ వైదేహ్యా శ్రియా చ పురుషర్షభః |
క్షిప్రం తిసృభిరేతాభిః సహ రామోఽభిషేక్ష్యతే ||

17

దుఃఖజం విసృజంత్యాస్రం నిష్క్రామంతముదీక్ష్య యమ్ |
అయోధ్యాయాం జనాః సర్వే శోకవేగసమాహతాః ||

18

కుశచీరధరం దేవం గచ్ఛంతమపరాజితమ్ |
సీతేవానుగతా లక్ష్మీస్తస్య కింనామ దుర్లభమ్ ||

19

ధనుర్గ్రహవరో యస్య బాణఖడ్గాస్త్రభృత్స్వయమ్ |
లక్ష్మణో వ్రజతి హ్యగ్రే తస్య కింనామ దుర్లభమ్ ||

20

నివృత్తవనవాసం తం ద్రష్టాసి పునరాగతమ్ |
జహి శోకం చ మోహం చ దేవి సత్యం బ్రవీమి తే ||

21

శిరసా చరణావేతౌ వందమానమనిందితే |
పునర్ద్రక్ష్యసి కళ్యాణి పుత్రం చంద్రమివోదితమ్ ||

22

పునః ప్రవిష్టం దృష్ట్వా తమభిషిక్తం మహాశ్రియమ్ |
సముత్స్రక్ష్యసి నేత్రాభ్యాం క్షిప్రమానందజం పయః ||

23

మా శోకో దేవి దుఃఖం వా న రామే దృశ్యతేఽశివమ్ |
క్షిప్రం ద్రక్ష్యసి పుత్రం త్వం ససీతం సహలక్ష్మణమ్ ||

24

త్వయాఽశేషో జనశ్చైవ సమాశ్వాస్యో యదాఽనఘే |
కిమిదానీమిమం దేవి కరోషి హృది విక్లబమ్ ||

25

నార్హా త్వం శోచితుం దేవి యస్యాస్తే రాఘవః సుతః |
న హి రామాత్పరో లోకే విద్యతే సత్పథే స్థితః ||

26

అభివాదయమానం తం దృష్ట్వా ససుహృదం సుతమ్ |
ముదాఽశ్రు మోక్ష్యసే క్షిప్రం మేఘలేఖేవ వార్షికీ ||

27

పుత్రస్తే వరదః క్షిప్రమయోధ్యాం పునరాగతః |
పాణిభ్యాం మృదుపీనాభ్యాం చరణౌ పీడయిష్యతి ||

28

అభివాద్య నమస్యంతం శూరం ససుహృదం సుతమ్ |
ముదాఽస్త్రైః ప్రోక్ష్యసి పునర్మేఘరాజిరివాచలమ్ ||

29

ఆశ్వాసయంతీ వివిధైశ్చ వాక్యైః
వాక్యోపచారే కుశలాఽనవద్యా |
రామస్య తాం మాతరమేవముక్త్వా
దేవీ సుమిత్రా విరరామ రామా ||

30

నిశమ్య తల్లక్ష్మణ మాతృవాక్యమ్
రామస్య మాతుర్నరదేవపత్న్యాః |
సద్యః శరీరే విననాశ శోకః
శరద్గతః మేఘ ఇవాల్పతోయః ||

31

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశః సర్గః ||

Ayodhya Kanda Sarga 44 Meaning In Telugu

కౌసల్య తన కుమారుడు రాముని తలచుకొని విలపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర ఆమెను ఓదారుస్తూ ఉంది. ఆ మాటకొస్తే సుమిత్రకుమారుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్లాడు. కాని సుమిత్ర ఎంతో గుండె నిబ్బరంతో కౌసల్యను ఊరడించింది.

“అక్కా! కౌసల్యా! రాముడి గురించి ఏడవడం ఎందుకు? రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ఎక్కడ ఉన్నా రాణించగలడు. రాముని కోసం విలపించడం తగదు. రాముడు కేవలము తన తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్లాడు. అది ఉత్తములు అనుసరించే మార్గము కదా. రాముడు ధర్మం నిలబెట్టాడు. ఇహ పరాలను సాధించాడు. రాముని కోసం విలపించడం వృధా!

అంతెందుకు రాముని వెంట నా కుమారుడు కూడా వెళ్లాడు. రామునికి సేవచేస్తూ కాపాడుతూఉంటాడు. రాముని గురించి భయం ఎందుకు. పైగా సీత. సుకుమారి. ఎండకన్నెరుగనిది. సుఖములు తప్ప దు:ఖము అంటే ఏమిటో తెలియనిది. అటువంటి సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది కదా. రాముడు ధర్మమును సత్యమును నమ్ముకున్నాడు. రాముని కీర్తి ప్రతిష్టలు ముల్లోకములలోనూ వ్యాపిస్తుంది. దీనికి సంతోషించాలి గానీ దుఃఖిస్తావెందుకు.

సూర్యుడు తన కిరణములతో రాముని శోషింపచేయడు. గాలి మెల్లగా వీస్తూ నీ కుమారునికి హాయి చేకూరుస్తుంది. రాత్రివేళలలో చంద్రుడు తనకిరణములతో రామునికి ఆహ్లాదము కలిగిస్తాడు. పైగా రామునికి ఎంతో దివ్య అస్త్ర సంపద ఉంది. కాబట్టి రామునికి శత్రు భయము లేదు. రాముడు అడవిలో ఉన్నా అంత:పురములో ఉన్నట్టే భావించు. పైగా రాముడు ధైర్యానికి శౌర్యానికి పెట్టింది పేరు. ఇంక రామునికి తిరుగేముంది. రాముడు ఇట్టే వనవాసమును ముగించుకొని రాగలడు.

ఓ కౌసల్యా! ఇంకా రాముడు సూర్యునికి సూర్యుని వంటి వాడు. అలాగే అగ్నికి అగ్ని, సంపదకు సంపద, కీర్తికి కీర్తి, ఓర్పుకు ఓర్పు, దేవతలకు దేవత, భూతములకు భూతము కాగల సమర్థత కలవాడు. (సాధారణంగా మానవులను కుంగదీసేది,దౌర్బల్యాన్ని కలుగజేసేది భయం. కాని రాముడు, అటువంటి భయానికే భయం పుట్టించే వాడు అని అర్ధము). అటువంటి రామునికి అడవీ అంతఃపురమూ ఒకటే కదా!

నువ్వు చూస్తూ ఉండు. 14 సంవత్సరాలు క్షణంలో గడిచిపోతాయి. రాముడు తన పక్కన సీతను కూర్చోబెట్టుకొని, రాజ్యలక్ష్మిని వరిస్తాడు. రాముడికి శక్యంకానిది పొందలేనిది ఈలోకంలో ఏదీలేదు. అన్నీ రామునికి పాదాక్రాంతమవుతాయి. అంతే కాకుండా ధనుర్బాణములు ధరించి లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా రామునికి అసాధ్యముఅనేది ఏముంటుంది చెప్పు.

ఓ కౌసల్యా! నేనుసత్యము చెబుతున్నాను. రాముడు తిరిగి అయోధ్యలో అడుగు పెట్టిననాడు నువ్వు ఎదురేగి రామునికి హారతులు ఇచ్చి నీ వెంట తీసుకొని వస్తావు. అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడు తన స్నేహితులతో నీ దగ్గరకు వచ్చి నీకు నీ నమస్కరించిననాడు, నీవు ఆనందపడేరోజు…. రాముడు వచ్చి నీ పాదములను పట్టుకొని ఆశీర్వదించమని అడిగే రోజు… ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

అయినా నువ్వు మా అందరికీ పెద్దదానివి. నువ్వు మా అందరినీ ఓదార్చాల్సింది పోయి, నువ్వే ఇలా బాధ పడితే మా గతి ఏమిటి. రాముని వంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుని కన్నందుకు నీవు జీవితాంతము సంతోషించాలి కానీ, కేవలం పదునాలుగేళ్లు వనవాసమునకే ఇంత దు:ఖించాలా! రాముని జీవిత కాలములో ఇది ఎంత. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు.” అని సుమిత్ర కౌసల్యను ఓదార్చింది.

సుమిత్ర ఆదరంతో చెప్పిన మాటలు విన్న కౌసల్య తన శోకమును మెల్ల మెల్లగా విడిచిపెట్టింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ పంచచత్వారింశః సర్గః (45) >>

Balakanda Sarga 57 In Telugu – బాలకాండ సప్తపంచాశః సర్గః

Balakanda Sarga 57 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని సప్తపంచాశః సర్గలో, త్రిశంకు పురాణం రాముడికి వివరించబడింది, ఇది విశ్వామిత్రుని పురాణంలో భాగమైంది. బ్రహ్మ విశ్వామిత్రుడిని బ్రాహ్మణ-సన్యాసిగా కాకుండా, రాజుగా-సన్యాసిగా ఉండమని ఆశీర్వదించినప్పుడు, విశ్వామిత్రుడు దేశంలోని దక్షిణ ప్రాంతాలలో తన ఆశ్రయాన్ని కొనసాగిస్తాడు. ఈలోగా, త్రిశంకు అనే రాజు మర్త్య శరీరంతో స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నాడు మరియు ఆ సూచనను తిరస్కరించిన వశిష్టుడిని సంప్రదించాడు. అప్పుడు ఆ రాజు అదే ఆలోచనతో అదే వశిష్ఠుని కుమారులను సంప్రదిస్తాడు.

త్రిశంకుయాజనప్రార్థనా

తతః సంతప్తహృదయః స్మరన్నిగ్రహమాత్మనః |
వినిఃశ్వస్య వినిఃశ్వస్య కృతవైరో మహాత్మనా ||

1

స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ |
తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః ||

2

అథాస్య జజ్ఞిరే పుత్రాః సత్యధర్మపరాయణాః |
హవిఃష్యందో మధుష్యందో దృఢనేత్రో మహారథః ||

3

పూర్ణే వర్షసహస్రే తు బ్రహ్మా లోకపితామహః |
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ ||

4

జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజ |
అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే ||

5

ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవతైః |
త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః ||

6

విశ్వామిత్రోఽపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాఙ్ముఖః |
దుఃఖేన మహతాఽఽవిష్టః సమన్యురిదమబ్రవీత్ ||

7

తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః |
దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలమ్ ||

8

ఇతి నిశ్చిత్య మనసా భూయైవ మహాతపాః |
తపశ్చచార కాకుత్స్థ పరమం పరమాత్మవాన్ ||

9

ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియః |
త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః ||

10

తస్య బుద్ధిః సముత్పన్నా యజేయమితి రాఘవ |
గచ్ఛేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిమ్ ||

11

స వసిష్ఠం సమాహూయ కథయామాస చింతితమ్ |
అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా ||

12

ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన స యయౌ దక్షిణాం దిశమ్ |
తతస్తత్కర్మసిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః ||

13

వాసిష్ఠా దీర్ఘతపసస్తపో యత్ర హి తేపిరే |
త్రిశంకుః సుమహాతేజాః శతం పరమభాస్వరమ్ ||

14

వసిష్ఠపుత్రాన్దదృశే తప్యమానాన్యశస్వినః |
సోఽభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్ ||

15

అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కించిదవాఙ్ముఖః |
అబ్రవీత్సుమహాభాగాన్సర్వానేవ కృతాంజలిః ||

16

శరణం వః ప్రపద్యేఽహం శరణ్యాన్ శరణాగతః |
ప్రత్యాఖ్యాతోఽస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా ||

17

యష్టుకామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హథ |
గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదయే ||

18

శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాంస్తపసి స్థితాన్ |
తే మాం భవంతః సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః ||

19

సశరీరో యథాహం వై దేవలోకమవాప్నుయామ్ |
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః ||

20

గురుపుత్రానృతే సర్వాన్నాహం పశ్యామి కాంచన |
ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమా గతిః ||

21

పురోధసస్తు విద్వాంసస్తారయంతి సదా నృపాన్ |
తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ ||

22

Balakanda Sarga 57 In Telugu Pdf With Meaning

“ఓ రామా! వసిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత, ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ, ఘోరమైన తపస్సుచేసాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, ధృడనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు. అప్పటికి వేయి సంవత్సరములు గడిచాయి.

విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ విశ్వామిత్రా! నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేసావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు.” అని పలికాడు.

తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంత కాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా. నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు. బ్రహ్మర్షి అని పిలువబడేవరకు తపస్సు చేస్తాను. అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు.

ఆవిధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజుఉండేవాడు. అతనికి ఈ శరీరంతోపాటు స్వర్గానికి వెళ్లాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వసిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు.

త్రిశంకు వసిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వసిష్ఠుడు ఆ పని తన వల్లకాదు అని చెప్పాడు.

“నీ వల్ల కాక పోతే నీ కుమారులతో చేయిస్తాను” అని పలికి త్రిశంకుడు వసిష్ఠుని కుమారుల వద్దకు వెళ్లాడు. వసిష్ఠుని నూర్గురు కుమారులు తమతమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్లాడు త్రిశంకు. వాళ్లముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు.

“ఓ ముని కుమారులారా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు వసిష్ఠులవారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందు వలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞచేయించుటకు మీరే సమర్థులు.

వసిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నపుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవసమానులు కదా!. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి” అని వేడుకున్నాడు త్రిశంకు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ అష్టపంచాశః సర్గః (58) >>

Balakanda Sarga 68 In Telugu – బాలకాండ అష్టషష్టితమః సర్గః

Balakanda Sarga 68 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టషష్టితమః సర్గలో, రాముడు, లక్ష్మణుడు విష్వామిత్రుడితో కలిసి మిథిలానగరికి చేరుకుంటారు. అక్కడ వారు సీతాస్వయంవరానికి హాజరవుతారు. సీతను పొందాలనుకునే అనేక రాజులు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ ఆ ధనుస్సును ఎత్తలేరు. చివరికి, రాముడు ఆ ధనుస్సును ఎత్తి, దానిని విరజేస్తాడు.

|| దశరథాహ్వానమ్ ||

జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాంతవాహనాః |
త్రిరాత్రముషితా మార్గే తేఽయోధ్యాం ప్రావిశన్పురీమ్ ||

1

రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్ |
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ ||

2

ఇత్యుక్తా ద్వారపాలస్తే రాఘవాయ న్యవేదయన్ |
తే రాజవచనాద్దూతా రాజవేశ్మ ప్రవేశితాః ||

3

దదృశుర్దేవసంకాశం వృద్ధం దశరథం నృపమ్ |
బద్ధాంజలిపుటాః సర్వే దూతా విగతసాధ్వసాః ||

4

రాజానం ప్రణతా వాక్యమబ్రువన్మధురాక్షరమ్ |
మైథిలో జనకో రాజా సాగ్నిహోత్రపురస్కృతమ్ ||

5

కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయపురోహితమ్ |
ముహుర్ముహుర్మధురయా స్నేహసంయుక్తయా గిరా ||

6

జనకస్త్వాం మహారాజాఽఽపృచ్ఛతే సపురఃసరమ్ |
పృష్ట్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాధిపః ||

7

కౌశికానుమతో వాక్యం భవంతమిదమబ్రవీత్ |
పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా ||

8

రాజానశ్చ కృతామర్షా నిర్వీర్యా విముఖీకృతాః |
సేయం మమ సుతా రాజన్విశ్వామిత్రపురఃసరైః ||

9

యదృచ్ఛయాఽఽగతైర్వీరైర్నిర్జితా తవ పుత్రకైః |
తచ్చ రాజన్ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా ||

10

రామేణ హి మహారాజ మహత్యాం జనసంసది |
అస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే ||

11

ప్రతిజ్ఞాం తర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతుమర్హసి |
సోపాధ్యాయో మహారాజ పురోహితపురఃసరః ||

12

శీఘ్రమాగచ్ఛ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ |
ప్రీతిం చ మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి ||

13

పుత్రయోరుభయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే |
ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్ ||

14

విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః శతానందమతే స్థితః |
ఇత్యుక్త్వా విరతా దూతా రాజగౌరవశంకితాః ||

15

దూతవాక్యం తు తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షితః |
వసిష్ఠం వామదేవం చ మంత్రిణోన్యాంశ్చ సోఽబ్రవీత్ ||

16

గుప్తః కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధనః |
లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ ||

17

దృష్టవీర్యస్తు కాకుత్స్థో జనకేన మహాత్మనా |
సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్ఛతి ||

18

యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః |
పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః ||

19

మంత్రిణో బాఢమిత్యాహుః సహ సర్వైర్మహర్షిభిః |
సుప్రీతశ్చాబ్రవీద్రాజా శ్వో యాత్రేతి స మంత్రిణః ||

20

మంత్రిణస్తు నరేంద్రేణ రాత్రిం పరమసత్కృతాః |
ఊషుః ప్రముదితాః సర్వే గుణైః సర్వైః సమన్వితాః ||

21

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టషష్టితమః సర్గః ||

Balakanda Sarga 68 Meaning In Telugu

జనకమహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి మూడుదినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వార పాలకులకు “మిథిలా నగరము నుండి జనకమహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి.” అని వర్తమానము పంపారు.

ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథమహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.

“దశరథ మహారాజా! తమరికి జయము కలుగు గాక! మేము మిథిలాధి పతి అయిన జనకమహారాజు వద్దనుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరియొక్క, తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగ క్షేమ సమాచారములు విచారించు చున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు, వారి మాటలుగా చెప్పమన్నారు.

“నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కాని నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను, విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు, రాముడు, తన వీరత్వముతో గెల్చుకున్నాడు. తర తరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమమును చాటాడు.

వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము తమరి కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథిలకు విచ్చేయవలసినదిగా కోరుచున్నాను. తమరుమిథిలకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవమును జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.” అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది, తమ పురోహితులు శతానందులవారి అనుమతి పొంది తమరితో పైవిధముగా చెప్పమన్నారు.” అని ఆ దూతలు జనక మహారాజు సందేశమును దశరథునికి సవినయంగా మనవిచేసారు.

తన కుమారునికి వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వసిష్ఠుని, పురోహితులను పిలిపించాడు.

వారితో ‘ ఇలా అన్నాడు. “రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహ పురములో ఉన్నాడని వర్తమానము వచ్చింది. మన రాముని బల పరాక్రమములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికి ఇచ్చి వివాహము చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరకూ ఇష్టం అయితే. జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే, మనము విదేహ పురమునకు బయలుదేరి వెళుదాము.” అని అన్నాడు.

దశరథుని ఆస్థానములో ఉన్న పురోహితులు, ఋషులు తమలో తాము తర్కించుకొని అందరూ ఏక కంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. “రేపే ప్రయాణము” అని నిర్ణయించాడు.

జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథమహారాజు అతిధులుగా అయోధ్యలో ఉన్నారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకోనసప్తతితమః సర్గః (69) >>

Balakanda Sarga 55 In Telugu – బాలకాండ పంచపంచాశః సర్గః

Balakanda Sarga 55 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు పరమశివుని దయతో క్షిపణులను పొందడం ద్వారా వశిష్ట ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తాడు. విష్-మిల్కర్ పవిత్ర ఆవు, కామధేనుడు సృష్టించిన దళాలు విశ్వామిత్రుని సైన్యాన్ని మరియు అతని వంద మంది కుమారులను అంతమొందించినప్పుడు, అతను ఆగ్రహం చెందాడు మరియు అసాధారణమైన క్షిపణులను ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు. వాటిని పొందిన తరువాత, అతను మళ్ళీ వశిష్ట మహర్షి ఆశ్రమానికి వచ్చి దానిని పూర్తిగా నాశనం చేస్తాడు. అప్పుడు విపరీతమైన కోపంతో వశిష్ట మహర్షి విశ్వామిత్రుడిని ఎదుర్కోవడానికి తన బ్రహ్మ లాఠీని ఆశ్రయిస్తాడు.

విశ్వామిత్రధనుర్వేదాధిగమః

తతస్తానాకులాన్దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ |
వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజ యోగతః ||

1

తస్యా హుంభారవాజ్జాతాః కాంభోజా రవిసన్నిభాః |
ఊధసస్త్వథ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః ||

2

యోనిదేశాచ్చ యవనాః శకృద్దేశాచ్ఛకాస్తథా |
రోమకూపేషు చ మ్లేచ్ఛా హారీతాః సకిరాతకాః ||

3

తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్ క్షణాత్ |
సపదాతిగజం సాశ్వం సరథం రఘునందన ||

4

దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా |
విశ్వామిత్రసుతానాం తు శతం నానావిధాయుధమ్ ||

5

అభ్యధావత్సుసంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరమ్ |
హుంకారేణైవ తాన్సర్వాన్దదాహ భగవానృషిః ||

6

తే సాశ్వరథపాదాతా వసిష్ఠేన మహాత్మనా |
భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా ||

7

దృష్ట్వా వినాశితాన్పుత్రాన్బలం చ సుమహాయశాః |
సవ్రీడశ్చింతయావిష్టో విశ్వామిత్రోఽభవత్తదా ||

8

సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః |
ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః ||

9

హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ద్విజః |
హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత ||

10

స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ |
పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత ||

11

స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితమ్ |
మహాదేవప్రసాదార్థం తపస్తేపే మహాతపాః ||

12

కేనచిత్త్వథ కాలేన దేవేశో వృషభధ్వజః |
దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలమ్ ||

13

కిమర్థం తప్యసే రాజన్బ్రూహి యత్తే వివక్షితమ్ |
వరదోఽస్మి వరో యస్తే కాంక్షితః సోఽభిధీయతామ్ ||

14

ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః |
ప్రణిపత్య మహాదేవమిదం వచనమబ్రవీత్ ||

15

యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ |
సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతామ్ ||

16

యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు |
గంధర్వయక్షరక్షఃసు ప్రతిభాంతు మమానఘ ||

17

తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితమ్ |
ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా ||

18

ప్రాప్య చాస్త్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః | [దేవేశాత్]
దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణోఽభవత్తదా ||

19

వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి |
హతమేవ తదా మేనే వసిష్ఠమృషిసత్తమమ్ ||

20

తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః |
యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా ||

21

ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః |
దృష్ట్వా విప్రద్రుతా భీతా మునయః శతశో దిశః ||

22

వసిష్ఠస్య చ యే శిష్యాస్తథైవ మృగపక్షిణః |
విద్రవంతి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః ||

23

వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః |
ముహూర్తమివ నిఃశబ్దమాసీదీరిణసన్నిభమ్ ||

24

వదతో వై వసిష్ఠస్య మా భైరితి ముహుర్ముహుః |
నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః ||

25

ఏవముక్త్వా మహాతేజా వసిష్ఠో జపతాం వరః |
విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమబ్రవీత్ ||

26

ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి |
దురాచారోసి యన్మూఢ తస్మాత్త్వం న భవిష్యసి ||

27

ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దండముద్యమ్య సత్వరః |
విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరమ్ ||

28

Balakanda Sarga 55 In Telugu Pdf With Meaning

కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామితుని పరాక్రమమునకు చెల్లా చెదరు కావడం చూచాడు వసిష్ఠుడు.

“ఓ కామధేనువా! ఇంకా సేనలను సృష్టించు.” అని ఆదేశిం చాడు వసిష్ఠుడు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోనినుండి యవనులు, గోమయమునుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసారు.

తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూర్గురు కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వసిష్ఠుని మీదికి దుమికారు. వసిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు, సైన్యము నాశనం కావడం కళ్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలా సేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయూయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షిమాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉ న్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేసాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు.

విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ రాజా! నీవు ఎందుకు ఇంతఘోర తపస్సు చేస్తున్నావు. నీకు ఏమి కావాలి. కోరుకో!” అని అడిగాడు.

“ఓ మహాదేవా! తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును, అందలి రహస్యములను, సాంగోపాంగముగా ఉ పదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉ పదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి” అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుని కోరికకు నవ్వి “నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను.” అని వరం ఇచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్థానము అయ్యాడు.

విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్లాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేసాడు. అహం కారంతో అట్టహాసం చేసాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్నిచనిపోగా మరి కొన్నిపారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి.

“భయపడకండి. నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను. మిమ్ములను రక్షిస్తాను.” అని వసిష్ఠుడు అరుస్తున్నాడు. కాని ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వసిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది.

విశ్వామిత్రుడు చేసిన మారణ కాండ చూచి వసిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్రా! నేనుఎంతో కాలంగా పెంచి పోషించిన జీవ జాలమును, వృద్ధిచేసిన ఆశ్రమమును క్షణ కాలంలో నాశనం చేసావు. నీకు భవిష్యత్తులేదు. నిన్ను నాశనం చేస్తాను.” అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ తత్సత్ తత్సత్.

బాలకాండ షట్పంచాశః సర్గః (56) >>

Balakanda Sarga 66 In Telugu – బాలకాండ షట్షష్టితమః సర్గః

Balakanda Sarga 66 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్షష్టితమః సర్గలో, విష్వామిత్రుడు రాక్షసుల నుంచి యజ్ఞాన్ని రక్షించేందుకు రాముడిని తనతో పంపమని దశరథునిని కోరుతాడు. తొలుత దశరథుడు భావోద్వేగంతో అంగీకరించకపోయినప్పటికీ, విష్వామిత్రుడి వాదనలతో పాటు గురువుల సలహా తీసుకొని, రాముడిని విష్వామిత్రుడితో పంపడానికి ఒప్పుకుంటాడు.

|| ధనుఃప్రసంగః ||

తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః |
విశ్వామిత్రం మహాత్మానమాజుహావ సరాఘవమ్ ||

1

తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేన కర్మణా |
రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచ హ ||

2

భగవన్ స్వాగతం తేఽస్తు కిం కరోమి తవానఘ |
భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతా హ్యహమ్ ||

3

ఏవముక్తః స ధర్మాత్మా జనకేన మహాత్మనా |
ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః ||

4

పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ |
ద్రష్టుకామౌ ధనుఃశ్రేష్ఠం యదేతత్త్వయి తిష్ఠతి ||

5

ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ |
దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః ||

6

ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్ |
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి ||

7

దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షష్ఠో మహీపతిః |
న్యాసోఽయం తస్య భగవన్హస్తే దత్తో మహాత్మనా ||

8

దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్ |
రుద్రస్తు త్రిదశాన్రోషాత్సలీలమిదమబ్రవీత్ ||

9

యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః |
వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వః ||

10

తతో విమనసః సర్వే దేవా వై మునిపుంగవ |
ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతోఽభవద్భవః ||

11

ప్రీతియుక్తః స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్ |
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః ||

12

న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వకే విభో |
అథ మే కృషతః క్షేత్రం లాంగలాదుత్థితా తతః ||

13 [మయా]

క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుతా |
భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా ||

14

వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా |
భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్ ||

15

వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ |
తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్ ||

16

వీర్యశుల్కేతి భగవన్న దదామి సుతామహమ్ |
తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ ||

17

మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా |
తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్ ||

18

న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేఽపి వా |
తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే ||

19

ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన |
తతః పరమకోపేన రాజానో మునిపుంగవ ||

20

న్యరుంధన్మిథిలాం సర్వే వీర్యసందేహమాగతాః |
ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః ||

21

రోషేణ మహతాఽఽవిష్టాః పీడయన్మిథిలాం పురీమ్ |
తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః ||

22

సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః |
తతో దేవగణాన్సర్వాన్ స్తపసాహం ప్రసాదయమ్ ||

23

దదుశ్చ పరమప్రీతాశ్చతురంగబలం సురాః |
తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః ||

24

అవీర్యా వీర్యసందిగ్ధాః సామాత్యాః పాపకారిణః |
తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్ ||

25

రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత |
యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే |
సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్షష్ఠితమః సర్గః ||

Balakanda Sarga 66 Meaning In Telugu

మరునాడు ఉదయం జనకమహారాజు కాలకృత్యములను తీర్చుకొనని విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుని, రామ లక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకొని వచ్చాడు. విశ్వామిత్రునికి పూజలు చేసాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! రామలక్ష్మణులారా! మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి. తక్షణమే నెరవేరుస్తాను.” అని పలికాడు జనకుడు.

“ఓ జనకమహారాజా! నీ వినయవిధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథి “మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు. వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్లిపోతారు.” అని అన్నాడు.

అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను. ఆ ధనుస్సు శివధనుస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయములో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఈశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనుస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి, పరమశివుడు ఆ ధనుస్సును నిమి చక్రవర్తి వంశంలో ఆరవ వాడైన దేవ రాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనుస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది.

తరువాత నేను ఒక సారి యజ్ఞము చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. అయోనిజ. (మానవ యోని నుండి జన్మించనిది).

సీతకు యుక్తవయసువచ్చినది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కాని సీతను వివాహమాడే వాడు అత్యంత పరాక్రమ వంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను “వీర్యశుల్క” గా ప్రకటించాను. (అనగా సీతను వివాహమాడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి).

సీతను వివాహ మాడటానికి మిథిలకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కు పెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసం కదల్చలేక పోయారు. అందుకని నేను ఎవరికీ సీతను ఇచ్చి వివాహము చేయలేదు.

ఓ మహర్షీ! నేను నా కుమార్తె సీతను వీర్య శుల్వగా ప్రకటించి, వారికి అలవి కాని పరీక్ష పెట్టి, సీతను ఇచ్చి వివాహము చేయలేదని, ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు యుద్ధానికి వచ్చారు. మిథిలను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను.

ఆ విధంగా ఒక సంవత్సరము గడిచింది. మిథిలానగరములో ఉన్న అత్యవసర వస్తువులు, ధాన్యములు తరిగిపోయాయి. ప్రజలు ఆహారము కోసరము అలమటిస్తున్నారు. అప్పుడు నేను తపస్సుచేసి దేవతలను ప్రార్థించాను. దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యమును సమకూర్చారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. దేవతా సైన్యము ధాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు, పారిపోయారు.

ఓ విశ్వామిత్ర మహర్షీ! ఇదీ ఈ ధనుస్సు వృత్తాంతము. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే అన్న మాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహము జరిపిస్తాను.” అని అన్నాడు జనకుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ సప్తషష్టితమః సర్గః (67) >>

Ayodhya Kanda Sarga 63 In Telugu – అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 63

అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గంలో, దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర, మరియు కైకేయిలతో కలసి రాముడి వనం పంపిన పశ్చాత్తాపంతో బాధపడుతాడు. దశరథుడు రాత్రింబవళ్లు రాముడి గురించే ఆలోచిస్తూ అనుతాపంలో మునిగి తానెవరి మాటలు వినకుండా ఉంటాడు. రాత్రి ఒకప్పుడు, అతను తన గత జీవితంలో చేసిన పాపం గురించి స్మరించుకుంటాడు, అందులో శ్రవణ కుమారుడు అనే అంధురాళ్ల కుమారుడిని పొరపాటున వధించిన సంఘటన. ఈ బాధతో, దశరథుడు తన మరణం సమీపంలో ఉన్నాడు. ఈ సర్గ దశరథుడి పశ్చాత్తాపం, అతని కుమారుడి వియోగంలో నష్టభావాన్ని, మరియు కర్మ ఫలితాలను తెలియజేస్తుంది.

ఋషికుమారవధాఖ్యానమ్

ప్రతిబుద్ధో ముహుర్తేన శోకోపహత చేతనః |
అథ రాజా దశరథః సచింతామభ్యపద్యత || ౧ ||

రామ లక్ష్మణయోశ్చైవ వివాసాద్వాసవోపమమ్ |
ఆవివేశోపసర్గస్తం తమః సూర్యమివాసురమ్ || ౨ ||

సభార్యే నిర్గతే రామే కౌసల్యాం కోసలేశ్వరః |
వివక్షురసితాపాంగాం స్మృత్వా దుష్కృతమాత్మనః || ౩ ||

స రాజా రజనీం షష్ఠీం రామే ప్రవ్రాజితే వనమ్ |
అర్ధరాత్రే దశరథః సంస్మరన్ దుష్కృతం కృతమ్ || ౪ ||

స రాజా పుత్రశోకార్తః స్మృత్వా దుష్కృతమాత్మనః |
కౌసల్యాం పుత్ర శోకార్తామిదం వచనమబ్రవీత్ || ౫ ||

యదాచరతి కళ్యాణి శుభం వా యది వాఽశుభమ్ |
తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః || ౬ ||

గురు లాఘవమర్థానామారంభే కర్మణాం ఫలమ్ |
దోషం వా యో న జానాతి స బాలైతి హోచ్యతే || ౭ ||

కశ్చిదామ్రవణం ఛిత్త్వా పలాశాంశ్చ నిషించతి |
పుష్పం దృష్ట్వా ఫలే గృధ్నుః స శోచతి ఫలాగమే || ౮ ||

అవిజ్ఞాయ ఫలం యో హి కర్మ త్వేవానుధావతి |
స శోచేత్ఫలవేలాయాం యథా కింశుకసేచకః || ౯ ||

సోఽహమామ్రవణం ఛిత్త్వా పలాశాంశ్చ న్యషేచయమ్ |
రామం ఫలాగమే త్యక్త్వా పశ్చాచ్ఛోచామి దుర్మతిః || ౧౦ ||

లబ్ధశబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మతా |
కుమారః శబ్దవేధీతి మయా పాపమిదం కృతమ్ || ౧౧ ||

తదిదం మేఽనుసంప్రాప్తం దేవి దుఃఖం స్వయం కృతమ్ |
సమ్మోహాదిహ బాలేన యథా స్యాద్భక్షితం విషమ్ || ౧౨ ||

యథాఽన్యః పురుషః కశ్చిత్పలాశైర్మోహితో భవేత్ |
ఏవం మమాఽప్యవిజ్ఞాతం శబ్ద వేధ్యమయం ఫలమ్ || ౧౩ ||

దేవ్యనూఢా త్వమభవో యువరాజో భవామ్యహమ్ |
తతః ప్రావృడనుప్రాప్తా మదకామవివర్ధినీ || ౧౪ ||

ఉపాస్యహి రసాన్ భౌమాన్ తప్త్వా చ జగదంశుభిః |
పరేతాచరితాం భీమాం రవిరావిశతే దిశమ్ || ౧౫ ||

ఉష్ణమంతర్దధే సద్యః స్నిగ్ధా దదృశిరే ఘనాః |
తతః జహృషిరే సర్వే భేకసారంగబర్హిణః || ౧౬ ||

క్లిన్నపక్షోత్తరాః స్నాతాః కృచ్ఛ్రాదివ పతత్రిణః |
వృష్టివాతావధూతాగ్రాన్ పాదపానభిపేదిరే || ౧౭ ||

పతితేనాంభసాఽఽచ్ఛన్నః పతమానేన చాసకృత్ |
ఆబభౌ మత్తసారన్గస్తోయ రాశిరివాచలః || ౧౮ ||

పాండురారుణవర్ణాని స్రూతాంసి విమలాన్యపి |
సుస్రువుర్గిరిధాతుభ్యః సభస్మాని భుజంగవత్ || ౧౯ ||

తస్మిన్నతిసుఖే కాలే ధనుష్మానిషుమాన్ రథీ |
వ్యాయామకృతసంకల్పః సరయూమన్వగాం నదీమ్ || ౨౦ ||

నిపానే మహిషం రాత్రౌ గజం వాఽభ్యాగతం నదీమ్ |
అన్యం వా శ్వాపదం కంచిత్ జిఘాంసురజితేంద్రియః || ౨౧ ||

అథాంధకారే త్వశ్రౌషం జలే కుంభస్య పర్యతః |
అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్దతః || ౨౨ ||

తతోఽహం శరముద్ధృత్య దీప్తమాశీవిషోపమమ్ |
శబ్దం ప్రతి గజప్రేప్సురభిలక్ష్య త్వపాతయమ్ || ౨౩ ||

అముంచం నిశితం బాణమహమాశీవిషోపమమ్ |
తత్ర వాగుషసి వ్యక్తా ప్రాదురాసీద్వనౌకసః || ౨౪ ||

హాహేతి పతతస్తోయే బాణాభిహతమర్మణః |
తస్మిన్నిపతితే బాణే వాగభూత్తత్ర మానుషీ || ౨౫ ||

కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని |
ప్రవివిక్తాం నదీం రాత్రౌ ఉదాహారోఽహమాగతః |
ఇషుణాఽభిహతః కేన కస్య వా కిం కృతం మయా || ౨౬ ||

ఋషేర్హి న్యస్త దండస్య వనే వన్యేన జీవతః |
కథం ను శస్త్రేణ వధో మద్విధస్య విధీయతే || ౨౭ ||

జటాభారధరస్యైవ వల్కలాజినవాససః |
కో వధేన మమార్థీ స్యాత్ కిం వాఽస్యాపకృతం మయా || ౨౮ ||

ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్థసంహితమ్ |
న కశ్చిత్ సాధు మన్యేత యథైవ గురుతల్పగమ్ || ౨౯ ||

నహం తథాఽనుశోచామి జీవిత క్షయమాత్మనః |
మాతరం పితరం చోభౌ అనుశోచామి మద్విధే || ౩౦ ||

తదేతన్మిథునం వృద్ధం చిరకాలభృతం మయా |
మయి పంచత్వమాపన్నే కాం వృత్తిం వర్తయిష్యతి || ౩౧ ||

వృద్ధౌ చ మాతా పితరౌ అహం చైకేషుణా హతః |
కేన స్మ నిహతాః సర్వే సుబాలేనాకృతాత్మనా || ౩౨ ||

తాం గిరం కరుణాం శ్రుత్వా మమ ధర్మానుకాంక్షిణః |
కరాభ్యాం సశరం చాపం వ్యథితస్యాపతద్భువి || ౩౩ ||

తస్యాహం కరుణం శ్రుత్వా నిశి లాలపతో బహు |
సంభ్రాంతః శోకవేగేన భృశమాసం విచేతనః || ౩౪ ||

తం దేశమహమాగమ్య దీన సత్త్వః సుదుర్మనాః |
అపశ్యమిషుణా తీరే సరయ్వాస్తాపసం హతమ్ || ౩౫ ||

అవకీర్ణజటాభారం ప్రవిద్ధకలశోదకమ్ |
స మాముద్వీక్ష్య నేత్రాభ్యాం త్రస్తమస్వస్థచేతసమ్ || ౩౬ ||

ఇత్యువాచ తతః క్రూరం దిధక్షన్నివ తేజసా |
కిం తవాపకృతం రాజన్ వనే నివసతా మయా || ౩౭ ||

జిహీర్షురంభో గుర్వర్థం యదహం తాడితస్త్వయా |
ఏకేన ఖలు బాణేన మర్మణ్యభిహతే మయి || ౩౮ ||

ద్వావంధౌ నిహతౌ వృద్ధౌ మాతా జనయితా చ మే |
తౌ కథం దుర్బలావంధౌ మత్ప్రతీక్షౌ పిపాసితౌ || ౩౯ ||

చిరమాశాకృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యతః |
న నూనం తపసో వాఽస్తి ఫలయోగః శ్రుతస్య వా || ౪౦ ||

పితా యన్మాం న జానాతి శయానం పతితం భువి |
జానన్నపి చ కిం కుర్యాదశక్తిరపరిక్రమః || ౪౧ ||

భిద్యమానమివాశక్తస్త్రాతుమన్యో నగో నగమ్ |
పితుస్త్వమేవ మే గత్వా శీఘ్రమాచక్ష్వ రాఘవ || ౪౨ ||

న త్వామనుదహేత్ క్రుద్ధో వనం వహ్నిరివైధితః |
ఇయమేకపదీ రాజన్ యతః మే పితురాశ్రమః || ౪౩ ||

తం ప్రసాదయ గత్వా త్వం న త్వాం స కుపితః శపేత్ |
విశల్యం కురు మాం రాజన్ మర్మ మే నిశితః శరః || ౪౪ ||

రుణద్ధి మృదుసోత్సేధం తీరమంబు రయో యథా |
సశల్యః క్లిశ్యతే ప్రాణైర్విశల్యో వినశిష్యతి || ౪౫ ||

ఇతి మామవిశచ్చింతా తస్య శల్యాపకర్షణే |
దుఃఖితస్య చ దీనస్య మమ శోకాతురస్య చ || ౪౬ ||

లక్షయామాస హృదయే చింతాం మునిసుతస్తదా |
తామ్యమానః స మాం కృచ్ఛాదువాచ పరమార్తవత్ || ౪౭ ||

సీదమానో వివృత్తాంగో వేష్టమానో గతః క్షయమ్ |
సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్ || ౪౮ ||

బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్ |
న ద్విజాతిరహం రాజన్ మాభూత్తే మనసో వ్యథా || ౪౯ ||

శూద్రాయామస్మి వైశ్యేన జాతః జనపదాధిప |
ఇతీవ వదతః కృచ్ఛ్రాత్ బాణాభిహతమర్మణః || ౫౦ ||

విఘూర్ణతో విచేష్టస్య వేపమానస్య భూతలే |
తస్యత్వానమ్యమానస్య తం బాణమహముద్ధరమ్ || ౫౧ ||

జలార్ద్రగాత్రం తు విలప్య కృచ్ఛ్రాత్
మర్మవ్రణం సంతతముచ్ఛ్వసంతమ్ |
తతః సరయ్వాం తమహం శయానమ్
సమీక్ష్య భద్రేఽస్మి భృశం విషణ్ణః || ౫౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిషష్ఠితమః సర్గః || ౬౩ ||

Ayodhya Kanda Sarga 63 Meaning In Telugu

దశరథుడు కలతనిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్రపట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకు చెబితే తన దు:ఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు.

ఓ కౌసల్యా! మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే, ఒక పనిని మొదలు పెట్టే ముందు, తాను చేయబోయే పని మంచిదా, చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకొని తరువాత ఆ పని మొదలుపెట్టాలి. అలా చెయ్యని వాడు మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు అని పెద్దలు అంటారు.

మోదుగుపూలు పెద్దవిగా ఉంటాయి. కాని మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగ పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు, పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి, మోదుగ చెట్లను పెంచిన వాడు మూఢుడు కాక మరేమవుతాడు. ఎందుకూ పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు, పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానము. మామిడి చెట్టులాంటి రాముని అడవులకు పంపి, మోదుగ చెట్లను పెంచుతున్నాను. కాని ఈ పాపమునకు బలమైన కారణము ఉంది.

నేను మంచి యవ్వనములో ఉండగా నాకు శబ్దవేధి విద్యనేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న మృగము నైనా అది చేయు శబ్దమును విని దానిని గురితప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది. మహా పాపము చేయించింది.

ఓ కౌసల్యా! అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనములో ఉన్నాను. పైగా యువరాజును. కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూనది సమీపములోని అడవికి వేటకు వెళ్లాను. వేటాడి వేటాడి అలసి పోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడటం చాలా ఇష్టం. సరోవరములో నీటిని తాగుటకు వచ్చు జంతువులు నీరు తాగునపుడు చేయు గుడ గుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినోదించేవాడిని.

అదే ప్రకారము ఆ రాత్రికూడా నేను ఒక సరోవరము దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలెనని సంకల్పముతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపునపుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి, ఆ శబ్దము వచ్చు వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘీంకారమునకు బదులు “అయ్యో అమ్మా అమ్మా” అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది.

నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్లాను. అక్కడ ఒక ముని కుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది. “మేము ఈ అడవితో తపస్సుచేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగము చేసినాడో కదా! మేము ఎవరికీ అపకారము చేయలేదే! నీళ్లు తీసుకొని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాని నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికీ ఏ విధమైన అపకారమూ చెయ్యము.

అటువంటిమాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు. అంటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సివచ్చింది. అతడు ఎవరో కానీ ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేసాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారములేదు. కాని నా తల్లి తండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లి తండ్రులను వారి వృధ్యాప్యములో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్థాంతరంగా మరణిస్తే వారికి దిక్కు ఎవరు? ఆ మూర్ఖుడు ఎవరో గానీ నన్ను మాత్రమే చంపలేదు. నాతోపాటు నా తల్లితండ్రులను కూడా చంపాడు. ” అని పరి పరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు.

ఆ మాటలు విన్న మా మనసు వికలమైపోయింది. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ ముని కుమారుని దగ్గరగా వెళ్లాను. అతడు తెచ్చిన కుండా పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ ముని కుమారుడు కళ్లు పైకెత్తి నన్ను చూచాడు.

“ఓ రాజా! నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది. నేను నీకు ఏమి అపకారము చేసానని నన్ను బాణంతో కొట్టావు. నేను నా తల్లి తండ్రుల కొరకు నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చాను. అది అపరాధమా! నువ్వు నన్నే కాదు. నా తల్లి తండ్రులనుకూడా చంపావు. నా తల్లి తండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకొని వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా! ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షము ఏమీ చేయలేనట్టు, నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కాని, నా తండ్రి, నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను, దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకొని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహము తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదుగో ఆ కనపడే కాలి బాట వెంట వెళితే మా ఆశ్రమము వస్తుంది. నీవు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పు.

ఓ రాజా! నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధకలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు. నాకు సత్వరమే మరణం ప్రసాదించు.” అని ఆ ముని కుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణమును తీస్తే అతను వెంటనే మరణిస్తాడు. తియ్యకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ ముని కుమారుడు. కాని అప్పటికే ఆ ముని కుమారుడు బాధతో నేల మీదపడి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు.

“ఓ రాజా! నీవు బ్రహ్మ హత్య చేసానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు. నా తల్లి శూద్ర వనిత. కాబట్టి నీకు ఆభయం లేదు.” అని అంత బాధలో కూడా నా మనసుకు ఊరట కలిగించాడు. ఆ ముని కుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరము నుండి బాణమును లాగేసాను. ఆ ముని కుమారుడు నా వంకే చూస్తూ ప్రాణములు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతిచెందిన ఆ ముని కుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధకలిగింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చతుఃషష్ఠితమః సర్గః (64) >>

Balakanda Sarga 53 In Telugu – బాలకాండ త్రిపంచాశః సర్గః

Balakanda Sarga 53 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు కామధేనుని పొందాలని ప్రయత్నిస్తాడు, కాని వశిష్ట మహర్షి విశ్వామిత్రుని బేరసారాలు మరియు వస్తుమార్పిడిని పట్టుదలతో నిరాకరిస్తాడు. ‘సామాన్యమైన ఆవును మాత్రమే పవిత్రంగా భావించి, అది మార్కెట్ చేయలేని వస్తువు అయినప్పుడు, ఏ కోరికనైనా పాలు చేసే శబల ఎలా ఇవ్వబడుతుంది లేదా ఇతర సంపదల కోసం ఎలా మార్చబడుతుంది…’ అనేది వశిష్ఠుని వాదన. అయినప్పటికీ, విశ్వామిత్రుడు తన బిడ్డింగ్కు వెళతాడు, కానీ ఫలించలేదు.

శబలానిష్క్రియః

ఏవముక్తా వసిష్ఠేన శబలా శత్రుసూదన |
విదధే కామధుక్కామాన్యస్య యస్య యథేప్సితమ్ ||

1

ఇక్షూన్మధూంస్తథా లాజాన్మైరేయాంశ్చ వరాసవాన్ |
పానాని చ మహార్హాణి భక్ష్యాంశ్చోచ్చావచాంస్తథా ||

2

ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయః పర్వతోపమాః |
మృష్టాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ ||

3

నానాస్వాదురసానాం చ షడ్రసానాం తథైవ చ | [షాడబానాం]
భోజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః ||

4

సర్వమాసీత్సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతమ్ |
విశ్వామిత్రబలం రామ వసిష్ఠేనాభితర్పితమ్ ||

5

విశ్వామిత్రోఽపి రాజర్షిర్హృష్టః పుష్టస్తదాభవత్ |
సాంతఃపురవరో రాజా సబ్రాహ్మణపురోహితః ||

6

సామాత్యో మంత్రిసహితః సభృత్యః పూజితస్తదా |
యుక్తః పరమహర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్ ||

7

పూజితోఽహం త్వయా బ్రహ్మన్పూజార్హేణ సుసత్కృతః |
శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్యవిశారద ||

8

గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ |
రత్నం హి భగవన్నేతద్రత్నహారీ చ పార్థివః ||

9

తస్మాన్మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ |
ఏవముక్తస్తు భగవాన్వసిష్ఠో మునిసత్తమః ||

10

విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిమ్ |
నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవామ్ ||

11

రాజన్దాస్యామి శబలాం రాశిభీ రజతస్య వా |
న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ ||

12

శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా |
అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ ||

13

ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ |
స్వాహాకారవషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా ||

14

ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః |
సర్వస్వమేతత్సత్యేన మమ తుష్టికరీ సదా ||

15

కారణైర్బహుభీ రాజన్న దాస్యే శబలాం తవ |
వసిష్ఠేనైవముక్తస్తు విశ్వామిత్రోఽబ్రవీత్తతః ||

16

సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్యవిశారదః |
హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్సువర్ణాంకుశభూషితాన్ ||

17

దదామి కుంజరాణాం తే సహస్రాణి చతుర్దశ |
హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానాం చతుర్యుజామ్ ||

18

దదామి తే శతాన్యష్టౌ కింకిణీకవిభూషితాన్ |
హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసామ్ ||

19

సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత |
నానావర్ణవిభక్తానాం వయఃస్థానాం తథైవ చ ||

20

దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ |
యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ ||

21

తావద్దాస్యామి తత్సర్వం శబలా దీయతాం మమ |
ఏవముక్తస్తు భగవాన్విశ్వామిత్రేణ ధీమతా ||

22

న దాస్యామీతి శబలాం ప్రాహ రాజన్కథంచన |
ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనమ్ ||

23

ఏతదేవ హి సర్వస్వమేతదేవ హి జీవితమ్ |
దర్శశ్చ పౌర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః ||

24

ఏతదేవ హి మే రాజన్వివిధాశ్చ క్రియాస్తథా |
అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః |
బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్ ||

25

Balakanda Sarga 53 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమ కూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగినవారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేసారు. వసిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంత:పుర కాంతలు, వారి వెంటవచ్చిన పురోహితులు, పరివారము, అందరూ ఎంతో సంతోషించారు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ ఆతిథ్యమునకు మేమందరమూ ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షీ! ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా! కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి.” అని అడిగాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ విశ్వామిత్రా! నీవు వందల వేల ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను. నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము. మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను. ” అని చెప్పాడు వసిష్ఠుడు.

“అది కాదు మహర్షీ! ఒక్క ఆవులే కాదు. బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వమఱులను కట్టిన 8 బంగారు రధములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు నీకు కోటి పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే….. అదీకాకపోతే నీకు ఏం కావాలో కోరుకో….. అవి అన్నీ ఇస్తాను. రత్నములా, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో… అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాతం నాకు ఇవ్వు. ” అని అడిగాడు విశ్వామిత్రుడు.

“నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము. నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు.

నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత, ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వలేను… ఇవ్వను” అని చెప్పాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃపంచాశః సర్గః (54) >>

Ayodhya Kanda Sarga 62 In Telugu – అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గః

Ayodhya Kanda Sarga 62

అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గలో మంత్రలే అత్రి మహర్షి ఇంటికి వెళ్ళి ఆధ్యాత్మికత, తపస్సు గురించి ప్రశంసలు అందుకుంటాడు. అత్రి మహర్షి, అతని భార్య అనసూయ, అతని ఆశ్రమంలో రాముడు, సీత మరియు లక్ష్మణుడిని ఆతిథ్యం ఇస్తారు. అనసూయ, సీతకు దుస్తులు మరియు ఆభరణాలు అందజేస్తుంది. ఆమె సీతకు పతివ్రత ధర్మాన్ని గురించి ఉపదేశాలు ఇస్తుంది. సీత, తన పతివ్రత ధర్మాన్ని పాటించాలని ప్రతిజ్ఞ చేస్తుంది. అందరూ కృతజ్ఞతా భావంతో ఆశ్రమం నుండి బయలుదేరి మరిన్ని అడవులలో ప్రయాణిస్తారు. ఈ సర్గ, సీత, రాముడు మరియు లక్ష్మణుడి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడాన్ని ప్రతిబింబిస్తుంది.

కౌసల్యాప్రసాదనమ్

ఏవం తు క్రుద్ధయా రాజా రామమాత్రా సశోకయా |
శ్రావితః పరుషం వాక్యం చింతయామాస దుఃఖితః || ౧ ||

చింతయిత్వా స చ నృపో ముమోహ వ్యాకులేంద్రియః |
అథ దీర్ఘేణ కాలేన సంజ్ఞామాప పరంతపః || ౨ ||

స సంజ్ఞాముపలభ్యైవ దీర్ఘముష్ణం చ నిశ్శ్వసన్ |
కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా పునశ్చింతాముపాగమత్ || ౩ ||

తస్య చింతయమానస్య ప్రత్యభాత్ కర్మ దుష్కృతమ్ |
యదనేన కృతం పూర్వమజ్ఞానాచ్ఛబ్ద వేధినా || ౪ ||

అమనాస్తేన శోకేన రామశోకేన చ ప్రభుః |
ద్వాభ్యామపి మహారాజః శోకాబ్యామన్వతప్యత || ౫ ||

దహ్యమానః సశోకాభ్యాం కౌసల్యామాహ భూపతిః |
వేపమానోఽంజలిం కృత్వా ప్రసాదర్థమవాఙ్ముఖః || ౬ ||

ప్రసాదయే త్వాం కౌసల్యే రచితోఽయం మయాఽంజలిః |
వత్సలా చానృశంసా చ త్వం హి నిత్యం పరేష్వపి || ౭ ||

భర్తా తు ఖలు నారీణాం గుణవాన్నిర్గుణోఽపి వా |
ధర్మం విమృశమానానాం ప్రత్యక్షం దేవి దైవతమ్ || ౮ ||

సా త్వం ధర్మపరా నిత్యం దృష్ట లోక పరావర |
నార్హసే విప్రియం వక్తుం దుఃఖితాఽపి సుదుఃఖితమ్ || ౯ ||

తద్వాక్యం కరుణం రాజ్ఞః శ్రుత్వా దీనస్య భాషితమ్ |
కౌసల్యా వ్యసృజద్బాష్పం ప్రణాలీవ నవోదకమ్ || ౧౦ ||

స మూర్ధ్ని బద్ధ్వా రుదతీ రాజ్ఞః పద్మమివాంజలిమ్ |
సంభ్రమాదబ్రవీత్ త్రస్తా త్వరమాణాక్షరం వచః || ౧౧ ||

ప్రసీద శిరసా యాచే భూమౌ నితతితాఽస్మి తే |
యాచితాఽస్మి హతా దేవ హంతవ్యాఽహం న హి త్వయా || ౧౨ ||

నైషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యాయా సంప్రసాద్యతే || ౧౩ ||

జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదినమ్ |
పుత్రశోకార్తయా తత్తు మయా కిమపి భాషితమ్ || ౧౪ ||

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ |
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమః రిపుః || ౧౫ ||

శక్యమాపతితః సోఢుం ప్రహరః రిపుహస్తతః |
సోఢుమాపతితః శోకః సుసూక్ష్మోఽపి న శక్యతే || ౧౬ ||

వనవాసాయ రామస్య పంచరాత్రోఽద్య గణ్యతే |
యః శోకహతహర్షాయాః పంచవర్షోపమః మమ || ౧౭ ||

తం హి చింతయమానాయాః శోకోఽయం హృది వర్ధతే |
నదీనామివ వేగేన సముద్రసలిలం మహత్ || ౧౯ ||

ఏవం హి కథయంత్యాస్తు కౌసల్యాయాః శుభం వచః |
మందరశ్మిరభూత్సూర్యో రజనీ చాభ్యవర్తత || ౨౦ ||

తథ ప్రహ్లాదితః వాక్యైర్దేవ్యా కౌసల్యయా నృపః | [ప్రసాదితో]
శోకేన చ సమాక్రాంతర్నిద్రాయా వశమేయివాన్ || ౨౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్ఠితమః సర్గః || ౬౨ ||

Ayodhya Kanda Sarga 62 Meaning In Telugu

రాముని వియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దు:ఖిస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకు వచ్చింది. తాను వేసిన శబ్దవేది బాణముల వలన కలిగిన మహాపరాధము తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తానుచేసిన పాపము మరొకరితో పంచుకొంటేనేగాని తీరదు అని అనుకున్నాడు. కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.

“కౌసల్యా! భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, సతికి పతియే కదా ప్రత్యక్ష దైవము. నీకు దుఃఖము లేదు అని నేను అనను. కాని ఎంత దు:ఖములో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా! ఆలోచించు.” అని అన్నాడు.

ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదముల మీద వాలి పోయింది. ఆయన పాదములు తన కన్నీటితో అభిషేకించింది.

“మహారాజా! మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండ ఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేసాను. కాని మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేసానో ఇప్పుడు నాకు అర్థం అయింది. ఓ మహారాజా! మీరు ధర్మాత్ములు అని నాకు తెలియును. నాకూ ధర్మం తెలుసు. అంత అవివేకురాలిని కాను. కానీ పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.

మహారాజా! తమరికి తెలియనిది కాదు. శోకము అన్ని అపరాథములకు మూలము. శోకసముద్రములో మునిగిన వాడికి మంచి చెడూ తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తప్పుకోవచ్చు కానీ, మనసులో పుట్టిన చిన్నపాటి దుఃఖమును తట్టకోడం కష్టం. అన్ని ధర్మములు తెలిసినవారు, సర్వసంగపరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసుకదా!

ఓ మహారాజా! రాముడు మనలను విడిచిపోయి నేటికి ఐదు దినములు అయినది కానీ నాకు ఐదు సంవత్సరములు అయినట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశములో ఏమేమో మాటలాడి ఉంటాను. నన్ను క్షమించండి.” అని ప్రార్థించింది కౌసల్య ఇంతలో సాయంకాలము అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది రెండవ భాగము సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గః (63) >>

Balakanda Sarga 64 In Telugu – బాలకాండ చతుఃషష్టితమః సర్గః

Balakanda Sarga 64 In Telugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుఃషష్టితమః సర్గలో, విష్ణుమూర్తి దశరథుని తపస్సుకు సంతృప్తి చెంది, రామునిగా అవతరించడానికి సన్నాహాలు చేస్తాడు. దశరథుని యాగం పూర్తయిన తర్వాత, అగ్నిదేవుడు ప్రత్యక్షమై, పాయసాన్ని ఆయనకు అందిస్తాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంపించి, వారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నాలుగు కుమారులను పొందుతారు.

|| రంభాశాపః ||

సురకార్యమిదం రంభే కర్తవ్యం సుమహత్త్వయా |
లోభనం కౌశికస్యేహ కామమోహసమన్వితమ్ ||

1

తథోక్తా సాఽప్సరా రామ సహస్రాక్షేణ ధీమతా |
వ్రీడితా ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ సురేశ్వరమ్ ||

2

అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః |
క్రోధముత్సృజతే ఘోరం మయి దేవ న సంశయః ||

3

తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తుమర్హసి |
ఏవముక్తస్తయా రామ రంభయా భీతయా తయా ||

4

తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిమ్ |
మా భైషి రంభే భద్రం తే కురుష్వ మమ శాసనమ్ ||

5

కోకిలో హృదయగ్రాహీ మాధవే రుచిరద్రుమే |
అహం కందర్పసహితః స్థాస్యామి తవ పార్శ్వతః ||

6

త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరమ్ |
తమృషిం కౌశికం రంభే భేదయస్వ తపస్వినమ్ ||

7

సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపమనుత్తమమ్ |
లోభయామాస లలితా విశ్వామిత్రం శుచిస్మితా ||

8

కోకిలస్య స శుశ్రావ వల్గు వ్యాహరతః స్వనమ్ |
సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత ||

9

అథ తస్య చ శబ్దేన గీతేనాప్రతిమేన చ |
దర్శనేన చ రంభాయా మునిః సందేహమాగతః ||

10

సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుంగవః |
రంభాం క్రోధసమావిష్టః శశాప కుశికాత్మజః ||

11

యన్మాం లోభయసే రంభే కామక్రోధజయైషిణమ్ |
దశ వర్షసహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||

12

బ్రాహ్మణః సుమహాతేజాస్తపోబలసమన్వితః |
ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధకలుషీకృతామ్ ||

13

ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
అశక్నువన్ధారయితుం క్రోధం సంతాపమాగతః ||

14

తస్య శాపేన మహతా రంభా శైలీ తదాఽభవత్ |
వచః శ్రుత్వా చ కందర్పో మహర్షేః స చ నిర్గతః ||

15

కోపేన సుమహాతేజాస్తపోఽపహరణే కృతే |
ఇంద్రియైరజితై రామ న లేభే శాంతిమాత్మనః ||

16

బభూవాస్య మనశ్చింతా తపోఽపహరణే కృతే |
నైవ క్రోధం గమిష్యామి న చ వక్ష్యామి కించన ||

17

అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి |
అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేంద్రియః ||

18

తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితమ్ |
అనుచ్ఛ్వసన్నభుంజానస్తిష్ఠేయం శాశ్వతీః సమాః ||

19

న హి మే తప్యమానస్య క్షయం యాస్యంతి మూర్తయః |
ఏవం వర్షసహస్రస్య దీక్షాం స మునిపుంగవః |
చకారాప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునందన ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃషష్టితమః సర్గః ||

దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు.

“ఓ రంభా! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు. “అని అన్నాడు.

ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. “ఓ దేవేంద్రా! నీమాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం.” అని చెప్పింది.

దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. “రంభా! నీకేం భయం లేదు. నేను, మన్మధుడు, కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమ యానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడపనిలేదు. నీ హావభావవిలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు.” అని అన్నాడు.

రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు.

ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమాన పడ్డాడు. రంభను శపించాడు.

“తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభ పరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు పదివేల సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాపవిమోచన కలుగుతుంది.” అని శాపము, విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది.

ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు.

తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాప పడ్డాడు.

“అయ్యో అనవసరంగా రంభ మీద కోపించాను. శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను ముఖ్యంగా కోపాన్ని జయించలేక పోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంక ఎవరి మీదా కోపగించు కోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీదా కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించువరకూ ఘోర తపస్సు చేస్తాను. ” అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైనాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ పంచషష్టితమః సర్గః (65) >>